దీపావళి తర్వాత జార్ఖండ్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ | PM Modi Rally in Jharkhand After Diwali | Sakshi
Sakshi News home page

దీపావళి తర్వాత జార్ఖండ్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ

Published Sun, Oct 27 2024 11:44 AM | Last Updated on Sun, Oct 27 2024 12:01 PM

PM Modi Rally in Jharkhand After Diwali

రాంచీ: జార్ఖండ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర బీజేపీ ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. నవంబర్ ఒకటి నుంచి నవంబర్ 10 వరకు ఎన్నికల ర్యాలీల కోసం ప్రధాని నరేంద్ర మోదీతో సహా స్టార్ క్యాంపెయినర్లు సమయం కేటాయించాలని పార్టీ కోరింది.

మీడియాకు అందిన తాజా సమాచారం ప్రకారం జార్ఖండ్‌లో దీపావళి తర్వాత బీజేపీ స్టార్ క్యాంపెయినర్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల ఎన్నికల ర్యాలీలు జరగనున్నాయి. ప్రధానమంత్రి ఆరు ఎన్నికల ర్యాలీలలో పాల్గొనేలా బీజేపీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పార్టీలోని ఆరు సంస్థాగత విభాగాల్లోనూ ప్రధాని ఎన్నికల సభను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొంతకాలం క్రితం ప్రధాని మోదీ  రాష్ట్రంలో రెండు ర్యాలీలు నిర్వహించారు.

గడచిన నవంబర్ 15న జంషెడ్‌పూర్‌లో ప్రధాని మోదీ తన మొదటి ర్యాలీ నిర్వహించారు. రెండో ర్యాలీ అక్టోబర్ 2న హజారీబాగ్‌లో జరిగింది. బీజేపీ పరివర్తన్ యాత్రను ఆయన రాష్ట్రంలో ముగించారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా సాహిబ్‌గంజ్, గిరిడిహ్‌లలో ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగం, అవినీతి, బంగ్లాదేశ్ చొరబాట్లు వంటి వివిధ సమస్యలు ప్రధాని మోదీ, అమిత్ షాల ప్రచారాస్త్రాలుగా ఉండనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతోపాటు పేపర్ లీక్  ఉదంతం కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధానాశం కానుంది.

ఇది కూడా చదవండి: బ్రెయిన్‌ స్ట్రోక్‌: ఇన్‌టైంలో వస్తే.. అంతా సేఫ్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement