మరో విమానానికి బాంబు బెదిరింపు.. జైపూర్‌లో అత్యవసర ల్యాండింగ్‌ | Bomb Threat Created Panic In Another International Flight, Police Suspect Use Of VPN Or Dark Web, More Details Inside | Sakshi
Sakshi News home page

మరో విమానానికి బాంబు బెదిరింపు.. జైపూర్‌లో అత్యవసర ల్యాండింగ్‌

Published Sat, Oct 19 2024 9:53 AM | Last Updated on Sat, Oct 19 2024 11:12 AM

Bomb Threat created panic in another International Flight

జైపూర్: విమానాల​కు తరచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం నంబర్ IX-196కు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ విమానం దుబాయ్‌ నుంచి జైపూర్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జైపూర్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో మొత్తం 189 మంది ప్రయాణికులున్నారు. ల్యాండింగ్ తర్వాత భద్రతా బలగాలు విమానం మొత్తం గాలించగా, వారికి  అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు.

ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ‘విస్తారా’ విమానంలో బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన మరువక ముందు తాజా ఉదంతం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా భారతీయ విమానయాన సంస్థలకు చెందిన దాదాపు 40 విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఫేక్‌ అని దర్యాప్లు తరువాత తేలింది. విమానయాన సంస్థలకు తప్పుడు బాంబు బెదిరింపులు అందకుండా ఉండేందుకు కొత్త టెక్నాలజీని వినియోగించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.

 


ఇది కూడా చదవండి: US Elections: ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేవారికే పట్టం

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement