bomb
-
PM Modi : మోదీ విమానానికి బాంబు బెదిరింపు
-
తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు
-
ఢిల్లీలో 23 స్కూళ్లకు బాంబు బెదిరింపు
-
ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. నిందితులు ఎవరంటే?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. గత శుక్రవారం ఢిల్లీలోని పలు స్కూళ్లకి బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ బెదిరింపు మెయిల్స్ చేసింది విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించారు.సాధారణంగా స్కూల్స్, కాలేజీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇందు కోసం విద్యార్థులు రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. కానీ వారిలో కొంత మంది విద్యార్థులు పరీక్షల ముందు రోజు బుక్ తీసి మమ అనిపిస్తుంటారు. సరిగ్గా చదవక.. స్కూల్కో,లేదంటే కాలేజీకి వెళ్లి పరీక్ష రాయాల్సి వస్తుందనే భయంతో ఆరోగ్యం సరిగా లేదని, ఊరెళుతున్నామని ఇలా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంటుంటారు.ఇదిగో ఢిల్లీలోని రోహిణి జిల్లాకు చెందిన స్కూల్ విద్యార్థులు కూడా అంతే. పరీక్ష రాయాల్సి వస్తుందని స్కూల్లో బాంబు తామే పెట్టామని బెదిరించినట్లు ఢిల్లీ స్పెషల్ పోలీసులు గుర్తించారు.తాజాగా రోహిణి జిల్లాలో రెండు స్కూల్స్కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు బెదిరింపు ఈ-మెయిల్స్ విచారణ చేపట్టారు. తమ విచారణలో ‘ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రెండు వేర్వేరు పాఠశాలలకు ఇ-మెయిల్స్ పంపినట్లు తేలింది’అని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులిద్దరూ స్కూల్లో పరీక్ష రాయాల్సి వస్తుందని బెయిరింపు ఇ - మెయిల్స్ పంపినట్లు వెల్లడించారు. విద్యార్థులు కావడంతో, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. #BreakingNews | #DelhiBombThreat : Major update has come in that students were behind the bomb threat that has been sent to 2 schools.@_pallavighosh | @shankar_news18 decodes#delhibombthreat #delhi #schools pic.twitter.com/FGAquLsFzV— News18 (@CNNnews18) December 22, 2024 11 రోజులుగా వందకు పైగా బాంబు బెదిరింపులుఢిల్లీ పోలీసులు గత 11 రోజులుగా 100కి పైగా పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు పంపడంపై దర్యాప్తు చేపట్టారు. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఉపయోగించి ఇ-మెయిల్స్ పంపడంతో నేరస్థులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది.ఢిల్లీలో బాంబు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. ఈ సంవత్సరం మే నుండి, నగరంలోని పాఠశాలలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, విమానయాన సంస్థలను లక్ష్యంగా చేసుకుని 50కి పైగా బాంబు బెదిరింపు ఇ-మెయిల్లు వచ్చాయి. ఈ కేసుల్లో పోలీసులు ఇంకా ఎలాంటి పురోగతి సాధించలేదు. -
బాంబు షెల్టర్లకు గిరాకీ వరల్డ్ వార్-3కి సంకేతమా?
-
సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు
పట్నా: ఇటీవలి కాలంలో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఎక్కువైంది. అయితే ఇప్పుడు రైలులో బాంబు ఉందంటూ ఓ వార్త వచ్చింది. ఈ ఘటన బీహార్లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే బీహార్లోని దర్భంగా నుండి న్యూఢిల్లీకి వెళుతున్న బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలులో బాంబు ఉందంటూ ఢిల్లీ కంట్రోల్ రూమ్కు సమాచారం అందింది. వెంటనే రైల్వే అధికారులు రైలును యూపీలోని గోండా స్టేషన్లో నిలిపివేసి, రైలులో అణువణువుగా తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలను గోండా ఎస్పీ, ఇద్దరు ఏఎస్పీలు ఒక సివిల్ సివిల్ పోలీసులు నిర్వహించారు. ఇదేవిధంగా డాగ్ స్క్వాడ్తో సెర్చ్ ఆపరేషన్ కూడా చేపట్టారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో బాంబు బెదిరింపు కేవలం వదంతేనని తేలింది. రైల్వేశాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలును గొండా స్టేషన్లో శుక్రవారం రాత్రి 7:32 గంటలకు నిలిపివేసి తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి బాంబు లేదని తేలడంతో, రాత్రి 9:45 గంటలకు రైలు ముందుకు కదిలేందుకు అనుమతినిచ్చారు. ప్రస్తుతం పోలీసులు ఈ వదంతు వచ్చిన ఫోన్ నంబర్కు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఇది కూడా చదవండి: రక్షణ శాఖ కార్యదర్శిగా రాజేశ్ కుమార్ సింగ్ -
19 ఏళ్ల క్రితం దీపావళి ఆనందాలను చిదిమేసిన బాంబు పేలుళ్లు
న్యూఢిల్లీ: ఈరోజు (అక్టోబరు 29) దేశ చరిత్రలో ఒక విషాద సంఘటన నమోదైంది. 19 ఏళ్ల క్రితం ఇదేరోజున ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లు దీపావళి ఆనందాన్ని హరింపజేశాయి. అక్టోబర్ సాధారణంగా ఢిల్లీలో పండుగల సీజన్. మొదట రామలీల ప్రదర్శనలు తరువాత దసరా కోలాహలం ఇది ముగిసిన వెంటనే ధన్తేరస్ షాపింగ్, దీపావళి, చివరిగా గోవర్ధన పూజ, భయ్యా దూజ్... ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా పండుగలు వస్తూనే ఉంటాయి. ఈ నేపధ్యంలో మార్కెట్లలో కొనుగోలుదారుల సందడి నెలకొంటుంది.2005 అక్టోబరు 29న ధన్తేరాస్ నాడు ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. రద్దీగా ఉండే మార్కెట్లలో జరిగిన ఈ పేలుళ్లలో 60 మంది మరణించగా, 200 మందికి పైగా జనం గాయపడ్డారు. నాడు ఢిల్లీలోని సరోజినీ నగర్, పహర్గంజ్, కల్కాజీ ప్రాంతాల్లోని మూడు చోట్ల డీటీసీ బస్సుల్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో చాలా మంది అయినవారిని కోల్పోయారు. నేటికీ సరోజినీ నగర్ మార్కెట్లోని దుకాణదారుల నాటి ఘటనను గుర్తుకు తెచ్చుకుని భయపడుతుంటారు.30 ఏళ్లుగా సరోజినీ నగర్ మార్కెట్లో దీపావళి వస్తువులు విక్రయిస్తున్న ఓ దుకాణదారుడు నాటి రోజును గుర్తు చేసుకుంటూ మీడియాతో మాట్లాడారు. నేటికీ నాటి భయానక దృశ్యం కళ్ల ముందు మెదులుతోందని, ఆరోజు ధన్తేరస్ రోజు కావడంతో మార్కెట్ అంతా కొనుగోలుదారులతో నిండివుందన్నారు. పేలుడు సంభవించినప్పుడు తాను ఘటనా స్థలానికి సమీపంలోని తన కొవ్వొత్తుల దుకాణంలో ఉన్నానని, అకస్మాత్తుగా భారీ పేలుగు శబ్ధం వచ్చి, అంతటా చీకటి అలుముకుందన్నారు. తొలుత తాను దుకాణంలో అమర్చిన బల్బు పేలివుంటుందని భావించానని తెలిపారు. అయితే ఆ పేలుడులో తన తలకు బలమైన గాయమైందని, స్పృహలోకి వచ్చేసరికి అక్కడ కుప్పలుగా పడి ఉన్న మృతదేహాలను చూసి భయపడ్డానన్నారు. బాంబు పేలుడు సంభవించిన దుకాణం యజమాని మృతదేహం రెండు భాగాలుగా విడిపోయి కనిపించిందన్నారు. నాటి ఘటనతో పలువురు సజీవదహనమయ్యారని అతను ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
తిరుపతిలో బాంబు బెదిరింపుల టెన్షన్
-
బాంబు బెదిరింపులతో హడల్
సాక్షి, అమరావతి: బాంబు బెదిరింపులతో యావత్ దేశం హడలిపోతోంది. విమానాలు, హోటళ్లు, విద్యాసంస్థలు.. ఇలా ప్రతిచోటా బాంబులు పెట్టినట్టు ఈమెయిల్, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బెదిరింపుల వరద ముంచెత్తుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బెదిరింపు రాగానే పోలీసు బృందాలు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేయడం.. బాంబు లేదని నిర్ధారించడం ప్రహసనంగా మారింది. ప్రధానంగా దక్షిణ భారతంలోని రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని అత్యధికంగా ఈ ఉత్తుత్తి బాంబు బెదిరింపులు వస్తుండటం గమనార్హం. ‘నాన్నా.. పులి కథ’లా మారకూడదన్న ఉద్దేశంతో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. రెండు వారాల్లో 400 బెదిరింపులువిమానాల్లో బాంబులు పెట్టినట్టు బెదిరింపు ఈమెయిల్స్ వస్తుండటంతో పౌర విమానయాన శాఖ బెంబేలెత్తుతోంది. రెండు వారాల్లో ఏకంగా 400 బెదిరింపులు రావడం గమనార్హం. శనివారం ఒక్కరోజే 33 బెదిరింపులు రావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని అంతర్జాతీయ ప్రయాణికులను ఖలీస్థానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల బెదిరించడం కూడా ఈ ఆందోళనను రెట్టింపు చేస్తోంది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తదితర విమానాశ్రయాలకు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఈమెయిల్స్తోపాటు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాంతో టేకాఫ్ తీసుకున్న విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేయిస్తూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. దక్షిణ భారతమే ప్రధాన లక్ష్యంగా..బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న ఆగంతకులు ప్రధానంగా దక్షిణ భారత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. తమిళనాడులోని చెన్నైకు బెదిరింపులు వచ్చాయి. అక్కడి విమానాశ్రయం నుంచి బయలుదేరే విమానాల్లోనూ, ఆ నగరంలోని హోటళ్లలోనూ బాంబులు పెట్టినట్టు బెదిరించారు. బెంగళూరు, హైదరాబాద్ కూడా ఈ బెదిరింపుల బెడద బారిన పడ్డాయి. ఆ రెండు నగరాల్లో విమానాలతోపాటు విద్యాసంస్థల్లో బాంబులు పెట్టినట్టు సోషల్ మీడియా వేదికల ద్వారా బెంబేలెత్తించారు. బెదిరింపుల బెడద ఆంధ్రప్రదేశ్నూ తాకింది. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుపతిని లక్ష్యంగా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.వారం రోజుల్లో తిరుపతిలోని 17 హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తిరుపతి ఇస్కాన్ ఆలయంలోనూ బాంబు పెట్టినట్టు బెదిరించడం గమనార్హం. కాగా.. విజయవాడలోని ఓ స్టార్ హోటల్కు కూడా బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఒకర్ని అరెస్ట్ చేసిన పోలీసులు బెంగళూరు, విజయవాడలోని హోటళ్లలో బాంబులు పెట్టినట్టు బెదిరింపు ఈమెయిల్స్ పంపిన ఓ ఆగంతకుడిని పోలీసులు గుర్తించారు. అస్సాం నుంచి ఆ మెయిల్ వచ్చినట్టు గుర్తించి ఏపీ, కర్ణాటక ఎస్ఐబీ విభాగం అధికారులు ఆ రాష్ట్రంలో సోదాలు నిర్వహించారు. ఈమెయిల్ పంపిన ఆగంతకుడిని గుర్తించి అరెస్ట్ చేసి బెంగళూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. అతను మతిస్థిమితంలేని వ్యక్తి అని పోలీసులు చెబుతున్నారు. విమానాశ్రయాల్లో ‘బీటీసీ’ల మోహరింపుబాంబు బెదిరింపుల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు విభాగం(ఎన్ఐఏ) కార్యాచరణను వేగవంతం చేసింది. దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లోనూ థ్రెట్ అసిస్టెంట్ కమిటీ(బీటీసీ)లను మోహరించింది. బెదిరింపు ఈమెయిల్స్, సోషల్ మీడియా పోస్టులను ఈ విభాగం పరిశీలించి దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఎక్కడి నుంచి మెయిల్స్ వస్తున్నాయో గుర్తించడం, ఎవరు చేస్తున్నారన్నది దర్యాప్తు చేయడం, తదనుగుణంగా కార్యాచరణ చేపట్టేందుకు భద్రతా దళాలకు సహకరించడంలో బీటీసీ బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.మరో విమానానికి బాంబు బెదిరింపువిశాఖ నుంచి ముంబై బయలుదేరిన విమానాన్ని వెనక్కి రప్పించిన అధికారులుతనిఖీల అనంతరం బాంబు లేదని నిర్ధారణసాక్షి, విశాఖపట్నం: వరుస బాంబుబెదిరింపులు విమానయాన సంస్థలతోపాటు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు రోజులుగా వివిధ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ బెదిరింపు కాల్ సోమవారం విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో అలజడి సృష్టించింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఇండిగో విమానంలో బాంబు ఉందని గుర్తుతెలియని వ్యక్తి శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో అక్కడి అధికారులు విశాఖ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చారు.అప్పటికే విశాఖ చేరుకుని.. ముంబై బయలుదేరిన ఆ విమానాన్ని అత్యవసరంగా వెనక్కి రప్పించారు. విమానం ల్యాండ్ అయ్యేసరికే బాంబ్ స్క్వాడ్ను సిద్ధం చేశారు. ప్రయాణికులను దింపి విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసి.. బాంబు లేదని నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విశాఖ నుంచి సుమారు 2 గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.32 గంటలకు విమానం ముంబైకి బయలుదేరి వెళ్లిందని ఎయిర్పోర్టు డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. -
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
-
CRPF స్కూల్లో బాంబు ఉందంటూ కాల్
-
మరోమారు 30 విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు విమానయాన సంస్థల విమానాలకు తరచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి కూడా 30 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం రాత్రి ఇండియన్ ఎయిర్లైన్కు చెందిన 30 దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.ఇండిగో ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన నాలుగు విమానాలకు సోమవారం భద్రతా హెచ్చరికలు అందాయని తెలిపారు. ఈ జాబితాలో 6ఈ 164 (మంగుళూరు నుండి ముంబై), 6ఈ 75 (అహ్మదాబాద్ నుండి జెడ్డా), 6ఈ 67 (హైదరాబాద్ నుండి జెడ్డా), 6ఈ 118 (లక్నో నుండి పూణే) ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయా విమానాల్లోని ప్రయాణికులు సురక్షితంగా అక్కడి నుండి తరలించారు.ఇదేవిధంగా ఎయిర్ ఇండియా విమానాలకు కూడా బెదిరింపులు వచ్చినట్లు ఆ సంస్థ ప్రతినిధి ధృవీకరించారు. నిర్దేశించిన ప్రోటోకాల్ను అనుసరించి, సంబంధిత అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారని, భద్రతా సంస్థల మార్గదర్శకాల ప్రకారం అన్ని భద్రతా విధానాలను అమలు చేశామన్నారు.విస్తారా ప్రతినిధి మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన కొన్ని విమానాలకు సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయని చెప్పారు. వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తమయ్యారని, అన్ని భద్రతా విధానాలను అమలు చేశారన్నారు.గడచిన వారం రోజుల్లో 120కి పైగా భారతీయ విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే బాంబు బెదిరింపులను కేవలం వదంతులుగా తేలికగా తీసుకోలేమని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. కాగా విమానయాన సంస్థలకు వస్తున్న బాంబు బెదిరింపులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చట్టబద్ధమైన చర్యలకు ఉపక్రమిస్తోంది. నేరస్తులను నో-ఫ్లై జాబితాలో ఉంచే యోచనలో ఉందని సమాచారం. ఇది కూడా చదవండి: ఉద్యోగుల తొలగింపు అవాస్తవం: ఫోన్పే -
విమానాలకు బాంబు బెదిరింపులపై దర్యాప్తు చేస్తున్నాం
-
మరో విమానానికి బాంబు బెదిరింపు.. జైపూర్లో అత్యవసర ల్యాండింగ్
జైపూర్: విమానాలకు తరచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం నంబర్ IX-196కు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ విమానం దుబాయ్ నుంచి జైపూర్కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జైపూర్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో మొత్తం 189 మంది ప్రయాణికులున్నారు. ల్యాండింగ్ తర్వాత భద్రతా బలగాలు విమానం మొత్తం గాలించగా, వారికి అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు.ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ‘విస్తారా’ విమానంలో బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన మరువక ముందు తాజా ఉదంతం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా భారతీయ విమానయాన సంస్థలకు చెందిన దాదాపు 40 విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఫేక్ అని దర్యాప్లు తరువాత తేలింది. విమానయాన సంస్థలకు తప్పుడు బాంబు బెదిరింపులు అందకుండా ఉండేందుకు కొత్త టెక్నాలజీని వినియోగించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. Jaipur, Rajasthan | An Air India Express flight IX-196 flying from Dubai to Jaipur, with 189 passengers onboard, received a bomb threat via email. The plane landed at the Jaipur International Airport at 1:20 am. After a thorough check by the security forces, nothing suspicious…— ANI (@ANI) October 19, 2024ఇది కూడా చదవండి: US Elections: ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేవారికే పట్టం -
మణిపూర్లో మళ్లీ హింస.. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు మృతి
ఇంఫాల్: మణిపూర్లో మరోమారు హింస చెలరేగింది. కుకీ-జో కమ్యూనిటీ కోరుతున్న ప్రత్యేక పరిపాలన డిమాండ్ను మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తిరస్కరించడంతో మరోమారు హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో అనుమానిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ దాడి నేపధ్యంలో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిలిటెంట్లు.. కోట్రుక్, పొరుగున ఉన్న కదంగ్బండ్లోని లోయ దిగువ ప్రాంతాలలో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతోపాటు, బాంబు దాడులు చేశారు. కదంగ్బండ్ ప్రాంతంలోని ఒక ఇంటిపై డ్రోన్ నుంచి బాంబు పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, తొమ్మదిమంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పలు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయన్నారు.పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర, కేంద్ర విభాగాలతోపాటు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కొట్రుక్ గ్రామస్తులపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. వారిని భయభ్రాంతులకు గురిచేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మణిపూర్ సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆదేశించారు. -
ఉక్రెయిన్పై రష్యా బాంబుల దాడి.. ఏడుగురి మృతి
ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. రష్యా సైన్యం శుక్రవారం ఉక్రెయిన్లోని ఖర్కీవ్ నగరంలోని అపార్టుమెంట్లు, ఆటస్థలాల్లో వైమానికి దాడులతో విరుచుకుపడింది. రష్యా బాంబుల దాడిలో ఎడుగురు మృతి చెందగా.. సుమారు 77 మందికి గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. బాంబు దాడిలో 12 అంతస్థుల అపార్టుమెంట్లో భారీగా మంటలు చెలరేగాయని ఖర్కీవ్ నగర మేయర్ వెల్లడించారు. అపార్టమెంట్ శిథిలాల నుంచి ఓ మహిళ మృతదేహాన్ని బయటకు తీశామని.. మృత సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో సుమారు 20 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.ఉక్రెయిన్- రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా సైన్యం ఖర్కీవ్ నగరమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇప్పటికే పలుసార్లు ధ్వంసం అయింది. అయితే ఇటీవల కాలంలో ఖర్కీవ్పై రష్యా దాడులు తగ్గినప్పటికీ.. రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోకి ఉక్రేయిన్ సైన్యం చొచ్చుకుపోవటంతో ప్రతీకారంగా బాంబులు వేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
Pakistan: బాంబు పేలి ఇద్దరు చిన్నారులు మృతి
పాకిస్తాన్లో నిత్యం ఏదో ఒక అలజడి చోటుచేసుకున్నదనే వార్లలను వింటుంటాం. తాజాగా పాక్లోని బలూచిస్థాన్ బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. పిషిన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాంబు పేలుడుకు స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు పోలీసులతో సహా 16 మంది గాయపడ్డారు.పిషిన్ జిల్లాలోని సుర్ఖబ్ చౌక్ సమీపంలోని ప్రధాన మార్కెట్లో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఇటీవల బలూచిస్థాన్లోని పోలీసు స్టేషన్లపై దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మూడు పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయి. యాంటీ టెర్రరిజం డిపార్ట్మెంట్, బాంబ్ స్క్వాడ్ విచారణ జరిపి కొన్ని ముఖ్యమైన ఆధారాలను సేకరించింది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని సీలు చేశారు.తాజా ఘటనలో గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన గురించి తెలుసుకున్న పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ దీనిని ఖండించారు. చిన్నారులు, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
Rajasthan: రెండు ఆస్పత్రులకు బాంబు బెదిరింపు కాల్స్.. తనిఖీలు ముమ్మరం
రాజస్థాన్లోని జైపూర్లోగల రెండు ప్రముఖ ఆస్పత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆయా ఆస్పత్రులకు చేరుకున్నారు. బాంబ్ స్క్యాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. రోగులను ఆస్పత్రి నుంచి బయటకు తరలించి, వైద్య సేవలు అందిస్తున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం జైపూర్లోని సీకే బిర్లా, మోనిలెక్ ఆసుపత్రులలో బాంబులు ఉన్నాయనే సమాచారం అందుకోగాగానే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆ ఆస్పత్రులలో పెద్ద సంఖ్యలో రోగులు, వారి బంధువులు ఉన్నారు. దీంతో పోలీసులు రోగులను బయటకు తరలించారు. వైద్యులు బయటనే రోగులకు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్గా మారింది.ఇటీవలి కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పలు ఆసుపత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తనిఖీల అనంతరం అవి ఫేక్ అని తేలుతోంది. అయితే ఇలాంటి వదంతుల వలన సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. जयपुर के सीके बिरला और मोनीलेक हॉस्पिटल में बम की सूचना पर बड़ी संख्या में पहुंची पुलिस. बम स्क्वायड वहां मरीजो को बाहर निकाल कर रहा है जांच @BhajanlalBjp @abplive pic.twitter.com/swl1p0s6Id— Santosh kumar Pandey (@PandeyKumar313) August 18, 2024 -
‘బ్యాగులో బాంబుందా’?: ప్రశ్నించిన ప్రయాణికుడి అరెస్టు
కొచ్చి: కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం(ఆగస్టు11) ఉదయం విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మనోజ్కుమార్(42) అనే ప్రయాణికుడు సెక్యూరిటీ చెక్ వద్ద తన బ్యాగ్ తీసుకుంటూ అందులో బాంబేమైనా ఉందా అని ప్రశ్నించాడు. దీంతో ఎయిర్పోర్టు ఎక్స్రే బ్యాగేజ్ స్కాన్ పాయింట్ వద్ద ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది బాంబు స్క్వాడ్ను రప్పించి తనిఖీలు చేశారు. మనోజ్కుమార్ క్యాబిన్ బ్యాగులతో పాటు చెకిన్ బ్యాగేజీని బాంబు డిటెక్షన్ మెషిన్తో జల్లెడ పట్టారు. తనిఖీల తర్వాత మనోజ్కుమార్ను పోలీసులకు అప్పగించారు. మనోజ్కుమార్ ఎయిర్ఇండియా విమానంలో కొచ్చి నుంచి ముంబై వెళ్లాల్సిఉంది. -
Mumbai: 50 ఆస్పత్రులకు బాంబు బెదిరింపు
మహారాష్ట్రలోని ముంబైలో గల బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ప్రధాన కార్యాలయంతోపాటు నగరంలోని 50 ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు ఈ మెయిల్స్ పంపారు. ఈ నేపధ్యంలో బీఎంసీ అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బీఎంసీ కార్యాలయంతో పాటు బాంబు బెదిరింపులు అందిన అన్ని ఆసుపత్రులలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులకు ఎటువంటి అనుమానాస్పద వస్తువు లభ్యం కాలేదు.వీపీఎన్ నెట్వర్క్ ద్వారా ఈ బెదిరింపు ఈమెయిల్స్ పంపినట్లు ముంబై పోలీసులు ధృవీకరించారు. బెదిరింపులకు పాల్పడిన వారు ఎవరనేది ఇంకా తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు. ముంబైలోని బీఎంసీ ప్రధాన కార్యాలయం, జస్లోక్ హాస్పిటల్, రహేజా హాస్పిటల్, సెవెన్ హిల్స్ హాస్పిటల్, కోహినూర్ హాస్పిటల్, కేఈఎం హాస్పిటల్, జేజే హాస్పిటల్, సెయింట్ జార్జ్ హాస్పిటల్ సహా 50కి పైగా ఆస్పత్రులకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. గతంలో దేశంలోని 41 విమానాశ్రయాలకు కూడా ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. 'కేఎన్ఆర్’ అనే ఆన్లైన్ గ్రూప్ ఈ నకిలీ బెదిరింపు ఈ మెయిల్స్ పంపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ బృందం మే ఒకటిన ఢిల్లీలోని వివిధ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్స్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. -
ప్రగతి భవన్ కు బాంబు బెదిరింపు నిందితుడు అరెస్ట్
-
ప్రజాభవన్లో బాంబు కలకలం
పంజగుట్ట: ‘‘ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో బాంబు పెట్టాం.. మరో కొద్దిసేపట్లో అది పేలబోతుంది..’’ అంటూ ఒక అగంతకుడు పోలీస్ కంట్రోల్రూం డయల్ 100కు ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా ఉరుకులు పరుగులు పెట్టారు. సుమారు నాలుగు గంటలపాటు మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ మొత్తం తనిఖీ చేసి ఎలాంటి బాంబు లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. మంగళవారం మధ్యాహ్నం 12:06 నిమిషాలకు పోలీస్ కంట్రోల్రూం 100కు ఓ అగంతకుడు ఫోన్ చేసి ప్రజాభవన్లోని మల్లు భట్టి విక్రమార్క ఇంటివద్ద బాబు పెట్టామని ఫోన్ చేశాడు. కంట్రోల్రూం సిబ్బంది 12:15కు పంజగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇంటలిజెన్స్ సెక్యురిటీ వింగ్, సిటీ సెక్యురిటీ వింగ్ అధికారులను రంగంలోకి దింపారు. హుటాహుటిన నాలుగు డాగ్ స్క్వాడ్ బృందాలు, 10 బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ బృందాలు రంగంలోకి దిగాయి. పంజగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ నేతృత్వంలో అణువణువూ తనిఖీ చేశారు.ఇకపై అక్కడ భారీ బందోబస్తు..: భట్టి ఇంటితోపాటు మంత్రి సీతక్క ఇంటిని, పరిసర ప్రాంతాలనూ చెక్ చేశారు. తరువాత ప్రజాభవన్ లోపల, పక్కనే ఉన్న మరోభవనం, అమ్మవారి ఆలయం సహా అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సుమారు 4 గంటలకు పైగా తనిఖీలు చేసి ఎక్కడా ఏమీ లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై ప్రజాభవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు.. సందర్శకులను క్షుణంగా పరిశీలించాలని సిబ్బందికి ఆదేశించారు. కాగా, ప్రజాభవన్లో బాంబు ఉందని ఫోన్ చేసిన వ్యక్తి గురించి పోలీసులు గాలిస్తున్నారు. -
ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు
-
కేంద్ర హోం శాఖకు బాంబు బెదిరింపు.. నార్త్ బ్లాక్ హై అలర్ట్
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కొలువు దీరిన నార్త్ బ్లాక్ భవనానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. హోం శాఖకు బుధవారం(మే22) బాంబు బెదిరింపుల మెయిల్ అందినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ వెల్లడించింది. బాంబు బెదిరింపులు వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా రెండు ఫైర్ ఇంజిన్లను నార్త్బ్లాక్ వద్దకు తరలించారు. గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు, ఎయిర్పోర్టులకు ఫేక్ బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. -
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలోని పాండువా ప్రాంతంలో ఈ రోజు (సోమవారం) బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. మీడియా కథనాల ప్రకారం కొంతమంది చిన్నారులు బంతిగా భావించి ఒక బాంబుతో ఆడుతుండగా, అది హఠాత్తుగా పేలింది. గాయపడిన వారిలో ఒకరు కుడి చేయి కోల్పోయినట్లు సమాచారం. కాగా టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇదే ప్రాంతంలో జరిగే ఎన్నికల ర్యాలీలో ప్రసంగించాల్సివుందిఈ పేలుడులో గాయపడిన ఇద్దరు చిన్నారులను రూపమ్ వల్లభ్, సౌరభ్ చౌదరిగా గుర్తించారు. చిన్నారుల వయసు 11 నుంచి 13 ఏళ్ల మధ్య ఉంటుంది. ప్రస్తుతం బాధితులు చుంచుర ఇమాంబర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం 8:30 గంటల సమయంలో తిన్నా ప్రాంతంలోని చెరువు దగ్గర పెద్ద పేలుడు శబ్ధం వినిపించింది. దీంతో సమీపంలోని వారు చెరువు గట్టు వద్దకు పరుగులు తీయగా, ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడిన స్థితిలో వారికి కనిపించారు. ఈ ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, ఒకరు మృతి చెందారు.ఈ ఘటనపై హుగ్లీ రూరల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన భద్రతా లోపంపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని కీలక నేత అభిషేక్ బెనర్జీ సమావేశం జరగాల్సిన స్థలంలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. -
TN: తమిళనాడులో స్కూళ్లకు బాంబు బెదిరింపు
చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూర్, కాంచీపురంలలో సోమవారం( మార్చ్ 4) బాంబు కలకలం రేగింది. రెండు నగరాల్లోని అగ్రశ్రేణి స్కూళ్లకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో స్కూళ్లలోని విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. వీటిలో ఆదివారం రాత్రి ఒక మెయిల్ రాగా సోమవారం ఉదయం మరో బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. బాంబు బెదిరింపు సమాచారం అందుకున్న వెంటనే కోయంబత్తూరులోని పీఎస్బీబీ మిలీనియం స్కూల్కు బాంబు స్క్వాడ్ చేరుకుని తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపులు వచ్చిన రెండు స్కూళ్లలో ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. స్కూళ్ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. కాగా, మార్చ్ 1వ తేదీ బెంగళూరు రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 10 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి.. అశ్లీల వీడియో వైరల్.. పోలీసులకు ఎంపీ ఫిర్యాదు -
ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పిన్ బాంబు లభ్యం
మధ్యప్రదేశ్లోని భింద్లో గల రాష్ట్రీయ స్వయం సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యాలయంలో శనివారం రాత్రి పిన్ బాంబు కనిపించడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ బాంబు చూసేందుకు గ్రెనేడ్ బాంబును పోలివుంది. రాత్రి 12 గంటల సమయంలో వాలంటీర్ రామ్ మోహన్ అందించిన సమాచారం మేరకు ఎస్పీ అసిత్ యాదవ్ తన బృందంతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు బాంబును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయ ఆవరణలో జెండా ఎగురవేసే స్థలంలో వాలంటీర్ రామ్మోహన్ ఈ బాంబును గుర్తించారు. అక్కడున్న పిల్లలు ఆ బాంబును రామ్ మోహన్కు చూపించారు. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించారు. కాగా విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ కుషా, ఎస్పీ అసిత్ యాదవ్, టీఐ కొత్వాలి ప్రవీణ్ చౌహాన్ డాగ్ స్క్వాడ్తో కలిసి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు బాంబును తమ వెంట తీసుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాంబు చాలా ఏళ్ల క్రితం నాటిది. ఈ ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం ఫైరింగ్ రేంజ్ ఏరియా ఉండేది. అప్పట్లో ఈ బాంబు మట్టిలో పడి ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా ఈ విషయంపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. -
జైపూర్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు..
రాజస్థాన్లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై, విమానాశ్రయాన్నంతా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభ్యంకాలేదు. రెండు గంటల తనిఖీ అనంతరం విమానాశ్రయ ప్రాంగణంలో అభ్యంతరకర వస్తువేదీ కనిపించకపోవడంతో భద్రతా సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం జైపూర్ ఎయిర్పోర్ట్ అధికారిక ఐడీకి ‘డాన్ ఆఫ్ ఇండియా’ అనే ఐడీ నుండి శుక్రవారం ఈ-మెయిల్లో బెదిరింపు వచ్చింది. వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బందితో పాటు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్(బీడీఎస్) తనిఖీలు చేపట్టింది. ఈ బెదిరింపు మెయిల్ గురించి ఎయిర్పోర్ట్ ఎస్హెచ్ఓ మమతా మీనా మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని పేల్చివేస్తామని బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులకు ఈ సమాచారం అందించామన్నారు. ఈ నేపధ్యంలో బీడీఎస్, సీఐఎస్ఎఫ్, డాగ్ స్క్వాడ్ బృందం విమానాశ్రయంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. సుమారు 2 గంటల పాటు జరిగిన సెర్చ్ ఆపరేషన్లో ఎయిర్పోర్టులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఇంతకు ముందు డిసెంబర్ 27న జైపూర్ సహా పలు విమానాశ్రయాలపై బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి. అయితే తనిఖీలలో ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. -
సరదా హద్దు దాటితే..పరిస్థితి ఇలా ఉంటుందా?
సరదాగే ఒకళ్లని ఆటిపట్టించేలా చేసే పనులు ఇరువురుకి ఆనందం కలిగించాలి. అవి హద్దు దాటితే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆ పనుల వల్ల ఇరువురిలో ఒక్కరూ హర్ట్ అయ్యి ప్రతిచర్యకు దిగితే పరిణామాలు దారుణంగా ఉంటాయి. అందుకే కాబోలు పెద్దలు ఏదైన సరే శృతి మించకూడదని పదే పదే అంటారు. ఇక్కడ అలానే సరదా అల్లరి కాస్తా శృతి మించింది. ఫలితం ఓ వ్యక్తి తీవ్ర గాయలపాలవ్వడానికి దారితీసింది. అసలేం జరిగిందంటే..ఈ షాకింగ్ ఘటన రష్యాలో చోటు చేసుకుంది. రష్యాలో చెల్యాబిన్స్క్లో ప్రొఫెసర్ బ్లాగిక్ స్ట్రీట్లోని ఓ అపార్ట్మెంట్లో పార్టీ జరగుతుంది. ఆదివారం కావడంతో వారంతపు రోజు ఎంజాయ్ చేయలనుకున్నారు. అందులో భాగంగా కొందరు వ్యక్తులు ఒక అపార్ట్మెంట్లో చేరి అల్లరి చేష్టలతో హుషారుగా ఉన్నారు. అయితే వారి అల్లరి శృతి మించింది. ఏకంగా వంటగదిలో స్మోకింగ్ బాంబ్ పేల్చారు. దీంతో మనస్తాపం చెందిన ఓ అమ్మాయి పట్టరాని కోపంతో దారుణమైన చర్యకు పూనుకుంది. ఏకంగా మరిగిమరిగే నీళ్లను తీసుకొచ్చి పార్టీ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తులపై పోసేందుకు యత్నించింది. అయితే ఆ నీళ్లు కాస్త ఆ ఇంటి యజమానిపైనే నేరుగాపడ్డాయి. అయితే ఆ వ్యక్తి ఏమీ స్మోకింగ్ బాంబ్ ప్రయోగించిన వ్యక్తి కాదు. అతను కూడా అలా చయొద్దన్న వ్యక్తే అని పోలీసుల విచారణలో తెలిసిందే. ఈ హఠాత్పరిణామం గురించి పోలీసులకు సమాచారం అందడంతో పార్టీ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తులపై చర్య తీసుకుని వారికి జరిమాన కూడా విధించారు. ఇలా చేసిన సదుర అమ్మాయిపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడ్డ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, తీవ్ర స్థాయిలో చర్మం బర్న్ అయ్యిందని పోలీసులు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సదరు మహిళపై పలువురు నెటిజన్లు ఫైర్ అవ్వగా, కొందరూ మాత్రం అలా వాళ్లు స్మోకింగ్ బాంబ్ పేల్చాలనుకోవడం కూడా తప్పే అందువల్ల ఆమె అలా ప్రవర్తించిందని మద్దతు పలుకుతూ ట్వీట్ చేశారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: పుట్టుకొస్తున్న ప్లాస్టిక్ శిలలు..ఆందోళనలో శాస్త్రవేత్తలు!) -
అలిపిరిలో బాంబు బ్లాస్ట్ బెదిరింపు ఫోన్ కాల్స్.. వ్యక్తి అరెస్టు..
తిరుమల: అలిపిరి వద్ద బాంబు బ్లాస్ట్ చేస్తానంటూ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితున్ని తమిళనాడు రాష్ట్రం, సేలం జిల్లాకు చేందిన బాలాజీ(39)గా గుర్తించారు. అతన్ని ఈ రోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 15వ తారీఖున అలిపిరి చెక్ పాయింట్ ల్యాండ్ ఫోన్ కి కాల్ చేసాడో వ్యక్తి. మధ్యాహ్నం 3గంటలకు 100 మందిని బాంబ్ బ్లాస్ట్ తో చంపేస్తానని చెప్పడంతో వెంటనే అప్రమత్తం అయ్యారు పోలీసులు. టీటీడీ పోలీసు, విజిలెన్స్ అధికారుల సమన్వయంతో అలిపిరి చెక్ పాయింట్ తనిఖీ చేసారు. అయినప్పటికీ ఎక్కడా ఎటువంటి పేలుడు పదార్ధాలు లభించలేదు. బాంబు పేలుడుకు సంబంధించి ఫోన్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా ఆకతాయి, దుష్ట చేష్టలకి పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తిరుమల డీఎస్పీ భాస్కర్ రెడ్డి అన్నారు. ఇదీ చదవండి: ఏపీ పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుల హవా -
తండ్రి నో చెప్పాడని.. సొంత ఇంటిపై బాంబు వేసి.. అక్కడి నుంచి
చెన్నై: పిల్లలు తల్లిదండ్రులను డబ్బులు అడగడం.. అందుకు వాళ్లు ససేమిరా అనడం సహజమే. ఇక కోపంతో కొందరు పిల్లలు కన్నవాళ్లతో గొడవపడడం లాంటి చేస్తుంటారు. కానీ ఓ పుత్ర రత్నం మాత్రం దారుణంగా ప్రవర్తించాడు. భూమి అమ్మిన డబ్బులు ఇవ్వలేదని సొంత ఇంటిపై బాంబు దాడి చేశాడు. ఈ కేసులో ఇంటి యజమాని కుమారుడితో సహా ఇద్దరిని పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన వేలచ్చేరిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేలచ్చేరిలోని భారతీయార్ వీధిలో నివాసం ఉంటున్న పన్నీర్సెల్వం ఇటీవల తనకున్న కొద్దిపాటి భూమిని విక్రయించాడు. డబ్బులు చేతికి రాగానే ఆ మొత్తంలో రూ.3 లక్షలు ఇవ్వాలని కుమారుడు అరుణ్ తండ్రిని అడిగాడు. అందుకు పన్నీర్ సెల్వం నిరాకరించాడు. దీంతో కోపంతో అరుణ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత తన బావమరిది ప్రవీణ్తో కలిసి బైక్పై వచ్చి తన సొంత ఇంటిపై బాంబు విసిరి పరారయ్యాడు. ఈ పేలుడులో అరుణ్ చిన్నాన్న వెట్రివేందన్, సోదరి రేఖకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఇన్స్పెక్టర్ అశోక్ ఆధ్వర్యంలో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాంబు నిపుణులను రప్పించి విచారణ చేపట్టారు. ఇంటిలో నాటు బాంబు పేలుడు పదార్థాలు దాచి ఉంచగా వాటిని జప్తు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరుణ్, ప్రవీణ్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. చదవండి రోజూ ఒకే టైంలో పవర్ కట్.. అసలు సంగతి తెలిసి గ్రామస్తుల మైండ్ బ్లాక్! -
ఈ బాంబు ఒక్కటి వేస్తే.. 100 బాంబులు వేసినట్టే..
ఏదైనా బాంబును ప్రయోగిస్తే.. అది పడిన ప్రదేశంతోపాటు కొంతదూరం వరకు విధ్వంసం సృష్టిస్తుంది. అక్కడితో దాని పని అయిపోతుంది. అదే క్లస్టర్ బాంబును ప్రయోగిస్తే.. టార్గెట్ చేసిన ప్రదేశంతోపాటు చుట్టుపక్కల కొంత దూరం దాకా విధ్వంసం సృష్టిస్తుంది. అందులోని భాగాలు ఆ తర్వాత కూడా పేలుతూనే.. అక్కడికి వచ్చినవారి ప్రాణాలు తీస్తూనే ఉంటాయి. తాజాగా ఉక్రెయిన్కు అమెరికా క్లస్టర్ బాంబులను ఇవ్వడం, ప్రతిగా తమ వద్ద కూడా క్లస్టర్ బాంబులు ఉన్నాయని రష్యా హెచ్చరించడం నేపథ్యంలో.. క్లస్టర్ బాంబులు ఏమిటి? వాటితో ప్రమాదమేంటి? ఇప్పటివరకు ఎక్కడైనా ప్రయోగించారా? అన్న వివరాలు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ ఒకటి కాదు వందల బాంబులు కలిపి.. సాధారణంగా క్షిపణులు అయినా, ఇతర బాంబులు అయినా వాటిలో పేలిపోయే భాగం (వార్ హెడ్) ఒకటే ఉంటుంది. ఒకే ప్రదేశంలో పెద్ద పేలుడు సంభవిస్తుంది. అదే క్లస్టర్ బాంబులో వందలకొద్దీ చిన్న బాంబులు (బాంబ్లెట్లు) ఉంటాయి. దీనిని ప్రయోగించాక నిర్దేశించిన ప్రాంతానికి చేరుకోగానే విచ్చుకుని.. అందులోని చిన్న బాంబులన్నింటినీ కొంతదూరం వరకు వెదజల్లుతుంది. ఇలా ఎక్కువ విస్తీర్ణంలో పేలుళ్లు జరుగుతాయి. అంత విస్తీర్ణంలో విధ్వంసం జరుగుతుంది. మిలటరీ స్థావరాలు, వాహనాలు, ఆయుధాలు నాశనమవుతాయి. ఆ ప్రాంతంలో ఉండే సైన్యం, సాధారణ ప్రజలకూ ప్రమాదం కలుగుతుంది. అప్పుడే పేలక.. తర్వాత ప్రాణాలు తీస్తూ.. క్లస్టర్ బాంబులు వెదజల్లే బాంబ్లెట్లలో అన్నీ అప్పటికప్పుడే పేలిపోవు. వాటిలో కొన్ని నేలపై చెల్లాచెదురుగా పడిపోతాయి. కొన్నిసార్లు ఏళ్లకేళ్లు కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడైనా సైనికులుగానీ, సాధారణ పౌరులుగానీ వాటిని తాకితే పేలిపోయి ప్రాణాలు తీస్తాయి. అంటే యుద్ధం ముగిసిపోయినా బాంబుల బాధ తప్పని పరిస్థితి. ♦ గతంలో వియత్నాం, లావోస్, ఇరాక్, అష్గానిస్తాన్ తదితర యుద్ధాల్లో అమెరికా ఈ కస్టర్ బాంబులను వినియోగించింది కూడా. వాటిలో పేలిపోకుండా ఉన్న బాంబులు ఇప్పటికీ తరచూ విస్ఫోటం చెందుతూ ప్రజలు ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నాయి. ♦ క్లస్టర్ బాంబులు భారీగా జన హననానికి దారి తీస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వీటి వాడకాన్ని నిషేధిస్తూ ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఆ ఒప్పందంపై అమెరికా, ఉక్రెయిన్, రష్యా సంతకం చేయకపోవడం గమనార్హం. ‘డడ్ రేటు’తో ఎఫెక్ట్ క్లస్టర్ బాంబు ప్రయోగించినప్పుడు పేలకుండా ఉండిపోయే బాంబ్లెట్ల శాతాన్ని ‘డడ్ రేటు’గా పిలుస్తారు. ఈ డడ్ రేటు ఎంత ఎక్కువగా ఉంటే.. భవిష్యత్తులో ప్రజలు వాటి బారినపడే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది. రష్యాకు చెందిన క్లస్టర్ బాంబుల డడ్ రేటు 4శాతం నుంచి 40 శాతం వరకు ఉంటుందని అంచనా. తాజాగా ఉక్రెయిన్కు ఇచ్చిన క్లస్టర్ బాంబుల డడ్ రేటు చాలా తక్కువగా 2.35 శాతమేనని అమెరికా అధికారులు ప్రకటించడం గమనార్హం. క్లస్టర్ బాంబుల ప్రత్యేకతలివీ.. ♦ క్లస్టర్ బాంబు బరువు సాధారణంగా 450 కిలోల నుంచి 500 కిలోల వరకు ఉంటుంది. అందులో ఒక్కోటీ ఏడెనిమిది అంగుళాల పొడవున్న 200 వరకు బాంబ్లెట్లు ఉంటాయి. ♦ క్లస్టర్ బాంబు నిర్దేశిత లక్ష్యానికి చేరువకాగానే.. అతి వేగంగా తిరగడం మొదలవుతుంది. తర్వాత దశలవారీగా బాంబ్లెట్లను విడుదల చేస్తుంది. దీనివల్ల బాంబ్లెట్లు దూరదూరంగా, వేగంగా పడిపోతాయి. ♦ క్లస్టర్ బాంబుల్లోని బాంబ్లెట్లకు కిందివైపు ఫ్యాన్ తరహా ప్రత్యేకమైన రెక్కలు, లేకుంటే చిన్నపాటి ప్యారాచూట్లను అమర్చుతారు. దీనితో అవి ఓ క్రమంలో నేలను తాకి పేలిపోతాయి. ♦ పేలిపోకుండా ఉండిపోయిన బాంబ్లెట్లను గుర్తించి నిర్విర్యం చేయడం కూడా ప్రమాదకరమైన పనే. ఎవరైనా తాకగానే పేలిపోయే అవకాశాలు ఎక్కువ. అందువల్ల బాంబ్ డిస్పోజల్ యూనిట్లు, రోబోలతో వాటిని గుర్తించి, నిర్విర్యం చేయాల్సి ఉంటుంది. 1 మిలటరీ వాహనం నుంచి క్లస్టర్ బాంబు ప్రయోగం 2 నిర్దేశిత లక్ష్యానికి సమీపంలో ఉండగా క్లస్టర్ బాంబు నుంచి బాంబ్లెట్లు విడుదల అవుతాయి. 3 చాలా వరకు బాంబ్లెట్లు నేలను తాకగానే పేలిపోతాయి. 4 కొంత మేర బాంబ్లెట్లు పేలిపోకుండా నేలపై పడి ఉంటాయి. వాటిని ఎవరైనా తాకితే వెంటనే పేలిపోయి విధ్వంసం సృష్టిస్తాయి. -
‘బాంబు.. బాంబు’ విమానంలో యువకుని కేకలు.. తరువాత జరిగిందిదే!
కోల్కతా నుంచి దోహా వెళుతున్న కతర్ ఎయిర్వేస్లో ఆ సమయంలో ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. విమానంలో ఉన్న ఒక యువకుడు ‘బాంబు.. బాంబు’ అంటూ పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. దీంతో క్రూ మెంబర్స్ ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్కు తెలియజేశారు. వెంటనే విమానంలో తనిఖీ చేపట్టారు. అయితే ఆ యవకుని తండ్రి అధికారులతో మాట్లాడుతూ తన కుమారుని మానసిక పరిస్థితి సరిగా లేదని తెలిపారు. వివరాల్లోకి వెళితే కతర్ ఎయిర్వేస్కు చెందిన క్యూఆర్541, విమానం కోల్కతా నుంచి దోహాకు బయలుదేరడంలో ఆలస్యం జరిగింది. ఒక యువకుడు విమానంలో బాంబు ఉందంటూ పెద్దగా కేకలుపెట్టాడు. విమానంలోని క్రూ మెంబర్స్ వెంటనే ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్కు చేరవేశారు. వెంటనే భద్రతా దళాలు పరుగుపరుగున వచ్చి, విమానంలోని ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. వారు ఆ యువకుడిని ప్రశ్నించగా... ఎవరో తనతో విమానంలో బాంబు ఉందని చెప్పారని అన్నాడు. కాగా సీఐఎస్ఎఫ్ బృందం ఎయిర్క్రాఫ్ట్ను స్నిఫర్ డాగ్స్ సాయంతో తనిఖీ చేయించారు. ఇంతలో ఆ యువకుని తండ్రి అధికారులతో మాట్లాడుతూ తన కుమారుని మానసిక పరిస్థితి బాగోలేదని చెబుతూ, అందుకు సంబంధించిన ధృవపత్రాలను కూడా చూపించాడు. ఈ ఘటన కారణంగా విమానం బయలుదేరడంలో ఆలస్యం జరిగింది. బాంబు లేదని నిర్థారించాక ప్రయాణికులను తిరిగి విమానంలోకి అనుమతించారు. కాగా దీనికిముందు గత ఫిబ్రవరిలో హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న విమానంలో బాంబు ఉందంటూ సూచన అందించింది. దీంతో ఆ విమానాన్ని లక్నోలోని చౌదరి చరణ్సింగ్ ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. తరువాత విమానంలో తనిఖీలు జరిపారు. అయితే విమానంలో ఎటువంటి బాంబు లభ్యంకాలేదు. ఈ ఘటనలో బాంబు ఉందంటూ వదంతులు వ్యాపింపజేసిన హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: ఆమె 18 ఏళ్ల తరువాత తన ఎల్కేజీ ఫ్రెండ్ను కనిపెట్టిందిలా.. -
హైదరాబాద్: డమ్మీ బాంబుతో బ్యాంకులో హల్చల్
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల షాపూర్నగర్ ఆదర్శ్ బ్యాంక్ దగ్గర గురువారం డమ్మీ బాంబు బెదిరింపు ఘటన చోటు చేసుకుంది. బాడీ మొత్తానికి బాంబు తరహా సెటప్ చేసుకుని ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. మామూలుగా బ్యాంకులోకి ఎంట్రీ ఇచ్చిన ఆ వ్యక్తి.. హఠాత్తుగా తాను మానవబాంబునని, తన దగ్గర బాంబు ఉందంటూ బెదిరింపులకు దిగాడు. రూ.2 లక్షలు ఇవ్వాలని, లేకుంటే బ్యాంకును పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో బ్యాంక్ సిబ్బంది భయపడ్డారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై జీడిమెట్ల పోలీసులకు అలర్ట్ వెళ్లింది. హుటాహుటిన సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు.. అది డమ్మీ బాంబుగా తేల్చారు. సదరు వ్యక్తిని జీడిమెట్లకే చెందిన శివాజీగా గుర్తించారు. అతను ఎందుకు అలా చేశాడన్నదానిపై తేల్చేందుకు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. -
అతీక్ బ్రదర్స్ హత్య: అష్రాఫ్ చివరి మాట గుడ్డూ గురించే.. ఎవరీ గుడ్డూ ముస్లిం?
న్యూఢిల్లీ: గుడ్డూ ముస్లిం.. ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఎవరీ గుడ్డూ అంటూ అంతా ఆరా తీస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ శనివారం రాత్రి ముగ్గురు యువకుల కాల్పుల్లో గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్ మరణించడం తెలిసిందే. కాల్పులకు క్షణాల ముందు అష్రాఫ్ నోట వచ్చిన చివరి మాట గుడ్డూ గురించే. మెయిన్ బాత్ యే హై కీ గుడ్డూ ముస్లిం... (నేను చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయం గుడ్డూ ముస్లిం...) అని అంటూనే సోదరులిద్దరూ కాల్పులకు బలయ్యారు. గుడ్డూ అతీక్ అహ్మద్ ముఖ్య అనుచరుడు. తుపాకుల బదులు బాంబులు వాడటం ఇతని స్టైల్. బాంబులు విసిరి ప్రత్యర్థులను అంతం చేయడంలో దిట్ట. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయాగ్రాజ్లో పట్టపగలే ఉమేశ్ పాల్ హత్య జరిగింది. ఆ సమయంలో గుడ్డూ బైక్ వెనుక కూర్చొని నాటు బాంబులు విసురుతున్న దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. అతీక్ మరణానంతరం అతడి నేరసామ్రాజ్యం గుడ్డూ చేతికి వెళ్తుందని ప్రచారం సాగుతోంది. దాంతో యూపీ పోలీసుల నజర్ ఇప్పుడు అతనిపైనే ఉంది. ఉమేశ్ హత్య కేసులో 10 మంది నిందితుల్లో గుడ్డూ పేరూ ఉంది. ఆ పది మందిలో ఇప్పటిదాకా ఆరుగురు హతం కాగా గుడ్డూతో సహా మిగతా వారంతా పరారీలో ఉన్నారు. గుడ్డూ ప్రస్తుతం కర్ణాటకలో తలదాచుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నమ్మినబంటు గుడ్డూ ముస్లిం ప్రయాగ్రాజ్లో పుట్టాడు. చిన్న వయసులోనే నేర సామ్రాజ్యంతో పరిచయం ఏర్పడింది. లక్నోకు మకాం మార్చి పలు నేరాల్లో పాలుపంచుకున్నాడు. బడా వ్యక్తులతో సన్నిహితంగా మెలిగాడు. ఓ టీచర్ హత్య కేసులో 1997లో అరెస్టయ్యాడు. బలమైన సాక్ష్యాల్లేక విడుదలయ్యాడు. బిహార్కు వెళ్లి నేరాలు కొనసాగించాడు. 2001లో మళ్లీ అరెస్టవగా అతీక్ బెయిల్పై బయటకు తీసుకొచ్చాడు. కొన్నేళ్ల క్రితం గుడ్డూ అనారోగ్యం పాలై పరిస్థితి విషమించగా అతీక్ రూ.8 లక్షలు ఖర్చు చేసి గుడ్డూను బతికించాడు. అందుకు కృతజ్ఞతగా ఉమేశ్పై గుడ్డూ బాంబులు విసిరి హత్య చేశాడు. అతీక్కు నమ్మినబంటుగా పేరుతెచ్చుకున్నాడు. అతీక్ కోసం పాకిస్తాన్ నుంచి పంజాబ్ మీదుగా ఆయుధాలను భారత్కు అక్రమంగా రవాణా చేసేవాడని పోలీసులు వెల్లడించారు. అన్నీ అనుమానాలే ప్రయాగ్రాజ్/లక్నో/న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్లు అతీక్, అష్రాఫ్ హత్య విషయంలో పోలీసుల తీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అంతటి కరడుగట్టిన నేరగాళ్లను రాత్రిపూట ఎందుకు ఆసుపత్రికి తీసుకొచ్చారు? పైగా వారున్న వాహనాన్ని గేటు బయటే ఆపి నడిపించుకుంటూ ఎందుకు వచ్చారు? మీడియా కంటపడకుండా ఆసుపత్రి లోపలి దాకా వాహనంలో ఎందుకు తీసుకురాలేదు? పైగా ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్టు విచారణలో సోదరులిద్దరూ ఒప్పుకున్నారు. నిబంధనల ప్రకారం ఇలాంటి కేసుల్లో నిందితుల్ని మీడియాతో సహా ఎవరి కంటా పడనివ్వకూడదు. దాన్నీ తుంగలో తొక్కారు. హంతకులు ముగ్గురూ విలేకరుల ముసుగులో వచ్చి కాల్పులు జరపడం తెలిసిందే. మీడియా ప్రతినిధులను తనిఖీ చేయకుండానే గ్యాంగ్స్టర్ల దగ్గరికి అనుమతించడం వెనక కుట్ర ఉండొచ్చంటున్నారు. వారు 20 తూటాల దాకా కాల్చినా నిందితుల వెన్నంటే ఉన్న పోలీసుల్లో మాత్రం ఎవరికీ ఏమీ కాకపోవడం నమ్మశక్యంగా లేదంటున్నారు. నిందితులను సోమవారం ప్రతాప్గఢ్ జిల్లా జైలుకు తరలించారు. విచారణకు సిట్ అతీక్ శరీరంలో 9 తూటాలున్నట్టు పోస్టుమార్టంలో వెల్లడైంది. 8 తూటాలు ఛాతీ, వీపు నుంచి దూసుకెళ్లగా మరోటి తలలో కనిపించింది. అష్రాఫ్ తలపై ఒకటి, వీపుపై నాలుగు తూటా గాయాలను గుర్తించారు. ఈ హత్యోదంతంపై దర్యాప్తుకు సతీశ్ చంద్ర, సత్యేంద్ర ప్రసాద్, ఓం ప్రకాశ్ సభ్యులుగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. దీనిపై విచారణకు యూపీ ప్రభుత్వం ఇప్పటికే జ్యుడీషియల్ కమిషన్ వేయడం తెలిసిందే. -
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కలకలం.. బాంబు బెదిరింపు కాల్..!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తి బళ్లారి ఎక్స్ప్రెస్లో బాంబు ఉందని కాల్ చేశాడు. ఆగి ఉన్న రైలులో బాంబు ఉందని బెదిరింపు కాల్ చేశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వే, జీఆర్పీ పోలీసులు కలిసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. -
Punjab CM: పంజాబ్ సీఎం హత్యకు కుట్ర? ఇంటివద్ద బాంబు స్వాధీనం..
చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఇంటి వద్ద లైవ్ బాంబు దొరకడం కలకలం రేపింది. చండీగఢ్లోని ఆయన నివాసం వద్ద పోలీసులు ఈ బాంబును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీఎం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. చండీగఢ్లోని పంజాబ్, హరియాణ సీఎంల నివాసాలకు సమీపంలో బాంబ్ షెల్ లభించింది. బాంబ్ స్క్వాడ్ అధికారులు సోమవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో దీన్ని స్వాధీనం చేసుకున్నారు. భగవంత్ మాన్ హెలిప్యాడ్ సమీపంలోనే ఈ బాంబు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బాంబును గుర్తించిన సమయంలో ఆయన ఇంట్లో లేరు. ఎవరో భగవంత్ మాన్ హత్యకు కుట్ర పన్నే బాంబు అమర్చి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కేసు నమోదుచేసుకుని త్వరితగతిన దర్యాప్తు చేపట్టారు. భారత సైన్యం వెస్టర్న్ కమాండ్ రంగంలోకి దిగి ఈ ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఏకంగా సీఎం ఇంటి వద్ద బాంబు దొరకడంతో భద్రతా వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోంది. సైన్యం, అధికారులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. Bomb found near Punjab CM Bhagwant Mann's house in Chandigarh; bomb squad present at the spot pic.twitter.com/qrDCnBS2IF — ANI (@ANI) January 2, 2023 చదవండి: 'సమాజం ఎటుపోతుందో అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి' -
అక్కడ పిల్లలకు ‘బాంబ్’, ‘గన్’ అనే పేర్లే పెట్టాలంటా.. లేదంటే?
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా.. ఆ పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది కిమ్ జోంగ్ ఉన్ పాలన. ఆ దేశం ఇతర దేశాలతో పోలిస్తే చాలా భిన్నం. నిరంకుశ పాలనలో ప్రపంచంతో సంబంధం లేకుండా భిన్నమైన నిబంధనలు పాటిస్తారు. వారికి సొంత క్యాలెండర్ ఉంటుంది. దేశం విడిచి వెళ్లేందుకు అనుమతులు కావాలి. విదేశీ సంగీతం అక్కడ నిషేధం. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. కనీసం తల వెంట్రుకలు ఎలా కట్ చేసుకోవాలనే విషయాన్ని కూడా ప్రభుత్వమే చెబుతుంది. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో కొత్త, విచిత్రమైన నిబంధనను తీసుకొచ్చింది కిమ్ సర్కార్. ఇకపై తల్లిదండ్రులు తమ పిల్లలకు ‘బాంబ్’, ‘గన్’, ‘శాటిలైట్’ వంటి పేర్లను పెట్టాలని కొద్ది రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. దేశభక్తి భావాన్ని పిల్లల్లో పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఉత్తర కొరియా ప్రభుత్వం పౌరుల పేర్లను నిర్ణయించటంపై వ్యతిరేకత వస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. దక్షిణ కొరియా మాదిరిగానే.. ఇక్కడా పేర్ల చివర్లలో అచ్చులు ఉండేలా చూడాలని గతంలో సూచించగా.. తాజా నిర్ణయంతో మారిపోయాయి. భారీగా జరిమానా.. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించే కుటుంబాలకు భారీగా జరిమానా విధించాలని కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు పలు నివేదికలు తెలిపాయి. చెప్పిన విధంగా పేర్లు లేకపోవటం సోషలిస్ట్ విధానానికి వ్యతిరేకమని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. మరోవైపు.. కొత్త పేర్లు దక్షిణా కొరియాలో ఉండే పేర్లకు భిన్నంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల ఆగ్రహం.. తమ పిల్లల పేర్లను బాంబ్, గన్, శాటిలైట్ వంటి వాటితో పెట్టాలని సూచించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆదేశాలను పాటించేందుకు చాలా మంది వ్యతిరేకత చూపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తమ పేర్లను మార్చుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఉత్తర కొరియాకు చెందిన ఓ వ్యక్తి రేడియో ఫ్రీ ఆసియా(ఆర్ఎఫ్ఏ)తో తెలిపాడు. గత ఏడాది నవంబర్ నుంచే పేర్ల మార్పునకు సంబంధించిన నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇదీ చదవండి: పార్లమెంట్లో మహిళా సభ్యురాలిపై చేయి చేసుకున్న ఎంపీ.. వీడియో వైరల్ -
భార్య దూరమైందనే బాధలో కోపంతో....
సైదాబాద్: తన భార్య దూరమైందనే బాధ... ఆమెను తన వద్దకు చేర్చట్లేదని పోలీసులపై కోపం...ఈ పరిస్థితులే ఓ వ్యక్తి బాంబు బెదిరింపు కాల్ చేసేలా చేశాయి. అతగాడు మంగళవారం రాత్రి చేసిన ఆ కాల్ పోలీసులు, బాంబ్ స్క్వాడ్ను ఉరుకులు, పరుగులు పెట్టింది. బుధవారం అతడిని పట్టుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 18 రోజుల జైలు శిక్ష విధించింది. సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బిరామిరెడి కథనం ప్రకారం... సంతోష్నగర్ ప్రాంతానికి చెందిన ఎండీ అక్బర్ఖాన్ ఇంటర్మీడియట్ వరకు చదివాడు. వివాహమైనప్పటికీ అనివార్య కారణాల నేపథ్యంలో కొన్నాళ్లుగా భార్య దూరంగా ఉంటోంది. దీనికి సంబం«ధించి అతడి గతంలో పోలీసుస్టేషన్లోనూ ఫిర్యాదు చేశాడు. అయితే అక్బర్ ప్రవర్తనతో విసిగిపోయానని, తాను అతడితో కలిసి ఉండలేనంటూ ఆమె పోలీసులకు స్పష్టం చేసింది. ఓపక్క తన భార్య దూరమైందనే బాధ, మరోపక్క పోలీసులు ఆమెను తీసుకువచ్చి తనకు అప్పగించట్లేదనే ఆవేదన అతడిలో ఎక్కువ అయ్యాయి. దీంతో బుధవారం రాత్రి 9.15 గంటల ప్రాంతంలో అతగాడు తన ఫోన్ నుంచే నేరుగా సైదాబాద్ ఠాణాకు ఫోన్ కాల్ చేశాడు. ఐఎస్సదన్లోని మసీద్ మందిర్ చౌరస్తాలో కొందరు బాంబు పెట్టనున్నారంటూ చెప్పాడు. ఈ కాల్తో అప్రమత్తమైన పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్లను పిలిపించారు. ఐఎస్ సదన్ ప్రాంతంలో అణువణువూ గాలించారు. చివరు అది బెదిరింపు కాల్గా తేల్చారు. ఈ ఉదంతంపై సైదాబాద్ ఠాణాలో కేసు నమోదైంది. ఫోన్ నెంబర్ ఆధారంగా ముందుకు వెళ్లిన అధికారులు బుధవారం ఉదయం అక్బన్ ఖాన్ను పట్టుకున్నారు. ఈ నిందితుడిపై ఐపీసీలోని 182, 186తో పాటు సిటీ పోలీసు యాక్ట్లోని 70 (బీ) సెక్షన్ కింద ఆరోపణలు చేస్తూ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయస్థానం అక్బర్ ఖాన్కు 18 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో సైదాబాద్ పోలీసులు అతనినిన చంచల్గూడ జైలుకు తరలించారు. (చదవండి: చెల్లెలిని ప్రేమించాడన్న కోపంతో ఓ అన్న..) -
భారత గగనతలంలో ఇరాన్ విమానానికి బాంబు బెదిరింపు
-
విమానం గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపు...దెబ్బకు నాన్ స్టాప్గా ప్రయాణించిన విమానం
ఇరాన్ విమానం భారత్ గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపులు కాల్స్ వచ్చాయి. ఈ ఘటన ఇరాన్లోని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంగ్జౌకు వెళుతున్న మహాన్ ఎయిర్ విమానంలో చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన భారత వైమానికదళం అధికారులు ఢిల్లీ విమానాశ్రయాన్ని అలర్ట్ చేసింది. అంతేగాదు ఆ విమానంలోని ఫైలెట్కి జైపూర్ లేదా చండీగఢ్లలో ల్యాండ్ అయ్యేలా రెండు ఆప్షన్లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఐతే పైలెట్ ఆ రెండు విమానాశ్రయాల్లోకి విమానాన్ని మళ్లించడానికి ఇష్టపడ లేదని భారత వైమానికి దళం పేర్కొంది. అంతేగాదు ఆ పైలెట్ బాంబు బెదిరింపులతో విమానాన్ని ఎక్కడ ల్యాండ్ చేసేందుకు ఇష్టపడలేదని చెప్పారు. దీంతో టెహ్రాన్ ఎయిర్పోర్ట్ రంగంలోకి దిగి పైలెట్ని బాంబు భయాన్ని వీడమని కోరడంతో సదరు ఫైలెట్ చైనాలోని తన గమ్యస్థానం వైపుకు ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇదిలా ఉండగా ఆ విమానాన్ని రెండు యుద్ధ విమానాలు సురక్షిత దూరం నుంచి అనుసరించినట్లు భారత వైమానిక దళం పేర్కొంది. ఆ విమానం చైనా గగనతలంలోకి ప్రవేశించిందని ప్లైట్ ట్రాకింగ్ వైబ్సైట్ ఫ్లైట్ రాడార్ చూపించినట్లు వైమానిక దళం తెలిపింది. సదరు ఇరాన్ విమానానికి ఉదయం 9.20 గం.ల ప్రాంతంలో బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. భారత గగనతలంలో ఉండగా ఈ బెదిరింపులు రావడంతో భారత వైమానిక దళం అప్రమత్తమై మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీల సంయుక్తంగా తగిన చర్యలు చేపట్టింది. అంతేగా భారత గగనతలం అంతటా భారతవైమానిక దళం ఈ విమానంపై గట్టి నిఘా పెట్టిందని కూడా అధికారులు తెలిపారు. ఐతే ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఈ బాంబు బెదిరింపుల గురించి లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తెలియజేసినట్లు సమాచారం. (చదవండి: ప్రచండ్ హెలికాఫ్టర్.. ప్రపంచంలోనే పవర్ఫుల్.. ‘మేడ్ ఇన్ ఇండియా’) -
ఇండిగో విమానంలో బాంబు కలకలం... కొద్దినిమిషాల్లో టేక్ ఆఫ్ అవుతుందనంగా..
ముంబై: ఇండిగో విమానం టేక్ ఆఫ్ అవుతుందనగా విమానంలో బాంబు ఉందంటూ వార్నింగ్ మెసేజ్ వచ్చింది. దెబ్బకు సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా హైఅలర్ట్ విధించి తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటన ముంబైలోని చత్రపతి శివాజి మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది. అయితే సిబ్బంది అప్రమత్తమై హుటాహుటినా తనిఖీలు నిర్వహించగా... అలాంటిదేమీ జరగలేదని అధికారులు తెలిపారు. కరక్ట్గా ఫ్లైట్ టేక్ఆఫ్ అయ్యే సమయానికి శనివారం రాత్రి ఈ గాలి వార్త వచ్చింది. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే విమానాన్ని ఆపీ తనిఖీలు చేశారు. దీంతో ఫ్లైట్ ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. ఆ ఇండిగో విమానం ముంబై ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సిన విమానం. అయితే ఆ ఈమెయిల్ మెసేజ్లో ఇండోగో విమానం ఫలాన ఫ్లైట్ నెంబర్లో బాంబు ఉందని చాలా క్లియర్గా సందేశం పంపిచడంతో అధికారులు సీరియస్గా తీసుకుని వెంటనే తనిఖీలు నిర్వహించామని తెలిపారు. అసలు ఎక్కడ నుంచి ఈ గాలి వార్త వచ్చిందని పోలీసులు దర్యాప్త చేయడం ప్రారంభించారు. (చదవండి: విషాదంలో ఎంత ఘోరం.. రీల్స్ తీస్తుండగా..) -
స్కూల్పై బాంబు పేలుడు.. భయంతో విద్యార్థులు, టీచర్ల పరుగులు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ టీటాగఢ్లో ఓ పాఠశాలపై బాంబు పేలడం కలకలం రేపింది. విద్యార్థులు, టీటర్లంతా స్కూల్లో ఉన్న సమయంలోనే శనివారం మధ్యాహ్నం 1:00గంటలకు ఈ ఘటన జరిగింది. భారీ పేలుడు శబ్దం వినగానే సిబ్బంది, స్టూడెంట్స్ భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒక్కరు కూడా గాయపడకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాంబు స్క్యాడ్ నిపుణులతో తనిఖీలు చేయించారు. అయితే స్కూల్ భవనంపైకప్పుపై ఈ బాంబు ఎలా పేలి ఉంటుందనే విషయంపై మాత్రం పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. ఈ బాంబును భవనంపైనే ఎవరైనా కావాలని పెట్టారా? లేక బయటి నుంచి స్కూల్ పైకి విసిరారా? అనే విషయం తెలియాల్సి ఉంది. అదృష్టవశాత్తు పేలుడు జరిగినప్పుడు విద్యార్థులంతా స్కూల్ లోపలే ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ భవనంపై కాకుండా పాఠశాల లోపల పేలుడు జరిగి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని పేర్కొన్నారు. ఈ పేలుడు ఘటనపై అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. క్రూడ్ బాంబులు, అక్రమ ఆయుధాల పరిశ్రమలే బెంగాల్లో పుట్టుకొస్తున్నాయని కమలం పార్టీ తృణమూల్ ప్రభుత్వంపై మాటల దాడికి దిగింది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు బీజేపీ ఎలాంటి అవకాశన్నైనా వదులుకోదని టీఎంసీ దీటుగా బదులిచ్చింది. చదవండి: ప్రధాని మోదీని ఆకాశానికెత్తిన అమెరికా మీడియా -
ఎయిర్పోర్టులో బాంబు కలకలం.. హుటాహుటిన ఖాళీ చేయించిన అధికారులు
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో బాంబు ఉందని బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. సమాచారం అందిన వెంటనే ఇంటర్నేషనల్ టర్మినల్ను ఖాళీ చేయించారు అధికారులు. అనుమానాస్పద ప్యాకేజీని గుర్తించినట్లు వెల్లడించారు. పోలీసులు, సిబ్బంది విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. తాము చెప్పే వరకు ఇంటర్నేషనల్ టర్మినల్ వైపు ఎవరూ రావొద్దని అధికారులు సూచించారు. అక్కడ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు వెల్లడించారు. 2020లో శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయాన్ని 30 లక్షల మందికిపైగా ప్రయాణికులు వినియోగించారు. పికప్, డ్రాప్ ఆఫ్ సేవలు తమ దేశీయ టర్మినల్స్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. చదవండి: ట్రంప్ మొదటి భార్య మృతిపై అనుమానాలు! వైద్యులు ఏం చెప్పారంటే? -
శబరి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు..ఫేక్ కాల్గా గుర్తింపు
-
కోణార్క్ ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు.. ఆకతాయిని పట్టుకున్న పోలీసులు
సాక్షి,మేడ్చల్: కోణార్క్ ఎక్స్ప్రెస్లో బాంబ్ ఉందని కాల్ చేసిన ఆకతాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఫేక్ కాల్ చేసింది గండిమైసమ్మ బహదూర్ పల్లికి చెందిన తోర్రి కార్తిక్ (19) గా పోలీసులు గుర్తించారు. ఆకతాయిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బాంబ్ ఉందని కాల్ చేస్తే పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దామని కాల్ చేసినట్లు తెలిపాడు. కాగా రైల్వే, లోకల్ పోలిసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని పట్టుకున్నారు. కాగా బుధవారం కోణార్క్ ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కాల్ రావడంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు చర్లపల్లి రైల్వేస్టేషన్లో ట్రైన్ను నిలిపివేశారు. బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు అనంతరం ఫేక్ కాల్గా రైల్వే పోలీసులు తేల్చారు. చివరికి కాల్ చేసిన ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు. కోణార్క్ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ నుంచి ముంబైకు వెళ్తోంది. -
మెట్రో స్టేషన్లో తలదాచుకుంటున్న ఉక్రెనియన్లు...వైరల్ అవుతున్న వీడియో
-
మెట్రో స్టేషన్లో తలదాచుకుంటున్న ఉక్రెనియన్లు...వైరల్ అవుతున్న వీడియో
Metro station in Kharkiv: ఉక్రెయిన్ పై రష్యా గత నెలరోజుల తరబడి దాడి చేస్తూనే ఉంది. వైమానిక దాడులతో పౌరుల ఆవాసాలనే లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే కైవ్, మారియుపోల్, ఖార్కివ్లను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా బలగాలు దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖార్కివ్లోని పౌరులు బాంబుల దాడుల నుంచి తప్పించుకునేందుకు మెట్రో స్టేషన్లోనే తలదాచుకుంటున్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో ..ఉక్రెనియన్లకు ఆ మెట్రో స్టేషనే బాంబు షెల్టర్గా మారిందని పేర్కొంది. ఆ స్టేషన్లో పౌరులు ఏవిధంగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారో వివరిస్తూ..వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అక్కడే నివాసం ఉంటున్న ఉక్రెయిన్ల కోసం తాత్కాలిక పడకలను, సంగీత కచేరీలను ఏర్పాటు చేశారు. అంతేగాదు రష్యా బలగాలు ఖార్కివ్లోని అణుకేంద్రం పై కూడా దాడులు నిర్వహించింది. అంతేగాదు ఖార్కివ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ టెక్నాలజీలోని న్యూట్రాన్ సోర్స్ ప్రయోగాశాల అగ్నిప్రమాదానికి గురైందని మంత్రిత్వ శాఖ తెలిపింది.. అంతేగాదు ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్లో జరుగుతున్న నష్టాన్ని అంచనవేయడం కూడా కష్టమేనని ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
మరియుపోల్లో మారణహోమం? రెండు సూపర్ బాంబులతో అటాక్!
యుద్ధం మొదలై నాలుగు వారాలైనప్పటికీ ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడుతూనే ఉంది. బాంబులతో ఉక్రెయిన్ని అల్లాడిస్తోంది. ఈ క్రమంలో రాజధాని కీవ్ నగరంతో పాటు పలు నగరాలపై విధ్వంసం సృష్టిస్తోంది. ఇందులో ముఖ్యంగా వినిపిస్తున్న నగరం పేరు మరియుపోల్. ఇక్కడి ప్రాంతాలు, ఫ్యాక్టరీలపై రష్యా బలగాలు నిర్విరామంగా దాడులు చేస్తూనే ఉన్నాయి. ఎలాగైనా ఈ నగరాన్ని స్వాధీనం చేసుకోవాలని రష్యాసేనలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. ఆ నగరాన్ని నలుదిక్కులా చ్టుటుముట్టి అదుపులోకి లక్ష్యంగా రష్యన్ బలగాలు పని చేస్తున్నాయి. తాజాగా రెండు శక్తివంతమైన ‘సూపర్’ బాంబులను మరియుపోల్ నగరంపై రష్యా ప్రయెగించింది. ఉక్రేనియన్ అధికారులు అదుపులో ఉన్న దక్షిణ ఓడరేవు నగరం మరియుపోల్ నుంచి పౌరులను రక్షించే ప్రయత్నం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. దాదాపు 1,00,000 మంది ప్రజలు ఆ నగరంలో చిక్కుకుపోయారని, దాడి అనంతరం మృతదేహాలతో, ధ్వంసమైన భవనాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయిందని స్థానిక హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది. అత్యాధునిక మిస్సైళ్ల దాడితో రష్యా దళాలు రాజధాని కీవ్పై తమ పట్టును కొనసాగిస్తున్నందున బుధవారం ఉదయం వరకు ఆ నగరం కర్ఫ్యూ నీడలో ఉంది. -
చర్చలు జరిగేందుకైన దాడి చేయడం ఆపండి!
legally binding security guarantees if NATO shut the Door: రష్య ఉక్రెయిన్పై తన దాడిని ఏడో రోజు కూడా కొససాగిస్తూనే ఉంది. ప్రస్తుతం ప్రజా ఆవాసాలపై కూడా దాడి చేసి రాజధాని కైవ్లోకి చొరబడేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే పలు నగరాలలోకి బలగాలు చొరబడ్డాయి. దీంతో ఉక్రెయిన్ అద్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అర్థవంతమైన చర్చలు జరిగేందుకైన ముందు ఉక్రెయిన్లోని నగరాలపై దాడి చేయడం ఆపేయాలని అన్నారు. కనీసం ప్రజలపై బాంబు దాడి చేయడం ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఉక్రెయిన్ను నాటోలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేకున్నా.. రష్యా ఉక్రెయిన్ నాటోలో ఉండకూడదనుకుంటే గనుక కనీసం ఉక్రెయిన్కు చట్టబద్ధంగా కట్టుబడి ఉండే భద్రతా హామీలను రూపొందించాలి అని భాగస్వామ్య దేశాలను జెలెన్ స్కీ కోరారు. ఉక్రెయిన్ పతనమైతే ఈ రష్యన్ దళాలన్నీ మీ నాటో సభ్య దేశాల సరిహద్దుల్లో ఉంటాయని తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నారు. అంతేకాదు అక్కడ కూడా మీకు ఇదే ప్రశ్న తలెత్తుందని స్పష్టం చేశారు. మరోవైపు ఉక్రెయిన్ గత వారం రష్యన్ దళాల దండయాత్రను తట్టుకోవడంలో సహాయపడటానికి నాటో సభ్యుల నుంచి ఆయుధాల రవాణాను పొందింది. అంతేగాక రష్యాను కట్టడి చేసి దిశగా పశ్చిమ దేశాలు రష్యా ఆర్థిక వ్యవస్థపై ఆంక్షలను కూడా ప్రవేశపెట్టాయి. అయితే జెలన్ స్కీ నో ఫ్లై జోన్ విధించడంతో పాటు మరిన్ని చేయాలని జెలెన్స్కీ అంతర్జాతీయ సమాఖ్యను కోరారు. రష్యా సైనిక చర్యతో త్వరితగతిన లాభలు పొందలేదని ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధ భూమిలో ఒంటరిగా నిలబడి ఉందని, పైగా దాని స్వంత భద్రత పశ్చిమ దేశాలతో ముడిపడి ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు. అంతేకాదు తమకు ప్రతి రోజు యుద్ధం ఉందని, తమకు సహాయం కావాలని చెప్పారు. "నేను నా దేశం కోసం నిరంతరం పనిచేస్తున్నా, మేము మా భూమిని, మా ప్రజలను రక్షించుకునేందకు చివరి వరకు నిలబడి పోరాడుతాం. మా పిల్లల భవిష్యత్తు కోసం నిలబడతాం ". అని జెలెన్ స్కీ చెప్పారు. (చదవండి: పుతిన్ ఆంక్షలు... రష్యన్లు దేశం విడిచి వెళ్లకుండా కట్టడి!) -
ఢిల్లీలో బాంబు కలకలం: ఓ ఇంట్లో అనుమానాస్పద బ్యాగ్..!!
-
పంజాబ్లో పాక్ డ్రోన్ కలకలం
అమృత్సర్: పాక్ నుంచి వచ్చిన ఒక డ్రోన్ పంజాబ్లో జారవిడిచిన 4 కిలోల ఆర్డీఎక్స్, తుపాకీ, బాంబు తయారీ సామగ్రిని రికవరీ చేశామని సరిహద్దు రక్షక దళం (బీఎస్ఎఫ్) బుధవారం తెలిపింది. అర్ధరాత్రి సమయంలో పాక్ నుంచి వస్తున్న డ్రోన్పైకి గురుదాస్పూర్ సెక్టార్లోని పంజ్గ్రైన్ వద్ద రక్షణ సిబ్బంది కాల్పులు జరిపారని బీఎస్ఎఫ్ ప్రతినిధి చెప్పారు. అనంతరం ఆ ప్రాంతాన్ని సోదా చేయగా రెండు ప్యాకెట్లు లభించాయని చెప్పారు. వీటిలో డ్రగ్స్ ఉంటాయని తొలుత భావించామని, తెరిచి చూస్తే 4.7 కిలోల ఆర్డీఎక్స్, చైనా తయారీ తుపాకీ, 22 బుల్లెట్లతో కూడిన మ్యాగ్జైన్, మూడు ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, టైమర్, డిటోనేటింగ్ కార్డ్, స్టీల్ కంటైనర్, నైలాన్ తాడు, ప్లాస్టిక్ పైను, లక్ష రూపాయల నగదు కనిపించాయని తెలిపారు. వీటిని ఐఈడీ (పేలుడు పదార్థాలు) తయారీకి వినియోగిస్తారన్నారు. వీటిని జారవిడిచిన అనంతరం డ్రోన్ తిరిగి పాక్లోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. భారతీయ జాలర్లను అరెస్టు చేసిన పాక్ భారత్కు చెందిన 36 మంది జాలర్లను పాకిస్తాన్ నావికాధికారులు అరెస్టు చేశారు. వీరికి చెందిన 6 పడవలను కూడా పాక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాక్ ప్రాదేశిక జలాల్లో చేపలు పడుతున్నారన్న కారణంపై వీరిని పాక్ అదుపులోకి తీసుకుందని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. పాక్ ఈఈజెడ్లో ఈ జాలర్లు ప్రవేశించారని, అందుకే అరెస్టు చేశామని పాక్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. -
బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు
-
ఎమ్మెల్యే ఇంటిపై బాంబు దాడి
సాక్షి, భువనేశ్వర్: గంజాం జిల్లాలోని కళ్లికోట్ ఎమ్మెల్యే సూర్యమణి బైద్య ఇంటిపై కొంతమంది గుర్తుతెలియని దుండగులు బాంబులు విసిరి పరారయ్యారు. ఈ దుర్ఘటనలో ఎమ్మెల్యే మద్దతుదారుల్లోని నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న కళ్లికోట్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం క్షతగాత్రులను కళ్లికోట్ ప్రభుత్వాస్పత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అందజేశారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం వారిని బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించామని ఎస్డీపీఓ గౌతమ్ కృష్ణ తెలిపారు. నిమ్మజర గ్రామంలోని ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరగగా, ఈ ఘటన వెనక ఉన్న కారణాలు ఇంకా తెలియరావాల్సి ఉందని గంజాం జిల్లా ఎస్పీ బ్రజేష్కుమార్ రాయ్ పేర్కొన్నారు. -
హైదరాబాద్ లోనే బాంబు తయారు NIA సీన్ రికన్ స్ట్రక్షన్
-
సాస్ ఇవ్వలేదని రెస్టారెంట్ను బాంబులతో పేల్చేస్తానన్నాడు.. చివరికి
ఆహారం విషయంలో కొంతమంది భోజన ప్రియులు కచ్చితంగా ఉంటారు. అలాగే వారికి నచ్చిన ఆహారం కోసం గతంలో కొందరు వందల కిలోమీటర్లు వెళ్లిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇంత వరకు ఓకే గానీ ఏదైనా సృతి మించకూడదని అంటారు. కాగా ఓ వ్యక్తి ఆ విషయంలో చాలా దూరం వెళ్లాడు. ఎంతంటే ఏకంగా రెస్టారెంట్ను బాంబులతో పేల్చేస్తానంటూ ఆ యజమానికే కాల్ చేసి బెదిరిస్తూ రెచ్చిపోయాడు. అసలు అతనికి అంతలా ఆగ్రహానికి గల కారణం తెలిస్తే షాక్ అవుతారు. మరేమీ లేదండీ.. సాస్ ఇవ్వడం మరిచిపోయాడని అతను అంత రచ్చ చేశాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని లోవాలో నివసిస్తున్న రోబర్ట్ గాల్విట్జెర్ ఫుడ్ రెస్టారెంట్ సంస్థ మెక్ డొనాల్డ్స్కు ఫోన్ చేసి చికెన్ నగ్గెట్స్ ఆర్డర్ చేశాడు. మెక్డొనాల అంటేనే చికెన్ నగ్గెట్స్, బర్గర్స్కి ప్రత్యేకమని అందరికీ తెలిసిన విషయమే. ఇంకేముంది రుచికరమైన వంటకం వస్తోంది, ఓ పట్టు పట్టాలి అని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇంతలో అతనికి చికెన్ నగ్గెట్స్ అందాయి. కానీ, అవి డిప్ చేసి తినేందుకు అందులో సాస్ ఇవ్వడం ఆ రెస్టారెంట్ సిబ్బంది మరిచిపోయారు. అసలు సాస్ లేకుండా ఎలా డెలివరీ చేస్తారని మనోడికి కోపం వచ్చింది. వెంటనే డెలివరీ సిబ్బందిని కొట్టడమే కాకుండా, రెస్టారెంట్కు ఫోన్ చేసి.. బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా గాల్విట్జెర్ను అరెస్టు చేశారు. చదవండి: వాంటెడ్ క్రిమినల్గా ‘మార్క్ జుకర్బర్గ్’.. పట్టిస్తే రూ.22కోట్లు -
దర్బంగా పేలుడు వెనుక హైదరాబాద్ లో కుట్ర
-
మరో సారి మా బాంబులు గురి తప్పవు : బ్రిటన్కు రష్యా వార్నింగ్
మాస్కో: శతాబ్దాల కాలం నుంచి సముద్రాల మీద అధిపత్యం కోసం సంపన్న దేశాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో పలు దేశాలు కొన్ని ప్రాంతాలలోని జలాలు తమకు చెందినవిగా ప్రకటించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరహాలోనే.. తమ జలాల్లోకి ప్రవేశించిన బ్రిటన్కు రష్యా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ రాయల్ నేవికి చెందిన డెస్ట్రాయర్ హెచ్ఎంఎస్ డిఫెండర్ నౌక ఉక్రెయిన్ నుంచి జార్జియాకు వెళ్లే క్రమంలో క్రిమియా జలాల్లోకి ప్రవేశించింది. దీనిని గుర్తించిన రష్యా నౌకాదళ సిబ్బంది హెచ్చరికగా కాల్పులు జరిపింది. మళ్లీ ఈ ఘటన పునరావృతమైతే మా బాంబులు లక్ష్యాన్ని తాకుతాయని హెచ్చరించింది. ఇప్పటికే రష్యా.. బ్రిటన్ యుద్ధ నౌక తమ జలాల్లోకి వచ్చిందని, మాస్కోలోని బ్రిటన్ అంబాసిడర్ కార్యాలయానికి సమన్లు కూడా జారీ చేసింది. అయితే ఈ జలాలు ఉక్రెయిన్కు చెందినవిగా బ్రిటన్ సహా పలు దేశాలు వాదిస్తున్న సంగతి తెలిసిందే. తమ యుద్ధనౌక మార్గంలో రష్యా బాంబులేసిందని బ్రిటన్ ఆరోపిస్తోంది. కాగా ఈ ఘటనపై వీరివురి వాదనలు వేరువేరుగా ఉన్నాయి. ఈ ఘటనపై రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రిని బ్రిటన్ యుద్ధనౌక మార్గంలో బాంబులేశారట కదా అని ప్రశ్నిస్తే.. భవిష్యత్తులో మార్గంలో కాదు, టార్గెట్పైనే వేస్తామని అనడం గమనార్హం. There are conflicting reports over an incident involving Russian and British naval vessels in the Black Sea. Russia's defense ministry says warning shots were fired at a British ship — But Britain says any shots fired were pre-announced training exercises https://t.co/TKJpAnikuU pic.twitter.com/xZfUWwrsZU — Reuters (@Reuters) June 23, 2021 చదవండి: ఇదో వింత కేసు, ఇతనికి పది నెలలుగా పాజిటివ్..చివరికి -
ఆన్లైన్లో చూసి బాంబు తయారు చేశాడు.. అనంతరం
ముంబై: ఈ మధ్యన యూట్యూబ్లో చూసి రకరకాల ప్రయోగాలు చేయడం అలవాటుగా మారిపోయింది. ఒక్కోసారి కొంతమంది శృతిమించిపోతుంటారు. తాజాగా నాగ్పూర్కు చెందిన రాహుల్ పగాడే (25) ఆన్లైన్లో పేలుడు పదార్థాలు ఎలా తయారు చేస్తారో చూసి ఒక బాంబ్ తయారు చేశాడు. అనంతరం ఆ బాంబ్తో ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి కలకలం సృష్టించాడు. అయితే తొలుత బాంబ్ తనకు నాగ్పూర్లోని ఓ కాలేజీ వద్ద దొరికిందని బుకాయించాడు. అయితే పోలీసులకు అతని మాటలు నమ్మశక్యం కాకపోవడంతో విచారణ చేశారు. అనంతరం బాంబ్ తానే తయారు చేశానని ఒప్పుకున్నాడు. ఈ విషయమై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ ‘‘కొన్ని ట్యుటోరియల్స్ చూసి బాంబ్ తయారు చేశాడు. అయితే అది తయారు చేసిన అనంతరం దాన్ని ఏం చేయాలో తెలియక భయపడ్డాడు. వెంటనే బాంబ్ వైర్లను కట్ చేసి నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చాడు. బాంబ్ తానే తయారు చేశానని చెప్పడానికి భయపడి కాలేజీ వద్ద దొరికిందని అబద్దం చెప్పాడు. విచారణ చేస్తే ఒప్పుకున్నాడు. అతడిపై మహారాష్ట్ర పోలీస్ చట్టం సెక్షన్ 123 కింద కేసు నమోదు చేశాం’’ అని పేర్కొన్నారు. చదవండి: 38 భార్యల ముద్దుల భర్త ఇక లేరు -
షూటింగ్లో నిజంగా పేలిన బాంబు.. హీరోకు గాయాలు
అప్పట్లో సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు అధికంగా డూప్లనే వినియోగించేవారు. ఫేమ్ను దృష్టిలో పెట్టుకొని హీరోలు కష్టపడకుండా డూప్లతనే పని కానిచ్చేవారు. కానీ ఈమద్య ట్రెండ్ మారడంతో అన్ని సన్నివేశాలు డూప్లు లేకుండా సొంతంగా సాహసం చేస్తున్నారు. రియాల్టీ కోసం యాక్షన్ సన్నివేశాలను కూడా అవలీలగా చేసేస్తున్నారు. అయితే ఇలాంటి రిస్క్ తీసుకునే ముందు తప్పగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం బాధ్యతారహితంగా ఉన్నా పెద్ద ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే కన్నడ సినీ పరిశ్రమలో చోటుచేసుకుంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి కూడా ఇలాగే షూటింగ్లో గాయ పడగా.. ఈ విషయం కాస్త ఆలస్యగా వెలుగులోకి వచ్చింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ‘హీరో’. గణవి లక్ష్మణ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ విడుదలవ్వగా.. ఆడియోన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ చిత్రం మార్చి 5న థియేటర్లలో విడుదల కానుంది. అయితే హాసన్ జిల్లాలోని బేలుర్లో షూటింగ్ చేస్తున్న క్రమంలో ఓ యాక్షన్ సన్నివేశంలో భాగంగా రిషబ్, గణవిపైకి పెట్రోల్ బాంబ్ను విసరాల్సి ఉంటుంది. ఈ సమయంలో వీరు పక్కకు దూరంగా వెళ్లాలి. కానీ వీరిద్దరు కాస్త ఆలస్యంగా మూవ్ కావడంతో అప్పటికే బాంబు పేలి మంటల చెలరేగడంతో రిషబ్కు స్పల్ప గాయాలయ్యాయి. దీంతో షూటింగ్ను నిలిపివేసి హీరోను ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కన్నడ పరిశ్రమలో రిషబ్ శెట్టికి బాగానే ఫాలోయింగ్ ఉంది. తుగ్లక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రిషబ్ బెల్ బటమ్ చిత్రంలో మంచి గుర్తింపు సాధించారు. అప్పటి నుంచి వరుస సినిమా అవకాశాలు తలుపు తట్టడంతో బిజీగా మారాడు. చదవండి: వకీల్సాబ్ అప్డేట్.. రెండో పాటకు రేపే ముహూర్తం! తెలంగాణ యాసలో అలరించనున్న ‘బేబమ్మ’ -
ట్రంప్ దూకుడు.. 3 వేల బాంబుల అమ్మకానికి ఓకే
వాషింగ్టన్: అధ్యక్ష పీఠం నుంచి వైదొలగడానికి మరి కొద్ది రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాకు 290 మిలియన్ డాలర్ల(21,25,29,40,000 రూపాయలు) విలువ చేసే 3 వేల స్మార్ట్ బాంబుల అమ్మకానికి ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ మంగళవారం ఓ నోటీసును విడుదల చేసింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ నోటీసు ప్రకారం సౌదీ అరేబియాకు 3 వేల బోయింగ్ నిర్మిత జీబీయూ -39 స్మాల్ డయామీటర్ బాంబ్ ఐ (ఎస్డీబీ ఐ) ఆయుధాలు, సంబంధిత పరికరాలను విక్రయించడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ నిర్ణయం ట్రంప్ పదవీకాలం చివరి రోజుల్లో వస్తుంది. అయితే ప్రపంచంలోని అత్యంత భయంకరమైన మానవతా సంక్షోభానికి కారణమైన యెమెన్లో యుద్ధాన్ని ముగించాలని రియాద్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా సౌదీ అరేబియాకు ఆయుధాల అమ్మకాలను నిలిపివేస్తామని నూతన అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల్లో హామీ ఇవ్వడం గమనార్హం. ఇక మిడిల్ ఈస్ట్లో అమెరికన్ ఆయుధాలను భారీగా కొనుగోలు చేసేది సౌదీ అరేబియానే. (చదవండి: కరోనా ప్యాకేజీపై ట్రంప్ సంతకం) "డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ రోజు అమ్మకం గురించి కాంగ్రెస్కు తెలియజేస్తూ అవసరమైన ధృవీకరణ పత్రాన్ని ఇచ్చింది" అని అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కంటైనర్లు, సహాయక పరికరాలు, సేవలు, విడి, మరమ్మతు భాగాలతో కూడిన జీబీయూ -39 ఎస్డీబీ ఐ మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేయాలని సౌదీ అరేబియా కోరినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ప్రతిపాదిత అమ్మకం "మధ్యప్రాచ్యంలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక వృద్ధికి ముఖ్యమైన శక్తిగా కొనసాగుతున్న స్నేహపూర్వక దేశం భద్రతను" మెరుగుపరచడానికి సహాయపడుతుందని విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. -
వీడిన రేణుగుంట పేలుడు మిస్టరీ
సాక్షి, రేణిగుంట (చిత్తూరు జిల్లా): రేణిగుంట–కోడూరు రైల్వే మార్గంలో రైలు పట్టాలపై రసాయన వ్యర్థాల వల్ల పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలివీ.. రేణిగుంట తారకరామానగర్కు చెందిన శశికళ (35) మంగళవారం గ్రామ శివారులో ఆవులను మేపుతోంది. ఆవులు రైలు పట్టాలపైకి వెళ్లడంతో వాటిని పక్కకు తోలేందుకు పట్టాలపైకి వెళ్లింది. రైలు పట్టాలపై ఓ బాక్స్ ఆమెకు అనుమానాస్పదంగా కనిపించడంతో చేతిలో ఉన్న గొడుగు సాయంతో బాక్స్ను కదిపింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో బాక్స్ పేలింది. దీంతో ఆమె చేతులు, కాళ్లు, ముఖానికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో ఆమెను తిరుపతి రుయాకు తరలించారు. రైలు పట్టాలపై ఆ బాక్స్ ఉన్న సమయంలో రైళ్ల రాకపోకలు జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బాంబ్ స్క్వాడ్ నిపుణులు అక్కడకు చేరుకుని పేలుడు అవశేషాలను సేకరించారు. రసాయన వ్యర్థాల వల్లే పేలుడు రసాయన వ్యర్థాలతో కూడిన డబ్బాను నిర్లక్ష్యంగా రైలు పట్టాలపై పడేయడం వల్లే ఈ పేలుడు ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్రెడ్డి తెలిపారు. ఇనుప కడ్డీలను వేడి చేసేందుకు ఉపయోగించే మిథైల్ ఇథైల్ కీటో పెరాక్సైడ్ అనే రా మెటీరియల్తో కూడిన డబ్బాను స్థానికంగా ఉన్న బాలాజి వెల్డింగ్ షాపు నుంచి తెచ్చి ఇక్కడ పడేసినట్లు విచారణలో గుర్తించామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన షాపు యాజమాన్యంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. (చదవండి: స్నానం చేస్తుంటే వీడియో తీసి.. ఆపై) -
బాంబులతో లేపేస్తా.! ఎవడురా అడ్డుకునేది..
లంగర్హౌస్: పోలీస్స్టేషన్తో పాటు ఒక్కో పోలీసు కింద బాంబు పెట్టి పేల్చి లేపేస్తా... ఎవడురా నన్ను అడ్డుకునేది.... ఎస్పీ, డీఎప్పీ ఎవడు వస్తాడో రమ్మను ఇక్కడే ఉంటా అందరిని చంపేస్తా.. అంటూ ఓ వ్యక్తి పోలీసులకు నేరుగా వార్నింగ్ ఇచ్చాడు. ఈ సంఘటన లంగర్హౌస్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... హిమయత్సాగర్ గ్రామంలో నివాసముండే లోకేష్(40) గతంలో రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు గురువారం ఉదయం తన ద్విచక్రవాహనంపై నగరానికి వస్తుండగా లంగర్హౌస్ పోలీస్స్టేషన్ పరిధిలోని టిప్పుఖాన్ బ్రిడ్జి చెక్పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇటు ఎందుకు వెళుతున్నావని పోలీసులు అడగగా తన ఇష్టం తనకు పనులు ఉన్నాయన్నాడు. అయితే ఈ భయంకర వాతావరణంలో హెల్మెట్ లేదు కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేవు అని పోలీసులు అడిగారు. దీంతో రెచ్చిపోయిన లోకేష్ లాక్డౌన్ అంటూ అందరిని పోలీసులు వేదిస్తున్నారు ఏందిరా మిమ్మల్ని బాంబులతో చంపుతా అంటు రెచ్చిపోయాడు. మీరు కూడా ఎందుకు పెట్టుకున్నారురా మాస్కులు అంటు పోలీసుల నుంచి మాస్కులు లాగి వారిపై దాడి చేశాడు. వార్నింగ్లు ఇస్తూ.. దుర్భాషలాడుతూ.. ఆ ప్రాంతంలో హల్చల్ సృష్టించాడు. అలా అన్నొద్దని అతడిని సముదాయించిన వారిని సైతం తిడుతూ దాడికి దిగాడు.(సరుకు రవాణా వాహనాలకు పాస్లు అవసరం లేదు) పోలీసుల తీరుపై విమర్శలు, ప్రశంసలు.... కొన్ని సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో బయటకి వచ్చిన వారిపై సైతం పోలీసులు లాఠీలు జులిపించారు. కాని నడి రోడ్డుపై లోకేష్ హంగామా చేస్తుంటే పోలీసులు ఏమనకుండా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు వారి సహనానికి సలాం అంటూ ప్రశంసించారు. లోకేష్ భార్య కొద్ది నెలల క్రితం చనిపోయింది. అప్పటి నుంచి మానసిక పరిస్థితి బాగలేదని గతంలో ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొంది ఫిబ్రవరి నెలలో డిశ్చార్జ్ అయ్యాడని తెలుసుకుని పోలీసులు అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మానసిక రోగిని ఆస్పత్రికి పంపకుండా ఇంటికి పంపడంలో ఆంతర్యమేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.(సొంతూరికి దారేది?) -
ఆదిత్యరావు బ్యాగులో సెనైడ్ లభ్యం
సాక్షి బెంగళూరు: మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పెట్టిన ఆదిత్యరావుకు సంబంధించి పోలీసులు తనిఖీ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఆదిత్యరావు బ్యాగులో సెనైడ్ లభ్యం కావడం, అంతేకాకుండా కర్ణాటక బ్యాంకులో ఓ లాకర్ బాంబు తయారీ వస్తువులన్నీ భద్రపరిచినట్లు తెలిపాడు. ఈక్రమంలో ఉడుపిలోని కర్ణాటక బ్యాంకుకు తీసుకెళ్లారు. తనిఖీ చేయగా బ్యాగులో తెల్లటి రంగులో ఉన్న పొడిని సెనైడ్గా పోలీసులు భావించారు. (‘అందుకే ఎయిర్పోర్టులో బాంబు పెట్టాను’) మంగళూరు విమానాశ్రయంలో బాంబు పెట్టే సమయంలో ఎవరైనా అడ్డు వస్తే సెనైడ్ టచ్ చేసి వెళ్లేందుకు సిద్ధమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గత ఆరు నెలలుగా సెనైడ్ను బ్యాంకు లాకర్లో ఉంచినట్లు ఆదిత్యరావు తెలిపాడు. అదేవిధంగా మంగళూరులో బాంబు పెట్టిన రోజున అతడు ఉడుపిలోని వడాభండేశ్వర ఆలయానికి వెళ్లాడు. ఈక్రమంలో తనిఖీల్లో భాగంగా నిన్న ఆదిత్యరావును ఉడుపి తీసుకెళ్లారు. ఆలయం నుంచి జిమ్ మాస్టర్కు తన సిమ్ నుంచి కాల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఎంత ప్రయత్నించినా నిందితుడు ఉపయోగించిన సిమ్ లభ్యం కాలేదు. (మంగళూరు ఎయిర్పోర్టులో బాంబు) -
మంగళూరు ఎయిర్పోర్టులో బాంబు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు దొరకడం కలకలం రేపింది. టికెట్ కౌంటర్ వద్ద సోమవారం ఉదయం 10 గంటల సమయంలో అనుమానాస్పద బ్యాగ్ను కొనుగొన్న విమానాశ్రయ పోలీసులు, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న నగర పోలీసు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఆ బ్యాగులో పేలుడు పదార్థం ఉన్నట్టుగా అనుమానించారు. దీంతో ఆ బ్యాగ్ను బాంబు తరలింపు వాహనం ద్వారా కిలోమీటరు దూరంలో ఉన్న ఖాళీ స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ కట్టుదిట్టమెన భద్రతతో సాయంత్రం 5.30 గంటలకు పేల్చారు. బ్యాగ్లోని మెటల్ కాయిన్ బాక్స్లో పేలుడు పదార్థం, లోహపు ముక్కలు నింపారని సమాచారం. సీసీ కెమెరాల్లో నిందితుడు.. సీసీ కెమెరా చిత్రాల ఆధారంతో అధికారులు నిందితుడి ఫొటోలు విడుదల చేశారు. నిందితుడు ఆటోలో రావడం, బ్యాగ్ ఉంచడం తదితర దృశ్యాలు విమానాశ్రయం కెమెరాల్లో రికార్డ య్యాయి. నిందితుడు మధ్యవయస్కుడు, విద్యావంతునిలా కనిపిస్తున్నాడు. బ్యాగ్ను కౌంటర్ వద్ద ఉంచి, ముఖాన్ని దాచుకుంటూ ఆటోలో వెళ్లిపోయాడు. దీని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని సీఐఎస్ఎఫ్ తెలిపింది. బాంబు విమానాశ్రయంలో పేలి ఉంటే మొత్తం బూడిదై పోయేదని మంగళూరు ఎస్పీ పీఎస్ హర్ష తెలిపారు. చుట్టూ 500 మీటర్ల మేర పేలుడు ప్రభావం ఉండేదన్నారు. మంగళూరు విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు బయల్దేరిన ఇండిగో విమానంలో బాంబు ఉందనే వదంతి వ్యాపించింది. దీంతో అధికారులు విమానాన్ని వెనక్కి రప్పించి తనిఖీలు చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. ఈ సంఘటనలతో మంగళూరులో భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల మంగళూరులో ఎన్నార్సీకి వ్యతిరేకంగా భారీగా అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. -
నాటుబాంబును కొరికిన ఎద్దు
చిత్తూరు,పలమనేరు: మండలంలోని కృష్ణాపురం కౌం డిన్య అటవీ ప్రాంతానికి మేతకోసం వెళ్లిన ఎద్దు వేటగాళ్లు వన్యప్రాణుల కోసం అమర్చిన నాటుబాంబును కొరికింది. దీంతో ఎ ద్దు దవడలు పూర్తిగా పేలిపోయి చర్మం వేలాడుతోంది. దీన్ని గమనించిన కాపరి ఎద్దును గ్రామానికి తోలుకొచ్చాడు. వేటగాళ్లు ఈ ప్రాంతంలో దుప్పుల కోసం అమర్చిన ఉంటను తినడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతు వాపోయాడు. మైలేరు పండుగల్లో పలు బహుమతులు గెలిచిన ఎద్దు విలువ లక్షకు పైగా ఉంటుందని తెలిపాడు. -
మన్యంలో కలకలం
సాక్షి, విశాఖపట్నం: మన్యంలో మరోసారి కలకలం రేగింది. మావోయిస్టులు తలపెట్టిన ముప్పును పోలీసు బలగాలు పసిగట్టి నిర్వీర్యం చేశాయి. రిమోట్ ల్యాండ్మైన్లను గుర్తించడంతో ఆదివాసీలతోపాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా పోలీసులు జి.మాడుగుల మండలం మారుమూల నుర్మతి అవుట్పోస్టు సమీపంలో నాలుగు అత్యంత శక్తిమంతమైన మందుపాతరలను (ల్యాండ్మైన్లు) గురువారం పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ పర్యవేక్షణలో వాటిని బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. అవుట్పోస్టు పరిసరాల్లో సుమారు రూ.50కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరో వైపు సివిక్ యాక్షన్లో భగంగా గ్రామదర్శిని పేరిట చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసులు గిరిజనులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అవుట్పోస్టు సమీపంలో సుమారు 300 మంది ఉంటున్న గిరిజన ఆశ్రమ -
నిజామాబాద్ జిల్లాలో రెచ్చిపోతున్న వేటగాళ్లు
-
భారీ పేలుడుతో దద్దరిల్లిన పారిస్
-
‘వారి మీద బాంబులేయ్యాలి’
లక్నో : మనిషి ప్రాణం కంటే ఆవు చావుకే ఎక్కువ ప్రాధాన్యతిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో నేలకొన్న పరిస్థితులను చూస్తే ఇక్కడ ఉండాలంటేనే భయంగా ఉందంటూ నటుడు నసీరుద్దిన్ షా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం సురక్షితం కాదనే వారి మీద బాంబులు వెయ్యాంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముజఫర్ నగర్ జిల్లా ఖతౌళి నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కొంత మంది దేశ ప్రతిష్టను దిగజార్చే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ దేశం వారికి సురక్షితం కాదని భావిస్తున్నారు. నాకే గనక ఓ మంత్రి పదవి ఉంటే ఇలాంటి వారందరి మీద బాంబులు వేసేవాడిని. ఒక్కరిని కూడా వదలే వాడిని కాదు. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’ అంటూ తెలిపారు. విక్రమ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. -
మావోయిస్టుల స్కెచ్ : త్రుటిలో తప్పిన ప్రమాదం
మల్కన్గిరి: డీఆర్జీ జవాన్లు త్రుటిలో ప్రమాదం తప్పించుకున్నారు. మావోయిస్టుల వల నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. మందుపాతర పేలకుండానిర్వీర్యం చేయగలిగారు. మల్కన్గిరి జిల్లా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో దోర్నిపాల్ సమితి గోరుగొండ గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. డీఆర్జీ జవాన్లు ఆదివారం ఉదయం ఈ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ విషయం ముందుగా తెలుసుకున్న మావోయిస్టులు గోరుగొండ గ్రామం పరిసరాల్లో రోడ్డుపై సుమారు 5 కేజీల ఐఈడీ బాంబును అమర్చారు. అయితే అదే దారిలో కూంబింగ్కు వెళుతున్న జవాన్లు దీనిని ముందుగా గుర్తించి చాకచక్యంగా తప్పించుకుని మందుపాతరను నిర్వీర్యం చేసి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ ప్రాంతంలో జవాన్లు కూంబింగ్ను ముమ్మరం చేశారని ఎస్పీ సందీప్కుమార్ తెలిపారు. -
70 ఏళ్ల తర్వాత బయటడింది..
ఫ్రాంక్ఫర్ట్ : రెండు ప్రపంచ యుద్ధాలు మానవ జాతిని అతలాకుతలం చేశాయి. మరీ ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం సృష్టించిన బీభత్సాన్ని ప్రపంచం నేటికి మర్చిపోలేదు. అందుకు ప్రధాన కారణం ఈ యుద్ధంలో వాడిన బాంబులే. ఇప్పుడున్నంత టెక్నాలజీ లేని కాలంలోనే ఆనాడు తయారు చేసిన బాంబులు తీవ్ర మారణహోమాన్ని సృష్టించాయి. అంతటి విపత్తు సృష్టించిన నాటి బాంబు ఒకటి బయటపడటంతో జనాలు మరోసారి భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన జర్మనిలో చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనుల చేపడుతున్న సమయంలో ఇది బయటపడింది. విషయం తెలుసుకున్న అధికారులు లుడ్విగ్షాఫెన్ నగరంలోని 18500 మంది ప్రజలను ఖాళీ చేయించారు. అనంతరం బాంబు డిస్పోజల్ టీమ్ దానిని సురక్షితంగా నిర్వీర్యం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో జర్మనీపై అమెరికా దళాలు వేసిన బాంబు ఇది. దీని బరువు సుమారు 500 కిలోలు. బాంబు నిర్వర్యం చేసే క్రమంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా కిలోమీటరు మేర పరిసర ప్రాంతాల్లోని ప్రజలను మరోచోటికి తరలించామని అధికారులు తెలిపారు. అంతేకాక కేవలం గంట సేపట్లోనే ఈ బాంబును నిర్వీర్యం చేశామన్నారు. అనంతరం అధికారులు బాంబును నిర్వీర్యం చేశామని, నగరంలోని ప్రజలంతా మళ్లీ వాళ్ల ఇళ్లకు రావచ్చని ఓ అధికారి ట్వీట్ చేశారు. అంతేకాక ఆ బాంబు తాలూకు ఫొటోను కూడా పోస్ట్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ఇప్పటికి 70 ఏళ్లు గడిచిన తర్వాత కూడా జర్మనీలో ఇలాంటి పేలని బాంబులు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. గతేడాది కూడా ఫ్రాంక్ఫర్ట్లో 1.8 టన్నుల బరువున్న బ్రిటన్ బాంబు బయటపడింది. ఆ సమయంలో నగరంలోని 60 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఏడాది ఏప్రిల్లో బెర్లిన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా మరో బ్రిటిష్ బాంబు కనిపించింది. -
అమెరికా ఎంబసీ వద్ద బాంబు పేలుడు
-
అమెరికా ఎంబసీ వద్ద పేలుడు
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద గురువారం బాంబు పేలుడు సంభవించింది. ఎంబసీ సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకునిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు పాల్పడింది చైనాలోని టోంగ్లియో ప్రాంతానికి చెందిన 26ఏళ్ల జియాంగ్గా గుర్తించారు. జియాంగ్ అమెరికా రాయబార కార్యాలయం ఎదుట బాంబు దాడికి యత్నించగా, బాంబు తీవ్రత తక్కువగా ఉండటంతో నిందితుడు మినహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చైనా పోలీసులు తెలిపారు. నిందితుడి పూర్తి వివరాలను దాడికి గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే భారత ఎంబసీ కూడా ఉంది. పేలుడు అనంతరం ఎంబసీ సమీపంలో దట్టమైన పొగ అలుముకున్న ఫోటోలు సామాజికమాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పేలుడు జరిగిన కొద్ది సమయంలోనే ఎంబసీ కార్యకలాపాలను పునరుద్దరించారు. -
టీవీ బాంబు కలకలం
మల్కన్గిరి: ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా మత్తిలి సమితి ఉదిరిబెడ గ్రామం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మావోయిస్టులు టీవీలో పెట్టిన బాంబును బీఎస్ఎఫ్ జవాన్లు పేల్చివేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. మల్కన్గిరి జిల్లా మత్తిలి సమితి ఉదిరిబెడ గ్రామం సమీపంలో ఓ చెట్టు వద్ద మావోయిస్టులు టీవీలో బాంబు పెట్టి ఉంచారు. మల్కన్గిరి–జయపురం రోడ్డు పక్కన దీనిని పెట్టారు. ఈ ప్రాంతం బీఎస్ఎఫ్ క్యాంప్నకు సుమారు 200 మీటర్ల దూరం ఉంటుంది. అయితే చెట్టు వద్ద టీవీ ఉండడం గమనించిన స్థానికులు బీఎస్ఎఫ్ జవాన్లకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. టీవీలో బాంబు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే బాంబు స్క్వాడ్ తీసుకొచ్చి మరో బాంబుతో టీవీలో ఉన్న బాంబును పేల్చివేశారు. ఈ సంఘటన నేపథ్యంలో మల్కన్గిరి–జయపురం రహదారిలో సుమారు మూడు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో సుమారు కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరాయి. ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ఘటనపై మల్కన్గిరి ఎస్పీ జోగ్మోహన్ మిన్నా మాట్లాడుతూ బీఎస్ఎఫ్ క్యాంప్నకు సుమారు 200 మీటర్ల దూరం టీవీ ఉండడంతో అందులో బాంబు ఉందేమోనని అనుమానం వచ్చిందన్నారు. దీంతో బాంబు స్క్వాడ్ తీసుకొచ్చి టీవీని పరిశీలించి అందులో బాంబును పేల్చివేశామన్నారు. -
భయపెట్టిన ‘బాంబే’...
బ్రిస్బేన్ : చిన్నపాటి అక్షర దోషాలే ఒక్కోసారి తీవ్ర పరిణామలకు కారణమవుతాయి. సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి ఆస్ట్రేలియా బ్రిస్బేన్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రయాణికుల సామన్లలో ఒక బ్యాగు మీద ‘బాంబ్ టు బ్రిస్బేన్’ అని రాసి ఉంది. ఇది గమనించిన ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ ఆ బ్యాగ్లో ప్రమాదకరమైనదేదో ఉందని భావించి వెంటనే అందరిని అప్రమత్తం చేశాడు. బ్యాగ్ను తనిఖీ చేయవలసిందిగా భద్రతా సిబ్బందిని ఆదేశించాడు. ఇంతలో ఓ నడివయస్సు మహిళా ప్రయాణికురాలు ఆ బ్యాగ్ తనదేనంటూ పోలీసుల వద్దకు వచ్చింది. పోలీసులు ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లి విచారించారు. ముంబాయి నుంచి బ్రిస్బేన్ వెళ్తున్న ఆ ప్రయాణికురాలి పేరు వెంకటలక్ష్మి(65). పోలీసులు ఆమెను బ్యాగు తెరిచి చూపించాల్సిందిగా ఆదేశించారు. బ్యాగులో ప్రమాదకరమైనవి ఏమి లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. మరి బ్యాగ్ మీద ఎందుకు ‘బాంబ్’ అని రాసి ఉంది అని అడగ్గా తాను ‘బాంబే’ అని రాయాలనుకున్నాను, కానీ స్థలం లేకపోవడంతో ‘వై’ ని రాయకుండా వదిలేసాను. దాంతో ‘బాంబే’ కాస్తా ‘బాంబ్’ గా మారిందని వివరించింది. వెంకటలక్ష్మి తన పుట్టిన రోజును జరుపుకోవడానికి బ్రిస్బేన్లో ఉన్న తన కూతురు దగ్గరికి వెళ్తుంది. బ్యాగును మరిచిపోతానేమో అని దానిపై ‘బాంబే టు బ్రిస్బేన్’ అని రాయాలనుకుంది. కానీ స్థలం సరిపోక ‘బాంబ్ టు బ్రిస్బేన్’ అని రాసింది. ఒక్క అక్షరాన్ని రాయకపోవడంతో ఇంత గందరగోళం జరిగింది. విషయం తెలిసిన తర్వాత ప్రయాణికులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. -
చెన్నై విమానాశ్రయంలో హైఅలర్ట్
సాక్షి, చెన్నై : సోమవారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో బాంబు పెట్టామని దుండగుల నుంచి ఫోన్కాల్ వచ్చింది. దీంతో బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు చేపట్టింది. విమానాశ్రయంలో హైఅలర్ట్ ప్రకటించినట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి. -
ఇరికించబోయి.. ఇరుక్కున్నారు
జమ్మలమడుగు/పెద్దముడియం : అప్పు చెల్లించలేక.. బాంబుల కేసులో ఇరికించాలనుకున్నారు.. ఇందుకోసం బాంబులు తయారు చేశారు.. అతని ఇంటి వెనుక పెట్టాలనుకున్నారు.. ఇందుకోసం వాటిని తీసుకొస్తుండగానే పోలీసులకు చిక్కిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ కె.కృష్ణన్ శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పెద్దముడియం మండలం కొండసుంకేసుల గ్రామస్తుడు రాంగోపాల్రెడ్డి.. అదే గ్రామానికి చెందిన విజయభాస్కర్రెడ్డి వద్ద రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. డబ్బును పదే పదే అడుగుతుండటంతో ఎలాగైనా విజయభాస్కర్రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి ఇబ్బందికి గురి చేయాలని రాంగోపాల్రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఇదే గ్రామానికి చెందిన బెల్టుషాపు నిర్వాహకుడు బాల చెన్నయ్యతో కలిసి ప్రణాళిక రూపొందించాడు. బాంబుల కేసు పెడితే బాగుంటుందని ఆలోచించారు. పక్కనే ఉన్న కోవెలకుంట్లకు వెళ్లి గంధకం, ఇనుపచువ్వలు, దారాలు తెచ్చుకుని రెండు బాంబులు తయారు చేశారు. వాటిని విజయభాస్కర్రెడ్డి ఇంటి వెనుక పెట్టాలని అనుకున్నారు. ఇందుకోసం వారు గ్రామానికి తీసుకొస్తున్నారు. మార్గంమధ్యలోని కొండసుంకేసుల, కల్వటాల గ్రామాలకు వెళ్లే రహదారిపై బ్యాగు పట్టుకుని ఉన్నారు. అదే సమయంలో పెద్దముడియం ఎస్ఐ హరిప్రసాద్, తన సిబ్బందితో కలసి అదే రోడ్డుపై వెళుతున్నారు. వారు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీశారు. బ్యాగులో బాంబులు ఉన్నట్లు గుర్తిం చారు. వారిని అరెస్ట్ చేసి, విచారణ చేపట్టడంతో విషయం వెలుగు చూసింది. వారిపై కేసు నమోదు చేసి, శుక్రవారం రిమాండ్కు తరలించారు. తప్పుడు ఫిర్యాదు చేస్తే చర్యలు ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చి ఇతరులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కె.కృష్ణన్ హెచ్చరించారు. ఫ్యాక్షన్, బాంబుల సంస్కృతికి దూరంగా ఉండాలని రూరల్ సీఐ ఉమామహేశ్వరరెడ్డి తెలిపారు. సమావేశంలో అర్బన్ సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐ సునీల్కుమార్రెడ్డి, రాఘవేంద్రారెడ్డి, హరిప్రసాద్ తదితరులు ఉన్నారు. -
భారీ బాంబు.. పేలి ఉంటే 4000 మంది ఏమయ్యేవారో..
-
భారీ బాంబు.. పేలి ఉంటే 4000 మంది ఏమయ్యేవారో..
హాంకాంగ్ : యుద్ధాలు వచ్చాయి.. పోయాయి.. కానీ బాంబులు మాత్రం అలాగే ఉన్నాయి. ఏళ్ల తర్వాత బయటపడుతూ బెంబేలెత్తిస్తున్నాయి. హాంకాంగ్లో ఓ భారీ బాంబు బయటపడింది. వెయ్యి పౌండ్ల బరువు ఉన్న రెండో ప్రపంచ యుద్ధకాలానికి చెందిన ఓ బాంబును హాంకాంగ్లో రద్దీగా ఉండే వాణిజ్య సముదాయాల వీధిలో గుర్తించారు. పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి దానిని పేలకుండా బయటకు తీశారు. అనంతరం నిర్వీర్యం చేశారు. దీనిపై హాంకాంగ్ పోలీసులు వివరాలు చెబుతూ గడిచిన వారంలోనే ఇది రెండో బాంబు అని చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో పలు ప్రాంతాల్లో భూమిలోపల బాంబులు పేలకుండా పడిపోయి ఉన్న విషయం తెలిసిందే. ఏదైనా నిర్మాణం చేయాలనుకున్నప్పుడు జరిపే తవ్వకాల్లో ఇవీ అనూహ్యంగా బయటపడుతున్నాయి. తాజాగా బయటపడిన బాంబు అమెరికా తయారు చేసిన ఏఎన్-ఎం65 బాంబు అని, ప్రస్తుతం అది బయటపడిన చోటు ఒకప్పుడు జపాన్ ఆదీనంలో ఉండేదని అధికారులు చెప్పారు. దాదాపు 4000 మందిని ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలించి రాత్రికి రాత్రి తీవ్రంగా శ్రమించి ఆ బాంబు నిర్వీర్యం చేశారు. -
చర్చిని డైనమైట్తో పేల్చేసిన చైనా
-
చర్చిని డైనమైట్తో పేల్చేసిన చైనా
హాంకాంగ్ : దేశంలోని ప్రముఖ ఎవలంజికల్ చర్చిను చైనా ప్రభుత్వం డైనమైట్ బాంబుతో నేలకూల్చింది. దీంతో పలు క్రిస్టియన్ సంఘాలు చైనా ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. మత స్వేచ్ఛ, మానవ హక్కులపై చైనా ప్రభుత్వానికి ఏ మాత్రం గౌరవం లేదని అన్నాయి. షాంగ్జీ ప్రావిన్సులో గల ది గోల్డెన్ ల్యాంప్స్టాండ్ చర్చి అత్యంత పురాతనమైనది. అధ్యాత్మిక జీవనాన్ని నియంత్రించేందుకు చైనా కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే కొద్దిరోజులుగా చర్చిలను నేలకూల్చుతోంది. అయితే, చర్చిల వరుస కూల్చివేతల వెనుక చైనా ప్రభుత్వ భయాందోళనలు ఉన్నట్లు తెలుస్తోంది. పాశ్చాత్య దేశాల సంస్కృతికి చెందిన క్రైస్తవ మత వ్యాప్తి దేశంలో జరిగితే భవిష్యత్లో కమ్యూనిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఈ కారణాన్ని పైకి చూపకుండా అధ్యాత్మికతపై నియంత్రణ పేరుతో క్రైస్తవ మతాన్ని కూకటివేళ్లతో పెకలించేందుకు చైనా ప్రభుత్వం యత్నిస్తోంది. -
అమెరికాపై సైక్లోన్ ‘బాంబ్’
న్యూయార్క్: అమెరికాపై మరో తుపాను విరుచుకుపడింది. ఆ దేశ తూర్పు తీరాన్ని తాకిన ‘బాంబ్ సైక్లోన్’ ధాటికి ఇప్పటి వరకు డజను మందికి పైగా చనిపోయినట్లు భావిస్తున్నారు. ఉత్తర కరోలినాలో ట్రక్కు ఓ బ్రిడ్జిపై నుంచి జారి ఓ కొండపై పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందినట్లు తెలిసింది. ఉత్తర, దక్షిణ కరోలినా, బోస్టన్, ఉత్తర ఫ్లోరిడా, న్యూయార్క్, వాషింగ్టన్, వర్జీనియాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంది. చాలా ప్రాంతాల్లో మంచు తుపాను లాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈదురు గాలులు, భారీ వర్షాలకు తోడు ఉష్ణోగ్రతలు మైనస్ స్థాయికి పడిపోవడంతో మంచుతో కప్పి ఉన్న రోడ్లపై ప్రయాణం కష్టమవుతోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు, శీతల పవనాలు ఈ వారమంతా కొనసాగే అవకాశాలున్నట్లు అమెరికా జాతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది. వీధుల వెంట మంచు పేరుకుపోవడంతో స్కూళ్లను మూసివేయడంతో పాటు పలు విమాన సర్వీసులను రద్దుచేశారు. న్యూయార్క్లోని రెండు ప్రధాన రన్వేలను మూసివేశారు. నయాగరా జలపాతం దాదాపుగా గడ్డకట్టుకుపోయింది. న్యూయార్క్లో అత్యవసర పరిస్థితి... తుపాను ప్రభావం విద్యుత్, టెలీ కమ్యూనికేషన్లపై కూడా పడింది. వర్జీనియా, ఉత్తర కరోలినాలో ప్రజలకు విద్యుత్ ఇక్కట్లు తప్పలేదు. బోస్టన్ తీరంలో వరదల పరిస్థితిని మసాచుసెట్స్ గవర్నర్ చార్లి బేకర్ తీవ్రమైనదిగా పేర్కొన్నారు. న్యూయార్క్లో ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించి, 500 మంది సిబ్బందితో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఉత్తర ఫ్లోరిడా, సౌత్ ఈస్టర్న్ జార్జియాలోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రాబోయే రోజుల్లో న్యూయార్క్, బోస్టన్లలో అడుగు కన్నా ఎక్కువ ఎత్తులో మంచు పేరుకుపోవొచ్చని అంచనా వేస్తున్నారు. లాంగ్ ఐలాండ్, సౌత్ ఈస్టర్న్ కనెక్టికట్లలో గంటకు 88.5 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. దీంతో ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 29 డిగ్రీలకు పడిపోయే అవకాశముంది. వర్జీనియా తీరం వెంట వాషింగ్టన్, న్యూపోర్ట్ న్యూస్ల మధ్య రైలు సేవలను నిలిపివేశారు. బాంబ్ సైక్లోన్ అంటే.. ఇలాంటి తుపాన్ల సాంకేతిక నామం బాంబోజెనెసిస్ కాగా, సాధారణంగా ‘బాంబ్ సైక్లోన్’ అని పిలుస్తారు. వాతావరణ పీడనం ఒక్కరోజు వ్యవధిలోనే కనీసం 24 మిల్లీబార్లకు పడిపోయి హరికేన్ లాంటి పెను గాలులకు దారితీసే వాతావరణ మార్పులనే బాంబోజెనెసిస్గా పరిగణిస్తారు. ఉపగ్రహ ఛాయాచిత్రం -
జర్మనీలో 1400 కిలోల బాంబు
ఫ్రాంక్ఫర్ట్: జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి పేలని బాంబును కనుగొన్నారు. బ్లాక్బస్టర్గా పిలిచే ఈ భారీ బాంబును వచ్చే ఆదివారం నిర్వీర్యం చేయనున్నారు. దీంతో బాంబును గుర్తించిన చోటు నుంచి సుమారు 70 వేల మందిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి స్థానిక అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. గోథె యూనివర్సిటీ వెస్ట్ఎండ్ క్యాంపస్ సమీపంలో కొనసాగుతున్న భవన నిర్మాణ పనుల్లో 1400 కిలోల బరువున్న ఈ బాంబు బయటపడిందని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశామని, ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. -
కారు బాంబు పేలి.. 25 మంది మృతి!
ఇస్లామాబాద్(పాకిస్తాన్): పాకిస్తాన్లోని తీవ్రవాద ప్రాబల్య ప్రాంతం బలూచిస్థాన్ ప్రావిన్సులో శక్తిమంతమైన బాంబు పేలుడుతో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం మధ్యాహ్నం ముస్తుంగ్ పట్టణంలోని మసీదులో జరిగిన ఓ కార్యక్రమానికి సెనేట్ డిప్యూటీ ఛైర్మన్ మౌలానా అబ్దుల్ గఫూర్ హైద్రి హాజరయ్యారు. అనంతరం ఆయన తిరిగి వెళ్తుండగా పెద్ద శబ్దంతో బాంబు పేలింది. దీంతో అక్కడికక్కడే 25 మంది చనిపోగా మరో 35 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో హైద్రికి కూడా గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జు అయింది. క్షతగాత్రులందరినీ ముస్తుంగ్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు కారకులెవరనేది తెలియరాలేదు. -
పాకిస్థాన్పై బాంబు వేసి, ఆయన్ను విడిపించండి
జంషెడ్పూర్: విశ్వ హిందూ పరిషత్ ఫైర్ బ్రాండ్ ప్రవీణ్ తొగాడియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్పై భారత్ బాంబు వేసి, ఆ దేశం మరణశిక్ష విధించిన మన నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ను విడిపించాలని తొగాడియా అన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను చూసి భారత్ నేర్చుకోవాలని సూచించారు. శుక్రవారం జార్ఖండ్లోని జంషెడ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో తొగాడియా మాట్లాడుతూ.. ట్రంప్ను ప్రశంసించారు. అఫ్ఘానిస్థాన్లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల రహస్య స్థావరాలపై ట్రంప్ బాంబు వేయించారని చెప్పారు. గూఢచర్యం కేసులో పాక్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న జాదవ్ను విడిపించేందుకు భారత్ కూడా ఇలాంటి దాడి చేయాలని వ్యాఖ్యానించారు. 'వాషింగ్టన్కు 10 వేల కిలో మీటర్లకు పైగా దూరంలో ఉన్న అఫ్ఘాన్లోని ఐఎస్ స్థావరాలపై అమెరికా బాంబు వేసింది. భారత ప్రభుత్వం కూడా పాకిస్థాన్పై బాంబు వేసి ఇలాగే ప్రతీకారం తీర్చుకోవాలి. న్యూఢిల్లీకి పాకిస్థాన్ కేవలం 800 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అలాగే భద్రత దళాలపై దాడులు చేస్తున్న ఉగ్రవాదులనే ఏరివేయాలి. కశ్మీర్లో పౌరులకు, భద్రత దళాలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందించాలి' అని తొగాడియా అన్నారు. -
సిరియాలో ఏం జరుగుతోంది?
ఓ పక్క అంతర్యుద్ధం, మరో పక్క ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాదుల ఆగడాలు, అన్నిటికీ మించి దాదాపు 17 ఏళ్లుగా బాత్పార్టీ నేత బషారల్ అసద్ నియంతృత్వ పాలనలో మగ్గుతున్న సిరియాలో సంక్షోభం గురువారం అమెరికా విమాన దాడులతో మరింత తీవ్రమయింది. ఇద్లీబ్ పట్టణంపై మంగళవారం జరిగిన సారిన్ విషవాయువు దాడికి తీవ్రంగా స్పందిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలపై అమెరికా సేనలు తొలిసారి సిరియాపై ప్రత్యక్ష దాడిచేశాయి. అసద్ దళాలు రసాయన దాడి చేయడానికి ఉపయోగించాయని భావిస్తున్న వైమానిక స్థావరంపై 59 అమెరికా క్షిపణుల వర్షం కురిపించాయి. విషవాయువు దాడి ఎవరు చేశారో దర్యాప్తు జరిపించాలని రష్యా ఐరాసలో ప్రయత్నం చేస్తుండగానే, అమెరికా ఎప్పటిలా అసద్నే దోషిగా చేసి దాడులు జరిపించింది. తిరుగుబాటుదారులే సారిన్ వాయువును జనంపై ప్రయోగించి, అసద్ సర్కారుకు ఆ పాపం అంటేలా చేశారని రష్యా భావిస్తోంది. ఎందుకీ అంతర్గత పోరు? 2010 చివర్లో ఈజిప్ట్ సహా అరబ్ దేశాల్లో నియంతల పాలనపై ఆరబ్ స్ప్రింగ్ పేరిట ఆరంభమైన తిరుగుబాట్లు సిరియాలోనూ ప్రజలను అసద్ సర్కారుపై పోరాటానికి పురికొల్పాయి. 2011 మార్చిలో దేరా పట్టణంలో మొదలైన ఘర్షణలు 2012 నాటికి ప్రాచీన నగరం అలెప్పో, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించి, అప్పటి నుంచి ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తూనే ఉన్నాయి. యుద్ధం ఎవరు ప్రారంభించారు? అప్పటికి(2011) 40 ఏళ్లుగా సోషలిస్ట్ బాత్ పార్టీ పేరిట సాగుతున్న అసద్ కుటుంబపాలనలో అవినీతి, అణచివేత అదుపు తప్పాయి. ఫలితంగా దేరాలో జరిగిన ప్రజాప్రదర్శనను సర్కారు ఉక్కుపాదంతో అణచివేసింది. దీంతో తిరుగుబాటుదారులకు ప్రవాసంలో ఉన్న అసద్ వ్యతిరేకులందరూ మద్దతు అందించారు. ఎవరెవరిపై పోరాడుతున్నారు? అధ్యక్షుడు అసద్ సేనలు తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్న తిరుగుబాటుదారులు, ఇస్లాం పేరిట దారుణాలకు పాల్పడుతున్న ఐసిస్ దళాలతో పోరుసాగిస్తున్నాయి. తిరుగుబాటుదారులపై యుద్ధంలో అసద్ సైన్యం ఎందుకు విజయం సాధించలేకపోతోంది? దీనికి ప్రధాన కారణం ఇతర దేశాలు, గ్రూపుల జోక్యమే. అసద్ షియా కావడంతో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వానికి షియా మెజారిటీ ఇరాన్తోపాటు, ప్రచ్ఛన్నయుద్ధకాలం నాటి సంబంధాల కారణంగా రష్యా సాయం చేస్తున్నాయి. అమెరికా, సౌదీఅరేబియాలు సున్నీ తిరుగుబాటుదారులకు అన్ని విధాలా తోడ్పడుతున్నాయి. అంతర్యుద్ధంలో జరిగిన నష్టమెంత? ఒక్క అలెప్పో నగరంలోనే మూడు నుంచి దాదాపు ఐదు లక్షల మంది ఈ అంతర్గత పోరులో ప్రాణాలు కోల్పోయారు. హింస ఎంతగా పెరిగిందంటే 2015 ఆగస్టులో ఇక్కడ మృతులను ఐక్యరాజ్య సమితి లెక్కించడం మానేసింది. దేశం నుంచి దాదాపు అర కోటి మంది పొరుగున ఉన్న టర్కీ, జోర్డాన్, లెబనాన్తో పాటు పశ్చిమ ఐరోపా దేశాలకు పారిపోయారు. దాదాపు 65 లక్షల మంది ప్రజలు ఈ అంతర్యుద్ధం కారణంగా తమ ఊళ్లను వదిలి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇతర ప్రాంతాలకు చెల్లాచెదురయ్యారు. ప్రత్యర్థులను మట్టుపెట్టడానికి అసద్ తన దళాలతో రసాయన ఆయుధాలు ప్రయోగించడమేగాక, వీధుల్లో మూకుమ్మడి హత్యాంకాడలకు తెగబడ్డాడని అమెరికా ఆరోపించింది. సిరియాలో హింస ఎంత క్రూరంగా కనిపిస్తోంది? తిరుగుబాటుదారుల చేతుల్లో ఉన్న ప్రధాన నగరం అలెప్పోను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి డిసెంబర్లో అసద్ ప్రభుత్వ దళాలు భారీ స్థాయిలో దాడులు జరిపాయి. ఈ మెరుపు దాడుల్లో 82 మంది పౌరులు మరణించారు. తిరుగుబాటుదారుల చివరి స్థావరంగా మిగిలిన తూర్పు అలెప్పోలో కేవలం అయిదు శాతం ప్రాంతం మాత్రమే వారి అధీనంలో ఉన్నాగాని ప్రజలను భయభ్రాంతులను చేయడానికి ప్రభుత్వ అనుకూల దళాలు ప్రజలపై దారుణాలకు పాల్పడ్డాయని ఐరాస ప్రధానకార్యదర్శి బాన్కీ మూన్ చెప్పారు. ప్రచ్ఛన్నయుద్ధం అవశేషాలే సిరియా మంటలకు కారణమా? ప్రచ్ఛన్నయుద్దకాలంలో అసద్ కుటుంబం అప్పటి సోవియెట్ యూనియన్కు మద్దతుదారుగా మారింది. అసద్ కుటుంబం షియా ఆలవైత్ తెగకు చెందినది కావడం, అమెరికాతో వైరం ఇరాన్ను సిరియాకు దగ్గరయ్యేలా చేసింది. సోవియెట్ యూనియన్ విచ్ఛన్నమయ్యాక కూడా అమెరికా అసద్ సర్కారుకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులకు సాయమందిస్తూనే ఉంది. ఫలితంగా రష్యాకు అసద్ సర్కారు మరింది చేరువయింది. ఏకైక అగ్రరాజ్యం అమెరికా, మాజీ అగ్రరాజ్యం వారసురాలు రష్యాల మధ్య ఇంకా కొనసాగుతున్న పోటీ కూడా సిరియా మంటలకు ఆజ్యం పోస్తోంది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
పునాదిలో భారీ బాంబు.. గుండెల్లో దడదడ
లండన్: బ్రిటన్లో ఓ భారీ బాంబు బయటపడింది. ఓ ఇంటి నిర్మాణంకోసం తవ్వకాలు జరుపుతుండగా పునాదులు అడుగున రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఫిరంగిగుండులాంటి 500 పౌండ్ల బరువున్న బాంబు కనిపించింది. సరిగ్గా వాయవ్య లండన్లోని బ్రెంట్ ప్రాంతంలో బ్రాండెస్బరి పార్క్ ప్రాంతంలోని ఈ బాంబు బయటపడింది. దీంతో అక్కడ ఉన్నవారందరికి ఒక్కసారిగా గుండెలు ఆగిపోయినంత పనైంది. ఈ విషయం తెలిసి వెంటనే అక్కడికి పోలీసులు, బాంబు నిర్వీర్య దళం, సైనికులు వచ్చారు. ఆ ప్రాంతలో రెండు పాఠశాలలు ఖాళీ చేయించారు. పలువురు స్వచ్ఛందంగా తమ నివాసాలను వదిలి దూరంగా వెళ్లిపోయారు. దాదాపు 200 మీటర్ల దూరం ప్రత్యేక భద్రతను ఏర్పాటుచేసి ఎవరిని ఆ చుట్టుపక్కలకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారి మాట్లాడుతూ ముందుగా ఆ ప్రాంత వాసులకు ధన్యవాదాలు తెలిపారు. బాంబును గుర్తించి వెంటనే తమకు సమాచారం ఇచ్చారని, స్వచ్ఛందంగా తమ ఇళ్లను వదిలివెళ్లి బాంబు నిర్వీర్య దళానికి సహాయం చేస్తున్నారని చెప్పారు. ఎవరికీ ఎలాంటి హానీ జరగకుండా తీవ్రంగా శ్రమిస్తున్నామని తెలిపారు. అది కచ్చితంగా రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబే నని దానిని చూస్తేనే సామాన్యులకు గుండెల్లో భయం పుడుతోందని, ఎలాంటి విస్ఫోటనం జరగకుండా తగిన విధంగా నిర్వీర్యానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు. -
ప్రధాని పర్యటనకు ముందు బాంబు స్వాధీనం
ఇంఫాల్: ఎన్నికల ప్రచారం కోసం మణిపూర్లో నేడు ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఒక హ్యాండ్ గ్రెనేడ్, బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మణిపూర్లో ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా ఆరు రెబల్ గ్రూపులకు సంబంధించిన అత్యున్నత కమిటీ నేడు పూర్తిస్థాయి రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ర్యాలీ చేపట్టే పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని లాంజింగ్ అచౌబా మైదానానికి 9 కిలోమీటర్ల దూరంలోని బీజేపీ అభ్యర్థి సుభచంద్ర నివాసానికి దగ్గరలో ఒక చైనీస్ హ్యాండ్ గ్రెనేడ్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే తోబాల్ జిల్లాలో మరో బీజేపీ కార్యకర్త నివాసానికి సమీపంలో మరో బాంబును గుర్తించారు. -
బాంబు భయానికి 70 వేల మంది ఖాళీ
తెస్సాలోనికి: గ్రీసులో బయటపడిన రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి బాంబును నిర్వీర్యం చేయడానికి తెస్సాలోనికి అనే పట్టణం నుంచి సుమారు 70 వేల మందిని వేరే ప్రాంతాలకు తరలించే ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. 250 కిలోలున్న ఈ బాంబును గత వారం రోడ్డు పనుల సందర్భంగా గుర్తించారు. తొలుత 20 అంబులెన్స్ లలో 300 మంది వికలాంగులను, రోగులను తరలించారు. బాంబు ఉన్న ప్రదేశానికి 1.9 కి.మీ పరిధిలో ఉన్న ప్రజలందరినీ ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల కల్లా తరలించాల్సి ఉంది. గ్రీస్లో జన సమ్మర్థ ప్రాంతాల్లో ఇంతకు ముందెప్పుడూ ఇంత పెద్ద బాంబును గుర్తించలేదని, అందుకే ప్రజల తరలింపు తప్పట్లేదని ఓ అధికారి తెలిపారు. బాంబును నిర్వీర్యం చేయడానికి సుమారు 8 గంటలు పట్టొచ్చని మిలిటరీ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం వేల సంఖ్యలో పోలీసులను రంగంలోకి దించారు. -
పొరపాటున బాంబేశారు..100 మంది మృతి
నైజీరియా: ఉగ్రవాదులపై వేయాల్సిన బాంబును పొరపాటున శరణార్థుల శిబిరంపై వేయడంతో 100 మందికి పైగా మృతి చెందిన ఘటన నైజీరియాలో చోటు చేసుకుంది. కామెరూన్ సరిహద్దు సమీపంలోని రాన్ ప్రాంతంలో.. బోకోహారమ్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతున్న ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ విమానం శరణార్థుల శిబిరంపై బాంబు జారవీడిచినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను నైజీరియా మిలిటరీ కమాండర్ మేజర్ జనరల్ లక్కీ ఇరాబొర్ ధృవీకరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారిని బోర్నో స్టేట్ గవర్నమెంట్ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాధితుల్లో శరణార్థులతో పాటు శిబిరంలో సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేషన్స్ వితౌట్ బార్డర్స్, రెడ్ క్రాస్ సంస్థల సిబ్బంది ఉన్నట్లు సమాచారం. -
కేరళ కోర్టు ఆవరణలో పేలుడు కలకలం
-
కేరళ కోర్టు ఆవరణలో పేలుడు కలకలం
తిరువనంతపురం: కేరళ మలప్పురం కోర్టు ఆవరణలో మంగళవారం పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోర్టు ఆవరణలో పార్క్ చేసి ఉన్న కారులో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో మూడు వాహనాలు ధ్వంసం కాగా, ఒకరు గాయపడ్డారు. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని స్థానికులు, పోలీసులు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో సోదాలు చేపట్టారు. దుండగులు ప్రెషర్ కుక్కర్ బాంబును అమర్చి పేల్చినట్టు పోలీసులు గుర్తించారు. కారు యజమాని హోమియో డీఎంవోదిగా గుర్తించారు. అలాగే ఘటనా స్థలంలో కరుడుకట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఫోటోను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉద్యోగం కోసం కోర్టులో బాంబు పెట్టాడు!
అలహాబాద్: స్థిరత్వంలేని ఉద్యోగంతో విరక్తి చెందిన యువకుడు... శాశ్వత కొలువు పట్టేయాలని వేసిన ప్రణాళిక బెడిసికొట్టి జైలు పాలయ్యాడు. అలహాబాద్ హైకోర్టులో చిన్నాచితకా పనులు చేస్తున్న సంతోష్ కుమార్ అగ్ర హారి(38) కోర్టు ప్రాంగణంలో బాంబులతో నిండిన సంచిని పెట్టి తర్వాత అతనే దాన్ని గుర్తించినట్లు అందరినీ అప్రమత్తం చేశాడు. ఎందుకంటే అతని జాగ్రత్తకు బహుమతిగా ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాడు. ఈ దెబ్బకు కోర్టు పరిసరాల్లో శుక్రవారం కలకలం రేగింది. కానీ అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలించాక అసలు విషయం బయటపడింది. గురువారం రాత్రి సీసీటీవీ దృశ్యాల్లో అగ్రహారి కదలికలు అనుమానస్పదంగా కనిపించాయి. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా బాంబులున్న ప్లాస్టిక్ సంచిని అక్కడ పెట్టింది తనేనని అంగీకరించాడు. ఉద్యోగం ఆశతోనే అలా చేసినట్టు చెప్పాడు. -
బ్రసెల్స్లో బాంబు దాడి కలకలం
బ్రసెల్స్: బెల్జియం రాజధాని బ్రసెల్స్లో బాంబు దాడి కలకలం సృష్టించింది. బ్రసెల్స్ ఉత్తర ప్రాంతంలోని 'బ్రసెల్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ'ని లక్ష్యంగా చేసుకొని దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. అయితే ఆ సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సోమవారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో దుండగుల కారు రోడ్డుపై ఏర్పాటు చేసిన అడ్డంకులను దాటుకొని ఇనిస్టిట్యూట్లోకి ప్రవేశించిందని అధికారులు వెల్లడించారు. వారు నేరుగా క్రిమినాలజీ ఇనిస్టిట్యూట్ లాబొరేటరీపైకి బాంబులు విసరడంతో అక్కడ మంటలు చెలరేగాయి. ఘటనలో ఎంతమంది వ్యక్తులు పాల్గొన్నారన్న విషయం తెలియరాలేదు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది ఉగ్రవాదుల చర్యనా లేక మరెవరైన ఈ దాడికి పాల్పడి ఉంటారా అన్న కోణంలో విచారణ జరుతుతున్నారు. -
జర్మనీలో మరో ఉగ్రదాడి
బెర్లిన్: జర్మనీలో మరోసారి ఉగ్రదాడి కలకలం సృష్టించింది. బెర్లిన్లో సిరియా శరణార్థి ఒకరు బాంబు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన వ్యక్తి(27) మృతి చెందాడు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ బార్ ప్రాంగణంలో జరుగుతున్న పాప్ మ్యూజిక్ ఫెస్టివల్ను లక్ష్యంగా చేసుకొని ఈ బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 10 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాంబు పేలుడు జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై మ్యూజిక్ ఫెస్టివల్ లో పాల్గొన్న 2,500 మందిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. దక్షిణ జర్మనీలోని బవేరియా రాష్ట్రంలో వారం రోజుల వ్యవధిలో జరిగిన మూడో దాడి ఇది. ఈ దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగిందని జర్మనీ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిథి మైఖెల్ సిఫెనర్ వెల్లడించారు. మ్యూనిక్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందగా.. రైలులో ప్రయాణికులపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడిచేసిన ఘటనలో పలువురు గాయపడిన ఘటనలు ఇటీవల జర్మనీలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. -
‘ట్వెల్త్’లోనే ఫస్ట్ బాంబ్!
*పాఠశాల రసాయనాలతో తయారు చేసిన ఆఫ్రిదీ * ఎనిమిదేళ్ల కాలంలో నాలుగు రాష్ట్రాల్లో మకాం *ఒక్కోచోట ఒక్కో వత్తిలో కొనసాగిన వైనం * రెండుసార్లు హైదరాబాద్కు రాకపోకలు సాక్షి: దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ‘జుందుల్ అల్ ఖలీఫా ఏ హింద్’ సంస్థ ఫైనాన్స్ చీఫ్, నగరంలోని టోలిచౌకికి చెందిన నఫీజ్ఖాన్ను ‘గురువు’గా వ్యవహరించిన ఆలమ్ జెబ్ ఆఫ్రిదీ మహా ముదరని నిఘా వర్గాలు చెప్తున్నాయి. 2008 నాటి అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో అక్కడి క్రై మ్ బ్రాంచ్ పోలీసులు ఆఫ్రిదీని గత నెల కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే తొలి బాంబు తయారీ నుంచి ఎనిమిదేళ్ల తన ‘ప్రస్థానం’లో వేసిన ‘వేషాల’ వరకు అన్నీ బయటపెట్టాడు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న జోహాపుర న్యూ ఆషియానా పార్క్కు చెందిన ఆలమ్ జెబ్ అఫ్రిదీ అక్కడి వెజల్పూర్లోని ద రేన్ స్కూల్లో 11-12 తరగతులు చదివాడు. ట్వెల్త్ క్లాస్లో ఉండగా స్కూల్ కెమిస్ట్రీ లాబొరేటరీ నుంచి కొన్ని రసాయనాలు తస్కరించాడు. వీటితో పాటు అగ్గిపుల్లలకు ఉండే పచ్చభాస్వరం ఉపయోగించి అప్పట్లోనే ఓ బాంబు తయారు చేసి, జోహాపురలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి పేల్చడం ద్వారా పరీక్షించానని క్రై మ్బ్రాంచి విచారణలో అఫ్రిదీ వెల్లడించాడు. నాలుగు వత్తుల్లోనూ సక్సెస్... నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ద్వారా ఉగ్రవాద బాట పట్టిన ఆఫ్రిదీ ఆపై ఇండియన్ ముజాహిదీన్లో (ఐఎం) కీలకపాత్ర పోషించాడు. 2008 జూలై 26న అహ్మదాబాద్లోని డైమండ్ మార్కెట్లో పేలుడుకు పాల్పడే సమయానికి ఆఫ్రిదీ అక్కడి ఓ ఆస్పత్రిలో టెలిఫోన్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. ఈ విధ్వంసం తర్వాత ఫారూఖాబాద్లోని తన స్నేహితుడి ఇంట్లో ఎక్స్-రే టెక్నీషియన్గా తలదాచుకున్నాడు. అదే ఏడాది సెప్టెంబర్లో ఐఎం మాడ్యుల్ గుట్టురట్టు కావడంతో అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్కు పారిపోయింది. కాన్పూర్లో ఇసుక కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. అక్కడ ఎక్కువ రోజులు ఉండటం సేఫ్కాదని మహారాష్ట్రలోని అమ్రావతికి వెళ్లి సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. ఆపై హర్యానాకు వెళ్లిన ఆఫ్రిదీ షాజహాన్పూర్లోని ఓ హైవే దాబాలో పని చేశాడు. మళ్లీ ఉత్తరప్రదేశ్కు వెళ్లి... మేవాట్ ప్రాంతంలోని స్వీట్షాప్లో కార్మికుడిగా చేరాడు. ఆ సమయంలో బెంగళూరుకు చెందిన కొందరితో పరిచయం ఏర్పడి.. తన మకాం కర్ణాటకకు మార్చాడు. బెంగళూరులోని వినాయకనగర్లో మహ్మద్ రఫీఖ్ పేరుతో ఏసీ మెకానిక్గా మారాడు. చెయ్యేస్తే ఏసీ పని చేయాల్సిందే... పరప్పన అగ్రహార ప్రాంతంలోని ఓ ఏసీ సర్వీస్ సెంటర్లో ఆఫ్రిదీ ఏసీ మెకానిక్గా చేరాడు. ఆరు నెలలకు ‘ఉద్యోగానికి రాజీనామా’ చేసి సొంతంగా పని ప్రారంభించాడు. దీంతో పాత యజమాని కై ్లంట్స్ అంతా ఇతడి వద్దకు వచ్చేవారు. దీంతో తన వ్యాపారం దెబ్బతినడంతో పాతయజమాని 2013లో పది మంది కిరాయి మనుషులతో అఫ్రిదీని కొట్టించాడు. దీంతో అఫ్రిదీ పోలీసులకు ఫిర్యాదు చేసి వారందరినీ అరెస్టు చేయించాడు. 2015లో బెంగళూరులోని ఎంబీ రోడ్లోని ఇజ్రాయిల్ వీసా సెంటర్కు నిప్పుపెట్టాడు. పోలీసులకు చిక్కుతాననే భయంతో సిరియా వెళ్లి ఐసిస్లో చేరేందుకు సోషల్ మీడియా ద్వారా సంప్రదింపులు జరిపాడు. రెండుసార్లు నగరానికీ ‘టూర్’.... సిరియా కేంద్రంగా ఐసిస్కు ఇండియా చీఫ్గా వ్యవహరిస్తున్న షఫీ ఆర్మర్కు సన్నిహితుడిగా మారాడు. సిరియా వచ్చే ముందు ‘జుందుల్’ మాడ్యుల్కు శిక్షణ ఇవ్వాల్సిందిగా అతడు చెప్పడంతో సోషల్మీడియా ద్వారానే నగరానికి చెందిన నఫీస్ ఖాన్ను సంప్రదించాడు. తొలిసారిగా గతేడాది టోలిచౌకి వచ్చి అతడిని కలిసి వెళ్లాడు. ఆ సమయంలో ఉగ్రవాదుల రిక్రూట్మెంట్, శిక్షణ, లావాదేవీలు తదితర అంశాలను చర్చించాడు. విధ్వంసాలకు అవసరమైన బాంబుల్ని తయారు చేసే ప్రయత్నాల్లో భాగంగా నఫీస్ ఖాన్ ‘స్థానిక పదార్థాల’తోనే నాలుగు బకెట్ బాంబుల్ని రూపొందించాడు. ఇవి పేలడానికి అవసరమైన డిటోనేటర్లును తయారు చేయడం మాత్రం ఇతడి వల్లకాలేదు. దీంతో నఫీస్ బాంబుల తయారీలో నిష్ణాతుడైన అఫ్రిదీ సహాయం కోరాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరిలో మరోసారి హైదరాబాద్ వచ్చిన అఫ్రిదీ... రసాయనాలు వినియోగించి డిటోనేటర్లు ఎలా తయారు చేయాలనే అంశాన్ని ‘బోధించి’ వెళ్లాడు. ఈ ప్రయత్నాలు కార్యరూపంలోకి రాకముందే ‘జుందుల్’ మాడ్యుల్తో పాటు అఫ్రిది సైతం చిక్కాడు. -
తాడేపల్లిగూడెంలో బాంబు కలకలం
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో మంగళవారం ఉదయం బాంబు కలకలం రేగింది. స్టేషన్లో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ప్రయాణికుల వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇస్తాంబుల్ దాడి సూత్రధారులు వారే..
టర్కీ పేలుళ్ళ సూత్రధారులను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఎయిర్ పోర్టులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డవారుగా భావిస్తున్నవారి ఫోటోలను స్థానిక మీడియా వెల్లడించింది. రైఫిళ్ళు చేత పట్టుకొని ముగ్గురు దుండగులు దాడులకు తెగబడినట్లుగా ఫోటోలనుబట్టి తెలుస్తోంది. పర్యాటక నగరం ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రక్తపాతం సృష్టించిన ఉగ్రవాదులను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. తుపాకులు, బాంబులతో మారణహోమానికి తెగబడి, 41 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. ఉన్మాదుల దాడిలో 230 మంది వరకూ తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఈ దాడులు ఇస్లామిక్ స్టేట్ పనేనని టర్కీ ప్రధాని బినాలీ ఇల్ డ్రిం అంటున్నారు. మృతుల్లో ఐదుగురు సౌదీకి చెందినవారు, ఇద్దరు ఇరాక్ దేశస్థులు, ఇంకా జోర్దాన్, టునీషియా, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, ఉక్రెయిన్ లకు చెందిన 13 మంది విదేశీయులున్నారు. ప్రస్తుతం విడుదలైన వీడియోలను బట్టి చూస్తే దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ముగ్గురు, కాల్పులు జరిపిన అనంతరం తమను తాము రైఫిళ్ళతో పేల్చేసుకున్నట్లు తెలుస్తోంది. గత మార్చిలో బ్రసెల్స్ లో కూడా ఇదే తరహాలో జరిగిన దాడుల్లో 32 మంది మరణించారు. అయితే ప్రస్తుత దాడుల్లో ఉగ్రవాదులెవరూ ఎయిర్ పోర్టు ప్రధాన ద్వారం నుంచీ ప్రవేశించలేదు. ముందుగా ఓ వ్యక్తి టర్మినల్ కు బయటే తనను తాను పేల్చేసుకోగా.. సందట్లో సడేమియాగా మిగిలిన ఇద్దరూ ఎయిర్ పోర్టు భవనంలోకి ప్రవేశించినట్లు తెలిసింది. బిల్డింగ్ దగ్గరకు నడుచుకుంటూ వెడుతున్నటెర్రరిస్టు, మరో ఫోటోలో నల్లని డ్రస్ ధరించి రైఫిల్ చేత పట్టుకొని కాల్పులు జరుపుతున్న దృశ్యాలు బయటపడటంతో పోలీసులు ఆ ఫుటేజీని విడుదల చేశారు. -
బాంబుపేలి గిరిజనులకు గాయాలు
♦ కూంబింగ్ పార్టీలు.. పోలీసులే లక్ష్యమా? ♦ భయం గుప్పిట్లో ఏజెన్సీ గ్రామాలు వెంకటాపురం: ఏజెన్సీలో బాంబు పేలింది. విజయపురి కాలనీ సమీపంలోని కొత్తపల్లి వెళ్లే ఆర్అండ్బీ ప్రధాన రహదారి పక్కన బుధవారం ప్రెషర్బాంబు పేలి ఇద్దరు గిరిజనులకు గాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మురుదొండ గ్రామానికి చెందిన తెల్లం రమేష్, తెల్లం సురేష్, పోడియం రాధ రెండు రోజుల క్రితం చర్ల మండలం క్రాంతిపురంలోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. బుధవారం ఉదయం ద్విచక్రవాహనంపై కాంతిపురం నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. విజయపురి కాలనీ సమీపంలోని కొత్తపల్లి వెళ్లే రహదారి పక్కన మూత్రం పోసుకునేందుకు ద్విచక్రవాహనాన్ని ఆపారు. మూత్రం పోసుకునేందుకు వెళ్తూ రోడ్డుపక్కన మట్టిలో ఉన్న కర్రను పీకారు. ఒక్కసారిగా బాంబు పేలి తెల్లం రమేష్ తల, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. పక్కనే ఉన్న పోడియం రాధకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఎదిర ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో 108 భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. టార్గెట్ ఎవరు? కూంబింగ్ పార్టీలు, పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు రోడ్డు పక్కన బాంబులను ఏర్పాటు చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ బలగాలు ఈ రహదారుల మీదుగానే కూంబింగ్ వెళ్తుంటారు. వారిని మట్టుబెట్టేందుకే రహదారికి ఇరువైపులా బాంబులు ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నారు. బాంబుపేలిన ప్రాంతంలోనే ఇటీవల మావోయిస్టులు వాల్పోస్టర్లు సైతం వేశారు. ఏజెన్సీలో భయం..భయం చాలా కాలం తర్వాత మావోలు పోస్టర్లు వేయడం, బాంబులు పేలడం వంటి ఘటనలు చోటుచేసుకోవడంతో గిరిజన గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. మావోలు, పోలీసుల నడుమ ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు. -
‘బాంబు బ్లాస్ట్’కు తొమ్మిదేళ్లు
ఘటన అనంతరం మక్కా మసీదులో భద్రత పెంపు 23 కెమెరాలు ఏర్పాటు... {పస్తుతం పని చేయని 18 కెమెరాలు పట్టించుకోని అధికారులు చార్మినార్: మే 18వ తేదీ వస్తుందంటే చాలు పాతబస్తీ ప్రజలు ఆనాటి ఛేదు జ్ఞాపకాల నుంచి తేరుకోలేకపోతున్నారు. 2007 మే 18వ తేదీ వుధ్యాహ్నం 1.18 గంటలకు జరిగిన బాంబు పేలుడు ఘటన ఈ ఏడాదితో తొమ్మిదేళ్లు పూర్తికావస్తోంది. ఆనాటి విషాదకర ఘటనలు గుర్తుకొచ్చి బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. బాంబు పేలుడు తదనంతరం జరిగిన పోలీసు కాల్పుల్లో వుృతి చెందిన తమ కుటుంబ సభ్యులకు తీరని నష్టం జరిగిందని వాపో తున్నారు. మక్కా వుసీదులో రౌండ్ ది క్లాక్ భద్రత... 2007 మే 18న జరిగిన బాంబు పేలుడు అనంతరం మక్కా మసీదులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక్కడ భద్రతను పర్యవేక్షించడానికి మూడు షిప్టులలో 18 వుంది హోంగార్డులను ప్రభుత్వం నియుమించింది. వీరు రౌండ్ ది క్లాక్ విధుల్లో ఉంటున్నారు. అలాగే, ప్రధాన ద్వారం వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. విద్రోహశక్తులు, అనుమానితులు ప్రవేశాన్ని పసిగట్టేందుకు మసీదు ఆవరణ, కొలను, లైబ్రరీతో పాటు ప్రార్థనాలయం ప్రధాన హాలు, కార్యాలయం వద్ద నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. పని చేయని 18 సీసీ కెమెరాలు.... బాంబు పేలుడు ఘటన అనంతరం మక్కా మసీదులో ఏర్పాటు చేసిన 23 సీసీ కెమెరాలు, స్టాటిక్ కెమెరాలలో ప్రస్తుతం కేవలం 5 మాత్రమే పని చేస్తున్నాయి. ఆరు నెలలుగా 18 కెమెరాలు పని చేయడం లేదు. నిరసన సభలకు అనుమతి లేదు .. మక్కా వుసీదు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నాం. దక్షిణ మండలంలోని నలుగురు ఏసీపీలు, 18 పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు ఇతర పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. పాతబస్తీలో ఎక్కడ నిరసన సభలు, ర్యాలీలు నిర్వహించుకోవడానికి ఎవరికీ ఎటువంటి అనువుతులు ఇవ్వడం లేదు. - వి.సత్యనారాయణ, దక్షిణ వుండలం డీసీపీ -
బాంబు బూచి చూపి స్కూలు ఎగ్గొట్టారు...
ఘజియాబాద్: క్లాసులు ఎగ్గొట్టేందుకు నలుగురు విద్యార్థులు చేసిన తుంటరి పనికి పోలీసులు, ఉన్నతాధికారులు కంగుతిన్నారు. స్కూల్లో బాంబులు ఉన్నాయంటూ పోలీసులకు కాల్ చేసి హల్ చల్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఛబ్బీల్ దాస్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్ ఫస్టియర్ చదివే విద్యార్థులు బుధవారం క్లాసులు ఎగ్గొట్టాలని ప్లాన్ వేశారు. అందులో భాగంగానే ఓ విద్యార్థి వద్ద ఉన్న చైనా వాచ్ లో సిమ్ కార్డ్ వేసి, బాంబు ఉందంటూ పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో వారు హుటాహుటిన స్కూలుకు చేరుకున్నారు. స్కూలు నుంచి అందర్నీ పంపించేసి ఇన్వెస్టిగేషన్ చాలా వేగంగా చేయగా అసలు విషయం బయటపడింది. అందరితో పాటు ఈ విద్యార్థులు కూడా ఇంటికి వెళ్లిపోయారు. అయితే, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి తమకు కాల్ వచ్చినట్లు గుర్తించారు. పోలీసులు ఎలాగోలా ప్రయత్నించి కాల్ చేసిన నలుగురు విద్యార్థులను గుర్తించారు. ఇంటికి వెళ్లిపోవడానికి ఈ పని చేసినట్లు విద్యార్థులు అంగీకరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాధేయపడటంతో విద్యార్థులకు కౌన్సెలింగ్ తో కూడిన వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. మరోసారి ఇలాంటి పనులు చేయవద్దంటూ గట్టిగా మందలించి వారి తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చేశారు. -
జెట్ ఎయిర్వేస్ విమానానికి బాంబు బెదిరింపు
అహ్మదాబాద్: బాంబు బెదిరింపు కారణంగా ముంబై బయల్దేరాల్సిన జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని నిలిపివేశారు. అహ్మదాబాద్ నుంచి జెట్ ఎయిర్వేస్ విమానం బుధవారం ముంబై బయలుదేరాల్సి ఉంది. అయితే బాంబు బెదిరింపు కారణంగా విమానాన్ని నిలిపి వేసి తనిఖీలు చేస్తున్నారు. బాంబు బెదిరింపు సమాచారంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. -
77 ఏళ్ల తర్వాత..
వియన్నా: రెండో ప్రపంచ యుద్ధంలో వేసిన 250 కిలోల బాంబును ఆస్ట్రియాలోని డోయేబ్లింగ్ జిల్లాలో దొరికింది. 1939 సెప్టెంబర్ 1 నుంచి 1945 సెప్టెంబర్ 2 వరకు జరిగిన ఈ యుద్ధంలో ఈ భారీ బాంబు వేసినా పేలకుండా ఉండిపోయింది. ఇటీవల భవన నిర్మాణం కోసం తీస్తున్న పునాదిలో 2.5 మీటర్ల లోతు వద్ద ఈ బాంబు వర్కర్ల కంట పడింది. బాంబ్ స్క్వాడ్ వెంటనే రంగంలోకి దిగి బాంబు ఉన్న ప్రదేశం చుట్టూ 300 నుంచి 400 మీటర్ల దూరాన్ని బ్లాక్ చేశారు. బాంబు దొరికిన ప్రదేశానికి రైల్వే ట్రాక్ చేరువలో ఉండటంతో రవాణ వ్యవస్థను నిలిపివేశారు. మొదట ఈ బాంబును యూఎస్కు చెందినది భావించిన స్క్వాడ్.. దాన్ని అక్కడే నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించింది. కానీ, బాంబును సురక్షితంగా తరలించేందుకు వీలు కుదరడంతో అక్కడి నుంచి తరలించి రైల్వే వ్యవస్థను పునరుద్ధరించారు. -
మదనపల్లెలో పేలుడు
♦ ఇంటిగోడ కూలి వృద్ధుడి మృతి ♦ బాంబు పేలుడువల్ల కూలిపోయిందంటున్న స్థానికులు ♦ సెల్ ఫోన్ పేలడంవల్లేనంటున్న పోలీసులు మదనపల్లె క్రైం: ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఒక ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం పేలుడు సంభవించి ఇంటి గోడ రెండువైపులా కూలి ఓ వ్యక్తి మృతిచెందాడు. భారీగా పొగ వచ్చి మంటలు వ్యాపించడంతో స్థానికులు భయకంపితులయ్యారు. గౌనిమాకులపల్లె సుబ్రమణ్యం (60) మదనపల్లె పట్టణంలోని చీకులగుట్ట గౌతమినగర్లో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. అతనికి భార్య చిన్నమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమారులు అందరికీ పెళ్లిళ్లు కావడం తో పక్కపక్క ఇళ్లలోనే వేర్వేరుగా ఉంటున్నారు. చిన్నకుమారుడు మంజుబాబు నాలుగేళ్ల క్రితం మృతిచెందడంతో కోడలు అన్నపూర్ణ తన ఇం టిలో ఒక్కావిడే ఉంటోంది. సుబ్రమణ్యం, అతని భార్య చిన్నమ్మ గొర్రెలు మేపుకుంటున్నారు. సుబ్రమణ్యం ఆదివారం మధ్యాహ్నం ఇంటి పక్క ఉన్న గొర్రెల మందలో చెత్త ఊడ్చేందుకు వెళ్లా డు. ఆ సమయంలో అన్నపూర్ణ ఉంటున్న ఇంటి లో భారీ పేలుడు సంభవించింది. దాని ధాటికి ఇంటి రెండువైపుల గోడలు కూలిపోయి ఆ సమయంలో ఆ పక్క నుంచి వెళుతున్న సుబ్రమణ్యంపై పడ్డాయి. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. భారీగా పొగవచ్చి, మంటలు వ్యాపించడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు, 108 సిబ్బంది, టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గోడల కింద ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడు మాంత్రికుడు కావడంతో గిట్టని వారు బాంబు వేయడం వల్ల చనిపోయి ఉంటాడని స్థానికులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. సెల్ఫోన్ పేలడం వల్లే ఈ సంఘటన జరిగిందని టూటౌన్ సీఐ హనుమంతునాయక్ తెలిపారు. అయితే సిమెంట్ స్లాబ్తో పది అడుగుల మందం గోడ ఉన్న ఇల్లు సెల్ఫోన్ పేలడంతో కూలిపోయిందని చెప్పడం నమ్మశక్యంగా లేదని స్థానికులు అంటున్నారు. -
అనుమానిత బ్యాగు కలకలం
భోపాల్: మధ్యప్రదేశ్లో అనుమానాస్పద బ్యాగు కలకలం రేపింది. ఉజ్జెయిన్లోని నానాఖేడా ప్రాంతంలోని ఓ హోటల్లో అనుమానిత బ్యాగును సిబ్బంది గుర్తించారు. దాని దగ్గరకు వెళ్లేందుకు అంతాభయపడటంతో వెంటనే బాంబ్ స్క్వాడ్ సిబ్బందిని పిలిపించారు. ప్రస్తుతం ఆ ప్రాంతానికి స్క్వాడ్ టీం చేరుకొని తనిఖీలు చేస్తోంది. -
ప్రయాణికులే లక్ష్యంగా పేలుడు : 15 మంది మృతి
-
జెట్ ఎయిర్వేస్ విమానానికి బాంబు బెదిరింపు
ఢిల్లీ: ఓ బాంబు బెదిరింపు కాల్ కారణంగా గోరక్ పూర్ బయల్దేరాల్సిన జెట్ ఎయిర్ వేస్ విమానం సుమారు రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. 55 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బందితో సహా ప్రయాణానికి సిద్ధంగా ఉన్న విమానాన్ని వైమానిక సంస్థ కార్యాలయానికి బాంబు బెదిరిపు కాల్ రావడంతో భద్రతా కారణాల దృష్ట్యా నిలిపివేశారు. విమానం బయల్దేరేందుకు సిద్ధంగా ఉండగా బాంబు బెదిరింపు కాల్ రావడం ఆలస్యానికి కారణమైందని, తర్వాత అది బూటకపు కాల్ అని తెలుసుకున్నట్లు ఎయిర్ లైన్స్ తెలిపింది. ఏటీ ఆర్ నిర్వహిస్తున్న జెట్ ఎయిర్ వేస్ కు చెందిన 9W-2467 విమానం ఢిల్లీనుంచి గోరక్ పూర్ కు మధ్యాహ్నం 1.30 కి బయల్దేరాల్సి ఉంది. సుమారు 12.30 సమయంలో వైమానిక సంస్థ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. బాంబు భయం ఉన్నమాట నిజమేనని తాము అధికారికంగా నిర్వహిస్తున్న ట్విట్టర్ ద్వారా తమకు తెలిసినట్లు ఢిల్లీ పోలీసులు కూడ ధృవీకరించారు. దీంతో విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన సిబ్బంది అటువంటిదేమీ లేదని నిర్థారించి విమానం బయల్దేరేందుకు ఏర్పాట్లు చేశారు. భద్రతా హెచ్చరికల మేరకు తనిఖీ ప్రక్రియ చేపట్టామని, ప్రయాణీకులకు ఎటువంటి ప్రమాదం లేదని, అంతా సురక్షితమేనని ఢిల్లీ పోలీసులు ఓ ట్వీట్లో తెలిపారు. సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత విమానం మధ్యాహ్నం 3.15 నిమిషాలకు బయల్దేరినట్లు ఎయిర్ లైన్స్ ప్రకటించింది. -
బాంబు దాడుల్లో 46 మంది మృతి
హోమ్స్: సిరియాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సెంట్రల్ సిటీ హోమ్స్లో ఆదివారం జంట కారు బాంబు డాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 46 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. వీరిలో ఎక్కువగా సాధారణ పౌరులే ఉన్నట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ వెల్లడించింది. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది. -
కరాచీ యూనివర్సిటీని ఖాళీ చేయించారు
కరాచీ: పాకిస్థాన్లోని కరాచీ విశ్వవిద్యాలయాన్ని బుధవారం అధికారులు ఖాళీ చేయించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో మూడు బాంబులున్నాయన్న సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకొని విద్యార్థులు, సిబ్బందిని యూనివర్సిటీ నుండి బయటకు పంపారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, పోలీసు సిబ్బంది బాంబులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. బాంబులున్నాయన్న వార్తలతో విద్యార్థులు, సిబ్బంది ప్రాణభయంతో యూనివర్సిటీ బయటకు పరుగులు తీశారని మీడియా సంస్థ డాన్ వెల్లడించింది. గత నెల పాక్లోని బచాఖాన్ యూనివర్సిటీపై జరిగిన ఉగ్రదాడిలో 24 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
అమ్మకానికి మార్గరెట్ థాచర్ నివాసం...!
బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ ప్యాలెస్ ను అమ్మకానికి పెట్టారు. ఆరంతస్తుల ఆ అపూర్వ భవనంలో సిబ్బంది క్వార్టర్స్, లూయిస్ ఫైర్ ప్లేస్ లు... ఓ ప్రధానమంత్రికి కావలసిన అన్నిరకాల హంగులూ ఉన్నాయి. దానికి తోడు... నీలి రాతితో మెరసి పోతున్న ఆ సౌధాన్ని.. కొనేవారి కోసం యజమానులు నిరీక్షిస్తున్నారు. మాజీ ప్రధాని చివరిగా నివసించిన ఆ భవనంలోని ప్రత్యేకతలను బట్టి... దాని ఖరీదును ముఫ్ఫై మిలియన్ల యూరోలుగా నిర్ణయించారు. లండన్ లోని 73 ఛెస్టర్ స్క్వేర్ లో ఉన్న ఆ భవంతిలో అంతకు ముందు కవి మాథ్యూ ఆర్నాల్డ్, నవలా రచయిత మేరీ షెల్లీ, 1930 కంజర్వేటివ్ ప్రధాని స్టాన్లీ బాల్డ్ విన్ నివసించారు. ఇటీవల లగ్జరీ డెవలపర్ లెకాన్ ఫీల్డ్ కొన్ని మిలియన్ పౌండ్లతో పునరుద్ధరించి, మూడేళ్ళ తర్వాత మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. ఈ భవంతిలోని ప్రధాన ద్వారాలకు థాచర్ ఇష్టంతో పొదిగించుకున్న 73 నీలి ఫలకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హాల్లోని ఫ్లోరింగ్, లాబీలకు కూడ అదేరకం రాయిని వినియోగించారు. ఇటువంటి ప్రత్యేకతలు కొనుగోలుదారులను అమితంగా ఆకట్టుకునేట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ భవనానికి ఏర్పాటు చేసిన బాంబ్ ప్రూఫ్ తలుపులు ఆ నాయకురాలి జీవితానికి గుర్తులుగా నిలుస్తున్నాయి. థాచర్ 1984 లో బ్రైటన్ హోటల్ బాంబు దాడి నుంచి తప్పించుకున్న తర్వాత బాంబ్ ఫ్రూఫ్ తలుపుల అవసరం మరింత పెరిగింది. అంతేకాదు ఈ ప్యాలెస్ లో ప్రదర్శన శాలలు, మోడరన్ జిమ్, సినిమా హాల్, 500 సీసాలు పట్టే వైన్ సెల్లార్ వంటి మరెన్నో ఆధునిక హంగులూ ఉన్నాయి. మేడమీది రెండో అంతస్తులో మాస్టర్ సూట్లు, డబుల్ బెడ్ రూమ్, డ్రెస్సింగ్ ఏరియా, మాస్టర్ బాత్ రూమ్ సహా అనేక ప్రత్యేక ఆకర్షణలు కొనుగోలుదారులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. అలాగే భవనంలోని మరో ఐదు బెడ్ రూమ్ లు, సిబ్బంది వసతి గృహాలతోపాటు ఇటాలియన్ ఫర్నిచర్, పాలరాతి టేబుల్ రాచరికపు అందాలను ఉట్టిపడేలా చేస్తున్నాయి. థాచర్ త్రండి ఆల్ ఫ్రెడ్ రాబర్ట్స్ 'గ్రాంథం' ప్రాంతానికి 1945 నుంచి 1946 వరకు మేయర్ గా పనిచేశారు. దీంతో ఆమె తన బాల్యాన్ని గ్రాంథం లో గడిపింది. స్థానిక గ్రామర్ స్కూల్లో చదివిన మార్గరెట్... ఆక్స్ ఫర్డ్ సోమర్ విల్లె కాలేజీలో కెమిస్ట్రీ లో పట్టభద్రత పొందింది. అనంతరం ఓ పరిశోధన రసాయన శాస్త్రవేత్తగా పనిచేసి, ఆమెకు 25 ఏళ్ళ వయసున్నపుడు రాజకీయాల్లో అడుగు పెట్టింది. 1951 లో కంజర్వేటివ్ అభ్యర్థిగా ఎంపికై... 1970 లో పార్టీ నాయకురాలిగా ఎదిగింది. తర్వాత మూడు పర్యాయాలు జనరల్ ఎన్నికల్లో గెలిచి మొదటి బ్రిటిష్ ప్రధానమంత్రిగా థాచర్ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. -
కాంగ్రెస్ నేత ఇంటికి బాంబు బెదిరింపు
పరుగులు తీసిన పోలీసులు వేలూరు: వేలూరు రంగాపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ కోశాధికారి ఇంటిలో బాంబు పెట్టినట్టు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో పోలీసులు పరుగులు తీసి, ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సత్వచ్చారి పోలీస్ స్టేషన్కు సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ కార్యదర్శి సీకే దేవేంద్రన్ ఇంటిలో బాంబు పెట్టామని గంట సమయంలో అది పేలుతుందని తెలిపి ఫోన్ కట్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసు లు రంగాపురంలోని దేవేంద్రన్ ఇంటికి వద్ద డాగ్ స్క్వాడ్తో వెళ్లి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంటిలో ఎం త గాలించినప్పటికీ ఎటువంటి బాంబు ఆచూకీ తెలియక పోవడంతో పోలీసు లు వెనుతిరిగి వెళ్లారు. అనంతరం పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ నెంబరు నుం చి వచ్చిందనే కోణంలో పోలీసులు విచారణ చే స్తున్నారు. ఇదిలా ఉండగా రంగాపురం ప్రాంతంలోని దేవేంద్రన్ ఇంటి వద్ద ఆకస్మికంగా బాంబు తనిఖీ లు చేపట్టడంతో చుట్టు పక్కల ఉన్న కుటుంబీ కులు పూర్తిగా బయటకు వచ్చారు. -
పారిస్లో మూడు స్కూళ్లకు బాంబు బెదిరింపు
పారిస్: పారిస్లో మరోసారి బాంబుల కలకలం రేగింది. మూడు పాఠశాలలు ఉన్నపలంగా ఖాళీ చేశారు. దీని వివరాలను పోలీసులు తెలియజేస్తూ సోమవారం మూడు పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు తమకు సమాచారం అందడంతో అదే విషయాన్ని పాఠశాల యాజమాన్యానికి తెలియజేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. అయితే అందులో ఎలాంటి బాంబులు లభ్యం కాలేదని తెలిపారు. గత వారం కూడా రెండు ఫేక్ బాంబు అలర్ట్స్ రావడంతో పలు పాఠశాలలు ఉన్న పలంగా ఖాళీ చేశారు. ఫ్రెంచ్ ఉపాధ్యాయులను హత్య చేస్తామని, ఆ దేశ విద్యావ్యవస్థను సర్వనాశనం చేస్తామని, అల్లాకు వ్యతిరేకంగా ఎవరుంటే వారిని చంపేస్తామని లో దార్ అల్ ఇస్లామ్ అనే ఆన్ లైన్ ఫ్రెంచ్ భాష మేగజిన్ 2015 నవంబర్ ఎడిషన్లో ఇస్లామిక్ స్టేట్ హెచ్చరించింది. అప్పటి నుంచి ఫ్రాన్స్ స్కూల్లలో ఏ అలికిడి వినిపించినా పోలీసులు శరవేగంగా స్పందిస్తున్నారు. -
‘హోటల్లో పేల్చాలనుకున్నా’
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో 2014 డిసెంబర్ 28న చర్చిస్ట్రీట్లో బాంబు పేలుడులో ప్రణాళిక ప్రకారం రెస్టారెంట్ లోపల బాంబు పేల్చాలనుకున్నానని శుక్రవారం అరెస్టయిన సిమీ ఉగ్రవాది రఫీక్ఖాన్(30) వెల్లడించాడు. ఇతన్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టుచేసి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరచింది. ఆనాడు కోకొనట్ గ్రోవ్బార్ అండ్ రెస్టారెంట్కు ఇజ్రాయెల్ ప్రతినిధి బృందం విందుకు హాజరవనుందనే సమాచారం తెలిసి ఎక్కువ ప్రాణనష్టం కలిగేలా హోటల్ లోపల బాంబు అమర్చాలనుకున్నానని, గేటు వద్ద సెక్యూరిటీ తనిఖీలు ఎక్కువగా ఉండడంతో కుదరలేదని రఫీక్ వెల్లడించాడు. -
విమానానికి బాంబు బెదిరింపు.
-
కారు బాంబు పేలుళ్లు.. 20 మంది మృతి
-
బెంగళూరులో బ్యాగ్ కలకలం!
-
బెంగళూరులో బ్యాగ్ కలకలం!
బెంగళూరు : బెంగళూరులోని కావేరి థియేటర్ సర్కిల్ సమీపంలో అనుమానాస్పదంగా పడిఉన్న ఓ బ్యాగ్ శుక్రవారం కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. దాదాపు రెండు నుంచి మూడు గంటల పాటు తనిఖీలు చేపట్టారు. అయితే బ్యాగ్లో ఎలాంటి పేలుడు పదార్ధాలు లేవని పోలీసులు వెల్లడించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఓ ఇంటి నుంచి తమకు సమాచారం వచ్చిందని, దాంతో బాంబు నిర్వీర్యం చేసే టీంను పిలిచినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి పేలుడు పదార్ధాలు లేవని తేలిందని, కాకపోతే తాము అప్రమత్తంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. -
నాలుగేళ్ల పిల్లాడిని బాంబుతో పేల్చేశారు!
బాగ్దాద్ : పదేళ్లు కూడా సరిగ్గా నిండని బాలికలను సెక్స్ బానిసలుగా చేసుకొని వారిపై సామూహిక అత్యాచారాలు జరుపుతున్న ఐసిస్ ముష్కర మూకల రాక్షసత్వానికి పరాకాష్ట ఈ సంఘటన. నాలుగేళ్ల బ్రిటిష్ బాలుడి నడుముకు బాంబును కట్టి రిమోట్ కంట్రోలర్తో దాన్ని పేల్చివేశారు ఆ ముష్కరులు. ఆ పేలుడు ధాటికి గాలిలోకి రక్తం విరజిమ్మడమే కాకుండా ఆ బాలుడి శరీరంలో అంతర్గత అవయవాలు ముక్కలు ముక్కలై నేలంతా చెల్లాచెదురయ్యాయని ఆ ముష్కర మూకలకు వ్యతిరేకంగా పోరాడుతున్న 'పాపులర్ మొబలైజేషన్' బుధవారం వెల్లడించింది. తమ తోటి సైనికులను ఇద్దరిని చంపారన్న ఆక్రోశంతో ఆ పిల్లాడి తండ్రిని బహిరంగంగా హత్య చేసిన రెండు రోజులకే పిల్లాడిని ఇలా పేల్చివేశారని, ఈ సంఘటన ఐసిస్ స్వాధీనంలో వున్న ఉత్తర ఇరాక్లోని అల్ షీర్కత్ జిల్లాలో జరిగిందని ఆ గ్రూప్ వివరించింది. బ్రిటిష్ పౌరులనుద్దేశించి 'వారినందరిని చంపేస్తా' అన్న ఓ నాలుగేళ్ల పిల్లాడు హెచ్చరించిన ప్రాపగాండ వీడియోను టెర్రరిస్టులు విడుదల చేసిన అనంతరం ఈ దారుణ సంఘటన చోటుచేసుకుందని ఆ రెబల్ గ్రూప్ తెలిపింది. చంపేస్తానన్న నాలుగేళ్ల పిల్లాడు ఇసాడేర్ కూడా బ్రిటీష్ పౌరుడేనని, ఆ బాలుడిని కిడ్నాప్ చేసి కొంతకాలం తమ నిర్బంధంలో ఉంచుకున్న టెర్రరిస్టులు ఆ బాలుడికి బ్రెయిన్ వాష్ చేసి అలా చెప్పించారని, అంతకు రెండు రోజుల ముందే ' తాతయ్యా, నన్ను రక్షించవా!' అంటూ టెర్రరిస్టులు తనకు ఫోన్ చేయించినప్పుడు తనను వేడుకున్నాడని ఇసాడేర్ తాత 59 ఏళ్ల హెన్రీ మంగళవారం బ్రిటీష్ మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే. -
'బాంబు' భయంతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
'బాంబు' భయంతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
నైరోబి: 'బాంబు' భయంతో ఎయిర్ ఫ్రాన్స్ విమానం కెన్యా తీరప్రాంత నగరం మొంబాసాలో అత్యవసరంగా దిగింది. మారిషస్ నుంచి పారిస్ వెళుతున్న బోయింగ్ 777 ఎయిర్ఫ్రాన్స్ విమానం (463)లో లావెటరీలో అనుమానాస్పద పరికరం కనిపించింది. దీనిని బాంబుగా అనుమానించిన పైలట్లు మొంబాసాలోని మొయి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని దింపేందుకు అనుమతి ఇవ్వాలని కోరారని, ఇందుకు ఎయిర్పోర్ట్ అధికారులు అంగీకరించడంతో శనివారం అర్ధరాత్రి 12.37 గంటల సమయంలో విమానం అత్యవసరంగా దిగిందని పోలీసులు తెలిపారు. విమానంలో 459 మంది ప్రయాణికులు, 14మంది సిబ్బంది ఉన్నారు. విమానం శనివారం రాత్రి మారిషస్ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరింది. లావెటరీలో పేలుడు పదార్థంలాంటి పరికరం ఉండటంతో ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. ఆ తర్వాత అనుమానిత పరికరాన్ని విమానం నుంచి బయటకు తీసుకెళ్లి పరీక్షలు జరుపుతున్నారు. బాంబు నిర్వీర్య బృందాలు ఈ పరికరాన్ని పరిశీలిస్తున్నాయి. -
'నోటి దురద.. తీరిన సరదా'
న్యూయార్క్: ఓ విద్యార్థి సరదాకు అన్న మాట అతడిని జైలు పాలు చేసింది. మూడు రోజులపాటు అతడికి జైలు గోడలు ఎలా ఉంటాయో చూపించింది. ఈ ఘటన టెక్సాస్ లో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే.. టెక్సాస్ లో అర్మాన్ సింగ్ సరాయ్ అనే పన్నేండేళ్ల బాలుడు తాను చదువుతున్న నికోలస్ జూనియర్ హైస్కూల్ లో ఓ క్లాస్ మేట్ తో తన బ్యాగులో బాంబు ఉందని అన్నాడు. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, దాని గురించి ఆలోచన చేయకుండా ప్రశ్నించకుండా నేరుగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ పిల్లాడు చేసిన అల్లరిపనికి పోలీసులు మూడు రోజులపాటు జైలులో ఉంచి వదిలివేశారు. ఈ విషయాన్ని అతడి సోదరి ఫేస్ బుక్ ద్వారా పంచుకోగా చాలామంది షేర్ చేసుకున్నారు. వాస్తవానికి ఆర్మాన్ తల్లిదండ్రులకు అతడి అరెస్టు గురించి తెలియదు. ఆరోజు స్కూల్ నుంచి ఇంకా రాలేదేంటి అని కంగారు పడిపోయి పోలీసులకు ఫిర్యాదుచేయగా అతడిని అరెస్టు చేసి జువెనైల్ అధికారులు సమక్షంలో ఉంచినట్లు తెలిపారు. ముందునుంచే అర్మాన్ కాస్తంత అల్లరిగా ఉండే పిల్లవాడు కావడంతో అతడిని అదుపుచేయడంలో విఫలమయ్యేవారు. -
'స్కూల్కు బాంబు తీసుకువచ్చావా?'
అట్లాంటా: అమెరికాలో 13 ఏళ్ల ముస్లిం విద్యార్థినికి స్కూల్లో అవమానకర సంఘటన ఎదురైంది. జార్జియాలోని ఓ స్కూల్లో టీచర్.. 'బ్యాగ్లో బాంబు తీసుకువచ్చావా' అని తన కుమార్తెను ప్రశ్నించినట్టు విద్యార్థిని తండ్రి అబ్దిరిజాక్ ఆడెన్ చెప్పాడు. ఈ ఘటనపై స్కూల్ ప్రిన్సిపాల్ క్షమాపణలు చెప్పారు. స్కూల్లో టీచర్ తన కుమార్తెను ఆపి 'మానవబాంబా' అని ప్రశ్నించారని, దీంతో తన కుమార్తె ఎంతో బాధపడిందని ఆడెన్ వెల్లడించాడు. ఈ విషయం తెలియగానే స్కూల్ నుంచి తన కుమార్తెను తీసుకువచ్చానని తెలిపాడు. 'మేం ఆఫ్రికా నుంచి వచ్చి అమెరికాలో నివసిస్తున్నాం. మేం ముస్లిం మతానికి చెందినవారం. ఇతరులను ద్వేషించాలని నేను పిల్లలకు చెప్పలేదు. ఇతరుల కంటే గొప్పని కూడా చెప్పలేదు' అని ఆడెన్ చెప్పాడు. ఈ ఘటనపై స్కూల్ ప్రిన్సిపాల్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు. -
రైల్వే ట్రాక్పై బాంబు?
కేసముద్రం (వరంగల్) : బాంబు భయంతో వరంగల్ జిల్లా కేసముద్రం, ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం రాత్రి 7.40 గంటల సమయంలో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. ట్రాక్పై వైర్లు కనిపించడంతో బాంబు అమర్చినట్టు అనుమానించిన సిబ్బంది ఆ మార్గంలో సికింద్రాబాద్ వైపు వెళుతున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. దాంతో మరికొన్ని రైళ్లు కూడా నిలిచినట్టు సమాచారం. -
'ఇక ఖాళీ విమానాలే పంపిస్తాం.. నో ప్యాసింజర్స్'
మాస్కో: ఈజిప్టుకు అన్ని రకాల ఫ్యాసింజర్ విమానాల సర్వీసులను రష్యా నిలిపివేసింది. బాంబు దాడి వల్లే రష్యా విమానం గతవారం కూలిపోయిందని అమెరికాతోపాటు బ్రిటన్ కూడా చెప్పడంతో ప్రస్తుతానికి ఈ ఈజిప్టు, రష్యాల మధ్య సర్వీసులను ఆపేసింది. దీంతో రెండు దేశాల మధ్య ఇది కొత్త సమస్యగా మారింది. గత నెల 31న బయలుదేరిన మెట్రోజెట్ ఎయిర్ బస్ 321-200 రష్యా విమానం కొద్ది సేపటికే కుప్పకూలి దాదాపు 224మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అనంతరం ఆ విమానాన్ని తామే కూల్చి వేశామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే, ఇప్పటి వరకు అధికారికంగా అటూ ఈజిప్టుగానీ, రష్యాగానీ ఉగ్రవాద సంస్థ ప్రకటనను ఆమోదించలేదు. తాజాగా, అమెరికా, బ్రిటన్ దేశాలు బలమైన బాంబు దాడి మూలంగానే రష్యా విమానం కూలిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశాయి. పరోక్షంగా ఈజిప్టు కూడా శుక్రవారం సాయంత్రం బాంబు దాడివల్లే ఈ విమానం కూలిపోయినట్లు భావిస్తున్నామని అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు రద్దయ్యాయి. రష్యా నుంచి ఎలాంటి ప్రయాణికులతో కూడిని విమానాలను ఈజిప్టుకు పంపించబోమని కాకపోతే అక్కడ ఉన్న తమ దేశ వాసులను వెనక్కి రప్పించేందుకు మాత్రం ఖాళీ విమానాలను పంపిస్తామని స్పష్టం చేసింది. ఈజిప్టులో మొత్తం 40 వేలమంది రష్యన్లు ఉన్నట్లు సమాచారం. ముందస్తు భద్రతా దృష్ట్యానే సర్వీసులు రద్దు చేశాం తప్ప ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదని రష్యా స్పష్టం చేసింది. -
ఫోన్ మాట్లాడుతుండగా చేతిలో పేలిన బాంబు
బయ్యారం (ఖమ్మం జిల్లా) : సెల్ఫోన్ మాట్లాడుతుండగా చేతిలో నాటు బాంబు పేలి చెయ్యి తెగి పడిపోయింది. ఈ ఘటన సోమవారం ఖమ్మం జిల్లా బయ్యారం మండలంలోని పెద్దచెరువు వద్ద చోటుచేసుకుంది. బయ్యారం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన శివ (32) చేపలు పడదామని సోమవారం నాటుబాంబుతో బయ్యారం పెద్ద చెరువు వద్దకు వెళ్లాడు. నాటుబాంబును చెరువులో విసిరి చేపలు పడదామని అనుకుని బాంబుకు నిప్పంటించాడు. అదే సమయంలో ఫోన్ మోగడంతో బాంబు విషయం మర్చిపోయి, ఫోన్ మాట్లాడుతున్నాడు. బాంబు ఒక్కసారిగా పేలడంతో చెయ్యి తెగిపడింది. క్షతగాత్రుడిని మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఆ 'బాంబ్' వాచ్ తిరిగొచ్చేసింది!
వాషింగ్టన్: మొత్తానికి అహ్మద్ మహమద్ చేతికి ఆ 'వాచ్' తిరిగొచ్చేసింది. 'బాంబ్' వాచ్గా పొరపడి.. 14 ఏళ్ల అహ్మద్ మహమద్ను సంకెళ్లలో నిలబెట్టిన వాచ్.. అతడి ఆవిష్కరణను మెచ్చి, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసల్లో ముంచెత్తిన 'వాచ్'.. ఎట్టకేలకు తన చేతుల్లోకి చేరింది. 'ఎట్టకేలకు నా వాచ్ నాకు దక్కిందోచ్' అంటూ అమెరికా ముస్లిం బాలుడు అహ్మద్ మహమద్ ట్వీట్ చేశాడు. అతడు గత నెలలో తాను సొంతంగా తయారుచేసిన 'వాచ్'ను పాఠశాలకు తీసుకురావడం.. దానిని 'బాంబ్'గా పొరపడి స్కూలు యాజమాన్యం ఆ బాలుడి చేతికి సంకెళ్లు వేసి నడిరోడ్డుపై నిలుపడం తీవ్ర కలకలం సృష్టించింది. తన ఆవిష్కరణను స్కూలకు తీసుకొచ్చి.. ఉపాధ్యాయులను, తోటి విద్యార్థులను ఆశ్చర్యపరచాలని అహ్మద్ భావిస్తే.. అమెరికాలో ఉన్న 'ఇస్లామోఫొబియా'తో అతన్నో ఉగ్రవాదిగా చూసి.. ఆ 'వాచ్' లాక్కొన్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. రాత్రికి రాత్రే.. అహ్మద్ ఘటన ఇంటర్నెట్లో సంచలనం అయింది. దీంతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం బాలుడికి సంఘీభావం ప్రకటించారు. అతడి ఆవిష్కరణను మెచ్చుకుంటూ అధ్యక్ష భవనం వైట్హౌస్కు ఆ వాచ్ను తీసుకొస్తావా? అని అడిగారు. అహ్మద్కి ఫేస్బుక్, గూగుల్, ఐక్యరాజ్యసమితి నుంచి ఆహ్వానాలు అందాయి. ఇప్పటికే అతడు న్యూయార్క్, సుడాన్, ఖతార్, మక్కాలో పర్యటించాడు. గతవారం కొందరు విద్యార్థులతో కలిసి అధ్యక్షుడు ఒబామను కలిశాడు. ఈ సందర్భంగా ఒబామాతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోను ట్వీట్ చేశాడు. టెక్సాస్లోని డల్లాస్లో ఉండే అహ్మద్ మహమద్ ప్రవాసి సుడాన్కు చెందిన వ్యక్తి కొడుకు. ప్రపంచవ్యాప్తంగా అహ్మద్కు వెల్లువెత్తున్న మద్దతుతో సంతోషపడుతున్న తల్లిదండ్రులు.. అతని చదువును ఖతార్లో కొనసాగించాలని భావిస్తున్నారు. అతని పాఠశాల విద్య, అండర్ గ్రాడ్యుయేషన్కు పూర్తి స్కాలర్షిప్ అందించేందుకు ఖతార్ ముందుకొచ్చింది. అతన్ని ఖతార్ ఫౌండేషన్కు చెందిన యంగ్ ఇన్నోవేటర్స్ కార్యక్రమానికి ఎంపిక చేసింది. -
బాలుడి అరెస్టు.. ఒబామా ఆహ్వానం
వాషింగ్టన్: సాధరణంగా ఓ కేసులో అరెస్టయిన కుర్రాడిని చిన్నతనంతో చూస్తాం. అతడిపట్ల ఏహ్య భావాన్ని కలిగి ఉంటాం. కానీ ఆ కుర్రాడికి ఏకంగా దేశ అధ్యక్షుడి నుంచి పిలుపు వస్తే.. అమెరికాలోని తొమ్మిదో తరగతి చదువుతున్న అహ్మద్ మహ్మద్ అనే కుర్రాడు ఓ అలారం గడియారాన్ని స్వయంగా తయారు చేశాడు. దానిని ఒక పెట్టెలో పెట్టుకొని తమ టీచర్లకు చూపించాలని ఆత్రంతో పాఠశాలకు వచ్చాడు. కానీ దానిని తెరిచి చూసిన ఉపాధ్యాయులు బాంబ్ అనుకొని పొరబడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ కుర్రాడిని అరెస్టు చేశారు. ఈ వీడియో ఇంటర్ నెట్లో హల్ చేసింది. కానీ, ఉపాధ్యాయులు, పోలీసులు చేసింది పొరపాటు అని తెలిసింది. ఈవిషయం అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా తెలిసి ఆ బాలుడిని ఏకంగా తన ఇంటికి ఆహ్వానించాడు. పద్నాలుగేళ్ల వయసులో అతడు చేసిన నూతన ఆవిష్కరణకు ముగ్దుడైపోయారు. అతడిలాంటి శాస్త్రవేత్తలే అమెరికాకు కావాలని పొగుడుతూ ట్వీట్ చేశారు. నూతన ఆవిష్కరణలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని మరింత ప్రోత్సహించాలే తప్ప సంకెళ్లు వేయకూడదని అన్నారు. మరోపక్క, ఫేస్ బుక్ అధినేత కూడా ఆ కుర్రాడిని పొగడ్తల్లో ముంచెత్తడు. తన ఆవిష్కరణలు అలాగే కొనసాగించమని, ఆ బాలుడికి ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి తనను నిరభ్యంతరంగా కలవొచ్చని ఆహ్వానించాడు. -
ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు!
ఢిల్లీ: విమానాల్లో బాంబులు పెట్టామంటూ వరుసగా వస్తున్న బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా పలు విమానాల్లో బాంబులు పెట్టామంటూ ఢిల్లీకి, బెంగళూరు నగరాల్లోని ఎయిర్ పోర్ట్ లకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆరు విమానాల్లో బాంబులు పెట్టామని దుండగుల నుంచి శనివారం ఉదయం బెదిరింపు ఫోన్స్ కాల్స్ వచ్చాయి. దీంత్ అప్రమత్తమై భద్రతా బలగాలు విమానాలను క్షణ్ణంగా తనిఖీ చేశారు. మూడు అంతర్జాతీయ విమానాలకు ఇందిరా గాంధీ విమానాశ్రయానికి తిరిగి రప్పించి తనిఖీలు నిర్వహించారు. అనంతరం విమానాల్లో ఎటువంటి బాంబులు లేవని నిర్ధారించారు. ఇది కొంతమంది ఆకతాయిలు చేసిన పనిగా అనుమానిస్తున్నా.. ఈ కాల్స్ పై పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకు పోలీసులు సన్నద్దమయ్యారు. అసలు బెదిరింపు కాల్స్ వెనుక ఉగ్రవాదులు కుట్ర ఏమైనా ఉందా?అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. -
బస్టాండ్ వద్ద బాంబు కలకలం
వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సోమవారం రాత్రి బాంబు కలకలం సృష్టించింది. ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం వద్ద ఓ అట్టపెట్టె చాలా సేపటి నుంచి ఉండటంతో సిబ్బంది అనుమానించారు. దీనిపై వారు వన్ టౌన్ పోలీసులకు వారు అందించారు. విషయం ఆనోటా.. ఈనోటా తెలియటంతో పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బాంబు స్క్వాడ్ నిపుణులు అక్కడికి చేరుకుని పెట్టెను తెరిచి చూడగా పై భాగంలో అంతా రంపం పొట్టుతో పాటు అడుగున చిన్న రాగి చెంబు కనిపించాయి. ఎలాంటి ప్రమాదం లేదని తెలియటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
వంతెన పేల్చివేతకు నక్సల్స్ కుట్ర!
ఔరంగాబాద్: పలు గ్రామాలను అనుసంధానించే వంతెనను బాంబులతో కూల్చివేసేందుకు నక్సల్స్ పన్నిన కుట్రను పోలీసులు ఛేదించారు. బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లా కెతాకీ సమీపంలోని వంతెన కింద పేలడానికి సిద్ధంగా ఉన్న శక్తిమంతమైన బాంబును పోలీసులు గుర్తించారు. వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ను రంగంలోకి దించి బాంబును నిర్వీర్యం చేశారు. 'ఇది కచ్చితంగా నకల్స్ పనే' అని స్థానికల పోలీసు అధికారులు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కెతాకీ సమీపంలోని అన్ని వంతెనలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. -
నాందేడ్లో మరోమారు బాంబు కలకలం
సాక్షి, ముంబై: ‘నేను నరేంద్ర మోదీని. నాందేడ్ రైల్వేస్టేషన్లో ఎవరో బాంబు పెట్టారు’ అని ఓ ఆగంతకుడి బెదిరింపు ఘటనను మరవకముందే మరోమారు బాంబు బెదిరింపులు వచ్చాయి. నాందేడ్ జిల్లాలోని ముత్కేడ్ రైల్వే స్టేషన్లో ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణ ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టినట్లు గురువారం తెల్లవారుజామున వదంతులు వినిపించాయి. దీంతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, డాగ్స్క్వాడ్, బాంబ్ డిటెక్టర్ల సహాయంతో రైలు మొత్తం తనిఖీ చేశారు. బాంబు లేదని పోలీసులు నిర్ధారించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
రైల్వే ట్రాక్పై బాంబు: నిలిచిపోయిన రాకపోకలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ కు పెనుముప్పు తప్పింది. కోల్ కతా నగరంలో లోకల్ ట్రైన్లు తిరిగే ట్రాక్ పై గుర్తుతెలియని దుండగులు బాంబును అమర్చారు. అదృష్టవశాత్తూ పేలుడు సంభవించక ముందే భద్రతా సిబ్బంది బాంబును వెలికితీశారు. ఈ కారణంగా కొద్ది గంటలపాటు కోల్ కతాలో రైల్వే సేవలు నిలిచిపోయాయి. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నగరంలోని పార్క్ సర్కస్, సీల్దా సౌత్ స్టేషన్ల మధ్య బాంబును గుర్తించినట్లు, ముందు జాగ్రత్త చర్యగా రైళ్లన్నీ నిలిపివేసినట్లు తూర్పు రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్పీఎఫ్, జీఆర్పీ బలగాలు సంఘటనా స్థలికి చేరుకుని బాంబును వెలికి తీశాయని, ప్రస్తుతం రైళ్ల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు లేవని పేర్కొంది. -
విమానం కేబిన్లో బాంబు బెదిరింపు
-
విమానం కేబిన్లో బాంబు
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. బ్యాంకాక్ నుంచి ఇస్తాంబుల్ కు సుమారు 148 మంది ప్రయాణికులతో బయలుదేరిన టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానంలో ఉన్నట్టుండి బాంబు కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. క్యాబిన్లో బాంబును కనుగొన్న పైలట్.. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు. ఆ సమయానికి దగ్గరలో ఉన్న న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అనుమతి తీసుకుని అత్యవసరంగా విమానాన్ని కిందకు దించారు. దీంతో న్యూఢిల్లీ విమానాశ్రయంలో అత్యవర పరిస్థితిని ప్రకటించారు. అన్ని భద్రతా దళాలతో పాటు నేషనల్ సెక్యూరిటీ దళాలను అప్రమత్తం చేసి హై ఎలర్ట్ ప్రకటించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ , అగ్నిమాపక దళాలు హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకున్నాయి. విమానం లోపల, రన్ వే తదితర ఏరియాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. దీనిపై ఎన్ఎస్జీ అధికారులు, ఇతర సీనియర్ అధికారులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారని సమాచారం. -
ఆప్ఘాన్ పార్లమెంట్పై ఆత్మాహుతి దాడి
-
ఆప్ఘనిస్థాన్ పార్లమెంట్ భవనంపై ఆత్మాహుతి దాడి
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా పార్లమెంట్పైనే దాడికి తెగబడ్డారు. కాబూల్లో పార్లమెంట్ భవనంపై సోమవారం ముష్కరులు దాడికి పాల్పడ్డారు. బాంబులు, తుపాకులతో విరుచుకుపడిన ఉగ్రవాదులు.. పార్లమెంట్ పరిసరాల్లో స్వైర విహారం చేశారు. బాంబు పేలుళ్ల శబ్దాలు, తుపాకుల మోతతో పార్లమెంట్ పరిసరాలు దద్దరిల్లిపోయాయి. ఆరు సార్లు బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అటు సాయుధ ఉగ్రవాదులు పార్లమెంట్ దిగువ సభలోకి చొరబడి కాల్పులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో పలువురు గాయపడినట్లు సమాచారం. మరోవైపు ఈ ఘాతుకానికి పాల్పడింది తామేనని తాలిబాన్లు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆంధ్రాబ్యాంకుపై బాంబు విసిరిన దుండగులు
చెన్నై: తిరుపతి శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్పై తమిళనాడులో మూడోరోజు కూడా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తుత్తుకుడిలో ఆంధ్రాబ్యాంకుపై గురువారం ఉదయం దుండగులు బాంబు విసిరారు. అయితే ఆ సమయంలో బ్యాంకు ఇంకా తెరవకపోవటంతో ప్రమాదం తప్పింది. ఆంధ్రా బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దాడి చేసిన విషయం తెలిసిందే. దాంతో తమిళనాడు నుంచి ఏపీ వైపు వెళ్లే బస్సు సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. -
39 నాటు బాంబులు స్వాధీనం
వెంకటాపురం: వరంగల్ జిల్లా వెంకటాపురం మండల కేంద్రం చివర ఉన్న ఓ మొక్కజొన్న పొలంలో 39 నాటు బాంబులను స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేశారు. మొక్కజొన్న పంటను అటవీ జంతువుల బారి నుంచి కాపాడుకోవటానికి కొంత మంది రైతులు పొలంలో అక్కడక్కడా నాటు బాంబులు పెట్టారు. ఈ నెల 10న అందులోని ఓ నాటు బాంబు పేలి రాజేశ్వర్ రావు అనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. మొత్తం 40 బాంబులు పాతిపెట్టగా అందులో ఒక బాంబు పేలింది. రాజేశ్వర్ రావు ఫిర్యాదు మేరకు కంచం అశోక్, రెడ్డి దామోదర్, గంటా నరసింగం, మేకల మల్లయ్య అనే రైతులను పోలీసులు అరెస్టు చేశారు. -
ప్రతీకారం తీర్చుకున్న జోర్డాన్
అమన్: ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల చర్యకు జోర్డాన్ ప్రభుత్వం దీటుగా బదులిచ్చింది. తమ ఆధీనంలో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను ఉరి తీసి ప్రతీకారం తీర్చుకుంది. అంతే కాకుండా తీవ్రవాదానికి సంబంధించిన ఏ అంశంలోనైనా పట్టుబడ్డ వారిని ఉరి తీస్తామని జోర్డాన్ ప్రభుత్వం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీచేసింది. 2013 డిసెంబర్లో సిరియాలోని రక్కా సమీపంలో నిర్బంధించిన జోర్డాన్ పైలట్ మోజ్ అల్ - కసస్ బెహ్ను ను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అత్యంత దారుణంగా చంపారు. ఒక బోనులో నిలబెట్టి మంటలు అంటించి సజీవదహనం చేశారు. ఇస్లామిక్ స్టేట్ మంగళవారం ఈ వీడియో దృశ్యాలను విడుదల చేసింది. కాగా పైలట్ను విడిపించేందుకు తమ వద్ద బందీగా ఉన్న ఐఎస్ఐఎస్ మహిళా నేతను విడుదల చేస్తామని జోర్డాన్ చెప్పినా కూడా ఉగ్రవాదులు పైలట్ను పొట్టన పెట్టుకున్నారు. -
బోనులో పెట్టి..పెట్రోల్ పోసి సజీవ దహనం
బీరుట్: డిసెంబర్లో తాము నిర్బంధించిన జోర్డాన్కు చెందిన పైలట్ను సజీవంగా దహనం చేసినట్లు ఇస్లామిక్ స్టేట్ మంగళవారం వీడియో దృశ్యాలను విడుదల చేసింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగాసిరియాలో చేపట్టిన సంకీర్ణ చర్యల్లో పాల్గొన్న జోర్డాన్కు చెందిన ఎఫ్-16 జెట్ విమానం డిసెంబర్ 24న కుప్పకూలింది. ఆ విమాన పైలట్ మాజ్ అల్ కస్సాస్బేను ఐఎస్ ఉగ్రవాదులు నిర్బంధించారు. జోర్డాన్లో జైలులో ఉన్న ఇరాకీ మహిళా ఆత్మాహుతి బాంబు సాజిదా అల్ రిషావీని తమకు అప్పగించకుంటే పైలట్ను చంపేస్తామని ఐఎస్ హెచ్చరించింది. తాజా వీడియోలో ఈ పైలట్ను ఇనుపబోనులో ఉంచి పెట్రోలు పోసి సజీవం గా దహన దృశ్యాలు ఉన్నాయి. -
మళ్లీ నెత్తురోడిన పాక్
షియా మసీదులో బాంబు పేలుడు; 49 మంది మృతి కరాచీ: పాకిస్తాన్ మరోసారి ఉగ్ర దాడికి నెత్తురోడింది. సింధ్ ప్రావిన్సులోని షికార్పూర్లో ఉన్న షియా మసీదైన ఇమామ్బర్గాలో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సందర్భంగా శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పలువురు చిన్నారులు సహా 49 మంది మృత్యువాతపడగా మరో 55 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి తాత్కాలిక భవనంలో ఉన్న మసీదు పైకప్పు కుప్పకూలడంతో చాలా మంది ముస్లింలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వెంటనే అక్కడకు చేరుకున్న వందలాది మంది స్థానికులు శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించారు. పేలుడు శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకూ వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ప్రార్థనల సమయంలో మసీదులోకి ప్రవేశించిన ఓ వ్యక్తి రిమోట్ ద్వారా పేలుడు జరిపినట్లు పోలీసులు పేర్కొనగా ఇది ఆత్మాహుతి దాడి అయ్యుండొచ్చని మీడియా అనుమానం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ పేలుడు తమ పనేనంటూ జున్దుల్లా మిలిటెంట్ గ్రూపు ప్రకటించుకుంది. షియాలు తమ శత్రువులని...అందుకే దాడికి పాల్పడినట్లు తెలిపింది. గత ఏడాది తాలిబాన్ నుంచి వేరుపడిన జున్దుల్లా మిలిటెంట్ గ్రూపు తాజాగా ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూపునకు విధేయత ప్రకటించింది. గత ఏడాది జనవరి 22న ఇరాన్ నుంచి 24 మంది షియా యాత్రికులతో తిరిగి వస్తున్న బస్సుపై బలూచిస్తాన్లో జరిగిన బాంబు దాడి తర్వాత షియాలపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే. కాగా, పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ దీనిపై తక్షణమే విచారణకు ఆదేశించారు. -
బాంబు కలకలం
వికారాబాద్: గుర్తుతెలియని వ్యక్తులు రైల్వేస్టేషన్లలో, రైళ్లలో బాంబులు పెట్టామని సికింద్రాబాద్ రైల్వే కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వడంతో కలకలం రేగింది. దీంతో పోలీసులు ఉదయం 1:30 గంటల నుంచి జాగిలాలతో వికారాబాద్ రైల్వేస్టేషన్తో పాటు ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించే రైళ్లలో జాగిలాలు, బాంబ్స్క్వాడ్తో త నిఖీలు చేశారు. హైదరాబాద్ నుంచి మొదలుకొని వాడీ, బీదర్ వరకు అన్ని రైల్వేస్టేషన్లలో, ఫ్లాట్ఫాంలలో క్షణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు సుమారుగా రెండు గంటల పాటు సాగాయి. పోలీసులు అనుమానిత వస్తువులు, అనుమానితులను తనిఖీ చేశారు. వికారాబాద్ రైల్వే జంక్షన్లో ఆర్పీఎఫ్ సీఐ ర మేష్చందర్రెడ్డి, జీఆర్పీ ఎస్ఐ తిరుపతి, స్థానిక డీఎస్పీ స్వామి, సీఐ రవి,ఎస్ఐలు శేఖర్,నాగరాజు బాంబుస్కాడ్ సిబ్బంది, జాగిలాలతో పరిశీలించారు. ఎట్టకేలకు ఆకతాయి సమాచారం అని నిర్ధారించుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
చేవెళ్ల పోలీస్ స్టేషన్లో బాంబు కలకలం
రంగారెడ్డి జిల్లా : చేవెళ్ల పోలీస్ స్టేషన్లో బాంబు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేసి స్టేషన్లో బాంబు ఉందాన్ని తెలిపారు. వెంటనే అప్రమత్తం అయిన రంగారెడ్డి డిఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారు. -
బాంబు కలకలం సృష్టించిన వ్యక్తి అరెస్ట్
నిందితుడు కర్ణాటక వాస తిరుపతి క్రైం: తిరుపతిలో బాంబు పేల్చేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడని నాలుగు రోజుల క్రితం పోలీసులకు ఫోన్ ద్వారా చెప్పి కలకలం సృష్టించిన వ్యక్తిని తిరుపతి అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. తన దగ్గర పనిచేసి నిలి చిపోయిన వ్యక్తిని ఇబ్బందులపాలు చేయబోయి తానే పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. మంగళవారం అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టి వివరాలు వెల్లడించారు.. ఈనెల 11వ తేదిన తిరుపతికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. ఆ నేపథ్యంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి కర్ణాటక డీజీపీ ఆఫీసులోని 100 నెంబరుకు ఫోన్ చేశాడు. తిరుపతిలో ఉత్తమ్కుమార్ అనే వ్యక్త్తి బాంబు పేల్చేందుకు సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. అతని సెల్ నెంబ రు కూడా ఇచ్చాడు. వారు తిరుపతి పో లీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అర్బన్ ఎస్పీ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని ముఖ్య ప్రదేశాలకు టీమ్స్ను పంపి తనిఖీ చేశారు. ఆ ఫోన్ నెంబరు ఆధారంగా విచారించి రాజు సర్కార్ అలియాస్ ఉత్తమ్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని వి చారించగా తనది పశ్చిమ బెంగాల్లోని బాలార్ ఘాట్ జిల్లా, కలిబరి పెరూసా గ్రామమని బతుకు తెరువు కోసం తిరుపతికి వచ్చి సెంట్రింగ్ పనులతో జీవిస్తున్నానని చెప్పాడు. ఫోన్ చేసి తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిని పట్టుకోవాలంటూ ఏఎస్పీ త్రిమూర్తులు, ఈస్ట్ డీఎ స్పీ రవిశంకర్రెడ్డిని ఆదేశించారు. వీరి ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్లు కర్ణాటక వెళ్లి కొప్పల్ జిల్లా, గంగావతి నగరంలో ఉండే మహమ్మద్ అమీరుల్ ఇస్లాం షేక్ను అదుపులోకి తీసుకున్నారు. ఇబ్బంది పెట్టాలనే.. పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మహమ్మద్ జరిగిన విషయం వివరంగా తెలిపాడు. కర్ణాటక రాష్ట్రంలో ఇతను సెంట్రింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. అక్కడ కూలీల కొరత ఉండటంతో పశ్చిమబెంగాల్ నుంచి ఉత్తమ్కుమార్ను పిలిపించుకున్నాడు. అయితే కూలి డబ్బు చాలడం లేదని ఉత్తమ్కుమార్ పనిమానేసి, మహమ్మద్ వద్ద పనిచేసే మరో ఇద్దరిని వెంటబెట్టుకుని తిరుపతికి వెళ్లిపోయాడు. కూలీలు లేక పనులు నిలిచిపోయి మహమ్మద్ బాగా నష్టపోవాల్సి వచ్చింది. దీంతో ఉత్తమ్కుమార్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని పోలీసులకు తప్పుడు సమాచారం అందించానని ఒప్పుకున్నాడు. తప్పుడు సమాచారంతో పోలీసులను తప్పుదోవ పట్టించి, అధికారులను ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన అహ్మద్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్టు అర్బన్ ఎస్పీ తెలిపారు. -
బాంబు కలకలం
►తిరుమల, తిరుపతిలో విస్తృత తనిఖీలు ►పరుగులు తీసిన పోలీసులు ►భద్రత కట్టుదిట్టం సాక్షి, తిరుమల/తిరుపతి క్రైం: ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో బాంబు ఉందనే సమాచారంతో కలకలం రేగింది. దీనికితోడు రాష్ట్ర డీజీపీ కార్యాలయం, ఇంటెలిజెన్స్ విభాగాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో, తిరుపతి అలిపిరి వద్ద అన్ని భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి. మధ్యాహ్నం నుంచి పోలీసులు, టీటీడీ విజిలెన్స్, ఎస్పీఎఫ్, ఏఆర్ పోలీసులు వారివారి పరిధిలో భద్రతను కట్టుదిట్టంచేశారు. మూడు బృందాలుగా విడిపోయి బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లు ఆలయం, రద్దీ ఉండే అన్ని అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లే భక్తులను రెట్టింపు స్థాయిలో తనిఖీ చేసి అనుమతించారు. మరోవైపు సీసీ కెమెరాల్లో నిఘా ఉంచారు. అనుమానిత వ్యక్తుల కదలికలను నిశితంగా పరిశీలించారు. ప్రధానమైన తిరుమల టోల్గేట్, తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్, టీటీడీ వసతి గృహాలు, ప్రముఖ దేవాలయాల్లో బాంబు స్క్వాడ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. టోల్గేట్ వద్ద వచ్చే వాహనాలను, యాత్రికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించి తిరుమలకు అనుమతించారు. కార్ల బ్యానెట్ సైతం తెరచి డాగ్స్క్వాడ్తో తనిఖీ చేయించారు.దీంతో తిరుమలకు ప్రయాణించే భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అన్ని చోట్లా వెతికినా ఏమీ దొరక్కపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ముక్కంటి చెంత శ్రీకాళహస్తి: తిరుపతిలోని అలిపిరి వద్ద బాంబులు ఉన్నట్లు పుకార్లు రావడంతో ఎస్పీ ఆదేశాల మేరకు ముక్కంటి చెంత పోలీసులు గురువారం రాత్రి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ వెంకటకిషోర్ నేతృత్వంలో వన్ టౌన్ సీఐ చిన్న గోవింద్, ఎస్ఐ ఏటీ.స్వామి పోలీసులు భక్తులను రాత్రి 7 నుంచి 9-30 గంటల వరకు విస్తృతంగా తనిఖీ చేశారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నామని.... ఆందోళన చెందాల్సిన అవసరంలేదని డీఎస్పీ వెంకటకిషోర్ స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ అధికారుల అదుపులో అనుమానితులు బాంబు ఉందంటూ పుకార్లు రావడంపై తిరుపతి ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆరాతీశారు. ఫోన్ కాల్స్ ఆధారంగా కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. -
మోదీ పర్యటనకు ముందు.. అసోంలో భారీ బాంబు స్వాధీనం
గువహాటి: ప్రధాని నరేంద్ర మోదీ అసోం పర్యటన ముందు ఆ రాష్ట్రంలో పోలీసులు శక్తివంతమైన బాంబును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం గువహాటి సమీపంలోని కెండుకొన రైల్వే స్టేషన్ వద్ద ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలులో 7 కిలోల బరువున్న బాంబును గుర్తించారు. బాంబును టవల్తో చుట్టి ప్లాస్టిక్ సంచిలో ఉంచారు. రైలు కంపార్ట్మెంట్లో దీన్ని దాచారు. భద్రత సిబ్బంది బాంబును గుర్తించిన వెంటనే రైలును ఆపివేశారు. నిపుణులు వచ్చి బాంబును నిర్వీర్యం చేశారు. ఆదివారం అసోంలో బాంబు పేలిన దుర్ఘటనలో ఇద్దరు మరణించగా, మరో 25 మంది గాయపడ్డారు. ఈ నెల 29న ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అసోం పర్యటనకు రానున్న నేపథ్యంలో బాంబు ఉదంతం సంఘటనలను భద్రత సిబ్బంది సీరియస్గా పరిగణిస్తున్నారు. -
రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు వెలికితీత
బెర్లిన్: రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబును జర్మనీలో కనుగొన్నారు. బవేరియా రాష్ట్రంలోని రామర్స్డర్ఫ్ జిల్లాలో దీన్ని గుర్తించారు. 250 కిలోల బరువు గల ఈ బాంబు రెండో ప్రపంచ యుద్ధం కాలం నుంచి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అధికారులు వెంటనే సమీప ప్రాంతం ప్రజలను అక్కడ నుంచి ఖాళీ చేయించారు. దగ్గరలోని హైవేపై రాకపోకలను ఆపివేయించారు. నిపుణులు బాంబును నిర్వీర్యం చేసి తొలగించారు. రెండో ప్రపంచ యుద్ధం సయమంలో బాంబు దాడుల్లో మూనిచ్ నగరం చాలా వరకు దెబ్బతింది. -
కోచీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
-
ఇళ్ల మధ్యే ‘బాంబ్’
అనుమతుల్లేకుండా వెలుస్తున్న దుకాణాలు హోల్సేల్ దుకాణాలు, ఇళ్లలో భారీగా అక్రమ నిల్వలు ఆదిలాబాద్ క్రైం : దీపావళి పండుగ అంటే అందరూ సుఖసంతోషాలతో జరుపుకుంటుంటాం. ముఖ్యంగా అందరి ఇళ్లలోనూ పండుగను పురస్కరించుకుని బాంబుల మోతతో వెలుగులు విరజిమ్మిస్తుంటారు. ఇదే అదునుగా భావించిన పలువురు వ్యా పారులు బాంబుల విక్రయాలతో తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసుకునేందుకు సన్నద్ధమయ్యా రు. ఇందుకు ప్రజల ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు. అనుమతుల్లేకుండానే ఇళ్ల మధ్యే షాపులు ఏర్పాటు చేస్తూ విక్రయాలు జరుపుతున్నారు. జిల్లా కేంద్రంతోపాటు ముఖ్యపట్టణాల్లో టపాసుల జీరో దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టి కోట్లు గడిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్నగర్, మందమర్రి, చెన్నూర్, ఆసిఫాబాద్, లక్సెట్టిపేట, తదితర ప్రాంతాల్లో టపాసుల దుకాణాలకు అగ్నిమాపక శాఖ అధికారులు అనుమతిస్తారు. ప్రతి ప్రాంతంలో అక్కడి జనాభాను దృష్టిలో పెట్టుకుని దుకాణాలు ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తారు. పలు చోట్ల నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్య దుకాణాలు నెలకొల్పిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏటా అధికారుల అనుమతి పొందిన దుకాణాలు 500లకు పైగా వెలుస్తాయి. అనుమతి సమయంలో అన్నీ చూపించిన వ్యాపారులు తీరా దుకాణం ఏర్పాటయ్యాక పాటించాల్సిన నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. అక్రమ నిల్వలు.. జిల్లాలో మంచిర్యాల, చెన్నూరు ప్రాంతంలో తప్ప ఎక్కడా అనుమతి ఉన్న హోల్సెల్ దుకాణాలు లేవు. కానీ.. జిల్లాలో చాలా చోట్ల అనుమతులు లేకుండానే పుట్టగొడుగుల్లా హోల్సెల్ దుకాణాలు దర్శనమిస్తాయి. సదరు హోల్సెల్ దుకాణానికి సంబంధించిన గోడౌన్లో, ప్రజల ఇళ్ల మధ్యే యజమానుల ఇళ్లలో టపాసులు నిల్వ చేస్తున్నారు. తాము అధికార పార్టీకి చెందిన వారమని చెప్పుకుంటూ కొంత మంది బడా వ్యాపారులు ఈ దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అనుమతులు తప్పనిసరి.. టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసేందుకు సదరు వ్యాపారులు రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖల, మున్సిపాలిటీ అధికారుల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. నిబంధనల ప్రకారం దుకాణాలు ఏర్పాటు చేశారా లేదా అన్న అంశాలపై అధికారులు పరిశీలించాలి. నిబంధనలు ఇలా.. * ముందుగా రూ.500 చాలన్ తీసి అగ్నిమాపక శాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది. * దుకాణానికి సంబంధించిన అన్ని శాఖల అనుమతి పత్రాలతో సంబంధిత తహశీల్దార్కు దరఖాస్తు చేసుకోవాలి. * తహశీల్దార్ ఆర్డీవోకు దరఖాస్తులు అందిస్తారు. వాటిని ఆర్డీవో పరిశీలించిన అనంతరం కలెక్టర్కు అందజేసి అనుమతి తీసుకుంటారు. * హోల్సెల్ దుకాణం అనుమతి పొందాలంటే ముందుగా రూ. 2500 చాలన్తో అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోవాలి. * ఆ తర్వాత హోల్సెల్ దుకాణానికి టపాసులు సరఫరా చేసే ప్రాంతం నుంచి అనుమతి ఉంటుంది. * జిల్లాలోని హోల్సెల్ దుకాణ వ్యాపారులు చెన్నై నుంచి టపాసులు తెచ్చుకుంటారు. అక్కడి అనుమతి పొందేందుకు వివిధ రకాలైన 900 నుంచి 3600 కేజీల టపాసులు భద్రపరిచేందుకు గది అనువైందిగా ఉండాలి. * పండుగ ముగిశాక కూడా 300 నుంచి 1200 వరకు టపాసులు అందుబాటులో పెట్టుకునేందుకు రూ.4,700 చాలన్ కట్టాల్సి ఉంటుంది. ఆ సంస్థ వారు మళ్లీ ఇక్కడి అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకొని సదరు దుకాణానికి అనుమతి ఇస్తుంది. వ్యాపారులు పాటించాల్సినవి.. * టపాసులు విక్రయించే వ్యాపారులు సైతం పలు జాగ్రత్తలు పాటించాలి. దుకాణాల సమీపంలో ఎవరూ బాణా సంచా పేల్చకుండా చూసుకోవాలి. * రెండు టపాకాయల దుకాణాల మధ్య కనీసం పది మీటర్ల దూరం ఉండాలి. * దుకాణంలో ఇసుక నింపిన ఫైల్ బకెట్లు, 200 లీటర్ల నీటితో నింపిన బ్యారెళ్లు సిద్ధంగా ఉంచాలి. * పరిమితంగా బాణాసంచా నిల్వ చేయాలి. విద్యుత్ తీగలను తనిఖీ చేస్తూ ఉండాలి. * టపాసులను విక్రయించే దుకాణాలను అగ్ని ప్రమాదాలకు అవకాశం లేని రీతిలో ఐరన్ రేకులతో నిర్మించాలి. * దుకాణానికి ఉండే విద్యుత్ సరఫరాలో లూజ్ కనెక్షన్లు లేకుండా జాగ్రత్త పడాలి. తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు ప్రమాదకరం. * పతి దుకాణంలో 5 కిలోల డ్రై కెమికల్ పౌడర్ అందుబాటులో ఉంచాలి. * దుకాణా పరిసర ప్రాంతాలన్నీ నో స్మోకింగ్ జోన్లుగా ప్రకటించి.. పొగ తాగే వారిపై నిఘా పెట్టాలి. * 18 ఏళ్లలోపు పిల్లలను దుకాణాల్లో పెట్టుకోకూడదు. అనుమతి లేకుంటే సీజ్ చేస్తాం.. - శంకర్లింగం, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తాం. కేవలం ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే విక్రయాలు జరపాలి. ఇళ్లలో, హోల్సెల్ దుకాణాల్లో టపాసులు నిల్వ ఉంచి విక్రయిస్తే క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుంది. అనుమతులు ఉన్న దుకాణాల్లోని టపాసులు కొనుగోలు చేయాలి. అనుమతులు లేకుండా టపాసులు విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దు.