
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కోర్టు అనుమతి కోరింది. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సీబీఐ. తీహార్ జైలులో కవితను లిక్కర్ స్కాం కేసులో విచారించి, ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలని కోరుతూ పిటిషన్ వేసింది.
కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. జైల్లోకి ల్యాప్టాప్, స్టేషనరీ తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది. లిక్కర్ కేసులో కవితను విచారించి, ఆమెస్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. వచ్చే వారం తీహార్ జైలులోనే కవితను దర్యాప్తు సంస్థ విచారించనుంది. ఆప్కు ఇచ్చిన రూ. 100 కోట్ల వ్యవహారంపై ప్రశ్నించనుంది.
అయితే గతంలోనే తమ ఎదుట హాజరుకావాలని కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ 2022 డిసెంబర్ 2న కవితకు నోటీసులు పంపింది.
ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత.. ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత నెల(మార్చి 15న) కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచగా ఏడు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో మూడు రోజుల కస్టడీ విధించింది. అనంతరం మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పర్చగా కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
చదవండి: Liquor Case : కవిత బెయిల్పై ఏప్రిల్ 8న తీర్పు
Delhi excise case: Central Bureau of Investigation (CBI) moves an application seeking permission to interrogate/record the statement of BRS leader K Kavitha in Tihar Jail
— ANI (@ANI) April 5, 2024
K Kavitha is presently in judicial custody and was arrested by the Enforcement Directorate.
Comments
Please login to add a commentAdd a comment