bomb
-
PM Modi : మోదీ విమానానికి బాంబు బెదిరింపు
-
తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు
-
ఢిల్లీలో 23 స్కూళ్లకు బాంబు బెదిరింపు
-
ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. నిందితులు ఎవరంటే?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. గత శుక్రవారం ఢిల్లీలోని పలు స్కూళ్లకి బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ బెదిరింపు మెయిల్స్ చేసింది విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించారు.సాధారణంగా స్కూల్స్, కాలేజీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇందు కోసం విద్యార్థులు రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. కానీ వారిలో కొంత మంది విద్యార్థులు పరీక్షల ముందు రోజు బుక్ తీసి మమ అనిపిస్తుంటారు. సరిగ్గా చదవక.. స్కూల్కో,లేదంటే కాలేజీకి వెళ్లి పరీక్ష రాయాల్సి వస్తుందనే భయంతో ఆరోగ్యం సరిగా లేదని, ఊరెళుతున్నామని ఇలా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంటుంటారు.ఇదిగో ఢిల్లీలోని రోహిణి జిల్లాకు చెందిన స్కూల్ విద్యార్థులు కూడా అంతే. పరీక్ష రాయాల్సి వస్తుందని స్కూల్లో బాంబు తామే పెట్టామని బెదిరించినట్లు ఢిల్లీ స్పెషల్ పోలీసులు గుర్తించారు.తాజాగా రోహిణి జిల్లాలో రెండు స్కూల్స్కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు బెదిరింపు ఈ-మెయిల్స్ విచారణ చేపట్టారు. తమ విచారణలో ‘ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రెండు వేర్వేరు పాఠశాలలకు ఇ-మెయిల్స్ పంపినట్లు తేలింది’అని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులిద్దరూ స్కూల్లో పరీక్ష రాయాల్సి వస్తుందని బెయిరింపు ఇ - మెయిల్స్ పంపినట్లు వెల్లడించారు. విద్యార్థులు కావడంతో, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. #BreakingNews | #DelhiBombThreat : Major update has come in that students were behind the bomb threat that has been sent to 2 schools.@_pallavighosh | @shankar_news18 decodes#delhibombthreat #delhi #schools pic.twitter.com/FGAquLsFzV— News18 (@CNNnews18) December 22, 2024 11 రోజులుగా వందకు పైగా బాంబు బెదిరింపులుఢిల్లీ పోలీసులు గత 11 రోజులుగా 100కి పైగా పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు పంపడంపై దర్యాప్తు చేపట్టారు. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఉపయోగించి ఇ-మెయిల్స్ పంపడంతో నేరస్థులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది.ఢిల్లీలో బాంబు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. ఈ సంవత్సరం మే నుండి, నగరంలోని పాఠశాలలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, విమానయాన సంస్థలను లక్ష్యంగా చేసుకుని 50కి పైగా బాంబు బెదిరింపు ఇ-మెయిల్లు వచ్చాయి. ఈ కేసుల్లో పోలీసులు ఇంకా ఎలాంటి పురోగతి సాధించలేదు. -
బాంబు షెల్టర్లకు గిరాకీ వరల్డ్ వార్-3కి సంకేతమా?
-
సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు
పట్నా: ఇటీవలి కాలంలో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఎక్కువైంది. అయితే ఇప్పుడు రైలులో బాంబు ఉందంటూ ఓ వార్త వచ్చింది. ఈ ఘటన బీహార్లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే బీహార్లోని దర్భంగా నుండి న్యూఢిల్లీకి వెళుతున్న బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలులో బాంబు ఉందంటూ ఢిల్లీ కంట్రోల్ రూమ్కు సమాచారం అందింది. వెంటనే రైల్వే అధికారులు రైలును యూపీలోని గోండా స్టేషన్లో నిలిపివేసి, రైలులో అణువణువుగా తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలను గోండా ఎస్పీ, ఇద్దరు ఏఎస్పీలు ఒక సివిల్ సివిల్ పోలీసులు నిర్వహించారు. ఇదేవిధంగా డాగ్ స్క్వాడ్తో సెర్చ్ ఆపరేషన్ కూడా చేపట్టారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో బాంబు బెదిరింపు కేవలం వదంతేనని తేలింది. రైల్వేశాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలును గొండా స్టేషన్లో శుక్రవారం రాత్రి 7:32 గంటలకు నిలిపివేసి తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి బాంబు లేదని తేలడంతో, రాత్రి 9:45 గంటలకు రైలు ముందుకు కదిలేందుకు అనుమతినిచ్చారు. ప్రస్తుతం పోలీసులు ఈ వదంతు వచ్చిన ఫోన్ నంబర్కు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఇది కూడా చదవండి: రక్షణ శాఖ కార్యదర్శిగా రాజేశ్ కుమార్ సింగ్ -
19 ఏళ్ల క్రితం దీపావళి ఆనందాలను చిదిమేసిన బాంబు పేలుళ్లు
న్యూఢిల్లీ: ఈరోజు (అక్టోబరు 29) దేశ చరిత్రలో ఒక విషాద సంఘటన నమోదైంది. 19 ఏళ్ల క్రితం ఇదేరోజున ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లు దీపావళి ఆనందాన్ని హరింపజేశాయి. అక్టోబర్ సాధారణంగా ఢిల్లీలో పండుగల సీజన్. మొదట రామలీల ప్రదర్శనలు తరువాత దసరా కోలాహలం ఇది ముగిసిన వెంటనే ధన్తేరస్ షాపింగ్, దీపావళి, చివరిగా గోవర్ధన పూజ, భయ్యా దూజ్... ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా పండుగలు వస్తూనే ఉంటాయి. ఈ నేపధ్యంలో మార్కెట్లలో కొనుగోలుదారుల సందడి నెలకొంటుంది.2005 అక్టోబరు 29న ధన్తేరాస్ నాడు ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. రద్దీగా ఉండే మార్కెట్లలో జరిగిన ఈ పేలుళ్లలో 60 మంది మరణించగా, 200 మందికి పైగా జనం గాయపడ్డారు. నాడు ఢిల్లీలోని సరోజినీ నగర్, పహర్గంజ్, కల్కాజీ ప్రాంతాల్లోని మూడు చోట్ల డీటీసీ బస్సుల్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో చాలా మంది అయినవారిని కోల్పోయారు. నేటికీ సరోజినీ నగర్ మార్కెట్లోని దుకాణదారుల నాటి ఘటనను గుర్తుకు తెచ్చుకుని భయపడుతుంటారు.30 ఏళ్లుగా సరోజినీ నగర్ మార్కెట్లో దీపావళి వస్తువులు విక్రయిస్తున్న ఓ దుకాణదారుడు నాటి రోజును గుర్తు చేసుకుంటూ మీడియాతో మాట్లాడారు. నేటికీ నాటి భయానక దృశ్యం కళ్ల ముందు మెదులుతోందని, ఆరోజు ధన్తేరస్ రోజు కావడంతో మార్కెట్ అంతా కొనుగోలుదారులతో నిండివుందన్నారు. పేలుడు సంభవించినప్పుడు తాను ఘటనా స్థలానికి సమీపంలోని తన కొవ్వొత్తుల దుకాణంలో ఉన్నానని, అకస్మాత్తుగా భారీ పేలుగు శబ్ధం వచ్చి, అంతటా చీకటి అలుముకుందన్నారు. తొలుత తాను దుకాణంలో అమర్చిన బల్బు పేలివుంటుందని భావించానని తెలిపారు. అయితే ఆ పేలుడులో తన తలకు బలమైన గాయమైందని, స్పృహలోకి వచ్చేసరికి అక్కడ కుప్పలుగా పడి ఉన్న మృతదేహాలను చూసి భయపడ్డానన్నారు. బాంబు పేలుడు సంభవించిన దుకాణం యజమాని మృతదేహం రెండు భాగాలుగా విడిపోయి కనిపించిందన్నారు. నాటి ఘటనతో పలువురు సజీవదహనమయ్యారని అతను ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
తిరుపతిలో బాంబు బెదిరింపుల టెన్షన్
-
బాంబు బెదిరింపులతో హడల్
సాక్షి, అమరావతి: బాంబు బెదిరింపులతో యావత్ దేశం హడలిపోతోంది. విమానాలు, హోటళ్లు, విద్యాసంస్థలు.. ఇలా ప్రతిచోటా బాంబులు పెట్టినట్టు ఈమెయిల్, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బెదిరింపుల వరద ముంచెత్తుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బెదిరింపు రాగానే పోలీసు బృందాలు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేయడం.. బాంబు లేదని నిర్ధారించడం ప్రహసనంగా మారింది. ప్రధానంగా దక్షిణ భారతంలోని రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని అత్యధికంగా ఈ ఉత్తుత్తి బాంబు బెదిరింపులు వస్తుండటం గమనార్హం. ‘నాన్నా.. పులి కథ’లా మారకూడదన్న ఉద్దేశంతో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. రెండు వారాల్లో 400 బెదిరింపులువిమానాల్లో బాంబులు పెట్టినట్టు బెదిరింపు ఈమెయిల్స్ వస్తుండటంతో పౌర విమానయాన శాఖ బెంబేలెత్తుతోంది. రెండు వారాల్లో ఏకంగా 400 బెదిరింపులు రావడం గమనార్హం. శనివారం ఒక్కరోజే 33 బెదిరింపులు రావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని అంతర్జాతీయ ప్రయాణికులను ఖలీస్థానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల బెదిరించడం కూడా ఈ ఆందోళనను రెట్టింపు చేస్తోంది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తదితర విమానాశ్రయాలకు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఈమెయిల్స్తోపాటు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాంతో టేకాఫ్ తీసుకున్న విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేయిస్తూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. దక్షిణ భారతమే ప్రధాన లక్ష్యంగా..బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న ఆగంతకులు ప్రధానంగా దక్షిణ భారత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. తమిళనాడులోని చెన్నైకు బెదిరింపులు వచ్చాయి. అక్కడి విమానాశ్రయం నుంచి బయలుదేరే విమానాల్లోనూ, ఆ నగరంలోని హోటళ్లలోనూ బాంబులు పెట్టినట్టు బెదిరించారు. బెంగళూరు, హైదరాబాద్ కూడా ఈ బెదిరింపుల బెడద బారిన పడ్డాయి. ఆ రెండు నగరాల్లో విమానాలతోపాటు విద్యాసంస్థల్లో బాంబులు పెట్టినట్టు సోషల్ మీడియా వేదికల ద్వారా బెంబేలెత్తించారు. బెదిరింపుల బెడద ఆంధ్రప్రదేశ్నూ తాకింది. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుపతిని లక్ష్యంగా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.వారం రోజుల్లో తిరుపతిలోని 17 హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తిరుపతి ఇస్కాన్ ఆలయంలోనూ బాంబు పెట్టినట్టు బెదిరించడం గమనార్హం. కాగా.. విజయవాడలోని ఓ స్టార్ హోటల్కు కూడా బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఒకర్ని అరెస్ట్ చేసిన పోలీసులు బెంగళూరు, విజయవాడలోని హోటళ్లలో బాంబులు పెట్టినట్టు బెదిరింపు ఈమెయిల్స్ పంపిన ఓ ఆగంతకుడిని పోలీసులు గుర్తించారు. అస్సాం నుంచి ఆ మెయిల్ వచ్చినట్టు గుర్తించి ఏపీ, కర్ణాటక ఎస్ఐబీ విభాగం అధికారులు ఆ రాష్ట్రంలో సోదాలు నిర్వహించారు. ఈమెయిల్ పంపిన ఆగంతకుడిని గుర్తించి అరెస్ట్ చేసి బెంగళూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. అతను మతిస్థిమితంలేని వ్యక్తి అని పోలీసులు చెబుతున్నారు. విమానాశ్రయాల్లో ‘బీటీసీ’ల మోహరింపుబాంబు బెదిరింపుల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు విభాగం(ఎన్ఐఏ) కార్యాచరణను వేగవంతం చేసింది. దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లోనూ థ్రెట్ అసిస్టెంట్ కమిటీ(బీటీసీ)లను మోహరించింది. బెదిరింపు ఈమెయిల్స్, సోషల్ మీడియా పోస్టులను ఈ విభాగం పరిశీలించి దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఎక్కడి నుంచి మెయిల్స్ వస్తున్నాయో గుర్తించడం, ఎవరు చేస్తున్నారన్నది దర్యాప్తు చేయడం, తదనుగుణంగా కార్యాచరణ చేపట్టేందుకు భద్రతా దళాలకు సహకరించడంలో బీటీసీ బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.మరో విమానానికి బాంబు బెదిరింపువిశాఖ నుంచి ముంబై బయలుదేరిన విమానాన్ని వెనక్కి రప్పించిన అధికారులుతనిఖీల అనంతరం బాంబు లేదని నిర్ధారణసాక్షి, విశాఖపట్నం: వరుస బాంబుబెదిరింపులు విమానయాన సంస్థలతోపాటు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు రోజులుగా వివిధ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ బెదిరింపు కాల్ సోమవారం విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో అలజడి సృష్టించింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఇండిగో విమానంలో బాంబు ఉందని గుర్తుతెలియని వ్యక్తి శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో అక్కడి అధికారులు విశాఖ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చారు.అప్పటికే విశాఖ చేరుకుని.. ముంబై బయలుదేరిన ఆ విమానాన్ని అత్యవసరంగా వెనక్కి రప్పించారు. విమానం ల్యాండ్ అయ్యేసరికే బాంబ్ స్క్వాడ్ను సిద్ధం చేశారు. ప్రయాణికులను దింపి విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసి.. బాంబు లేదని నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విశాఖ నుంచి సుమారు 2 గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.32 గంటలకు విమానం ముంబైకి బయలుదేరి వెళ్లిందని ఎయిర్పోర్టు డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. -
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
-
CRPF స్కూల్లో బాంబు ఉందంటూ కాల్
-
మరోమారు 30 విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు విమానయాన సంస్థల విమానాలకు తరచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి కూడా 30 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం రాత్రి ఇండియన్ ఎయిర్లైన్కు చెందిన 30 దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.ఇండిగో ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన నాలుగు విమానాలకు సోమవారం భద్రతా హెచ్చరికలు అందాయని తెలిపారు. ఈ జాబితాలో 6ఈ 164 (మంగుళూరు నుండి ముంబై), 6ఈ 75 (అహ్మదాబాద్ నుండి జెడ్డా), 6ఈ 67 (హైదరాబాద్ నుండి జెడ్డా), 6ఈ 118 (లక్నో నుండి పూణే) ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయా విమానాల్లోని ప్రయాణికులు సురక్షితంగా అక్కడి నుండి తరలించారు.ఇదేవిధంగా ఎయిర్ ఇండియా విమానాలకు కూడా బెదిరింపులు వచ్చినట్లు ఆ సంస్థ ప్రతినిధి ధృవీకరించారు. నిర్దేశించిన ప్రోటోకాల్ను అనుసరించి, సంబంధిత అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారని, భద్రతా సంస్థల మార్గదర్శకాల ప్రకారం అన్ని భద్రతా విధానాలను అమలు చేశామన్నారు.విస్తారా ప్రతినిధి మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన కొన్ని విమానాలకు సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయని చెప్పారు. వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తమయ్యారని, అన్ని భద్రతా విధానాలను అమలు చేశారన్నారు.గడచిన వారం రోజుల్లో 120కి పైగా భారతీయ విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే బాంబు బెదిరింపులను కేవలం వదంతులుగా తేలికగా తీసుకోలేమని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. కాగా విమానయాన సంస్థలకు వస్తున్న బాంబు బెదిరింపులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చట్టబద్ధమైన చర్యలకు ఉపక్రమిస్తోంది. నేరస్తులను నో-ఫ్లై జాబితాలో ఉంచే యోచనలో ఉందని సమాచారం. ఇది కూడా చదవండి: ఉద్యోగుల తొలగింపు అవాస్తవం: ఫోన్పే -
విమానాలకు బాంబు బెదిరింపులపై దర్యాప్తు చేస్తున్నాం
-
మరో విమానానికి బాంబు బెదిరింపు.. జైపూర్లో అత్యవసర ల్యాండింగ్
జైపూర్: విమానాలకు తరచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం నంబర్ IX-196కు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ విమానం దుబాయ్ నుంచి జైపూర్కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జైపూర్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో మొత్తం 189 మంది ప్రయాణికులున్నారు. ల్యాండింగ్ తర్వాత భద్రతా బలగాలు విమానం మొత్తం గాలించగా, వారికి అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు.ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ‘విస్తారా’ విమానంలో బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన మరువక ముందు తాజా ఉదంతం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా భారతీయ విమానయాన సంస్థలకు చెందిన దాదాపు 40 విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఫేక్ అని దర్యాప్లు తరువాత తేలింది. విమానయాన సంస్థలకు తప్పుడు బాంబు బెదిరింపులు అందకుండా ఉండేందుకు కొత్త టెక్నాలజీని వినియోగించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. Jaipur, Rajasthan | An Air India Express flight IX-196 flying from Dubai to Jaipur, with 189 passengers onboard, received a bomb threat via email. The plane landed at the Jaipur International Airport at 1:20 am. After a thorough check by the security forces, nothing suspicious…— ANI (@ANI) October 19, 2024ఇది కూడా చదవండి: US Elections: ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేవారికే పట్టం -
మణిపూర్లో మళ్లీ హింస.. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు మృతి
ఇంఫాల్: మణిపూర్లో మరోమారు హింస చెలరేగింది. కుకీ-జో కమ్యూనిటీ కోరుతున్న ప్రత్యేక పరిపాలన డిమాండ్ను మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తిరస్కరించడంతో మరోమారు హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో అనుమానిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ దాడి నేపధ్యంలో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిలిటెంట్లు.. కోట్రుక్, పొరుగున ఉన్న కదంగ్బండ్లోని లోయ దిగువ ప్రాంతాలలో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతోపాటు, బాంబు దాడులు చేశారు. కదంగ్బండ్ ప్రాంతంలోని ఒక ఇంటిపై డ్రోన్ నుంచి బాంబు పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, తొమ్మదిమంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పలు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయన్నారు.పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర, కేంద్ర విభాగాలతోపాటు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కొట్రుక్ గ్రామస్తులపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. వారిని భయభ్రాంతులకు గురిచేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మణిపూర్ సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆదేశించారు. -
ఉక్రెయిన్పై రష్యా బాంబుల దాడి.. ఏడుగురి మృతి
ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. రష్యా సైన్యం శుక్రవారం ఉక్రెయిన్లోని ఖర్కీవ్ నగరంలోని అపార్టుమెంట్లు, ఆటస్థలాల్లో వైమానికి దాడులతో విరుచుకుపడింది. రష్యా బాంబుల దాడిలో ఎడుగురు మృతి చెందగా.. సుమారు 77 మందికి గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. బాంబు దాడిలో 12 అంతస్థుల అపార్టుమెంట్లో భారీగా మంటలు చెలరేగాయని ఖర్కీవ్ నగర మేయర్ వెల్లడించారు. అపార్టమెంట్ శిథిలాల నుంచి ఓ మహిళ మృతదేహాన్ని బయటకు తీశామని.. మృత సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో సుమారు 20 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.ఉక్రెయిన్- రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా సైన్యం ఖర్కీవ్ నగరమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇప్పటికే పలుసార్లు ధ్వంసం అయింది. అయితే ఇటీవల కాలంలో ఖర్కీవ్పై రష్యా దాడులు తగ్గినప్పటికీ.. రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోకి ఉక్రేయిన్ సైన్యం చొచ్చుకుపోవటంతో ప్రతీకారంగా బాంబులు వేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
Pakistan: బాంబు పేలి ఇద్దరు చిన్నారులు మృతి
పాకిస్తాన్లో నిత్యం ఏదో ఒక అలజడి చోటుచేసుకున్నదనే వార్లలను వింటుంటాం. తాజాగా పాక్లోని బలూచిస్థాన్ బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. పిషిన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాంబు పేలుడుకు స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు పోలీసులతో సహా 16 మంది గాయపడ్డారు.పిషిన్ జిల్లాలోని సుర్ఖబ్ చౌక్ సమీపంలోని ప్రధాన మార్కెట్లో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఇటీవల బలూచిస్థాన్లోని పోలీసు స్టేషన్లపై దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మూడు పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయి. యాంటీ టెర్రరిజం డిపార్ట్మెంట్, బాంబ్ స్క్వాడ్ విచారణ జరిపి కొన్ని ముఖ్యమైన ఆధారాలను సేకరించింది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని సీలు చేశారు.తాజా ఘటనలో గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన గురించి తెలుసుకున్న పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ దీనిని ఖండించారు. చిన్నారులు, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
Rajasthan: రెండు ఆస్పత్రులకు బాంబు బెదిరింపు కాల్స్.. తనిఖీలు ముమ్మరం
రాజస్థాన్లోని జైపూర్లోగల రెండు ప్రముఖ ఆస్పత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆయా ఆస్పత్రులకు చేరుకున్నారు. బాంబ్ స్క్యాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. రోగులను ఆస్పత్రి నుంచి బయటకు తరలించి, వైద్య సేవలు అందిస్తున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం జైపూర్లోని సీకే బిర్లా, మోనిలెక్ ఆసుపత్రులలో బాంబులు ఉన్నాయనే సమాచారం అందుకోగాగానే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆ ఆస్పత్రులలో పెద్ద సంఖ్యలో రోగులు, వారి బంధువులు ఉన్నారు. దీంతో పోలీసులు రోగులను బయటకు తరలించారు. వైద్యులు బయటనే రోగులకు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్గా మారింది.ఇటీవలి కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పలు ఆసుపత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తనిఖీల అనంతరం అవి ఫేక్ అని తేలుతోంది. అయితే ఇలాంటి వదంతుల వలన సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. जयपुर के सीके बिरला और मोनीलेक हॉस्पिटल में बम की सूचना पर बड़ी संख्या में पहुंची पुलिस. बम स्क्वायड वहां मरीजो को बाहर निकाल कर रहा है जांच @BhajanlalBjp @abplive pic.twitter.com/swl1p0s6Id— Santosh kumar Pandey (@PandeyKumar313) August 18, 2024 -
‘బ్యాగులో బాంబుందా’?: ప్రశ్నించిన ప్రయాణికుడి అరెస్టు
కొచ్చి: కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం(ఆగస్టు11) ఉదయం విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మనోజ్కుమార్(42) అనే ప్రయాణికుడు సెక్యూరిటీ చెక్ వద్ద తన బ్యాగ్ తీసుకుంటూ అందులో బాంబేమైనా ఉందా అని ప్రశ్నించాడు. దీంతో ఎయిర్పోర్టు ఎక్స్రే బ్యాగేజ్ స్కాన్ పాయింట్ వద్ద ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది బాంబు స్క్వాడ్ను రప్పించి తనిఖీలు చేశారు. మనోజ్కుమార్ క్యాబిన్ బ్యాగులతో పాటు చెకిన్ బ్యాగేజీని బాంబు డిటెక్షన్ మెషిన్తో జల్లెడ పట్టారు. తనిఖీల తర్వాత మనోజ్కుమార్ను పోలీసులకు అప్పగించారు. మనోజ్కుమార్ ఎయిర్ఇండియా విమానంలో కొచ్చి నుంచి ముంబై వెళ్లాల్సిఉంది. -
Mumbai: 50 ఆస్పత్రులకు బాంబు బెదిరింపు
మహారాష్ట్రలోని ముంబైలో గల బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ప్రధాన కార్యాలయంతోపాటు నగరంలోని 50 ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు ఈ మెయిల్స్ పంపారు. ఈ నేపధ్యంలో బీఎంసీ అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బీఎంసీ కార్యాలయంతో పాటు బాంబు బెదిరింపులు అందిన అన్ని ఆసుపత్రులలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులకు ఎటువంటి అనుమానాస్పద వస్తువు లభ్యం కాలేదు.వీపీఎన్ నెట్వర్క్ ద్వారా ఈ బెదిరింపు ఈమెయిల్స్ పంపినట్లు ముంబై పోలీసులు ధృవీకరించారు. బెదిరింపులకు పాల్పడిన వారు ఎవరనేది ఇంకా తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు. ముంబైలోని బీఎంసీ ప్రధాన కార్యాలయం, జస్లోక్ హాస్పిటల్, రహేజా హాస్పిటల్, సెవెన్ హిల్స్ హాస్పిటల్, కోహినూర్ హాస్పిటల్, కేఈఎం హాస్పిటల్, జేజే హాస్పిటల్, సెయింట్ జార్జ్ హాస్పిటల్ సహా 50కి పైగా ఆస్పత్రులకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. గతంలో దేశంలోని 41 విమానాశ్రయాలకు కూడా ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. 'కేఎన్ఆర్’ అనే ఆన్లైన్ గ్రూప్ ఈ నకిలీ బెదిరింపు ఈ మెయిల్స్ పంపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ బృందం మే ఒకటిన ఢిల్లీలోని వివిధ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్స్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. -
ప్రగతి భవన్ కు బాంబు బెదిరింపు నిందితుడు అరెస్ట్
-
ప్రజాభవన్లో బాంబు కలకలం
పంజగుట్ట: ‘‘ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో బాంబు పెట్టాం.. మరో కొద్దిసేపట్లో అది పేలబోతుంది..’’ అంటూ ఒక అగంతకుడు పోలీస్ కంట్రోల్రూం డయల్ 100కు ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా ఉరుకులు పరుగులు పెట్టారు. సుమారు నాలుగు గంటలపాటు మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ మొత్తం తనిఖీ చేసి ఎలాంటి బాంబు లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. మంగళవారం మధ్యాహ్నం 12:06 నిమిషాలకు పోలీస్ కంట్రోల్రూం 100కు ఓ అగంతకుడు ఫోన్ చేసి ప్రజాభవన్లోని మల్లు భట్టి విక్రమార్క ఇంటివద్ద బాబు పెట్టామని ఫోన్ చేశాడు. కంట్రోల్రూం సిబ్బంది 12:15కు పంజగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇంటలిజెన్స్ సెక్యురిటీ వింగ్, సిటీ సెక్యురిటీ వింగ్ అధికారులను రంగంలోకి దింపారు. హుటాహుటిన నాలుగు డాగ్ స్క్వాడ్ బృందాలు, 10 బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ బృందాలు రంగంలోకి దిగాయి. పంజగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ నేతృత్వంలో అణువణువూ తనిఖీ చేశారు.ఇకపై అక్కడ భారీ బందోబస్తు..: భట్టి ఇంటితోపాటు మంత్రి సీతక్క ఇంటిని, పరిసర ప్రాంతాలనూ చెక్ చేశారు. తరువాత ప్రజాభవన్ లోపల, పక్కనే ఉన్న మరోభవనం, అమ్మవారి ఆలయం సహా అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సుమారు 4 గంటలకు పైగా తనిఖీలు చేసి ఎక్కడా ఏమీ లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై ప్రజాభవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు.. సందర్శకులను క్షుణంగా పరిశీలించాలని సిబ్బందికి ఆదేశించారు. కాగా, ప్రజాభవన్లో బాంబు ఉందని ఫోన్ చేసిన వ్యక్తి గురించి పోలీసులు గాలిస్తున్నారు. -
ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు
-
కేంద్ర హోం శాఖకు బాంబు బెదిరింపు.. నార్త్ బ్లాక్ హై అలర్ట్
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కొలువు దీరిన నార్త్ బ్లాక్ భవనానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. హోం శాఖకు బుధవారం(మే22) బాంబు బెదిరింపుల మెయిల్ అందినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ వెల్లడించింది. బాంబు బెదిరింపులు వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా రెండు ఫైర్ ఇంజిన్లను నార్త్బ్లాక్ వద్దకు తరలించారు. గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు, ఎయిర్పోర్టులకు ఫేక్ బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. -
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలోని పాండువా ప్రాంతంలో ఈ రోజు (సోమవారం) బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. మీడియా కథనాల ప్రకారం కొంతమంది చిన్నారులు బంతిగా భావించి ఒక బాంబుతో ఆడుతుండగా, అది హఠాత్తుగా పేలింది. గాయపడిన వారిలో ఒకరు కుడి చేయి కోల్పోయినట్లు సమాచారం. కాగా టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇదే ప్రాంతంలో జరిగే ఎన్నికల ర్యాలీలో ప్రసంగించాల్సివుందిఈ పేలుడులో గాయపడిన ఇద్దరు చిన్నారులను రూపమ్ వల్లభ్, సౌరభ్ చౌదరిగా గుర్తించారు. చిన్నారుల వయసు 11 నుంచి 13 ఏళ్ల మధ్య ఉంటుంది. ప్రస్తుతం బాధితులు చుంచుర ఇమాంబర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం 8:30 గంటల సమయంలో తిన్నా ప్రాంతంలోని చెరువు దగ్గర పెద్ద పేలుడు శబ్ధం వినిపించింది. దీంతో సమీపంలోని వారు చెరువు గట్టు వద్దకు పరుగులు తీయగా, ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడిన స్థితిలో వారికి కనిపించారు. ఈ ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, ఒకరు మృతి చెందారు.ఈ ఘటనపై హుగ్లీ రూరల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన భద్రతా లోపంపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని కీలక నేత అభిషేక్ బెనర్జీ సమావేశం జరగాల్సిన స్థలంలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. -
TN: తమిళనాడులో స్కూళ్లకు బాంబు బెదిరింపు
చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూర్, కాంచీపురంలలో సోమవారం( మార్చ్ 4) బాంబు కలకలం రేగింది. రెండు నగరాల్లోని అగ్రశ్రేణి స్కూళ్లకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో స్కూళ్లలోని విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. వీటిలో ఆదివారం రాత్రి ఒక మెయిల్ రాగా సోమవారం ఉదయం మరో బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. బాంబు బెదిరింపు సమాచారం అందుకున్న వెంటనే కోయంబత్తూరులోని పీఎస్బీబీ మిలీనియం స్కూల్కు బాంబు స్క్వాడ్ చేరుకుని తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపులు వచ్చిన రెండు స్కూళ్లలో ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. స్కూళ్ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. కాగా, మార్చ్ 1వ తేదీ బెంగళూరు రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 10 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి.. అశ్లీల వీడియో వైరల్.. పోలీసులకు ఎంపీ ఫిర్యాదు -
ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పిన్ బాంబు లభ్యం
మధ్యప్రదేశ్లోని భింద్లో గల రాష్ట్రీయ స్వయం సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యాలయంలో శనివారం రాత్రి పిన్ బాంబు కనిపించడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ బాంబు చూసేందుకు గ్రెనేడ్ బాంబును పోలివుంది. రాత్రి 12 గంటల సమయంలో వాలంటీర్ రామ్ మోహన్ అందించిన సమాచారం మేరకు ఎస్పీ అసిత్ యాదవ్ తన బృందంతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు బాంబును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయ ఆవరణలో జెండా ఎగురవేసే స్థలంలో వాలంటీర్ రామ్మోహన్ ఈ బాంబును గుర్తించారు. అక్కడున్న పిల్లలు ఆ బాంబును రామ్ మోహన్కు చూపించారు. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించారు. కాగా విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ కుషా, ఎస్పీ అసిత్ యాదవ్, టీఐ కొత్వాలి ప్రవీణ్ చౌహాన్ డాగ్ స్క్వాడ్తో కలిసి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు బాంబును తమ వెంట తీసుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాంబు చాలా ఏళ్ల క్రితం నాటిది. ఈ ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం ఫైరింగ్ రేంజ్ ఏరియా ఉండేది. అప్పట్లో ఈ బాంబు మట్టిలో పడి ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా ఈ విషయంపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. -
జైపూర్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు..
రాజస్థాన్లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై, విమానాశ్రయాన్నంతా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభ్యంకాలేదు. రెండు గంటల తనిఖీ అనంతరం విమానాశ్రయ ప్రాంగణంలో అభ్యంతరకర వస్తువేదీ కనిపించకపోవడంతో భద్రతా సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం జైపూర్ ఎయిర్పోర్ట్ అధికారిక ఐడీకి ‘డాన్ ఆఫ్ ఇండియా’ అనే ఐడీ నుండి శుక్రవారం ఈ-మెయిల్లో బెదిరింపు వచ్చింది. వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బందితో పాటు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్(బీడీఎస్) తనిఖీలు చేపట్టింది. ఈ బెదిరింపు మెయిల్ గురించి ఎయిర్పోర్ట్ ఎస్హెచ్ఓ మమతా మీనా మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులకు ఈ సమాచారం అందించామన్నారు. ఈ నేపధ్యంలో బీడీఎస్, సీఐఎస్ఎఫ్, డాగ్ స్క్వాడ్ బృందం విమానాశ్రయంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. సుమారు 2 గంటల పాటు జరిగిన సెర్చ్ ఆపరేషన్లో ఎయిర్పోర్టులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఇంతకు ముందు డిసెంబర్ 27న జైపూర్ సహా పలు విమానాశ్రయాలపై బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి. అయితే తనిఖీలలో ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. -
సరదా హద్దు దాటితే..పరిస్థితి ఇలా ఉంటుందా?
సరదాగే ఒకళ్లని ఆటిపట్టించేలా చేసే పనులు ఇరువురుకి ఆనందం కలిగించాలి. అవి హద్దు దాటితే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆ పనుల వల్ల ఇరువురిలో ఒక్కరూ హర్ట్ అయ్యి ప్రతిచర్యకు దిగితే పరిణామాలు దారుణంగా ఉంటాయి. అందుకే కాబోలు పెద్దలు ఏదైన సరే శృతి మించకూడదని పదే పదే అంటారు. ఇక్కడ అలానే సరదా అల్లరి కాస్తా శృతి మించింది. ఫలితం ఓ వ్యక్తి తీవ్ర గాయలపాలవ్వడానికి దారితీసింది. అసలేం జరిగిందంటే..ఈ షాకింగ్ ఘటన రష్యాలో చోటు చేసుకుంది. రష్యాలో చెల్యాబిన్స్క్లో ప్రొఫెసర్ బ్లాగిక్ స్ట్రీట్లోని ఓ అపార్ట్మెంట్లో పార్టీ జరగుతుంది. ఆదివారం కావడంతో వారంతపు రోజు ఎంజాయ్ చేయలనుకున్నారు. అందులో భాగంగా కొందరు వ్యక్తులు ఒక అపార్ట్మెంట్లో చేరి అల్లరి చేష్టలతో హుషారుగా ఉన్నారు. అయితే వారి అల్లరి శృతి మించింది. ఏకంగా వంటగదిలో స్మోకింగ్ బాంబ్ పేల్చారు. దీంతో మనస్తాపం చెందిన ఓ అమ్మాయి పట్టరాని కోపంతో దారుణమైన చర్యకు పూనుకుంది. ఏకంగా మరిగిమరిగే నీళ్లను తీసుకొచ్చి పార్టీ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తులపై పోసేందుకు యత్నించింది. అయితే ఆ నీళ్లు కాస్త ఆ ఇంటి యజమానిపైనే నేరుగాపడ్డాయి. అయితే ఆ వ్యక్తి ఏమీ స్మోకింగ్ బాంబ్ ప్రయోగించిన వ్యక్తి కాదు. అతను కూడా అలా చయొద్దన్న వ్యక్తే అని పోలీసుల విచారణలో తెలిసిందే. ఈ హఠాత్పరిణామం గురించి పోలీసులకు సమాచారం అందడంతో పార్టీ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తులపై చర్య తీసుకుని వారికి జరిమాన కూడా విధించారు. ఇలా చేసిన సదుర అమ్మాయిపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడ్డ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, తీవ్ర స్థాయిలో చర్మం బర్న్ అయ్యిందని పోలీసులు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సదరు మహిళపై పలువురు నెటిజన్లు ఫైర్ అవ్వగా, కొందరూ మాత్రం అలా వాళ్లు స్మోకింగ్ బాంబ్ పేల్చాలనుకోవడం కూడా తప్పే అందువల్ల ఆమె అలా ప్రవర్తించిందని మద్దతు పలుకుతూ ట్వీట్ చేశారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: పుట్టుకొస్తున్న ప్లాస్టిక్ శిలలు..ఆందోళనలో శాస్త్రవేత్తలు!) -
అలిపిరిలో బాంబు బ్లాస్ట్ బెదిరింపు ఫోన్ కాల్స్.. వ్యక్తి అరెస్టు..
తిరుమల: అలిపిరి వద్ద బాంబు బ్లాస్ట్ చేస్తానంటూ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితున్ని తమిళనాడు రాష్ట్రం, సేలం జిల్లాకు చేందిన బాలాజీ(39)గా గుర్తించారు. అతన్ని ఈ రోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 15వ తారీఖున అలిపిరి చెక్ పాయింట్ ల్యాండ్ ఫోన్ కి కాల్ చేసాడో వ్యక్తి. మధ్యాహ్నం 3గంటలకు 100 మందిని బాంబ్ బ్లాస్ట్ తో చంపేస్తానని చెప్పడంతో వెంటనే అప్రమత్తం అయ్యారు పోలీసులు. టీటీడీ పోలీసు, విజిలెన్స్ అధికారుల సమన్వయంతో అలిపిరి చెక్ పాయింట్ తనిఖీ చేసారు. అయినప్పటికీ ఎక్కడా ఎటువంటి పేలుడు పదార్ధాలు లభించలేదు. బాంబు పేలుడుకు సంబంధించి ఫోన్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా ఆకతాయి, దుష్ట చేష్టలకి పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తిరుమల డీఎస్పీ భాస్కర్ రెడ్డి అన్నారు. ఇదీ చదవండి: ఏపీ పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుల హవా -
తండ్రి నో చెప్పాడని.. సొంత ఇంటిపై బాంబు వేసి.. అక్కడి నుంచి
చెన్నై: పిల్లలు తల్లిదండ్రులను డబ్బులు అడగడం.. అందుకు వాళ్లు ససేమిరా అనడం సహజమే. ఇక కోపంతో కొందరు పిల్లలు కన్నవాళ్లతో గొడవపడడం లాంటి చేస్తుంటారు. కానీ ఓ పుత్ర రత్నం మాత్రం దారుణంగా ప్రవర్తించాడు. భూమి అమ్మిన డబ్బులు ఇవ్వలేదని సొంత ఇంటిపై బాంబు దాడి చేశాడు. ఈ కేసులో ఇంటి యజమాని కుమారుడితో సహా ఇద్దరిని పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన వేలచ్చేరిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేలచ్చేరిలోని భారతీయార్ వీధిలో నివాసం ఉంటున్న పన్నీర్సెల్వం ఇటీవల తనకున్న కొద్దిపాటి భూమిని విక్రయించాడు. డబ్బులు చేతికి రాగానే ఆ మొత్తంలో రూ.3 లక్షలు ఇవ్వాలని కుమారుడు అరుణ్ తండ్రిని అడిగాడు. అందుకు పన్నీర్ సెల్వం నిరాకరించాడు. దీంతో కోపంతో అరుణ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత తన బావమరిది ప్రవీణ్తో కలిసి బైక్పై వచ్చి తన సొంత ఇంటిపై బాంబు విసిరి పరారయ్యాడు. ఈ పేలుడులో అరుణ్ చిన్నాన్న వెట్రివేందన్, సోదరి రేఖకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఇన్స్పెక్టర్ అశోక్ ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాంబు నిపుణులను రప్పించి విచారణ చేపట్టారు. ఇంటిలో నాటు బాంబు పేలుడు పదార్థాలు దాచి ఉంచగా వాటిని జప్తు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరుణ్, ప్రవీణ్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. చదవండి రోజూ ఒకే టైంలో పవర్ కట్.. అసలు సంగతి తెలిసి గ్రామస్తుల మైండ్ బ్లాక్! -
ఈ బాంబు ఒక్కటి వేస్తే.. 100 బాంబులు వేసినట్టే..
ఏదైనా బాంబును ప్రయోగిస్తే.. అది పడిన ప్రదేశంతోపాటు కొంతదూరం వరకు విధ్వంసం సృష్టిస్తుంది. అక్కడితో దాని పని అయిపోతుంది. అదే క్లస్టర్ బాంబును ప్రయోగిస్తే.. టార్గెట్ చేసిన ప్రదేశంతోపాటు చుట్టుపక్కల కొంత దూరం దాకా విధ్వంసం సృష్టిస్తుంది. అందులోని భాగాలు ఆ తర్వాత కూడా పేలుతూనే.. అక్కడికి వచ్చినవారి ప్రాణాలు తీస్తూనే ఉంటాయి. తాజాగా ఉక్రెయిన్కు అమెరికా క్లస్టర్ బాంబులను ఇవ్వడం, ప్రతిగా తమ వద్ద కూడా క్లస్టర్ బాంబులు ఉన్నాయని రష్యా హెచ్చరించడం నేపథ్యంలో.. క్లస్టర్ బాంబులు ఏమిటి? వాటితో ప్రమాదమేంటి? ఇప్పటివరకు ఎక్కడైనా ప్రయోగించారా? అన్న వివరాలు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ ఒకటి కాదు వందల బాంబులు కలిపి.. సాధారణంగా క్షిపణులు అయినా, ఇతర బాంబులు అయినా వాటిలో పేలిపోయే భాగం (వార్ హెడ్) ఒకటే ఉంటుంది. ఒకే ప్రదేశంలో పెద్ద పేలుడు సంభవిస్తుంది. అదే క్లస్టర్ బాంబులో వందలకొద్దీ చిన్న బాంబులు (బాంబ్లెట్లు) ఉంటాయి. దీనిని ప్రయోగించాక నిర్దేశించిన ప్రాంతానికి చేరుకోగానే విచ్చుకుని.. అందులోని చిన్న బాంబులన్నింటినీ కొంతదూరం వరకు వెదజల్లుతుంది. ఇలా ఎక్కువ విస్తీర్ణంలో పేలుళ్లు జరుగుతాయి. అంత విస్తీర్ణంలో విధ్వంసం జరుగుతుంది. మిలటరీ స్థావరాలు, వాహనాలు, ఆయుధాలు నాశనమవుతాయి. ఆ ప్రాంతంలో ఉండే సైన్యం, సాధారణ ప్రజలకూ ప్రమాదం కలుగుతుంది. అప్పుడే పేలక.. తర్వాత ప్రాణాలు తీస్తూ.. క్లస్టర్ బాంబులు వెదజల్లే బాంబ్లెట్లలో అన్నీ అప్పటికప్పుడే పేలిపోవు. వాటిలో కొన్ని నేలపై చెల్లాచెదురుగా పడిపోతాయి. కొన్నిసార్లు ఏళ్లకేళ్లు కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడైనా సైనికులుగానీ, సాధారణ పౌరులుగానీ వాటిని తాకితే పేలిపోయి ప్రాణాలు తీస్తాయి. అంటే యుద్ధం ముగిసిపోయినా బాంబుల బాధ తప్పని పరిస్థితి. ♦ గతంలో వియత్నాం, లావోస్, ఇరాక్, అష్గానిస్తాన్ తదితర యుద్ధాల్లో అమెరికా ఈ కస్టర్ బాంబులను వినియోగించింది కూడా. వాటిలో పేలిపోకుండా ఉన్న బాంబులు ఇప్పటికీ తరచూ విస్ఫోటం చెందుతూ ప్రజలు ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నాయి. ♦ క్లస్టర్ బాంబులు భారీగా జన హననానికి దారి తీస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వీటి వాడకాన్ని నిషేధిస్తూ ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఆ ఒప్పందంపై అమెరికా, ఉక్రెయిన్, రష్యా సంతకం చేయకపోవడం గమనార్హం. ‘డడ్ రేటు’తో ఎఫెక్ట్ క్లస్టర్ బాంబు ప్రయోగించినప్పుడు పేలకుండా ఉండిపోయే బాంబ్లెట్ల శాతాన్ని ‘డడ్ రేటు’గా పిలుస్తారు. ఈ డడ్ రేటు ఎంత ఎక్కువగా ఉంటే.. భవిష్యత్తులో ప్రజలు వాటి బారినపడే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది. రష్యాకు చెందిన క్లస్టర్ బాంబుల డడ్ రేటు 4శాతం నుంచి 40 శాతం వరకు ఉంటుందని అంచనా. తాజాగా ఉక్రెయిన్కు ఇచ్చిన క్లస్టర్ బాంబుల డడ్ రేటు చాలా తక్కువగా 2.35 శాతమేనని అమెరికా అధికారులు ప్రకటించడం గమనార్హం. క్లస్టర్ బాంబుల ప్రత్యేకతలివీ.. ♦ క్లస్టర్ బాంబు బరువు సాధారణంగా 450 కిలోల నుంచి 500 కిలోల వరకు ఉంటుంది. అందులో ఒక్కోటీ ఏడెనిమిది అంగుళాల పొడవున్న 200 వరకు బాంబ్లెట్లు ఉంటాయి. ♦ క్లస్టర్ బాంబు నిర్దేశిత లక్ష్యానికి చేరువకాగానే.. అతి వేగంగా తిరగడం మొదలవుతుంది. తర్వాత దశలవారీగా బాంబ్లెట్లను విడుదల చేస్తుంది. దీనివల్ల బాంబ్లెట్లు దూరదూరంగా, వేగంగా పడిపోతాయి. ♦ క్లస్టర్ బాంబుల్లోని బాంబ్లెట్లకు కిందివైపు ఫ్యాన్ తరహా ప్రత్యేకమైన రెక్కలు, లేకుంటే చిన్నపాటి ప్యారాచూట్లను అమర్చుతారు. దీనితో అవి ఓ క్రమంలో నేలను తాకి పేలిపోతాయి. ♦ పేలిపోకుండా ఉండిపోయిన బాంబ్లెట్లను గుర్తించి నిర్విర్యం చేయడం కూడా ప్రమాదకరమైన పనే. ఎవరైనా తాకగానే పేలిపోయే అవకాశాలు ఎక్కువ. అందువల్ల బాంబ్ డిస్పోజల్ యూనిట్లు, రోబోలతో వాటిని గుర్తించి, నిర్విర్యం చేయాల్సి ఉంటుంది. 1 మిలటరీ వాహనం నుంచి క్లస్టర్ బాంబు ప్రయోగం 2 నిర్దేశిత లక్ష్యానికి సమీపంలో ఉండగా క్లస్టర్ బాంబు నుంచి బాంబ్లెట్లు విడుదల అవుతాయి. 3 చాలా వరకు బాంబ్లెట్లు నేలను తాకగానే పేలిపోతాయి. 4 కొంత మేర బాంబ్లెట్లు పేలిపోకుండా నేలపై పడి ఉంటాయి. వాటిని ఎవరైనా తాకితే వెంటనే పేలిపోయి విధ్వంసం సృష్టిస్తాయి. -
‘బాంబు.. బాంబు’ విమానంలో యువకుని కేకలు.. తరువాత జరిగిందిదే!
కోల్కతా నుంచి దోహా వెళుతున్న కతర్ ఎయిర్వేస్లో ఆ సమయంలో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. విమానంలో ఉన్న ఒక యువకుడు ‘బాంబు.. బాంబు’ అంటూ పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. దీంతో క్రూ మెంబర్స్ ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్కు తెలియజేశారు. వెంటనే విమానంలో తనిఖీ చేపట్టారు. అయితే ఆ యవకుని తండ్రి అధికారులతో మాట్లాడుతూ తన కుమారుని మానసిక పరిస్థితి సరిగా లేదని తెలిపారు. వివరాల్లోకి వెళితే కతర్ ఎయిర్వేస్కు చెందిన క్యూఆర్541, విమానం కోల్కతా నుంచి దోహాకు బయలుదేరడంలో ఆలస్యం జరిగింది. ఒక యువకుడు విమానంలో బాంబు ఉందంటూ పెద్దగా కేకలుపెట్టాడు. విమానంలోని క్రూ మెంబర్స్ వెంటనే ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్కు చేరవేశారు. వెంటనే భద్రతా దళాలు పరుగుపరుగున వచ్చి, విమానంలోని ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. వారు ఆ యువకుడిని ప్రశ్నించగా... ఎవరో తనతో విమానంలో బాంబు ఉందని చెప్పారని అన్నాడు. కాగా సీఐఎస్ఎఫ్ బృందం ఎయిర్క్రాఫ్ట్ను స్నిఫర్ డాగ్స్ సాయంతో తనిఖీ చేయించారు. ఇంతలో ఆ యువకుని తండ్రి అధికారులతో మాట్లాడుతూ తన కుమారుని మానసిక పరిస్థితి బాగోలేదని చెబుతూ, అందుకు సంబంధించిన ధృవపత్రాలను కూడా చూపించాడు. ఈ ఘటన కారణంగా విమానం బయలుదేరడంలో ఆలస్యం జరిగింది. బాంబు లేదని నిర్థారించాక ప్రయాణికులను తిరిగి విమానంలోకి అనుమతించారు. కాగా దీనికిముందు గత ఫిబ్రవరిలో హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న విమానంలో బాంబు ఉందంటూ సూచన అందించింది. దీంతో ఆ విమానాన్ని లక్నోలోని చౌదరి చరణ్సింగ్ ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. తరువాత విమానంలో తనిఖీలు జరిపారు. అయితే విమానంలో ఎటువంటి బాంబు లభ్యంకాలేదు. ఈ ఘటనలో బాంబు ఉందంటూ వదంతులు వ్యాపింపజేసిన హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: ఆమె 18 ఏళ్ల తరువాత తన ఎల్కేజీ ఫ్రెండ్ను కనిపెట్టిందిలా.. -
హైదరాబాద్: డమ్మీ బాంబుతో బ్యాంకులో హల్చల్
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల షాపూర్నగర్ ఆదర్శ్ బ్యాంక్ దగ్గర గురువారం డమ్మీ బాంబు బెదిరింపు ఘటన చోటు చేసుకుంది. బాడీ మొత్తానికి బాంబు తరహా సెటప్ చేసుకుని ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. మామూలుగా బ్యాంకులోకి ఎంట్రీ ఇచ్చిన ఆ వ్యక్తి.. హఠాత్తుగా తాను మానవబాంబునని, తన దగ్గర బాంబు ఉందంటూ బెదిరింపులకు దిగాడు. రూ.2 లక్షలు ఇవ్వాలని, లేకుంటే బ్యాంకును పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో బ్యాంక్ సిబ్బంది భయపడ్డారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై జీడిమెట్ల పోలీసులకు అలర్ట్ వెళ్లింది. హుటాహుటిన సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు.. అది డమ్మీ బాంబుగా తేల్చారు. సదరు వ్యక్తిని జీడిమెట్లకే చెందిన శివాజీగా గుర్తించారు. అతను ఎందుకు అలా చేశాడన్నదానిపై తేల్చేందుకు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. -
అతీక్ బ్రదర్స్ హత్య: అష్రాఫ్ చివరి మాట గుడ్డూ గురించే.. ఎవరీ గుడ్డూ ముస్లిం?
న్యూఢిల్లీ: గుడ్డూ ముస్లిం.. ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఎవరీ గుడ్డూ అంటూ అంతా ఆరా తీస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ శనివారం రాత్రి ముగ్గురు యువకుల కాల్పుల్లో గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్ మరణించడం తెలిసిందే. కాల్పులకు క్షణాల ముందు అష్రాఫ్ నోట వచ్చిన చివరి మాట గుడ్డూ గురించే. మెయిన్ బాత్ యే హై కీ గుడ్డూ ముస్లిం... (నేను చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయం గుడ్డూ ముస్లిం...) అని అంటూనే సోదరులిద్దరూ కాల్పులకు బలయ్యారు. గుడ్డూ అతీక్ అహ్మద్ ముఖ్య అనుచరుడు. తుపాకుల బదులు బాంబులు వాడటం ఇతని స్టైల్. బాంబులు విసిరి ప్రత్యర్థులను అంతం చేయడంలో దిట్ట. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయాగ్రాజ్లో పట్టపగలే ఉమేశ్ పాల్ హత్య జరిగింది. ఆ సమయంలో గుడ్డూ బైక్ వెనుక కూర్చొని నాటు బాంబులు విసురుతున్న దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. అతీక్ మరణానంతరం అతడి నేరసామ్రాజ్యం గుడ్డూ చేతికి వెళ్తుందని ప్రచారం సాగుతోంది. దాంతో యూపీ పోలీసుల నజర్ ఇప్పుడు అతనిపైనే ఉంది. ఉమేశ్ హత్య కేసులో 10 మంది నిందితుల్లో గుడ్డూ పేరూ ఉంది. ఆ పది మందిలో ఇప్పటిదాకా ఆరుగురు హతం కాగా గుడ్డూతో సహా మిగతా వారంతా పరారీలో ఉన్నారు. గుడ్డూ ప్రస్తుతం కర్ణాటకలో తలదాచుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నమ్మినబంటు గుడ్డూ ముస్లిం ప్రయాగ్రాజ్లో పుట్టాడు. చిన్న వయసులోనే నేర సామ్రాజ్యంతో పరిచయం ఏర్పడింది. లక్నోకు మకాం మార్చి పలు నేరాల్లో పాలుపంచుకున్నాడు. బడా వ్యక్తులతో సన్నిహితంగా మెలిగాడు. ఓ టీచర్ హత్య కేసులో 1997లో అరెస్టయ్యాడు. బలమైన సాక్ష్యాల్లేక విడుదలయ్యాడు. బిహార్కు వెళ్లి నేరాలు కొనసాగించాడు. 2001లో మళ్లీ అరెస్టవగా అతీక్ బెయిల్పై బయటకు తీసుకొచ్చాడు. కొన్నేళ్ల క్రితం గుడ్డూ అనారోగ్యం పాలై పరిస్థితి విషమించగా అతీక్ రూ.8 లక్షలు ఖర్చు చేసి గుడ్డూను బతికించాడు. అందుకు కృతజ్ఞతగా ఉమేశ్పై గుడ్డూ బాంబులు విసిరి హత్య చేశాడు. అతీక్కు నమ్మినబంటుగా పేరుతెచ్చుకున్నాడు. అతీక్ కోసం పాకిస్తాన్ నుంచి పంజాబ్ మీదుగా ఆయుధాలను భారత్కు అక్రమంగా రవాణా చేసేవాడని పోలీసులు వెల్లడించారు. అన్నీ అనుమానాలే ప్రయాగ్రాజ్/లక్నో/న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్లు అతీక్, అష్రాఫ్ హత్య విషయంలో పోలీసుల తీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అంతటి కరడుగట్టిన నేరగాళ్లను రాత్రిపూట ఎందుకు ఆసుపత్రికి తీసుకొచ్చారు? పైగా వారున్న వాహనాన్ని గేటు బయటే ఆపి నడిపించుకుంటూ ఎందుకు వచ్చారు? మీడియా కంటపడకుండా ఆసుపత్రి లోపలి దాకా వాహనంలో ఎందుకు తీసుకురాలేదు? పైగా ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్టు విచారణలో సోదరులిద్దరూ ఒప్పుకున్నారు. నిబంధనల ప్రకారం ఇలాంటి కేసుల్లో నిందితుల్ని మీడియాతో సహా ఎవరి కంటా పడనివ్వకూడదు. దాన్నీ తుంగలో తొక్కారు. హంతకులు ముగ్గురూ విలేకరుల ముసుగులో వచ్చి కాల్పులు జరపడం తెలిసిందే. మీడియా ప్రతినిధులను తనిఖీ చేయకుండానే గ్యాంగ్స్టర్ల దగ్గరికి అనుమతించడం వెనక కుట్ర ఉండొచ్చంటున్నారు. వారు 20 తూటాల దాకా కాల్చినా నిందితుల వెన్నంటే ఉన్న పోలీసుల్లో మాత్రం ఎవరికీ ఏమీ కాకపోవడం నమ్మశక్యంగా లేదంటున్నారు. నిందితులను సోమవారం ప్రతాప్గఢ్ జిల్లా జైలుకు తరలించారు. విచారణకు సిట్ అతీక్ శరీరంలో 9 తూటాలున్నట్టు పోస్టుమార్టంలో వెల్లడైంది. 8 తూటాలు ఛాతీ, వీపు నుంచి దూసుకెళ్లగా మరోటి తలలో కనిపించింది. అష్రాఫ్ తలపై ఒకటి, వీపుపై నాలుగు తూటా గాయాలను గుర్తించారు. ఈ హత్యోదంతంపై దర్యాప్తుకు సతీశ్ చంద్ర, సత్యేంద్ర ప్రసాద్, ఓం ప్రకాశ్ సభ్యులుగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. దీనిపై విచారణకు యూపీ ప్రభుత్వం ఇప్పటికే జ్యుడీషియల్ కమిషన్ వేయడం తెలిసిందే. -
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కలకలం.. బాంబు బెదిరింపు కాల్..!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తి బళ్లారి ఎక్స్ప్రెస్లో బాంబు ఉందని కాల్ చేశాడు. ఆగి ఉన్న రైలులో బాంబు ఉందని బెదిరింపు కాల్ చేశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వే, జీఆర్పీ పోలీసులు కలిసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. -
Punjab CM: పంజాబ్ సీఎం హత్యకు కుట్ర? ఇంటివద్ద బాంబు స్వాధీనం..
చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఇంటి వద్ద లైవ్ బాంబు దొరకడం కలకలం రేపింది. చండీగఢ్లోని ఆయన నివాసం వద్ద పోలీసులు ఈ బాంబును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీఎం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. చండీగఢ్లోని పంజాబ్, హరియాణ సీఎంల నివాసాలకు సమీపంలో బాంబ్ షెల్ లభించింది. బాంబ్ స్క్వాడ్ అధికారులు సోమవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో దీన్ని స్వాధీనం చేసుకున్నారు. భగవంత్ మాన్ హెలిప్యాడ్ సమీపంలోనే ఈ బాంబు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బాంబును గుర్తించిన సమయంలో ఆయన ఇంట్లో లేరు. ఎవరో భగవంత్ మాన్ హత్యకు కుట్ర పన్నే బాంబు అమర్చి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కేసు నమోదుచేసుకుని త్వరితగతిన దర్యాప్తు చేపట్టారు. భారత సైన్యం వెస్టర్న్ కమాండ్ రంగంలోకి దిగి ఈ ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఏకంగా సీఎం ఇంటి వద్ద బాంబు దొరకడంతో భద్రతా వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోంది. సైన్యం, అధికారులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. Bomb found near Punjab CM Bhagwant Mann's house in Chandigarh; bomb squad present at the spot pic.twitter.com/qrDCnBS2IF — ANI (@ANI) January 2, 2023 చదవండి: 'సమాజం ఎటుపోతుందో అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి' -
అక్కడ పిల్లలకు ‘బాంబ్’, ‘గన్’ అనే పేర్లే పెట్టాలంటా.. లేదంటే?
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా.. ఆ పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది కిమ్ జోంగ్ ఉన్ పాలన. ఆ దేశం ఇతర దేశాలతో పోలిస్తే చాలా భిన్నం. నిరంకుశ పాలనలో ప్రపంచంతో సంబంధం లేకుండా భిన్నమైన నిబంధనలు పాటిస్తారు. వారికి సొంత క్యాలెండర్ ఉంటుంది. దేశం విడిచి వెళ్లేందుకు అనుమతులు కావాలి. విదేశీ సంగీతం అక్కడ నిషేధం. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. కనీసం తల వెంట్రుకలు ఎలా కట్ చేసుకోవాలనే విషయాన్ని కూడా ప్రభుత్వమే చెబుతుంది. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో కొత్త, విచిత్రమైన నిబంధనను తీసుకొచ్చింది కిమ్ సర్కార్. ఇకపై తల్లిదండ్రులు తమ పిల్లలకు ‘బాంబ్’, ‘గన్’, ‘శాటిలైట్’ వంటి పేర్లను పెట్టాలని కొద్ది రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. దేశభక్తి భావాన్ని పిల్లల్లో పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఉత్తర కొరియా ప్రభుత్వం పౌరుల పేర్లను నిర్ణయించటంపై వ్యతిరేకత వస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. దక్షిణ కొరియా మాదిరిగానే.. ఇక్కడా పేర్ల చివర్లలో అచ్చులు ఉండేలా చూడాలని గతంలో సూచించగా.. తాజా నిర్ణయంతో మారిపోయాయి. భారీగా జరిమానా.. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించే కుటుంబాలకు భారీగా జరిమానా విధించాలని కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు పలు నివేదికలు తెలిపాయి. చెప్పిన విధంగా పేర్లు లేకపోవటం సోషలిస్ట్ విధానానికి వ్యతిరేకమని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు.. కొత్త పేర్లు దక్షిణా కొరియాలో ఉండే పేర్లకు భిన్నంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల ఆగ్రహం.. తమ పిల్లల పేర్లను బాంబ్, గన్, శాటిలైట్ వంటి వాటితో పెట్టాలని సూచించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆదేశాలను పాటించేందుకు చాలా మంది వ్యతిరేకత చూపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తమ పేర్లను మార్చుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఉత్తర కొరియాకు చెందిన ఓ వ్యక్తి రేడియో ఫ్రీ ఆసియా(ఆర్ఎఫ్ఏ)తో తెలిపాడు. గత ఏడాది నవంబర్ నుంచే పేర్ల మార్పునకు సంబంధించిన నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇదీ చదవండి: పార్లమెంట్లో మహిళా సభ్యురాలిపై చేయి చేసుకున్న ఎంపీ.. వీడియో వైరల్ -
భార్య దూరమైందనే బాధలో కోపంతో....
సైదాబాద్: తన భార్య దూరమైందనే బాధ... ఆమెను తన వద్దకు చేర్చట్లేదని పోలీసులపై కోపం...ఈ పరిస్థితులే ఓ వ్యక్తి బాంబు బెదిరింపు కాల్ చేసేలా చేశాయి. అతగాడు మంగళవారం రాత్రి చేసిన ఆ కాల్ పోలీసులు, బాంబ్ స్క్వాడ్ను ఉరుకులు, పరుగులు పెట్టింది. బుధవారం అతడిని పట్టుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 18 రోజుల జైలు శిక్ష విధించింది. సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బిరామిరెడి కథనం ప్రకారం... సంతోష్నగర్ ప్రాంతానికి చెందిన ఎండీ అక్బర్ఖాన్ ఇంటర్మీడియట్ వరకు చదివాడు. వివాహమైనప్పటికీ అనివార్య కారణాల నేపథ్యంలో కొన్నాళ్లుగా భార్య దూరంగా ఉంటోంది. దీనికి సంబం«ధించి అతడి గతంలో పోలీసుస్టేషన్లోనూ ఫిర్యాదు చేశాడు. అయితే అక్బర్ ప్రవర్తనతో విసిగిపోయానని, తాను అతడితో కలిసి ఉండలేనంటూ ఆమె పోలీసులకు స్పష్టం చేసింది. ఓపక్క తన భార్య దూరమైందనే బాధ, మరోపక్క పోలీసులు ఆమెను తీసుకువచ్చి తనకు అప్పగించట్లేదనే ఆవేదన అతడిలో ఎక్కువ అయ్యాయి. దీంతో బుధవారం రాత్రి 9.15 గంటల ప్రాంతంలో అతగాడు తన ఫోన్ నుంచే నేరుగా సైదాబాద్ ఠాణాకు ఫోన్ కాల్ చేశాడు. ఐఎస్సదన్లోని మసీద్ మందిర్ చౌరస్తాలో కొందరు బాంబు పెట్టనున్నారంటూ చెప్పాడు. ఈ కాల్తో అప్రమత్తమైన పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్లను పిలిపించారు. ఐఎస్ సదన్ ప్రాంతంలో అణువణువూ గాలించారు. చివరు అది బెదిరింపు కాల్గా తేల్చారు. ఈ ఉదంతంపై సైదాబాద్ ఠాణాలో కేసు నమోదైంది. ఫోన్ నెంబర్ ఆధారంగా ముందుకు వెళ్లిన అధికారులు బుధవారం ఉదయం అక్బన్ ఖాన్ను పట్టుకున్నారు. ఈ నిందితుడిపై ఐపీసీలోని 182, 186తో పాటు సిటీ పోలీసు యాక్ట్లోని 70 (బీ) సెక్షన్ కింద ఆరోపణలు చేస్తూ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయస్థానం అక్బర్ ఖాన్కు 18 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో సైదాబాద్ పోలీసులు అతనినిన చంచల్గూడ జైలుకు తరలించారు. (చదవండి: చెల్లెలిని ప్రేమించాడన్న కోపంతో ఓ అన్న..) -
భారత గగనతలంలో ఇరాన్ విమానానికి బాంబు బెదిరింపు
-
విమానం గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపు...దెబ్బకు నాన్ స్టాప్గా ప్రయాణించిన విమానం
ఇరాన్ విమానం భారత్ గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపులు కాల్స్ వచ్చాయి. ఈ ఘటన ఇరాన్లోని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంగ్జౌకు వెళుతున్న మహాన్ ఎయిర్ విమానంలో చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన భారత వైమానికదళం అధికారులు ఢిల్లీ విమానాశ్రయాన్ని అలర్ట్ చేసింది. అంతేగాదు ఆ విమానంలోని ఫైలెట్కి జైపూర్ లేదా చండీగఢ్లలో ల్యాండ్ అయ్యేలా రెండు ఆప్షన్లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఐతే పైలెట్ ఆ రెండు విమానాశ్రయాల్లోకి విమానాన్ని మళ్లించడానికి ఇష్టపడ లేదని భారత వైమానికి దళం పేర్కొంది. అంతేగాదు ఆ పైలెట్ బాంబు బెదిరింపులతో విమానాన్ని ఎక్కడ ల్యాండ్ చేసేందుకు ఇష్టపడలేదని చెప్పారు. దీంతో టెహ్రాన్ ఎయిర్పోర్ట్ రంగంలోకి దిగి పైలెట్ని బాంబు భయాన్ని వీడమని కోరడంతో సదరు ఫైలెట్ చైనాలోని తన గమ్యస్థానం వైపుకు ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇదిలా ఉండగా ఆ విమానాన్ని రెండు యుద్ధ విమానాలు సురక్షిత దూరం నుంచి అనుసరించినట్లు భారత వైమానిక దళం పేర్కొంది. ఆ విమానం చైనా గగనతలంలోకి ప్రవేశించిందని ప్లైట్ ట్రాకింగ్ వైబ్సైట్ ఫ్లైట్ రాడార్ చూపించినట్లు వైమానిక దళం తెలిపింది. సదరు ఇరాన్ విమానానికి ఉదయం 9.20 గం.ల ప్రాంతంలో బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. భారత గగనతలంలో ఉండగా ఈ బెదిరింపులు రావడంతో భారత వైమానిక దళం అప్రమత్తమై మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీల సంయుక్తంగా తగిన చర్యలు చేపట్టింది. అంతేగా భారత గగనతలం అంతటా భారతవైమానిక దళం ఈ విమానంపై గట్టి నిఘా పెట్టిందని కూడా అధికారులు తెలిపారు. ఐతే ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఈ బాంబు బెదిరింపుల గురించి లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తెలియజేసినట్లు సమాచారం. (చదవండి: ప్రచండ్ హెలికాఫ్టర్.. ప్రపంచంలోనే పవర్ఫుల్.. ‘మేడ్ ఇన్ ఇండియా’) -
ఇండిగో విమానంలో బాంబు కలకలం... కొద్దినిమిషాల్లో టేక్ ఆఫ్ అవుతుందనంగా..
ముంబై: ఇండిగో విమానం టేక్ ఆఫ్ అవుతుందనగా విమానంలో బాంబు ఉందంటూ వార్నింగ్ మెసేజ్ వచ్చింది. దెబ్బకు సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా హైఅలర్ట్ విధించి తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటన ముంబైలోని చత్రపతి శివాజి మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది. అయితే సిబ్బంది అప్రమత్తమై హుటాహుటినా తనిఖీలు నిర్వహించగా... అలాంటిదేమీ జరగలేదని అధికారులు తెలిపారు. కరక్ట్గా ఫ్లైట్ టేక్ఆఫ్ అయ్యే సమయానికి శనివారం రాత్రి ఈ గాలి వార్త వచ్చింది. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే విమానాన్ని ఆపీ తనిఖీలు చేశారు. దీంతో ఫ్లైట్ ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. ఆ ఇండిగో విమానం ముంబై ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సిన విమానం. అయితే ఆ ఈమెయిల్ మెసేజ్లో ఇండోగో విమానం ఫలాన ఫ్లైట్ నెంబర్లో బాంబు ఉందని చాలా క్లియర్గా సందేశం పంపిచడంతో అధికారులు సీరియస్గా తీసుకుని వెంటనే తనిఖీలు నిర్వహించామని తెలిపారు. అసలు ఎక్కడ నుంచి ఈ గాలి వార్త వచ్చిందని పోలీసులు దర్యాప్త చేయడం ప్రారంభించారు. (చదవండి: విషాదంలో ఎంత ఘోరం.. రీల్స్ తీస్తుండగా..) -
స్కూల్పై బాంబు పేలుడు.. భయంతో విద్యార్థులు, టీచర్ల పరుగులు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ టీటాగఢ్లో ఓ పాఠశాలపై బాంబు పేలడం కలకలం రేపింది. విద్యార్థులు, టీటర్లంతా స్కూల్లో ఉన్న సమయంలోనే శనివారం మధ్యాహ్నం 1:00గంటలకు ఈ ఘటన జరిగింది. భారీ పేలుడు శబ్దం వినగానే సిబ్బంది, స్టూడెంట్స్ భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒక్కరు కూడా గాయపడకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాంబు స్క్యాడ్ నిపుణులతో తనిఖీలు చేయించారు. అయితే స్కూల్ భవనంపైకప్పుపై ఈ బాంబు ఎలా పేలి ఉంటుందనే విషయంపై మాత్రం పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. ఈ బాంబును భవనంపైనే ఎవరైనా కావాలని పెట్టారా? లేక బయటి నుంచి స్కూల్ పైకి విసిరారా? అనే విషయం తెలియాల్సి ఉంది. అదృష్టవశాత్తు పేలుడు జరిగినప్పుడు విద్యార్థులంతా స్కూల్ లోపలే ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ భవనంపై కాకుండా పాఠశాల లోపల పేలుడు జరిగి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని పేర్కొన్నారు. ఈ పేలుడు ఘటనపై అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. క్రూడ్ బాంబులు, అక్రమ ఆయుధాల పరిశ్రమలే బెంగాల్లో పుట్టుకొస్తున్నాయని కమలం పార్టీ తృణమూల్ ప్రభుత్వంపై మాటల దాడికి దిగింది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు బీజేపీ ఎలాంటి అవకాశన్నైనా వదులుకోదని టీఎంసీ దీటుగా బదులిచ్చింది. చదవండి: ప్రధాని మోదీని ఆకాశానికెత్తిన అమెరికా మీడియా -
ఎయిర్పోర్టులో బాంబు కలకలం.. హుటాహుటిన ఖాళీ చేయించిన అధికారులు
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో బాంబు ఉందని బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. సమాచారం అందిన వెంటనే ఇంటర్నేషనల్ టర్మినల్ను ఖాళీ చేయించారు అధికారులు. అనుమానాస్పద ప్యాకేజీని గుర్తించినట్లు వెల్లడించారు. పోలీసులు, సిబ్బంది విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. తాము చెప్పే వరకు ఇంటర్నేషనల్ టర్మినల్ వైపు ఎవరూ రావొద్దని అధికారులు సూచించారు. అక్కడ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు వెల్లడించారు. 2020లో శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయాన్ని 30 లక్షల మందికిపైగా ప్రయాణికులు వినియోగించారు. పికప్, డ్రాప్ ఆఫ్ సేవలు తమ దేశీయ టర్మినల్స్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. చదవండి: ట్రంప్ మొదటి భార్య మృతిపై అనుమానాలు! వైద్యులు ఏం చెప్పారంటే? -
శబరి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు..ఫేక్ కాల్గా గుర్తింపు
-
కోణార్క్ ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు.. ఆకతాయిని పట్టుకున్న పోలీసులు
సాక్షి,మేడ్చల్: కోణార్క్ ఎక్స్ప్రెస్లో బాంబ్ ఉందని కాల్ చేసిన ఆకతాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఫేక్ కాల్ చేసింది గండిమైసమ్మ బహదూర్ పల్లికి చెందిన తోర్రి కార్తిక్ (19) గా పోలీసులు గుర్తించారు. ఆకతాయిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బాంబ్ ఉందని కాల్ చేస్తే పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దామని కాల్ చేసినట్లు తెలిపాడు. కాగా రైల్వే, లోకల్ పోలిసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని పట్టుకున్నారు. కాగా బుధవారం కోణార్క్ ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కాల్ రావడంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు చర్లపల్లి రైల్వేస్టేషన్లో ట్రైన్ను నిలిపివేశారు. బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు అనంతరం ఫేక్ కాల్గా రైల్వే పోలీసులు తేల్చారు. చివరికి కాల్ చేసిన ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు. కోణార్క్ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ నుంచి ముంబైకు వెళ్తోంది. -
మెట్రో స్టేషన్లో తలదాచుకుంటున్న ఉక్రెనియన్లు...వైరల్ అవుతున్న వీడియో
-
మెట్రో స్టేషన్లో తలదాచుకుంటున్న ఉక్రెనియన్లు...వైరల్ అవుతున్న వీడియో
Metro station in Kharkiv: ఉక్రెయిన్ పై రష్యా గత నెలరోజుల తరబడి దాడి చేస్తూనే ఉంది. వైమానిక దాడులతో పౌరుల ఆవాసాలనే లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే కైవ్, మారియుపోల్, ఖార్కివ్లను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా బలగాలు దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖార్కివ్లోని పౌరులు బాంబుల దాడుల నుంచి తప్పించుకునేందుకు మెట్రో స్టేషన్లోనే తలదాచుకుంటున్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో ..ఉక్రెనియన్లకు ఆ మెట్రో స్టేషనే బాంబు షెల్టర్గా మారిందని పేర్కొంది. ఆ స్టేషన్లో పౌరులు ఏవిధంగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారో వివరిస్తూ..వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అక్కడే నివాసం ఉంటున్న ఉక్రెయిన్ల కోసం తాత్కాలిక పడకలను, సంగీత కచేరీలను ఏర్పాటు చేశారు. అంతేగాదు రష్యా బలగాలు ఖార్కివ్లోని అణుకేంద్రం పై కూడా దాడులు నిర్వహించింది. అంతేగాదు ఖార్కివ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ టెక్నాలజీలోని న్యూట్రాన్ సోర్స్ ప్రయోగాశాల అగ్నిప్రమాదానికి గురైందని మంత్రిత్వ శాఖ తెలిపింది.. అంతేగాదు ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్లో జరుగుతున్న నష్టాన్ని అంచనవేయడం కూడా కష్టమేనని ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
మరియుపోల్లో మారణహోమం? రెండు సూపర్ బాంబులతో అటాక్!
యుద్ధం మొదలై నాలుగు వారాలైనప్పటికీ ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడుతూనే ఉంది. బాంబులతో ఉక్రెయిన్ని అల్లాడిస్తోంది. ఈ క్రమంలో రాజధాని కీవ్ నగరంతో పాటు పలు నగరాలపై విధ్వంసం సృష్టిస్తోంది. ఇందులో ముఖ్యంగా వినిపిస్తున్న నగరం పేరు మరియుపోల్. ఇక్కడి ప్రాంతాలు, ఫ్యాక్టరీలపై రష్యా బలగాలు నిర్విరామంగా దాడులు చేస్తూనే ఉన్నాయి. ఎలాగైనా ఈ నగరాన్ని స్వాధీనం చేసుకోవాలని రష్యాసేనలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. ఆ నగరాన్ని నలుదిక్కులా చ్టుటుముట్టి అదుపులోకి లక్ష్యంగా రష్యన్ బలగాలు పని చేస్తున్నాయి. తాజాగా రెండు శక్తివంతమైన ‘సూపర్’ బాంబులను మరియుపోల్ నగరంపై రష్యా ప్రయెగించింది. ఉక్రేనియన్ అధికారులు అదుపులో ఉన్న దక్షిణ ఓడరేవు నగరం మరియుపోల్ నుంచి పౌరులను రక్షించే ప్రయత్నం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. దాదాపు 1,00,000 మంది ప్రజలు ఆ నగరంలో చిక్కుకుపోయారని, దాడి అనంతరం మృతదేహాలతో, ధ్వంసమైన భవనాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయిందని స్థానిక హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది. అత్యాధునిక మిస్సైళ్ల దాడితో రష్యా దళాలు రాజధాని కీవ్పై తమ పట్టును కొనసాగిస్తున్నందున బుధవారం ఉదయం వరకు ఆ నగరం కర్ఫ్యూ నీడలో ఉంది. -
చర్చలు జరిగేందుకైన దాడి చేయడం ఆపండి!
legally binding security guarantees if NATO shut the Door: రష్య ఉక్రెయిన్పై తన దాడిని ఏడో రోజు కూడా కొససాగిస్తూనే ఉంది. ప్రస్తుతం ప్రజా ఆవాసాలపై కూడా దాడి చేసి రాజధాని కైవ్లోకి చొరబడేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే పలు నగరాలలోకి బలగాలు చొరబడ్డాయి. దీంతో ఉక్రెయిన్ అద్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అర్థవంతమైన చర్చలు జరిగేందుకైన ముందు ఉక్రెయిన్లోని నగరాలపై దాడి చేయడం ఆపేయాలని అన్నారు. కనీసం ప్రజలపై బాంబు దాడి చేయడం ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఉక్రెయిన్ను నాటోలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేకున్నా.. రష్యా ఉక్రెయిన్ నాటోలో ఉండకూడదనుకుంటే గనుక కనీసం ఉక్రెయిన్కు చట్టబద్ధంగా కట్టుబడి ఉండే భద్రతా హామీలను రూపొందించాలి అని భాగస్వామ్య దేశాలను జెలెన్ స్కీ కోరారు. ఉక్రెయిన్ పతనమైతే ఈ రష్యన్ దళాలన్నీ మీ నాటో సభ్య దేశాల సరిహద్దుల్లో ఉంటాయని తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నారు. అంతేకాదు అక్కడ కూడా మీకు ఇదే ప్రశ్న తలెత్తుందని స్పష్టం చేశారు. మరోవైపు ఉక్రెయిన్ గత వారం రష్యన్ దళాల దండయాత్రను తట్టుకోవడంలో సహాయపడటానికి నాటో సభ్యుల నుంచి ఆయుధాల రవాణాను పొందింది. అంతేగాక రష్యాను కట్టడి చేసి దిశగా పశ్చిమ దేశాలు రష్యా ఆర్థిక వ్యవస్థపై ఆంక్షలను కూడా ప్రవేశపెట్టాయి. అయితే జెలన్ స్కీ నో ఫ్లై జోన్ విధించడంతో పాటు మరిన్ని చేయాలని జెలెన్స్కీ అంతర్జాతీయ సమాఖ్యను కోరారు. రష్యా సైనిక చర్యతో త్వరితగతిన లాభలు పొందలేదని ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధ భూమిలో ఒంటరిగా నిలబడి ఉందని, పైగా దాని స్వంత భద్రత పశ్చిమ దేశాలతో ముడిపడి ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు. అంతేకాదు తమకు ప్రతి రోజు యుద్ధం ఉందని, తమకు సహాయం కావాలని చెప్పారు. "నేను నా దేశం కోసం నిరంతరం పనిచేస్తున్నా, మేము మా భూమిని, మా ప్రజలను రక్షించుకునేందకు చివరి వరకు నిలబడి పోరాడుతాం. మా పిల్లల భవిష్యత్తు కోసం నిలబడతాం ". అని జెలెన్ స్కీ చెప్పారు. (చదవండి: పుతిన్ ఆంక్షలు... రష్యన్లు దేశం విడిచి వెళ్లకుండా కట్టడి!) -
ఢిల్లీలో బాంబు కలకలం: ఓ ఇంట్లో అనుమానాస్పద బ్యాగ్..!!
-
పంజాబ్లో పాక్ డ్రోన్ కలకలం
అమృత్సర్: పాక్ నుంచి వచ్చిన ఒక డ్రోన్ పంజాబ్లో జారవిడిచిన 4 కిలోల ఆర్డీఎక్స్, తుపాకీ, బాంబు తయారీ సామగ్రిని రికవరీ చేశామని సరిహద్దు రక్షక దళం (బీఎస్ఎఫ్) బుధవారం తెలిపింది. అర్ధరాత్రి సమయంలో పాక్ నుంచి వస్తున్న డ్రోన్పైకి గురుదాస్పూర్ సెక్టార్లోని పంజ్గ్రైన్ వద్ద రక్షణ సిబ్బంది కాల్పులు జరిపారని బీఎస్ఎఫ్ ప్రతినిధి చెప్పారు. అనంతరం ఆ ప్రాంతాన్ని సోదా చేయగా రెండు ప్యాకెట్లు లభించాయని చెప్పారు. వీటిలో డ్రగ్స్ ఉంటాయని తొలుత భావించామని, తెరిచి చూస్తే 4.7 కిలోల ఆర్డీఎక్స్, చైనా తయారీ తుపాకీ, 22 బుల్లెట్లతో కూడిన మ్యాగ్జైన్, మూడు ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, టైమర్, డిటోనేటింగ్ కార్డ్, స్టీల్ కంటైనర్, నైలాన్ తాడు, ప్లాస్టిక్ పైను, లక్ష రూపాయల నగదు కనిపించాయని తెలిపారు. వీటిని ఐఈడీ (పేలుడు పదార్థాలు) తయారీకి వినియోగిస్తారన్నారు. వీటిని జారవిడిచిన అనంతరం డ్రోన్ తిరిగి పాక్లోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. భారతీయ జాలర్లను అరెస్టు చేసిన పాక్ భారత్కు చెందిన 36 మంది జాలర్లను పాకిస్తాన్ నావికాధికారులు అరెస్టు చేశారు. వీరికి చెందిన 6 పడవలను కూడా పాక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాక్ ప్రాదేశిక జలాల్లో చేపలు పడుతున్నారన్న కారణంపై వీరిని పాక్ అదుపులోకి తీసుకుందని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. పాక్ ఈఈజెడ్లో ఈ జాలర్లు ప్రవేశించారని, అందుకే అరెస్టు చేశామని పాక్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. -
బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు
-
ఎమ్మెల్యే ఇంటిపై బాంబు దాడి
సాక్షి, భువనేశ్వర్: గంజాం జిల్లాలోని కళ్లికోట్ ఎమ్మెల్యే సూర్యమణి బైద్య ఇంటిపై కొంతమంది గుర్తుతెలియని దుండగులు బాంబులు విసిరి పరారయ్యారు. ఈ దుర్ఘటనలో ఎమ్మెల్యే మద్దతుదారుల్లోని నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న కళ్లికోట్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం క్షతగాత్రులను కళ్లికోట్ ప్రభుత్వాస్పత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అందజేశారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం వారిని బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించామని ఎస్డీపీఓ గౌతమ్ కృష్ణ తెలిపారు. నిమ్మజర గ్రామంలోని ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరగగా, ఈ ఘటన వెనక ఉన్న కారణాలు ఇంకా తెలియరావాల్సి ఉందని గంజాం జిల్లా ఎస్పీ బ్రజేష్కుమార్ రాయ్ పేర్కొన్నారు. -
హైదరాబాద్ లోనే బాంబు తయారు NIA సీన్ రికన్ స్ట్రక్షన్
-
సాస్ ఇవ్వలేదని రెస్టారెంట్ను బాంబులతో పేల్చేస్తానన్నాడు.. చివరికి
ఆహారం విషయంలో కొంతమంది భోజన ప్రియులు కచ్చితంగా ఉంటారు. అలాగే వారికి నచ్చిన ఆహారం కోసం గతంలో కొందరు వందల కిలోమీటర్లు వెళ్లిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇంత వరకు ఓకే గానీ ఏదైనా సృతి మించకూడదని అంటారు. కాగా ఓ వ్యక్తి ఆ విషయంలో చాలా దూరం వెళ్లాడు. ఎంతంటే ఏకంగా రెస్టారెంట్ను బాంబులతో పేల్చేస్తానంటూ ఆ యజమానికే కాల్ చేసి బెదిరిస్తూ రెచ్చిపోయాడు. అసలు అతనికి అంతలా ఆగ్రహానికి గల కారణం తెలిస్తే షాక్ అవుతారు. మరేమీ లేదండీ.. సాస్ ఇవ్వడం మరిచిపోయాడని అతను అంత రచ్చ చేశాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని లోవాలో నివసిస్తున్న రోబర్ట్ గాల్విట్జెర్ ఫుడ్ రెస్టారెంట్ సంస్థ మెక్ డొనాల్డ్స్కు ఫోన్ చేసి చికెన్ నగ్గెట్స్ ఆర్డర్ చేశాడు. మెక్డొనాల అంటేనే చికెన్ నగ్గెట్స్, బర్గర్స్కి ప్రత్యేకమని అందరికీ తెలిసిన విషయమే. ఇంకేముంది రుచికరమైన వంటకం వస్తోంది, ఓ పట్టు పట్టాలి అని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇంతలో అతనికి చికెన్ నగ్గెట్స్ అందాయి. కానీ, అవి డిప్ చేసి తినేందుకు అందులో సాస్ ఇవ్వడం ఆ రెస్టారెంట్ సిబ్బంది మరిచిపోయారు. అసలు సాస్ లేకుండా ఎలా డెలివరీ చేస్తారని మనోడికి కోపం వచ్చింది. వెంటనే డెలివరీ సిబ్బందిని కొట్టడమే కాకుండా, రెస్టారెంట్కు ఫోన్ చేసి.. బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా గాల్విట్జెర్ను అరెస్టు చేశారు. చదవండి: వాంటెడ్ క్రిమినల్గా ‘మార్క్ జుకర్బర్గ్’.. పట్టిస్తే రూ.22కోట్లు -
దర్బంగా పేలుడు వెనుక హైదరాబాద్ లో కుట్ర
-
మరో సారి మా బాంబులు గురి తప్పవు : బ్రిటన్కు రష్యా వార్నింగ్
మాస్కో: శతాబ్దాల కాలం నుంచి సముద్రాల మీద అధిపత్యం కోసం సంపన్న దేశాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో పలు దేశాలు కొన్ని ప్రాంతాలలోని జలాలు తమకు చెందినవిగా ప్రకటించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరహాలోనే.. తమ జలాల్లోకి ప్రవేశించిన బ్రిటన్కు రష్యా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ రాయల్ నేవికి చెందిన డెస్ట్రాయర్ హెచ్ఎంఎస్ డిఫెండర్ నౌక ఉక్రెయిన్ నుంచి జార్జియాకు వెళ్లే క్రమంలో క్రిమియా జలాల్లోకి ప్రవేశించింది. దీనిని గుర్తించిన రష్యా నౌకాదళ సిబ్బంది హెచ్చరికగా కాల్పులు జరిపింది. మళ్లీ ఈ ఘటన పునరావృతమైతే మా బాంబులు లక్ష్యాన్ని తాకుతాయని హెచ్చరించింది. ఇప్పటికే రష్యా.. బ్రిటన్ యుద్ధ నౌక తమ జలాల్లోకి వచ్చిందని, మాస్కోలోని బ్రిటన్ అంబాసిడర్ కార్యాలయానికి సమన్లు కూడా జారీ చేసింది. అయితే ఈ జలాలు ఉక్రెయిన్కు చెందినవిగా బ్రిటన్ సహా పలు దేశాలు వాదిస్తున్న సంగతి తెలిసిందే. తమ యుద్ధనౌక మార్గంలో రష్యా బాంబులేసిందని బ్రిటన్ ఆరోపిస్తోంది. కాగా ఈ ఘటనపై వీరివురి వాదనలు వేరువేరుగా ఉన్నాయి. ఈ ఘటనపై రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రిని బ్రిటన్ యుద్ధనౌక మార్గంలో బాంబులేశారట కదా అని ప్రశ్నిస్తే.. భవిష్యత్తులో మార్గంలో కాదు, టార్గెట్పైనే వేస్తామని అనడం గమనార్హం. There are conflicting reports over an incident involving Russian and British naval vessels in the Black Sea. Russia's defense ministry says warning shots were fired at a British ship — But Britain says any shots fired were pre-announced training exercises https://t.co/TKJpAnikuU pic.twitter.com/xZfUWwrsZU — Reuters (@Reuters) June 23, 2021 చదవండి: ఇదో వింత కేసు, ఇతనికి పది నెలలుగా పాజిటివ్..చివరికి -
ఆన్లైన్లో చూసి బాంబు తయారు చేశాడు.. అనంతరం
ముంబై: ఈ మధ్యన యూట్యూబ్లో చూసి రకరకాల ప్రయోగాలు చేయడం అలవాటుగా మారిపోయింది. ఒక్కోసారి కొంతమంది శృతిమించిపోతుంటారు. తాజాగా నాగ్పూర్కు చెందిన రాహుల్ పగాడే (25) ఆన్లైన్లో పేలుడు పదార్థాలు ఎలా తయారు చేస్తారో చూసి ఒక బాంబ్ తయారు చేశాడు. అనంతరం ఆ బాంబ్తో ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి కలకలం సృష్టించాడు. అయితే తొలుత బాంబ్ తనకు నాగ్పూర్లోని ఓ కాలేజీ వద్ద దొరికిందని బుకాయించాడు. అయితే పోలీసులకు అతని మాటలు నమ్మశక్యం కాకపోవడంతో విచారణ చేశారు. అనంతరం బాంబ్ తానే తయారు చేశానని ఒప్పుకున్నాడు. ఈ విషయమై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ ‘‘కొన్ని ట్యుటోరియల్స్ చూసి బాంబ్ తయారు చేశాడు. అయితే అది తయారు చేసిన అనంతరం దాన్ని ఏం చేయాలో తెలియక భయపడ్డాడు. వెంటనే బాంబ్ వైర్లను కట్ చేసి నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చాడు. బాంబ్ తానే తయారు చేశానని చెప్పడానికి భయపడి కాలేజీ వద్ద దొరికిందని అబద్దం చెప్పాడు. విచారణ చేస్తే ఒప్పుకున్నాడు. అతడిపై మహారాష్ట్ర పోలీస్ చట్టం సెక్షన్ 123 కింద కేసు నమోదు చేశాం’’ అని పేర్కొన్నారు. చదవండి: 38 భార్యల ముద్దుల భర్త ఇక లేరు -
షూటింగ్లో నిజంగా పేలిన బాంబు.. హీరోకు గాయాలు
అప్పట్లో సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు అధికంగా డూప్లనే వినియోగించేవారు. ఫేమ్ను దృష్టిలో పెట్టుకొని హీరోలు కష్టపడకుండా డూప్లతనే పని కానిచ్చేవారు. కానీ ఈమద్య ట్రెండ్ మారడంతో అన్ని సన్నివేశాలు డూప్లు లేకుండా సొంతంగా సాహసం చేస్తున్నారు. రియాల్టీ కోసం యాక్షన్ సన్నివేశాలను కూడా అవలీలగా చేసేస్తున్నారు. అయితే ఇలాంటి రిస్క్ తీసుకునే ముందు తప్పగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం బాధ్యతారహితంగా ఉన్నా పెద్ద ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే కన్నడ సినీ పరిశ్రమలో చోటుచేసుకుంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి కూడా ఇలాగే షూటింగ్లో గాయ పడగా.. ఈ విషయం కాస్త ఆలస్యగా వెలుగులోకి వచ్చింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ‘హీరో’. గణవి లక్ష్మణ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ విడుదలవ్వగా.. ఆడియోన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ చిత్రం మార్చి 5న థియేటర్లలో విడుదల కానుంది. అయితే హాసన్ జిల్లాలోని బేలుర్లో షూటింగ్ చేస్తున్న క్రమంలో ఓ యాక్షన్ సన్నివేశంలో భాగంగా రిషబ్, గణవిపైకి పెట్రోల్ బాంబ్ను విసరాల్సి ఉంటుంది. ఈ సమయంలో వీరు పక్కకు దూరంగా వెళ్లాలి. కానీ వీరిద్దరు కాస్త ఆలస్యంగా మూవ్ కావడంతో అప్పటికే బాంబు పేలి మంటల చెలరేగడంతో రిషబ్కు స్పల్ప గాయాలయ్యాయి. దీంతో షూటింగ్ను నిలిపివేసి హీరోను ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కన్నడ పరిశ్రమలో రిషబ్ శెట్టికి బాగానే ఫాలోయింగ్ ఉంది. తుగ్లక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రిషబ్ బెల్ బటమ్ చిత్రంలో మంచి గుర్తింపు సాధించారు. అప్పటి నుంచి వరుస సినిమా అవకాశాలు తలుపు తట్టడంతో బిజీగా మారాడు. చదవండి: వకీల్సాబ్ అప్డేట్.. రెండో పాటకు రేపే ముహూర్తం! తెలంగాణ యాసలో అలరించనున్న ‘బేబమ్మ’ -
ట్రంప్ దూకుడు.. 3 వేల బాంబుల అమ్మకానికి ఓకే
వాషింగ్టన్: అధ్యక్ష పీఠం నుంచి వైదొలగడానికి మరి కొద్ది రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాకు 290 మిలియన్ డాలర్ల(21,25,29,40,000 రూపాయలు) విలువ చేసే 3 వేల స్మార్ట్ బాంబుల అమ్మకానికి ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ మంగళవారం ఓ నోటీసును విడుదల చేసింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ నోటీసు ప్రకారం సౌదీ అరేబియాకు 3 వేల బోయింగ్ నిర్మిత జీబీయూ -39 స్మాల్ డయామీటర్ బాంబ్ ఐ (ఎస్డీబీ ఐ) ఆయుధాలు, సంబంధిత పరికరాలను విక్రయించడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ నిర్ణయం ట్రంప్ పదవీకాలం చివరి రోజుల్లో వస్తుంది. అయితే ప్రపంచంలోని అత్యంత భయంకరమైన మానవతా సంక్షోభానికి కారణమైన యెమెన్లో యుద్ధాన్ని ముగించాలని రియాద్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా సౌదీ అరేబియాకు ఆయుధాల అమ్మకాలను నిలిపివేస్తామని నూతన అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల్లో హామీ ఇవ్వడం గమనార్హం. ఇక మిడిల్ ఈస్ట్లో అమెరికన్ ఆయుధాలను భారీగా కొనుగోలు చేసేది సౌదీ అరేబియానే. (చదవండి: కరోనా ప్యాకేజీపై ట్రంప్ సంతకం) "డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ రోజు అమ్మకం గురించి కాంగ్రెస్కు తెలియజేస్తూ అవసరమైన ధృవీకరణ పత్రాన్ని ఇచ్చింది" అని అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కంటైనర్లు, సహాయక పరికరాలు, సేవలు, విడి, మరమ్మతు భాగాలతో కూడిన జీబీయూ -39 ఎస్డీబీ ఐ మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేయాలని సౌదీ అరేబియా కోరినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ప్రతిపాదిత అమ్మకం "మధ్యప్రాచ్యంలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక వృద్ధికి ముఖ్యమైన శక్తిగా కొనసాగుతున్న స్నేహపూర్వక దేశం భద్రతను" మెరుగుపరచడానికి సహాయపడుతుందని విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. -
వీడిన రేణుగుంట పేలుడు మిస్టరీ
సాక్షి, రేణిగుంట (చిత్తూరు జిల్లా): రేణిగుంట–కోడూరు రైల్వే మార్గంలో రైలు పట్టాలపై రసాయన వ్యర్థాల వల్ల పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలివీ.. రేణిగుంట తారకరామానగర్కు చెందిన శశికళ (35) మంగళవారం గ్రామ శివారులో ఆవులను మేపుతోంది. ఆవులు రైలు పట్టాలపైకి వెళ్లడంతో వాటిని పక్కకు తోలేందుకు పట్టాలపైకి వెళ్లింది. రైలు పట్టాలపై ఓ బాక్స్ ఆమెకు అనుమానాస్పదంగా కనిపించడంతో చేతిలో ఉన్న గొడుగు సాయంతో బాక్స్ను కదిపింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో బాక్స్ పేలింది. దీంతో ఆమె చేతులు, కాళ్లు, ముఖానికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో ఆమెను తిరుపతి రుయాకు తరలించారు. రైలు పట్టాలపై ఆ బాక్స్ ఉన్న సమయంలో రైళ్ల రాకపోకలు జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బాంబ్ స్క్వాడ్ నిపుణులు అక్కడకు చేరుకుని పేలుడు అవశేషాలను సేకరించారు. రసాయన వ్యర్థాల వల్లే పేలుడు రసాయన వ్యర్థాలతో కూడిన డబ్బాను నిర్లక్ష్యంగా రైలు పట్టాలపై పడేయడం వల్లే ఈ పేలుడు ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్రెడ్డి తెలిపారు. ఇనుప కడ్డీలను వేడి చేసేందుకు ఉపయోగించే మిథైల్ ఇథైల్ కీటో పెరాక్సైడ్ అనే రా మెటీరియల్తో కూడిన డబ్బాను స్థానికంగా ఉన్న బాలాజి వెల్డింగ్ షాపు నుంచి తెచ్చి ఇక్కడ పడేసినట్లు విచారణలో గుర్తించామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన షాపు యాజమాన్యంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. (చదవండి: స్నానం చేస్తుంటే వీడియో తీసి.. ఆపై) -
బాంబులతో లేపేస్తా.! ఎవడురా అడ్డుకునేది..
లంగర్హౌస్: పోలీస్స్టేషన్తో పాటు ఒక్కో పోలీసు కింద బాంబు పెట్టి పేల్చి లేపేస్తా... ఎవడురా నన్ను అడ్డుకునేది.... ఎస్పీ, డీఎప్పీ ఎవడు వస్తాడో రమ్మను ఇక్కడే ఉంటా అందరిని చంపేస్తా.. అంటూ ఓ వ్యక్తి పోలీసులకు నేరుగా వార్నింగ్ ఇచ్చాడు. ఈ సంఘటన లంగర్హౌస్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... హిమయత్సాగర్ గ్రామంలో నివాసముండే లోకేష్(40) గతంలో రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు గురువారం ఉదయం తన ద్విచక్రవాహనంపై నగరానికి వస్తుండగా లంగర్హౌస్ పోలీస్స్టేషన్ పరిధిలోని టిప్పుఖాన్ బ్రిడ్జి చెక్పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇటు ఎందుకు వెళుతున్నావని పోలీసులు అడగగా తన ఇష్టం తనకు పనులు ఉన్నాయన్నాడు. అయితే ఈ భయంకర వాతావరణంలో హెల్మెట్ లేదు కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేవు అని పోలీసులు అడిగారు. దీంతో రెచ్చిపోయిన లోకేష్ లాక్డౌన్ అంటూ అందరిని పోలీసులు వేదిస్తున్నారు ఏందిరా మిమ్మల్ని బాంబులతో చంపుతా అంటు రెచ్చిపోయాడు. మీరు కూడా ఎందుకు పెట్టుకున్నారురా మాస్కులు అంటు పోలీసుల నుంచి మాస్కులు లాగి వారిపై దాడి చేశాడు. వార్నింగ్లు ఇస్తూ.. దుర్భాషలాడుతూ.. ఆ ప్రాంతంలో హల్చల్ సృష్టించాడు. అలా అన్నొద్దని అతడిని సముదాయించిన వారిని సైతం తిడుతూ దాడికి దిగాడు.(సరుకు రవాణా వాహనాలకు పాస్లు అవసరం లేదు) పోలీసుల తీరుపై విమర్శలు, ప్రశంసలు.... కొన్ని సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో బయటకి వచ్చిన వారిపై సైతం పోలీసులు లాఠీలు జులిపించారు. కాని నడి రోడ్డుపై లోకేష్ హంగామా చేస్తుంటే పోలీసులు ఏమనకుండా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు వారి సహనానికి సలాం అంటూ ప్రశంసించారు. లోకేష్ భార్య కొద్ది నెలల క్రితం చనిపోయింది. అప్పటి నుంచి మానసిక పరిస్థితి బాగలేదని గతంలో ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొంది ఫిబ్రవరి నెలలో డిశ్చార్జ్ అయ్యాడని తెలుసుకుని పోలీసులు అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మానసిక రోగిని ఆస్పత్రికి పంపకుండా ఇంటికి పంపడంలో ఆంతర్యమేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.(సొంతూరికి దారేది?) -
ఆదిత్యరావు బ్యాగులో సెనైడ్ లభ్యం
సాక్షి బెంగళూరు: మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పెట్టిన ఆదిత్యరావుకు సంబంధించి పోలీసులు తనిఖీ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఆదిత్యరావు బ్యాగులో సెనైడ్ లభ్యం కావడం, అంతేకాకుండా కర్ణాటక బ్యాంకులో ఓ లాకర్ బాంబు తయారీ వస్తువులన్నీ భద్రపరిచినట్లు తెలిపాడు. ఈక్రమంలో ఉడుపిలోని కర్ణాటక బ్యాంకుకు తీసుకెళ్లారు. తనిఖీ చేయగా బ్యాగులో తెల్లటి రంగులో ఉన్న పొడిని సెనైడ్గా పోలీసులు భావించారు. (‘అందుకే ఎయిర్పోర్టులో బాంబు పెట్టాను’) మంగళూరు విమానాశ్రయంలో బాంబు పెట్టే సమయంలో ఎవరైనా అడ్డు వస్తే సెనైడ్ టచ్ చేసి వెళ్లేందుకు సిద్ధమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గత ఆరు నెలలుగా సెనైడ్ను బ్యాంకు లాకర్లో ఉంచినట్లు ఆదిత్యరావు తెలిపాడు. అదేవిధంగా మంగళూరులో బాంబు పెట్టిన రోజున అతడు ఉడుపిలోని వడాభండేశ్వర ఆలయానికి వెళ్లాడు. ఈక్రమంలో తనిఖీల్లో భాగంగా నిన్న ఆదిత్యరావును ఉడుపి తీసుకెళ్లారు. ఆలయం నుంచి జిమ్ మాస్టర్కు తన సిమ్ నుంచి కాల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఎంత ప్రయత్నించినా నిందితుడు ఉపయోగించిన సిమ్ లభ్యం కాలేదు. (మంగళూరు ఎయిర్పోర్టులో బాంబు) -
మంగళూరు ఎయిర్పోర్టులో బాంబు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు దొరకడం కలకలం రేపింది. టికెట్ కౌంటర్ వద్ద సోమవారం ఉదయం 10 గంటల సమయంలో అనుమానాస్పద బ్యాగ్ను కొనుగొన్న విమానాశ్రయ పోలీసులు, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న నగర పోలీసు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఆ బ్యాగులో పేలుడు పదార్థం ఉన్నట్టుగా అనుమానించారు. దీంతో ఆ బ్యాగ్ను బాంబు తరలింపు వాహనం ద్వారా కిలోమీటరు దూరంలో ఉన్న ఖాళీ స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ కట్టుదిట్టమెన భద్రతతో సాయంత్రం 5.30 గంటలకు పేల్చారు. బ్యాగ్లోని మెటల్ కాయిన్ బాక్స్లో పేలుడు పదార్థం, లోహపు ముక్కలు నింపారని సమాచారం. సీసీ కెమెరాల్లో నిందితుడు.. సీసీ కెమెరా చిత్రాల ఆధారంతో అధికారులు నిందితుడి ఫొటోలు విడుదల చేశారు. నిందితుడు ఆటోలో రావడం, బ్యాగ్ ఉంచడం తదితర దృశ్యాలు విమానాశ్రయం కెమెరాల్లో రికార్డ య్యాయి. నిందితుడు మధ్యవయస్కుడు, విద్యావంతునిలా కనిపిస్తున్నాడు. బ్యాగ్ను కౌంటర్ వద్ద ఉంచి, ముఖాన్ని దాచుకుంటూ ఆటోలో వెళ్లిపోయాడు. దీని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని సీఐఎస్ఎఫ్ తెలిపింది. బాంబు విమానాశ్రయంలో పేలి ఉంటే మొత్తం బూడిదై పోయేదని మంగళూరు ఎస్పీ పీఎస్ హర్ష తెలిపారు. చుట్టూ 500 మీటర్ల మేర పేలుడు ప్రభావం ఉండేదన్నారు. మంగళూరు విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు బయల్దేరిన ఇండిగో విమానంలో బాంబు ఉందనే వదంతి వ్యాపించింది. దీంతో అధికారులు విమానాన్ని వెనక్కి రప్పించి తనిఖీలు చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. ఈ సంఘటనలతో మంగళూరులో భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల మంగళూరులో ఎన్నార్సీకి వ్యతిరేకంగా భారీగా అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. -
నాటుబాంబును కొరికిన ఎద్దు
చిత్తూరు,పలమనేరు: మండలంలోని కృష్ణాపురం కౌం డిన్య అటవీ ప్రాంతానికి మేతకోసం వెళ్లిన ఎద్దు వేటగాళ్లు వన్యప్రాణుల కోసం అమర్చిన నాటుబాంబును కొరికింది. దీంతో ఎ ద్దు దవడలు పూర్తిగా పేలిపోయి చర్మం వేలాడుతోంది. దీన్ని గమనించిన కాపరి ఎద్దును గ్రామానికి తోలుకొచ్చాడు. వేటగాళ్లు ఈ ప్రాంతంలో దుప్పుల కోసం అమర్చిన ఉంటను తినడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతు వాపోయాడు. మైలేరు పండుగల్లో పలు బహుమతులు గెలిచిన ఎద్దు విలువ లక్షకు పైగా ఉంటుందని తెలిపాడు. -
మన్యంలో కలకలం
సాక్షి, విశాఖపట్నం: మన్యంలో మరోసారి కలకలం రేగింది. మావోయిస్టులు తలపెట్టిన ముప్పును పోలీసు బలగాలు పసిగట్టి నిర్వీర్యం చేశాయి. రిమోట్ ల్యాండ్మైన్లను గుర్తించడంతో ఆదివాసీలతోపాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా పోలీసులు జి.మాడుగుల మండలం మారుమూల నుర్మతి అవుట్పోస్టు సమీపంలో నాలుగు అత్యంత శక్తిమంతమైన మందుపాతరలను (ల్యాండ్మైన్లు) గురువారం పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ పర్యవేక్షణలో వాటిని బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. అవుట్పోస్టు పరిసరాల్లో సుమారు రూ.50కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరో వైపు సివిక్ యాక్షన్లో భగంగా గ్రామదర్శిని పేరిట చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసులు గిరిజనులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అవుట్పోస్టు సమీపంలో సుమారు 300 మంది ఉంటున్న గిరిజన ఆశ్రమ -
నిజామాబాద్ జిల్లాలో రెచ్చిపోతున్న వేటగాళ్లు
-
భారీ పేలుడుతో దద్దరిల్లిన పారిస్
-
‘వారి మీద బాంబులేయ్యాలి’
లక్నో : మనిషి ప్రాణం కంటే ఆవు చావుకే ఎక్కువ ప్రాధాన్యతిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో నేలకొన్న పరిస్థితులను చూస్తే ఇక్కడ ఉండాలంటేనే భయంగా ఉందంటూ నటుడు నసీరుద్దిన్ షా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం సురక్షితం కాదనే వారి మీద బాంబులు వెయ్యాంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముజఫర్ నగర్ జిల్లా ఖతౌళి నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కొంత మంది దేశ ప్రతిష్టను దిగజార్చే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ దేశం వారికి సురక్షితం కాదని భావిస్తున్నారు. నాకే గనక ఓ మంత్రి పదవి ఉంటే ఇలాంటి వారందరి మీద బాంబులు వేసేవాడిని. ఒక్కరిని కూడా వదలే వాడిని కాదు. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’ అంటూ తెలిపారు. విక్రమ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. -
మావోయిస్టుల స్కెచ్ : త్రుటిలో తప్పిన ప్రమాదం
మల్కన్గిరి: డీఆర్జీ జవాన్లు త్రుటిలో ప్రమాదం తప్పించుకున్నారు. మావోయిస్టుల వల నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. మందుపాతర పేలకుండానిర్వీర్యం చేయగలిగారు. మల్కన్గిరి జిల్లా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో దోర్నిపాల్ సమితి గోరుగొండ గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. డీఆర్జీ జవాన్లు ఆదివారం ఉదయం ఈ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ విషయం ముందుగా తెలుసుకున్న మావోయిస్టులు గోరుగొండ గ్రామం పరిసరాల్లో రోడ్డుపై సుమారు 5 కేజీల ఐఈడీ బాంబును అమర్చారు. అయితే అదే దారిలో కూంబింగ్కు వెళుతున్న జవాన్లు దీనిని ముందుగా గుర్తించి చాకచక్యంగా తప్పించుకుని మందుపాతరను నిర్వీర్యం చేసి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ ప్రాంతంలో జవాన్లు కూంబింగ్ను ముమ్మరం చేశారని ఎస్పీ సందీప్కుమార్ తెలిపారు. -
70 ఏళ్ల తర్వాత బయటడింది..
ఫ్రాంక్ఫర్ట్ : రెండు ప్రపంచ యుద్ధాలు మానవ జాతిని అతలాకుతలం చేశాయి. మరీ ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం సృష్టించిన బీభత్సాన్ని ప్రపంచం నేటికి మర్చిపోలేదు. అందుకు ప్రధాన కారణం ఈ యుద్ధంలో వాడిన బాంబులే. ఇప్పుడున్నంత టెక్నాలజీ లేని కాలంలోనే ఆనాడు తయారు చేసిన బాంబులు తీవ్ర మారణహోమాన్ని సృష్టించాయి. అంతటి విపత్తు సృష్టించిన నాటి బాంబు ఒకటి బయటపడటంతో జనాలు మరోసారి భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన జర్మనిలో చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనుల చేపడుతున్న సమయంలో ఇది బయటపడింది. విషయం తెలుసుకున్న అధికారులు లుడ్విగ్షాఫెన్ నగరంలోని 18500 మంది ప్రజలను ఖాళీ చేయించారు. అనంతరం బాంబు డిస్పోజల్ టీమ్ దానిని సురక్షితంగా నిర్వీర్యం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో జర్మనీపై అమెరికా దళాలు వేసిన బాంబు ఇది. దీని బరువు సుమారు 500 కిలోలు. బాంబు నిర్వర్యం చేసే క్రమంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా కిలోమీటరు మేర పరిసర ప్రాంతాల్లోని ప్రజలను మరోచోటికి తరలించామని అధికారులు తెలిపారు. అంతేకాక కేవలం గంట సేపట్లోనే ఈ బాంబును నిర్వీర్యం చేశామన్నారు. అనంతరం అధికారులు బాంబును నిర్వీర్యం చేశామని, నగరంలోని ప్రజలంతా మళ్లీ వాళ్ల ఇళ్లకు రావచ్చని ఓ అధికారి ట్వీట్ చేశారు. అంతేకాక ఆ బాంబు తాలూకు ఫొటోను కూడా పోస్ట్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ఇప్పటికి 70 ఏళ్లు గడిచిన తర్వాత కూడా జర్మనీలో ఇలాంటి పేలని బాంబులు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. గతేడాది కూడా ఫ్రాంక్ఫర్ట్లో 1.8 టన్నుల బరువున్న బ్రిటన్ బాంబు బయటపడింది. ఆ సమయంలో నగరంలోని 60 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఏడాది ఏప్రిల్లో బెర్లిన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా మరో బ్రిటిష్ బాంబు కనిపించింది. -
అమెరికా ఎంబసీ వద్ద బాంబు పేలుడు
-
అమెరికా ఎంబసీ వద్ద పేలుడు
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద గురువారం బాంబు పేలుడు సంభవించింది. ఎంబసీ సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకునిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు పాల్పడింది చైనాలోని టోంగ్లియో ప్రాంతానికి చెందిన 26ఏళ్ల జియాంగ్గా గుర్తించారు. జియాంగ్ అమెరికా రాయబార కార్యాలయం ఎదుట బాంబు దాడికి యత్నించగా, బాంబు తీవ్రత తక్కువగా ఉండటంతో నిందితుడు మినహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చైనా పోలీసులు తెలిపారు. నిందితుడి పూర్తి వివరాలను దాడికి గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే భారత ఎంబసీ కూడా ఉంది. పేలుడు అనంతరం ఎంబసీ సమీపంలో దట్టమైన పొగ అలుముకున్న ఫోటోలు సామాజికమాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పేలుడు జరిగిన కొద్ది సమయంలోనే ఎంబసీ కార్యకలాపాలను పునరుద్దరించారు. -
టీవీ బాంబు కలకలం
మల్కన్గిరి: ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా మత్తిలి సమితి ఉదిరిబెడ గ్రామం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మావోయిస్టులు టీవీలో పెట్టిన బాంబును బీఎస్ఎఫ్ జవాన్లు పేల్చివేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. మల్కన్గిరి జిల్లా మత్తిలి సమితి ఉదిరిబెడ గ్రామం సమీపంలో ఓ చెట్టు వద్ద మావోయిస్టులు టీవీలో బాంబు పెట్టి ఉంచారు. మల్కన్గిరి–జయపురం రోడ్డు పక్కన దీనిని పెట్టారు. ఈ ప్రాంతం బీఎస్ఎఫ్ క్యాంప్నకు సుమారు 200 మీటర్ల దూరం ఉంటుంది. అయితే చెట్టు వద్ద టీవీ ఉండడం గమనించిన స్థానికులు బీఎస్ఎఫ్ జవాన్లకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. టీవీలో బాంబు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే బాంబు స్క్వాడ్ తీసుకొచ్చి మరో బాంబుతో టీవీలో ఉన్న బాంబును పేల్చివేశారు. ఈ సంఘటన నేపథ్యంలో మల్కన్గిరి–జయపురం రహదారిలో సుమారు మూడు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో సుమారు కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరాయి. ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ఘటనపై మల్కన్గిరి ఎస్పీ జోగ్మోహన్ మిన్నా మాట్లాడుతూ బీఎస్ఎఫ్ క్యాంప్నకు సుమారు 200 మీటర్ల దూరం టీవీ ఉండడంతో అందులో బాంబు ఉందేమోనని అనుమానం వచ్చిందన్నారు. దీంతో బాంబు స్క్వాడ్ తీసుకొచ్చి టీవీని పరిశీలించి అందులో బాంబును పేల్చివేశామన్నారు. -
భయపెట్టిన ‘బాంబే’...
బ్రిస్బేన్ : చిన్నపాటి అక్షర దోషాలే ఒక్కోసారి తీవ్ర పరిణామలకు కారణమవుతాయి. సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి ఆస్ట్రేలియా బ్రిస్బేన్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రయాణికుల సామన్లలో ఒక బ్యాగు మీద ‘బాంబ్ టు బ్రిస్బేన్’ అని రాసి ఉంది. ఇది గమనించిన ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ ఆ బ్యాగ్లో ప్రమాదకరమైనదేదో ఉందని భావించి వెంటనే అందరిని అప్రమత్తం చేశాడు. బ్యాగ్ను తనిఖీ చేయవలసిందిగా భద్రతా సిబ్బందిని ఆదేశించాడు. ఇంతలో ఓ నడివయస్సు మహిళా ప్రయాణికురాలు ఆ బ్యాగ్ తనదేనంటూ పోలీసుల వద్దకు వచ్చింది. పోలీసులు ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లి విచారించారు. ముంబాయి నుంచి బ్రిస్బేన్ వెళ్తున్న ఆ ప్రయాణికురాలి పేరు వెంకటలక్ష్మి(65). పోలీసులు ఆమెను బ్యాగు తెరిచి చూపించాల్సిందిగా ఆదేశించారు. బ్యాగులో ప్రమాదకరమైనవి ఏమి లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. మరి బ్యాగ్ మీద ఎందుకు ‘బాంబ్’ అని రాసి ఉంది అని అడగ్గా తాను ‘బాంబే’ అని రాయాలనుకున్నాను, కానీ స్థలం లేకపోవడంతో ‘వై’ ని రాయకుండా వదిలేసాను. దాంతో ‘బాంబే’ కాస్తా ‘బాంబ్’ గా మారిందని వివరించింది. వెంకటలక్ష్మి తన పుట్టిన రోజును జరుపుకోవడానికి బ్రిస్బేన్లో ఉన్న తన కూతురు దగ్గరికి వెళ్తుంది. బ్యాగును మరిచిపోతానేమో అని దానిపై ‘బాంబే టు బ్రిస్బేన్’ అని రాయాలనుకుంది. కానీ స్థలం సరిపోక ‘బాంబ్ టు బ్రిస్బేన్’ అని రాసింది. ఒక్క అక్షరాన్ని రాయకపోవడంతో ఇంత గందరగోళం జరిగింది. విషయం తెలిసిన తర్వాత ప్రయాణికులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. -
చెన్నై విమానాశ్రయంలో హైఅలర్ట్
సాక్షి, చెన్నై : సోమవారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో బాంబు పెట్టామని దుండగుల నుంచి ఫోన్కాల్ వచ్చింది. దీంతో బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు చేపట్టింది. విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించినట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి. -
ఇరికించబోయి.. ఇరుక్కున్నారు
జమ్మలమడుగు/పెద్దముడియం : అప్పు చెల్లించలేక.. బాంబుల కేసులో ఇరికించాలనుకున్నారు.. ఇందుకోసం బాంబులు తయారు చేశారు.. అతని ఇంటి వెనుక పెట్టాలనుకున్నారు.. ఇందుకోసం వాటిని తీసుకొస్తుండగానే పోలీసులకు చిక్కిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ కె.కృష్ణన్ శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పెద్దముడియం మండలం కొండసుంకేసుల గ్రామస్తుడు రాంగోపాల్రెడ్డి.. అదే గ్రామానికి చెందిన విజయభాస్కర్రెడ్డి వద్ద రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. డబ్బును పదే పదే అడుగుతుండటంతో ఎలాగైనా విజయభాస్కర్రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి ఇబ్బందికి గురి చేయాలని రాంగోపాల్రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఇదే గ్రామానికి చెందిన బెల్టుషాపు నిర్వాహకుడు బాల చెన్నయ్యతో కలిసి ప్రణాళిక రూపొందించాడు. బాంబుల కేసు పెడితే బాగుంటుందని ఆలోచించారు. పక్కనే ఉన్న కోవెలకుంట్లకు వెళ్లి గంధకం, ఇనుపచువ్వలు, దారాలు తెచ్చుకుని రెండు బాంబులు తయారు చేశారు. వాటిని విజయభాస్కర్రెడ్డి ఇంటి వెనుక పెట్టాలని అనుకున్నారు. ఇందుకోసం వారు గ్రామానికి తీసుకొస్తున్నారు. మార్గంమధ్యలోని కొండసుంకేసుల, కల్వటాల గ్రామాలకు వెళ్లే రహదారిపై బ్యాగు పట్టుకుని ఉన్నారు. అదే సమయంలో పెద్దముడియం ఎస్ఐ హరిప్రసాద్, తన సిబ్బందితో కలసి అదే రోడ్డుపై వెళుతున్నారు. వారు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీశారు. బ్యాగులో బాంబులు ఉన్నట్లు గుర్తిం చారు. వారిని అరెస్ట్ చేసి, విచారణ చేపట్టడంతో విషయం వెలుగు చూసింది. వారిపై కేసు నమోదు చేసి, శుక్రవారం రిమాండ్కు తరలించారు. తప్పుడు ఫిర్యాదు చేస్తే చర్యలు ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చి ఇతరులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కె.కృష్ణన్ హెచ్చరించారు. ఫ్యాక్షన్, బాంబుల సంస్కృతికి దూరంగా ఉండాలని రూరల్ సీఐ ఉమామహేశ్వరరెడ్డి తెలిపారు. సమావేశంలో అర్బన్ సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐ సునీల్కుమార్రెడ్డి, రాఘవేంద్రారెడ్డి, హరిప్రసాద్ తదితరులు ఉన్నారు. -
భారీ బాంబు.. పేలి ఉంటే 4000 మంది ఏమయ్యేవారో..
-
భారీ బాంబు.. పేలి ఉంటే 4000 మంది ఏమయ్యేవారో..
హాంకాంగ్ : యుద్ధాలు వచ్చాయి.. పోయాయి.. కానీ బాంబులు మాత్రం అలాగే ఉన్నాయి. ఏళ్ల తర్వాత బయటపడుతూ బెంబేలెత్తిస్తున్నాయి. హాంకాంగ్లో ఓ భారీ బాంబు బయటపడింది. వెయ్యి పౌండ్ల బరువు ఉన్న రెండో ప్రపంచ యుద్ధకాలానికి చెందిన ఓ బాంబును హాంకాంగ్లో రద్దీగా ఉండే వాణిజ్య సముదాయాల వీధిలో గుర్తించారు. పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి దానిని పేలకుండా బయటకు తీశారు. అనంతరం నిర్వీర్యం చేశారు. దీనిపై హాంకాంగ్ పోలీసులు వివరాలు చెబుతూ గడిచిన వారంలోనే ఇది రెండో బాంబు అని చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో పలు ప్రాంతాల్లో భూమిలోపల బాంబులు పేలకుండా పడిపోయి ఉన్న విషయం తెలిసిందే. ఏదైనా నిర్మాణం చేయాలనుకున్నప్పుడు జరిపే తవ్వకాల్లో ఇవీ అనూహ్యంగా బయటపడుతున్నాయి. తాజాగా బయటపడిన బాంబు అమెరికా తయారు చేసిన ఏఎన్-ఎం65 బాంబు అని, ప్రస్తుతం అది బయటపడిన చోటు ఒకప్పుడు జపాన్ ఆదీనంలో ఉండేదని అధికారులు చెప్పారు. దాదాపు 4000 మందిని ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలించి రాత్రికి రాత్రి తీవ్రంగా శ్రమించి ఆ బాంబు నిర్వీర్యం చేశారు.