ఆదిత్యరావు బ్యాగులో సెనైడ్‌ లభ్యం | Mangaluru Bomb Case: Aditya Rao taken to Udupi | Sakshi
Sakshi News home page

ఆదిత్యరావు బ్యాగులో సెనైడ్‌ లభ్యం

Published Sun, Jan 26 2020 9:04 AM | Last Updated on Sun, Jan 26 2020 1:45 PM

Mangaluru Bomb Case: Aditya Rao taken to Udupi - Sakshi

సాక్షి బెంగళూరు: మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పెట్టిన ఆదిత్యరావుకు సంబంధించి పోలీసులు తనిఖీ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఆదిత్యరావు బ్యాగులో సెనైడ్‌ లభ్యం కావడం, అంతేకాకుండా కర్ణాటక బ్యాంకులో ఓ లాకర్‌ బాంబు తయారీ వస్తువులన్నీ భద్రపరిచినట్లు తెలిపాడు. ఈక్రమంలో ఉడుపిలోని కర్ణాటక బ్యాంకుకు తీసుకెళ్లారు. తనిఖీ చేయగా బ్యాగులో తెల్లటి రంగులో ఉన్న పొడిని సెనైడ్‌గా పోలీసులు భావించారు. (అందుకే ఎయిర్పోర్టులో బాంబు పెట్టాను)


మంగళూరు విమానాశ్రయంలో బాంబు పెట్టే సమయంలో ఎవరైనా అడ్డు వస్తే సెనైడ్‌ టచ్‌ చేసి వెళ్లేందుకు సిద్ధమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గత ఆరు నెలలుగా సెనైడ్‌ను బ్యాంకు లాకర్‌లో ఉంచినట్లు ఆదిత్యరావు తెలిపాడు. అదేవిధంగా మంగళూరులో బాంబు పెట్టిన రోజున అతడు ఉడుపిలోని వడాభండేశ్వర ఆలయానికి  వెళ్లాడు. ఈక్రమంలో తనిఖీల్లో భాగంగా నిన్న ఆదిత్యరావును ఉడుపి తీసుకెళ్లారు. ఆలయం నుంచి జిమ్‌ మాస్టర్‌కు తన సిమ్‌ నుంచి కాల్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఎంత ప్రయత్నించినా నిందితుడు ఉపయోగించిన సిమ్‌ లభ్యం కాలేదు. (మంగళూరు ఎయిర్పోర్టులో బాంబు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement