
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కష్టకాలంలో అత్యవసర సేవలందించిన కరోనా వారియర్స్ని ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్ర్య వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది. కరోనా నేపథ్యంలో స్వాతంత్ర్య వేడుకలపై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ర్ట రాజధాని ప్రాంతాల్లో ఉదయం 9 గంటలకు వేడుకలను నిర్వహించాలని పేర్కొంది. కరోనా దృష్ట్యా భారీ స్థాయిలో జనం వేడుకల్లో పాల్గొనకుండా చూడాలని అన్ని రాష్ర్ట ప్రభుత్వాలను కోరింది. స్వాతంత్ర్య వేడుకల్లో నిర్వహించే మార్చ్ఫాస్ట్కు పోలీసు, ఆర్మీ, పారామిలటరీ, ఎన్సీసీ దళాలు మాస్క్ ధరించాలని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment