guidelines
-
అమ్మో... కాటు!.. 600 మంది మృతి
దేశంలో మూడేళ్లుగా పాముకాట్లు పెరుగుతున్నాయి. పాము కాటుకు గురై మృతి చెందిన వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. 2022 నుంచి 2024 వరకు గత మూడేళ్లలో దేశంలో 2.69 లక్షల పాము కాటు కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో పాము కాటుకు మృతి చెందిన వారి సంఖ్య 600కు చేరింది. పాము కాటు కేసులు అత్యధికంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, అసోం రాష్ట్రాల్లో నమోదైనట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. పాము కాటుకు గురై చనిపోయిన వారు కర్ణాటక, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశాలో అత్యధికంగా ఉన్నట్లు వెల్లడించింది. – సాక్షి, అమరావతివైద్య వ్యవస్థ బలోపేతానికి చర్యలుపాము కాటు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపింది. పాముకాటు నివారణకు మార్గదర్శకాలను కూడా జారీ చేసినట్లు పేర్కొంది. పాము కాటుకు చికిత్స అందించేందుకు వైద్య వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అత్యవసర మందులు, పరికరాలు, రవాణా యంత్రాంగం, ఇతర సౌకర్యాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం అందిస్తోందని తెలిపింది. జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన ఔషధాల జాబితాలో పాలీవాలెంట్ యాంటీ స్నేక్ వెనంను చేర్చినట్లు పేర్కొంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉచిత ఔషధాలకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధులు ఇస్తున్నట్లు తెలిపింది. దేశంలో పాటుకాటు నివారణ కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పాము కాటు నిర్వహణ, అత్యవసర సంరక్షణ తదితర అంశాలపై వైద్య నిపుణులకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రజా వైద్య శాలల్లోని వైద్యులను పాము కాటు కేసుల అత్యవసర నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలతో సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. -
అవకతవకలకు తావులేకుండా...
న్యూఢిల్లీ: క్రీడాకారుల ఎంపిక విషయంలో పారదర్శకత పెంపొందించాలనుకుంటున్న కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ... జాతీయ క్రీడా సమాఖ్యలకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. సెలెక్షన్ ప్రక్రియను వీడియో రూపంలో పొందుపరచాలని ఇప్పటికే స్పష్టంచేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ... ఎంపిక ప్రక్రియకు ముందు పాటించాల్సిన నింబధనలను తాజాగా వెల్లడించింది. సెలెక్షన్లో అవకతవకలకు తావివ్వకుండా జావాబుదారీతనం పెంపొందించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. క్రీడాకారులను ఎంపిక చేయడానికి 15 రోజుల ముందే దానికి సంబంధించిన పూర్తి వివరాలను వివిధ జాతీయ క్రీడా సమాఖ్యలు వెల్లడించాలని క్రీడా మంత్రిత్వ శాఖ సూచించింది. దీనివల్ల ట్రయల్స్లో అన్యాయం జరిగిందనే విమర్శలకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. ఇటీవలి కాలంలో రెజ్లింగ్, షూటింగ్తో పాటు సెలెక్షన్స్ అవకతవకలపై పలు ఫిర్యాదులు అందడంతో... కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ జాతీయ క్రీడా సమాఖ్యలకు ప్రత్యేక సూచనలు చేశారు.ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకూడదని సూచించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. భారత ఒలింపిక్స్ సంఘం (ఐఓఏ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్), జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు పంపింది. » ఎంపిక ప్రక్రియకు సంబంధించిన నియమ నిబంధనలను ప్రతి సమాఖ్య తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరచడం తప్పనిసరి. సెలెక్షన్కు మూడు నెలల సమయం ఉన్నప్పుడు మాత్రమే వాటిలో మార్పు చేర్పులు చేయాలి. » సెలెక్షన్ ప్రక్రియనంతా వీడియోలో నిక్షిప్తం చేయాలి. వీటి రికార్డులను సెలెక్షన్ కమిటీ సంతకం చేసిన అనంతరం విధిగా ‘సాయ్’కు అందజేయాలి. ప్రతి ట్రయల్కు ముందు అవసరమైన ఆర్థిక సహాయానికి సంబంధించిన వివరాలను మంత్రిత్వ శాఖకు తెలియజేయాలి. » ఒలింపిక్స్, పారాలింపిక్స్, ఆసియా గేమ్స్, పారా ఆసియా గేమ్స్, కామన్వెల్త్ క్రీడల వంటి పెద్ద టోర్నీల ఎంపిక ప్రమాణాలను కనీసం రెండు సంవత్సరాల ముందుగానే పొందుపరచాలి. ఈ అంశంలో అథ్లెట్లకు అవగాహన కల్పించాలి. » విదేశీ టోర్నీల్లో పాల్గొనేందుకు వెళ్లే సమయంలో పాటిస్తున్న నిబంధనల విషయంలో పునరాలోచించాలని ప్రముఖ షూటింగ్ కోచ్ జస్పాల్ రాణా గతంలోనే కోరగా... తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ అంశంలోనూ కీలక సవరణలు చేసింది. » సెలెక్షన్ కమిటీలోని సభ్యులెవరూ... ఫిర్యాదుల పరిష్కార కమిటీలో భాగం కాకూడదు. ఇది సహజ న్యాయ సూత్రానికి విరుద్ధం. జాతీయ క్రీడా సమాఖ్య వివాద పరిష్కార కమిషన్ను ఏర్పాటు చేసుకోవాలి. » జాతీయ క్రీడా సమాఖ్యల అధ్యక్షులు ఎంపిక ప్రక్రియను దగ్గరుండి పరిశీలించాలి. హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్, చీఫ్ కోచ్, మాజీ క్రీడాకారులు, ఖేల్రత్న, అర్జున అవార్డు గ్రహీతలు ఇలా అందుబాటులో ఉన్న వారిని సెలెక్షన్ కమిటీకి ఎంపిక చేసే అధికారం జాతీయ క్రీడా సమాఖ్యల అధ్యక్షులదే. -
సెబీ మార్గదర్శకాలలో సవరణలు
న్యూఢిల్లీ: డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలకు నామినీలను పేర్కొనే విషయంలో నిబంధనలను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సవరించింది. ఆస్తుల బదిలీ, నామినీ సులభతర ఎంపికకు వీలుగా మార్గదర్శకాలను సవరిస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. వెరసి సెక్యూరిటీల మార్కెట్లలో నామినేషన్ సౌకర్యంపై అవసరమైన స్పష్టతను కల్పించింది.ఒక వ్యక్తి లేదా సంయుక్త ఖాతాదారులలో ఒకరు మరణిస్తే ఆస్తుల బదిలీని అదనపు కేవైసీ అవసరంలేకుండా రెండవ వ్యక్తికి బదిలీ చేసేందుకు దారి ఏర్పాటు చేసింది. ముందస్తుగానే కేవైసీ ఇచ్చి ఉంటే వీటి అవసరం ఉండదు. ఖాతాదారులలో జీవించి ఉన్న వ్యక్తి ఏ సమయంలోనైనా కాంటాక్టు వివరాలు, నామినీ మార్పు వంటివి చేపట్టవచ్చు.ఈ బాటలో ఫిజికల్గా ఖాతా నిర్వహించేలేని వ్యక్తులు, ఎన్ఆర్ఐలకు సంబంధించి సైతం మార్పులు ప్రవేపెట్టింది. తాజా సవరణలు 2025 మార్చి1 నుంచి మూడు దశలలో అమలుకానున్నాయి. సవరించిన మరికొన్ని నిబంధనలు జూన్1 నుంచి, పూర్తి నిబంధనలు సెపె్టంబర్ 1నుంచి వర్తించనున్నాయి. -
Mahakumbh: మాఘ పూర్ణిమకు సన్నాహాలు.. క్రౌడ్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి
మహాకుంభమేళాకు నేడు (మంగళవారం) 30వ రోజు. ఈ రోజు ఉదయం 8 గంటల సమయానికి మొత్తం 49.68 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. ప్రస్తుతం త్రివేణీ సంగమం వద్ద పుణ్య స్నానాలు చేసేందుకు భక్తుల బారులు తీరారు. ఫిబ్రవరి 12న వచ్చే మాఘపౌర్ణమి పుణ్య స్నానాలకు అధికారులు పకడందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రయాగ్రాజ్లో నూతన ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నారు. #WATCH प्रयागराज: त्रिवेणी संगम पर पवित्र डुबकी लगाने के लिए महाकुंभ मेला क्षेत्र में श्रद्धालुओं की भारी भीड़ पहुंची।#MahaKumbh2025 pic.twitter.com/Qp7OYkvCVA— ANI_HindiNews (@AHindinews) February 11, 2025ఫిబ్రవరి 10 వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఈ నిబంధనలను అమలులోకి తీసుకువచ్చారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 13 రాత్రి 8 గంటల వరకూ కుంభమేళాకు ఎటువంటి వాహనాలనూ అనుమతించరు. కేవలం కుంభమేళాలో విధులు నిర్వహించే అధికారులు, వైద్య సిబ్బందికి సంబంధించిన వాహనాలను మాత్రమే ప్రయాగ్రాజ్లోకి అనుమతించనున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మహాకుంభమేళాపై అధికారులతో సమీక్ష జరిపారు. మాఘపౌర్ణిమ నాడు ట్రాఫిక్ నియంత్రణ, క్రౌడ్ మేనేజిమెంట్ను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.సంగమానికి ఎలా వెళ్లాలి?సంగమం చేరుకోవడానికి నడక మార్గం: భక్తులు జీటీ జవహర్ మార్గ్ నుండి త్రివేణీ సంగమానికి చేరుకోవచ్చు. ఈ నడకమార్గంలో భక్తులు కాళీ రాంప్, సంగమం అప్పర్ రోడ్ ద్వారా త్రివేణీ సంగమానికి రావాల్సివుంటుంది.తిరుగు నడక మార్గం: సంగమం ప్రాంతం నుండి అక్షయవత్ మార్గ్ మీదుగా తిరుగు మార్గంలో నడచివెళ్లాల్సివుంటుంది.#WATCH प्रयागराज, उत्तर प्रदेश: #MahaKumbh2025 के दौरान श्रद्धालु त्रिवेणी संगम घाट पर पावन स्नान के लिए पहुंच रहे हैं।वीडियो ड्रोन से ली गई है। pic.twitter.com/mXgJqnT7lg— ANI_HindiNews (@AHindinews) February 11, 2025అధికారులకు సీఎం ఆదిత్యనాథ్ సూచనలుమహా కుంభమేళాకు సంబంధించి అధికారులతో సీఎం యోగి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు.1.మహా కుంభ్ మార్గ్లో ట్రాఫిక్ ఎక్కడా ఆగకూడదు. పార్కింగ్ స్థలాలను సక్రమంగా నిర్వహించాలి.2 ప్రయాగ్రాజ్కు భక్తులు అన్ని దిశల నుండి వస్తున్నందున రోడ్లపై వాహనాల క్యూలు ఉండకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలి.3. మాఘ పూర్ణిమ నాడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వసంత పంచమి నాడు అమలు చేసిన వ్యవస్థలను తిరిగి అమలు చేయాలి.4. పిల్లలు, వృద్ధులు, మహిళల భద్రత విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పార్కింగ్ ప్రాంతం నుండి జాతర ప్రాంగణానికి షటిల్ బస్సుల సంఖ్యను పెంచాలి.5. అనుమతి లేకుండా ఏ వాహనాన్ని కూడా కుంభమేళా జరిగే ప్రాంగణంలోకి అనుమతించకూడదు.6. ప్రతి భక్తుడిని వారి ఇంటికి సురక్షితంగా చేర్చడమనేది అధికారుల బాధ్యత.7. మహాకుంభ్ ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలి. ఉత్సవం జరుగుతున్న ప్రాంతాలన్నింటినీ క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలి.8 ప్రయాగ్రాజ్కు ఆనుకుని ఉన్న జిల్లాల అధికారులు ప్రయాగ్రాజ్ అధికారులతో నిరంతరం టచ్లో ఉండాలి. వాహనాల కదలికలను పరస్పర సమన్వయంతో పర్యవేక్షిస్తుండాలి.9. ప్రయాగ్రాజ్లోని ఏ రైల్వే స్టేషన్లోనూ అధిక జనసమూహం గుమిగూడకుండా చూసుకోవాలి. స్పెషల్ రైళ్లు, అదనపు బస్సులను నడపాలని సీఎం సంబంధిత అధికారులకు సూచించారు. ఇది కూడా చదవండి: ‘అద్భుత స్వాగతం’.. పారిస్ నుంచి ప్రధాని మోదీ వీడియో -
వర్సిటీలపై ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని రుద్దే కుట్ర
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విడుదల చేసిన నూతన మార్గదర్శకాలు దేశ సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్నాయని మేధావులు ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వర్సిటీలపై రుద్దే కుట్రలో భాగంగానే ఈ మార్గదర్శకాలను రూపొందించారని ఆరోపించారు. రాష్ట్ర విద్యా కమిషన్ నేతృత్వంలో ‘యూనివర్సిటీ రెగ్యులేషన్స్ – రాష్ట్ర యూనివర్సిటీల్లో జోక్యం’ అనే అంశంపై గురువారం హైదరాబాద్లో నిర్వహించిన సదస్సులో విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, జస్టిస్ సుదర్శన్రెడ్డి, ప్రొఫెసర్లు హరగోపాల్, శాంతాసిన్హా, రాం మెల్కొటే, డి.నర్సింహారెడ్డి, తిరుపతిరావు, మురళీ మనోహర్, ఎస్.సత్యనారాయణ, అమీర్ ఉల్లాఖాన్, కె.లక్ష్మీనారాయణ, పద్మాషా, డాక్టర్ చరకొండ వెంకటేశ్ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. యూజీసీ మార్గదర్శకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాల వ్యాప్తికే: మురళి విశ్వవిద్యాలయాల అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకోవడానికే యూజీసీ కొత్త మార్గదర్శకాలను తెచ్చిందని ఆకునూరి మురళి విమర్శించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. బోదన, బోధనేతర సిబ్బంది నియామకాలన్నీ కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. యూనివర్సిటీకి వైస్ చాన్స్లర్గా నియమించాలంటే పీహెచ్డీ చేసి, పదేళ్లు ప్రొఫెసర్గా పనిచేసి ఉండాలనే నిబంధనను యూజీసీ ముసాయిదా మార్గదర్శకాల్లో పూర్తిగా మార్చేశారని తెలిపారు. పరిశ్రమలు, అకడమిక్ అడ్మినిస్ట్రేటర్ , పబ్లిక్ సెక్టార్లో.. ఇలా నచ్చిన వారిని ఎలాంటి నిబంధనలు లేకుండా నియమించుకునే అధికారం కేంద్రం తన చేతుల్లోకి తీసుకునేలా మార్గదర్శకాలు ఉన్నా యని చెప్పారు. మితిమీరిన జోక్యం: ప్రొఫెసర్ కోదండరాం విశ్వవిద్యాలయాలపై కేంద్రం మితిమీరిన జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీలు ఉండేలా చూ సేందుకు ఏర్పాటుచేసిన యూజీసీనే ఇప్పుడు రాజకీయం చేయడం దారుణమన్నారు. జస్టిస్ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. వర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడేందుకు అన్నివర్గాలు సమైక్యంగా గళమెత్తాలన్నారు. వీసీలను నియమించే అధికారం ఇప్పటికే గవర్నర్ చేతుల్లో ఉందని, ఆ గవర్నర్ను కేంద్రమే తన ప్రతినిధిగా నియమిస్తుందని గుర్తుచేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై కూడా ఈ తరహా చర్చలు ఎందుకు పెట్టడం లేదని ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్స్ అసోసియేషన్ నేత ఆజాద్ సదస్సులో ప్రశ్నించారు. -
TG: రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: రైతుభరోసా(Rythu Bharosa) మార్గదర్శకాలను తెలంగాణ సర్కార్ (Telangana Government) విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు. భూ భారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనున్నట్లు ప్రకటించింది. భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు అందించనున్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా ప్రభుత్వం సాయం అందించనుంది. సాగు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కాగా ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని వచ్చేనెల 15 నుంచి 28వ తేదీలోపు అమల్లోకి తీసుకొచ్చేలా విధివిధానాలు ఖరారు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మేధావులు, ఉద్యోగులు, రైతులు, పార్టీల నాయకుల అభిప్రాయాలను సేకరించి భూభారతి చట్టం తీసుకు వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వాలు ఏ చట్టం చేసినా కొన్ని నిబంధనలు ఉంటాయని, అయితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’లోపభూయిష్టంగా ఉందని అన్నారు.ఇదీ చదవండి: హైదరాబాద్లో లక్ష ఇళ్లు @సేల్! ప్రజాపాలన సభల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.15 కోట్ల దరఖాస్తులు వస్తే.. అందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80.60 లక్షల దరఖాస్తులు ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో అర్హులను గుర్తించేందుకు ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ మినహా సుమారు 72 లక్షల దరఖాస్తులపై సర్వే చేపట్టామని, ఈ పథకానికి సంబంధించిన అర్హులను ఈనెల 26న గ్రామసభల్లో నిర్ణయిస్తామని చెప్పారు. అదేరోజు రైతుభరోసాతో పాటు తెల్లరేషన్ కార్డుల ప్రక్రియ, భూమి లేని నిరుపేదలకు ఏటా రూ.12 వేలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వివరించారు. ఈ పథకాలకు అర్హుల గుర్తింపునకు ఈనెల 16 నుంచి కసరత్తు చేపట్టనున్నట్లు తెలిపారు. -
ప్రైవేటు చేతికి ఇంటి ప్లాన్ అనుమతులు!
సాక్షి, అమరావతి: పట్టణ ప్రణాళిక విభాగంలో భవన నిర్మాణ అనుమతుల మంజూరు బాధ్యతలు ప్రైవేటుపరం కానున్నాయి. ఇప్పటివరకు స్థల యజమానులకు ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా భవన నిర్మాణ ప్లాన్లు ఇచ్చే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ (ఎల్టీపీలు) ఇకపై నిర్మాణ అనుమతులు కూడా మంజూరు చేయనున్నారు. ఇంటి నిర్మాణ ప్లాన్ల మంజూరు ముసుగులో ఎమ్మెల్యేలు సొమ్ములు దండుకునేందుకు వీలుగా ఈ మార్పు చేస్తున్నట్టు సమాచారం. ఇలా దండుకున్న మొత్తంలో ‘ముఖ్య నేత’కు వాటాలు దక్కేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు భోగట్టా. ఇందుకోసం పురపాలక పట్టణాభివృద్ధి శాఖలోని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో మార్గదర్శకాలను మారుస్తున్నారు. ఇందుకోసం టౌన్ప్లానింగ్ చట్టాల్లో ప్రభుత్వం మార్పులు చేస్తోంది. 15 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాలకు ప్లానింగ్తో పాటు నిర్మాణ అనుమతులనూ ఎల్టీపీలే జారీ చేసేలా అధికారం ఇవ్వనున్నారు. ఇలాంటి నిర్మాణాలపై ఫిర్యాదు అందితేనే టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ నిర్మాణాన్ని పరిశీలించి చర్యలకు సిఫారసు చేసేలా నిబంధనలు ఉండనున్నాయి. ఈ విధానంతో ప్రభుత్వ అనుమతిలేని లే–అవుట్లలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరగడంతోపాటు దురాక్రమణలకూ అస్కారం ఉంటుంది. ఇటీవల చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార లే–అవుట్లో ఓ మంత్రి చేపట్టిన భవన నిర్మాణానికి అక్కడి సిటీ ప్లానర్ అనుమతిచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన మంత్రి, నిర్మాణ అనుమతులు మంజూరు చేసే అధికారాన్ని టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి తొలగించి, ఎల్టీపీలకు అప్పగించేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఏపీ లో అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న 4 వేల మంది వార్డు ప్లానింగ్ కార్యదర్శులతో పాటు టీపీవోలు, ఏసీపీలు, సీపీల విధులు, బాధ్యతలను లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లకు అప్పగించనున్నట్టు తెలిసింది.అక్రమ నిర్మాణాలకు లైసెన్స్ ఇచ్చినట్టే..ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాలు చేపట్టాలంటే సంబంధిత టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతి తప్పనిసరి. ఇందుకోసం స్థల యజమానులు నిర్మాణ ప్లాన్తో పాటు నిర్ణీత రుసుం చెల్లించి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జతచేసి ఎల్టీపీ ద్వారా టౌన్ ప్లానింగ్ విభాగానికి పంపిస్తున్నారు. ఈ ప్లాన్ను టౌన్ ప్లానింగ్ విభాగంలోని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టీపీవో) లేదా అసిస్టెంట్ సిటీ ప్లానర్ లేదా సిటీ ప్లానర్ పరిశీలించి అనుమతి ఇస్తారు. అంతకుముందు ఏపీడీఎంఎస్లో ఉన్న నిబంధనల మేరకు ప్లాన్ ఉందో లేదో సాఫ్ట్టెక్ రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలిస్తారు. సదరు ప్లాన్ నిబంధనల పరిధిలో ఉండి అన్ని ఫీజులు చెల్లించి ఉంటే ఆన్లైన్లో నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తారు. ప్లాన్ ఇచ్చేవారు, అనుమతి ఇచ్చేవారు ఒక్కరే అయితే నిబంధనలు అతిక్రమించే ప్రమాదముందన్న భావనతో గతంలో ఈ రెండు విధులు వేర్వేరుగా ఉంచారు. దీంతోపాటు ఎక్కడైనా నిబంధనలు అతిక్రమించి నిర్మాణ ప్లాన్ మంజూరైతే దీనిపై తీవ్రమైన చర్యలు తీసుకునేలా గత ప్రభుత్వంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తప్పు చేసిన ఎల్టీపీ లైసెన్స్ను పూర్తిగా రద్దు చేయడంతో పాటు అనుమతి మంజూరు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులపైనా చర్యలు తీసుకునేవారు. కొత్త నిబంధనల ప్రకారం ప్లాన్ గీసేదీ, ప్రభుత్వానికి పంపేది.. వాటిని అనుమతి ఇచ్చేదీ ఎల్టీపీనే. 15 మీటర్ల ఎత్తు భవనాలకు అంటే ఐదు అంతస్తుల భవన నిర్మాణాల అనుమతులన్నీ పూర్తిగా ఎల్టీపీలకు ఇవ్వనున్నారు. ఇందులో ఎంత విస్తీర్ణం అనే చెప్పకపోవడంతో భారీగా అక్రమాలు చోటుచేసుకునే ఆస్కారముందని, అనధికార లే–అవుట్లలో ప్లాట్లకు కూడా అనుమతులు మంజూరు చేసే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా ఇలాంటి నిర్మాణాలపై ఫిర్యాదు అందితేనే టౌన్ప్లానింగ్ అధికారులు పరిశీలన చేయాలన్న నిబంధన కూడా విధించినట్టు తెలుస్తోంది. టౌన్ ప్లానింగ్ చట్టంలో మార్పులు చేయాలని ఆదేశించిన మంత్రి.. త్వరలో ఈ నిబంధనలు అమల్లోకి తేవాలని పట్టుదలతో ఉన్నట్టు తెలిసింది. -
‘హెచ్ఎంపీవీ’పై అప్రమత్తం!
సాక్షి, హైదరాబాద్: చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్ఎంపీవీ) వేగంగా వ్యాప్తి చెందుతోందన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రజలకు శనివారం పలు సూచనలు చేసింది. హెచ్ఎంపీవీ గురించి ఆందోళన చెందకుండా, శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డీజీహెచ్ఎస్) సూచించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్యాధికారులకు పలు ఆదేశాలు జారీచేసింది. ఎవరిలోనైనా వైరస్ లక్షణాలు బయటపడితే తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించింది. హైదరాబాద్లోని ఫీవర్, గాంధీ, ఉస్మానియా, రాం కోఠి, పేట్ల బురుజు వంటి ప్రధాన ఆసుపత్రులతో పాటు అన్ని జిల్లాల ఆసుపత్రులను అప్రమత్తం చేసింది. అదే సమయంలో అనారోగ్యంతో ఉన్నవారు కరోనా సమయంలో వ్యవహరించిన విధంగానే మాసు్కలు, చేతి రుమాలుతో జాగ్రత్తలు పాటించాలని ప్రజారోగ్య సంచాలకుడు బి.రవీందర్ నాయక్ సూచించారు. ప్రజలు పాటించవలసిన జాగ్రత్తలు, చేయకూడని పనులకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు.హెచ్ఎంపీవీ కూడా ఇతర శ్వాసకోశ వైరస్లలాగే శీతాకాలంలో ప్రధానంగా యువకులు, వృద్ధులలో సాధారణ జలుపు, ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలో హెచ్ఎంపీవీ కేసులేవీ నమోదు కాలేదని చెప్పారు. అయితే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన ప్రస్తుత డేటాను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. హెచ్ఎంపీవీ విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు చేయాల్సిన పనులు.. » దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కును రుమాలు లేదా టిష్యూ పేపర్, మాస్్కతో కప్పుకోవాలి. » చేతులను తరచుగా సబ్బు, నీరు లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్తో కడగాలి. » రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ఫ్లూతో బాధపడుతున్న వ్యక్తుల నుంచి ఒక మూరెడు పొడవు కంటే ఎక్కువ దూరంలో ఉండాలి. » మీకు జ్వరం, దగ్గు, తుమ్ములు ఉంటే బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండండి. » పుష్కలంగా నీరు తాగాలి. పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. » అంటువ్యాధులను తగ్గించడానికి తగినంత గాలి వీచే ప్రదేశాలలో ఉండాలి. » అనారోగ్యంతో ఉంటే ఇంట్లోనే ఇతరులను కలవకుండా ఉండాలి. » కంటినిండా నిద్రపోవాలి.చేయకూడనివి.. » ఇతరులతో కరచాలనం చేయకండి. » ఒకటే టిష్యూ పేపర్, చేతి రుమాలును పదేపదే వాడకండి. » అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు సన్నిహితంగా మెలగొద్దు. » కళ్లు, ముక్కు, నోటిని తరచూ తాకవద్దు. » బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకండి. » వైద్యుడిని సంప్రదించకుండా ఔషధాలు వాడకూడదు. -
యూపీ ఉప ఎన్నికలు.. ఈసీ వార్నింగ్, ఏడుగురి పోలీసుల సస్పెండ్
మహారాష్ట్ర, ఝార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వీటితోపాటు దేశ వ్యాప్తంగా పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నేడు జరుగుతున్నాయి.అయితే ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్లో పోలీసులు బురఖా ధరించిన ఓటర్లను తనిఖీ చేయడంపై వివాదం చేలరేగింది. దీనిపై తాజాగా ఎన్నికల సంఘం స్పందించింది. నిష్పక్షపాతంగా ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని భారత ఎన్నికల సంఘం బుధవారం అధికారులను కోరింది. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడానికి మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోలీసు సిబ్బందిని కూడా ఈసీ సస్పెండ్ చేసింది.అర్హత ఉన్న ఓటరు ఓటు వేయకుండా అడ్డుకోరాదని తెలిపింది. ఓటింగ్ సమయంలో ఎలాంటి పక్షపాత వైఖరిని సహించబోమని స్పష్టం చేసింది. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ జరుపుతామని, ఎవరైనా దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపింది.కాగా ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక కొనసాగుతుండగా.. బురఖా ధరించిన ఓటర్ల గుర్తింపును సరిగ్గా తనిఖీ చేయాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు బీజేపీ నేత అఖిలేష్ కుమార్ అవస్తీ లేఖ రాసింది. ముసుగులు ధరించిన మహిళలు చాలాసార్లు ఓటు వేయడానికి ప్రయత్నించిన కేసులు గతంలో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. అంతేకగాక కొంతమంది పురుషులు కూడా బురఖా ధరించి ఓటు వేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అయితే వీరిని ఈసీ అధికారులు అడ్డుకున్నారని చెప్పారు. బురఖా ధరించిన మహిళల గుర్తింపును తనిఖీ చేయకపోతే, నకిలీ ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. సరైన తనిఖీ మాత్రమే న్యాయమైన, పారదర్శకమైన ఓటింగ్కు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బురఖా ధరించిన మహిళలను తనిఖీ చేసేందుకు తగిన సంఖ్యలో మహిళా పోలీసులను పోలింగ్ కేంద్రాల వద్ద తప్పనిసరిగా మోహరించాలని ఆయన అన్నారు. ఓటరు ఐడీ కార్డులను తనిఖీ చేస్తున్న పోలీసులపై ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ ధ్వజమెత్తింది. పార్టీ చీఫ్, లోక్సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఇద్దరు పోలీసులు ఓటర్ల గుర్తింపు కార్డులు అడిగే వీడియోను షేర్ చేస్తూ.. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ జోక్యాన్ని కోరారు."ఎన్నికల సంఘం యాక్టివ్గా ఉంటే.. పోలీసులు ఓటర్ల ఐడీలను తనిఖీ చేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. రోడ్లు మూసివేయకుండా, ఐడీలను స్వాధీనం చేసుకోకుండా, ఓటర్లను బెదిరించకుండా, ఓటింగ్ వేగం మందగించకుండా, సమయం వృధా కాకుండా చూసుకోవాలని అన్నారు. అధికార పార్టీకి ప్రతినిధిగా ఉండకుండా పరిపాలనను చూసుకోవాలని తెలిపారు. అయితే అఖిలేష్ యాదవ్ పోస్టుపై కాన్పూర్ పోలీసులు సైతం స్పందించారు. ఓటర్లను తనిఖీ చేసిన సంబంధిత అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.. ఎన్నికల సమయంలో రాష్ట్ర పోలీసులు ఎన్నికల సంఘం ఆధీనంలోకి వస్తారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడానికి మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోలీసు సిబ్బందిని కూడా ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
పశువులు, కోళ్ల వైద్యానికి ప్రామాణిక మార్గదర్శకాలు
పశువులు, కోళ్ల వైద్యానికి సంబందించి సరికొత్తప్రామాణిక మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రంయాంటీబయాటిక్ తదితర ఔషధాల వినియోగాన్ని తగ్గించటం, దుర్వినియోగాన్ని అరికట్టే ప్రత్యామ్నాయ చికిత్సలపై దృష్టి సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఈవీఎంల)కు పెద్దపీటఈవీఎంలపైప్రాంతీయ భాషల్లో పుస్తకాలు, వీడియోలు ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన ఎన్.డి.డి.బి.దేశంలో పశువులు, కోళ్లకు వచ్చే జబ్బులు, ఇన్ఫెక్షన్లకు అందించేప్రామాణిక చికిత్సా పద్ధతులను నిర్దేశిస్తూ కేంద్ర పశు సంవర్థక, పాడి అభివృద్ధి శాఖ సరికొత్త మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. పాడి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు తదితర పశువులతో పాటు కోళ్ల చికిత్సకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. నిర్హేతుకంగా యాంటీబయాటిక్స్ తదితర అల్లోపతి ఔషధాల వినియోగాన్ని కట్టడి చేయటంతో పాటు.. ఆరోగ్యదాయకమైన ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులను విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చే లక్ష్యంతో కేంద్రం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా పాడి పశువుల చికిత్సలో చీటికి మాటికి యాంటీబయాటిక్స్ను అతిగా వాడటం, దుర్వినియోగం చేయటం వల్ల పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు తదితర ఆహారోత్పత్తుల్లో వాటి అవశేషాలు మోతాదుకు మించి మిగిలి΄ోతున్నాయి.పశువైద్యంలో యాంటీబయాటిక్ మందులను అతిగా వాడటం వల్ల సూక్ష్మజీవులు నిరోధకతను సంతరించుకుంటున్నాయి. ఫలితంగా యాంటీబయాటిక్ ఔషధాలు నిరర్థకంగా మారుతున్నాయి. ఇది ప్రజారోగ్యానికి పైకి కనిపించని పెను ముప్పుగా పరిణమిస్తోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ), యుఎస్ఎయిడ్ సంస్థల తోడ్పాటుతో కేంద్ర పశుసంవర్థక మంత్రిత్వ శాఖ 6 నెలల పాటు సుమారు 80 మంది ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని నిపుణులతో చర్చించింది. సరికొత్తప్రామాణిక మార్గదర్శకాలను రూపొందించి ఇటీవలే విడుదల చేసింది. అల్లోపతి ఔషధాలను ఏయే జబ్బులకు ఎంత మోతాదులో వాడాలో మార్గదర్శకాలలో పొందుపరిచారు.ఈవీఎంలకు పెద్ద పీటఅంతేకాకుండా, సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నో వెటరినరీ మెడిసిన్ప్రాక్టీసెస్ – ఈవీఎంల)ను, హోమియో వంటి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులకు కూడా ప్రభుత్వం ఈ మార్గదర్శకాల్లో పెద్ద పీట వేయటం విశేషం. సంప్రదాయ ఆయుర్వేద పద్ధతుల్లో రైతులే స్వయంగా తయారు చేసుకొని వాడేందుకు వీలుగా ఉండే చికిత్సా పద్ధతులను కూడా పొందుపరిచారు. ఈ రంగంలో 20 ఏళ్లు కృషి చేసిన తమిళనాడుకు చెందిన ఎమిరిటస్ ప్రొఫెసర్ ఎన్. పుణ్యస్వామి 22 రకాల పశువ్యాధులకు రూపొందించిన ఈవీఎం పద్ధతులకు చోటు కల్పించారు. దేశంలో పాడిపై ఆధారపడిన చిన్న, సన్నకారు రైతులకు అతితక్కువ ఖర్చుతో సమకూరే ఈవీఎం చికిత్సా పద్ధతులు ఉపయోగపడతాయని కేంద్ర పశుసంవర్థక శాఖ కార్యదర్శి అల్క ఉపాధ్యాయ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, హోమియో గురించి ప్రస్తావించినప్పటికీ ఈ చికిత్స పద్ధతుల గురించి మార్గదర్శకాల్లో వివరించలేదు. దేశంలోని నలుమూలల్లోని పశు వైద్యులు, వైద్య సిబ్బంది, సంప్రదాయ వైద్యులు, పశు΄ోషకుల అనుభవాలు, సూచనలతో ప్రతి 2–3 ఏళ్లకోసారి ఈ మార్గదర్శకాలను పరిపుష్టం చేయనుండటం మరో విశేషం.సంప్రదాయ ఆయుర్వేద చికిత్సాపద్ధతులు తమిళనాడుకు చెందిన తంజావూరులోని వెటరినరీ యూనివర్సిటీ పరిశోధనా కేంద్రంలో ‘ఎత్నో–వెటరినరీ హెర్బల్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ యూనిట్’ అధిపతిగా పనిచేసిన ఎమిరిటస్ ప్రొఫెసర్ డా.ఎన్. పుణ్యస్వామి, టిడియు ఎమిరిటస్ప్రొఫెసర్ ఎం.ఎన్. బాలకృష్ణన్ నాయర్ పశువ్యాధులకు సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నో వెటరినరీ మెడిసిన్ప్రాక్టీసెస్– ఈవీఎంల)పై సుదీర్ఘంగా పరిశోధన చేసి ప్రమాణీకరించారు. ముఖ్యమైన 22 రకాల జబ్బులకు (అల్లోపతి మందులు, యాంటీబయాటిక్స్ వాడవసరం లేకుండా) రైతుల ఇళ్లలో ΄ోపు డబ్బాల్లో ఉండే మసాలా దినుసులు, పెరట్లో ఉండే మొక్కలతో ఆయుర్వేద మందుల్ని రైతులే స్వయంగా తయారు చేసుకొని వాడుకోగలిగే పద్ధతులను పొందుపరచిన ఒక చిరు పుస్తకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలతో పాటు అందుబాటులోకి తెచ్చింది. ఆంగ్లం, హిందీ, తెలుగుతో పాటు 12 భాషల్లో ఈ చిరుపుస్తకాల పీడీఎఫ్లను అందుబాటులోకి తెచ్చింది. పశువులకు, ముఖ్యంగా పాడి ఆవులు, గేదెలకు వచ్చే జబ్బులకు ఆయుర్వేద మందులను రైతులు ఇంటి దగ్గరే ఎలా తయారు చేసుకోవాలి? ఎలా వాడాలి? అనేది తెలుగు సహాప్రాంతీయ భాషల్లో రూపొందించిన వీడియోలను జాతీయ పాడి అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి.) యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచారు. ఈ చిరు పుస్తకాల పిడిఎఫ్లను, ఆయుర్వేద మందుల తయారీ, వాడే పద్ధతులు తెలిపే వీడియోలను ఉచితంగానే చూడొచ్చు.. డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాంటీబయాటిక్స్, రసాయనిక ఔషధాల అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన పాలు, మాంసం ఉత్పత్తికి దోహదం చేసే మార్గం ఇది. -
జీఎస్టీ చెల్లించాలి..మీరే తవ్వించుకోవాలి
సాక్షి, అమరావతి : ఉచిత ఇసుక పథకంలో ప్రభుత్వం మరో కొత్త మెలిక పెట్టింది. వినియోగదారులే రీచ్లకు కార్మికులను తీసుకెళ్లి, తవ్వించుకుని లోడ్ చేయించుకోవాలని తెలిపింది. అలా తవ్వించుకోలేకపోతే అక్కడ ప్రభుత్వం నియమించిన ప్రైవేటు వారికి డబ్బు చెల్లించి తవ్వించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇలా ఉచిత ఇసుక పథకంలో పలు మార్పులు చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇసుక రీచ్లను ఇప్పటికే ప్రైవేటు వారికి అప్పగించిన ప్రభుత్వం.. వారు ఇసుక సరఫరా చేయాలంటే ఆపరేషనల్ ఖర్చులు, నిర్వహణ ఛార్జీలతోపాటు ఇతర రుసుములు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇలా చెల్లించిన వాటికి రశీదులు కూడా ఇస్తారని తెలిపింది. ఒకవేళ వారితో పని లేదనుకుంటే సొంతంగా రీచ్కు లేబర్ని తీసుకువెళ్లి ఇసుకను తవ్వించి, రవాణా వాహనాల్లోకి లోడ్ చేయించుకుని తీసుకెళ్లాలని తెలిపింది. ఇలా చేయడం ఏ వినియోగదారుడికీ సాధ్యమయ్యే పరిస్థితి ఉండదని తెలిసి కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వడం గమనార్హం. అంటే ఎవరైనా తప్పనిసరిగా ప్రైవేటు వారిపై ఆధారపడాల్సిందే. వారికి డబ్బు కట్టాల్సిందే. అందుకే ఇసుక రీచ్లన్నింటినీ ప్రైవేటు ఏజెన్సీలే నిర్వహిస్తాయని మార్గదర్శకాల్లో తెలిపింది. ఒకవేళ ఎవరైనా లేబర్ను తీసుకెళ్లి తవ్వుకోవాలని ప్రయత్నించినా, అక్కడున్న ప్రైవేటు ఏజెన్సీల నిర్వాహకులు అంగీకరించరన్నది సుస్పష్టం. ఏతావాతా ఉచితం పేరుకే కానీ, నయా పైసలతో సహా వసూలు చేయాలన్నది చంద్రబాబు సర్కారు వ్యూహంలా ఉందన్న విషయం తేటతెల్లమవుతోంది. ఇసుక తవ్వకాలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే జరుగుతాయని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. బల్క్ వినియోగదారుల కోసం ఇసుక కమిటీలు ప్రత్యేకంగా ఇసుక వనరులను రిజర్వు చేయవచ్చని తెలిపింది.తాజా మార్గదర్శకాల ప్రకారం ఇసుక ఇలా తీసుకెళ్లాలి» అనుమతించిన రీచ్లు, డీసిల్టేషన్ పాయింట్ల (సరఫరా ప్రదేశాలు) నుంచి మాత్రమే ఇసుక సరఫరా అవుతుంది. » ఇసుక కోసం ఆన్లైన్లో లేదా సరఫరా పాయింట్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి» రిజిస్టర్ చేసుకున్నాక జారీ అయ్యే ఈ–ట్రాన్సిట్/పర్మిట్ ద్వారా వినియోగదారుడు సొంత వాహనం లేదా మైనింగ్ శాఖ రిజిస్టర్ చేసిన వాహనాన్ని ఎంపిక చేసుకోవాలి» ఆ వాహనం ఖర్చును వినియోగదారులు నేరుగా రవాణాదారులకే చెల్లించాలి» ఆ తర్వాత రవాణాదారు లేదా వినియోగదారు ఇసుక పాయింట్ వద్ద ఉన్న ఇన్ఛార్జి వద్దకు వెళ్లి డెలివరీ తేదీ, టైమ్ స్లాట్ తెలుసుకోవాలి»టైమ్ స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయానికి రవాణాదారు రీచ్కు వెళ్లి అక్కడ ఉన్న ప్రైవేటు ఏజెన్సీ ద్వారా గానీ, సొంత కార్మికుల ద్వారా గానీ ఇసుకను తవ్వించుకుని వాహనంలో లోడ్ చేయించుకోవాలి» లేబర్ను తీసుకెళ్లలేక అక్కడ ప్రభుత్వం నియమించిన ప్రైవేటు ఏజెన్సీ సహాయాన్ని పొందాలనుకుంటే జిల్లా ఇసుక కమిటీలు నిర్ణయించిన రేట్లు చెల్లించాలి» అలా డబ్బు కట్టి తీసుకెళ్లే వాహనానికి ‘ఉచిత ఇసుక రవాణా వాహనం’ అనే పేరుతో ఉన్న బ్యానర్ను తప్పనిసరిగా ఉండాలి. » స్థానికంగా ఉన్న ఇసుకను ఆయా గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యక్తిగత, కమ్యూనిటీ పనుల కోసం ట్రాక్టర్లు, ఎడ్ల బళ్లలో మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అలా తీసుకెళ్లే ఇసుకను యంత్రాలతో కాకుండా మనుషులతో మాత్రమే తవ్వించుకొని తీసుకెళ్లాలి. ఈ తవ్వకాలు, తరలింపు సమాచారాన్ని ఆన్లైన్లో లేదా స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో ముందుగానే ఇవ్వాలి.» ప్రభుత్వం, మైనింగ్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారం ఇసుక రీచ్లలో మిగిలిన ఇసుకను జిల్లా కమిటీలు ఇసుక రీచ్లు లేని జిల్లాల కోసం రిజర్వు చేస్తాయి. ఇందుకోసం ఇసుక రీచ్లు లేని జిల్లాల కమిటీలు వాటి జిల్లాల్లో ప్రైవేటు ఏజెన్సీలను ఎంపిక చేసి, వాటికి మినరల్ డీలర్ లైసెన్సులు (ఎండీఎల్) జారీ చేయాలి. లైసెన్సు పొందిన ఏజెన్సీలు నిర్దేశించిన రీచ్ నుంచి, నిర్దేశించిన ధరకు ఇసుకను తెచ్చి వినియోగదారులకు సరఫరా చేయాలి. ఇందులోనే రవాణా, ఆపరేషన్, నిర్వహణ ఛార్జీలు ఉంటాయి.సీనరేజికి మాత్రమే మినహాయింపు.. జీఎస్టీ చెల్లించాల్సిందే..ఇసుకకు సీనరేజితోపాటు జీఎస్టీ కూడా రద్దు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించినప్పటికీ, మార్గదర్శకాల్లో మాత్రం సీనరేజిని మాత్రమే మినహాయించారు. టన్నుపై రూ.88గా వసూలు చేస్తున్న సీనరేజి ఫీజును మాత్రమే వసూలు చేయకుండా మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. జీఎస్టీ రద్దు గురించి ప్రస్తావించలేదు. అంటే ఆపరేషనల్ ఖర్చులు, నిర్వహణ ఛార్జీలతోపాటు జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. -
ఆ మహిళల కోసం అలర్ట్ వ్యవస్థ: సుప్రీం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆచూకీ లేకుండా పోయిన మహిళల కోసం కేంద్రీకృత విధానంలో పని చేసే అలర్ట్ వ్యవస్థను తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. మైనర్ బాలికల అపహరణ ఉదంతంలో గతంలోనే సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలను సూచించడం తెలిసిందే. వాటిలో పలు లోపాలున్నాయని పిటిషనర్ తరఫున న్యాయవాది నిత్యా రామకృష్ణన్ కోర్టుకు నివేదించారు. ‘‘బాలిక/మహిళ కనిపించకుండా పోవడంపై ఫిర్యాదులో ఆలస్యం వల్ల న్యాయం దక్కడమూ ఆలస్యమవుతోంది. ఉత్తరాఖండ్లోని రుద్రపూర్ అనే కుగ్రామంలో జరిగిన ఉదంతమే ఇందుకు నిదర్వనం. నర్సుగా చేస్తున్న ఓ 11 ఏళ్ల పాప తల్లి ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదు. పాప ఉదయం పక్కింటివాళ్లకు చెప్పింది. వాళ్లు పొరుగింటి వాళ్లకు చెప్పారు. కానీ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. ఎనిమిది రోజుల తర్వాత ఇంటి సమీపంలోనే మృతదేహం దొరికింది. విషయం అందరికీ తెల్సి ఆందోళనలు మొదలయ్యాక గానీ ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు. దేశవ్యాప్తంగా నెలకొన్న దుస్థితి కూడా ఇదే’’ అని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం స్పందించింది. ఈ అంశంలో నోటీసులు ఇచ్చేందుకు అంగీకరించింది. -
సుప్రీం మార్గదర్శకాల మేరకు..బీసీ రిజర్వేషన్లను నిర్ధారించండి
సాక్షి, హైదరాబాద్: వికాస్ కిషన్రావ్ గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు బీసీ రిజర్వేషన్లను నిర్ధారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యయనానికి రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయాలి.. సామాజిక, రాజకీయ అంశాలు, వెనుకబాటుతనం లాంటి అంశాలను పరిశీలించి జనాభా నిష్పత్తికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు నిర్ధారించాలి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లన్నీ 50 శాతానికి మించకూడదు’ అని వికాస్ కిషన్రావ్ గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో పేర్కొన్న ఈ మూడు సూత్రాలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. దీన్ని అమలు చేసేందుకు మూడు నెలల సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి కోరారు. దీంతో తదుపరి విచారణను 3 నెలలకు వాయిదా వేస్తూ, అప్పటిలోగా నివేదిక అందజేయాలని తేల్చిచెప్పింది. రాష్ట్రంలో బీసీల జనాభా వివరాలను సేకరించడానికి, సర్వేల నిర్వహణకు తెలంగాణ బీసీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ను అధీకృత సంస్థగా ప్రభుత్వం గుర్తించడం రాజ్యాంగ వ్యతిరేకమని.. రాజ్యాంగ బద్ధమైన బీసీ కమిషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్లను నిర్ణయించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్రావు మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ధర్మేశ్ డీకే జైస్వాల్, శ్రీనివాస్ యాదవ్, కౌటూరు పవన్కుమార్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్, కేంద్రం తరఫున డీఎస్జీ గాడి ప్రవీణ్కుమార్ హాజరయ్యారు. వికాస్ కిషన్రావ్ గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్లోని పేరా 13 అమలుపై వివరాలు తెలుసుకుని చెబుతామని గత విచారణ సందర్భంగా ఏజీ వెల్లడించారు. మంగళవారం విచారణ సందర్భంగా మూడు అంశాలు అమలు చేయడానికి ఎంత సమయం కావాలని ఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి అధ్యయనానికి 3 నెలల సమయం కావాలని కోరడంతో అనుమతించిన ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. -
సుప్రీం మార్గదర్శకాలు పాటించాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్సాగర్లో గణేశ్ నిమజ్జనాలు చేయొద్దంటూ సుప్రీంకోర్టు 2021లో ఇచ్చిన మార్గదర్శకాలను విధిగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలనే నిమజ్జనం చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్లాస్టర్ ఆఫ్పారిస్ (పీవోపీ) విగ్రహాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే కృత్రిమ నీటికుంటల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. న్యాయవాది వేణుమాధవ్ వేసిన ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ వినోద్కుమార్, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం మంగళవారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది. అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ పీవోపీ విగ్రహాల నిమజ్జనం కోసం ట్యాంక్బండ్పై భారీ క్రేన్లు నిలుపుతున్నారని న్యాయవాది వేణుమాధవ్ అభ్యంతరం తెలిపారు. భారీ క్రేన్ల వల్ల ట్యాంక్బండ్కు ముప్పు ఉందన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదిస్తూ ‘కోర్టు ధిక్కరణ చట్ట ప్రకారం ఒక వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయడానికి గడువు ఒక సంవత్సరం. కానీ పిటిషనర్ 2021 నాటి సు ప్రీం మార్గదర్శకాలను ప్రస్తావిస్తున్నారు క నుక పిటిషన్ అక్కడే వేయాలి. ఇక్కడ వేసిన పిటిషన్ను అనుమతించొద్దు’అని కోరారు. ఇన్నాళ్లూ ఏం చేశారు? న్యాయవాది వేణుమాధవ్ వాదనలపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘2021లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇస్తే రెండేళ్లుగా ధిక్కరణ పిటిషన్ ఎందుకు వేయలేదు? అధికారులు ఒకవేళ రెండేళ్లు మార్గదర్శకాలు పాటించి ఉంటే ఇప్పుడు పాటించరని ముందే ఎలా చెబుతారు? అయినా ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడో ముందే తెలిసినా ఇన్ని నెలలు పిటిషన్ వేయకుండా నిమజ్జనాల వేళ పిటిషన్ వేయడంలో మీ ఉద్దేశం ఏమిటి? పీవోపీ విగ్రహాల నిమజ్జనం చేస్తే ఫొటోలతో నివేదిక అందజేయాలని 2023లో హైకోర్టు ఆదేశించినా ఆ పని చేయలేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చే నాటికి హైడ్రా మనుగడలో లేదు. అలాంటప్పుడు హైడ్రాను ప్రతివాదిగా ఎలా చేరుస్తారు? ప్రస్తుతానికి కేసు మెరిట్లోకి వెళ్లడం లేదు. పిటిషన్ను అనుమతించడంపైనే విచారణ చేస్తున్నాం. ఆలస్యంపట్ల మీరు విచారం వ్యక్తం చేసినా అనుమతించలేం. చివరి నిమిషంలో ప్రభుత్వం ఎస్ఎల్పీ దాఖలు చేయడాన్ని సుప్రీంకోర్టు కూడా 2021లో తప్పుబట్టింది కదా. అదే ఉత్తర్వు లు అందరికీ వర్తిసాయి. పీవోపీ విగ్రహాల నిమజ్జనం, కాలుష్య ఆరోపణలను రుజువు చేసేందుకు ఆధారాలు, గణాంకాలను వెల్లడించలేదు. అయితే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విధిగా పాటించాల్సిందే’అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ధిక్కరణ పిటిషన్లో విచారణ ముగించింది. కాగా, పీవోపీ విగ్రహాల తయారీపై నిషేధం విధిస్తూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన మరో పిటిషన్లో పీసీబీ తీరుపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే అవి చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టాలిగానీ రహదారినే తీసేస్తామన్నట్లు అధికారుల చర్యలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. -
AP: ఉద్యోగుల బదిలీల విధివిధానాలు విడుదల
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం బుధవారం(ఆగస్టు14) విడుదల చేసింది.బదిలీల జీవో గురువారం విడుదల కానుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి 31 వరకు 16 రోజుల్లో మొత్తం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
10 ఎకరాల వరకే రైతు భరోసా..
-
వ్యాయామం చేయని మహిళలు తీసుకోవాల్సిన డైట్ ఇదే!
మహిళలు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అత్యంత ముఖ్యంగా. అందులోనూ వ్యాయామం చేయని మహిళలు తినే ఆహారం విషయంలో పట్ల శ్రద్ద వహించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెబుతోంది. అలాంటి మహిళలు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదే ఐసీఎంఆర్ కొన్ని మార్గదర్శకాలు కూడా అందించింది. అవేంటో చూద్దామా..!వ్యాయామం చేయని మహిళలు తినే ఫుడ్పై శ్రద్ధ పెట్టడం కీలకం. అతిగా తినకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. తక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లతో ఉండే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ నూనెతో కాల్చినవి, ఆవిరిపై ఉడికించినవి తీసుకోవాలిన చెబుతున్నారు. అలాగే వాటి తోపాటు లీన్ ప్రోటీనఖ కూడా అవసరం. స్కిన్లెస్ చికెన్, చేపలు, అప్పడప్పుడూ రెడ్ మీట్ వంటివి తీసుకోవాలని సూచించారు. అదనప్పు కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులు,లేకుండా చేసుకోవాలి. కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి. హెర్బల్ టీలు వంటివి తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు చక్కెర పానీయాలకు దూరంగా ఉండటమే బెటర్బరువు అదుపులో ఉంచుకునే యత్నం చేయాలి. ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా తృణధాన్యాలు, కాలానుగుణంగా పండ్లకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అనారోగ్యకరమైన చిరుతిండ్లకు దూరంగా ఉండటం మంచిది. భోజనాని కంటే వివిధ రకాల పచ్చి కూరగాయలు తినడానికి యత్నం చేయాలి. మిల్లెట్స్ , బ్రౌన్రైస్కి ప్రాధాన్యత ఇవ్వాలి. బ్రేక్ఫాస్ట్గా కూడా బీన్స్, కాయధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన గింజలను(బాదం పప్పులు, జీడిపప్పులు)కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదైనా గానీ తీసుకునే ఆహారాన్ని మనస్పూర్తిగా ఆస్వాదిస్తూ తినాలి, సమతుల్యతకు ప్రాముఖ్యత ఇవ్వడం వంటివి చేస్తే.. మీ చేతుల్లోనే ఆరోగ్యం పదిలంగా ఐసీఎంఆర్ చెబుతోంది. వ్యాయామం చేయని మహిళలు ఈ విషయాలు గుర్తించుకుని మంచి డైట్ పాటిస్తే చాలని చెబుతోంది.(చదవండి: తొలి పోస్టల్ సర్వీస్ నుంచి .. సరికొత్త ట్యూన్ వరకు ఎన్నో ఘటనలకు సాక్షి 'మే 31'!) -
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
గుంటూరు: ఏపీ ఈఏపీసెట్(ఎంసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రరెడ్డి తెలిపారు. ‘‘రేపటి(గురువారం) నుంచి ఏపీ ఎప్సెట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. రేపు, ఎల్లుండి బైపీసీ గ్రూపుకి ఎప్సెట్ పరీక్షలు జరుగుతాయి. 18వ తేదీ నుంచి 23 వరకు ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు. రోజుకి రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు ఆన్లైన్ మోడ్లో నిర్వహిస్తున్నాం. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్. మద్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండవ సెషన్గా పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 140 సెంటర్లు. హైదరాబాద్లో రెండు సెంటర్లు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 3,61,640 మంది ఈ ఎప్సెట్కు హాజరవుతున్నారు. ఇందులో మహిళలు 1,81,536 మంది, పురుషులు 1,80,104 మంది విద్యార్ధులు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఎంపీసీ విభాగంలో 34,828 మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. బైపీసీ విభాగంలో మాత్రం 13,138 మంది విద్యార్ధులు గత ఏడాదితో పోలిస్తే తక్కువగా దరఖాస్తు చేసుకున్నారు’’ అని తెలిపారు.ముఖ్యమైన సూచనలు..‘‘ఒక నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తాం. ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకు రాకూడదు. పరీక్షా కేంద్రంలో పలికి విద్యార్ధులను అరగంట ముందుగా అనుమతి ఇస్తాం. పరీక్షా కేంద్రాలకి బస్సులు నడపాలని ఆర్టిసిని విజ్ణప్తి చేశాం. పరీక్షా కేంద్రాలకి నిరంతరాయ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశాం. 160 ప్రశ్నలు ఉంటాయి. నెగటివ్ మార్కులు విధానం లేదు. బయోమెట్రిక్ విధానంతో హాజరు తీసుకుంటాం కాబట్టి చేతులకి మెహందీ పెట్టుకోవద్దు. చెవులకి చెవి దిద్దులు తీసేసి పరీక్షలకి హాజరు కావాలి. ప్రతీ హాల్ టికెట్ వెనుక పరీక్షా కేంద్రం రూట్ మ్యాప్ కూడా ఉంటుంది’’ అని హేమచంద్రారెడ్డి తెలిపారు.ఒక నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తాం..ఏపీ ఈఏపీసెట్ రీక్షలకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ ఎప్సెట్ చైర్మన్, కాకినాడ జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాదరాజు తెలిపారు. ‘‘ఒక నిమిషం నిబంధన పక్కాగా అమలు చేస్తాం. విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకి ముందుగానే చేరుకోవాలి. ఇప్పటికే విద్యార్ధులకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడానికి అందుబాటులో ఉంచాం. విద్యార్థులెవరూ ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రానికి తీసుకురావద్దు. విద్యార్ధులు ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి’’ అని తెలిపారు. -
అప్రమత్తతే అతి ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: ఎండాకాలం నేపథ్యంలో అగ్నిప్రమాదాలకు అవకాశాలు పెరిగాయి. అప్రమత్తతతో ఉంటేనే అగ్ని ప్రమాదాలను నియంత్రించడంతోపాటు ప్రమాదాలు జరిగినా తక్కువ నష్టంతో బయటపడొచ్చు. ఇందుకు ప్రజల్లో అవగాహన అతి ముఖ్యమని అగ్నిమాపకశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదాల నియంత్రణలో భాగంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈనెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక సేవల వారోత్సవాలు చేయనున్నట్టు ఫైర్ డీజీ వై.నాగిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. రద్దీ ఎక్కువగా ఉండే బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, నివాససముదాయాలు, మల్టీప్లెక్స్, మాల్స్లో వీటిని నిర్వహిస్తారు. ఎండల తీవ్రత పెరగడంతో అగ్నిప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ అగ్నిమాపకశాఖ కొన్ని మార్గదర్శకాలు వెల్లడించింది. ఈ విషయాల్లో జాగ్రత్త ► వేసవి తీవ్రత పెరగడంతో ఫ్యాన్లు, ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాల వాడకం పెరుగుతుంది. దీనివల్ల ఓవర్లోడ్తో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. విద్యుత్ వైరింగ్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ► ఇంట్లో మంటల వ్యాప్తికి ప్రధాన అంశాల్లో వంటింట్లో మంటలు అంటుకోవడం కూడా.. అందువల్ల వంటగదిలో మంటలు అంటుకునే వస్తువులు లేకుండా చూసుకోవాలి. వీలైనంత గాలివెలుతురు ఉండేలా చూసుకోవాలి. ► అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యునిటీలు, బహుళ అంతస్థుల భవనాల్లో ఉండే వారు తప్పకుండా ఫైర్ ఆడిటింగ్ నిర్వహించాలి. అగ్నిమాపక నియంత్రణ పరికరాలు, మంటలార్పేందుకు నీటి పైప్లైన్ వ్యవస్థ, ఫైర్ అలార్మ్లు పనిచేస్తున్నాయా..ఇలా అన్నింటినీ ఒకసారి సరిచూసుకోవాలి. ► కారు ప్రయాణంలోనూ అగ్ని ప్రమాదాల నుంచి రక్షణకు పోర్టబుల్ ఫైర్ ఎక్ట్సింగ్విషర్ (మంటలు ఆర్పేది) పెట్టుకోవాలి. ► ఇళ్లలో ఎలక్ట్రికల్ వస్తువులు వాడకపోతే వాటిని వెంటనే స్విచ్ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ► కార్యాలయాల్లో ఫైర్ స్ప్రింక్లర్ వ్యవస్థ, ఫైర్ అలార్మ్లు, ఎమర్జెన్సీ లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటి వరకు 2,550 ఫైర్ కాల్స్ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి మార్చి చివరి వరకు అగ్నిప్రమాదాలకు సంబంధించి అన్ని రకాల ఫిర్యాదులు కలిపి 2,550 ఫైర్ కాల్స్ వచి్చనట్టు అగ్నిమాపకశాఖ అధికారులు వెల్లడించారు. గతేడాదిలో 8151 ఫైర్ కాల్స్ వచి్చనట్టు తెలిపారు. ఇందులో 141 తీవ్రమైన ప్రమాదాలు, 175 మధ్యతరహా అగ్నిప్రమాదాలు ఉన్నట్టు తెలిపారు. -
త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు కొత్తగా కార్డులివ్వాలని నిర్ణయించింది. ప్రతి కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని యూనిక్ నంబర్తో కార్డులు ఇవ్వనుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఒక్కో సబ్ నంబర్ ఇస్తారు. ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్కు లింక్ చేసి, స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను తయారు చేస్తారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు కసరత్తు చేస్తోంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు కొందరు పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. అంతేకాకుండా అనేకమంది తెల్ల రేషన్కార్డును ఆధారం చేసుకొనే ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల జారీ అంశంపై ఆరోగ్యశ్రీ ట్రస్టు దృష్టిసారించింది. ఈ మేరకు లబ్దిదారుల గుర్తింపుపై మార్గదర్శకాలు రూపొందిస్తోంది. అందరికీ ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.1,100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందరికీ వర్తింప చేయడం వల్ల అదనంగా రూ.400 కోట్ల భారం పడే అవకాశం ఉందని, ఇది పెద్ద భారం కాదన్న భావనలో సర్కారు ఉంది. మధ్యతరగతి ప్రజల్లో చాలామందికి, ఉద్యోగులకు, ఇతరులకు పలు పథకాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఆరోగ్య బీమాతో ఆరోగ్య సేవలు పొందుతున్న వారూ చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కార్డులతో అందరికీ సార్వజనీన ఆరోగ్య సేవలు అందించవచ్చని సర్కారు యోచిస్తోంది. వంద శస్త్రచికిత్సలు చేర్చే అవకాశం రాష్ట్రంలో 293 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు, 198 ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే గత ఏడాది 809 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లోనూ ఆరోగ్యశ్రీ కింద సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా రాష్ట్రంలో 1,310 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి అర్హులుగా 77.19 లక్షల మంది పేదలు ఉన్నారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని కూడా ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్ఎస్ కిందకు వస్తారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 1,376 శస్త్రచికిత్సలు, 289 వైద్య సేవలున్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద 1,949 వ్యాధులకు వైద్యం అందుతోంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్లో ఈ రెండింటిలో ఉన్న వ్యాధులను కలిపి అమలు చేస్తున్నారు. వీటికి సుమారు మరో వంద శస్త్రచికిత్సలను చేర్చే అవకాశం ఉంది. ఒక్కో కుటుంబానికి 10 లక్షల కవరేజీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్రం 2022లో ప్యాకేజీలను సవరించింది. గతంలో ఆరోగ్యశ్రీ కింద కవరేజీ రూ. 2 లక్షలు ఉండగా, ఆయుష్మాన్ భారత్ పథకం రావడంతో దాన్ని రూ. 5 లక్షలు చేశారు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రూ.10 లక్షలు చేసిన సంగతి తెలిసిందే. ఏడాదికి ఈ పథకాల కింద ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల వరకు కవరేజీ వర్తిస్తుంది. దీనికి ప్యాకేజీ సొమ్ము కూడా పెంచితే ఏటా రూ.1,500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈహెచ్ఎస్ పథకంపై తేలని నిర్ణయం ఈహెచ్ఎస్ పథకంపై ఉద్యోగులు కంట్రిబ్యూషన్ ఇస్తామని పేర్కొన్న సంగతి విదితమే. గత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు ముందు రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ) ఏర్పాటు చేసి అమలు చేయాలని నిర్ణయించింది. పథకం అమలుకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత మొత్తాన్ని, అంతే మొత్తంలో ప్రతి నెలా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా జమ చేయాలని పేర్కొన్నది. ఈ మేరకు తమ మూల వేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశాయి. ఆసుపత్రుల్లో తమకు వైద్యం అందనందున ఈ ప్రక్రియకు ఉద్యోగులు కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల బకాయిల చెల్లింపునకు ఏర్పాట్లు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయడంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. బ కాయిలు పేరుకుపోవడంతో పాటు ఆరో గ్యశ్రీ కింద ఆసుపత్రులకు ఇచ్చే ప్యాకేజీ సొమ్ము సరిపోవడం లేదని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నా యి. దీంతో ఆరోగ్యశ్రీ లబ్దిదారులు, ఈ హెచ్ఎస్ బాధితులు డబ్బులు చెల్లించి వైద్యం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా తర్వాత అనారోగ్య సమస్యలు పెరగడంతో చాలామంది ప్రైవేట్ ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. ఉద్యోగులైతే రీయింబర్స్మెంట్ పద్ధతిలో ముందుగా డబ్బులు చెల్లించి వైద్యం పొందుతున్నా రు. అయితే బిల్లుల సొమ్ము మాత్రం పూ ర్తి స్థాయిలో రావడంలేదని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. పెద్దఎత్తున బిల్లులు పే రుకుపోవడం వల్లే తాము వైద్యం అందించలేకపోతున్నామని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు నెట్వర్క్ ఆసుపత్రుల లెక్క ప్రకా రం దాదాపు రూ.500 కోట్లు ఆరోగ్యశ్రీ నుంచి తమకు రావాల్సిన బిల్లుల బకా యిలు పెండింగ్లో ఉన్నాయని అంటున్నాయి. మరోవైపు వివిధ వ్యాధులకు 2013లో నిర్ధారించిన ప్యాకేజీ ప్రకారమే ఆసుపత్రులకు సొమ్ము అందుతోంది. అంటే తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటివరకు ఒక్కసారి కూడా వ్యాధులు, చికిత్సలకు ప్యాకేజీ సవరణ జరగలేదు. ఈ రెండు కారణాల వల్ల తాము ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ పథకాల కింద వైద్యం చేయలేకపోతున్నామని ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
BAPS అబుదాబి హిందూ మందిర్ : కఠిన నిబంధనలు, డ్రెస్ కోడ్
అబుదాబిలో ఇటీవల (ఫిబ్రవరి 14, 204) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ మందిరంలో డ్రెస్కోడ్ వార్తల్లో నిలిచింది. మార్చి ఒకటో తేదీనుంచి ఇక్కడ ప్రజల దర్శనాలకు అనుమతినిచ్చిన నేపథ్యంలో నియమ నిబంధనలు, భక్తుల డ్రెస్ కోడ్కు సంబంధించిన నియమాలు, మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా క్యాప్స్, టీషర్ట్లు, అభ్యంతరకరమైన దుస్తులకు అనుమతి ఉండదు. డ్రెస్ కోడ్, ఇతర నిబంధనలు అబుదాబి మందిర్ ట్విటర్లో షేర్ చేసిన వివరాల ప్రకారం ప్రతి మంగళవారం - శనివారం, ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఈ మందిర్ తెరిచి ఉంటుంది. సోమవారం మాత్రం ఆలయాన్ని మూసివేస్తారు. The wait is over!#AbuDhabiMandir is now open for all visitors and worshipers. Opening hours: Tuesday to Sunday: 9am-8pm Every Monday: Closed for visitors pic.twitter.com/JnYvZoVSPk — BAPS Hindu Mandir (@AbuDhabiMandir) March 1, 2024 ముస్లిం దేశంలో అబుదాబిలో తొలి హిందూ దేవాలయంబాప్స్లో డ్రెస్ కోడ్, మార్గదర్శకాల విషయంలో కఠినంగా వహరించనున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం, మెడ, మోచేతులు, మడమల వరకూ కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. టైట్గా ఉన్న దుస్తులు, స్లీవ్లెస్, షార్ట్స్కు అనుమతించరు. శబ్దాలు చేసే ఉపకరణాలనూ ఆలయంలోకి అనుమతించరు. బయటి ఆహారాన్ని ఆలయంలోకి తీసుకు రాకూడదు. పెంపుడు జంతువులకు కూడా ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధం. అంతేకాదు దేవాలయం పరిసరాల్లో డ్రోన్స్ వినియోగంపై కూడా నిషేధం విధించారు. ఫోటోలకు అనుమతి ఉందా? వ్యక్తిగత అవసరాల కోసమే ఫోటోలు తీసుకోవచ్చు. ఎవరైనా వాణిజ్య అవసరాల నిమిత్తం వీడియోను రికార్డ్ చేయాలనుకుంటే, వారు తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాలి. ఆలయంలోని ఆధ్యాత్మిక, ప్రశాంత వాతావరణానికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా భక్తులు నియమాలను పాటించి సహకరించాలని ఆలయ అధికారులు కోరారు. కాగా 700 కోట్ల రూపాయల వ్యయంతో 27 ఎకరాల్లో బాప్స్ సంస్థ ఆధ్వర్యంలో అబూ మారేఖ్ ప్రాంతంలో ఆలయ నిర్మాణం జరిగింది. శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన ఈ ఆలయంలో ఒకేసారి 5 వేల మంది ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. -
విసిగిస్తున్న కాల్స్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: ప్రమోషనల్ లేదా అవాంఛిత కాల్స్ సమస్య పరిష్కారానికి మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఫిబ్రవరి 14న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో టెలికం శాఖ, ఆర్థిక సర్వీసుల విభాగం, గృహ .. పట్టణ వ్యవహారాల శాఖ, రిజర్వ్ బ్యాంక్, బీమా రంగ నియంత్రణ .. అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ), టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) సహా పరిశ్రమ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. మరోవైపు, అవాంఛిత కాల్స్ అనేవి యూజర్ల గోప్యతకు మాత్రమే కాకుండా వారి హక్కులకు కూడా భంగం కలిగిస్తాయని సమావేశంలో పాల్గొన్న వారు అభిప్రాయపడినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సేవల సంస్థలు.. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి ఇలాంటి కాల్స్ ఎక్కువగా ఉంటున్నాయని గుర్తించినట్లు తెలిపింది. అంతే కాకుండా కస్టమర్లను పోంజీ స్కీములు, క్రిప్టో పెట్టుబడుల వైపు ఆకర్షించేందుకు స్పామ్ కాలర్లు ఇప్పుడు వాట్సాప్ మొదలైన యాప్స్ ద్వారా ఇంటర్నెట్ కాల్స్ కూడా చేస్తున్నట్లు వివరించింది. రిజిస్టర్డ్ టెలీమార్కెటర్ల నుంచి స్పామ్ మెసేజీలు, అవాంఛిత కాల్స్ సమస్యను పరిష్కరించేందుకు టెలికం శాఖ, ట్రాయ్ ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. -
రూ. 500 గ్యాస్ సిలిండర్.. ఈ కేవైసీ అవసరం లేదు..!
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో రూ. 500లకే వంట గ్యాస్ అందజేస్తామని ప్రకటించింది. దీంతో గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ (నో యువర్ కస్టమర్) చేయించుకునేందుకు గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ కేవైసీతో సంబంధం లేదని అధికారులు, డీలర్లు చెబుతున్నా ఏజెన్సీల వద్ద మహిళలు బారులు తీరుతున్నారు. తమ పనులు వదులుకొని వినియోగదారులు ఉదయం 8 గంటల నుంచే గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలు కడుతున్నారు. హైదరాబాద్: ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, షేక్పేట, రహమత్నగర్, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ, బోరబండ, వెంగళ్రావునగర్, శ్రీనగర్ కాలనీ డివిజన్ల పరిధిలో తొమ్మిది గ్యాస్ ఏజెన్సీలు ఉండగా 3.40 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. ► ఇందులో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు 83,127 మంది ఉండగా, అన్నపూర్ణ అన్నయోజన కార్డు కలిగిన వారు 3368 మంది కలిగి ఉన్నారు. ► ప్రభుత్వం రూ. 500 గ్యాస్ సిలిండర్పై ఇంత వరకు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకున్నా తెల్లరంగు రేషన్ కార్డుదారులకు వర్తిస్తుందని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో వార్తలు వైరల్ అవుతుండటంతో ఇటు తెల్లకార్డుదారులు, అటు సాధారణ గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ► ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ. 500కే వంట గ్యాస్ అందిస్తామని చెప్పింది. ఈ పథకానికి ఈ కేవైసీకి సంబంధం లేదని దీనికి నిర్దిష్టగడువు కూడా ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు రావొద్దని ఏజెన్సీల నిర్వాహకులు ఏకంగా బ్యానర్లే కడుతున్నారు. ఉజ్వల పథకానికి మాత్రమే... ► కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల పథకానికి మాత్రమే ఈ కేవైసీ చేయాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద గతంలో మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ పథకంలోని లబి్ధదారులకు ప్రభుత్వం రాయితీపై గ్యాస్ అందజేస్తుంది. ఈ పథకంలో మృతి చెందిన వారి వివరాలు తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీని ప్రవేశ పెట్టింది. మహిళలు బయోమెట్రిక్ చేయించి నమోదు చేయించుకోవాలని వేలి ముద్రలు పడకపోతే ఐరిష్ విధానంలో ఈ కేవైసీని పూర్తి చేస్తారు. వాస్తవాలు తెలియని వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. రెండేళ్లకోసారి ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది. లబి్ధదారుల సంఖ్య, మృతులు, ఏజెన్సీ నుంచి మరో ఏజెన్సీకి బదిలీ చేయించుకోవడం, కనెక్షన్ రద్దు చేసుకోవడం, తదితర కారణాలు తెలుసుకునేందుకు ఇది వీలవుతుంది. ఇందులో భాగంగానే కచి్చతమైన సంఖ్య తెలుసుకోవడానికి లబి్ధదారుల వేలిముద్రలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మార్గర్శకాలు వచి్చన వెంటనే వినియోగదారులకు, గ్యాస్ ఏజెన్సీలకు సమాచారం అందిస్తామని అధికారులు పేర్కొంటున్నా వినియోగదారులు వినిపించుకోకుండా గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు తీస్తున్నారు. ఇంటి వద్దకే డెలివరీ బాయ్స్ వస్తారు గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. మా డెలివరీ బాయ్స్ ఇంటికే వచ్చి ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారు. ఇందులో భాగంగా సెల్ఫోన్లు, ఐరిష్ విధానంలో కళ్లను స్కాన్ చేస్తారు. దీనికి అంతరాయం ఏర్పడితేనే గ్యాస్ ఏజెన్సీలకు రప్పిస్తాం. గృహ వినియోగదారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. రూ. 500 సిలిండర్ కోసం చాలా మంది ఏజెన్సీలకు వస్తున్నారు. తప్పుడు సమాచారం సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చెందుతోంది. దీంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. సదరు పథకం కింద లబ్ధి పొందాలని కాంక్షిస్తూ ఏజెన్సీలకు పరుగులు పెడుతున్నారు. వదంతులు నమ్మవద్దు, ఇంకా మార్గదర్శకాలు రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఈ కేవైసీ ప్రక్రియకు రాయితీ సిలిండర్కు ఎలాంటి సంబంధం లేదు. వినియోగదారులు అనవసరంగా ఆందోళనకు గురికావొద్దు. – బి.శ్రీనివాస్, గ్యాస్ డీలర్, జూబ్లీహిల్స్ -
అర్ధరాత్రి 1 గంట వరకూ న్యూ ఇయర్
కర్ణాటక: కొత్త ఏడాది అంటే ఐటీ సిటీలో ఉత్సవ వాతావరణం నెలకొంటుంది. డిసెంబరు ఆఖరి రోజు సాయంత్రం నుంచి జనవరి 1వ తేదీ తెల్లవారేవరకూ రోడ్లు, కూడళ్లలో నగరవాసులు మజా చేస్తారు. ఈ నేపథ్యంలో రాబోయే నూతన సంవత్సర సంబరాలపై బీబీఎంపీ, పోలీస్శాఖ మార్గదర్శకాలను విడుదల చేశాయి. ► 31వ తేదీ అర్ధరాత్రి 1 గంటలోగా న్యూ ఇయర్ వేడుకలను ముగించాలి. ► బెంగళూరు ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, ఇందిరా నగరలో న్యూ ఇయర్ సంబరాలకు అనుమతి ఉంది. ► ఆ రోజు రాత్రి 10 గంటల అనంతరం 31 తేదీ రాత్రి నగరంలోని ప్రముఖ ఫ్లై ఓవర్లు బంద్. ► ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డులో 200 కు పైగా సీసీటీవీ అమర్చడంతో ఎలాంటి అసాంఘిక ఘటనలు జరగకుండా నియంత్రణ. రాత్రి 8 గంటల నుంచి ఈ రోడ్లలో వాహన సంచారం నిషేధం ► సంబరాలకు వచ్చేవారికి ప్రత్యేక పార్కింగ్ వ్యవస్థ. మహిళల భద్రత కోసం భారీగా మహిళా పోలీసుల మోహరింపు ► అర్ధరాత్రి 1 గంట తరువాత బార్, పబ్లను మూసివేయాలి ► సామూహిక న్యూ ఇయర్ విందు వినోదాలకు అనుమతి తప్పనిసరి ► లౌడ్ స్పీకర్లు, టపాసుల కాల్చడంపై ఆంక్షలు ► రాత్రి 1 గంట వరకు మెట్రో రైలు, సిటీ బస్సుల సంచారం. -
కాంట్రాక్ట్..ఇక పర్మినెంట్
-
హజ్ యాత్రకు నమోదు చేసుకోండి : ఏపీ హజ్ కమిటీ చైర్మన్
సాక్షి, విజయవాడ : కేంద్ర మైనార్టీ వ్యహహారాల శాఖ వచ్చే ఏడాది(2024) హజ్ వెళ్లే యాత్రికుల కోసం గైడ్లైన్స్ విడుదల చేసినట్లు ఏపీ హజ్ కమిటీ చైర్మన్ గౌసల్ ఆజాం తెలిపారు. యాత్రికులు డిసెంబర్ 4 నుంచి 20 వరకు ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. జిల్లాల్లో ఉన్న హజ్ సొసైటీల్లో వాలంటీర్లు రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పారు. ‘అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 70 సంవత్సరాల వయసు వారు హజ్ యాత్రకు అర్హులు. రెండేళ్ల లోపల వయసున్న చిన్నారులకు విమాన ఛార్జీల్లో 10శాతం రాయితీ ఉంటుంది. 40 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలు కూడా హజ్కి వెళ్ళవచ్చు. విజయవాడలో గతేడాది నుంచి ఎంబారికేషన్ పాయింట్ ఏర్పాటు చేయిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. విజయవాడ నుంచి వెళ్తున్న హజ్ యాత్రికులకు విమాన చార్జీల భారాన్ని తగ్గించేందుకు సీఎం జగన్ గతేడాది రూ. 14 కోట్లు విడుదల చేశారు’అని గౌసల్ ఆజాం తెలిపారు. ‘దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ యాత్రికుల కోసం ఏర్పాట్లు జరిగినట్టు మక్కాలో మాట్లాడుకున్నారు. మే 9 నుంచి జూన్ 20 వరకు హజ్ యాత్ర విడతల వారిగా జరుగుతుంది. యాత్రికులు ఏప్రిల్ 24కల్లా పాస్ పోర్టులు సబ్మిట్ చేయాలి. గతేడాది కంటే మరింత బాగా హజ్ యాత్ర జరగాలని సీఎం జగన్ సూచించారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశించారు’ అని గౌసల్ వెల్లడించారు. ఇదీచదవండి..మిచౌంగ్ తుపాను హెచ్చరిక.. అప్డేట్స్ -
పాఠాలే కాదు.. జీవితపాఠాలూ నేర్పాలి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులకు మొదటి సంవత్సరంలోనే ఆత్మస్థైర్యం కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) విశ్వవిద్యాలయాలకు సూచించింది. విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం తొలగించి మానసికంగా దృఢంగాఉండేలా చూడాలని పేర్కొంది. తొలిదశలో నిర్వహించే అవగాహన కార్యక్రమం (ఇండక్షన్ ప్రోగ్రామ్) నుంచే ఇది మొదలవ్వాలని తెలిపింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ అధ్యయనాలపై ఏఐసీటీఈ దృష్టి పెట్టింది. ఇంటర్ వరకూ ఎక్కువగా బట్టీ విధానంలో చదివే విద్యార్థులు ఇంజనీరింగ్లోని భిన్నమైన విద్యా విధానం వల్ల సొంత అవగాహన పద్ధతులపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారని ఏఐసీటీఈ భావించింది. ఈ సమస్యను అధిగమించడానికి వీలుగా ఇంజనీరింగ్ విద్యకు ముందుగా విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలని జాతీయ విద్యావిధానం–2020లో సూచనలు చేసింది. ఇప్పటికే ఇంజనీరింగ్ తరగతులు మొదలైనందున వచ్చే ఏడాది నుంచి విశ్వవిద్యాలయాలు దీనిపై దృష్టి పెట్టే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఇవీ సూచనలు.. కేవలం పుస్తకాలకే కాకుండా సామాజికంగా ఎదురయ్యే సవాళ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. తరగతి పాఠాలకే పరిమితం చేయకుండా సామాజిక అంశాలపై చర్చా వేదికలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. ప్రతి యూనివర్సిటీలోనూ దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. విద్యార్థులు ఇంజనీరింగ్లో చేరాక ఇంటర్ వరకూ ఉన్న వాతావరణం నుంచి ఇంజనీరింగ్ అనే కొత్త ప్రపంచం అర్థమయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విద్యార్థి ఏ ప్రాంతం నుంచి వచ్చాడు? అతని సామర్థ్యం ఏమిటి? అందరిలో కలుస్తున్నాడా? వంటి అంశాలను అధ్యాపకులు గమనించాలి. తరగతి గదిలో అందరి మధ్య సఖ్యత పెరిగి స్నేహపూర్వక వాతావరణం నెలకొన్న తర్వాతే బోధన చేపట్టాలి. ఇంజనీరింగ్లోని వివిధ బ్రాంచీలకు చెందిన విద్యార్థుల మధ్య సమన్వయం నెలకొనేందుకు కాలేజీలు ప్రయత్నించాలి. దీనికోసం సృజనాత్మకత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపకల్పనకు వర్సిటీలు కృషి చేయాలి. అకడమిక్ నాలెడ్జ్తోపాటు అనుభవపూర్వకంగా విద్యను నేర్చుకోవడం వల్ల విద్యార్థి మానసిక వికాసం పెరుగుతుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అభిప్రాయపడింది. దీన్ని కాలేజీలు విధిగా అనుసరించాలి -
అందరికీ అందుబాటులోకి స్వచ్ఛ ఇంధనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అందరికీ కాలుష్యం లేని స్వచ్ఛ ఇంధనం అందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, వినియోగానికి పెద్ద పీట వేస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. సౌర, పవన, జల విద్యుత్ వంటి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహించి, వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు విద్యుత్ చట్టంలో మార్పులు చేస్తూ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్, ఛార్జీలు, బ్యాంకింగ్ నిబంధనలను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నియంత్రణ 2023 పేరుతో డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ను తయారు చేసింది. ఈ నెల 21 నుంచి నూతన మార్గదర్శకాలు రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వస్తాయి. దేశంలో 2070 నాటికి కర్బన ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తేవాలని, దాని కోసం 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామరŠాధ్యన్ని సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి కూడా ఈ మార్గదర్శకాలు దోహదపడతాయని ఏపీఈఆర్సీ వెల్లడించింది. గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ ద్వారా పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2022లో నిబంధనలు జారీ చేసింది. వాటిని అనుసరించి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, వినియోగదారులు విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 181 (1) ప్రకారం నడుచుకోవడానికి రాష్ట్ర కమీషన్లు చట్ట ప్రకారం నిబంధనలను రూపొందించవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజా డ్రాఫ్డ్ను తీసుకువచ్చినట్లు ఏపీఈఆర్సీ పేర్కొంది. ఈ నియంత్రణ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్తును ఓపెన్ యాక్సెస్ చేయడానికి, ఇంట్రా–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్లు (సరఫరా వ్యవస్థలు), విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు వర్తిస్తుంది. కొత్త నిబంధనలివీ.. ♦ గ్రీన్ ఎనర్జీ నిబంధనల ప్రకారం.. దివాలా తీసిన సంస్థలు, డిస్కంలకు రెండు నెలల కంటే ఎక్కువ కాలం బకాయిలు ఉన్న సంస్థలు, అనధికారికంగా విద్యుత్ వినియోగిస్తున్న సంస్థలు, విద్యుత్ దొంగతనం కేసు పెండింగ్లో ఉన్న సంస్థలకు ఓపెన్ యాక్సెస్ను పొందడానికి అర్హత లేదు.అరు్హలైన వారికి స్వల్పకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ను మంజూరు చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోడ్ డెస్పాచ్ సెంటర్ (ఏపీఎస్ఎల్డీసీ) నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ♦ దీర్ఘకాలిక, మధ్యకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ మంజూరు కోసం స్టేట్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ(ఏపీ ట్రాన్స్కో) నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ♦ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ దరఖాస్తులన్నీ నేరుగా సంబంధిత రాష్ట్ర నోడల్ ఏజెన్సీలకు సింగిల్ విండో ద్వారా వెళతాయి. ♦ సెంట్రల్ నోడల్ ఏజెన్సీ పోర్టల్లో గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ సమాచారం మొత్తం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ♦ అన్ని కొత్త గ్రీన్ ఎనర్జీ జనరేటర్లకు కనెక్టివిటీ మంజూరు చేస్తారు ♦వినియోగదారులు, జనరేటర్ల మధ్య ప్రస్తుతం ఉన్న ఒప్పందాలు యధావిధిగా కొనసాగుతాయి. ప్రభుత్వ విధానం ప్రకారం ఓపెన్ యాక్సెస్ను కొనసాగించవచ్చు. వారికి సంబంధిత ఒప్పందాలలో పేర్కొన్న విధంగానే ఛార్జీలు వర్తిస్తాయి. ♦ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ట్రాన్స్మిషన్, వీలింగ్, క్రాస్ సబ్సిడీ సర్ఛార్జీలు, స్టాండ్బై ఛార్జీలు, బ్యాంకింగ్ ఛార్జీలు, రియాక్టివ్ ఎనర్జీ ఛార్జీలను నిబంధనల మేరకు విధిస్తారు. అయితే ఇవన్నీ అందరికీ వర్తించవు. ఉదాహరణకు 2032 డిసెంబర్లోగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పి, ఓపెన్ యాక్సెస్లో వినియోగదారులకు సరఫరా చేసే ఆఫ్షోర్ విండ్ ప్రాజెక్ట్ల నుంచి జరిగే విద్యుత్ ఉత్పత్తికి అదనపు సర్ఛార్జి వర్తించదు. దీర్ఘకాలిక, మధ్యకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ప్రాసెసింగ్ ఫీజు రూ. 1 లక్ష కాగా, స్వల్పకాలానికి రూ.25 వేలు కడితే సరిపోతుంది. ♦ రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ వినియోగదారులకు వార్షిక ప్రాతిపదికన గ్రీన్ సర్టిఫికేట్ అందించాలి. ఓపెన్ యాక్సెస్ అంటే.. విద్యుత్తు వినియోగదారులు ఎవరైనా వారికి నచ్చిన పునరుత్పాదక ఉత్పత్తి సంస్థ నుంచి నేరుగా కరెంటును పొందే వెసులుబాటు. ఇందుకు ఈ వినియోగదారులు నోడల్ ఏజెన్సీ అనుమతి పొంది తగిన చార్జీలు చెల్లించి ఈ విద్యుత్తును పొందవచ్చు. -
బ్రిజేష్ ట్రిబ్యునల్కు కొత్త మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కృష్ణా నదీ జలాల పంపిణీ, కేటాయింపులకు సంబంధించి జస్టిస్ బ్రిజేష్కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ)–2కు కొత్త విధి విధానాల(టరŠమ్స్ ఆఫ్ రెఫరెన్సస్)ను కేంద్రం జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేడబ్ల్యూడీటీ–1(బచావత్ ట్రిబ్యునల్) కేటాయించిన 811 టీఎంసీలతోపాటు.. పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణాకు మళ్లించే గోదావరి జలాలకుగాను గోదావరి ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన జలాల(45 టీఎంసీలు)ను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసి, వాటాలు తేల్చి.. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాలని నిర్దేశించింది. తద్వారా విభజన చట్టంలో సెక్షన్–89లో ‘ఏ’, ‘బీ’ నిబంధలనకు సరి కొత్త నిర్వచనం చెప్పింది. ప్రాజెక్టులంటే.. ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలో ఉన్నవని స్పష్టీకరించింది. ఈ విధి విధానాల మేరకు నీటి కేటాయింపులపై విచారణ చేసి 2024 మార్చి 31లోగా అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల(ఐఎస్ఆర్డబ్ల్యూడీ) చట్టం–1956లో సెక్షన్–5(3) ప్రకారం నివేదిక ఇవ్వాలని కేడబ్ల్యూడీటీ–2కు నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్మోహన్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు (గెజిట్ నెంబర్ 4204) జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2014 జూలై 14న సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయాలని చేసిన ఫిర్యాదు ఆధారంగా కేడబ్ల్యూడీటీ–2కు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదించిన మరిన్ని విధి విధానాలకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర జల్ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం పేర్కొన్న మార్గదర్శకాల మేరకు ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ చేస్తోంది. కేంద్రం ఇప్పుడు జారీ చేసిన విధి విధానాలతో కృష్ణా జలాల పంపిణీ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. బచావత్ ట్రిబ్యునల్ సమీక్ష చట్ట విరుద్ధం ఐఎస్ఆర్డబ్ల్యూడీ చట్టం–1956లో సెక్షన్–6(2) ప్రకారం ఒక ట్రిబ్యునల్ పరిష్కరించిన జల వివాదాన్ని మళ్లీ పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. పరిష్కారమైన జల వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. అందుకే బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీల జోలికి వెళ్లకుండా.. వాటిని యథాతథంగా బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ కొనసాగించింది. కానీ.. ఇప్పుడు కేంద్ర జల్ శక్తి శాఖ వాటిని పంపిణీ చేయాలని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు నిర్దేశించడం గమనార్హం. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల్లో నాగార్జునసాగర్కు ఎగువన 45 టీఎంసీలను కృష్ణాలో అదనంగా వాడుకునే అవకాశాన్ని గోదావరి ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఇచ్చింది. అదే ట్రిబ్యునల్.. గోదావరి జలాలను ఏ బేసిన్కు మళ్లించినా.. ఆ నది జలాల్లో అదనపు వాటాను దాని పరిధిలోని రాష్ట్రాలకు ఇవ్వాలని నిర్దేశించింది. కాళేశ్వరంతోపాటు వివిధ ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ 240 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లిస్తోంది. వాటిని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు జారీ చేసిన విధి విధానాల్లో చేర్చకపోవడం గమనార్హం. పదేళ్ల తర్వాత మరిన్ని విధి విధానాలా! కృష్ణా జలాల పంపిణీకి 2004 ఏప్రిల్ 2న సెక్షన్–4 ద్వారా ఏర్పాటైన బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్.. సెక్షన్–5(2) కింద 2010 డిసెంబర్ 30న నివేదికను.. 2013 నవంబర్ 29న తదుపరి నివేదికను కేంద్రానికి సమర్పించింది. ట్రిబ్యునల్కు నిర్దేశించిన లక్ష్య సాధనపై కేంద్రం సంతృప్తి చెందితే సెక్షన్–12 కింద ఆ ట్రిబ్యునల్ను రద్దు చేయొచ్చు. లక్ష్య సాధనపై సంతృప్తి చెందకపోతే తదుపరి నివేదిక ఇచ్చిన మూడు నెలల్లోగా అదనపు విధి విధానాలను నిర్దేశించి, మళ్లీ విచారణ చేయాలని కోరే అధికారం కేంద్రానికి ఉంటుంది. కానీ.. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తదుపరి నివేదిక ఇచ్చి దాదాపు పదేళ్లు పూర్తవడం గమనార్హం. -
విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేలా..మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు!
ఇటీవల కాలంలో చదువుకునే విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. ఎగ్జామ్స్లో అనుకున్నన్ని మార్కులు రాకపోయినా లేదా తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కన్నవాళ్లకు తీరని వ్యధను మిగులుస్తున్నారు. ఇలాంటి వాటిని అరికట్టేలా పాఠశాల స్థాయి నుంచే మార్పులు తీసుకువచ్చేలా విద్యామంత్రిత్వ శాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. అందుకోసం ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. సున్నిత మనస్తత్వం గల విద్యార్థులను గుర్తించి స్వీయ హాని తలపెట్టుకోకుండా మద్దతు ఇచ్చేలా పాఠశాలల్లో సమగ్రమైన టీమ్ విధానాన్ని అవలంభించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ మేరకు విద్యార్థులు స్వీయ హానిని చేసుకోకుండా నిరోధించేలా ప్రేరేపించడం, నిర్వహించడం, సానుభూతి, సాధికారత, అభివృద్ధి తదితద మద్దతు అందించేలా మార్గదర్శకాలను విడుదల చేసింది మంత్రిత్వ శాఖ. అందుకు అనుగుణంగా స్కూల్ వెల్నెస్ టీమ్ని ఏర్పాటు చేయడం. స్వీయ హాని ప్రమాదంలో ఉన్న విద్యార్థులను ఆ టీమ్ గుర్తించి స్పందించడం, మద్దతు ఇవ్వడం వంటి చర్యలు ఈ ముసాయిదా మార్గదర్శకాల్లో ఉన్నాయి. విద్యార్థులు వ్యక్తిగత సామాజిక సమస్యలు, ఆందోళనలను సమర్ధవంతంగా నిర్వహించలేనప్పుడూ నిరంత దుఃఖం, అసంతృప్తి, నిరాశ, మానసిక కల్లోలం, నిస్సహాయ భావన వంటి తీవ్ర పరిణామాలకి దారితీస్తుంది. చాలామటుకు ఇలాంటి కేసులు చివరకు స్వీయ హానికి దారితీస్తున్నాయని ముసాయిదా మార్గదర్శకాలు పేర్కొన్నాయి. అందువల్ల ముందుగా ఆత్మహత్యల నివారణ దిశగా ఈ స్కూల్ టీమ్లు ప్రయత్నాలు చేయాలని విద్యామంత్రిత్వ శాఖ పేర్కొంది. పాఠశాలల్లో అందుబాటులో ఉన్న వనరులను బట్టి స్కూల్ వెల్నెస్ టీమ్ క్రమం తప్పకుండా విద్యార్థుల తీరు తెన్నులను గమనిస్తూ ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండేలా మద్దతు ఇచ్చి వారిని గైడ్ చేయాలని పేర్కొంది. పాఠశాలలోని ఈ స్కూల్ వెల్నెస్ టీమ్లు పనితీరును వార్షిక ప్రాతిపదికన సమీక్షించాలి. అలాగే ఆత్మహత్యలను సమర్ధవంతంగా నిరోధించేలా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి కుటుంబాలు సమిష్టిగా భాగస్వామ్యం అయ్యి పనిచేయాలని ముసాయిదా సిఫార్సు చేసింది. (చదవండి: గురక ఇబ్బంది పెడుతోందా!..వెంటనే తగ్గిపోవాలంటే..) -
విద్యార్థుల క్షేమమే లక్ష్యంగా మరిన్ని చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల క్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే గుర్తించిన 15 రకాల ప్రమాదాలను నివారించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 3,783 హాస్టళ్లు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. హాస్టళ్లలో ఐదు ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, వికలాంగుల, జువైనల్ సంక్షేమ శాఖలకు చెందిన వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లో చదివే విద్యార్థుల భద్రత, విద్య, ఆహారం, ఆరోగ్యం, సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో అనేక ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంది. వాటిలో పాము కాటు, కుక్క కాటు, తేలు కుట్టడం, కరెంట్ షాక్, ఎత్తయిన ప్రదేశం నుంచి పడిపోవడం, గాయపడటం, ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నం, అనారోగ్యం, కలుíÙత ఆహారం, ఈవ్ టీజింగ్ తదితరాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించింది. యంత్రాంగం తక్షణమే స్పందించడం వల్ల ప్రమాద తీవ్రతను, నష్టాన్ని తగ్గించవచ్చని పేర్కొంది. ఏదైనా ఘటన జరిగితే వెంటనే హాస్టల్ బాధ్యులు సంబంధిత అధికారులకు సమాచారం తెలియజేసి.. ఉపశమన చర్యలు చేపట్టాలని సూచించింది. హాస్టళ్లలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైతే మెరుగైన వైద్యం కోసం విద్యార్థులను ఆస్పత్రులకు తరలించాలని స్పష్టం చేసింది. ఏదైనా హాస్టల్లో ఘటన జరిగితే.. 5 నిమిషాల్లోనే సంబంధిత హాస్టల్ బాధ్యులు స్పందించి అక్కడికి చేరుకోవాలని సూచించింది. పది నిమిషాల్లో ఉన్నతాధికారులకు.. 15 నిమిషాల్లో కలెక్టర్కు.. అరగంటలోగా పిల్లల తల్లిదండ్రులకు సమాచారమివ్వాలని స్పష్టం చేసింది. ఘటన తీవ్రత ఆధారంగా హాస్టల్ నిర్వాహకులతో పాటు డివిజనల్, జిల్లా స్థాయి అధికారులు వీలైనంత త్వరగా అక్కడికి చేరుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఘటన జరిగిన 24 గంటల్లో విచారణ చేసి ప్రాథమిక నివేదికను అందించాల్సి ఉంటుంది. 48 గంటల్లోగా జిల్లా స్థాయి అధికారి ఘటనాస్థలిని సందర్శించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. -
ఓడీఎల్ అడ్మిషన్లు కఠినతరం
సాక్షి, అమరావతి: ఆన్లైన్, ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) కోర్సులకు సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఓడీఎల్ ప్రోగ్రాముల పేరిట అనేక ఆన్లైన్ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఇష్టానుసారంగా కోర్సులను అందిస్తామంటూ విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు యూజీసీ పటిష్ట విధివిధానాలను ప్రకటించింది. ఆండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్లలో ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్, ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రాంలకు సంబంధించి తాజా నియంత్రణ నిబంధనలను విడుదల చేసింది. అలాగే, 2020లోనూ యూజీసీ కొన్ని మార్గదర్శకాలను వెల్లడించింది. యూజీ, పీజీ డిగ్రీలకు సంబంధించి ఆయా సంస్థల నిర్దేశిత ప్రమాణాలను పాటించేలా 2021లో మరికొన్ని సవరణలను ప్రతిపాదించింది. ఈ ప్రోగ్రాముల్లో కనీస బోధనా ప్రమాణాలుండేలా తాజాగా మరిన్ని నిబంధనలను రూపొందించింది. ఈ అంశాల్లో ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రాంలకు నో.. ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రాంలలో కొన్ని అంశాలను మాత్రమే యూజీసీ అనుమతులిస్తోంది. ప్రాక్టికల్స్, ఇతర క్షేత్రస్థాయి ప్రయోగాలతో సంబంధమున్న అంశాల్లో ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రాంలను నిషేధించింది. అవి.. ♦ ఇంజనీరింగ్, మెడికల్, ఫిజియోథెరపీ, ఆక్యుపేషన్ థెరపీ, పారామెడికల్, ఫార్మసీ, నర్శింగ్, డెంటల్, ఆర్కిటెక్చర్, లా, అగ్రికల్చర్, హారి్టకల్చర్, హోటల్ మేనేజ్మెంట్, కేటరింగ్ టెక్నాలజీ, కలినరీ సైన్సెస్, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్, విజువల్ ఆర్ట్స్, స్పోర్ట్స్, ఏవియేషన్. ♦ ఇవేకాక.. అధికారిక నియంత్రణ సంస్థలు అనుమతించని ప్రోగ్రాములు వేటినీ ఓడీఎల్, ఆన్లైన్ కోర్సుల కింద ఆయా సంస్థలు అందించడానికి వీల్లేదు. యోగా, టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో యూజీ, పీజీ ప్రోగ్రాంలు అందించడానికీ వీల్లేదు. అలాగే, ఆయా సబ్జెక్టులలో ఎంఫిల్, పీహెచ్డీ ప్రోగ్రాంలను ఓడీఎల్, ఆన్లైన్ కోర్సులుగా అందించకూడదు. ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రాంలు అందించే ఉన్నత విద్యాసంస్థలు ఆయా కోర్సులకు సంబంధించి నియంత్రణ సంస్థల అనుమతుల పత్రాలు, అఫిడవిట్లు, ఇతర సమాచారాన్ని పూర్తిగా తమ వెబ్సైట్లో పొందుపరచాలి. అడ్మిషన్లు తీసుకునే ముందే పరిశీలించాలి.. ఇక విద్యార్థులు ఆయా సంస్థలు అందించే ఓడీఎల్, ఆన్లైన్ కోర్సుల్లో చేరే ముందు అవి అధికారిక నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తీసుకున్నాయో లేదో ముందుగా పరిశీలించుకోవాలని.. అలాగే, ఆయా ఉన్నత విద్యాసంస్థల వెబ్సైట్లలో ఓడీఎల్, ఆన్లైన్ కోర్సులకు సంబంధించిన వివరాలను తనిఖీ చేసుకోవాలని యూజీసీ సూచించింది. అకడమిక్ సెషన్ల వారీగా అనుమతుల స్థితిని యూజీసీ వెబ్సైట్ ‘హెచ్టీటీపీఎస్://డీఈబీ.యూజీసీ.ఏసీ.ఐఎన్’లో యూజీసీ అందుబాటులో ఉంచింది. అడ్మిషన్లు తీసుకునే ముందు యూజీసీ వెబ్సైట్లోని నోటీసులు, ఇతర ప్రజాసంబంధిత హెచ్చరికలను పరిశీలించాలని కోరింది. యూజీసీ వెబ్సైట్లో ఆయా సంస్థల సమాచారం.. ఓడీఎల్ కోర్సులందించేందుకు అనుమతులున్న సంస్థల వివరాలను కూడా తమ వెబ్సైట్లో ఉంచినట్లు యూజీసీ పేర్కొంది. ఆయా డిగ్రీ ప్రోగాంల పేర్లు, వాటి కాలపరిమితి, ఆయా సబ్జెక్టుల అంశాలు యూజీసీ సవరణ నిబంధనలు–2024 ప్రకారం ఉన్నాయో లేవో సరిచూసుకోవాలి. నిషేధిత జాబితాల్లోని ప్రోగ్రాములుంటే కనుక వాటిలో చేరకుండా జాగ్రత్తపడాలి. ఇదిలా ఉంటే.. ఈ కోర్సులను అందించడానికి సంబంధించి కొన్ని విద్యాసంస్థలను డిబార్ చేసినట్లు యూజీసీ ప్రకటించింది. అందులో నర్సీ ముంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (మహారాష్ట్ర), శ్రీ వేంకటేశ్వర వర్సిటీ (ఆంధ్రప్రదేశ్) పెరియార్ యూనివర్సిటీ (తమిళనాడు) ఉన్నాయి. ఈ సంస్థలు 2023 జూలై–ఆగస్టు, 2024 జనవరి–ఫిబ్రవరి సెషన్లకు సంబంధించి ఓడీఎల్, ఆన్లైన్ కోర్సులు అందించకుండా డిబార్ చేసినట్లు వివరించింది. ఫ్రాంఛైజీలపై నిషేధం.. సెంట్రల్ వర్సిటీలు, రాష్ట్ర వర్సిటీలు, ప్రైవేటు వర్సిటీలు, డీమ్డ్ వర్సిటీలు ఏవైనా సరే తమ కేంద్ర కార్యాలయాల ద్వారా మాత్రమే అందించాలి. ఫ్రాంచైజీల రూపంలో ఓడీఎల్ ప్రోగ్రాములు అందించడానికి వీల్లేదు. అలాగే, లెర్నర్ సపోర్టు కేంద్రాలను నేరుగా ఆయా ఉన్నత విద్యాసంస్థలే నిర్వహించాలి. ఫ్రాంఛైజీల ద్వారానో, ఔట్ సోర్సింగ్ ద్వారానో నిర్వహించేందుకు వీల్లేదు. ఈ ఓడీఎల్ ప్రోగ్రాంలు, ఆన్లైన్ కోర్సులకు సంబంధించి పూర్తిగా ఆయా ఉన్నత విద్యాసంస్థలే బాధ్యులుగా ఉండాలి. ఫ్రాంఛైజీల ద్వారా అందించేందుకు యూజీసీ అనుమతించదు. ఆయా విద్యాసంస్థలు అందించే ప్రోగ్రాంలు యూజీసీ నియమ నిబంధనలకు లోబడి ఉంటేనే వాటికి అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో సమానత వర్తిస్తుంది. ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రాంలకు అడ్మిషన్లను కూడా నిర్ణీత గుర్తింపు ఉన్న కాలానికి మాత్రమే చేపట్టాలి. టెరిటోరియల్ పరిధిలోనే కోర్సులు.. మరోవైపు.. ఓడీఎల్, ఆన్లైన్ ప్రోగ్రాంలను అందించే సంస్థల టెరిటోరియల్ పరిధిని కూడా యూజీసీ నిర్దేశించింది. ఆయా సంస్థలు తమ కోర్సులను అనుమతులున్న కాలంలో ఎక్కడి వారికైనా అందించవచ్చు. అయితే, వాటి కార్యకలాపాలు కేవలం తమ సంస్థకు నిర్దేశించిన పరిధిలోనే చేపట్టాలని యూజీసీ పేర్కొంది. ♦ సెంట్రల్ వర్సిటీలు వాటి చట్టంలో నిర్దేశించిన టెరిటోరియల్ నిబంధనల ప్రకారం ఈ ఓడీఎల్ ప్రోగ్రాంలను అమలుచేయవచ్చు. ♦ స్టేట్ వర్సిటీలు వాటి చట్టంలో పేర్కొన్న పరిధికి లోబడి.. లేదా తమ రాష్ట్ర పరిధిలో మాత్రమే ఈ ఓడీఎల్ కోర్సులను అమలుచేయాలి. ♦ ప్రైవేటు వర్సిటీలు కూడా తమ చట్టంలో నిర్దేశించుకున్న రాష్ట్ర పరిధికి మించి ప్రోగ్రాములను అందించరాదు. హెడ్ క్వార్టర్ పరిధిలో మాత్రమే ప్రోగ్రాంలను అందించవచ్చు. గుర్తింపు ఉన్న ఆఫ్ క్యాంపస్ల ద్వారా కూడా అమలుచేయవచ్చు. ♦ ప్రోగ్రాములను లెర్నర్ సపోర్టు కేంద్రాల ద్వారా అమలుచేయడానికి వీల్లేదు. డీమ్డ్ వర్సిటీలు తమ హెడ్ క్వార్టర్ పరిధిలో, కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉన్న ఆఫ్ క్యాంపస్ల ద్వారా ఈ ప్రోగ్రాములను అమలుచెయ్యొచ్చు. -
ఇలా అమ్ముకోండి.. అలా కొనుక్కోండి
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లు, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ముగిసిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్కో)లు కరెంటును నేరుగా ఎవరికైనా అమ్ముకొనే అవకాశం కల్పించింది. ఏదైనా జెన్కో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినప్పుడు డిస్కంలతో పీపీఏ కుదర్చుకుంటుంది. ఇది సాధారణంగా 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకూ ఉంటుంది. ఈ ఒప్పందం గడువు ముగిసిన తరువాత కూడా డిస్కంలు అదే రేటుకి అదే జెన్కో ద్వారా విద్యుత్ను తీసుకునే వెసులుబాటు ఇప్పటివరకూ ఉంది. ఇప్పుడు కేంద్రం ఈ వెసులుబాటు లేకుండా చేసింది. గడువు ముగిసిన తరువాత కూడా అదే రేటుకి కొంటే జెన్కోలకు నష్టం వాటిల్లుతుందన్నది కేంద్రం చెబుతున్న కారణం. దీంతో జెన్కోలు పీపీఏల గడువు ముగిసిన తరువాత ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్ (ఐఈఎక్స్)లోగానీ, ఎక్కువ ధర ఇచ్చే డిస్కంలకు గానీ విద్యుత్ను విక్రయించుకోవచ్చు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటును పీపీఏలు ముగిసిన తరువాత విక్రయించేందుకు సెంట్రల్ పూల్ విధానాన్ని కేంద్రం కొత్తగా తీసుకువచ్చింది. కేంద్రానికి చెందిన పదహారు ప్లాంట్లలో విద్యుత్ను డిస్కంలు ముందస్తు దరఖాస్తు ద్వారా కొనుక్కొనే అవకాశం కలి్పంచింది. కొనుగోలు ఒప్పందాన్ని కూడా ఐదేళ్లకు పరిమితం చేసింది. పీపీఏలు చేసుకోగా మిగిలిన విద్యుత్ను ఐఈఎక్స్లో విక్రయిస్తారు. అంతా ఐఈఎక్స్లోనే విద్యుత్ను అమ్మాలన్నా, కొనాలన్నా ఇప్పుడు జెన్కోలు, డిస్కంలకు ఉన్న ప్రధాన మార్కెట్ ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అనుమతితో 2008 జూన్ 27న ప్రారంభమైన ఐఈఎక్స్ 2017లో స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీగా మారింది. అప్పటినుంచి విద్యుత్ క్రయ విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. 29 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 55కు పైగా విద్యుత్ పంపిణీ సంస్థలు, 600కుపైగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, 1800కుపైగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, 4,600కు పైగా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ఐఈఎక్స్లో చేరాయి. గత నెలలో ఐఈఎక్స్లో 8,469 మిలియన్ యూనిట్ల లావాదేవీలు జరిగాయి. యూనిట్ సగటు ధర రూ.6.89గా ఉంది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ లావాదేవీలకు జెన్కోలు, డిస్కంల నుంచి గరిష్టంగా యూనిట్కు 2 పైసలు రుసుమును (ఐఈఎక్స్) వసూలు చేస్తోంది. -
పల్మనరీ మెడిసిన్ ఔట్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీ పెట్టడానికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విడుదల చేసింది. మూడేళ్ల తర్వాత ప్రస్తుత పరిస్థితులను ఆధారం చేసుకొని గత మార్గదర్శకాల్లో పలు మార్పులు చేర్పులు చేసింది. గతంలో మెడికల్ కాలేజీకి అనుమతి రావాలంటే 24 డిపార్ట్మెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం వాటిల్లో నాలుగింటిని తొలగించి, ఒక దాన్ని చేర్చారు. అంటే 21 విభాగాలు ఉంటే సరిపోతుంది. అయితే ఎంబీబీఎస్ విద్యార్థులకు కీలకమైన పల్మనరీ మెడిసిన్ విభాగం తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. దీనితో పాటు ప్రాధాన్యత కలిగిన ఎమర్జెన్సీ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, రేడియేషన్ అంకాలజీ విభాగాలను కూడా ఎన్ఎంసీ తొలగించింది. కొత్తగా సమీకృత వైద్య పరిశోధన విభాగాన్ని తీసుకొచ్చింది. అత్యవసర వైద్యానికి ప్రాధాన్యం ఇచి్చంది. సాధారణ పడకలను 8 శాతం తగ్గించి ఐసీయూ పడకలను మాత్రం 120 శాతం పెంచింది. పల్మనాలజీ కిందే ఛాతీ, ఊపిరితిత్తుల వ్యాధులు ఛాతీ, ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులు లేదా కరోనా వంటి సమయాల్లో పల్మనరీ మెడిసిన్ కీలకమైనది. టీబీ వ్యాధి కూడా దీని కిందకే వస్తుంది. వెంటిలేటర్ మీద ఉండే రోగులను పల్మనరీ, అనెస్తీషియా విభాగాల వైద్యులే చూస్తారు. అలాంటి ప్రాధాన్యత కలిగిన విభాగాన్ని తొలగించడంపై సంబంధిత వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పల్మనరీని తీసేయడం వల్ల అనెస్తీషియా, జనరల్ మెడిసిన్ స్పెషలిస్టులపై భారం పడుతుందని అంటున్నారు. కాలేజీలో తొలగించిన విభాగాలకు చెందిన పీజీలు ఉండరు. దానికి సంబంధించిన వైద్యం కూడా అందుబాటులో ఉండదు. పల్మనరీ మెడిసిన్ రద్దు సమంజసం కాదు 50 ఏళ్లుగా ఉన్న పల్మనరీ మెడిసిన్ విభాగం తప్పనిసరి నిబంధన తొలగించడం సరైన చర్య కాదు. 2025 నాటికి టీబీ నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకున్న భారత్ పల్మనరీ వంటి కీలకమైన విభాగాన్ని తీసేయడం సమంజసం కాదు. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కమిటీ కన్వినర్,ఐఎంఏ, తెలంగాణ మరికొన్ని మార్గదర్శకాలు అనెస్తీషియా కింద పెయిన్ మేనేజ్మెంట్ విభాగాన్ని తీసుకొచ్చారు. దీర్ఘకాలిక నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు వంటివి ఈ విభాగం కిందికి వస్తాయి. యోగాను ఒక విభాగంగా ప్రవేశపెట్టారు. ఈ మేరకు వేర్వేరుగా స్త్రీ, పురుష శిక్షకులు ఉండాలి. గతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 300 పడకలు అవసరం కాగా, ప్రస్తుతం వాటిని 220కి కుదించారు. స్కిల్ ల్యాబ్ తప్పనిసరి చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థులు నేరుగా రోగుల మీద కాకుండా బొమ్మల మీద ప్రయోగం చేసేందుకు దీన్ని తప్పనిసరి చేశారు. గతంలో కాలేజీకి సొంత భవనం ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు 30 ఏళ్లు లీజుతో కూడిన భవనం ఉంటే సరిపోతుంది. కాలేజీ, అనుబంధ ఆసుపత్రి మధ్య దూరం గతంలో 10 కిలోమీటర్లు, 30 నిమిషాల ప్రయాణంతో చేరగలిగేలా ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు దీనిని కేవలం 30 నిమిషాల్లో చేరగలిగే దూరంలో ఉండాలన్న నియమానికి పరిమితం చేశారు. ఎన్ని సీట్లకు ఎన్ని జర్నల్స్, పుస్తకాలు ఉండాలన్నది స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా డాక్టర్లు, నర్సులతో పాటు మొత్తం 17 మంది సిబ్బందితో అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలి. ఎంబీబీఎస్ విద్యార్థులను ఇక్కడికి శిక్షణకు పంపుతారు. గతంలో ఎంబీబీఎస్, హౌసర్జన్లు, రెసిడెంట్లకు హాస్టల్ వసతి తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు రెసిడెంట్లకు తీసేశారు. -
నిషేధిత జాబితా నుంచి నెలలో ‘అసైన్డ్’కు విముక్తి
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్ట సవరణ చేసిన ప్రభుత్వం.. దాన్ని వేగంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయగా, ఎప్పటిలోగా పూర్తి చేయాలనే విషయంపై తాజాగా అధికార యంత్రాంగానికి టైం లైన్ నిర్దేశించింది. నెల రోజుల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కసరత్తు ముగించి అసైన్మెంట్ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన అసైన్డ్ భూములను నిషేధిత ఆస్తుల జాబితా (22)ఏ నుంచి తొలగించాలని ఆదేశించింది. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్ట సవరణ చేసిన గత నెల 31వ తేదీకి ఈ భూములు సంబంధిత రైతులు, వారి వారసులు లేదా లీగల్ హైర్స్ ఆదీనంలో ఉంటే వారికి యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్ జి. సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. వారం నుంచి నెల రోజుల గడువు రైతుకు కేటాయించి 20 సంవత్సరాలు పూర్తయిన అసైన్డ్ భూములను 22 (ఎ) నుంచి తొలగించేందుకు వీఆర్వో నుంచి తహశీల్దార్, జేసీ, కలెక్టర్లు చేయాల్సిన పనులను కూడా వివరిస్తూ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఇప్పుడు 50 ఎకరాల వరకు అసైన్డ్ భూములున్న గ్రామాల్లో వారం రోజుల్లో వాటిని 22(ఎ) నుంచి తొలగించాలని సూచించింది. 150 వరకు ఉంటే రెండు వారాలు, 250 ఎకరాలు ఉంటే మూడు వారాలు, 250 ఎకరాలకు పైబడి అసైన్డ్ భూములుంటే నాలుగు వారాల్లో (నెల రోజుల్లో) ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. ఈ గడువు ప్రకారం పని జరిగేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై రైతులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఈ భూములపై హక్కులు ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా కోరుతున్న 15 లక్షల మందికిపైగా రైతులు లబ్ధి పొందనున్నారు. వారిలో మెజారిటీ రైతులు దళితులే. -
మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయో ఇలా తెలుసుకోండి.. లేకుంటే ప్రమాదమే!
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో ఎంత తెలిసినవారైనా తప్పకుండా మోసపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొంతమంది మనం వాడి పడేసిన సిమ్ కార్డులను ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం. నిజానికి సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చే ఆఫర్లకు ఆకర్షితులై ఒక్కొక్కరు నాలుగైదు సిమ్ కార్డులు కొనేసి.. వినియోగించిన తరువాత పడేస్తున్నారు. ఇలాంటి నంబర్లను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల విజయవాడకు సంబంధించిన ఒకే వ్యక్తి కార్డుతో 658 సిమ్ కార్డులు యాక్టివేట్ అయినట్లు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. టెలికామ్ అధికారులు వీటిని మొత్తం బ్లాక్ చేసినట్లు సమాచారం. టెలికామ్ శాఖ కొత్త నిబంధనల ప్రకారం, ఒక ఆధార్ కార్డుపై గరిష్టంగా 9 సిమ్ కార్డులు మాత్రమే కలిగి ఉండాలని ఆదేశించించినట్లు సమాచారం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ సిమ్ కార్డులు తీసుకోవాల్సి వస్తే.. రీ వెరిఫికేషన్ చేసుకోవాలని తెలుస్తోంది. మొత్తం మీద సిమ్ కార్డుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఏం ఐడియా గురూ! డ్రైవర్ క్రియేటివిటీకి ఫిదా అవుతున్న ప్యాసింజర్లు.. టెలికామ్ సంస్థ ఒక ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయని తెలుసుకోవడానికి ఓ కొత్త వెబ్సైట్ తీసుకువచ్చింది. దీంతో ఆధార్ నెంబర్ మీద ఎన్ని సిమ్ కార్డులున్నాయనే విషయం మాత్రమే కాకుండా.. మొబైల్ ఎవరైనా దొంగలించిన లేదా పోగొట్టుకున్న సమయంలో అయినా నెంబర్ బ్లాక్ చేసే అవకాశం ఉంది. ఇలా తెలుసుకోండి.. మొదట సంచార్ సతి అధికారిక వెబ్సైట్ (www.sancharsaathi.gov.in) ఓపెన్ చేయాలి. అందులో మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మీ మొబైల్ నెంబర్ కనెక్షన్ తెలుసుకోండి(TAFCOP) మీద క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అయిన తరువాత మీ 10 అంకెల మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తరువాత, వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే.. యూజర్ మీద ఎన్ని మొబైల్ నంబర్స్ ఉన్నాయో కనిపిస్తుంది. అందులో మీది కానీ నెంబర్ బ్లాక్ చేసుకునే ఆప్షన్ కూడా అక్కడే ఉంటుంది. -
అమ్ముకున్న సీట్లకు అధికారిక ముద్ర!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా భర్తీకి ఉన్నత విద్యామండలి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. నిబంధనల ప్రకారం సీట్లను భర్తీ చేసుకోవచ్చంటూ బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. కన్వీనర్ కోటా సీట్ల తొలివిడత కేటాయింపు ఇటీవలే పూర్తవగా మరో రెండు దశల్లో ఎంసెట్ సీట్ల కేటాయింపు ఉండే వీలుంది. ఈలోగా యాజమాన్య కోటా సీట్ల భర్తీ చేపట్టేందుకు మండలి అవకాశం కల్పించడం గమనార్హం. అలాగే బీఫార్మసీ, ఫార్మా–డీ విభాగాల్లోనూ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి వెసులుబాటు కల్పించింది. అయితే ఈ విభాగాల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ఇప్పటివరకు చేపట్టలేదు. రాష్ట్రవ్యాప్తంగా 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. అందులో 30 శాతం సీట్లు యాజమాన్య కోటాగా ఉంటాయి. అంటే దాదాపు 30 వేల వరకు సీట్లు ఉంటాయి. ఇలా భర్తీ చేయాలి... అన్ని కాలేజీలూ గురువారం తమ పరిధిలో ఏయే బ్రాంచీల్లో ఎన్ని సీట్లున్నాయనే వివరాలతో పత్రికా ప్రకటన ఇవ్వాలి. ఆ వివరాలను ఈ నెల 31లోగా కాలేజీల వెబ్సైట్లలో పొందుపరచాలి. వచ్చే నెల 31న కాలేజీలలో జరిగే అడ్మిషన్ల వివరాలు వెల్లడించాలి. సెప్టెంబర్ 15 వరకూ విద్యార్థుల నుంచి యాజమాన్య కోటా కింద దరఖాస్తులు తీసుకోవాలి. మొత్తం యాజమాన్య సీట్లలో 15 శాతం ప్రవాస భారతీయుల పిల్లలు, వారు సిఫార్సు చేసే వారికి ఇవ్వాలి. మరో 15 శాతం సీట్లను ర్యాంకులవారీగా యాజమాన్యం భర్తీ చేయాలి. ఈ విభాగంలో ప్రవేశం పొందే విద్యార్థుల నుంచి రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ (టీఎస్ఎఫ్ఆర్సీ) నిర్ణయించిన ఫీజులను తీసుకోవాలి. ఎలాంటి ఫీజు రీఇంబర్స్మెంట్ ఈ విభాగానికి వర్తించదు. ఎన్ఆర్ఐ కోటా కింద తీసుకొనే సీట్లకు నిర్ణీత ఫీజు కాలేజీనిబట్టి డాలర్లలో ఉంటుంది. ‘బీ’ కేటగిరీ సీట్లను ముందుగా జేఈఈ ర్యాంకు ఆధారంగా భర్తీ చేయాలి. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకును, తర్వాత ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని ఉన్నత విద్యామండలి మార్గదర్శకాల్లో పేర్కొంది. ముందుగానే బేరాలు... నిజానికి ఎంసెట్ ఫలితాలు రాగానే యాజమాన్య కోటా సీట్ల భర్తీ ప్రక్రియ మొదలైపోతోందనేది ఏటా వస్తున్న ఆరోపణే. కన్వీనర్ కోటాలో మంచి కాలేజీ, బ్రాంచి రాదని భావించే వారు యాజమాన్య కోటా కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని కాలేజీల యాజమాన్యాలు సీట్లను భారీ మొత్తానికి బేరం పెడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో కంప్యూటర్ సైన్స్, ఇతర కంప్యూటర్ కోర్సులకు భారీ డిమాండ్ ఉండటంతో ముందే బేరం కుదుర్చుకుంటున్న కాలేజీలు... నోటిఫికేషన్ జారీ ప్రక్రియను సాధారణ విషయంగానే భావిస్తున్నాయి. ఈ సమయంలో ఎవరు దరఖాస్తు చేశారు? ర్యాంకులు ఏమిటి? అనే వివరాలపై అధికారులు ఆరా తీయడం సాధ్యం కావడం లేదు. ఆన్లైన్లో యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేస్తే తప్ప దీన్ని నియంత్రించడం సాధ్యం కాదని అన్ని వర్గాలూ చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయట్లేదు. దీంతో ‘బీ’ కేటగిరీ సీట్ల భర్తీ నోటిఫికేషన్ కేవలం అప్పటికే అమ్ముకున్న సీట్లకు అధికారిక ముద్ర వేసే ప్రక్రియగానే మిగిలిపోతోంది. ర్యాంకుల ప్రకారమే సీట్లు ఇవ్వాలి యాజమాన్య కోటా సీట్ల భర్తీలోనూ కాలేజీలు నిబంధనలు పాటించాలి. ర్యాంకుల ప్రకారమే సీట్లు ఇవ్వాలి. ముందే అమ్ముకున్నారనే ఆరోపణలపై ఆధారాలుంటే ఎవరైనా మాకు ఫిర్యాదు చేయవచ్చు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. యాజమాన్య కోటాలో అర్హత ఉండి కూడా సీటు రాని వారు సైతం ఆ విషయాన్ని మా దృష్టికి తేవాలి. – ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
జేపీఎస్ల పనితీరు మదింపునకు కమిటీలు
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సర్విస్ రెగ్యులరైజేషన్ కసరత్తులో భాగంగా వారి పనితీరు మదింపునకు జిల్లా స్థాయి పనితీరు మూల్యాంకన కమిటీ (డిస్ట్రిక్ట్ లెవల్ పెర్ఫార్మన్స్ ఎవాల్యూయేషన్ కమిటీ)లను రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటు చేసింది. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఎస్పీ లేదా ఎస్పీ నామినీగా డీఎస్పీ కంటే తక్కువ ర్యాంక్ కాని అధికారి, జిల్లా అటవీ అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఈ కమిటీ జేపీఎస్ల పనితీరును మదింపు చేస్తుంది. ఈ మేర కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా శనివారం ఆదేశాలు జారీ చేశారు. నాలుగేళ్ల సర్విస్ పూర్తి చేసుకున్న జేపీఎస్లను రెగ్యులరైజ్ చేసే క్రమంలో ఈ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ మేరకు పలు మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం 100 పాయింట్లతో మదింపు ♦ జిల్లా కమిటీకి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. ♦ కమిటీ గ్రామ పంచాయతీలను సందర్శించి, ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్ల ఆధారంగా 4 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన జేపీఎస్ల పనితీరు అంచనా వేసి జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పిస్తుంది. ♦ ఈ డేటాను, మదింపునకు సంబంధించిన స్కాన్డ్ కాపీలను పంచాయతీరాజ్ కమిషనర్ (పీఆర్) ఓ మొబైల్ యాప్లో నమోదు చేస్తారు. ♦ జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు కమిటీలిచ్చే నివేదికలను పరిశీలించి జేపీఎస్ల సర్విసు రెగ్యులరైజైన్ ప్రతిపాదనలను పీఆర్ కమిషనర్కు సమర్పిస్తారు. ♦ ఈ నివేదికలపై పీఆర్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ♦ రోడ్లు, మురుగు కాల్వల శుభ్రత, దోమల నివారణ, వైకుంఠధామాల నిర్వహణ, నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, ప్రకృతి వనాలు, ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ..తదితర అంశాలకు వేర్వేరుగా పాయింట్లు ఇవ్వడం ద్వారా, మొత్తం వంద పాయింట్లుగా మదింపు చేస్తారు. -
విదేశాల్లో ‘రూపీ ట్రేడింగ్’.. బ్యాంకులకు త్వరలో ఆర్బీఐ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ఇతర దేశాలతో రూపాయిలో వాణిజ్య లావాదేవీలను నిర్వహించేటప్పుడు ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల పరిష్కారం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) త్వరలో బ్యాంకులకు మార్గదర్శకాలను జారీ చేయనుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రూపాయి ట్రేడింగ్ మెకానిజం విషయానికొస్తే, కొన్ని అంశాలకు సంబంధించి మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, అయితే వీటిలో చాలా వరకూ పరిష్కారమయ్యాయని తెలిపారు. పరిష్కారం కాని అంశాల్లో ఎలక్ట్రానిక్ బ్యాంక్ రియలైజేషన్ సర్టిఫికేట్ (ఈ–బీఆర్ఈ) ఒకటని తెలిపారు. ఈ సమస్య పరిష్కా రంపై ఆర్బీఐ ప్రస్తుతం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. కాగా, యూరో లేదా దిర్హామ్ లేదా యువాన్ లేదా డాలర్లో చెల్లింపు చేయడానికి ఎటువంటి అడ్డంకి లేదని కూడా అధికారి ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఇతర భాగస్వామ్య దేశాలతో రూపాయి వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. -
10 లక్షల జనాభాకు ఓ మెడికల్ కాలేజీ
సాక్షి, హైదరాబాద్: 10 లక్షల జనాభా కలిగిన ప్రాంతంలో కొత్త మెడికల్ కాలేజీ స్థాపన కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎలాంటి మెడికల్ కాలేజీ ఉనికిలో ఉండకూడదని పేర్కొంది. కొత్త మెడికల్ కాలేజీ స్థాపన నిబంధనలు, ఎంబీబీఎస్లో సీట్ల పెంపుదలకు సంబంధించి ఎన్ఎంసీ తాజాగా ముసాయిదా మార్గదర్శకాలు జారీచేసింది. 2024–25 వైద్య విద్యా సంవత్సరం నుంచి ఇవి అమలులోకి వస్తాయని పేర్కొంది. కొత్త మెడికల్ కాలేజీలకు 50/100/150 సీట్ల వరకే అనుమతి ఇస్తామని, అంతకంటే ఎక్కువ సీట్లు కేటాయించబోమని పేర్కొంది. అయితే గతంలోనే అధిక సీట్ల కోసం (150కు మించి) దరఖాస్తు చేసుకుంటే దాన్ని పరిగణలోకి తీసుకుంటామంది. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న కాలేజీలకు మాత్రమే ఎంబీబీఎస్ అడ్మిషన్లు కొనసాగించడానికి అర్హత కలిగి ఉంటాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంత ఆసుపత్రులతో అనుసంధానం కొత్తగా అనుమతి తీసుకునే మెడికల్ కాలేజీకి అనుబంధంగా గ్రామీణ ఆరోగ్య శిక్షణ కేంద్రాలు/ కమ్యూనిటీ హెల్త్/ అర్బన్ హెల్త్ సెంటర్లు ఉండాలి. ఒక్కో కేంద్రానికి 15 మంది విద్యార్థులను ఇంటర్న్గా పంపేలా ఉండాలి. ఈ కేంద్రాలు మెడికల్ కాలేజీ యాజమాన్యంలో లేదా ప్రభుత్వంలోని ఆరోగ్య కేంద్రానికి చెందినవిగా ఉండాలి. నగరాల్లో మినహా ఈ ఆరోగ్య కేంద్రాలు 30 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. అల్పాహారం, సాంస్కృతిక కార్యకలాపాలు, యోగా శిక్షణ, ఇండోర్ గేమ్స్, కౌన్సెలింగ్ సదుపాయాలు ఉండాలి. బయోమెట్రిక్ హాజరు మెడికల్ కాలేజీల్లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎన్ఎంసీ సూచించింది. దీని పరిధిలోకి అధ్యాపకులు, ట్యూటర్లు, సీనియర్ రెసిడెంట్లు వస్తారు. హాజరును సరిగా పాటించని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి. అన్ని కాలేజీల బయోమెట్రిక్ మెషీన్లను ఎన్ఎంసీ కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేయాలి. ప్రతీ మెడికల్ కాలేజీ సీసీటీవీ వ్యవస్థ కలిగి ఉండాలి. అధునాతన సౌకర్యాలతో కూడిన లైబ్రరీ ఉండాలి. కొత్త మార్గదర్శకాలివీ.. ♦ 30 ఏళ్లపాటు లీజుకు తీసుకున్న స్థలమైతే అందులో భవన నిర్మాణాలు చేపట్టాలి. ♦ కాలేజీ, బోధనాసుపత్రులకు వేర్వేరు భవనాలు ఉన్నట్లయితే వాటి మధ్య దూరం గరిష్టంగా 30 నిమిషాల్లో చేరేలా ఉండాలి. ♦ ఆసుపత్రిలో కనీసం 220 పడకలుండాలి. ♦ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం ఏర్పాటు చేసే కాలేజీలో తప్పనిసరిగా అనాటమీ, ఫిజియా లజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, సైకియా ట్రీ, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, నేత్ర వైద్యం, గైనకాలజీ, అనస్థీషియాలజీ, డెంటిస్ట్రీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, అత్యవసర వైద్యం, ఇంటిగ్రేటివ్ మెడికల్ రీసెర్చ్ విభాగాలు తప్పనిసరిగా ఉండాలి. -
ఇల్లు కట్టుకుంటే రూ.3 లక్షలు.. గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు రూ.3 లక్షల ఆర్ధిక సాయం ప్రభుత్వం అందించనుంది. గృహలక్ష్మీ పథకం మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల ఇండ్లు, మొత్తం 4 లక్షల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇండ్లు చొప్పున మొత్తం 4లక్షల ఇండ్లు నిర్మాణానికి 7,350 కోట్లు ఖర్చు చేయనుంది. మహిళా పేరు మీదనే ఇల్లు మంజూరవుతుంది. లబ్దిదారులు తమకు ఇష్టమైన డిజైన్ ఎంపికకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. పథకం ద్వారా లబ్ది పొందిన ఇంటిపై ప్రభుత్వం ఆమోదించబడిన గృహలక్ష్మి లోగో ఉంటుంది. సంబంధిత కుటుంబం ఆహార భద్రత కార్డును కలిగి ఉండాలి. ప్రజలు, ప్రజా ప్రతినిధుల ద్వారా దరఖాస్తులు జిల్లా కలెక్టర్లు స్వీకరించనున్నారు. లబ్ధి దారుల ఎంపికలో స్క్రూటినీ చేసి, లబ్ధి దారులను కలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. గృహలక్ష్మి పథకం కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్తో పాటు, మొబైల్ యాప్ను ప్రభుత్వం సిద్దం చేయనుంది. మూడు దశల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం నగదు పంపిణీ చేయనుంది. మొదటి దశలో బేస్మెంట్ లెవెల్ స్టేజ్ రూఫ్ తోపాటు పనులు పూర్తయిన తర్వాత మొత్తం అమౌంట్ అందజేయనుంది. తొలుతగా లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వనుంది. చదవండి: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక ట్విస్ట్ -
వితంతువులకే మొదటి ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులెవరినీ వారి సొంత గ్రామ పంచాయతీలకు లేదా వారి సొంత మున్సిపల్ వార్డుల పరిధిలోకి ఎట్టి పరిస్థితిలో బదిలీ చేయబోమని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్ లక్ష్మీశ శనివారం పూర్తి మార్గదర్శకాలను విడుదల చేశారు. 2019, 2020 నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు పొంది.. ఈ ఏడాది మే 25 నాటికి ప్రొబేషన్ ప్రక్రియ పూర్తయిన వారు బదిలీ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇక ఏఎన్ఎంలకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు పరస్పర అంగీకార బదిలీలకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. బదిలీలకు దరఖాస్తు చేసుకునే వారిపైన ఎలాంటి శాఖపరమైన క్రమశిక్షణా చర్యలు, ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్లో ఉండకూడదని స్పష్టం చేశారు. ఒంటరి మహిళలకే తొలి ప్రాధాన్యం.. ♦ కాగా బదిలీ దరఖాస్తులో సచివాలయాల ఉద్యోగులు ఐదు మండలాలు లేదా ఐదు మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకునే వీలు కల్పించారు. పరస్పర అంగీకార బదిలీలకు కేవలం ఒక మండలం లేదా మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్నే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేటప్పుడు ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ల ద్వారా పొందిన నో డ్యూస్ సర్టిఫికెట్ను అప్లోడ్ చేయాలి. ♦ బదిలీలు కోరుకునేవారిలో... వితంతువులు తమ భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని, వ్యాధిగ్రస్తులు మెడికల్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. చెరొక చోట ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలకు వివాహ ధ్రువీకరణపత్రంతో పాటు భర్త లేదా భార్య ఆధార్ వివరాలు, వారి ఉద్యోగ ఐడీ కార్డు, ఉన్నతాధికారి జారీ చేసిన సర్టిఫికెట్లు ఉండాలి. వాటిని దరఖాస్తుతోపాటు జత చేయాలి. ♦ ఒక జిల్లా పరిధిలో 15 శాతం నాన్ లోకల్ నిబంధనలకు లోబడి అంతర్ జిల్లాల బదిలీలు ఉంటాయి. ఒక లోకల్ ఉద్యోగి, మరొక నాన్ లోకల్ ఉద్యోగి పరస్పర అంగీకారంతో అంతర్ జిల్లా కేటగిరీలో బదిలీ కోరుకున్నప్పుడు ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో బదిలీపై వెళ్తున్న ఉద్యోగితో సహా కొత్తగా ఆ జిల్లాకు వచ్చే నాన్ లోకల్ ఉద్యోగి సంఖ్య మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం మించి ఉన్నప్పుడు అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం ఉండదని వెల్లడించారు. ♦ బదిలీలకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించే సమయంలో మొదట జిల్లా పరిధిలో, ఆ తర్వాత దశలో మాత్రమే అంతర్ జిల్లాల బదిలీలను పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్లతోసహా ఇతర నియామక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిధిలో బదిలీల్లో మొదట ఒంటరి మహిళ లేదా వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆ తర్వాత వరుస క్రమంలో అనారోగ్య కారణాలు, భార్యాభర్తలు వేర్వేరు చోట్ల పనిచేస్తుండడం వంటివాటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇక చివరి ప్రాధాన్యతగా పరస్పర అంగీకార బదిలీలకు వీలు కల్పించాలన్నారు. అర్హులందరికీ బదిలీలకు అవకాశం బదిలీ కోరుకునే ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరగకుండా.. నిర్ణీత గడువులోగా అర్హులందరికీ ప్రొబేషన్ కూడా పూర్తయ్యేలా కలెక్టర్లతో కలిసి ఆయా శాఖాధిపతులు చర్యలు చేపట్టాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ సూచించారు. డైరెక్టర్ లక్ష్మీశతో కలిసి శనివారం ఆయన సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖాధిపతులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. -
జేఎన్టీయూ(ఏ) పరిధిలో కొత్తగా 3 కళాశాలలు
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) పరిధిలో నూతనంగా రెండు ఇంజినీరింగ్ కళాశాలలు, ఒక ఫార్మసీ కళాశాల మంజూరయ్యాయి. చిత్తూరు, రాయచోటిలో ఒక్కొక్క ఇంజినీరింగ్ కళాశాల, నెల్లూరులో ఒక ఫార్మసీ కళాశాల ఏర్పాటు కానున్నాయి. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. నూతన జాతీయ విద్యావిధానం–2020ని దృష్టిలో ఉంచుకుని అనుమతుల ప్రక్రియలో వెసులుబాటుతోపాటు కొన్ని మార్పులు చేసింది. ప్రొఫెషనల్ కోర్సులపై ఉన్న మారిటోరియాన్ని ఎత్తేసింది. దీంతో కొత్తగా ఇంజినీరింగ్ కళాశాలలు, సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ(ఏ) పరిధిలో రెండు ఇంజినీరింగ్, ఒక ఫార్మసీ కళాశాల మంజూరయ్యాయి. ఇప్పటికే జేఎన్టీయూ(ఏ) పరిధిలో 98 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలుండగా.. తాజాగా ఆ సంఖ్య 100కు చేరింది. ఫార్మసీ కళాశాలల సంఖ్య కూడా 34కు చేరింది. ఏఐసీటీఈ తాజా నిర్ణయం మేరకు బీటెక్ కోర్సుల్లో బీఈ, బీటెక్ గరిష్ట సీట్ల సంఖ్యను 300 నుంచి 360కి పెంచారు. నూతన నిబంధనల ప్రకారం కంప్యూటర్ అప్లికేషన్ ప్రోగ్రామ్లలో ఇన్టేక్ను 180 నుంచి 300 వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. తక్కిన 60 సీట్లు.. 30 సీట్లు చొప్పున సివిల్, మెకానికల్ వంటి కోర్ గ్రూప్లలో భర్తీ చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్సెస్ ప్రోగ్రామ్ను సైతం తాజాగా కోర్ గ్రూప్గా పరిగణించారు. విద్యార్థుల నమోదు శాతంతో సంబంధం లేకుండా అభివృద్ధి చెందుతున్న విభాగాలలో నూతన కోర్సులను ప్రారంభించేందుకు అనుమతించనున్నారు. యూసీఎస్ బకాయిలు చెల్లిస్తేనే ఎన్వోసీ వర్సిటీకి చెల్లించాల్సిన యూనివర్సిటీ కామన్ సర్విసెస్ (యూసీఎస్) ఫీజుల బకాయిలు చెల్లిస్తేనే నో అబ్జెక్షన్ సర్టీఫికెట్ (ఎన్వోసీ) జారీచేస్తామని జేఎన్టీయూ (ఏ) ఉన్నతాధికారులు గతంలో స్పష్టం చేశారు. వర్సిటీ ఆయా ఇంజినీరింగ్ కళాశాలలకు ఎన్వోసీ జారీచేస్తేనే ఏఐసీటీఈ 2023–24 విద్యా సంవత్సరానికి గుర్తింపు ఇస్తుంది. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ(ఏ) ఎన్వోసీ జారీకి యూసీఎస్ బకాయిలతో ముడిపెట్టింది. వర్సిటీ పరిధిలోని 98 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇప్పటికే 88 కాలేజీలు యూసీఎస్ బకాయిలు చెల్లించాయి. 10 ఇంజినీరింగ్ కళాశాలలు రూ.1.50 కోట్ల బకాయిలున్నాయి. వీటికి కూడా బకాయిలు చెల్లిస్తేనే ఎన్వోసీ ఇవ్వాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. పోర్టల్లో వివరాలు ఏఐసీటీఈ నుంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయా ఇంజినీరింగ్ కళాశాలలు వర్సిటీ అనుబంధ హోదాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కళాశాలకు సంబంధించిన వివరాలన్నీ పోర్టల్లో నమోదు చేస్తారు. వాటి ఆధారంగా వర్సిటీ నిజనిర్ధారణ కమిటీలను నియమిస్తుంది. కమిటీ నివేదిక ఆధారంగానే ఆయా ఇంజినీరింగ్ కళాశాలలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే అంశంపై స్పష్టత రానుంది. ప్రస్తుతం ఏపీ ఈఏపీసెట్ జరుగుతోంది. పరీక్ష పూర్తయి ర్యాంకులు ప్రకటించి కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేలోపు సీట్ల కేటాయింపు పూర్తికావాల్సి ఉంది. అన్ని వసతులు ఉన్న కళాశాలలకే గుర్తింపు బోధన ప్రమాణాలు, మౌలిక వసతులు, అనుభవజు్ఞలైన ఫ్యాకల్టీ ఉన్న కళాశాలకే అనుబంధ గుర్తింపు జారీచేస్తాం. నిబంధనలకు లోబడి ఇంజినీరింగ్ సీట్లు కేటాయిస్తాం. గత ఐదేళ్ల పురోగతి, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కొలువులు తదితర అంశాలను బేరీజు వేసి కళాశాల స్థితిగతులను అంచనావేస్తాం. అన్ని రకాల సదుపాయాలున్న ఆయా ఇంజినీరింగ్ కళాశాలలనే పరిగణనలోకి తీసుకుంటాం. – ప్రొఫెసర్ జింకా రంగజనార్ధన, వీసీ, జేఎన్టీయూ అనంతపురం -
పట్టణ మాస్టర్ ప్లాన్లకు ఏకరూప మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో మాస్టర్ ప్లాన్ తయారీ, అమలు ఏకరీతిన ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం ప్రకారం మాస్టర్ ప్లాన్ తయారీలో ఏకీకృత విధానం పాటించేలా పలు సూచనలతో ప్రభుత్వం జీవో నంబర్ 66 జారీ చేసింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో రాష్ట్రంలో పట్టణీకరణను పెంపొందించేలా ఈ జీవోలో మార్గదర్శకాలు పొందుపరిచింది. వాస్తవానికి డెవలప్మెంట్ అథారిటీలు పరిమిత సాంకేతిక నైపుణ్యంతో మాస్టర్ ప్లాన్లను తయారు చేస్తుండటంతో ప్రాదేశిక ప్రణాళిక నాణ్యత సరిగా ఉండడంలేదు. పైగా డెవలప్మెంట్ అథారిటీల మాస్టర్ ప్లాన్ల తయారీలో మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అనుసరించడంలేదు. రిపోర్టింగ్ ఫార్మాట్స్, శాటిలైట్ ఇమేజ్ క్వాలిటీ, ఆర్ఎఫ్పీ ప్రిపరేషన్, కన్సల్టెన్సీ చార్జీల ఫిక్సింగ్, కన్సల్టెంట్లు, టౌన్ ప్లానింగ్ స్టాఫ్ పాత్ర, బాధ్యతలతో కూడిన మాస్టర్ ప్లాన్ తయారీలో ఏకరూపత ఉండడంలేదు. దాంతో రాష్ట్రంలోని 123 పట్టణ ప్రాంతాలు (యూఎల్బీలు), 21 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (యూడీఏ)ల్లో ఏకీకృత మాస్టర్ ప్లాన్ ఉండేలా ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ప్రస్తుతం ఆయా విభాగాల్లోని మాస్టర్ ప్లాన్లు ఏ దశలో ఉన్నాయో అవన్నీ కొత్త మార్గదర్శకాల ప్రకారం రూపొందించాలని యూడీఏ, యూఎల్బీలను ఆదేశించింది. అభ్యర్థనలు, మ్యాప్ తయారీ, సర్వే, ఫీల్డ్ డేటా సేకరణ, మాస్టర్ ప్లాన్ నివేదిక, డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కోసం సాంకేతిక ఆమోదం, మాస్టర్ప్లాన్ ప్రచురణ, ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనల స్వీకరణ, తుది మాస్టర్ ప్లాన్, మ్యాప్ తయారీకి ప్రభుత్వం నుంచి సాంకేతిక ఆమోదం, మంజూరు కోసం ప్రభుత్వానికి సమర్పణ వంటి అంశాలను ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సొంతింటి ఆశలు తీరే సమయం!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎన్నోఏళ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారి ఆశలు త్వరలో తీరనున్నాయి. మంత్రి కేటీఆర్ కొత్త సచివాలయం ప్రారంబోత్సవం రోజున డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాల ఫైల్పైనే తొలి సంతకం చేయనున్నారు. దీనితో ల ర్థిదారుల ఎంపిక చేపట్టి, ఇళ్లను పంపిణీ చేసేందుకు మార్గం సుగమం కానుంది. నాలుగైదు నెలల్లో ఎన్నికలున్న నేపథ్యంలో.. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. కొనసాగుతున్న వివరాల అప్లోడింగ్ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దాదాపు 63వేల వరకు పూర్తయ్యాయి. ల ర్థిదారులను ఎంపిక చేయగానే వాటిని పంపిణీ చేయవచ్చు. మిగతా ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఏడు లక్షలమందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ను రూపొందించి ఓటరు కార్డు ఆధారంగా వివరాలను అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 3.6 లక్షల మంది వివరాలు అప్లోడ్ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. నిజానికి రెండేళ్ల క్రితమే చాలా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి. కానీ పంపిణీ చేయకపోవడంతో.. పలుచోట్ల ఇళ్లలోని సామగ్రి దొంగల పాలైంది. మేడ్చల్ జిల్లా పరిధిలో ఎక్కువ ఇళ్లు జీహెచ్ఎంసీలో నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎక్కువశాతం మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్నాయి. ఆ జిల్లాలో 38,419 ఇళ్లు ఉండగా.. హైదరాబాద్ జిల్లాలో 9,453, రంగారెడ్డి జిల్లాలో 23,908, సంగారెడ్డి జిల్లాలో 28,220 ఇళ్లున్నాయి. వీటిలో పాత ఇళ్లు, గుడిసెలను కూల్చి అక్కడే కొత్తగా నిర్మించిన వాటిని మాత్రం ఇప్పటికే పంపిణీ చేశారు. నగరంలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సరిపడా స్థలాలు లేనందున శివారు ప్రాంతాల్లో ఎక్కువగా నిర్మించారు. నగరంలో ఉంటున్న వారికి కూడా ఆయా ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించనున్నారు. మూడు కేటగిరీలుగా ‘డబుల్’ఇళ్లు అవసరాన్ని బట్టి, ఆయా ప్రాంతాల్లో అందుబాటును బట్టి జీహెచ్ఎంసీలో మూడు కేటగిరీల్లో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించారు. ♦ సెల్లార్+స్టిల్ట్+9 అంతస్తులు, లిఫ్టులు, ఫైర్సేఫ్టీ ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు. ఒక్కో ఇంటి వ్యయం రూ.8.65 లక్షలు. ♦ స్టిల్ట్+ 5 అంతస్తులు, లిఫ్టులు, మౌలిక సదుపాయాలు. ఒక్కో ఇంటి వ్యయం రూ.8.50 లక్షలు. ♦ లిఫ్టులు లేకుండా గ్రౌండ్+3 అంతస్తులు. మౌలిక సదుపాయాలు. ఒక్కో ఇంటి వ్యయం రూ.7.75 లక్షలు. పేదలకు ఇళ్ల పంపిణీపై కేటీఆర్ తొలి సంతకం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ భవనంలోని మూడో అంతస్తులో తనకు కేటాయించిన చాంబర్లోకి ఆదివారం మంత్రి కేటీఆర్ అడుగుపెట్టబోతున్నారు. ఈ కార్యాలయం నుంచే ఐటీ, మున్సిపల్, పట్ట ణాభివృద్ధి, పరిశ్రమల శాఖల మంత్రిగా విధులు నిర్వర్తించనున్నారు. కొత్త సచివాలయం నుంచి విధుల నిర్వహణ సందర్భంగా కీలకమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు మార్గదర్శకాలకు సంబంధించిన ఫైల్ ఇది అని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
స్కూళ్లు, కాలేజీల్లో మాస్కులు.. ఆ ఉద్యోగులకు వర్క్ఫ్రం హోం..!
లక్నో: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ నోయిడా ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. వైరస్ బారినపడకుండా ప్రజలు భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్కు పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. మరోవైపు పని ప్రదేశాల్లో యజమాన్యాలు కరోనా నివారణ చర్యలు చేపట్టాలని అధికారులు తెలిపారు. కార్యాలయాలను శానిటైజర్లతో శుభ్రం చేయాలని, ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ ఉష్ణోగ్రత స్కానర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఎవరైనా ఉద్యోగుల్లో జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు కన్పిస్తే వాళ్లకు వర్క్ఫ్రం హోం ఇవ్వాలని చెప్పారు. లక్షణాలు తగ్గకపోతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆ ఉద్యోగులకు సూచించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో దాని పక్కనే ఉన్న గౌతమ్ బుద్ధ నగర్, సహా ఇతర ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని నోయిడా అధికారులు ఈమేరకు చర్యలు చేపట్టారు. దేశ రాజధానిలో గురువారం 1,527 కరోనా కేసులు వెలుగుచూశాయి. బుధవారంతో పోల్చితే ఇవి 33 శాతం అధికం. పాజిటివీ రేటు కూడా 27.7 శాతంగా ఉంది. దీంతో ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు ముందు జాగ్రత్త చర్యగా చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. చదవండి: సూరత్ కోర్టులో వాదనలు.. ‘మరీ ఇంత పెద్ద శిక్షా ?’ -
ప్రయాణికులు అలాంటి దుస్తుల్లో రావద్దు.. ఢిల్లీ మెట్రో కీలక ప్రకటన..
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో ఓ యువతి టు పీస్ బికినీ టైప్ దుస్తులు ధరించి ప్రయాణించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ కీలక ప్రకటన చేసింది. రైలులో ప్రయాణించేవారు ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయంపై మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రయాణికులు మెట్రోలో ఇతరులకు అసౌకర్యంగా, ఇబ్బందికరంగా అన్పించే దుస్తులు ధరించవద్దని యాజమాన్యం సూచించింది. తోటి ప్రయాణీకుల సున్నితత్వాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించవద్దని స్పష్టం చేసింది. సమాజానికి ఆమోదయోగ్యమైన వేషధారణలో ప్రయాణించాలని తెలిపింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే సెక్షన్ 59 ప్రకారం శిక్షార్హులని హెచ్చరించింది. 'మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తున్నప్పుడు వేషధారణ మంచిగా ఉండాలని ప్రయాణికులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దుస్తుల ఎంపిక వ్యక్తిగత విషయమే అయినప్పటికీ.. ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించి స్వీయ నియంత్రణలో ఉండాలని విజ్ఞప్తి చేసింది. బ్రా.. మిని స్కర్ట్.. పీలికల్లాంటి దుస్తుల్లో మెట్రో రైలులో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులను బిత్తరపోయేలా చేసిన యువతి పేరు రిథమ్ చననా. సోషల్ మీడియాలో ఈ యువతిపై మామూలు తిట్లు పడడం లేదు. సొసైటీని పాడు చేయడానికే అలాంటి బట్టలు వేసుకుంటున్నావా? అంటూ మండిపడుతున్నారంతా. తొలుత ఆమె ఫొటోలు, వీడియోలు చూసి అంతా ఉర్ఫీ జావెద్ అనుకుని పొరపడ్డారంతా. చివరికి.. ఆమె అసలు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఐడెంటింటీ రివీల్ అయ్యింది. తనది ఎంతో పద్ధతిగల కుటుంబమని చెప్పిన ఆమె.. మొదట్లో తాను అంతే పద్దతిగా ఉండేదానినని చెప్పింది. అయితే.. సడన్గా తన ఆలోచనలు మారాయని, ఆ ఆలోచనలకు ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో దూరంగా ఉంటూ వస్తున్నానని తెలిపింది. చదవండి: దారుణం.. ప్రియుడ్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికిన ప్రియురాలు.. 400 కిలోమీటర్లు తీసుకెళ్లి బీచ్లో.. -
Pee Gate Row: రెచ్చిపోతే ఇకపై ఊరుకోరు!
న్యూఢిల్లీ: విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన ప్రయాణికుడి ఘటన.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన నెల తర్వాత వృద్ధురాలు ఫిర్యాదు చేయడం, ముంబైకి చెందిన శంకర్ మిశ్రా పరారీలో ఉండడం, ఈ మధ్యలో జరిగిన రాజీ యత్నాలు వాట్సాప్ ఛాటింగ్ రూపంలో.. నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ వ్యవహారంలో!. అయితే.. ఇదొక్కటే కాదు.. స్వల్ఫ వ్యవధిలో ఇలాంటి వికృత ఘటనలు చోటు చేసుకోవడంతో కీలక ఆదేశాలు వెలువడ్డాయి. ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో అలాంటి ప్రయాణికుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని, ఇకపై కఠినంగానే వ్యవహరించాలని విమానయాన నియంత్రణ సంస్థ నిర్ణయించుకుంది. విమానాల్లో ఇష్టానుసారం, పద్ధతి లేకుండా ప్రవర్తించే ప్రయాణికులను నిలువరించాల్సిన బాధ్యత పూర్తిగా సిబ్బందిదేనని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్లైన్స్ సంస్థలతో పేర్కొంది. అలాంటి ప్రయాణికులను నిలువరించేందుకు విమానంలోని సిబ్బంది సామరస్యంగా ప్రయత్నించాలి. పరిస్థితిని అంచనా వేయడం, సెంట్రల్ కంట్రోల్కు సమాచారం అందించాల్సిన బాధత్య పైలట్ది. ఒకవేళ..వాళ్లు(రెచ్చిపోయి ఇష్టానుసారం ప్రవర్తించే ప్రయాణికులు) వినలేని పరిస్థితులు గనుక ఎదురైతే ప్రత్యేక పరికరాలను ఉపయోగించాలని డీజీసీఏ.. ఎయిర్లైన్స్ సంస్థలకు సూచించింది. బేడీలు లేదంటే బెల్టుల తరహా పరికరాలను ఉపయోగించాలని, వాటిని విమానంలో ఎప్పుడూ ఉంచాలని చెబుతూ.. అవి ఎలా ఉండాలో కూడా పలు సూచనలు చేసింది డీసీసీఏ. నవంబర్లో(26వ తేదీన) జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానంలో బిజినెస్ క్లాస్ సెక్షన్లో ఓ వ్యక్తి.. ఓ వృద్ధురాలిపై మూత్రం పోశాడు. ఆ సమయంలో సిబ్బంది ఆమెకు సర్దిచెప్పి.. అతన్ని అక్కడి నుంచి పంపించేశారు విమాన సిబ్బంది. అయితే విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడా ఆ వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా సదరు వ్యక్తి అక్కడి నుంచి ఏం జరగనట్లు వెళ్లిపోయాడు. అయితే.. ఈ ఘటన విషయంలో ఇరుపార్టీలు రాజీకి వచ్చి ఉంటాయని ఎయిర్ ఇండియా ఇంతకాలం భావించిందట!. కానీ, తాజాగా ఆ వృద్ధురాలు ఏకంగా ఎయిర్ ఇండియా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్కు లేఖ రాయడంతో వ్యవహారం మీడియాకు ఎక్కింది. ఇక ఇది జరిగిన పదిరోజులకే.. అంటే డిసెంబర్ నెలలో మరోకటి జరిగింది. ప్యారిస్-ఢిల్లీ విమానంలో తప్పతాగిన ఓ వ్యక్తి తోటి మహిళా ప్రయాణికురాలి బ్లాంకెట్లో మూత్రం పోశాడు. అయితే విమానం దిగాక ఆ వ్యక్తితో లేఖ రాసి పంపించేశారు విమాన సిబ్బంది. ఇలా.. స్వల్ప కాలిక వ్యవధిలో జరిగిన ఘటనలు విమానయాన సంస్థల తీరు మీద విమర్శలు చెలరేగేలా చేశాయి. -
కేంద్రం కీలక నిర్ణయం.. వాటికి చెక్, ఈ–కామర్స్ కంపెనీలు ఇలా చేయాల్సిందే!
న్యూఢిల్లీ: ఉత్పత్తులు, సర్వీసులపై వినియోగదారులను తప్పుదోవ పట్టించే నకిలీ ఆన్లైన్ సమీక్షలకు చెక్ చెప్పే దిశగా కేంద్రం కొత్త పాలసీని రూపొందించింది. ఇది నవంబర్ 25 నుండి అమల్లోకి రానుంది. ఆయా ఆన్లైన్ పోర్టల్స్ ముందుగా వీటిని స్వచ్ఛందంగా అమలు చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ తప్పుడు రివ్యూల సమస్య కొనసాగిన పక్షంలో నిబంధనలను కేంద్రం తప్పనిసరి చేయనుంది. దీని ప్రకారం అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ–కామర్స్ కంపెనీలు స్వచ్ఛందంగా అన్ని పెయిడ్ రివ్యూల వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఇతరుల నుండి కొనుగోలు చేసిన సమీక్షలు, అలాగే సరఫరాదారు లేదా థర్డ్ పార్టీ తమ ఉత్పత్తులు/సర్వీసుల రివ్యూ కోసం నియమించుకున్న ఉద్యోగులు రాసే సమీక్షలను ప్రచురించకూడదు. ఆన్లైన్ వినియోగదారుల రివ్యూలపై భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) ‘ఐఎస్ 19000:2022’ పేరిట కొత్త ప్రమాణాన్ని రూపొందించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సోమవారం తెలిపారు. ఉత్పత్తులు .. సర్వీసుల సరఫరాదారులు, తమ సొంత కస్టమర్ల నుండి రివ్యూలను సేకరించే సంస్థలు, సరఫరాదారు నియమించుకున్న థర్డ్ పార్టీ కాంట్రాక్టరు సహా కన్జూమర్ రివ్యూలను ఆన్లైన్లో ప్రచురించే అన్ని సంస్థలకు ఇవి వర్తిస్తాయని వివరించారు. 15 రోజుల్లో సర్టిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం.. ఆన్లైన్ పోర్టల్స్ ఈ ప్రమాణాలను పాటిస్తున్నాయో లేదో పరిశీలించేందుకు సంబంధించిన సర్టిఫికేషన్ ప్రక్రియను వచ్చే 15 రోజుల్లోగా ప్రారంభించనున్నట్లు సింగ్ చెప్పారు. ఈ–కామర్స్ సంస్థలు ఈ సర్టిఫికేషన్ కోసం బీఐఎస్కి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. చాలా దేశాలు తప్పుడు రివ్యూలకు అడ్డుకట్ట వేసేందుకు చాలా తంటాలు పడుతున్న తరుణంలో ఈ తరహా ప్రమాణాలను ప్రవేశపెట్టిన తొలి దేశం బహుశా భారతేనని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా టూర్..ట్రావెల్, రెస్టారెంట్లు .. హోటళ్లు, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో రివ్యూలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సింగ్ తెలిపారు. జొమాటో, స్విగ్గీ, రిలయన్స్ రిటైల్, టాటా సన్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర సంస్థలు కొత్త ప్రమాణాలపై సంప్రదింపుల ప్రక్రియలో పాల్గొన్నట్లు సింగ్ చెప్పారు. అలాగే ప్రమాణాల రూపకల్పనలో సీఐఐ, ఫిక్కీ తదితర పరిశ్రమ సమాఖ్యలను కూడా సంప్రదించినట్లు వివరించారు. నిబంధనల ప్రకారం .. ఏ సంస్థలోనైనా రివ్యూలను హ్యాండిల్ చేసే బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగిని రివ్యూ అడ్మినిస్ట్రేటర్గా వ్యవహరిస్తారు. సమీక్షలు చట్టబద్ధమైనవిగా, కచ్చితమైనవిగా, తప్పుదోవ పట్టించని విధంగా ఉండాలి. రివ్యూ చేసే వ్యక్తుల అనుమతి లేకుండా వారి పేర్లను వెల్లడించకూడదు. సమీక్షలసేకరణ పక్షపాతరహితంగా ఉండాలి. చదవండి: మూన్లైటింగ్: 81 శాతం ఉద్యోగులు స్పందన ఇదే.. సర్వేలో షాకింగ్ విషయాలు! -
Ukraine: భారతీయులకు తీవ్ర హెచ్చరికలు
న్యూఢిల్లీ/కీవ్: ఉక్రెయిన్లో మళ్లీ దాడులు ఉధృతం కావడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ వెళ్తున్నవాళ్లకు, ఉక్రెయిన్లో ఉంటున్న భారతీయులకు సోమవారం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. అనవసర ప్రయాణాలొద్దని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక అధికారులు జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని వారిని కోరింది. రాజధాని కీవ్ నగరంతో పాటు ఉక్రెయిన్లోని పలు చోట్ల రష్యా మిస్సైల్స్తో విరుచుకుపడుతున్న నేపథ్యంలో.. భారత్ ఈ మార్గదర్శకాలను జారీ చేయడం గమనార్హం. సుమారు 84కిపైగా మిస్సైల్స్ ఉక్రెయిన్ భూభాగంలో విధ్వంసం సృష్టించగా.. సుమారు పది మంది పౌరులు మృతి చెందారని, మరో 60 మంది గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. ఉక్రెయిన్లో ప్రస్తుతం పెరుగుతున్న దాడుల దృష్ట్యా.. భారతీయ పౌరులు ఉక్రెయిన్కు, ఉక్రెయిన్ లోపల కూడా అన్ని అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఉక్రెయిన్ ప్రభుత్వం, స్థానిక అధికారులు జారీ చేసిన రక్షిత, భద్రతా మార్గదర్శకాలను వారు ఖచ్చితంగా పాటించాలి అని ఉక్రెయిను్ రాజధాని కీవ్లోని భారత రాయబార కార్యాలయం నుంచి అడ్వైజరీ విడుదల అయ్యింది. ఉక్రెయిన్లో ఉంటున్న భారతీయులు వాళ్ల వాళ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎంబసీకి తెలియజేయాలని, తద్వారా సాయం విషయంలో ఎలాంటి గందరగోళం ఉండదని పేర్కొంది. మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం, పౌరుల మరణాలతో సహా ఉక్రెయిన్లో సంఘర్షణ తీవ్రతరం కావడంపై భారతదేశం తీవ్ర ఆందోళన చెందుతోంది అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. యుద్ధవిరమణకు తక్షణ పిలుపు ఇచ్చారాయన. మరోవైపు.. ఇప్పటిదాకా ఉక్రెయిన్పై రష్యా దాడులను భారత్ ఖండించింది లేదు. దౌత్యం-చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరుతూ వస్తోంది. -
సీపీఎస్ ఉద్యోగులకు పింఛన్ మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ సర్కారు
సాక్షి, హైదరాబాద్: కంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం (సీపీఎస్) పరిధిలోనికి వచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కుటుంబ పింఛన్ మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. గతేడాది జూన్ 11న ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా మార్గదర్శకాలతో సర్క్యులర్ను రాష్ట్ర ట్రెజరీ శాఖ మంగళవారం అన్ని జిల్లాలకు పంపింది. ఈ సర్క్యులర్ ప్రకారం చనిపోయిన లేదా విధులు నిర్వర్తించలేని స్థితిలో ఉన్న ఉద్యోగి తన చివరి నెలలో డ్రా చేసే వేతనంలోని 33 శాతాన్ని అతని కుటుంబానికి పింఛన్ కింద ఇవ్వ నున్నారు. అదేవిధంగా గతంలో ఉద్యోగి వేతనం నుంచి కంట్రిబ్యూటరీ పింఛన్ను మినహాయించుకోకపోయినా, పింఛన్ కోసం శాశ్వత అకౌంట్ నెంబర్ (ప్రాన్) లేకపోయినా ఈ పింఛన్ విధానం వర్తించనుంది. ఈ ఉత్తర్వులు రాకముందే చనిపోయి లేదా ఉద్యోగ విధుల్లో లేకుండా ఉండి అరకొర పింఛన్తో వెళ్లదీస్తోన్న ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఈ పింఛన్ వర్తించనుంది. తద్వారా 1,500 మంది ఉద్యోగుల కుటుంబాలకు పింఛన్ మంజూరయ్యేందుకు మార్గం సుగమం అయింది. ఈ ఉత్తర్వుల జారీ పట్ల తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పింఛన్ పథక ఉద్యోగుల యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) హర్షం వ్యక్తం చేసింది. కుటుంబ పింఛన్ కోసం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ డైరెక్టర్కు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.స్థితప్రజ్ఞ కృతజ్ఞతలు తెలిపారు. తమ యూనియన్ వినతి మేరకు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడం సంతోషదాయకమని యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి నరేష్గౌడ్, ౖఅధ్యక్షుడు నరేందర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. -
భారత్లో మంకీపాక్స్.. కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ: చాపకింద నీరులా ప్రపంచం మొత్తం మంకీపాక్స్ వ్యాపిస్తోంది. తాజాగా భారత్లోనూ తొలి కేసు కేరళలో వెలుగు చూసింది. వైరస్ సోకిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టింది అక్కడి వైద్యశాఖ. ఈ క్రమంలో మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులు.. జ్వరం, జబ్బులున్న వాళ్లతో సన్నిహితంగా ఉండొద్దని మార్గదర్శకాల్లో పేర్కొంది కేంద్రం. అలాగే.. ఎలుకలు, ఉడుతలు, వన్యప్రాణులు, ఇతర జీవులకు దూరంగా ఉండాలని పేర్కొంది. అడవి జంతువుల మాంసం విషయంలో, ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తా ఉండాలి. అలాగే.. ఆఫ్రికా నుంచి దిగుమతి అయిన వణ్యప్రాణి సంబంధిత ప్రొడక్టులు.. లోషన్లు, క్రీమ్లు, పౌడర్లకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఇన్ఫెక్షన్ సోకిన వాళ్లు వాడినవి, ఇన్ఫెక్షన్ సోకిన జంతువులకు దూరంగా ఉండడం తప్పనిసరి. జ్వరం, దద్దర్లు లాంటి మంకీపాక్స్ సంబంధిత లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలి. ఐసోలేషన్కి వెళ్లిపోవాలి. మంకీపాక్స్ అంటే.. స్మాల్ పాక్స్ (మశూచి) తరహా ఇన్ఫెక్షన్ ఇది. మశూచితో పోల్చి చూస్తే తక్కువ తీవ్రత ఉంటుంది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ తొలుత వెలుగులోకి వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970ల్లో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్ వైరస్ జాడ కనిపించింది. డబ్ల్యూహెచ్వో ప్రకారం మంకీపాక్స్ అనేది జంతువుల ద్వారా సంక్రమించే మంకీపాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్. జంతువుల ద్వారా మనుషులకు సోకుతుంది. మనునషుల నుంచి మనుషులకు కూడా సోకుతుంది. ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాలైన మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసులు వెలుగు చూసేవి. బయటి దేశాల్లో బయటపడడం చాలా అరుదైన అంశం. అలాంటిది ఇప్పుడు భారత్ సహా చాల దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగు చూస్తున్నాయి. లక్షణాలివే.. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ, గ్లాండ్స్లో వాపు వంటివి మొదట కనిపిస్తాయి. అయిదు రోజులకి మశూచి వ్యాధి మాదిరిగా శరీరమంతా బొబ్బలు వస్తాయి. ఇవి తగ్గడానికి కనీసం నాలుగు వారాలు పడుతుంది. ఎలా వ్యాపిస్తుంది?: మంకీపాక్స్ అనేది క్లోజ్ కాంటాక్ట్ ద్వారా సోకుతుంది. దగ్గరగా ఉన్నా.. కలిసి ఉన్నా.. శారీరక సంబంధం కలిగా ఉన్నా.. సోకుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ సోకిన జంతువులకు దగ్గరగా ఉన్నా కూడా సోకుతుంది. తుంపర్ల ద్వారా, మంకీపాక్స్ బాధితులకు అతి సమీపంగా మెలిగినా వ్యాపిస్తుంది. రోగుల దుస్తులు ముట్టుకున్నా, వారితో కలిసి బెడ్పై పడుకున్నా, శారీరకంగా కలిసినా కూడా వ్యాపిస్తుంది. చికిత్స ఎలా.. ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీవైరల్ డ్రగ్స్ వాడతారు. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కూడా పని చేస్తుంది. మందులు వాడితే.. నాలుగైదు వారాల్లో దానంతట అదే తగ్గిపోతుంది. లేదంటే మరో మూడు వారాలు ఎక్కువ పట్టొచ్చు. ప్రతీ పది మందిలో ఒకరు మంకీపాక్స్తో చనిపోయే అవకాశాలు ఉన్నాయి. మంకీపాక్స్ లక్షణాలు కనిపించిన వ్యక్తికి వీలైనంత దూరంగా ఉండడమే.. ఈ వైరస్ను అడ్డుకునే మార్గం. చదవండి: మంకీపాక్స్ సామాజిక వ్యాప్తి చెందొచ్చు! -
హోటల్స్, రెస్టారెంట్లలో ఆ బలవంతపు వసూళ్లకు చెక్
న్యూఢిల్లీ: హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లే కస్టమర్లకు.. ఇక నుంచి ‘సర్వీస్ ఛార్జీ’ బాదుడు నుంచి ఊరట లభించింది. వినియోగదారుల విషయంలో ఇష్టానుసారం వ్యవహరించకుండా ఉండేందుకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) సరికొత్త మార్గదర్శకాలను సోమవారం జారీ చేసింది. హోటల్స్, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీల పేరిట కస్టమర్ల నుంచి బలవంతపు వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ.. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ప్రకటించింది. బిల్లులకు ఆటోమేటిక్గా కానీ, మ్యానువల్గా కానీ సర్వీస్ ఛార్జీలను జత చేయొద్దని సీసీపీఏ తన గైడ్లైన్స్లో పేర్కొంది. సర్వీస్ ఛార్జీలను ఏ రూపేనా కూడా వసూలు చేయడానికి వీల్లేదు. కస్టమర్ల నుంచి బలవంతంగా వసూలు చేయరాదు. అది కేవలం స్వచ్ఛంద చెల్లింపు, ఆప్షనల్ మాత్రమే. ఈ విషయాన్ని కస్టమర్కు సైతం తెలియజేయాలని మార్గదర్శకాల్లో కన్జూమర్ ఎఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఫుడ్ బిల్లు, జీఎస్టీతో పాటు సర్వీస్ ఛార్జ్ అనేది బిల్లులో ఇకపై కనిపించడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా హోటల్, రెస్టారెంట్ గనుక సర్వీస్ఛార్జ్ వసూలు చేస్తే గనుక.. నిబంధనలను ఉల్లంఘించినట్లేనని తాజా మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. ఈ విషయమై ప్రశ్నించే.. నిలదీసే హక్కు కస్టమర్లకు ఉంటుందని తెలిపింది. ఫిర్యాదు చేయాలనుకుంటే.. నేషనల్ కన్జూమర్ హెల్ప్లైన్ నెంబర్ 1915కు కాల్ చేయాలని తెలిపింది. లేదంటే ఎన్సీహెచ్ మొబైల్ యాప్లోనూ ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేసింది. సీపీపీఏకు ఈ-మెయిల్ ccpa@nic.in ద్వారా కూడా ఫిర్యాదు ఇవ్వొచ్చని తెలిపింది. అంతేకాదు అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టిస్ కింద కన్జూమర్ కమిషన్లోనూ ఫిర్యాదు చేయొచ్చని స్పష్టం చేసింది. ఒకవేళ వేగవంతమైన చర్యల కోసం.. ఈ-దాఖిల్ పోర్టల్ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపింది. ఇవేం కుదరకుంటే.. నేరుగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందిస్తే.. సీసీపీఏ సమన్వయం ద్వారా దర్యాప్తు జరుగుతుందని స్పష్టం చేసింది. చదవండి: కప్పు ఛాయ్ రూ. 70 వసూలు!.. రైల్వే వివరణ -
తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన టెట్ పరీక్ష..
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రారంభమైంది. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 336 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 83,465 మంది పరీక్షకు హాజరు కానున్నారు. అత్యధికంగా హైదరాబాద్లో 212 పరీక్ష కేంద్రాలున్నాయి. రాజ ధానిలో మొత్తం 50,600 మంది పరీక్ష రాస్తున్నారు. ములుగులో అతి తక్కువగా 15 పరీక్ష కేంద్రాలున్నాయి. ఈ జిల్లాలో దాదాపు 2,200 మంది పరీక్ష రాస్తున్నారు. ప్రతి కేంద్రానికి 11 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రతి కేంద్రానికి 11 మంది ఇన్విజిలేటర్లు, మరో ముగ్గురు పర్యవేక్షణ అధికారుల చొప్పున వినియోగిస్తున్నారు. వారికి పరీక్ష నిర్వహణ విధానంపై శిక్షణ కూడా ఇచ్చారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. వీటిని ఇంటర్నెట్ ద్వారా జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేశారు. ప్రశ్నపత్రం ఓపెన్ చేయడం మొదలు కొని, ప్యాక్ చేసే వరకూ వీడియో రికార్డింగ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పేపర్– 1 అభ్యర్థులకు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, పేపర్– 2 అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది, తాగునీరు, నిరంతర విద్యుత్ సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష సమయానికి కేంద్రాలకు అభ్యర్థులు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. పరేషాన్లో అభ్యర్థులు.. టెట్ హాల్ టికెట్లు తప్పుల తడకగా మారడంతో అభ్యర్థులు పరేషాన్ అవుతున్నారు. ఇప్పటికే కొందరు హాల్ టికెట్ సరిచేసుకోగా మరికొందరు అవగాహన లేక చేసుకోలేక పోయారు. వాస్తవంగా ప్రైవేటు ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో అనేక తప్పులు దొర్లాయి. హాల్ టికెట్లలో అభ్యర్థి పేరు, తండ్రి, తల్లి పేరు, పుట్టిన తేదీ, కులం, లింగం, డిసెబిలిటీ (పీహెచ్సీ) వంటి వివరాలతో పాటు ఫొటో లు సరిగా కనిపించకపోవడం, ఫొటో కింద సంతకాలు లేకపోవడం ఇబ్బందిగా తయారైంది. పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హాల్ టికెట్పై ఫొటో, సంతకం సరిగా లేకపోయినా, అస్సలు లేకపోయినా అభ్యర్థులు తాజా ఫొటోను అతికించి, గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేష¯న్ చేయించుకొని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో చాలా మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. మరికొందరు అవగాహన లేక తిప్పలు పడుతున్నారు. ► గుర్తుంచోవాల్సిన అంశాలు ►పేపర్1(ఎస్జీటీ) ఉదయం 9.30 గంటల నుంచి 12 వరకు, పేపర్2(ఎస్ఏ) మధ్యాహ్నం2.30 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ►అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా హాలులోకి అనుమతించారు. ►ఓఎమ్ఆర్ షీట్లను చించడం, మతడపెట్టడం చేయరాదు. నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి తెలిసినవి ఆన్సర్ చేసి ఆ తర్వాత ఖచ్చితంగా తెలియని, ఊహించి చెప్పగలిగేవి ఆన్సర్ చేయండి. ►ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లో హెల్ప్లైన్ టెట్ అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. టెట్ పరీక్షకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్లు, రూట్మ్యాప్, రవాణా సౌకర్యాలు, ఇతర సందేహాలు, సలహాల కోసం ఈ నంబర్లను సంప్రదించవచ్చు. ►హైదరాబాద్ : 98488 39244 ►రంగారెడ్డి జిల్లా : 96661 62092, 93968 56548, 77999 99242, 99666 53653 ►మేడ్చల్ జిల్లా : 91604 19991 -
ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై గైడ్లైన్స్ జారీ.. ఇకపై..
సాక్షి, అమరావతి: ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమా టికెట్ల విక్రయాలకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఏఫీఎఫ్డీసీకి (ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్) సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతల నిర్వహణ అప్పగించింది. ఇకపై రాష్టంలోని థియేటర్లు ఏపీఎఫ్డీసీతో అగ్రిమెంట్ చేసుకోవాలి. అన్ని థియేటర్లు,ప్రయివేట్ సంస్థలు నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే అమ్మకాలు చేపట్టాలి. విక్రయించే ప్రతి టికెట్ పై 2 శాతం మాత్రం సర్వీస్ చార్జీ వసూలు చేయాలి. థియేటర్లలో ఎటువంటి అవకతవకలు లేకుండా పక్కాగా ఆన్లైన్ టికెట్ల అమ్మకాలు చేయాలి. కొత్త సినిమా విడుదల నేపథ్యంలో వారం ముందు నుంచి మాత్రమే టిక్కెట్లు అమ్మకాలు జరపాలి. చదవండి: అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు...ప్రేమ పేరుతో బాలికతో మరో పెళ్లి -
బంగారం దిగుమతులు: ఆర్బీఐ కొత్త నిబంధనలు
ముంబై: బంగారం భౌతిక దిగుమతుల్లో మరింత పారదర్శకత లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం కీలక నిబంధనలు జారీ చేసింది. ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్ ఐఎఫ్ఎస్సీ (ఐఐబీఎక్స్) లేదా భారతదేశంలోని క్వాలిఫైడ్ జ్యువెలర్ల అధికారిక ఎక్సే్ఛంజ్ ద్వారా పసిడి దిగుమతులకు ఉద్దేశించి ఈ నిబంధనలను రూపొందించడం జరిగిందని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. ఆర్బీఐ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ద్వారా నామినేట్ అయిన ఏజెన్సీలతో పాటు, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) ఆమోదించిన క్వాలిఫైడ్ జ్యువెలర్స్ (క్యూజే) బంగారం దిగుమతికి గత జనవరిలో సెంట్రల్ బ్యాంక్ అనుమతించింది. అయితే దిగుమతులకు సంబంధించిన తాజాగా నిబంధలు జారీ అయ్యాయి. నిబంధనావళి ప్రకారం... ♦ ఐఎఫ్ఎస్సీ చట్టం కింద జారీ అయిన విదేశీ వాణిజ్య విధానం, నిబంధనలకు అనుగుణంగా ఐఐబీఎక్స్ ద్వారా బంగారం దిగుమతి కోసం క్వాలిఫైడ్ జ్యువెలర్లు బ్యాంకులకు 11 రోజుల ముందస్తు చెల్లింపులు చేయవచ్చు. ♦ బంగారాన్ని దిగుమతి చేసుకునేందుకు ముందస్తుగా చెల్లించే సొమ్ముకు సంబంధించి రుణ సౌలభ్యతకు లేదా ముందస్తు చెల్లింపుల కంటే ఎక్కువ విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకునేందుకు ఏ రూపంలోనూ అనుమతి ఉండదు. ♦ ఐఎఫ్ఎస్సీఏ అధీకృత ఎక్స్ఛేంజ్ ద్వారా బంగారం దిగుమతికి సంబంధించి ముందస్తు చెల్లింపులు, దిగుమతులు కార్యరూపం దాల్చకపోవడం, లేదా దిగుమతి ప్రయోజనం కోసం చేసిన అడ్వాన్స్ రెమిటెన్స్ అవసరమైన మొత్తం కంటే ఎక్కువగా ఉండడం, ఉపయోగించని అడ్వాన్స్లు తిరిగి చెల్లించడం వంటి లావాదేవీలను సంబంధిత బ్యాంక్లో నిర్దిష్ట 11 రోజుల కాలపరిమితిలోపు నిర్వహించే వీలుంది. ♦ ఐఐబీఎక్స్ ద్వారా బంగారం దిగుమతుల కోసం క్వాలిఫైడ్ జ్యువెలర్స్ చేసే అన్ని చెల్లింపులు ఐఎఫ్ఎస్సీఏ ఆమోదించిన విధంగా ఎక్స్ఛేంజ్ యంత్రాంగం ద్వారా జరుగుతాయి. ♦ 2022 ఏప్రిల్లో బంగారం దిగుమతులు గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 72 శాతం తగ్గి 6.23 బిలియన్ డాలర్ల నుంచి 1.72 బిలియన్ డాలర్లకు చేరిన నేపథ్యంలో తాజా నిబంధనావళి జారీ కావడం గమనార్హం. -
Medchal: స్విమ్మింగ్పూల్స్ వద్ద భద్రత ప్రశ్నార్థకం!
సాక్షి, హైదరాబాద్(పోచారం): వేసవి కాలంలో పిల్లల కేరింతలతో స్విమ్మింగ్ పూల్స్ సందడిగా ఉంటాయి. నీళ్లలో ఈత కొట్టేందుకు పిల్లలు ఉరకలు వేస్తారు. పూల్లో కూల్ అవుతూ వేసవి తాపం నుంచి తప్పించుకుంటున్నారు. కానీ, పోచారం మున్సిపాలిటీలోని స్విమ్మింగ్ పూల్స్ వద్ద భద్రత ప్రశ్నార్థకంగా మారడంతో చిన్నారులు తనువు చాలించిన సందర్భాలు చోటుచేసుకుంటున్నాయి. కొరవడిన అధికారిక పర్యవేక్షణ.. స్విమ్మింగ్ పూల్స్పై అధికారిక పర్యవేక్షణ లోపించడంతో నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. నిర్వాహకుల దయాదాక్షిణ్యాలపైనే స్విమ్మర్లు ఆధారపడాల్సి వస్తోంది. నేషనల్ బిల్డింగ్ కోడ్ నిబంధనలు మినహా నిర్వాహకులకు వేరే ఎలాంటి గైడ్లైన్స్ను ప్రభుత్వం జారీ చేయకపోవడంతో స్విమ్మింగ్ నేర్చుకునే వారికి వసతులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్స్ గణాంకాలు.. స్విమ్మింగ్ పూల్స్కు సంబంధించిన గణాంకాలు పోచారం మున్సిపల్ అధికారుల వద్ద లేవు. వీటిలో ఎలాంటి సదుపాయాలున్నాయో వీరు పరిశీలించరు. లైఫ్ గార్డులు, నీటి లోతు, తరచు నీటి మార్పిడి, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు వంటి అంశాలను గాలికి వదిలేస్తున్నారు. కోచ్లు అందుబాటులో ఉండటం లేదు. ఇవన్నీ స్విమ్మింగ్ పూల్స్ వద్ద భద్రత లోపించిందనడానికి నిలువెత్తు నిదర్శనాలు. ఇటీవల బాలుడి మృతి.. ఇటీవల అన్నోజిగూడలోని స్విమ్మింగ్ పూల్లో 16 ఏళ్ల విద్యార్థి పూజారి పారికర్ మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందే. జిల్లా వ్యాప్తంగా 50కు పైగానే.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా గేటెడ్ కమ్యూనిటీలను కలుపుకొని గణాంకాలు తీస్తే సుమారు 50కు పైగానే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయని అంచనా వేశారు. వీటిలో నిబంధనల ప్రకారం నిర్మితమైనవి పది కంటే మించవు. నీటి కొరత, ఇతరత్రా కారణాల వల్ల మరో 15 స్విమ్మింగ్ పూల్స్ మూతపడినట్లు తెలిసింది. పిల్లలకు ఇవి ఇవ్వడం మర్చిపోవద్దు.. స్విమ్మింగ్ పూల్లోకి దిగే ముందు పిల్లలకు కంటి అద్దాలు, చెవి ప్లగ్లు, ఫ్లోటర్లు, టవర్లు వంటి భద్రతా పరికరాలు ఇవ్వడం గుర్తుంచుకోవాలి. వీటితో నిర్భయంగా ఈత నేర్చుకోవచ్చు. అప్పుడే పిల్లలు సురక్షితంగా ఉంటారు. -
ఈ-కామర్స్కు ఆర్బీఐ పెద్దపీట! ఆన్లైన్ చెల్లింపులపై కీలక నిర్ణయం!
ముంబై: ఎగుమతులు–దిగుమతులు (ఎగ్జిమ్), ఇందుకు సంబంధించి చెల్లింపుల పరిష్కార ప్రక్రియలో ఈ–కామర్స్కు పెద్దపీట వేయడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారిస్తోంది. ఈ దిశలో ఆయా అంశాలను సరళీకరించి, హేతుబద్ధీకరించడంపై కీలక చర్య తీసుకుంది. ఇందుకు వీలుగా ప్రస్తుత నిబంధనలను సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక ముసాయిదా మార్గదర్శకాల పత్రాన్ని సెంట్రల్ బ్యాంక్ ప్రతిపాదించింది. ‘‘ఎగుమతి, దిగుమతులకు సంబంధించి చిన్న స్థాయి చెల్లింపుల ప్రక్రియను ఈ కామర్స్ ద్వారా సులభతరం చేయడానికి తీసుకువస్తున్న ఆన్లైన్ ఎక్స్పోర్ట్–ఇంపోర్ట్ ఫెసిలిటేటర్స్’ అనే శీర్షికన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. బ్యాంకులు, ఇతర సంబంధిత వర్గాల నుంచి స్వీకరించిన అభిప్రాయాల ప్రాతిపదిక, సమగ్ర సమీక్ష అనంతరం తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆర్బీఐ ప్రకటన సూచించింది. పరిమితులు ఇలా... 3,000 డాలర్లకు మించని విలువైన వస్తువులు, డిజిటల్ ఉత్పత్తులను ఆన్లైన్లో దిగుమతి చేసుకోవడానికి ఈ కామర్స్ చెల్లింపుల సౌకర్యం అందుబాటులో ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ ప్రతిపాదించింది. ఎగుమతుల విషయంలో ఈ విలువ 15,000 డాలర్ల వరకూ ఉంది. ప్రస్తుతం వస్తువులు, సేవల ఎగుమతులు, అలాగే వస్తువులు, సాఫ్ట్వేర్ల దిగుమతికి సంబంధించి చెల్లింపు ప్ర క్రియ నిర్వహించడానికి బ్యాంకింగ్కు అనుమతి ఉంది. దీనిప్రకారం ఆన్లైన్ పేమెంట్ గేట్వే సర్వీ స్ ప్రొవైడర్లతో (ఓపీజీఎస్పీలు) స్టాండింగ్ కాంట్రాక్ట్లోకి ప్రవేశించడం ద్వారా దిగుమతి, ఎగు మతి సంబంధిత రెమిటెన్స్ల ప్రాసెసింగ్, సెటిల్మెంట్ సౌకర్యాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. -
ఉక్రెయిన్ లో భారతీయులకు అత్యవసర మార్గదర్శకాలు
-
ఆన్లైన్ క్లాసులూ నిర్వహించాలి..
సాక్షి, హైదరాబాద్: విద్యా సంస్థల్లో ఈ నెల 28 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్లైన్ బోధన కొనసాగించాలని ఆన్లైన్ బోధన కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్కుమార్ షావిలిలతో కూడిన ధర్మాస నం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కరో నాపై దాఖలైన పలు వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను గురువారం ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. వారాంతపు సంతల కంటే బార్లు, రెస్టారెంట్ల వల్లే ఎక్కువ ప్రమాదం ఉంటుందని వ్యాఖ్యానించింది. వీటి వద్దే ఎక్కువ మంది జనం ఉంటారని, ఇక్కడ కూడా కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవా లని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో రెండు వారా ల్లోగా నివేదించాలని కోరింది. అక్కడా అమలు చేయండి..: అన్ని మతపర మైన కార్యక్రమాల్లోనూ కోవిడ్ మార్గదర్శకాలు అమలు చేయాలని ఆదేశించింది. సమ్మక్క జాతరలో, సమతామూర్తి సహ స్రాబ్ది వేడుకల్లో కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడా లని ఏజీకి సూచిం చింది. నిర్లక్ష్యం వహిస్తే కరోనా ప్రబలే ప్రమాదం ఉంటుందని, అందుకే ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించగా.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్తో పాటు న్యాయ వాదులు పవన్, చిక్కుడు ప్రభాకర్ ఇతరులు వాదించారు. విచారణకు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. పిల్లలకు చికిత్స కోసం ఏర్పాట్లు: పిల్లలకు చికిత్స కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆస్ప త్రుల్లో ఏర్పాట్లు చేసినట్లు శ్రీనివాసరావు వివరిం చారు. మేడారం జాతరలో ప్రభుత్వం కోవిడ్ జాగ్రత్తలన్నీ తీసుకుంటుందని చెప్పారు. కరోనా తీవ్రత ఎక్కువగా లేనందునే విద్యా సంస్థలను తెరిచా మని, విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని విద్యా సంవత్సరం నష్టపో కుండా చర్యలు తీసుకున్నామంటూ విద్యా శాఖ విడిగా నివేదిక అందజేసింది. కాగా ప్రభుత్వం తీసుకున్న చర్యల నివేదికను ఈ నెల 28న జరిగే విచారణ నాటికి అందించాలని ధర్మాసనం ఆదేశించింది. -
ఎస్బీఐ కొత్త రూల్స్.. నిర్మలకు ఎంపీ లేఖ.. ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: గర్భిణీ మహిళా అభ్యర్థులకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెచ్చిన తాజా నిబంధనలు విమర్శలకు దారితీస్తున్నాయి. 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హులంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎస్బీఐ తన నిబంధనలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. ఇక ఇదే విషయంపై ఢిల్లీ మహిళా కమిషన్ స్టేట్ బ్యాంక్కు నోటీసులు సైతం జారీచేసింది. చట్టవిరుద్ధమైన ఈ నిబంధనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కొత్తగా ఉద్యోగంలో చేరేవారు, పదోన్నతులపై కొత్త పదవిలో చేరేవారి కోసం ఎస్బీఐ 2021 డిసెంబరు 31న నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిపై ఆలిండియా ఎస్బీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. (చదండి: ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించే చారిత్రక నిర్ణయం) -
కొత్త పేస్కేల్స్ అమలుపై మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: కొత్త పీఆర్సీకి అనుగుణంగా ఉద్యోగుల పేస్కేల్స్ నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మెమో జారీ చేశారు. ప్రస్తుతమున్న బేసిక్ పే, 2018 జూలై 1 వరకు ఉన్న డీఏలు(30.392 శాతం), 23 శాతం ఫిట్మెంట్ను కలిపి బేసిక్ పే నిర్ధారించాలని ఆదేశించారు. కొత్తగా ప్రకటించిన హెచ్ఆర్ఏలు, సీసీఏ మినహాయించి అమలు చేయాలని స్పష్టం చేశారు. మారిన పే స్కేల్స్ను 2018 జూలై 1 నుంచి నోషనల్గా తీసుకుని.. 2020 ఏప్రిల్ 1 నుంచి మానిటరీ బెనిఫిట్ అమలు చేయాలని సూచించారు. మారిన పేస్కేల్స్ ప్రకారం కొత్త జీతాలను ఫిబ్రవరి 1న ఐదు పెండింగ్ డీఏలతో కలిపి ఇవ్వాలని స్పష్టం చేశారు. పేస్కేల్స్కి సంబంధించిన అన్ని వివరాలను ఏపీ గెజిట్ పోర్టల్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పేస్కేల్స్ కోసం ఏపీసీఎఫ్ఎస్ఎస్ హెచ్ఆర్ఎంఎస్లో కొత్త మోడల్ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. -
ఒమిక్రాన్పై కేంద్రం హెచ్చరికలు.. వారం రోజుల్లోనే..
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ను సాధారణ జలుబుగా భావించవద్దని కేంద్రం హెచ్చరించింది. కరోనా తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోందని, కేవలం వారం రోజుల్లోనే 300 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం దాటిందని స్పష్టం చేసింది. అయితే.. డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నా.. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అటు.. కరోనా బాధితుల డిశ్చార్జ్ పాలసీని సవరించినట్లు చెప్పిన అగర్వాల్.. కోవిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చి.. స్వల్ప లక్షణాలు ఉన్న బాధితులను ఏడు రోజుల్లో డిశ్చార్జ్ చేయాలన్నారు. వీరికి మళ్లీ వైరస్ నిర్థారణ పరీక్షలు అవసరం లేదని చెప్పారు. మరోవైపు థర్డ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కనీసం 48 గంటల మెడికల్ ఆక్సిజన్ను బఫర్ స్టాక్లో ఉంచాలని స్పష్టం చేసింది. మెడికల్ ఆక్సిజన్ కంట్రోల్ రూమ్లను పటిష్ట పర్చాలని సూచించింది. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో తగినంత ఆక్సిజన్ లభ్యత ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రాణవాయువు కొరత ఏర్పడితే సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. -
ఐసీఎంఆర్ కొత్త గైడ్లైన్స్.. ఈ లక్షణాలు ఉంటేనే కోవిడ్ పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా పరీక్షలకు సంబంధించి భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కీలక మార్గదర్శకాలు జారీచేసింది. లక్షణాలు లేని వారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. దగ్గు, జ్వరం, గొంతులో సమస్య, రుచి, వాసన కోల్పోయినవారు మాత్రం తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలని ఐసీఎంఆర్ స్పష్టంచేసింది. దాంతోపాటు వయసు రీత్యా, అనారోగ్య సమస్యల పరంగా హై రిస్క్ కేటగిరీలోకి రాకపోతే.. కోవిడ్ క్లోజ్ కాంటాక్ట్స్కు కూడా పరీక్షలు అవసరం లేదని పేర్కొంది. హోం ఐసోలేషన్ మార్గదర్శకాల ప్రకారం డిశ్చార్జి అయిన పేషెంట్లు, రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారు... కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ ప్రకటించింది. ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ వస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, మళ్లీ పరీక్ష చేయించాల్సిన అవసరం లేదని పేర్కొంది. నెగెటివ్ వచ్చినప్పటికీ కోవిడ్ లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. (చదవండి: భారీగా కేసులు.. వారందరికీ వర్క్ ఫ్రం హోం ఇవ్వండి!) -
ముప్పు వచ్చేస్తొంది.. కోవిడ్పై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ
ఢీల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కఠిన చర్యలు చేపట్టినా భారత్లో థర్డ్ వేవ్ ప్రారంభమైంది. ఓ పక్క వైరస్ అడ్డుకట్టకు టీకా కీలకమని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సంబంధిత అధికారులు అహర్నిశలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కష్టపడుతున్నారు. మరో వైపు కోవిడ్ చాప కింద నీరులా పాకుతూ దేశవ్యాప్తంగా తన ఉనికిని మళ్లీ చాటేందుకు చూస్తోంది. దీంతో ఆప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు కోవిడ్పై పలు కీలక సూచనలు చేస్తూ లేఖ రాసింది. అందులో.. కోవిడ్ నివారణ చర్యలను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. జిల్లా, సబ్ స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలిని సూచించింది. ఆస్పత్రుల్లో సిబ్బంది, మౌలికవసతులు, పడకల లభ్యత చూసుకోవడంతో పాటు హోం ఐసోలేషన్లో ఉన్నవారికి తగిన వైద్య సూచనలు చేయాలిని ఆదేశించింది. చదవండి: Passengers From Italy Tested Positive Amritsar: కలకలం: ఒకే విమానంలో ప్రయాణించిన 125 మందికి కరోనా.. -
ఉచిత తాగునీటి పథకానికి తాజా మార్గదర్శకాలివే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి సరఫరా పథకం అమలుపై మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ తాజాగా గురువారం మరిన్ని మార్గదర్శకాలు జారీచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మురికి వాడలు, అన్ని గృహవినియోగ నల్లాలకు డిసెంబరు 2020 నుంచి డిసెంబరు 2021 వరకు నీటిబిల్లులు మాఫీ చేయనున్నారు. ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పెండింగ్లో ఉన్న వినియోగదారులు, రెండో నల్లా కనెక్షన్ కలిగిన వినియోగదారులకు కూడా మాఫీ వర్తించనుంది. జనవరి 2022 నుంచి మురికి వాడలు మినహా ఇతర ప్రాంతాల వినియోగదారులకు నీటివినియోగం ఆధారంగా నీటిమీటరు రీడింగ్తో బిల్లులు జారీ చేయనున్నారు. ఇప్పటికే వాటర్సెస్ చెల్లించిన వినియోగదారులకు భవిష్యత్లో వారి కనెక్షన్కు జారీచేసే బిల్లులో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేయనున్నారు. ఆధార్ అనుసంధానం చేసుకోని వినియోగదారులకు 13 నెలల నీటిబిల్లు జారీ చేయనున్నారు. దీనిపై ఎలాంటి వడ్డీ, అపరాధ రుసుం ఉండదు. (చదవండి: ప్లాట్.. పాస్‘బుక్కయ్యి’.. ధరణి రూటు మారుస్తున్న రియల్టర్లు) -
Omicron: ‘నాన్ రిస్క్’ నుంచే రిస్క్!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వ్యూహంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమానాశ్రయాల్లో కేవలం రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఎక్కువగా దృష్టి పెట్టి పరీక్షలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో నమోదైన మూడు ఒమిక్రాన్ కేసులూ నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవే కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రయాణికుల విషయంలో తీసుకోవల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసింది. రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు చేయాలని, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 2 శాతం మందికి ర్యాండమ్గా పరీక్షలు చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల ఒకటో తేదీ నుంచి ఆ మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయి. 11 దేశాలను రిస్క్ కేటగిరీ కింద గుర్తించారు. ఇందులో జర్మనీ, ఫ్రాన్స్, కెనడాతో పాటు యూఎస్, యూకే తదితర దేశాలున్నాయి. ఆయా దేశాల నుంచి వచ్చిన అందరు ప్రయాణికులకు, అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ర్యాండమ్గా శంషాబాద్ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రిస్క్ దేశాల నుంచి వచ్చి పాజిటివ్గా తేలిన వారి నమూనాల్లో ఒమిక్రాన్ను గుర్తించేందుకు జీనోమ్ స్వీక్వెన్సింగ్కు పంపిస్తున్నారు. వారిని విమానాశ్రయం నుంచి నేరుగా టిమ్స్కు తరలిస్తున్నారు. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారి నుంచి (2 శాతం) కేవలం నమూనాలు సేకరించి ఆర్టీపీసీఆర్ ఫలితం రాకముందే పంపేస్తున్నారు. ఇలా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 7,018 మందికి కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరిలో నాన్ రిస్క్ దేశాలకు చెందిన వారు 1,622 మంది ఉన్నారు. ఈ విధంగా నిర్దేశించిన 2 శాతం కంటే ఎక్కువగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పరీక్షలు చేసింది. ఈ క్రమంలోనే తొలిసారిగా 3 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. అందరినీ పరీక్షించాలి రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రిస్క్, నాన్ రిస్క్ దేశాలనే దానితో సంబంధం లేకుండా విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడిపైనా దృష్టిపెట్టి పరీక్షలు చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా నమోదైన మూడు కేసులు జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయని అంటున్నారు. అలాగే ర్యాండమ్గా పరీక్షలు నిర్వహిస్తున్న వారిని ఆర్టీపీసీఆర్ ఫలితం వచ్చేవరకు ఆపకుండా పంపించేయడం కూడా సమంజసం కాదని పేర్కొంటున్నారు. ఇలా పంపించేయ డం వైరస్ వ్యాప్తికి అవకాశం ఇచ్చినట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో బయట పడిన 3 కేసులు ఇందుకు నిదర్శనమని అంటున్నారు. చదవండి: శిక్షణలో ఉన్న యువతిపై ఇంజినీర్ల అసభ్య ప్రవర్తన -
తెలంగాణ: ఉద్యోగుల విభజనలో సీనియారిటీనే లెక్క
ఉద్యోగుల విభజనలో కీలక నిబంధనలివీ.. ► కొత్త జిల్లా/జోనల్/మల్టీ జోనల్ కేడర్లకు మంజూరు చేసిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు ఉంటాయి. ► రాష్ట్రంలో వేర్వేరు ఉమ్మడి జిల్లాల్లోని ప్రాంతాలతో 8 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఈ జిల్లాల ఉద్యోగులకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఏర్పాటైన కొత్త జిల్లాలతోపాటు ప్రాంతాలు కలిసిన పొరుగు జిల్లాల్లో ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ► అవసరమైన ఉద్యోగుల (వర్కింగ్ స్ట్రెంత్) దామాషా ప్రకారమే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను కొత్త జిల్లాలకు కేటాయిస్తారు. ► దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, వితంతువులకు ప్రాధాన్యత ►ప్రస్తుత ఉద్యోగుల కేటాయింపు పూర్తయ్యాకే భార్యాభర్తల (స్పౌజ్ కేటగిరీ) బదిలీలు చేపడతారు. ► ఏ ఉద్యోగిని ఎక్కడైనా నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని మార్గదర్శకాల్లో సర్కారు స్పష్టం చేసింది. సాక్షి, హైదరాబాద్: పాత జిల్లాలు, జోనల్ పోస్టుల్లోని ఉద్యోగులంతా.. కొత్త జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్లలో కేటాయింపుల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశిత నమూనాలో తమ ప్రాథమ్యాలను వరుస క్రమంలో పేర్కొంటూ.. సంబంధిశాఖ జిల్లాధిపతి (జిల్లా కేడర్), విభాగాధిపతి (జోనల్), శాఖ కార్యదర్శి (మల్టీ జోనల్)కు దరఖాస్తులు అందజేయాలని సూచించింది. ఉద్యోగులెవరైనా దరఖాస్తు చేసుకోకుంటే.. సంబంధిత అధికారులే నిబంధనల మేరకు కేటాయింపులు చేస్తారని స్పష్టం చేసింది. ఎక్కడైనా పోస్టుల లభ్యతకు మించి ప్రాథమ్యాలు ఉంటే.. ఉద్యోగుల సీనియా రిటీ ఆధారంగా ఎంపిక జరుగుతుందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు–2018 ప్రకారం.. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను విడుదల చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల కేడర్లను 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీజోన్లుగా పునర్విభజిస్తూ ‘తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఆర్డర్–2018’ను రాష్ట్రపతి జారీ చేసిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోనల్ కేడర్లకు పోస్టుల సంఖ్య (కేడర్ స్ట్రెంత్) విభజన ఇప్పటికే పూర్తయింది. వాటికి అనుగుణంగా ఉద్యోగులను కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉద్యోగుల ప్రాథమ్యాలను పరిశీలించి కేటాయింపులు చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. ►పరిపాలనా అవసరాలకు అనుగుణంగా కొత్త జిల్లా/జోనల్/మల్లీ జోనల్ పోస్టుల సంఖ్యను విభజించారు. అదే నిష్పత్తిలో అన్ని ప్రభుత్వ శాఖలు ప్రతి లోకల్ కేడర్కు వర్కింగ్ స్ట్రెంత్ను కేటాయించాయి. ► పాత లోకల్ కేడర్లలోని సీనియారిటీ ప్రకారం ఉద్యోగుల జాబితాలను శాఖల అధిపతులు రూపొందిస్తారు. కేటాయింపుల్లో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా సెలవులు, సస్పెన్షన్, శిక్షణ, డిప్యుటేషన్, ఫారిన్ సర్వీస్లో ఉన్న ఉద్యోగులను సైతం పరిగణనలోకి తీసుకుంటారు. కేటాయింపుల అనంతరం వారు కొత్త లోకల్ కేడర్లలో సెలవులు, సస్పెన్షన్, డిప్యుటేషన్, శిక్షణ, ఫారిన్ సర్వీస్లో కొనసాగుతున్నట్టు పరిగణిస్తారు. జిల్లా కేడర్ ఉద్యోగుల విభజన ఇలా.. ► ఉమ్మడి జిల్లా పరిధిలోని కొత్త జిల్లాల్లో అన్నిపోస్టులకు.. సదరు ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులందరినీ పరిగణనలోకి తీసుకుంటారు. ► హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, సిద్దిపేట, మహబూబ్నగర్, వికారాబాద్, రంగారెడ్డి కొత్త జిల్లాలు ఒకటి కంటే ఎక్కువ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రాంతాల కలయికతో ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి పాత జిల్లాల ఉద్యోగులకు.. ఉమ్మడి జిల్లా పరిధిలోని కొత్త జిల్లాలతోపాటు, ఆ ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రాంతం కలిసిన కొత్త జిల్లాల్లోనూ అవకాశం కల్పిస్తారు. జోనల్ కేడర్ కేటాయింపులు ఇలా.. ► కొత్త జోనల్/మల్టీజోనల్ కేడర్లకు ఖరారైన ఉద్యోగుల సంఖ్యకు లోబడి.. పాత జోనల్ కేడర్లోని ఉద్యోగులందరినీ కేటాయింపుల కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ► పాత 5వ జోన్ ఉద్యోగులను.. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల్లోని 1–4 జోన్లకు (నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలు, ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సిద్దిపేట ప్రాంతంలోని పోస్టులు మినహాయించి), జోన్–5లోని జనగామ జిల్లాలో ఉన్న పోస్టుల్లో కేటాయింపుల కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ► పాత జోన్–6 కేడర్ ఉద్యోగులను.. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల్లోని 5, 6, 7 జోన్లకు (జనగామ జిల్లాలోని పోస్టులు మినహాయించి), జోన్–2లోని నిజామాబాద్ జిల్లాకు, జోన్–3లోని కామారెడ్డి, మెదక్ జిల్లాతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటకు కేటాయించేందుకు పరిగణనలోకి తీసుకుంటారు. మల్టీ జోన్ పోస్టులు ఇలా... ► పాత 5వ జోన్ ఉద్యోగులను.. మల్టీ జోన్–1 (నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్ధిపేట ప్రాంతం మినహాయించి)కు, మల్టీజోన్–2లోని జనగామ జిల్లాలోని పోస్టుల్లో కేటాయింపులకు పరిగణనలోకి తీసుకుంటారు. ► పాత 6వ జోన్ ఉద్యోగులను.. మల్టీ జోన్–2 (జనగామ జిల్లాలోని పోస్టులు మినహాయించి)కు, మల్టీ జోన్–1లోని నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటలోని పోస్టుల్లో కేటాయింపులకు పరిగణనలోకి తీసుకుంటారు. ► రాష్ట్రపతి పాత ఉత్తర్వులు వర్తించని కొన్ని పోస్టులను కొత్త ఉత్తర్వుల్లో మల్టీజోనల్ పోస్టులుగా విభజించారు. అలాంటి పోస్టుల్లో ఉన్న ఉద్యోగులు, పాత మల్టీజోన్ కేడర్ ఉద్యోగులను ఏదైనా ఒక కొత్త మల్టీజోన్కు కేటాయిస్తారు. కొన్ని ప్రత్యేక కేటగిరీలుగా.. కొన్ని ప్రత్యేక అంశాల మేరకు సీనియారిటీతో సంబంధం లేకుండా కొత్త లోకల్ కేడర్లకు కేటాయింపులు చేస్తామని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ ప్రత్యేక కేటగిరీల కింద కేటాయింపు పొందడానికి ఉద్యోగులు తగిన రుజువులు సమర్పించాల్సి ఉంటుంది. ► 70శాతం, ఆపై వైకల్యంగల వారు, కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన వితంతువులు ప్రత్యేక కేటగిరీ కిందికి వస్తారు. ► మనోవైకల్యంగల పిల్లలున్న ఉద్యోగులకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నచోట పోస్టింగ్ ఇస్తారు. ► కేన్సర్, న్యూరోసర్జరీ, కిడ్నీ/కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన వారిని.. ఇదే క్రమంలో పరిగణనలోకి తీసుకుంటారు. విభజన తర్వాతే ‘స్పౌస్’ బదిలీలు ►ప్రస్తుత కేటాయింపుల్లో జీవిత భాగస్వాములు వేర్వేరు కేడర్లకు పంపబడితే.. కేటా యింపులు పూర్తయ్యాక కేడర్ మార్పిడికి దర ఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. పోస్టుల లభ్యత, పాలన అవసరాలకు లోబడి ఒకే లోకల్ కేడర్లో వారికి స్థానం కల్పిస్తారు. ► కేటాయింపులపై ఉద్యోగులెవరికైనా అభ్యంతరాలుంటే సంబంధిత శాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం పరిశీలించి పరిష్కరిస్తుంది. విభజన తర్వాతే ‘స్పౌస్’ బదిలీలు ► ప్రస్తుత కేటాయింపుల్లో జీవిత భాగస్వాములు వేర్వేరు కేడర్లకు పంపబడితే.. కేటా యింపులు పూర్తయ్యాక కేడర్ మార్పిడికి దర ఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. పోస్టుల లభ్యత, పాలన అవసరాలకు లోబడి ఒకే లోకల్ కేడర్లో వారికి స్థానం కల్పిస్తారు. ►కేటాయింపులపై ఉద్యోగులెవరికైనా అభ్యంతరాలుంటే సంబంధిత శాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం పరిశీలించి పరిష్కరిస్తుంది. -
AP: విద్యాశాఖ మార్గదర్శకాలు.. ‘కేజీబీవీ’ పోస్టుల భర్తీకి పక్కా రూల్స్
సాక్షి, అమరావతి: కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) టీచింగ్ పోస్టుల భర్తీ అత్యంత పారదర్శకంగా నిర్వహించేలా విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. కేజీబీవీల్లో మొత్తం 958 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ కావడం తెలిసిందే. ఈ పోస్టులన్నిటినీ పూర్తిగా మహిళా అభ్యర్థులతోనే భర్తీ చేస్తారు. పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు. విద్యార్హతలు, అనుభవం, మెరిట్ను ప్రాతిపదికగా తీసుకుని రిజర్వేషన్లను అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లను (పీజీటీ) పార్ట్టైమ్ ప్రాతిపదికన, మిగతా టీచర్లను కాంట్రాక్టు విధానంలో నియమించనున్నారు. ఏడాది ఒప్పందం.. ఆపై షరతులతో పొడిగింపు కేజీబీవీల్లో బోధనకు ఎంపికైన అభ్యర్థులకు అధికారికంగా నియామక ఉత్తర్వులు జారీ చేయరు. కౌన్సెలింగ్లో వారికి కేటాయించిన కేజీబీవీలో రిపోర్టు చేయాలని మాత్రమే సూచిస్తారు. అక్కడ వారు ఎంవోయూపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ నియామక ఒప్పందం 12 నెలలకే పరిమితం. విద్యా సంవత్సరం చివరి రోజుతో అది ముగుస్తుంది. తదుపరి విద్యాసంవత్సరాలకు తిరిగి కొనసాగింపుపై కొత్త ఒప్పందం సంతృప్తికరమైన పనితీరు, ఆంగ్ల మాధ్యమంలో బోధనా సామర్థ్యం తదితరాలపై ఆధారపడి ఉంటుంది. ఆంగ్ల మాధ్యమంలో బోధనా సామర్థ్యం లేకున్నా, పేలవమైన పనితీరు ఉన్నా, నిధుల దుర్వినియోగం లాంటి ఇతర ఆరోపణలున్నా విద్యాసంవత్సరంలో ఏ సమయంలోనైనా ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే ఒప్పందాన్ని రద్దు చేస్తారు. ఈ పోస్టులలో నియమించే అభ్యర్థులకు భవిష్యత్తులో క్రమబద్ధీకరణ కోరే హక్కు గానీ, దావా వేసే వీలు కానీ ఉండదు. పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా నైట్ డ్యూటీలు నిర్వర్తించేందుకు అంగీకారం తెలపాలి. వీరికి కేంద్ర ప్రభుత్వ కమ్యూనిటీ ఎయిడ్, స్పాన్సర్షిప్ ప్రోగ్రాం (సీఏఎస్పీ) మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం పడకుండా వేతనాలను ఖరారు చేస్తారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కాలవ్యవధికి లోబడే ఈ కాంట్రాక్టు, పార్ట్ టైమ్ పోస్టుల కొనసాగింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు కౌన్సెలింగ్ తేదీ రోజు హాజరుకాకపోయినా, కేటాయించిన కేజీబీవీలో 15 రోజుల లోపు చేరకున్నా నియామకాన్ని రద్దు చేసి తదుపరి మెరిట్ అభ్యర్థిని ఎంపిక చేస్తారు. కౌన్సెలింగ్ అనంతరం 30 రోజులలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఆపై ఎలాంటి నియామకాలు ఉండవు. పోస్టుల వారీగా అభ్యర్థులకు కౌన్సెలింగ్ చేపడతారు. ఈ నియామకాల కోసం జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ లేదా కలెక్టర్ నామినేట్ చేసే అధికారి చైర్మన్గా కమిటీని ఏర్పాటు చేస్తారు. సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ మెంబర్ కన్వీనర్గా, డీఈవో, ఏపీఎంఎస్ అసిస్టెంట్ డైరెక్టర్ మెంబర్గా ఈ కమిటీ ఉంటుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఆయా కేటగిరీల వారీగా పోస్టులను కేటాయిస్తారు. అభ్యర్థుల వయసు 2021 జూలై 1వతేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 47 ఏళ్లు కాగా దివ్యాంగులకు 52 ఏళ్లుగా నిర్దేశించారు. ప్రిన్సిపాళ్లు, పీజీటీలకు మెరిట్ మార్కులు ఇలా ♦అకడమిక్ అర్హతలో సాధించిన మార్కులు– 40 మార్కులు. ♦వృత్తిపరమైన అర్హతలో సాధించిన మార్కులు – 40 మార్కులు ♦2 సంవత్సరాల అనుభవం – 10 మార్కులు ♦హయ్యర్ అకడమిక్ అర్హత – 5 మార్కులు ♦హయ్యర్ ప్రొఫెషనల్ అర్హత – 5 మార్కులు ♦ఏదైనా కేజీబీవీలో రెండేళ్లకన్నా తక్కువ కాకుండా పనిచేసిన వారికి, సంతృప్తికరమైన విధి నిర్వహణ, ఆరోపణలు లేనివారికి మెరిట్ జాబితాలో ప్రాధాన్యమిస్తారు. సీఆర్టీలు, పీఈటీలకు మెరిట్ మార్కులు ఇలా ♦అకడమిక్ అర్హతలో సాధించిన మార్కులు – 30 మార్కులు ♦వృత్తిపరమైన అర్హతలో సాధించిన మార్కులు – 30 మార్కులు ♦టెట్లో సాధించిన మార్కులు – 20 మార్కులు ♦2 సంవత్సరాల అనుభవం – 10 మార్కులు ♦హయ్యర్ అకడమిక్ అర్హత – 5 మార్కులు ♦హయ్యర్ ప్రొఫెషనల్ అర్హత – 5 మార్కులు ♦ఏదైనా కేజీబీవీలో రెండేళ్లకన్నా తక్కువ కాకుండా పనిచేసిన వారికి, సంతృప్తికరమైన విధి నిర్వహణ, ఆరోపణలు లేనివారికి మెరిట్ జాబితాలో ప్రాధాన్యమిస్తారు. పీజీటీ వొకేషనల్ టీచర్ పోస్టులకు మెరిట్ మార్కులిలా ♦అకడమిక్ అర్హతలో సాధించిన మార్కులు – 60 మార్కులు ♦ 2 సంవత్సరాల అనుభవం – 20 మార్కులు ♦హయ్యర్ అకడమిక్ అర్హత – 20 మార్కులు ♦ఏదైనా కేజీబీవీలో రెండేళ్లకన్నా తక్కువ కాకుండా పనిచేసిన వారికి, సంతృప్తికరమైన విధి నిర్వహణ,ఆరోపణలు లేనివారికి మెరిట్ జాబితాలో ప్రాధాన్యమిస్తారు. -
ఆర్బీఐ మార్గదర్శకాలపై అసంతృప్తి.. సుప్రీంకు కేరళ సర్కార్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI మార్గదర్శకాలపై కేరళ ప్రభుత్వం అసంతృప్తితో రగిలిపోతోంది. ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీలు, కోఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ నియంత్రణ ఆదేశాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు సుప్రీం కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉంది. ఆర్బీఐ తాజా గైడ్లైన్స్ ప్రకారం.. కోఆపరేటివ్ సొసైటీలు ‘కోఆపరేటివ్ బ్యాంక్’ అనే పదాన్ని ఉపయోగించడానికి వీల్లేదు. ఓటింగ్ హక్కు లేని సభ్యుల నుంచి సహకార సంఘాలు డిపాజిట్లు తీసుకోకుండా నిషేధం విధించింది. ఈ మార్గదర్శకాల వల్ల 1,625 ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీలు, వేలకొద్దీ ఇతర కోఆపరేటివ్ బ్యాంకుల నిర్వహణకు ఆటంకాలు ఎదురుకానున్నాయి. అందుకే ఆర్బీఐ గైడ్లైన్స్పై సుప్రీంను ఆశ్రయించాలని కేరళ ప్రభుత్వం అనుకుంటోంది. ఈ మేరకు కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్, అడ్వొకేట్ జనరల్తో భేటీ అయ్యి చర్చలు జరుపుతున్నారు. అయితే ఆర్బీఐ మాత్రం సెప్టెంబర్లో పార్లమెంట్ జారీ చేసిన బ్యాంకింగ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారమే ముందుకు పోతున్నట్లు చెప్తోంది. ఇదిలా ఉంటే ఈ చట్టం కేరళలో మాత్రమే పటిష్టంగా అమలు కావడం లేదని కేంద్రం భావిస్తోంది. ఈ తరుణంలోనే కేంద్రం ఆర్బీఐపై ఒత్తిడి చేస్తుండగా.. ఈ రెండు ఆదేశాలపై సుప్రీం కోర్టు ఊరట ఇచ్చినప్పటికీ రాజకీయ ఉద్దేశాలతోనే కేంద్రం ఇలా ప్రవర్తిస్తోందంటూ కేరళ కోఆపరేషన్ మినిస్టర్ వీఎన్ వాసవన్ ఆరోపిస్తున్నారు. 60 శాతం కోఆపరేటివ్ సొసైటీల కార్యకలాపాలు సజావుగా సాగడం బహుశా కేంద్రానికి కంటగింపుగా మారిందేమోనని ఆయన అంటున్నారు. క్లిక్ చేయండి: ఆ ఛార్జీల మోతపై క్లారిటీ ఇచ్చిన ఎస్బీఐ -
ఈ దేశాల నుంచి వస్తే క్వారెంటైన్ అక్కర్లేదు.. కొత్త మార్గదర్శకాలు
చాన్నాళ్లుగా విదేశాల్లో చిక్కుపోయిన వారికి, ఎన్నాళ్ల నుంచో స్వదేశం రావాలని ప్లాన్ చేసుకున్న ఎన్నారైలకు భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అంతార్జతీయ ప్రయాణికులపై ఉన్న క్వారంటైన్ నిబంధనల్లో అనేక సడలింపులు ఇచ్చింది. భారత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. లిస్ట్ ఏలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో క్వారెంటైన్ భయాలు తొలగిపోయాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించి 99 దేశాలతో భారత్ అవగాహన కుదుర్చుకుంది. ఈ దేశాల్లో డబ్ల్యూహెచ్వో గుర్తించిన వ్యాక్సిన్లు అందిస్తున్నారు. వ్యాక్సిన్లు తీసుకున్న వారు ఎయిర్ సువిధా పోర్టల్లో తమ వ్యాక్సినేషన్కి సంబంధించిన రిపోర్టుని అప్లోడ్ చేయాలి. దీంతో పాటు ప్రయాణానికి 72 గంటల ముందు జారీ చేసిన కోవిడ్ నెగటీవ్ రిపోర్టకు కూడా జత చేయాలి. ఈ రెండు పనులు చేసిన ప్రయాణికులు ఇండియా వచ్చిన తర్వాత 14 రోజుల నిర్బంధ క్వారంటైన్ ఉండక్కర్లేదు. లిస్ట్ ఏలో 99 దేశాల జాబితాలో విదేశీ ప్రయాణికులు ఎక్కువగా వచ్చే అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, ఖతర్, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ తదితర దేశాలు ఉన్నాయి. తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులతెఓ పాటు ఉన్న ఐదేళ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ప్రయాణం సందర్భంగా కోవిడ్రూల్స్ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అక్టోబరు 15 నుంచే విదేశీ ప్రయాణికులను ఇండియాలోకి అనుమతి ఇస్తున్నారు. అయితే అప్పుడు కేవలం ఛార్టెడ్ ఫ్లైట్లకే అనుమతి ఇచ్చారు. కాగా ఇప్పుడు కమర్షియల్ విమానాలకు పచ్చజెండా ఊపారు. చదవండి: వలస కార్మికులకు ఉచిత వీసాలు -
బ్యాంకులకు ఆర్బీఐ షాక్ !
ముంబై: మొండి బకాయిల (ఎన్పీఏలు) గుర్తింపు విషయంలో నిబంధనలను ఆర్బీఐ కఠినతరం చేసింది. నిర్ణీత వ్యవధి వరకు రుణానికి సంబంధించి చెల్లింపులు చేయకపోతే నిబంధనల కింద ఆయా ఖాతాను ఎన్పీఏగా బ్యాంకులు ప్రకటించి, కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. అయితే ఎన్పీఏ ఖాతాలకు సంబంధించి కేవలం వడ్డీ చెల్లింపులు వచ్చినంత మాత్రాన, వాటిని స్టాండర్డ్ ఖాతాలుగా మార్చొద్దంటూ ఆర్బీఐ తాజాగా బ్యాంకులను కోరింది. ఆయా ఖాతాల విషయంలో వడ్డీతోపాటు, అసలు చెల్లింపులు, వాటికి నిర్ణీత గడువులను పేర్కొనాల్సిందేనని తన తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. కొన్ని బ్యాంకులు ఎన్పీఏల ఖాతాల విషయంలో కేవలం వడ్డీ చెల్లింపులను లేదా పాక్షిక వడ్డీ చెల్లింపులను స్వీకరించి స్టాండర్డ్ ఖాతాలుగా మారుస్తున్నట్టు ఆర్బీఐ దృష్టికి రావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. -
ఫెయిల్ అవ్వడం ఎలా ?: ఫన్నీ వైరల్ వీడియో
యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించడం అంత సులభం కాదు. అందుకనే చాలామంది యూపీఎస్సీ పరీక్షల్లో గెలుపు కోసం ఈ పరీక్షల్లో మంచిగా ఉత్తీర్ణత సాధించిన వారి విజయగాథలను ఆదర్శంగా తీసుకుంటూ ప్రిపేర్ అవుతారు. పైగా వాటికి సంబంధించిన మార్గనిర్దేశిక వీడియోలను కూడా తెగ చూస్తుంటారు. కానీ ఎప్పుడైన యూపీఎస్సీ పరీక్షలో ఎలా ఫెయిల్ అవ్వాలో మార్గనిర్దేశం చేసే వీడియో గురించి విన్నారా! లేదు కదా. కానీ అలాంటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. (చదవండి: వాయు కాలుష్యంపై చర్యలేవి: సుప్రీంకోర్టు) అసలు విషయంలోకెళ్లితే....ఐఏఎస్ అధికారి అవాంశ్ శరణ్ యూపీఎస్సీ పరీక్షలో ఎలా ఫెయిల్ అవ్వాలో మార్గనిర్దేశం చేసే వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పైగా ఆ వీడియోలో యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించకూడదనుకంటే చేయవలసిన పనుల సుదీర్ఘ జాబితా గురించి చెప్పుకొస్తారు. ఆ తర్వాత ఆయన "యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఎలా విఫలమవ్వాలి'" అనే గైడ్ని నిజాయితీగా ప్రయత్నించవద్దు లేకుంటే మీరు విజయం సాధించే అవకాశాలు ఉంటాయి" అంటూ చమత్కరిస్తారు. నిజానికి ఈ వీడియో చూడంగానే ఏంటిది అనిపిస్తుంది. ఎలాంటివి చేస్తే ఫెయిలవుతాం అనేవి ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ఒక చక్కని సందేశంలా ఉపయోగ పడటమే కాక తాము అలా చేస్తున్నామా అనేది కూడా ఎవరకి వారుగా వ్యక్తిగతంగా తెలుసుకునేలా ఉంటుంది. అయితే నెటిజన్లు కూడా ఈ విషయాలకు ఏకిభవిస్తూ "మేము కూడా ఇలాంటి తప్పిదాలు చేశాం. అందువల్లే విఫలమయ్యానంటూ" రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: 89 ఏళ్ల వయసు.. ఫిజిక్స్లో పీహెచ్డీ!) How to fail UPSC Civil Services Exam. Well explained. pic.twitter.com/IftbagsJA5 — Awanish Sharan (@AwanishSharan) November 8, 2021 -
‘పెట్రోల్ లేకపోయినా.. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు’
న్యూఢిల్లీ:సడలించిన నూతన పెట్రోల్ పంపుల లైసెన్స్ నిబంధనల కింద.. పెట్రోల్, డీజిల్ విక్రయాల కంటే ముందే సీఎన్జీ, ఈవీ చార్జింగ్ కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019 నవంబర్ 8 నాటి నిబంధనల విషయమై ఈ మేరకు తాజాగా వివరణ ఇచ్చింది. ఈ నూతన నిబంధనల కింద.. పెట్రోల్, డీజీల్ విక్రయాలతో పాటు ఏదైనా ఒక నూతన తరం ప్రత్యామ్నాయ ఇంధన విక్రయాలను (సీఎన్జీ లేదా ఎల్ఎన్జీ లేదా ఎలక్ట్రిక్ లేదా బయో ఇంధనం) కూడా చేపట్టాల్సి ఉంటుంది. అయితే, దీన్ని తప్పనిసరి ఆదేశంగా చూడొద్దని ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల పెట్రోలు బంకుకి అనుమతి పొందిన సంస్థలు. పెట్రోలు, డీజిల్ విక్రయాని కంటే ముందే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవచ్చు. చదవండి : వరుసగా ఏడో రోజు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు -
చక్కగా సంరక్షిస్తే ‘దత్తత’కు ఓకే
సాక్షి, అమరావతి: కోరుకున్న వారికి అనాథ బాలలను సంరక్షణకు అప్పగించిన అనంతరం.. రెండేళ్లపాటు ఆ బాలలను సంరక్షకులు బాధ్యతతో చూస్తారనే నమ్మకం అధికారులకు కలిగితే దత్తత ఇచ్చే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. తాజాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పోస్టర్ కేర్ (సంరక్షణ)కు సంబంధించిన మార్గదర్శకాలకు ఆమోద ముద్ర వేసింది. ఇందుకనుగుణంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అవసరమైన కసరత్తు చేపట్టింది. బాలల సంరక్షణ ఇలా.. పిల్లలు లేనివారు, అనాథలకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకునే ఆదర్శవాదులు, ఎవరులేని వారిని పెంచి పెద్దచేయాలనుకునే సంస్థలు బాలల కోసం అధికారులకు దరఖాస్తు చేసుకుంటారు. వాటిపై మహిళా శిశు సంక్షేమ, సాంఘిక సంక్షేమ, పోలీస్ తదితర శాఖలు ఆరా తీసిన అనంతరం ఆయా వ్యక్తులు, సంస్థలకు బాలలను అప్పగించేలా అధికారిక అనుమతి ఇస్తారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఆరేళ్లలోపు బిడ్దలను మాత్రమే దత్తత ఇస్తుంటారు. ఆరేళ్ల నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలను సంరక్షణ(పోస్టర్ కేర్)కు అప్పగిస్తారు. సంరక్షకులు వారిని ఎలా చూస్తున్నారనే దానిపై ప్రతి ఆరు నెలలకు ఒక మారు అధికారులు పర్యవేక్షిస్తారు. ఇలా రెండేళ్లపాటు అధికారుల స్వీయ పరిశీలన అనంతరం.. నమ్మకం కలిగితే దత్తతకు అనుమతిస్తారు. అలాగే 8 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు బాలలను కోరుకున్న సంరక్షకులకు అప్పగిస్తారు. వారిని సంరక్షకులు ఎలా చూస్తున్నారని ఏడాదిపాటు అధికారులు పరిశీలించిన అనంతరమే సంతృప్తికరంగా ఉంటే పూర్తిస్థాయిలో దత్తతకు అనుమతిస్తారు. అలాగే దత్తతతో నిమిత్తం లేకుండా బాలల సంరక్షణ బాధ్యతలు తీసుకుంటామని ముందుకు వచ్చే వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి పోస్టర్ కేర్(సంరక్షణ)కోసం అధికారులు అప్పగించనున్నారు. రాష్ట్రంలో 3,354 దరఖాస్తులు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సంరక్షకులకు బాలలను అప్పగించే కార్యాచరణ చేపడతాం. రాష్ట్రంలోని జిల్లా కేంద్రంగా నిర్వహించే బాలల సంరక్షణ కేంద్రాల్లో 18 ఏళ్ల లోపు బాలలు 143 మంది ఉన్నారు. వారిలో 75 మంది బాలలతోపాటు 68 మంది విభిన్న ప్రతిభావంతులున్నారు. అనాథ బాలలను ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా 3,354 మంది సంరక్షకులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కేవలం 2 ఏళ్లలోపు బాలలను దత్తతకు ఇవ్వాలని కోరినవారు 2,304 మంది ఉన్నారు. కొత్తగా దరఖాస్తులు తీసుకుని పరిశీలించి బాలలను సంరక్షణకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. -
అప్పటికి మూడో వేవ్ ముగుస్తుంది: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడం, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు మార్గదర్శకాలు రూపొందించడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘కరోనా మరణాలకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలని మేము గతంలోనే ఆదేశించాం. ఆ తర్వాత గడువును పొడిగించాం కూడా. మీరు మార్గదర్శకాలు రూపొందించే సమయానికి మూడో వేవ్ కూడా ముగిసిపోతుంది’’ అని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుధ్ బోస్లతో కూడిన సుప్రీం డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. శుక్రవారం ఈ కేసుని విచారిస్తూ మార్గదర్శకాలను ఈ నెల 11లోగా రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నష్టపరిహారం అసలైన వారికి చేరాలంటే కోవిడ్–19 డెత్ సర్టిఫికెట్ జారీకి కూడా కేంద్రం మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందంటూ కొందరు అడ్వకేట్లు గతంలోనే వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన సుప్రీం కోర్టు ఇప్పటికే మార్గదర్శకాల రూపకల్పనకు రెండు సార్లు గడువు పొడిగించింది. ఇక మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. మరణ ధ్రువీకరణ పత్రం జారీకి సంబంధించి మార్గదర్శకాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. కేంద్రం తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఈ అంశం ఉందని సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారు. -
ప్రజలు గుమికూడటాన్ని నివారించండి
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మార్గదర్శకాల అమలును మరో నెలపాటు, సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా శనివారం తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశం మొత్తమ్మీద కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతానికి స్థిరంగా ఉందని పేర్కొన్నారు. అందుకే, రానున్న పండగల సీజన్ సమయంలో ప్రజలు ఒకే చోట పెద్ద సంఖ్యలో గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. అవసరమైతే స్థానికంగా ఆంక్షలను అమలు చేయాలని స్పష్టం చేశారు. జనసమ్మర్ధం ఉన్నచోట్ల కోవిడ్ ప్రొటోకాల్స్ అమలు చేయాలన్నారు. సాధ్యమైనంత ఎక్కువ మంది కోవిడ్ టీకా వేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. -
హుజూరాబాద్ షెడ్యూల్ ఇప్పట్లో లేనట్లే?
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ రేపో మాపో వెలువడుతుందనే ఉద్దేశంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. కానీ జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఉద్దేశించి కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన లేఖ మాత్రం.. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలకు మరికొంత సమయం పట్టే అవకాశముందనే సంకేతాలు ఇస్తోంది. సీఈసీ ఈ నెల 9న లేఖ విడుదల చేసింది. ‘ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నిక జరపాల్సి ఉంది. కోవిడ్ పరిస్థితుల్లో గతంలో సాధారణ లేదా ఉప ఎన్నికలు జరిగే చోట అనుసరించాల్సిన మార్గదర్శకాలతో అనేక ఆదేశాలు, సూచనలు జారీ చేశాం. అయితే ఇప్పుడు నిర్వహించాల్సిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గతంలో జారీ చేసిన ఆయా మార్గదర్శకాలపై మీ పార్టీల అభిప్రాయాన్ని ఈ నెల 30వ తేదీలోగా వెల్లడించగలరు..’అని అందులో కోరింది. అభిప్రాయాలు పరిశీలించిన తర్వాతే.. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు హరియాణా, రాజస్తాన్, కర్ణాటక, మేఘాలయ, ఏపీ, తమిళనాడులో పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. రాష్ట్రంలోనూ ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే సీఈసీ ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయాలను కోరడం, ఈ నెల 30లోగా సలహాలు, సూచనలు అందజేయాలని కోరిన నేపథ్యంలో ఇప్పట్లో ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడక పోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీల నుంచి సూచనలు స్వీకరించిన తర్వాత వాటిని పరిశీలించడానికి సమయం పడుతుందని, ఆ తర్వాతే ఉప ఎన్నికలపై సీఈసీ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. దీంతో పాటే శాసన మండలిలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికపైనా స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. తెలంగాణలో కోవిడ్ పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించింది. -
ఉద్యోగుల కేటాయింపుపై మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లకు ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు–2018 మేరకు పోస్టుల పునర్విభజన ప్రక్రియ ఇప్పటికే ప్రభుత్వం పూర్తిచేసింది. ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులను సంబంధిత క్యాడర్లకు కేటాయించాల్సి ఉంది. పోస్టులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వారీగా విభజించిన నిష్పత్తిలోనే ఆయా పోస్టుల్లో పనిచేసే ఉద్యోగులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. మంజూరైన పోస్టులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులుగా విభజించిన నిష్పత్తిలోనే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను సైతం జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లకు కేటాయించాలని సూచించింది. లోకల్ క్యాడర్లకు కేటాయింపు కోసం ఉద్యోగుల నుంచి ప్రాధాన్యతలను స్వీకరించాలని ఆదేశించింది. అయితే, సీనియారిటీతో సంబంధం లేకుండా శారీరక వైకల్యం, వితంతువులు, కేన్సర్/కిడ్నీ రోగులు, మానసిక సమస్యలున్న పిల్లలు గల ఉద్యోగులు, జీవిత భాగస్వామి కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి/ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగి అయితే ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జీవిత భాగస్వామి ప్రాధాన్యత ప్రయోజనం జీహెచ్ఎంసీ పరిధిలో(హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధి)లో వర్తించదు. కేటాయింపులు చేసేదెవరంటే.. ►జిల్లాస్థాయి ఉద్యోగుల కేటాయింపులను ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కొత్త జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖ జిల్లా అధికారి సభ్యులుగా ఉండే కమిటీ జరపనుంది. ►జోనల్ పోస్టులకు ఉద్యోగుల కేటాయింపులను సంబంధిత విభాగం అధిపతి జరుపనున్నారు. ►మల్టీ జోనల్ పోస్టులకు ఉద్యోగుల కేటాయింపులను సంబంధిత శాఖ కార్యదర్శి చేస్తారు. ప్రక్రియకు గడువు ►వివిధ లోకల్ క్యాడర్లకు ఉన్న క్యాడర్ స్ట్రెంత్ను సంబంధిత హెచ్వోడీ/కార్యదర్శి 3 రోజుల్లో పూర్తిచేయాలి. ►క్యాడర్లవారీగా ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను కలెక్టర్లు/హెచ్వోడీలు/కార్యదర్శులు 2 రోజుల్లో పూర్తిచేయాలి. ఉద్యోగులు ఆప్షన్లను ఇచ్చేందుకు 3 రోజుల గడువు ఉంటుంది. జిల్లా కమిటీ/ హెచ్వోడీ/కార్యదర్శి ద్వారా ఉద్యోగుల కేటాయింపులను 10 రోజుల్లో పూర్తి చేయాలి. -
ఏపీ: మొహర్రం వేడుకల్లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరి
సాక్షి, అమరావతి: మొహర్రం వేడుకల్లో భక్తులు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పలు మార్గదర్శకాలను విడుదల చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు ఈ మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ►సాధారణ సూచనలు: వ్యక్తులు బహిరంగ ప్రదేశాలలో కనీసం 6 అడుగుల (2 మీటర్లు) దూరం పాటించాలి. ఫేస్ మాస్క్లు తప్పనిసరిగా ఉపయోగించాలి. సబ్బు, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోరు, ముక్కు వద్ద చేతి రుమాలు, టిష్యూ పేపర్ వంటివి అడ్డుపెట్టుకోవాలి. ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయకూడదు. ►మార్గదర్శకాలు: మొహర్రం ప్రదర్శన, పీర్ల వద్ద ఎక్కువ మంది గుమికూడరాదు. భౌతిక దూరాన్ని పాటించాలి. సాధారణ ప్రజలు, భక్తులను ఎక్కువ మందిని అనుమతించకూడదు. అశూర్ఖానా (పీర్ల చావిడి) వద్ద తగినన్ని శానిటైజర్లు ఏర్పాటు చేసుకోవాలి. వృద్ధులు, పిల్లలతోపాటు దగ్గు, జలుబు, జ్వరం, మధుమేహం, అధిక బీపీ, గుండె జబ్బులు ఉన్నవారిని అనుమతించకూడదు. ఊరేగింపుల్లో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించాలి. సన్నాయి మేళం మినహా ఆర్కెస్ట్రా, సంగీత బృందాలు వంటివి ఏర్పాటు చేయకూడదు. తబరుక్, షర్బత్లను సీలు చేసిన ప్యాకెట్లలో మాత్రమే ఇవ్వాలి. -
కరోనాపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను తాజాగా పొడిగించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టినా మరికొన్నాళ్లు ఈ మార్గదర్శకాలు పాటించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు గైడ్లైన్స్ను మరికొన్నాళ్లు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 31వ తేదీ వరకు మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. కేసులు తగ్గుతున్నాయని ఆత్మ సంతృప్తి చెందవద్దని ఈ సందర్భంగా హెచ్చరించింది. కొన్ని రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల, ఆర్ ఫ్యాక్టర్ అధికంగా ఉండడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. పండుగల నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో ప్రజలు కరోనా మార్గదర్శకాలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. స్థానికంగా కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షల సడలింపులపై నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు పంచ వ్యూహం సిద్ధం చేసింది. టెస్ట్.. ట్రాక్.. ట్రీట్.. టీకా.. కరోనాగా పేర్కొంది. మార్గదర్శకాలకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు పంపారు. -
ఏపీ: ఐటీకి ప్రోత్సాహం.. ఉద్యోగాలకు ఊతం
సాక్షి, అమరావతి: కోవిడ్–19తో ఐటీ రంగంలో మారుతున్న పరిణామాలను అందిపుచ్చుకుంటూ ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు పెద్ద పీట వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఐటీ పాలసీ 20 21–24ను విడుదల చేసింది. ఇంటి నుంచే పనిచేసే విధానం (వర్క్ ఫ్రమ్ హోమ్) పెరుగుతున్న నేప థ్యంలో సొంతంగా ఐటీ ప్రాజెక్టులు చేసుకునే గిగ్ వర్కర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఐటీ పాలసీలో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏ ర్పాటు చేసే ఐటీ కంపెనీలకు ప్రత్యేక రాయితీలను ప్రవేశపెట్టారు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఐటీ పాలసీ విధివిధానాలను రాష్ట్ర ఐటీ శాఖ ము ఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి శుక్రవారం విడుదల చే శారు. పాలసీలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ►రాష్ట్రంలో ఐటీ క్యాంపస్లు, ఐటీ పార్కులు నిర్మించే సంస్థలకు ఉద్యోగ కల్పన ఆధారంగా పారదర్శకంగా భూములు కేటాయించే విధంగా పాలసీలో విధివిధానాలు రూపొందించారు. ►రాష్ట్రంలో ఏదైనా సంస్థ ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలంటే ఆ సంస్థ కనీసం 10,000 మంది ఉద్యోగులను కలిగి ఉండటంతో పాటు వరుసగా మూడేళ్లపాటు రూ.500 కోట్లకు పైగా వ్యాపారాన్ని చేస్తూ ఉండాలి. అదే విదేశీ కంపెనీ అయితే ఫార్చ్యున్ 1,000 కంపెనీ అయ్యి ఉండాలి. ►ఐటీ పార్కుల్లో కనీసం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అభివృద్ధి చేసే సంస్థలకే అనుమతిస్తారు. అలాగే ఐటీ పార్కులు నిర్మించే సంస్థలు గత మూడేళ్లుగా రూ.25 కోట్లకు పైగా వ్యాపారాన్ని చేస్తూ ఉండాలి. భూమి కేటాయించిన ఆరేళ్లలోపు ప్రతి ఎకరానికి కనీసం 500 ఉద్యోగాలు కల్పించాలి. ►కనీసం 10 ఎకరాలు కేటాయించి ఉంటే.. వారు అభివృద్ధి చేసిన భూమిలో 30 శాతం ఇతర అవసరాల వినియోగానికి అనుమతిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చి, మూడేళ్ల పాటు అంటే 2024 మార్చి 31 వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. ►ఐటీ రంగంలో మహిళలు, వెనుకబడిన సామాజిక వర్గాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా ఐటీ పాలసీలో ప్రత్యేక రాయితీలను ప్రకటించారు. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీలు కల్పించే ప్రతి స్థానిక ఉద్యోగికి వార్షిక ఆదాయంలో 15 శాతం రాయితీగా అందిస్తారు. ►ఉన్నత స్థాయి ఉద్యోగం కల్పిస్తే గరిష్టంగా రూ.1,50,000.. మధ్య స్థాయి ఉద్యోగానికి రూ.1,12,500.. ప్రవేశ స్థాయి ఉద్యోగానికి రూ.75,000 వరకు చెల్లిస్తారు. మిగతా ఐటీ కంపెనీలకు ఈ రాయితీ 10 శాతంగా ఉంది. ►మిగిలిన ఐటీ కంపెనీల్లో ఉన్నత స్థాయి ఉద్యోగం కల్పిస్తే గరిష్టంగా రూ.1,00,000.. మధ్య స్థాయి ఉద్యోగానికి రూ.75,000.. ప్రవేశ స్థాయి ఉద్యోగానికి రూ.50,000 వరకు చెల్లిస్తారు. ఈ రాయితీని మూడు విడతలుగా చెల్లిస్తారు. దీంతో పాటు పారిశ్రామిక విద్యుత్ రాయితీ, ప్రతి ఉద్యోగికి రవాణా సబ్సిడీగా నెలకు రూ.500 చొప్పున రెండేళ్ల పాటు ఇస్తారు. ►ఈ విధంగా ఒక సంస్థకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు. స్థానిక ఉద్యోగికి అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం ఉద్యోగికి రూ.10,000 ఒకేసారి చెల్లిస్తారు. స్టార్టప్ కంపెనీలను అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తారు. ఒక కంపెనీ క్వాలిటీ సర్టిఫికేషన్ తీసుకోవడానికి చేసే వ్యయంలో 50 శాతం చొప్పున గరిష్టంగా రూ.5 లక్షల వరకు రాయితీ అందిస్తారు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’కు ప్రత్యేక రాయితీలు ►కోవిడ్ తర్వాత పెరుగుతున్న ఇంటి వద్ద నుంచే పనిచేసే (వర్క్ ఫ్రమ్ హోమ్) విధానం, ఇంటి దగ్గర నుంచే సొంతంగా ప్రాజెక్టులు చేపట్టే (గిగ్ ఎకనామీ) అవకాశాలను అందిపుచ్చుకోవడానికి పాలసీలో ప్రత్యేక రాయితీలు ప్రవేశపెట్టారు. ►రాష్ట్రంలో నుంచి పని చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చుకోవడానికి రూ.20,000 అందిస్తారు. సొంతంగా ఐటీ కాంట్రాక్టులు తీసుకొని పనిచేసే గిగ్ వర్కర్లు కొనుగోలు చేసే కంప్యూటర్లు, ల్యాప్టాప్ల వ్యయంలో 50 శాతం లేదా గరిష్టంగా రూ.20,000 రాయితీ అందిస్తారు. గిగ్ వర్క్రర్ కనీస వార్షిక వ్యాపార పరిమాణం రూ.3,00,000 దాటితేనే ఈ రాయితీ లభిస్తుంది. ►వ్యయాన్ని భారీగా తగ్గించే విధంగా ప్లగ్ అండ్ ప్లే విధానంలో పని చేసుకునే విధంగా మూడు ప్రాంతాల్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కాన్సెప్ట్ సిటీలను అభివృద్ధి చేయడంతో పాటు విశాఖలో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్ను అభివృద్ధి చేయనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు. ►వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పెరుగుతుండటంతో ఈ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా పంచాయతీల్లో డిజిటల్ లైబ్రరీలు, కోవర్కింగ్ ప్లేస్లను అభివృద్ధి చేయనున్నారు. ►రాష్ట్రంలో ఉన్న స్థానిక ఐటీ కంపెనీలకు ఊతమిచ్చే విధంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు స్థానిక కంపెనీల నుంచే ఐటీ కొనుగోళ్లు చేయాలన్న నిబంధన ప్రవేశపెట్టారు. -
గుడ్న్యూస్: ఇక వీఆర్వోలు నేరుగా సీనియర్ అసిస్టెంట్లు
సాక్షి, అమరావతి: సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వీఆర్వోల పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. గ్రేడ్–1 వీఆర్వోలకు నేరుగా సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించేందుకు విధివిధానాలను రూపొందించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిగ్రీ చదివి, ఐదేళ్లు గ్రేడ్–1 వీఆర్వోగా సర్వీసు పూర్తి చేసినవారికి నేరుగా సీనియర్ అసిస్టెంట్ పదోన్నతికి అర్హత ఉంటుందని తెలిపారు. రెవెన్యూ శాఖలో పనిచేసే గ్రేడ్–1 వీఆర్వోలు, జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టుల మధ్య 60:40 నిష్పత్తిలో.. జిల్లా స్థాయిలో రొటేషన్ పద్ధతిలో పదోన్నతులు కల్పిస్తారు. పదోన్నతి పొందిన వీఆర్వోలు.. మొదట సీనియర్ అసిస్టెంట్లుగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్లో రెండేళ్లు పని చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా వారిని ఫీల్డ్ వర్క్కి పంపకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదోన్నతి పొందాక అన్ని డిపార్ట్మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే కంప్యూటర్, ఆటోమేషన్ పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. ఇవన్నీ రెండేళ్లలోపు పూర్తి చేయకపోతే వారిని తిరిగి వీఆర్వోలుగా పంపుతామన్నారు. రెండేళ్లలో ఈ అర్హతలన్నీ సాధించినవారిని రెగ్యులరైజ్ చేయడంతోపాటు సీనియారిటీని కూడా నిర్ధారిస్తామని స్పష్టం చేశారు. ఇందుకనుగుణంగా 1998 ఏపీ మినిస్టీరియల్ సర్వీసు రూల్స్ని సాధారణ పరిపాలన శాఖ సవరిస్తుందన్నారు. -
డీఆర్డీఓ 2-డీజీ డ్రగ్ ఎవరు వాడాలి? ఎవరు వాడొద్దు?
సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ నిరోధానికి డీఆర్డీఓ రూపొందించిన 2-డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్) డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఎవరెవరికీ డ్రగ్ వేయాలి.. వేయకూడదో స్పష్టం చెప్పింది. కోవిడ్-19 వైద్యంలో అత్యవసర వినియోగం కింద అనుమతించినట్టు గుర్తు చేసింది. మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లో మాత్రమే వినియోగించాలని సూచించింది. పాజిటివ్గా గుర్తించిన వెంటనే గరిష్టంగా 10 రోజుల పాటు డ్రగ్ ఇవ్వొచ్చు అని పేర్కొంది. అయితే ఆస్పత్రుల్లో వైద్యుల సూచన మేరకు మాత్రమే డ్రగ్ వినియోగించాలని స్పష్టం చేసింది. నియంత్రణ లేని మధుమేహం, తీవ్రమైన హృద్రోగ, శ్వాసకోస, హెపాటిక్ రీనల్ ఇంపెయిర్మెంట్ సమస్యలు ఉన్నవారిపై ఈ డ్రగ్ను పరీక్షించలేదని, అలాంటివారికి వినియోగించే సమయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం అని డీఆర్డీఓ సూచించింది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, 18 ఏళ్ల లోపువారికి 2-డీజీ డ్రగ్ ఇవ్వరాదు అని డీఆర్డీఓ స్పష్టంగా పేర్కొంది. రోగులు, వారి బంధువులు ఈ డ్రగ్ కోసం ఆస్పత్రి యాజమాన్యాలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ను సంప్రదించవచ్చు. 2dg@drreddys.comకు మెయిల్ చేయడం ద్వారా డ్రగ్ సరఫరాకు విజ్ఞప్తి చేయవచ్చు. డీఆర్డీఓ రూపొందించిన 2-డీజీ సాచెట్ ధరను రెడ్డీస్ ల్యాబ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో 2డీజీ సాచెట్ ధర రూ.990గా రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించింది. చికిత్సలో ఒక్కొక్కరికి ఐదు నుంచి పది సాచెట్లు అవసరం. చికిత్సకు ఒక్కో వ్యక్తికి రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుంది. చదవండి: మార్కెట్లోకి 2-డీజీ డ్రగ్ విడుదల చదవండి: 2-డీజీ సాచెట్ ధర ప్రకటించిన రెడ్డీస్ ల్యాబ్స్ -
రిజిస్ట్రేషన్లకు లాక్డౌన్ మార్గదర్శకాలు విడుదల చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ అమల్లో ఉన్న కాలంలో స్లాట్ బుకింగ్ ద్వారానే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఈ నెల 9 వరకు registration. telangana.gov.in వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకుని ముందుగా ఫీజు చెల్లించిన వారికి మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు మంత్రివర్గం అనుమతించిన నేపథ్యంలో లాక్డౌన్ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను సోమవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.శేషాద్రి విడుదల చేశారు. ఈ మార్గదర్శకాల ప్రకారం... పనిదినాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఒక సబ్ రిజిస్ట్రార్ పనిచేసే కార్యాలయాల్లో రోజుకు 24 స్లాట్లు, ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు పనిచేసే చోట 48 స్లాట్లు మాత్రమే మంజూరు చేస్తారు. స్లాట్ బుక్ చేసుకున్న వారు నిర్దేశిత సమయానికి 5 నిమిషాల ముందు సబ్ రిజి స్ట్రార్ ఆఫీసుకు చేరుకోవాలి. దీనికి అవసరమైన ఈ–పాస్లు స్లాట్ బుక్ కాగానే జారీ అవుతాయి. వాటిని చూపిస్తే సం బంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తారు. రిజిస్ట్రేషన్ కోసం కేవలం అమ్మకందారులు, కొనుగోలుదారులతో పాటు ఇద్దరు సాక్షులను మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గుంపులుగా గుమికూడకూడదు. రిజిస్ట్రేషన్కు వేలిముద్రలు తీసుకునే ముందు చేతులను శానిటైజ్ చేయాలి. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈసీలు/సీసీలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయా ల్లో ఇవ్వరు. ఆన్లైన్లో లేదా మీ సేవ కేంద్రాల ద్వారా వాటిని తీసుకోవచ్చు. పనివేళల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలి. -
కోవిడ్పై వార్.. అపార్ట్మెంట్ల కేర్
సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభణ నేపథ్యంలో హైదరాబాద్, వరంగల్ వంటి పెద్ద నగరాల్లోని అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, గేటెడ్ కమ్యూనిటీలు తమ నివాసితులకు అండగా నిలుస్తున్నాయి. కరోనా బారినపడిన వారికి అవసరమైన ఆహారం, మందులు వంటివాటితోపాటు ఆస్పత్రులతో ఒప్పందాలు, వ్యాక్సినేషన్ వంటివీ చేపడుతున్నాయి. కొన్నిచోట్ల మరో అడుగు ముందుకేసి.. మినీ కోవిడ్ కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్స్ కొరత, వైద్య సేవలకు ఇబ్బందులతోపాటు స్వల్ప లక్షణాలు ఉండి వైద్యుల సూచనలు తీసుకునేవారు, అసలు లక్షణాలే లేనివారు ఎక్కువగా ఉండటంతో ఈ తరహా మినీ కోవిడ్ కేర్ సెంటర్లు ప్రయోజనకరంగా నిలుస్తున్నాయి. కామన్ ఏరియాల్లో ఏర్పాటు చేస్తూ.. కమ్యూనిటీలు, కాంప్లెక్స్ల నిర్వహణ కమిటీలు, అసోసియేషన్లు.. వాటి ఆవరణలోని క్లబ్ హౌస్లు, బాంకెట్ హాళ్లు, ఇతర కామన్ ఏరియాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. నిరంతరం అందుబాటులో ఉండేలా డాక్టర్, నర్స్, డయాగ్నస్టిక్ కిట్స్, అంబులెన్స్, ఐసొలేషన్ బెడ్స్, ఆక్సిజన్.. తదితరాలను సమకూర్చుకుంటున్నారు. వీటి నిర్వహణ కోసం స్థానిక ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ‘‘మా ఫ్లాట్స్ నివాసితుల కోసం ఆస్పత్రులతో మాట్లాడి వ్యాక్సినేషన్ చేయిస్తున్నాం. 10 ఐసొలేషన్ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు, నర్సులను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’.. అని హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న ఫార్చ్యూన్ టవర్స్ నిర్వాహక కమిటీ సభ్యురాలు రాజేశ్వరి తెలిపారు. వైద్య రంగంలోని సంస్థలతో.. ఆస్పత్రుల వెలుపల కోవిడ్ కేర్ సెంటర్స్ను ఏర్పాటు చేసేందుకు వైద్య రంగంలో ఉన్న మేక్షిఫ్ట్, పోర్టియా వంటి సంస్థల సేవలను వినియోగించుకుంటున్నారు. కొన్ని వారాలుగా తమకు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ల నుంచి ఎంక్వైరీలు వెల్లువెత్తుతున్నాయని పోర్టియా హెల్త్కేర్ ప్రతినిధి మీనా గణేశ్ తెలిపారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కోవిడ్ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేశామన్నారు. ముందు జాగ్రత్తగా.. మా కమ్యూనిటీలో 2016 అపార్ట్మెంట్లున్నాయి. వాటిలో 7 వేల మంది ఉంటారు. వీరిలో కోవిడ్ సోకినవారు పడుతున్న ఇబ్బందులను గమనించాం. ఆస్పత్రులకు వెళ్తున్న వారికి వెంటనే ఆక్సిజన్ బెడ్స్ దొరకడం లేదు. ఇలాంటి సమయంలో సాయంగా ఉండేలా.. మా కమ్యూనిటీ ఆవరణలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేశాం. 4 బెడ్స్. 2 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, 2 ఆక్సిజన్ సిలిండర్స్, బీపీ, టెంపరేచర్ పరికరాలు కొన్నాం. పారామెడికల్ సిబ్బందిని నియమించుకున్నాం. అంబులెన్స్ కూడా ఉంటుంది. ఆస్పత్రుల్లో బెడ్ దొరికేవరకు ఇక్కడ చికిత్స ఇస్తాం. – మురళీధర్, ప్రెసిడెంట్, మై హోమ్ జ్యుయల్, కొండాపూర్ ఈ సెంటర్లకు మార్గదర్శకాలివీ.. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం గత ఏడాది జూలైలోనే మార్గదర్శకాలు ఇచ్చింది. వాటిని తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఆ మార్గదర్శకాలివీ.. కోవిడ్ కేర్ సెంటర్కు అనుమతి తీసుకోవాలి. సంబంధిత ప్రభుత్వ విభాగాలకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. వీటిని సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తుండాలి. కమ్యూనిటీ హాల్, కామన్ ఏరియా, లేదా నివాసితులకు కాస్త దూరంగా ఉన్న ఖాళీగా ఫ్లా్లట్ల ఈ సెంటర్లకు ఉపయోగించుకోవాలి. ప్రత్యేకమైన ఎంట్రీ/ఎగ్జిట్, టాయిలెట్ ఉండాలి. కోవిడ్ అనుమానితులు, లక్షణాల్లేని, స్వల్ప లక్షణాలున్న వారికి మాత్రమే వినియోగించాలి. వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు, ఏవైనా తీవ్ర వ్యాధులున్న వారికి ఈ సెంటర్లను ఉపయోగించొద్దు. సెంటర్ కోసం ఏర్పాటు చేసుకునే వైద్యులు.. రోజూవారీగా పరీక్షలు నిర్వహించాలి. బెడ్స్ మధ్య కనీసం ఒక మీటర్ దూరం ఉండాలి. తగినంత వెలుతురు, గాలి అందేలా చూడాలి. వీటిలో ఉపయోగించిన లినెన్, పిల్లో కవర్స్, టవల్స్ను డిస్పోజబుల్ బ్యాగ్లో ఉంచాలి. వాటిని 72 గంటల తర్వాత రోగి నివాసంలో మాత్రమే ఉతకాలి. -
విదేశాల నుంచి వచ్చేవారికి కోవిడ్ టెస్ట్ తప్పనిసరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో కోవిడ్ నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్న నిబంధన విధించింది. ఎయిర్పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి క్వారంటైన్ గైడ్లైన్స్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం కోవిడ్ లక్షణాలతో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు విధిగా 14 రోజుల పాటు క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలి. మిగిలిన వారు హోమ్ క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు 72 గంటల ముందు కోవిడ్ నెగెటివ్ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దేశీయ ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా నిర్వహించాలని నిబంధనల్లో ప్రభుత్వం పేర్కొంది. చదవండి: ఆటలే అస్త్రాలు: కరోనాతో ‘ఆడుకుంటున్నారు..’ కరోనా కట్టడికి ఏపీ బాటలో ఇతర రాష్ట్రాలు -
వ్యాక్సిన్ విధానం లో కేంద్రం కీలక మార్గదర్శకాలు
-
లాక్డౌన్ గైడ్లైన్స్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
Telangana: లాక్డౌన్ గైడ్లైన్స్ విడుదల చేసిన టీ సర్కార్
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడి కోసం తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు గంటల పాటు జరిగిన క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 20న మరోసారి క్యాబినెట్ భేటీ జరగనుంది. లాక్డౌన్ కొనసాగించడమా లేదా అన్న దాని గురించి ఈ భేటీలో చర్చించనున్నారు. ఇక మే 12 నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుండటంతో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం వ్యవసాయం, మీడియా, విద్యుత్ రంగాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు. ప్రభుత్వ ఆఫీసులన్ని 33 శాతం సిబ్బందితోనే పని చేస్తాయి. బ్యాంకులు, ఏటీఎంలు యథావిధిగా కార్యక్రమాలు కొనసాగిస్తాయి. వ్యవసాయ సంబంధిత కార్యకలపాలు, ఉపాధి హామీ పనులకు లాక్డౌన్ నుంచి మినహాయింపు లభించింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ ఫూల్స్, జిమ్ములు మూసివేయాలి. రవాణా విషయానికి వస్తే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. సిటీ బస్సులు, జిల్లా సర్వీసులు కూడా లాక్డౌన్ సడలింపు సమయంలోనే నడుస్తాయి. ఆయా డిపోల పరిధిలో బస్సుల సమయాలను అడ్జెస్ట్ చేస్తారు. ఇతర రాష్టాలకు బస్సులు నడపమని తెలిపారు. జాతీయ రహదారులపై రవాణాకు అనుమతి ఇచ్చింది. అంత్యక్రియలకు 20 మంది.. వివాహాలకు 40 మందికి మాత్రమే అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ప్రత్యేక టాస్క్ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్లు, మందుల సరఫరాలో అవకతవకలు అరికట్టేందుకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయగా, అందుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. క్యాబినెట్ నిర్ణయాలు : ►మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి.. 10 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. కేవలం 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయి. మిగతా 20 గంటలపాటు లాక్ డౌన్ కఠినంగా అమల్లో ఉంటుంది. ►మే 20వ తేదీన క్యాబినెట్ తిరిగి సమావేశం అవుతుంది. లాక్ డౌన్ కొనసాగించే విషయంపై సమీక్షించి, తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. ► యుద్ధ ప్రాతిపదికన.. వ్యాక్సిన్ ప్రొక్యూర్ మెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది. ►ప్రభుత్వ రంగంతోపాటు, ప్రైవేట్ రంగంలో కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని, వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను క్యాబినెట్ ఆదేశించింది. ►అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం. ప్రతిరోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం. ► రెమిడిసివర్ ఇంజక్షన్ ఉత్పత్తిదారులతో క్యాబినెట్ సమావేశం నుంచే ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరా చేయాలని కోరిన సీఎం. ► ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉంటారు. ► లాక్డౌన్ ముగిసేవరకు మెట్రో సర్వీసులు కూడా బంద్. లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు : ►వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు. ► తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ►వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు. ►గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది. ►విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి. ►జాతీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది. ►జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి. ►కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు ►ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు ►ఉపాధిహామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి. ►ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి. ►గత లాక్ డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి. ►అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి ►అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి ►తెలంగాణ చుట్టూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం ►ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది. ►ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి. ►కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యధావిధిగా కొనసాగుతుంది. చదవండి: తెలంగాణలో లాక్డౌన్: హైకోర్టు కీలక వ్యాఖ్యలు -
కరోనా కట్టడి: జాతీయ మానవ హక్కుల సంఘం కీలక మార్గదర్శకాలు
సాక్షి, ఢిల్లీ: కరోనా కట్టడిపై జాతీయ మానవహక్కుల సంఘం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రియల్ టైం డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొంది. డ్యాష్ బోర్డులో ఆస్పత్రులు, ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు, మందుల వివరాలు నమోదు చేయాలని సూచించింది. ఆక్సిజన్, మందులను బ్లాక్మార్కెట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవహక్కుల సంఘం ఆదేశించింది.ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. అందరికీ టీకాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు, కరోనా యోధుల రక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. నిత్యావసర వస్తువులు అమ్మే వేళలను తగ్గించాలని జాతీయ మానవహక్కుల సంఘం పేర్కొంది. చదవండి: డబుల్ మాస్క్పై కేంద్రం కీలక మార్గదర్శకాలు కొంత ఊరట.. దేశంలో రెండో రోజూ తగ్గిన కేసులు -
డబుల్ మాస్క్పై కేంద్రం కీలక మార్గదర్శకాలు
-
డబుల్ మాస్క్పై కేంద్రం కీలక మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ముప్పు నుంచి తప్పించుకోవాలంటే మాస్కు ధరించడం కచ్చితం. ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వైరస్ నుంచి మరింత సురక్షితంగా ఉండడం కోసం డబుల్ మాస్క్లను ధరించాలని సూచనలు చేశారు. నిపుణుల ప్రకారం.. డబుల్ మాస్క్ వేసుకోవడంతో కొంతమేరకు వైరస్ వ్యాప్తి జరిగే ప్రభావాన్ని తగ్గించవచ్చునని తేలింది. కాగా తాజాగా డబుల్ మాస్క్ వాడకంపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఒకే రకమైన రెండు మాస్క్లను డబుల్ మాస్క్గా వాడొద్దని కేంద్రం స్పష్టం చేసింది. డబుల్ మాస్క్ను ధరించేటప్పుడు సర్జికల్ మాస్క్, క్లాత్ మాస్క్ కలిపి ధరించాలని కేంద్రం సూచించింది. అంతేకాకుండా ఒకే మాస్క్ను వరుసగా రెండ్రొజులు పాటు వాడొద్దని కేంద్రం తెలిపింది. సాధారణ క్లాత్మాస్క్ 42 నుంచి 46 శాతం వరకు రక్షణ కల్పిస్తుందని అధ్యయనకర్తలు వెల్లడించారు. సర్జికల్ మాస్కు అయితే 56.4 శాతం రక్షణ ఇస్తుందన్నారు. సర్జికల్ మాస్కుపై క్లాత్మాస్కు ధరిస్తే కరోనా నుంచి రక్షణ 85.4 శాతం వరకు ఉంటుందన్నారు. #Unite2FightCorona The Dos and Dont's while #DoubleMasking...Take a look👇#PIBKochi @COVIDNewsByMIB @PIB_India @KirenRijiju @BSF_India @CRPF_sector @cpmgkerala @crpfindia @GMSRailway pic.twitter.com/hH8nY9Og38 — PIB in KERALA (@PIBTvpm) May 9, 2021 చదవండి: Double Masking: రెండు మాస్కులు ధరిస్తే కరోనా రాదా? -
హోం ఐసోలేషన్.. కేంద్రం కొత్త గైడ్లైన్స్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ బారిన పడి ఇంట్లోనే ఉండే ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాధితులకు సంబంధించి కేంద్రం ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాల్ని విడుదల చేసింది. హోం ఐసోలేషన్లో ఉన్న బాధితులు తప్పనిసరిగా ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్ను వినియోగించాలని సూచించింది. ఎనిమిది గంటల తర్వాత వాటిని పడేయాలని తెలిపింది. అలానే హోం ఐసోలేషన్లో ఉన్న వారి వద్దకు కుటుంబసభ్యులు ఎవరైనా వస్తే.. బాధితుడు, కుటుంబ సభ్యుడు ఇద్దరూ ఎన్ 95 మాస్క్ ను ధరించాలని స్పష్టం చేసింది. 1 శాతం సోడియం హైపోక్లోరైట్తో క్రిమిసంహారకం చేసిన తర్వాత మాత్రమే మాస్క్ను తొలగించాలని సూచించింది. కరోనా బారిన పడిన వారు తగినంత విశ్రాంతి తీసుకోవాలని.. ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలని సూచించింది. దేశంలో ఒకే రోజు 3,79,257 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో కేంద్రం ఈ కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,83,76,524 కు చేరుకోగా యాక్టీవ్ కేసుల సంఖ్య 30 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. చదవండి: మాస్క్ పెట్టుకోనందుకు ప్రధానికి రూ.14 వేల జరిమానా -
కర్ర పట్టుకుని పరిగెత్తించి కొట్టిన కలెక్టర్.. కారణం తెలిస్తే షాక్!
సాక్షి, పర్లాకిమిడి: రోజురోజుకు గజపతి జిల్లా కేంద్రం పర్లాకిమిడిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్థానిక మహేంద్రతనయ వంతెన వద్ద ఆంధ్రా–ఒడిశా సరిహద్దును మూసివేశారు. స్వయంగా కలెక్టర్ అనుపమ కుమార్ సాహా, సబ్కలెక్టర్ సంగ్రాం కేసరి పండాలు శనివారం చేత కర్రలు పట్టుకుని కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని, పాతపట్నం (ఆంధ్రప్రదేశ్) నుంచి జిల్లాలోకి వచ్చేవారిని తరిమికొట్టారు. విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు సరిహద్దులో పాతపట్నం డిపోవద్ద నిలిపివేయడంతో అనేకమంది ఒడిశాకు రావాలనుకున్న వారు కాలినడకన వచ్చి ఒడిశా అధికారులకు తమ కాగితాలను చూపించి పర్లాకిమిడి పట్టణానికి రావాల్సి వచ్చింది. మహిళలు లగేజీ మోయలేక, ఆటోలు లేక ఇబ్బందులు పడ్డారు. నాకాపాయింట్ల వద్ద విడిచిపెట్టకపోవడంతో ఉపాధి కూలీలు స్వస్థలాలకు రాలేక అవస్థలు పడ్డారు. జిల్లాలో రాత్రి కర్ఫ్యూ విధించారు. జిల్లాకు వచ్చే ఆంధ్రా సరిహద్దుల నాకాపాయింట్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కరోనా కల్లోలం : తెలంగాణ వైద్యశాఖ కీలక నిర్ణయం
హైదరాబాద్: కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గురువారం కీలక నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడున్న బెడ్లకు అదనంగా, మరో 25 శాతం పెంచాలని అధికారులను ఆదేశించింది. అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలెక్టివ్ ఆపరేషన్లలను వాయిదా వేసుకోవాలని సూచించింది. అదేవిధంగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా బెడ్స్ సంఖ్యని పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ రోగులను ఆస్పత్రుల్లో చేర్చేందకు ప్రత్యేక ప్రొటోకాల్ ఏర్పాటు చేయాలని సూచించింది. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో వైద్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలందరు మాస్క్ను విధిగా ధరిస్తూ, సామాజిక దూరంపాటించాలని.. దీనిపై ఏమాత్రం అశ్రధ్ధ చేయోద్దని వైద్యారోగ్యశాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. చదవండి: కొంప ముంచిన అంత్యక్రియలు.. చనిపోయాక పాజిటీవ్.. దీంతో! -
తాజ్మహల్ పైనుంచి విమానాలు వెళ్లలేవు, ఎందుకో తెలుసా?
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కుట్రతో కూల్చివేసి, ఆ ప్రజలపైనే దాడులకు తెగబడుతున్న మయన్మార్ నియంత పాలకుల మారణహోమం మొత్తానికి భూతలం నుంచి గగనతలానికి చేరుకుంది! కుట్రకు వ్యతిరేకంగా వీధులలోకి వచ్చి నిరసన ప్రదర్శనలు జరుపుతున్న పౌరులపై సొంత సైన్యమే జరిపిన కాల్పులలో ఫిబ్రవరి 1 నుంచి (ప్రభుత్వాన్ని సైన్యం హస్తగతం చేసుకున్న రోజు) ఇంతవరకు వెయ్యిమందికి పైగా మరణించారు. వీరు కాక, మయన్మార్లోని కొన్ని ప్రాంతాలపై సైనిక విమానాలు నిన్న, మొన్న జరిపిన బాంబు దాడుల వల్ల మరణించినవారిలో వంద మందికి పైగా పౌరులు, చిన్నారులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో శనివారం నాడు ఐక్యరాజ్య సమితిలో మయన్మార్ రాయబారి క్యాఉమో తున్ మయన్మార్ను నిర్వైమానిక మండలం (నో–ఫ్లయ్ జోన్) గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. మయన్మార్ గగనతలాన్ని నో–ఫ్లయ్ జోన్గా ప్రకటిస్తే వెంటనే అక్కడ విమానాలు ఎగరడం ఆగిపోవాలి. లేకుంటే అది అంతర్జాతీయ ఆదేశాలకు విరుద్ధం అవుతుంది. అసలు నో–ఫ్లయ్ జోన్ను ఏయే పరిస్థితుల్లో ప్రకటిస్తారు? నో–ఫ్లయ్ జోన్ విధింపును ఉల్లంఘిస్తూ ఒక విమానం గాల్లోకి లేస్తే ఆ విమానాన్ని కూల్చివేయవచ్చా? ప్రస్తుతం మయన్మార్ ప్రభుత్వం మిలటరీ చేతుల్లో ఉంది. మిలటరీనే పౌరులపై వైమానిక దాడులకు పాల్పడుతోంది కనుక వారి విమానాలను ఎవరు నేలకు ‘దించుతారు’? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ కింది ఏడు నో–ఫ్లయ్ జోన్స్లో దొరుకుతాయి. ఇంకొక విషయం. కేవలం యుద్ధ వాతావరణంలో మాత్రమే నో–ఫ్లయ్ జోన్స్ని ప్రకటిస్తారనేం లేదు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కూడా ప్రత్యేక ప్రాంతాలలో విమానాలను ఎగరనివ్వరు. ఉత్తర కొరియా ఈ దేశం ఎప్పుడు, ఎక్కడ, ఏ మిస్సయిల్ను పరీక్షించి చూసుకుంటుందో ఎవరికీ తెలియదు. చిన్న హెచ్చరికైనా జారీ చేయకుండా తరచు జపాన్ సముద్రం మీదుగా ఉత్తర కొరియా తన క్షిపణుల పని తీరును ప్రయోగాత్మకంగా పరీక్షిస్తూ ఉంటుంది! అందుకే ప్రపంచంలోని అనేక దేశాలకు ఉత్తర కొరియా గగనతలం నో–ఫ్లయింగ్ జోన్. చివరికి ఐక్యరాజ్య సమితికి కూడా. తాజ్మహల్, ఇండియా భారత ప్రభుత్వం 2006లో తాజ్మహల్ గగనతలాన్ని నిర్వైమానిక మండలంగా ప్రకటించింది. తాజ్మహల్ పైన విమానాలు ఎగిరేందుకు లేదు. కట్టడాన్ని విమానాల శబ్దం నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విమానాల రాకపోకల వల్ల జనించే కాలుష్యం నుంచి ఆ పాలరాతి భవనాన్ని సంరక్షించే ప్రయత్నం కూడా అది. బకింగ్హామ్ ప్యాలెస్, లండన్ బ్రిటన్ రాచకుటుంబాలు నివాసం ఉంటే ఈ భవంతుల గగనతలాలు నో–ఫ్లయ్ జోన్స్. రాణిగారి కుటుంబ సభ్యుల భద్రత, రక్షణల కోసం వీటిపై విమానాలు ఎగరకుండా ఏళ్ల నుంచే నిషేధాజ్ఞలు ఉన్నాయి. ఉత్తర భాగం, ఉక్రెయన్ 2014లో ఇక్కడ జరిగిన ఘోర దుర్ఘటనలో మలేషియా విమానం ఎంహెచ్–17 కూలిపోయింది. లోపల ఉన్న ప్రయాణికులంతా మరణించారు. దాంతో విమానాలు ఎగిరేందుకు యోగ్యం కాని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా దీనిని పరిగణించి, నో–ఫ్లయ్ జోన్గా ప్రకటించారు. అంతేకాదు, రష్యా, ఉక్రెయిన్ల మధ్య నడిచే అన్ని విమానాలూ ఒక దాని గగనతలం మీద ఒకటి (కొన్ని ప్రాంతాల మీదుగా) ఎగిరేందుకు లేదు. సరిహద్దు వివాదాలు అందుకు కారణం. వాల్ట్ డిస్నీ వరల్డ్, యు.ఎస్.ఎ. ఈ థీమ్ పార్క్కు మూడు మైళ్ల పరిధిలో, 3000 అడుగుల లోపు ఎత్తులో విమానాలు ఎగిరేందుకు లేదు. విమానాల ధ్వనులు అత్యంత సున్నితమైన తమ నిర్మాణాలకు పడవని డిస్నీ అంటుంది! ఆ ధ్వనులు.. ప్రశాంతమైన డిస్నీకి కొత్తగా వచ్చినవాళ్లను భయపెట్టే ప్రమాదం ఉందని కూడా యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఆ గగనతలాన్ని నో–ఫ్లయ్ జోన్గా ప్రకటించింది. అయితే ‘ఫ్లయింగ్ అడ్వరై్టజ్మెంట్లు’ ఇచ్చేందుకు వీల్లేకుండా తమను నివారించడానికే డిస్నీ ఆ ప్లాన్ వేసిందని పోటీదారుల ఆరోపణ. ఏరియా 51, యు.ఎస్.ఎ. నెవడా రాష్ట్రంలోని ఎడారి వంటి ఈ ప్రాంతం అమెరికా రక్షణదళం అధీనంలో ఉంది. అమెరికా సైన్యం నిరంతరం ఇక్కడ మిలటరీ టెక్నాలజీకి సంబంధించిన రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. 1950 లు, 60 లలో ‘యు–2 స్పై ప్లేన్’ను ఇక్కడే తయారు చేశారు. యు.ఎస్. రాజధాని వాషింగ్టన్పై ఎంత గట్టి నిఘా ఉంటుందో ఈ ‘ఏరియా 51’ చుట్టూ, లోపల మానవ కదలికలపై అంతకుమించిన నిఘా, ఆంక్షలు ఉంటాయి. ఏరియా 51 గగనతలంపై చిన్న పిట్టలాంటి విమానం కూడా ఎగరడానికి లేదు. అది స్వదేశీ విమానమే అయినా.. నేల కూల్చేస్తారు. తియానన్మెన్ స్క్వేర్, చైనా చైనా గగనతలంలో ఏ ప్రాంతంలోనైనా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయంటే అది తియానన్మెన్ స్క్వేరే. ఆ స్క్వేర్ మీదుగా విమానాలు వెళ్లకూడదు. ఒకప్పుడు పావురాలు, ద్రోణ్లు, బెలూన్లు కూడా పైన ఎగరడం నిషిద్ధం. వెంటనే షూట్ చేసి పడగొట్టేసేవారు. ఈ స్క్వేర్లోనే అమూల్యమైన పురావస్తుశాలల భవంతులు, చైనా చారిత్రక యోధుల స్మరణ మందిరాలు ఉన్నాయి. వాటికి తాకిడి లేకుండా ఉండేందుకే నో–ఫ్లయ్ జోన్ చేశారు. బ్రిటన్ రాచకుటుంబాలు నివాసం ఉంటే ఈ భవంతుల గగనతలాలు నో–ఫ్లయ్ జోన్స్. రాణిగారి కుటుంబ సభ్యుల భద్రత, రక్షణల కోసం వీటిపై విమానాలు ఎగరకుండా ఏళ్ల నుంచే నిషేధాజ్ఞలు ఉన్నాయి. -
తెలంగాణలో మళ్లీ ఆంక్షలు
-
తెలంగాణలో పండుగలు, పబ్బాలు లేవు!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మత సంబంధిత సామూహిక కార్యక్రమాలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులపై ఆంక్షలు విధించింది. బహిరంగ స్థలాలు, పని ప్రదేశాలు, ప్రజారవాణా వ్యవస్థల్లో మాస్క్లు ధరించడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సామూహిక కార్యక్రమాలతో కరోనా వ్యాప్తికి ఎక్కువ ముప్పు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు ఆంక్షలు విధించినట్టు పేర్కొన్నారు. షబ్–ఏ–బరాత్, హోలీ, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గుడ్ఫ్రైడే, రంజాన్ తదితర వివిధ మతాల పండుగలు, ఉత్సవాలకు అనుమతించడం లేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని బహిరంగ స్థలాలు, మైదానాలు, పార్కులు, ప్రార్థనా స్థలాల్లో మత సంబంధిత ర్యాలీలు, ఊరేగింపులు, ఉత్స వాలు, సామూహిక కార్యక్రమాలు, సమావేశాలను అనుమతించబోమని పేర్కొన్నారు. ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం–2005, సంబంధిత ఇతర చట్టాల కింద కేసులు పెడతామని హెచ్చరించారు. మాస్క్లు ధరించనివారిపై విపత్తుల నిర్వహణ చట్టంతో పాటు ఐపీసీలోని సెక్షన్ 188 కింద కేసులు పెడతామని తెలిపారు. ఈ ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు/ఎస్పీలను ఆదేశించారు. దేశం లో మళ్లీ కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలు విధించుకోవడానికి అనుమతిస్తూ ఈ నెల 23న కేంద్ర హోంమంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ చేసిన విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభు త్వం రాష్ట్రంలో ఆంక్షలు విధించింది. చదవండి: కరోనాపై మళ్లీ పోలీస్ వార్ -
డిజిటల్ మీడియాకు వాక్ స్వేచ్ఛ వద్దా?
నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటర్మీడియరీ లయబిలిటీ మార్గదర్శకాలు యూజర్ల గోప్యతపై నిషేధం విధించి, వారి సంభాషణలను శాశ్వతంగా భద్రపర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి ఇది మీడియా వాక్ స్వేచ్ఛకు మాత్రమే కాకుండా సాఫ్ట్వేర్ రంగంలో వాక్ స్వేచ్ఛకు కూడా సంబంధించిన సమస్య. ప్రతి యూజర్ సందేశాన్ని ఇలా నిలవ చేయటం ద్వారా నిఘా సంస్థలు కోరుకున్న ప్రతిసారీ వాటిలోని విషయాన్ని సమర్థంగా పరిశీలించవచ్చు. కానీ, రహస్యంగా సాగించే సంభాషణలను, లేదా పంపే సందేశాలను నిషేధించే తరహా నిబంధనలు విఫలమవుతాయన్నది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మధ్యస్థపు మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ నిబంధనలు వాక్ స్వేచ్ఛ అనే భావనకే వ్యతిరేకంగా ఉన్నాయనే అంశంపై ఏకాభిప్రాయం కలుగుతోంది. సాధారణంగా మితభాషిగా ఉండే ఎడిటర్స్ గిల్డ్ సైతం ఈ విషయమై ఒక ప్రకటన చేస్తూ ఈ కొత్త నియమాలు దేశంలో మీడియా స్వతంత్రతకు వ్యతిరేకమని పేర్కొనడం గమనార్హం. సాధారణ ప్రజానీకం కోసం కోడ్ రచన, సంకేత నిక్షిప్త సందేశాల టెక్నాలజీ ప్రాప్యతను పరిమితం చేయడానికి 50 ఏళ్లుగా ప్రయత్నిస్తున్న జాతీయ ప్రభుత్వాల ట్రెండ్కీ కేంద్రప్రభుత్వ మధ్యస్థపు మార్గదర్శకాలకు సమాన ప్రాధాన్యత ఉంది. అమెరికా 1990ల చివరలో క్రిప్టోగ్రఫీని సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉంచడంపై పరిమితి విధించడానికి ప్రయత్నించినప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో వాక్ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న సైఫర్పంక్స్ (సామాజిక, రాజకీయ మార్పుకోసం ప్రైవసీ పొడిగింపు టెక్నాలజీలను, క్రిప్టోగ్రఫీని విస్తృతంగా ఉపయోగించాలని ప్రబోధించే వారు) ఆ ప్రయత్నాన్ని తీవ్రంగా అడ్డుకున్నారు. క్రిప్టోగ్రఫిక్ కోడ్ రచనను విదేశాలకు ఎగుమతి చేయడాన్ని అనుమతించకుండా ఆంక్షలు విధించినప్పుడు, టీ షర్ట్లపై ఈ కోడ్ను సైఫర్పంక్లు ముద్రించి సంచలనం రేకెత్తించారు.ఈరోజు మనందరం ఆధారపడిన ఎండ్–టు–ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటోకాల్ (పంపిన సందేశాలను సంబంధిత యూజర్లు మాత్రమే చదవగలిగేలా చేసే కమ్యూనికేషన్ సిస్టమ్) సైఫర్పంక్లు ప్రారంభించిన 50 ఏళ్ల ప్రతిఘటనా ఉద్యమ ఫలితం మాత్రమే. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటర్మీడియరీ లయబిలిటీ మార్గదర్శకాలను కూడా ఈ కోణంలోనే చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈ మార్గదర్శకాలు యూజర్ల గోప్యతపై నిషేధం విధించి, ప్రతి యూజర్ గోప్యతా సంభాషణను శాశ్వత రికార్డు రూపంలో భద్రపర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత సమస్య మీడియా వాక్ స్వేచ్ఛకు సంబంధించింది మాత్రమే కాదు. అంతకు మించి ఇది సాఫ్ట్వేర్ రంగంలో వాక్ స్వేచ్ఛకు సంబంధించిన సమస్య. ప్రాథమిక స్థాయిలో చూస్తే కోడ్ను రాసి దాన్ని ప్రచురించడానికి, అభిప్రాయాలను రాసి వాటిని పుస్తకాలుగా ప్రచురించడానికి మధ్య ఎలాంటి వ్యత్యాసమూ లేదు. కానీ మెసేజింగ్ యాప్లు కోడ్ రచనను ఎలా చేయాలనే విషయమై, కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మధ్యస్థపు మార్గదర్శకాలు ఆదేశిస్తున్నట్లుగా కనబడుతున్నాయి. ఇది సాంకేతిక రంగానికి వర్తించే వాక్ స్వేచ్ఛపై ఆంక్షలు విధించే రూపమే తప్ప మరేమీ కాదు.ఈ ప్రత్యేక సమస్య కేంద్ర బిందువు ఏదంటే సిగ్నల్ ప్రొటోకాల్. ఇది సైబర్ రంగంలో అభిప్రాయాలను వెలువరించే కోడ్ వ్యక్తీకరణ. ఇది భౌతిక రంగంలో వాక్ స్వేచ్ఛ పరవళ్లు తొక్కడాన్ని అనుమతిస్తుంది. దీన్ని ‘ఓపెన్ విస్పర్ సిస్టమ్స్’ అనే పేరు కలిగిన లాభేతర కంపెనీ వృద్ధి చేసింది. ఇతరుల కంటబడకుండా, వినకుండా యూజర్లు చేసే గోప్య సంభాషణలను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపెట్టరాదనే ప్రగాఢ విశ్వాసం ఈ కంపెనీకి ఊపిరిగా ఉంటోంది. మద్రాస్ హైకోర్టులో ఫింగర్ప్రింటింగ్ టెక్నిక్పై చర్చ జంతు పరిరక్షణా కార్యకర్త ఆంథోనీ క్లెమెంట్ రూబిన్ మద్రాస్ హైకోర్టు ముందు దాఖలు చేసిన ప్రజావ్యాజ్య ప్రయోజన దావాతో యూజర్ల గోప్యతపై చర్చ భారత్లో మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది. న్యాయస్థానంలో ఈ అంశంపై జరిగిన చర్చ.. నిక్షిప్త సందేశాలను విచ్ఛిన్నపర్చకుండానే యూజర్ల మాటల సందేశాన్ని వాట్సాప్ ట్రాక్ చేయవచ్చా అనే అంశంపైకి మళ్లింది. అప్పుడు సైతం పేరుచెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ అధికారులు కొందరు ప్రతి సందేశంపై ఫింగర్ ప్రింటింగ్ (డేటాను గుర్తించి, ట్రాక్ చేసేందుకు నెట్వర్క్ డేటా నష్ట నివారణ సంస్థలు చేపట్టే డేటా లేదా డాక్యుమెంట్ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్) వేయడాన్ని ఒక పరిష్కార మార్గంగా ప్రతిపాదించారు. ప్రతి సందేశంపై ఫింగర్ ప్రింటింగ్ అమలు అసాధ్యమని వాట్సాప్ తోసిపుచ్చినందున ఎండ్–టు–ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటోకాల్ అవసరమే లేదని తమిళనాడు అడ్వొకేట్ జనరల్ వాదించారు కూడా.అయితే ఇప్పుడు కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలను ప్రకటించి ఉన్నందున ఫింగర్ప్రింటింగ్ సొల్యూషన్ని అమలుపర్చేందుకు అధి కార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. అయితే యూజర్ల గోప్యత సందేశాలను తాను వెల్లడి చేయబోననే తప్పుడు ప్రకటనతో ప్రభుత్వ యంత్రాంగం ముందుకొస్తోంది. ఫింగర్ ప్రింటింగ్ సొల్యూషన్ యూజర్ల గోప్యత సందేశాలను ఎలా బహిర్గతం చేస్తుందో అర్థం కావాలంటే ఫార్వార్డ్ సీక్రెసీ భావనను ముందుగా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఫార్వార్డ్ సీక్రెసీ అంటే మీ ప్రస్తుత ఎన్క్రిప్షన్ కీని ఎవరైనా సైబర్ అటాకర్ దొంగిలించినా, మీ మునుపటి సందేశాలను ఇప్పటికీ సురక్షితంగానే ఉంచే సిగ్నల్ ప్రొటోకాల్. ఈ ఫార్వర్డ్ సీక్రెసీ అనేది చైనా వంటి ప్రత్యర్థి దేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించడానికి ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని విచ్ఛిన్నపర్చడం ద్వారా మీ సందేశాలన్నింటిని అడ్డుకోవడమే కాకుండా, మీ ఫోన్ నుండి మీ ప్రమేయం లేకుండా బలవంతంగా సందేశాలను గుంజుకోవడానికి ఇలాంటి దేశాలు ప్రయత్నించే అవకాశం ఉంది. మన ప్రత్యర్థి దేశాలు ఆత్యాధునిక సైబర్ ఆపరేషన్లను కలిగి ఉంటున్నప్పుడు బలహీనమైన ఎన్క్రిప్షన్ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. మునుపటి సందేశాలు కొంత కాలం తర్వాత ఆటోమేటిక్గా తొలిగిపోతున్నప్పుడు ఫార్వర్ట్ సీక్రెసీ అనేది మరింతగా ఆచరణ సాధ్యంగా మారుతుంది. కాబట్టి మీ ఫోన్ని మీరు కోల్పోయినా లేక ఎవరైనా తీసుకుపోయినా సరే వాటిలోని పాత సందేశాలని ఎవరూ ఇకపై చూడలేరు. సంగ్రహించలేరు. కాబట్టి, సిగ్నల్ మెసెంజర్, వాట్సాప్ రెండింటిలో సందేశాలు మాయమవడం అనేది ఒక ప్రామాణిక ఫీచర్గా ఉంటుంది. అంటే ఇతరుల చెవిలో మాత్రమే మనం వినిపించే గుసగుసలు ఎలా రహస్యంగా ఉంటాయో, అవి గాల్లో ఎలా కలిసిపోతాయో ఆ రకంగా ఇకపై మొబైల్ సందేశాలు కనిపించకుండా పోతాయి. మీరు ఒక గ్రూప్లో సందేశాలను పంపించినప్పుడు, ఇతర డివైస్ల నుంచి సందేశాలను తొలగించే సందర్భంలో కూడా ఇది వర్తిస్తుంది. దీనివల్ల మీ గోప్యత మరింత విస్తృతమవడమే కాకుండా స్వేచ్ఛగా మీకు మీరుగా గానీ, లేక గ్రూప్లో కానీ మాట్లాడవచ్చు.అభిప్రాయాలను పంచిపెడుతూ, ప్రజలను ప్రభావితం చేసేం దుకు ఒక పబ్లిక్ రంగాన్ని రూపొందించి ఉంచే ట్విట్టర్, ఫేస్బుక్ మాదిరి కాకుండా, మెసేజింగ్ ప్లాట్ఫామ్లు అనేవి వ్యక్తులు లేదా గ్రూపుల వ్యక్తిగత కమ్యూనికేషన్ కోసమే ప్రాథమికంగా ఉపయోగపడతాయి. అయితే ఈ గ్రూపులు లేదా సంభాషణ కర్తలు నేరస్వభావంతో ఉండవచ్చు. ఒక మూసివుంచిన గదిలో నేరాలు ఎలా చేయాలో మాట్లాడుకునే భావసారూప్యత కలిగిన వ్యక్తులకు, ఇలాంటి యూజర్ల గ్రూపుకు పెద్దగా తేడా ఉండకపోవచ్చు. ఇలాంటి గ్రూప్లలోకి చొరబడటం ద్వారా లేక ఇలాంటి గ్రూప్ల ఆధారాన్ని సేకరించి వారు చేస్తున్న నేరాలను పసిగట్టి దర్యాప్తు చేయడం నిఘా సంస్థల పని. ఒక సందేశాన్ని మొట్టమొదటగా ఎవరు పంపించారో కనుగొనడానికి మెసేజింగ్ అప్లికేషన్లు తమ నిక్షిప్త సందేశాల టెక్నాలజీని మార్చుకోవాలని ఆదేశించడం ద్వారా, ప్రభుత్వం ప్రతి సందేశాన్ని, ప్రతి యూజర్ వివరాలకు సంబంధించిన హ్యాష్ విలువలను తప్పకుండా నిల్వ చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ప్రతి సందేశాన్ని ఇలా నిలవ చేయటం అంటే నిఘా సంస్థలు కోరుకున్న ప్రతిసారీ ఈ సందేశాలలోని విషయాన్ని సమర్థంగా పరిశీలించవచ్చు. ఇటీవలే దిశారవి అరెస్టు సందర్భంగా ఢిల్లీ కోర్టు వాక్ స్వేచ్ఛ, స్వేచ్ఛాయుత వ్యక్తీకరణ అనేది ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను కోరుకునే హక్కును కలిగి ఉంటుందని, కమ్యూనికేషన్లో అలాంటి భౌగోళిక అడ్డుగోడలు ఉండవని వ్యాఖ్యానించడాన్ని గుర్తుంచుకోవాలి. రహస్యంగా సాగించే సంభాషణలను, లేదా పంపే సందేశాలను నిషేధించడానికి తీసుకొచ్చే నిబంధనలు తప్పక విఫలమవుతాయి. ఈ సందర్భంగా ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేయడాన్ని నియంత్రించడం ఎలా అనే అంశంపై మరింత చర్చలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీనివాస్ కొడాలి వ్యాసకర్త స్వతంత్ర పరిశోధకుడు డేటా, ఇంటర్నెట్ గవర్నెన్స్ (ది వైర్ సౌజన్యంతో) -
ఇంజనీరింగ్ కోర్సులకు ఏఐసీటీఈ కొత్త నిబంధన
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ కాలేజీల్లో వివిధ కోర్సులకు అనుమతులపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనలను కఠినతరం చేసింది. ఈ మేరకు 2021–22 విద్యా సంవత్సరానికి కాలేజీలు, కొత్త కోర్సులకు సంబంధించిన నిబంధనల హ్యాండ్బుక్లో పలు అంశాలు పొందుపరిచింది. ఇంజనీరింగ్ కాలేజీల్లోని వివిధ కోర్సుల్లో ఏఐసీటీఈ అనుమతించిన ఇన్టేక్ (మొత్తం) సీట్లలో 50 శాతానికి మించి విద్యార్థుల చేరికలు ఉంటేనే కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వనున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్ వంటి కోర్సులను ఆయా సంస్థల్లో తగిన సదుపాయాలు, ఇతర వనరులు ఉంటేనే అనుమతిస్తారు. ఈ కోర్సులను ప్రవేశపెట్టాలంటే ఈ సదుపాయాలతోపాటు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు ఉండాలని ఏఐసీటీఈ నిబంధన విధించింది. ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా ఆషామాషీగా కోర్సులకు అనుమతులు తీసుకొని అడ్మిషన్లు నిర్వహిస్తున్న కాలేజీల వల్ల ప్రమాణాలు దిగజారిపోతుండడంతో ఈసారి అనుమతుల విషయంలో పలు మార్పులు చేసింది. దీని ప్రకారం.. ► ఆర్కిటెక్చర్ కోర్సుల నిర్వహణకు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి తప్పనిసరి. అలాగే ఫార్మసీ కోర్సులకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి తప్పనిసరి. ► ప్రైవేటు కాలేజీల తనిఖీ కోసం వసూలు చేసే టీఈఆర్ చార్జీల నుంచి ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే సంస్థలకు మినహాయింపు ఉంటుంది. ఇతర సంస్థలు ఒక దఫాకు రూ.లక్ష చెల్లించాలి. గతంలో ఇది రూ.2 లక్షలుగా ఉండేది. ► డిప్లొమా స్థాయి కోర్సులను డిగ్రీ స్థాయి కోర్సులుగా మార్చుకునేందుకు అవకాశం. ► ప్రస్తుత ఇంజనీరింగ్ టెక్నాలజీ కాలేజీల్లో కొత్త ప్రోగ్రాములకు మల్టీ డిసిప్లినరీ విభాగాల్లో మాత్రమే అనుమతిస్తారు. ► విద్యార్థులు, బోధన సిబ్బంది అంతర్గత బదలాయింపులను అనుమతించరు. ఒకే మాతృ సంస్థ పరిధిలోని సంస్థల విలీనమైతే మాత్రం అక్కడి మౌలిక సదుపాయాలు, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ బదలాయింపును అనుమతిస్తారు. ► విదేశీ విద్యార్థులు, ప్రవాస భారతీయులు, గల్ఫ్ దేశాల్లోని భారతీయ కార్మికుల పిల్లల కోసం సూపర్ న్యూమరరీ సీట్లను అనుమతిస్తారు. ► ప్రాంతీయ భాషల్లో నిర్వహించే సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల ఇన్టేక్ను పెంచుకునేందుకు అవకాశం. ► సంబంధిత విద్యాసంస్థలో మొత్తం ఇన్టేక్ సీట్ల (2019–20)లో 50 శాతానికి పైగా భర్తీ అయితే కొత్త కోర్సులకు అనుమతి. ► విదేశీ యూనివర్సిటీలు, విద్యాసంస్థలతో కలిసి ట్విన్నింగ్ తదితర ప్రోగ్రామ్స్ నిర్వహించాలంటే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఆ సంస్థలు టాప్ 500ల్లో ఉండాలి. దేశంలోని సంస్థలు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్లో టాప్ 100లో ఉండాలి. అంతేకాకుండా ఎన్బీఏ అక్రిడిటేషన్ కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ముందు నుంచే ఉన్నత విద్య ప్రవేశాల్లో సంస్కరణలు కాగా.. రాష్ట్రంలో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేలా తొలి నుంచి అనేక చర్యలు చేపట్టారు. ఉన్నత విద్యా పర్యవేక్షణ నియంత్రణ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యామండలిని మరింత పటిష్టపరిచారు. ప్రమాణాలు లేని, పూర్తి చేరికలు లేక తూతూమంత్రంగా నిర్వహించే కాలేజీలను గుర్తించి.. వారికి లోపాలను సవరించుకునేందుకు ఉన్నత విద్యామండలి కొంత సమయం ఇచ్చింది. లోపాలు సరిదిద్దుకోని వాటిలో ప్రవేశాలను నిలిపేసింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, డీఫార్మా కోర్సుల్లో జీరో అడ్మిషన్లున్న 53 కాలేజీలకు, నిర్ణీత రుసుములు చెల్లించని 82 కాలేజీలకు 2020–21 విద్యాసంవత్సరం అడ్మిషన్లను ఆపేసింది. అలాగే నాన్ ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి ప్రమాణాలు పాటించని కాలేజీలపైనా చర్యలు తీసుకుంది. జీరో నుంచి 25 శాతంలోపు అడ్మిషన్లున్న 48 కాలేజీల అనుమతులను ఉపసంహరించారు. కొన్నిటిలో కోర్సుల అనుమతులను రద్దు చేశారు. చదవండి: మతి చెడగొడుతున్న సెల్ఫోన్ ఏపీ: ప్రకాశం జిల్లాలో 34 బ్యాక్లాగ్ ఖాళీలు -
Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
సాక్షి, అమరావతి: ఈ ఏడాది జూన్లో జరగనున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్యాట్రన్లో మార్పులు, గ్రూప్ కాంబినేషన్లు, నామినల్ రోల్స్, ఇతర అంశాలకు సంబంధించి ప్రధానోపాధ్యాయులకు సవివర సూచనలను చేస్తూ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి బుధవారం సర్క్యులర్ విడుదల చేశారు. పరీక్ష పేపర్లు, సమయం, మార్కులు తదితర అంశాలను అందులో వివరించారు. ఈ సర్క్యులర్ ప్రకారం.. ► ఈ పరీక్షలకు తొలిసారి హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థులంతా తెలుగు భాషను ఫస్ట్ లాంగ్వేజ్ లేదా సెకండ్ లాంగ్వేజ్ కిందS తప్పనిసరిగా రాయాలి.► తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్గా ఉన్న విద్యార్థులు సెకండ్ లాంగ్వేజ్ కింద హిందీ తప్పనిసరిగా రాయాలి.► ఆంగ్ల మాధ్యమ అభ్యర్థులు ఫస్ట్ లాంగ్వేజ్గా తెలుగును ఎంచుకుంటే సెకండ్ లాంగ్వేజ్ పేపర్గా హిందీని మాత్రమే ఎంపిక చేసుకోవాలి.►తమిళం, కన్నడ, ఒరియా తదితర మాతృభాషలను ఫస్ట్ లాంగ్వేజ్గా ఎంచుకున్న విద్యార్థులు రెండో పేపర్గా తెలుగును తప్పనిసరిగా రాయాలి. పబ్లిక్ పరీక్షల్లో.. ఇంటర్నల్ మార్కులకు వెయిటేజీ ఉండదు.►ఏడు పేపర్లలో ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, మేథమెటిక్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు ఒక్కొక్కటి 100 మార్కులకు ఉంటాయి. ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పరీక్షలు 50 మార్కుల చొప్పున వేర్వేరుగా ఉంటాయి.► ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ పేపర్–1.. 70 మార్కులకు, పేపర్–2.. 30 మార్కులకు ఉంటాయి.► లాంగ్వేజ్ పరీక్షలు, మేథమెటిక్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు రాసేందుకు ఒక్కో పేపర్కు 3 గంటలు, ప్రశ్నపత్రం చదువుకునేందుకు 15 నిమిషాల (మొత్తం 3 గంటల 15 నిమిషాలు) సమయం ఇస్తారు. ►ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పరీక్షలు రాసేందుకు 2.30 గంటలు, ప్రశ్నపత్రం చదువుకునేందుకు 15 నిమిషాలు (మొత్తం 2 గంటల 45 నిమిషాలు) ఇస్తారు.► 2017 మార్చిలో మొదటిసారి టెన్త్ పరీక్షలకు హాజరై 2019 జూన్ వరకు ఆ పరీక్షలను పూర్తిచేయనివారు కొత్త స్కీమ్లో ప్రస్తుతం నిర్వహించే పరీక్షలకు రిజిష్టర్ కావచ్చు.► ఇంటిపేరుతో సహా అభ్యర్థి పూర్తిపేరు, తండ్రి, తల్లి పూర్తి పేర్లు నమోదు చేయాలి. అనాథలకు సంరక్షకుల పేరు నమోదు చేయాలి.► స్కూలు రికార్డుల్లో నమోదైన వారిని మాత్రమే రెగ్యులర్ అభ్యర్థులుగా పరిగణిస్తారు. ► గుర్తింపు ఉన్న స్కూలు నామినల్ రోల్స్ మాత్రమే రెగ్యులర్ అభ్యర్థులుగా అప్లోడ్ చేయాలి.► చెవిటి, మూగ, అంధత్వం తదితర బహుళ దివ్యాంగులకు రెండు లాంగ్వేజ్లకు బదులు ఒక్కటే ఎంచుకోవచ్చు. వీరికి ప్రతి సబ్జెక్టులో పాస్ మార్కులు 20 మాత్రమే. -
కరోనా: కేంద్రం తాజా మార్గదర్శకాలు.. పూర్తి వివరాలు
సాక్షి, న్యూఢిల్లీ: కార్యాలయాలు ఇతరత్రా పని చేసే ప్రాంతాలు ఎప్పుడూ రద్దీగా ఉంటాయన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా ప్రామాణిక నియమావళి విడుదల చేసింది. కారిడార్లు, ఎలివేటర్లు, స్టెయిర్కేస్, వాహనాలు నిలుపదల చేసే చోటు, క్యాంటీన్, కేఫటేరియా, సమావేశాల మందిరాలు తదితర ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రామాణిక నియమావళి పాటించాలని మంత్రిత్వశాఖ ఆదేశాల్లో పేర్కొంది. నియమావళి ఇదీ... ► కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు అన్నివేళలా ఉండాలి. ► కార్యాలయాల్లో ప్రతి ఒక్కరూ ఇతరులతో ఆరు అడుగుల దూరం పాటించాలి. ► అన్నివేళలా మాస్కులు ధరించాలి. ముక్కు, నోరు మూసి ఉండేలా మాస్కుల ధరించేలా చూడాలి. మాస్కు ముందుభాగం పదేపదే తాకకుండా చూసుకోవాలి. ► కార్యాలయంలోకి ప్రవేశించే ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ వినియోగించాలి. ► కరోనా లక్షణాలు లేని వారినే కార్యాలయాల్లోకి అనుమతించాలి ► అధికారి లేదా సిబ్బంది కంటైన్మెంట్ జోన్లలో నివశిస్తున్నట్లైతే వారు డీనోటిఫైఅయ్యే వరకూ కార్యాలయానికి రాకూడదు. వారికి ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించాలి. ► డ్రైవర్లు వారికి కేటాయించిన గదుల్లో సామాజిక దూరం పాటించాలి. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. కంటైన్మెంట్ జోన్లలో నివసించే వారిని వాహనం నడపడానికి అనుమతించకూడదు. ► వాహనం లోపలి భాగాన్ని రోజుకి రెండుసార్లు సోడియం హైపోక్లోరైట్ సొల్యూషన్ లేదా స్ప్రేతో శుభ్రం చేయాలి. ► డోర్ హ్యాండిళ్లు, తాళాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ► వయసు ఎక్కువ ఉన్నవారు, గర్భిణులు, వైద్య సేవలు పొందుతున్న వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కార్యాలయాల్లో ఫ్రంట్లైన్ పనులకు వారి సేవలు వినియోగించకూడదు. ► మాస్కు ధరించిన వారినే కార్యాలయాల్లోకి రానివ్వాలి. ► సందర్శకులను పూర్తిగా పరిశీలించిన అనంతరమే అనుమతించాలి. ► వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలు నిర్వహించాలి. ► వ్యాలెట్ పార్కింగ్ నిర్వహించే వారు గ్లౌజ్లు, మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ► కార్యాలయం లోపల , బయట ఉన్న దుకాణాలు, స్టాళ్లు, కేఫటేరియా, క్యాంటీన్లలో సామాజిక దూరం పాటించేలా చూడాలి. ► కనీసం రోజుకి రెండుసార్లు కార్యాలయాల ప్రాంగణం శానిటైజ్ చేయాలి. ► వాష్రూమ్ల్లో ఎళ్లవేళలా శానిటైజర్, సబ్బులు, నీటిప్రవాహం ఉండేలా చూసుకోవాలి. ► సీపీడబ్ల్యూడీ నిబంధనలు అనుసరించి ఏసీలు ఎప్పుడూ 24–30డిగ్రీలు, తేమ 40–70శాతం మధ్యలో ఉండేలా చూసుకోవాలి. ప్రాంగణం ఎలా ఉండాలి... ► కార్యాలయాల్లో కేసులు నమోదైతే కనక సదరు రోగి 48 గంటల క్రితం సందర్శించిన లేదా పనిచేసిన ప్రాంతాలను శానిటైజేషన్ చేయాలి. ► ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత మార్గదర్శకాలు అనుసరించి పనులు కొనసాగించొచ్చు. ► ఒకవేళ ఆయా కార్యాలయాల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైతే సదరు బ్లాక్ లేదా భవనం మొత్తాన్ని శానిటైజ్ చేసి తర్వాత కార్యకలాపాలు ప్రారంభించాలి. కంటైన్మెంట్ జోన్లలో నివసించే అధికారులు, సిబ్బంది కార్యాలయానికి సంబంధించిన పర్యవేక్షక అధికారికి ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలి. ► కంటైన్మెంట్ జోన్ డీనోటిఫై అయ్యే వరకూ కార్యాలయాలకు హాజరుకాకూడదు. ఆయా సిబ్బంది ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాలి. కేసులు వస్తే ఏం పాటించాలి... ► ఆయా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కార్యాలయాల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు వస్తే ... అనారోగ్యానికి గురైన వ్యక్తి గది లేదా ప్రాంతం ఇతరులకు దూరంగా ఉంచాలి. ► అనారోగ్యానికి గురైన వారిని వైద్యుడి వద్దకు తీసుకెళ్తే ఆ సమయంలో వారు మాస్కు లేదా ఫేస్ కవర్ ధరించేలా చూడాలి. ► వెంటనే దగ్గర్లోని వైద్య సదుపాయం ఉన్న ప్రాంతాలకు వారి సమాచారం చేరవేయాలి. వైద్యుల సలహాలు పాటించాలి. ► ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం కేసుల నిర్వహణ ఉండాలి. ఇవి కూడా చదవండి: ఇలాగైతే కరోనా వ్యాప్తి చెందదా? టీకా తీసుకున్న 20 రోజులకు పాజిటివ్! -
ఇకపై ఆర్టీసీ ఉద్యోగులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత..!
సాక్షి, హైదారాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేసింది. ఇందులో భాగంగా వారి ఉద్యోగ భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కె.చంద్రశేఖర్ రావు గురువారం సంతకం చేశారు. విధి నిర్వహణలో ఆర్టీసీ ఉద్యోగులు అనేక సందర్భాల్లో అనవసర వేధింపులకు గురవుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ సర్కర్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఉద్యోగులు గతంలో చాలా సందర్భాల్లో సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీఎం కేసీఆర్ స్పందించి.. ఆర్టీసీ ఉద్యోగులు వేధింపులకు గురి కాకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు అధికారుల కమిటీ మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలుస్తోంది. -
భౌతికదూరం పాటిస్తూ బడికెళ్లేదెలా..
సాక్షి, హైదరాబాద్: పిల్లలు స్కూల్కు ఎలా వెళ్లాలి? తిరిగి ఇంటికి చేరేదెలా? ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్నలు ఇవి. స్కూళ్లలో భౌతిక దూరంపాటించడం, తరగతి గదులను తరచుగా శానిటైజ్ చేయడం వంటి నిబంధనలు అమలు చేయవచ్చు. అలాగే పిల్లలకు మాస్కులు ధరించేవిధంగా జాగ్రత్తలు పాటించవచ్చు. సాధారణ రోజుల్లో అయితే స్కూల్ బస్సులు, ఆటోల్లో వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా వాహనాల్లో ఎక్కువ మంది ప్రయాణం చేయడం సాధ్యం కాదు. పైగా కోవిడ్ నిబంధనలకు విరుద్ధం కూడా. దీంతో పిల్లలను చేరవేయడం అనేది ప్రస్తుతం అతి పెద్ద సమస్య. ప్రస్తుతం 9, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ స్థాయి విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ దశలవారీగా అన్ని తరగతులను అనుమతించే అవకాశం ఉంది. ఈ క్రమంలో భౌతిక దూరం పాటిస్తూ కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేయడం సాధ్యం కాకపోవచ్చుననే అభిప్రాయం ఉంది. అప్పుడు అలా... గ్రేటర్లో సుమారు 3500కు పైగా స్కూళ్లలో 20 లక్షల మందికి పైగా పిల్లలు చదువుకుంటున్నారు. ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్ధులు ఇందుకు అదనం. 11500 స్కూల్ బస్సులు, మరో 50 వేలకు పైగా ఆటోలు, 10 వేల వ్యాన్లు, టాటా ఏస్ వంటి వాహనాల్లో పిల్లలకు రవాణా సదుపాయం కల్పిస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఆటోల్లో పంపిస్తారు. ఒక్కో ఆటోలో 8 మంది విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లవలసి ఉండగా చాలామంది ఆటోడ్రైవర్లు 15 మంది పిల్లలను ఆటోల్లో బంధించి తీసుకెళ్తారు. ఇవి కాకుండా నగర శివార్లలోని కళాశాలలకు వెళ్లే విద్యార్ధులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్ధుల రద్దీకనుగుణంగా ఆర్టీసీ రోజుకు 3 వేలకు పైగా ట్రిప్పులు నడుపుతుంది. కోవిడ్ కారణంగా అన్ని విద్యాసంస్థలు మూతపడడంతో స్టూడెంట్ ట్రాన్స్పోర్టు కూడా స్తంభించింది. లాక్డౌన్ దృష్ట్యా రవాణాశాఖ అన్ని రకాల వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలను నిలిపివేసింది. ఈ ఫిబ్రవరి వరకు అనుమతులను పొడిగించింది. దీంతో సంవత్సరానికి ఒకసారి స్కూల్ బస్సులకు నిర్వహించే ఫిట్నెస్ ధృవీకరణ కూడా ఆగింది. మరోవైపు చాలా బస్సులు ఎలాంటి నిర్వహణ లేకుండా పార్కింగ్ అడ్డాలకే పరిమితమయ్యాయి. ఇప్పటికిప్పుడు ఈ బస్సుల్లో రవాణా సదుపాయం కల్పించాలంటే ఫిట్నెస్ పరీక్షలు చేసి వాటి సామర్థ్యాన్ని ధృవీకరించవలసి ఉంటుంది. ఇప్పుడు ఎలా... ⇔ ప్రస్తుతం 9,10 తరగతుల పిల్లలను మాత్రమే అనుమతించాలని భావిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్ధులకు కూడా కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ⇔ ఈ స్టూడెంట్స్ అంతా స్కూల్కు వెళ్లడం ఇప్పుడు సవాల్గానే మారింది. ఆటోలు, బస్సుల్లో పంపించేందుకు చాలా మంది తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. ⇔ మరోవైపు పిల్లలను స్కూల్కు పంపించడం, తిరిగి తీసుకెళ్లడం తల్లిదండ్రుల బాధ్యత అని విద్యాసంస్థల యాజమాన్యాలు సూచిస్తున్నాయి. ⇔ ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలు చేసుకొనే తల్లిదండ్రులకు ఇది భారంగానే మారనుంది. -
ఈ లక్షణాలుంటే కోవాగ్జిన్ టీకా తీసుకోవచ్చా?
సాక్షి, ముంబై: ఒకవైపు కరోనా మహమ్మారి అంతానికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు సీరం వ్యాక్సిన్ తీసుకున్న 24 గంటల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారన్న వార్తలు ఆందోళన పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి దేశీయ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్కు సంబంధించి భారత్ బయోటెక్ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటీవల కోవాగ్జిన్ టీకా దుష్ప్రభావాలపై పలు విమర్శలు వచ్చిన క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా తాజా సూచనలు జారీ చేసింది. ఎవరు తమ టీకాను తీసుకోకూడదు, ఎవరు తీసుకోవచ్చు అనే వివరాలతో ఒక వివరణాత్మక ఫ్యాక్ట్ షీట్ను రిలీజ్ చేసింది. ముఖ్యంగా బలహీనమైన ఇమ్యూనిటీ ఉన్నవారు, రోగనిరోధక శక్తి వ్యవస్థపై ప్రభావం చూపే మందులు వాడేవారు, అలర్జీ ఉన్నవారు తమ కోవాగ్జిన్ టీకాను తీసుకోవద్దు అని భారత్ బయోటెక్ హెచ్చరించింది. భారత్ బయోటెక్ వెబ్సైట్లో పోస్ట్ చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం రక్తస్రావ లోపాలు లేదా బ్లడ్ థిన్నర్స్ వాడేవారు టీకా తీసుకోకపోవడం మంచిది. అలాగే జ్వరం లేదా అలెర్జీ ఉన్నవారు, గర్భిణీ, పాలిచ్చే తల్లులు కూడా వ్యాక్సిన్ తీసుకోవద్దని సూచించింది. దీనితోపాటు మరో కంపెనీ టీకా తీసుకున్న వారు కోవాగ్జిన్ టీకా వాడవద్దని కూడా హెచ్చరించింది. వ్యాక్సిన్ డోస్ తీసుకున్న తర్వాత ఎవరైనా కోవిడ్-19 లక్షణాలను కనిపిస్తే, దాన్ని ఆర్టీ-పీసీఆర్ పరీక్ష ఆధారంగా "ప్రతికూల సంఘటన" గా పరిగణిస్తారని పేర్కొంది. కాగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సయుక్తంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ను భారత్ బయోటెక్ రూపొందిస్తోంది. ఇప్పటికీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. అత్యవసర ఉపయోగం కోసం కేంద్రం అనుమతి పొందిన రెండు సంస్థల్లో భారత్ బయెటెక్ ఒకటి. జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. -
‘ఫ్లూ’ ఏదైనా.. జాగ్రత్తే అసలు మందు
సాక్షి, హైదరాబాద్: బర్డ్ ఫ్లూ... కరోనా వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో ఎదురైన మరో ఉపద్రవం. ఈ ఫ్లూ పక్షులపైనే కాదు.. మనుషులపైనా ప్రభావం చూపనుందని కేంద్ర ప్రభుత్వం పసిగట్టింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఛాయలను గుర్తించింది. కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్రల్లో ఈ నెల 11న ఫ్లూ ఉన్నట్లు ఖరారు చేసిన కేంద్రం... దీన్ని ఏవియన్ ఇన్ఫ్లూయెంజాగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రధానంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లే బర్డ్ ఫ్లూపై పోరాటంలో కీలక భూమిక పోషించాలని స్పష్టం చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు అప్పగించినప్పటికీ... సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదమేమీ కాదని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసింది. చదవండి: కోవాగ్జిన్ వద్దు.. కోవిషీల్డ్ కావాలి పూర్తిగా ఉడికించిన ఆహారం మేలు హాఫ్ బాయిల్డ్(సగం ఉడికించిన) గుడ్లను అస్సలు తినొద్దు. సగం ఉడికించిన చికెన్ జోలికీ పొవద్దు. 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కనీసం అరగంట పాటు ఉడికించిన పదార్థాలనే తినాలి. బర్డ్ఫ్లూ సోకిన పక్షులకు కాస్త దూరంగా ఉండటంతో పాటు అవి సంచరించిన చోట ఉండే ఆహార పదార్థాలు, పచ్చి కాయగూరలు, పండ్లను తీసుకోకపోవడమే మేలు. ఆహార పదార్థాల వాడకంపై మరింత అవగాహన పెంచుకోవాలి. దీనికి సంబంధించిన సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపర్చినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. (చదవండి: దేశమంతటా టీకా పండుగ) జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు... బర్డ్ ఫ్లూపై పోరాటం చేసే బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. కలెక్టర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి రోజువారీ పురోగతిని సమీక్షించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా పశుసంవర్థక, అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూ సంస్కరణల విభాగం, హోం, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మరణించిన పక్షులను ముట్టుకోకుండా ఉండటంతో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొంది. అకారణంగా పక్షులు మరణించినట్లు గుర్తిస్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్రూమ్ నంబర్ 040–246511196కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. జ్వరం, గొంతు నొప్పి బర్డ్ఫ్లూ సోకిన పక్షితోనే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఫ్లూ సోకిన పక్షిని తాకడం.. ముఖ్యంగా పక్షి కళ్లు, ముక్కును పట్టుకోవడంతో ఈ వైరస్ మరొకరికి సోకుతుంది. ఫ్లూ సోకిన పక్షి ఎగురుతున్నప్పుడు రెక్కల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని శాçస్త్రవేత్తలు చెబుతున్నారు. పక్షుల్లో రకరకాల లక్షణాలు అంతర్గతంగా కనిపిస్తుండగా... ఈ వైరస్ మనుషులకు సోకితే ముందుగా జ్వరం, గొంతు నొప్పి, జలుబు, తలనొప్పి, కండరాలు, ఎముకల నొప్పితో మొదలై క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, గర్భిణులు, బాలింతలు, రెండేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధుల్లో ఈ వైరస్ సొకితే దుష్ప్రభావాలు ఎక్కువ. వీరంతా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో పొందుపర్చింది. -
కరోనా వ్యాక్సిన్: కేంద్రం మార్గదర్శకాలు..
సాక్షి, ఢిల్లీ: కరోనా వ్యాక్సిన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. కోవిడ్ -19 వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్లో గర్భవతి, బాలింతలను భాగం చేయలేదని.. లబ్ధిదారులు రెండు రకాల టీకాలు వేసుకోవద్దని కేంద్రం స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఉపయోగం గురించి లేఖలో కేంద్రం వివరించింది. 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అని కేంద్రం తెలిపింది. ఏ టీకా అయితే మొదటి డోసు తీసుకుంటారో అదే టీకా రెండో డోసులో తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చదవండి: ‘కోవిడ్ టీకాతో నపుంసకులవుతారు’ కాగా, దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ రేపు (శనివారం) ప్రారంభం కానుంది. రేపు ఉదయం 10 గంటలకు వర్చువల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్ను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 3,006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకాలు ఇవ్వనున్నారు. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. చదవండి: కరోనా కట్టడి: భారత్పై ఐఎంఎఫ్ ప్రశంసలు -
వివాదంలో ప్రియాంకా చోప్రా
లండన్: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. కోవిడ్ నిబంధనలకుమ విరుద్దంగా ప్రియాంక లండన్ సెలూన్ను సందర్శించడంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. యూకేలో కొత్త రకం కరోనా(యూకే స్టెయిన్) విజృంభిస్తున్న సంగతి తెలిసిదే. దీంతో లండన్ ప్రభుత్వం అక్కడ కఠిన నిబంధనలతో కూడిన లాక్డౌన్ను అమలు చేస్తోంది. అయితే షూటింగ్లో భాగంగా ప్రస్తుతం లండన్లో ఉన్న ప్రియాంక గతవారం తన తల్లి మధు చోప్రాతో కలిసి సెలబ్రిటీ స్టైలిస్ట్ జోష్ వుడ్కు సంబంధించిన ప్రైవేటు సెలూన్ను సందర్శించారు. దీంతో అది చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమచారం అందించాడు. లాక్డౌన్ అమలును పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని ప్రియాంకతో పాటు మిగతా వారిని హెచ్చరించారు. అంతేగాక ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా సెలూన్ను తెలిరిచిన జోష్ వుడ్ను గట్టిగా వారించారు. అయితే అతడిపై ఏవిధమైన జరిమాన విధించలేదు. అనంతరం షూటింగ్లో భాగంగా తన హేర్కు కలర్ వేసుకోవాల్సి ఉందని, అందుకే సెలూక్కు వచ్చినట్లు ప్రియాంక పోలీసులతో పేర్కొన్నారు. (చదవండి: ప్రియాంకా చోప్రా దూకుడు : బిగ్ న్యూస్) ఈ వార్త వైరల్ అవ్వడంతో నెటిజన్లు ప్రియాంకపై ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా ప్రియాంక తన హేర్కు కలర్ వేసుకోవడం ముఖ్యమా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరూ ‘ఇది సో కాల్డ్ సెలబ్రిటీలను అనుసరించడం ఆపే సమయం’ అంటూ ప్రియాంకపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా యూకే స్ట్రెయిన్(కొత్త రకం కరోనా) నేపథ్యంలో కొన్ని మార్గదర్శకాలను అనుసరిస్తూ టీవీ, మూవీ షూటింగ్లకు అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ప్రియాంక నటిస్తున్న ‘టెక్ట్ ఫర్ యూ’ మూవీ షూటింగ్ షెడ్యూల్ లండన్ జరుపుకోనున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇటీవల అక్కడకు చేరుకుంది. లంండన్ ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ‘టెక్ట్ ఫర్ యూ’ టీం అంతా కోవిడ్ టెస్టులు చేయించుకుని క్వారంటైన్కు వెళ్లింది. ఇటీవల క్వారంటైన్ సమయం ముగియడంతో ప్రియాంక హేర్ కలర్ కోసం ఇలా కరోనా నిబంధనలను ఉల్లంఘించి నెటిజన్ల ఆగ్రహనికి గురయ్యారు. (చదవండి: మిస్ వరల్డ్ గెలిచిన తర్వాత అమ్మ నాతో..) -
యూకే స్ట్రెయిన్: సల్మాన్ సోదరులపై ఎఫ్ఐఆర్
ముంబై: కరోనా వైరస్ను అరికట్టెందుకు మన ప్రభుత్వాలు కఠిన నిబంధనలు విధిస్తున్నప్పటికి కొందరు మాత్రం వాటిని లెక్కచేయకుండా పెడచెవిన పెడుతున్నారు. ప్రభుత్వ నియమాలను, ఆదేశాలను లెక్కచేయని వారిలో సామాన్య ప్రజలే కాకుండా సెలబ్రిటీలు కూడా ఉండటం గమనార్హం. తాజాగా వారిలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరులు అర్భాజ్ ఖాన్, సోహైల్ ఖాన్లు కూడా చేరారు. కోవిడ్ నిబంధనలను ఉల్లఘించారంటూ వారిపై ఓ వైద్యాధికారి ముంబై మున్సిపల్ కార్పోరేషన్(బీఎంసీ) పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో యూకే స్ట్రెయిన్ కేసుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహరాష్ట్ర ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చిన వారు కోవిడ్ టెస్టు చేయించుకోవడం తప్పనిసరి అంటూ ఆదేశాలు జారీ చేసింది. పరీక్షలో ఒకవేళ నెగిటివ్ వచ్చినప్పటికి కూడా వారాల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని మహా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఇటీవల దుబాయ్ వెళ్లిన అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్, సోహైల్ తనయుడు నిర్వాన్ ఖాన్లు గతేడాది డిసెంబర్ 25న దుబాయ్ నుంచి ముంబైకు తిరిగి వచ్చారు. అయితే ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం లేక్క చేయకుండ ఆర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్, నిర్వాన్లు నిబంధలను ఉల్లఘించడంతో ముగ్గురిపై ముంబై వైద్యాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్కు వెళ్లాలి. కానీ నిబంధనలను అతిక్రమిస్తూ వారు నేరుగా ఇంటికి వెళ్లారని, కోవిడ్ -19 మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్లో ఉండాలని చెప్పినా పట్టించుకోకుండా మొండిగా ప్రవర్తించారని సదరు వైద్య అధికారి ఫిర్యాదులో పేర్కొన్నారు. -
కోవిడ్ నిబంధనల గడువు పొడిగింపు
సాక్షి, ఢిల్లీ: కోవిడ్ మార్గదర్శకాల గడువును జనవరి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ కేసులు తగ్గుతున్నా.. కొత్త స్ట్రెయిన్ దృష్ట్యా గడువు పొడిగించింది. కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. కాగా, భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కేసుల సంఖ్యలో రోజురోజు స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ వ్యాధి అదుపులో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణంకాలు తెలుపుతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య కోటి రెండు లక్షలకు చేరాయి. -
ప్రపంచ యుద్ధంలా కరోనా : సుప్రీంకోర్టు
ఢిల్లీ : కరోనాపై ప్రపంచ యుద్ధం జరుగుతుందని, దీని వల్ల ప్రతీ ఒక్కరూ బాధపడుతున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. సరైన మార్గదర్శకాలు అమలు చేయకపోవడం వల్లే వైరస్ దావానంలా వ్యాపిస్తోందని న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా మార్గదర్శకాలపై దాఖలైన పిటిషన్పై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కఠిన నిబంధనలు అమలుచేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. ఎక్కువ జనసంచారం ఉన్న ఫుడ్ కోర్టులు, తినుబండారాలు, కూరగాయల మార్కెట్లు, బస్ స్టేషన్లు , రైల్వే స్టేషన్లలో పోలీసు సిబ్బందిని మోహరించాలని సంబంధిత అధికారులను కోరింది. (క్రెడిట్ మొత్తం మీరే తీసుకోండి.. కానీ: ప్రధాని మోదీ ) ప్రైవేటు ఆసుపత్రుల్లో విధించే ఫీజులపై పరిమితి విధించే రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కరోనా తీవ్రత ఉన్న ప్రాంతాల్లో కర్ఫ్యూ లేదా లాక్డౌన్ విధించాలనుకుంటే కొన్ని రోజులు మందుగానే ప్రకటన చేయాలని సూచించింది. దీంతో ప్రజలు ఇబ్బందికి గురికాకుండా ముందుగానే అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉంటారని తెలిపింది. అధికారులందరూ తప్పనిసరిగా మార్గదర్శకాలకు కట్టుబడి ఆంక్షలు అమలు చేసేలా చూడాలని పేర్కొంది. గత ఎనిమిది నెలలుగా కరోనా కట్టడికి వైద్యులు, నర్సులు నిర్విరామంగా పనిచేయడం వల్ల శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని సుప్రీం పేర్కొంది. వారితో పాటు ఫ్రంట్లైన్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికులకు సైతం తగినంత విశ్రాంతిని కల్పించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. (మమతకు వరుస షాక్లు.. బీజేపీ సెటైర్లు! ) -
మాస్కు ఉంటేనే ఓటు
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్లే సిబ్బందికి, బ్యాలెట్ పేపర్లను ఒక దగ్గరకు చేర్చే ఉద్యోగులకు పీపీఈ కిట్లు ఇవ్వాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథికి సమగ్ర మార్గదర్శకాలను అందజేశారు. ఆ ప్రకారం ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కార్యకలాపాల్లో పాల్గొనే వారందరూ తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. లేకుంటే పోలింగ్ స్టేషన్లలోకి ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. ‘నో మాస్క్ నో ఎంట్రీ’అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ‘భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి. రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బంది తమ కార్యకలాపాలను పెద్ద పెద్ద హాళ్లలో నిర్వహించుకోవాలి. పోలింగ్, భద్రతా సిబ్బంది కిక్కిరిసినట్లు వెళ్లకుండా తగినన్ని వాహనాలను సమకూర్చుకోవాలి. ఎన్నికల సిబ్బంది అంతా ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల’ని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఆరడుగుల దూరం పోలింగ్స్టేషన్కు వచ్చే ఓటర్ల మధ్య ఆరడుగుల దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సందర్భంగా కోవిడ్ జాగ్రత్తలను పర్యవేక్షించేందుకు వార్డు స్థాయి వరకు నోడల్ హెల్త్ ఆఫీసర్లను నియమించాలి. పోలింగ్ సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే, తక్షణమే వారి స్థానంలో రిజర్వుడు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలి. అభ్యర్థులు తమ రోజువారీ ఎన్నికల ఖర్చులను ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు. నామినేషన్ సమర్పించడానికి అభ్యర్థితో పాటు మరో ఇద్దరికే అనుమతి ఇస్తారు. రెండు వాహనాలకే అనుమతి. మరికొన్ని మార్గదర్శకాలు... - ఎన్నికల సామగ్రి పంపిణీ, సేకరణ, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. - పోలింగ్స్టేషన్ను పరిశుభ్రంగా ఉంచడంపై ప్రత్యేక దృష్టి కేటాయించాలి. - ఓటర్ల మధ్య ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించేలా వలయాలు గీయాలి. వాటిల్లో ఓటర్లు నిలబడేలా పర్యవేక్షించాలి. - స్త్రీ, పురుషులు, వికలాంగులు/ సీనియర్ సిటిజన్లకు... మూడు క్యూలు ప్రత్యేకంగా ఉండాలి. - అవకాశముంటే సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు క్యూలలో నిలబడకుండా నేరుగా పోలింగ్స్టేషన్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వాలి. - భౌతికదూరాన్ని పర్యవేక్షించేందుకు వాలంటీర్ల సేవలు ఉపయోగించుకోవాలి. - కోవిడ్ అవగాహనకు పోస్టర్లు ప్రదర్శించాలి. - సిబ్బంది, ఏజెంట్ల కోసం పోలింగ్స్టేషన్లలో భౌతికదూరం పాటించేలా సీటింగ్ ఏర్పాట్లు చేయాలి. - మాస్క్ లేకుండా ఓటర్లను పోలింగ్స్టేషన్లలోకి అనుమతించరు. అయితే ఓటరును గుర్తించేందుకు ఒకసారి మాస్క్ను తొలగించి వెంటనే పెట్టుకోవచ్చు. - ప్రతి పోలింగ్ అధికారి ముందు ఒక ఓటరు మాత్రమే నిలబడటానికి అనుమతిస్తారు. - పోలింగ్ అధికారులకు, భద్రతా సిబ్బందికి మాస్క్లు, శానిటైజర్లు, ఫేస్షీల్డ్లు ఇస్తారు. - ఇంటింటి ప్రచారానికి అభ్యర్థితో కలిపి ఐదుగురు వెళ్లొచ్చు. - రోడ్షోలలో వాహనాల మధ్య 100 మీటర్ల దూరం పాటించాలి. - ఒకేమార్గంలో రెండు వేర్వేరు రాజకీయ పార్టీ రోడ్ షోలు ఉంటే, వాటి మధ్య కనీసం అరగంట తేడా ఉండాలి. - కరోనా ప్రొటోకాల్ ప్రకారం బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించుకోవచ్చు. పర్యవేక్షించడానికి హెల్త్ రెగ్యులేటర్లను నియమించాలి. -
తరగతి గదిలో 16 మందే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నవంబర్ 2 నుంచి స్కూళ్ల ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. కోవిడ్–19 నేపథ్యంలో విద్యార్థులకు, టీచర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించకుండా ఉండాలని నిర్ణయించారు. ఒక్కో విద్యార్థికి మధ్య దూరం 6 అడుగులు ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. రోజువిడిచి రోజు తరగతుల నిర్వహణ, ఆన్లైన్, ఆఫ్లైన్ బోధన తదితర అంశాలను మార్గదర్శకాల్లో పొందుపరిచారు. నవంబర్ నెలంతా హాఫ్ డే స్కూళ్లే ► నవంబర్ నెలంతా స్కూళ్లు హాఫ్డే మాత్రమే (ఉదయం 9 నుంచి 1.30 వరకు) ఉంటాయి. మధ్యాహ్న భోజనం ముగిశాక పిల్లలను ఇళ్లకు పంపిస్తారు. ► విద్యార్థులు రోజు విడిచి రోజు తరగతులకు హాజరయ్యేలా ఏర్పాట్లు. ► ప్రారంభంలో 9వ తరగతికి ఒకరోజు పెడితే మరునాడు 10వ తరగతి పిల్లలకు తరగతులు పెట్టాలి ► నవంబర్ 23 నుంచి 6, 8 తరగతులకు ఒకరోజు, 7, 9 తరగతులకు మరునాడు తరగతులు నిర్వహించాలి. ► డిసెంబర్ 14 నుంచి 1, 3, 5, 7, 9 తరగతులకు ఒకరోజు, 2, 4, 6, 8 తరగతులకు మరుసటిరోజు తరగతులు పెట్టాలి. ► టెన్త్ విద్యార్థులకు ప్రతి రోజూ తరగతులు నిర్వహించాలి. ► ఏ స్కూలులో అయినా 750 మందికి మించి విద్యార్థులున్నట్లయితే వారిని మూడు బ్యాచులుగా చేసి మూడేసి రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలి. ► టీచర్లు రోజూ స్కూళ్లకు హాజరవ్వాలి. ఉదయం తరగతుల బోధన, మధ్యాహ్నం ఆన్లైన్ బోధనలో పాల్గొనాలి. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్వహణ ఇలా.. ► హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను అక్కడి వసతిని బట్టి నిర్ణీత నిబంధనలను పాటిస్తూ 9–12 తరగతుల పిల్లలతో నవంబర్ 2వ తేదీనుంచి ప్రారంభించవచ్చు. ► నిబంధనలకు అనువుగా తగినంత వసతి లేని పక్షంలో నవంబర్ 23 నుంచి ప్రారంభించాలి. ► అప్పటివరకు ఆ విద్యార్థులు సమీపంలోని ప్రభుత్వ స్కూళ్లలోని తరగతులకు హాజరవ్వడం లేదా ఆన్లైన్ తరగతుల ద్వారా ఆయా పాఠ్యాంశాలు నేర్చుకొనేలా చూడాలి. ► 3 నుంచి 8వ తరగతి పిల్లలకు సంబంధించి నిబంధనలు తరువాత విడుదల చేస్తారు. అప్పటివరకు ఈ విద్యార్థులు సమీపంలోని స్కూళ్లలోని తరగతులకు హాజరై అక్కడ మధ్యాహ్న భోజనం తీసుకోవచ్చు. అకడమిక్ క్యాలెండర్ ఇలా.. ► రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన అకడమిక్ క్యాలెండర్ను అన్ని పాఠశాలలు అనుసరించాలి. ► నవంబర్ 2 నుంచి 2021 ఏప్రిల్ 30 వరకు మొత్తం 180 రోజులకు తగ్గట్టుగా క్యాలెండర్ ఉంటుంది. ► ఆదివారాలు, సెలవు దినాల్లో స్కూళ్లు మూసిఉన్న రోజుల్లో పిల్లలు ఇంటినుంచే చదువుకొనేలా ప్రణాళిక ఉంది. ► తల్లిదండ్రుల కమిటీలతో సంప్రదించి ప్రతి రోజూ స్కూళ్లను పరిశుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలి. ► పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగేందుకు తగిన పౌష్ఠికాహారం మధ్యాహ్న భోజనం ద్వారా అందించాలి. మధ్యాహ్న భోజనం అమలులో కోవిడ్ జాగ్రత్తలు పూర్తిగా తీసుకోవాలి. మూడో వంతు మంది చొప్పున విడతల వారీగా పంపాలి. ► ప్రతిఒక్కరూ మాస్కు ధరించేలా, సామాజిక దూరం పాటించేలా చూడాలి. ► ఉదయం స్కూళ్లు తెరవగానే కోవిడ్ ప్రతిజ్ఞ చేయించి జాగ్రత్తలపై 15 నిమిషాలు బోధించాలి. -
ఆధార్ అప్డేట్ చేయాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల కోసం తలపెట్టిన ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల అమలును ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ పథకాలకు విద్యార్థుల వేలిముద్రల సమర్పణను తప్పనిసరి చేసింది. ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తును సమర్పించిన తర్వాత ప్రతి విద్యార్థి ఇకపై బయోమెట్రిక్ ఎంట్రీ చేయాల్సిందే. ఇదివరకు మాన్యువల్ పద్ధతిలో వివరాల నమోదుతో దరఖాస్తును ఆమోదించే అధికారం సంక్షేమాధికారికి ఉండేది. కానీ ప్రస్తుతం ప్రతి విద్యార్థి తప్పకుండా ఆధార్తో అనుసంధానమైన వేలిముద్రలు సమర్పిస్తేనే దరఖాస్తు సంక్షేమాధికారికి చేరుతుంది. అయితే ఆధార్ ఆధారిత వేలిముద్రలు సరిపోలడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యార్థులు ఆధార్ కార్డు పొందిన సమయంలో ఇచ్చిన ఫింగర్ ప్రింట్స్ ప్రస్తుతం సమర్పించే ప్రింట్స్ సరిపోలడం లేదు. పిల్లల్లో ఎదుగుదల వేగంగా ఉండటంతో వేలిముద్రల్లో మార్పులు వస్తున్నాయి. దీంతో పోస్టుమెట్రిక్ కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఆధార్ అప్డేషన్ అనివార్యమవుతోంది. అప్డేట్ చేస్తేనే... : ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తులో విద్యార్థి ఆధార్ నంబర్ తప్పనిసరి. ఈ నంబర్ ఎంట్రీ చేయడంతో దానికి అనుసంధానమైన వేలిముద్రలు దరఖాస్తులో భాగమవుతాయి. ఈ దరఖాస్తు కాలేజీ ప్రిన్స్పల్ లాగిన్కు చేరుతుంది. అక్కడ దరఖాస్తును తెరిచి పరిశీలించిన తర్వాత విద్యార్థి తన వేలి ముద్రలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఆధార్తో అనుసంధానమైన వేలి ముద్రల్లో ఏమాత్రం తేడా ఉన్నా సాఫ్ట్వేర్ ఆమోదించదు. ప్రతి ఐదేళ్లకోసారి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ నిబంధనలు చెబుతున్నాయి. ఈ ఐదేళ్ల కాలంలో జరిగిన మార్పులు, కొత్తగా చేరికలను ఎంట్రీ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం పోస్టుమెట్రిక్ విద్యార్థులకు ఈ అప్డేషన్ ప్రక్రియ అవసరముందని సంక్షేమ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆధార్ అప్డేట్ చేసుకోని విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు సమయంలో ఇబ్బందులు వస్తున్నందున ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నవంబర్ 30 వరకు గడువు... : 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల దరఖాస్తుకు వచ్చేనెల 30వ తేదీ వరకు ప్రభుత్వం గడువు విధించింది. వాస్తవానికి ఇప్పటికే గడువు ముగియాల్సి ఉండగా.. కోవిడ్–19 వ్యాప్తి, అడ్మిషన్ల ప్రక్రియలో జాప్యం నెలకొనడంతో దరఖాస్తుల స్వీకరణ ఆలస్యంగా ప్రారంభించారు. వచ్చే నెలాఖరు వరకు దరఖాస్తుకు సమయం ఉండటంతో ఆలోపు దీర్ఘకాలికంగా ఆధార్ అప్డేట్ చేసుకోని విద్యార్థులు ఆధార్ నమోదు కేంద్రాల్లో వేలి ముద్రలు సమర్పిస్తే సరిపోతుంది. -
నవంబర్ 30 వరకూ అన్లాక్ 5.0 గైడ్లైన్స్ అమలు
-
నవంబర్ 30 వరకూ అన్లాక్ 5.0 పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్కు సడలింపులు ఇస్తూ సెప్టెంబర్లో ప్రకటించిన అన్లాక్ 5.0 మార్గదర్శకాలు నవంబర్ 30 వరకూ కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పేర్కొంది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లకు 50 శాతం సీట్లతో అనుమతించడంతో సహా అన్లాక్ 5.0 మార్గదర్శకాలు నవంబర్ 30 వరకూ అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా ముప్పు ఇంకా ఉన్నందున మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేయాలని పేర్కొంది. ప్రభుత్వం అనుమతించిన సేవలు మినహా అంతర్జాతీయ విమాన సర్వీసుల నిలిపివేత యధావిధిగా కొనసాగుతుంది. దశలవారీగా స్కూళ్లు, విద్యాసంస్ధలను తెరవడంపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది. చదవండి : భారత్లో తగ్గుముఖం పట్టిన కరోనా -
సత్తా చూసి ఎంపిక చేయండి
సాక్షి, హైదరాబాద్: బల్క్డ్రగ్స్ పార్కుల ఏర్పాటు విషయంలో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలపై రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పార్కు ల ఏర్పాటులో కేవలం భూముల ధరలనే కాకుండా ఆయా రాష్ట్రాల్లో ఔషధాల రంగంలో ఉన్న మౌలిక వసతులు, అనువైన వాతావరణాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలని కోరుతోంది. బల్క్డ్రగ్స్ తయారీలో అత్యంత కీలకమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ), ఇతర కీలక ముడి పదార్థాలను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు మూడు కొత్త బల్క్ డ్రగ్స్ పార్కులను(బీడీపీ) ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పార్కులను ఎక్కడ ఏర్పాటు చేయాలో సూచించాలని కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫార్మాస్యూటికల్స్ విభాగానికి(డీఓపీ) కేంద్రం బాధ్యత అప్పగిం చింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై 27న బీడీపీల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేస్తూ, ఆసక్తి కలి గిన రాష్ట్రాలు దరఖాస్తు చేసుకోవాలని సూచిం చింది. బీడీపీల ఏర్పాటుకు ఆసక్తి చూపే రాష్ట్రాల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా కేంద్రం విడుదల చేసింది. కేంద్ర పథకంలో భాగంగా ఒక్కో బీడీపీకి గరిష్టంగా రూ.వెయ్యి కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్తో పాటు 75 శాతం మేర ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. అలాగే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. బీడీపీల ఏర్పాటుకు ఆసక్తి చూపే రాష్ట్రాలు అక్టోబర్ 15వ తేదీలోగా తమ ప్రతిపాదనలు అందజేసేందుకు డీఓపీ తుది గడువు విధిం చింది. దీంతో తెలంగాణ, ఏపీ, గుజరాత్, తమిళనాడు, పంజాబ్ ఆసక్తి చూపుతూ ప్రతిపాదనలు అందజేశాయి. మార్గదర్శకాలపై అభ్యంతరం బీడీపీలకు అవసరమైన భూమి ధరలు, విద్యుత్ రాయితీలు, ఇతర ప్రోత్సాహకాల వివరాలు సమర్పిస్తే, చాలెంజ్ మోడ్లో అర్హత కలిగిన రాష్ట్రాలను ఎంపిక చేస్తామని డీఓపీ ప్రకటించింది. ప్రాజెక్టు మేనేజ్మెంట్ ఏజెన్సీ.. రాష్ట్రాలు అందజేసే ప్రతిపాదనలను మదింపు చేసిన తర్వాత, ఏజెన్సీ చేసే సిఫారసు మేరకు ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తామని వెల్లడించింది. కాగా, కనీసం ఒక్క బీడీపీని అయినా సాధించాలనే పట్టుదలతో ఉన్న తెలంగాణ, బీడీపీల ఎంపిక కోసం రూపొందించిన మార్గదర్శకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేవలం భూమి ధరలు, రాయితీలు, ప్రోత్సాహకాలే కాకుండా ఇతర అంశాలు కూడా ఫార్మాపరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడకు లేఖ రాశారు. బీడీపీల ఏర్పాటులో ప్రణాళిక, పర్యావరణ అనుమతులు వంటి అంశాలను కూడా ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకోవాలని, ఈ విషయంలో ఆయా రాష్ట్రాల శక్తిసామర్థ్యాలను లెక్కలోకి తీసుకోవాలని తెలంగాణ కోరుతోంది. అలాగే ఏపీఐ, ఇతర కీలక ముడి పదార్థాల తయారీకి రాష్ట్రంలో ఉన్న అనువైన వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ప్రధాననగరాలకు దూరంగా 3 వందల కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతాల్లో భూమి ధరలు సహజంగానే తక్కువగా ఉంటాయనేది రాష్ట్రం వాదన. ఇలాంటి చోటకు నైపుణ్యం కలిగిన వారిని రప్పించడం, ఉద్యోగుల రవాణా, నివాసం తదితరాలు ఇబ్బందికరంగా ఉంటాయని, అలాగే అంతర్జాతీయ పెట్టుబడులు రావడం కష్టమని కేంద్ర మంత్రికి రాసినలేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. చైనా కీలకం.. భారత బల్క్డ్రగ్స్ తయారీ, ఎగుమతి రంగంలో తెలంగాణ కేంద్ర బిందువుగా ఉంది. బల్క్డ్రగ్స్ తయారీలో కీలకమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్లు (ఏపీఐ), ముడి పదార్థాల కోసం చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. వివిధ కారణాలతో ఏపీఐల రవాణాలో అంతరాయం ఏర్పడుతుండగా, కోవిడ్ నేపథ్యంలో ఏపీఐ, ఇతర కీలక ముడి పదార్థాల ధరలు 20 శాతం మేర పెరిగాయి. ఉత్పత్తి, రవాణా వ్యయం పెరగడంతో పాటు లాభాలపై ఏపీఐ దిగుమతులు ప్రభావం చూపుతున్నాయి. -
మీలో మాస్క్ మహారాజు ఎవరు?
సాక్షి, హైదరాబాద్: దసరా, దీపావళి పండగల వేళ కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న దృష్ట్యా దీన్ని నివారించేందుకు విస్తృత ప్రచారం చేపట్టేందుకు సర్కారు సమాయత్తమైంది. సోషల్ మీడియా సహా వివిధ రకాల ప్రచార సాధనాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణ యాసలో ఆకట్టుకొనే నినాదాలు, ప్రత్యేక పాటలు సిద్ధం చేసింది. అలాగే పండుగల సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు మార్గదర్శకాలు జారీ చేసింది. మీలో మాస్క్ మహారాజు ఎవరు? బతుకమ్మను తీసుకెళ్లే మహిళలు మాస్క్ లు ధరించి కరోనాను కట్టడి చేయాలని చెప్పేలా ప్రత్యేక పోస్టర్ను అధికారులు విడుదల చేశారు. ‘ఈ పండుగ వేళ శుభ్రతే మన భద్రత’, ‘కరోనాఖేల్ ఖతం చేద్దాం.. ప్రతీ ఇంటా సంబురాలు షురూ చేద్దాం’ వంటి నినాదాలను పోస్టర్లపై ముద్రిం చారు. ఇంకో పోస్టర్లో ‘మీలో ఎవరు మాస్క్ మహారాజు?’ అంటూ తీర్చిదిద్దారు. ‘మాస్క్ మహారాజు ఎప్పుడూ సరిగ్గా మాస్క్ వేసుకుంటడు’, ‘చేతులు సబ్బుతో మంచిగా శుభ్రం చేసుకుంటడు’, ‘గుంపులల్ల దూరడు... ఆరడుగుల దూరం పాటిస్తడు’, ఇవన్నీ మీరు చేస్తుం టే మీరే మాస్క్ మహారాజు..అంటూ ఆకట్టుకొనే రీతిలో కార్టూన్లు ప్రదర్శించారు. మరో పోస్టర్లో ‘కరోనా’సురునిపై సంధించిన 3 బాణాలు చూపి స్తూ ‘కరో నా’సురుడిని అంతమొందించా లని చూపించారు. బతుకమ్మ పాటలతో రేడియో జింగిల్స్ను తయారు చేశారు. పండుగలు ఏటా వస్తాయి.. ప్రాణాలు పోతే తిరిగిరావు ‘పండుగలు ఏటా వస్తాయి, ప్రాణాలు పోతే తిరిగిరావు’అని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ప్రజలను హెచ్చరించారు. ఈ ఒక్కసారికి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన వైద్యవిద్యా సంచాలకులు డాక్టర్ రమేశ్రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. కేరళలో ఓనం పండగ తర్వాత కరోనా కేసులు భారీగా పెరిగిన విషయాన్ని శ్రీనివాసరావు గుర్తు చేశారు. వర్షాలు, వరదల కారణంగా రోగాలు ముసిరే ప్రమాదం ఉన్నందున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీనివాసరావు ప్రజలను కోరారు. -
పార్కుల్లో సీసీటీవీలు..
సాక్షి, హైదరాబాద్: వినోదపు పార్కులు, ఫుడ్కోర్టుల్లో సీసీటీవీలు ఏర్పాటుచేసి సందర్శకులు గుంపుగా ఒకేచోటకు చేరకుండా పర్యవేక్షించాలని కేంద్ర ప్రభు త్వం ఆదేశించింది. కరోనా కంటైన్మెంట్ ఏరియాల్లో వినోదపు పార్కులు తెరవ కూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. కరోనా వ్యాప్తి జరగకుండా వినోదపు పార్కుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. వినోద కేంద్రాలకు, పార్కుల్లోకి సందర్శకులు విశ్రాంతి, వినోదం కోసం పెద్దసంఖ్యలో వస్తారు. కాబట్టి కరోనా నివారణ చర్యలు పాటించడం చాలా ముఖ్యమని నొక్కిచెప్పింది. ఇవీ మార్గదర్శకాలు ► కనీసం ఆరడుగుల భౌతికదూరం పాటించాలి. మాస్క్ తప్పనిసరి. చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవాలి. లేకుంటే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లను వాడాలి. ఉమ్మివేయడం నిషేధం. ►65 ఏళ్లు పైబడిన, తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నవారు, గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు ఇంట్లోనే ఉండాలి. ►పార్కుల్లో పనిచేసే వారిలో అనారోగ్యంతో ఉన్నవారు, వయసు పైబడిన, గర్భిణులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేకుండా విధులు నిర్వహించాలి. ► ఫుడ్కోర్టులు ఇతర చోట్ల రద్దీని గుర్తించడానికి íసీసీటీవీలతో పర్యవేక్షించాలి. ► ప్రాంగణం లోపల, వెలుపల భౌతికదూరాన్ని పాటించేలా నేలపై నిర్ధిష్ట గుర్తులుపెట్టాలి. ప్రాంగణం లోపల, వెలుపల క్యూ పాటించాలి. క్యూ, భౌతికదూరం పర్యవేక్షణకు తగినంత మంది సిబ్బందిని నియమించాలి. ► ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం కంటే ఎక్కువ సీటింగ్ సామర్థ్యం అనుమతించకూడదు. ఫుడ్కోర్టు సిబ్బంది లేదా వెయిటర్లు మాస్క్లు, గ్లోవ్స్ ధరించాలి. ► మ్యూజియంలు, ఉద్యానవనాలు, ఫుడ్ కోర్టులు, థియేటర్లు మొదలైన వాటితో పాటు డోర్ హ్యాండిల్స్, ఎలివేటర్ బటన్లు, కుర్చీలు, బెంచీలు, అంతస్తులు, గోడలు మొదలైనవాటిని సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రపరచాలి. ► వాష్రూమ్లలో సబ్బు, ఇతర సాధారణ ప్రాంతాల్లో హ్యాండ్ శానిటైజర్లను తగినంత పరిమాణంలో ఉంచాలి. మాస్క్లు, శానిటైజర్లు, సబ్బులు, సోడియం హైపోక్లోరైట్ ద్రావణం, ఇతరత్రా లాజిస్టిక్స్ను అందుబాటులో ఉంచుకోవాలి. ► సందర్శకులు, ఉద్యోగులు ఉపయోగించిన మాస్క్లను ప్రత్యేక కవర్ డబ్బాలలో పారవేసేలా ఏర్పాట్లు చేయాలి. ►స్విమ్మింగ్పూల్స్ను మూసివేయాలి. నీటితో కూడిన వినోదం అందించే పార్కుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటిచోట్ల నీటి వడపోత, క్లోరినేషన్ తప్పనిసరి. ►రద్దీ ఎక్కువుండే వారాంతం, సెలవు రోజుల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ►ఆన్లైన్ టిక్కెట్ సదుపాయాన్ని ప్రోత్సహించాలి. టికెట్లు జారీ చేసేటప్పుడు చేయవలసిన, చేయకూడని సూచనలతో కూడిన కరపత్రాలు పంచాలి. లేదా టికెటట్లపైనే వాటిని ముద్రించవచ్చు. ►సహజ వెలుతురు ఉండాలి. క్రాస్ వెంటిలేషన్ తగినంతగా ఉండాలి. ►ఎవరైనా కోవిడ్ లక్షణాలతో బాధపడుతుంటే పార్కును సందర్శించవద్దని తెలపాలి. కంటైన్మెంట్ జోన్లలో ఉండే వారికి ప్రవేశం లేదు. ► కోవిడ్ హెల్ప్లైన్ నంబర్లను, స్థానిక ఆరోగ్య అధికారుల ఫోన్ నంబర్లను ప్రదర్శించాలి. ►ప్రవేశద్వారం వద్ద శానిటైజర్ డిస్పెన్సర్, థర్మల్ స్క్రీనింగ్ తప్పక ఏర్పాటుచేయాలి. ఎగ్జిట్ మార్గాల కోసం వీలైనన్ని గేట్లు ఏర్పాటు చేయాలి. ►వాలెట్ పార్కింగ్ అందుబాటులో ఉంటే మాస్క్లు ధరించిన ఆపరేటింగ్ సిబ్బందితో పనిచేయించాలి. వాహనాల స్టీరింగ్, డోర్ హ్యాండిల్స్, కీలు మొదలైన వాటిని శుభ్రపరచాలి. ►పార్క్ ప్రాంగణంలో కుర్చీలు, బెంచీలు మొదలైన వాటి మధ్య ఆరడుగుల దూరం ఉండాలి. ► కాంటాక్ట్లెస్ ఆర్డరింగ్ మోడ్, డిజిటల్ మోడ్ చెల్లింపులను ప్రోత్సహించాలి. -
‘కో ఇన్ఫెక్షన్’పై జర జాగ్రత్త!
న్యూఢిల్లీ: ప్రస్తుతం కోవిడ్తో పాటు ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఈ ‘కో ఇన్ఫెక్షన్’ను ఎదుర్కొనే దిశగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ సీజన్లో మలేరియా, డెంగ్యూ, చికన్ గున్యా, హెచ్1ఎన్1, స్క్రబ్ టైఫస్ తదితర వ్యాధులు ప్రబలే అవకాశముందని, అందువల్ల కరోనాతో పాటు, అవసరమైన చోట, ఆయా వ్యాధుల నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని సూచించింది. సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే ప్రాంతాల్లో ఈ కో ఇన్ఫెక్షన్పై అప్రమత్తతతో వ్యవహరించాలని పేర్కొంది. కోవిడ్ సోకిన వారిలో ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో నిర్ధారించాలని సూచించింది. కోవిడ్ లక్షణాలు, ఇతర సీజనల్ వ్యాధుల లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయని, అందువల్ల వ్యాధి నిర్ధారణలో అప్రమత్తంగా ఉండాలంది. కో ఇన్ఫెక్షన్ ఉన్న సందర్భాల్లో వ్యాధి నిర్ధారణలో తప్పుడు (ఫాల్స్ నెగటివ్/ఫాల్స్ పాజిటివ్) ఫలితం వచ్చే అవకాశముందని హెచ్చరించింది. (చదవండి: కోవిడ్-19 : మృతుల్లో 45 శాతం వారే!) -
పాఠశాలలకు కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు
సాక్షి, న్యూఢిల్లీ : పాఠశాలల పునఃప్రారంభానికి వీలుగా కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలను జారీచేసింది. కేంద్ర హోం శాఖ సెప్టెంబర్ 30న జారీచేసిన అన్లాక్–5 మార్గదర్శకాలను అనుసరించి కేంద్ర విద్యా శాఖ ఈ మార్గదర్శకాలను జారీచేసింది. దశల వారీగా పాఠశాలల పునఃప్రారంభానికి వీలుగా అక్టోబర్ 15 తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని నాటి మార్గదర్శకాల్లో హోం శాఖ స్వేచ్ఛనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆరోగ్యం, భద్రత అంశాలకు సంబంధించి మొదటి భాగం, భౌతిక దూరం పాటిస్తూ అభ్యాసం, బోధన కొనసాగించే అంశాలపై రెండో భాగంలో విద్యా శాఖ సోమవారం మార్గదర్శకాలు జారీచేసింది. ఒకటో భాగంలోని మార్గదర్శకాలను స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ అమలు చేయాలని కోరింది. బోధనకు సంబంధించిన రెండో భాగం మార్గదర్శకాలు కేవలం సూచనతో కూడినవని, వాటిని అనుసరించవచ్చని లేదా ప్రత్యేక మార్గదర్శకాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తయారుచేసుకోవచ్చని పేర్కొంది. తల్లిదండ్రుల సమ్మతితో విద్యార్థులు తాము ఇంటి నుంచే చదువు కుంటామంటే అందుకు అనుమతించాలని సూచించింది. బడి పునఃప్రారంభమైన తర్వాత 2–3 వారాల వరకు ఎలాంటి అసెస్మెంట్ చేయకూడదని, ఆన్లైన్ లెర్నింగ్, ఐసీటీ విధానాలను ప్రోత్సహించే విధానాలను కొనసాగించాలని సూచించింది. ఆరోగ్యం, భద్రతకు సంబంధించి మార్గదర్శకాలు ఇలా.. ► పాఠశాలలోని ఫర్నిచర్, పరికరాలు, స్టేషనరీ, స్టోర్ రూమ్లు, నీటి ట్యాంకులు, వంట గదులు, క్యాంటీన్, మరుగుదొడ్లు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు తదితర అన్ని ప్రాంతాలను పూర్తిగా శుభ్రపరచడమే కాకుండా డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. లోపలి ప్రాంతంలోకి గాలి ధారాళంగా వచ్చేలా చూడాలి. ► పాఠశాలలు టాస్క్ టీమ్లను ఏర్పాటు చేయాలి. అత్యవసర సహాయం అందించే టీమ్, జనరల్ సపోర్ట్ టీమ్, రవాణా మద్దతు బృందం, పారిశుద్ధ్య తనిఖీ బృందం వంటి వాటిని ఏర్పరచి వాటికి బాధ్యతలు అప్పగించాలి. ► రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసే మార్గదర్శకాలను అనుసరించి పాఠశాలలు ప్రామాణిక నియమావళిని రూపొందించుకునేలా ప్రోత్సహించాలి. భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు, తల్లిదండ్రులకు ఎప్పటికప్పడు సమాచారం ఇచ్చే వ్యవస్థ వంటి వాటిని ఈ నియమావళిలో చేర్చాలి. ► విద్యార్థులకు సీట్లు కేటాయించేటప్పుడు భౌతిక దూరం ఉండేలా చూడాలి. వేడుకలు, ఈవెంట్లు జరపరాదు. విద్యార్థులు అందరూ ఒకేసారి చేరేలా, పాఠశాల విడిచేలా టైమ్ టేబుల్స్ ఉండరాదు. ► పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఫేస్మాస్క్ లేదా ఫేస్ కవర్తో పాఠశాలకు వచ్చేలా చూడాలి. తరగతి గదుల్లో అయినా, మెస్లో అయినా, లైబ్రరీలో అయినా మాస్క్లు ధరించే ఉండాలి. ► భౌతిక దూరం పాటించేందుకు వీలుగా మార్కింగ్స్ చేయాలి. విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యే ముందు రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రుల సమ్మతి తీసుకోవాలి. విద్యార్థులు ఇంటి నుంచే క్లాసులు వింటామని చెబితే అందుకు అనుమతించాలి. ► కోవిడ్ సవాళ్లపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి అవగాహన కల్పించాలి. ► విద్యార్థులందరికీ టెక్ట్స్బుక్స్ అందేలా చూడడమే కాకుండా, అకడమిక్ కాలెండర్ మార్పులకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా సెలవులు, పరీ క్షలకు సంబంధించి ఈ ప్రణాళిక తప్పనిసరి. ► ఒక పూర్తిస్థాయి శిక్షణ పొందిన హెల్త్ కేర్ అటెండెంట్ లేదా నర్స్ లేదా డాక్టర్, కౌన్సిలర్ పాఠశాలకు అందుబాటులో ఉండేలా చూడాలి. ► పాఠశాలలో విద్యార్థులు సహా అందరి ఆరోగ్య స్థితిగతులపై సమాచారాన్ని సేకరించాలి. అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య సేవలు పొందేందుకు వీలుగా ప్రభుత్వ యంత్రాం గానికి చెందిన ఫోన్నెంబర్లు, కోవిడ్ సెంటర్ వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి. ► హాజరు, సిక్ లీవ్స్ విధానంలో అనువైన మార్పులు చేసుకుని విద్యార్థులు, సిబ్బంది అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ► కోవిడ్–19 సందేహాత్మక కేసులు ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రొటోకాల్ను అనుసరించాలి. ► ఇల్లు లేని విద్యార్థులు, వలస కార్మికుల పిల్లలు, దివ్యాంగులు, కోవిడ్–19 ప్రభావిత విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి. వారి అవసరాలు గుర్తించి సాయంచేయాలి. ► పౌష్ఠికాహార అవసరాలు గుర్తించి వారి వ్యాధి నిరోధకత పెంపునకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజనం వేడివేడిగా అందేలా చూడాలి. పాఠశాల మూసి ఉన్న సమయాల్లో, లేదా వేసవి సెలవుల్లో తత్సమాన ఆహార భద్రత భృతి చెల్లించాలి. -
నేటి నుంచి బార్లు, రెస్టారెంట్లు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ప్రారంభమవుతున్నాయి. ఇటీవల ప్రకటించినట్టుగానే బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచేందుకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి కస్టమర్కు ప్రవేశం ద్వారం వద్దనే థర్మల్ స్క్రీనింగ్ చేయాలని ఆదేశించింది. కస్టమర్లకు సేవలందించే సమయంలో భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. ఇక డబ్బులు చెల్లించేందుకు అత్యధికంగా డిజిటల్ పద్దతిని వినియోగించాలని సూచించింది. మాస్క్లు లేకుండా ఎవరిని లోపలికి అనుమతించకూడదని, కేవలం అహార పదార్థాలు సేవించే సమయంలో మాస్కులు విప్పేందుకు అనుమతి ఉంటుందని మార్గదర్శకాల్లో పేర్కొంది. కాగా, కస్టమర్లు వీలైతే మాస్కులతోపాటు గ్లౌస్లు, ఇన్స్టంట్ హ్యాండ్ వాష్లు వెంట తెచ్చుకోవాలని సూచించాలి. అన్లాక్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 50 శాతం సామర్థ్యంతో హోటళ్లు. బార్లు, రెస్టారెంట్లు తెరవాలన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గత ఆరు నెలలుగా లాక్డౌన్ కారణంగా మూసి ఉంచిన బార్లు, రెస్టారెంట్లు సోమవారం నుంచి కిటకిటలాడనున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు.. * కస్టమర్లు వస్తే హోటళ్లు, బార్లు, రెస్టారెంట్ల సిబ్బంది ద్వారాలు తెరవాలి * లక్షణాలు లేని వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి. * కస్టమర్ల పేర్లు నమోదు చేయాలి. * అదేవిధంగా ప్రతి కస్టమర్కు శానిటైజర్ను అందుబాటులో ఉంచాలి. * డబ్బులు తీసుకునే వ్యక్తి తరచూ శానిటైజర్ వినియోగించాలి. * శౌచాలయాలు, హ్యాండ్ వాష్ చేసుకునే స్థలాలను తరచూ పరిశీలించి అక్కడ పరిశుభ్రత ఉండేలా చూడాలి. * సిబ్బందితోపాటు కస్టమర్ల మధ్య వీలైనంత తక్కువగా సంప్రదింపులు ఉండేలా చూడాలి. * సీసీటీవీ కెమెరా పని చేస్తూ ఉండాలి. * సీట్ల సంఖ్య కంటే అధిక కస్టమర్లను అనుమతించకూడదు.. * రెండు టేబుళ్ల మధ్య సురక్షితమైన దూరం ఉండేలా చూడాలి. * టేబుళ్లు, కిచెన్ను నిత్యం పరిశుభ్రం చేయాలి. * సిబ్బంది (కార్మికులు)కి టైమ్ టు టైమ్ వైద్య/ కరోనా పరీక్షలు చేయించాలి. అవసరమైతే కరోనా హెల్ప్లైన్ కేంద్రాన్ని సంప్రదించాలి. * కూర్చునే ముందు టేబుళ్లపై మెనూ కార్డు, టేబుల్ టవల్ ఇతర వస్తువులేవి ఉండకూడదు. బట్ట (వస్త్రం) నాప్కిన్కు బదులుగా యూజ్ అండ్ త్రో (డిస్పోజల్) వస్త్రాన్ని వినియోగించాలి. * క్యూఆర్ కోడ్ మాదిరిగా మెనూ కార్డు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నించాలి. * సోషల్ డిస్టేన్స్ ఉంచేందుకుగాను భూమిపై కూడా మార్క్లు (గీతలు) చేయాలి. * వీలైతే ఏసీ వినియోగం వద్దు. అవసరమనిపిస్తే ఏసీని తరచూ శుభ్రపరచాలి. * వీలైనంతవరకు వండిన వస్తువుల వివరాలే మెనూ కార్డులో ఉంచాలి. ఒక టేబుల్పై ఒకే కుటుంబం లేదా ఒక సమూహానికి చెందిన వారినే కూర్చునేందుకు అనుమతించాలి. ఇతరులను అనుమతించకూడదు. -
అన్లాక్ 4.0: ఏపీ సర్కార్ మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్లాక్ 4.0 మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 30 వరకు విద్యాసంస్థల బంద్ కానున్నాయి. సెప్టెంబర్ 21 నుండి తొమ్మిదో తరగతి, టెన్త్, ఇంటర్ విద్యార్థులు పాఠశాలలు, కళాశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వగా, ఇందుకు తల్లిదండ్రుల రాత పూర్వక అంగీకారం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు 21 నుండి అనుమతి ఇచ్చారు. పీహెచ్డీ, పీజీ విద్యార్థులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. (చదవండి: విశాఖలో సినిమా షూటింగ్ల జోష్..) ►సెప్టెంబర్ 20 నుండి పెళ్లిలకు 50 మంది అతిథులతో అనుమతి ►అంతక్రియలకు 20 మందికి అనుమతి ►సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్లకు అనుమతి నిరాకరణ ►సెప్టెంబర్ 21 నుండి ఓపెన్ ఏర్ థియేటర్స్ కు అనుమతి (చదవండి: 8న సినీ ప్రముఖులతో కేంద్రం భేటీ) -
ఒక్కో రైలులో 300 మందే..
అమీర్పేట: లాక్డౌన్ తరువాత హైదరాబాద్లో దశలవారీగా మెట్రోరైల్ సర్వీసులను పునఃప్రారంభిస్తున్నామని మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. శనివారం అమీర్పేట మెట్రోస్టేషన్లో ఎల్అండ్టీ సంస్థ సీఈఓ కేబీఎన్రెడ్డితో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి దశలో కారిడార్ 1 మియాపూర్, ఎల్బీనగర్ మార్గంలో ఈ నెల 7 నుంచి మెట్రోరైల్ అందుబాటులోకి రానుందని చెప్పారు. రెండో దశలో కారిడార్ 3 నాగోల్, రాయదుర్గ్ మార్గంలో, 8వ తేదీ, 9వ తేదీల్లో కారిడార్ 2తో పాటు అన్ని ఇతర మార్గాల్లో సర్వీసులు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. అన్లాక్ – 4 నిబంధనలు పాటిస్తూ సర్వీసులను నడిపిస్తామన్నారు. మెట్రోరైళ్లతో పాటు స్టేషన్ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రయాణికులు కోవిడ్–19 నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని సూచించారు. చేతి మణికట్టు వద్ద థర్మల్ స్క్రీనింగ్, చేతులను శానిటైజ్ చేశాకే లోపలికి అనుమతిస్తామన్న ఆయన.. ప్రయాణికులు తప్పని సరిగా మాస్కులు ధరించాలని, ఒకవేళ మరచిపోయి వస్తే స్టేషన్లలో మాస్కులు కొనుక్కుని ధరించాలని, ప్రతిచోట భౌతికదూరం పాటించాలని వివరించారు. టెంపరేచర్ ఉంటే వెనక్కి పంపిస్తామని, అలాగే మెటల్ వస్తువులు వెంట తీసుకురాకూడదని స్పష్టంచేశారు. రైల్లో 75 శాతం తాజా గాలి ఉండేలా టెర్మినల్స్ వద్ద రైళ్ల డోర్స్ను ఎక్కువ సమయం తెరిచి ఉంచుతామని చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతి 5 నిమిషాలకు ఒక రైలును నడిపిస్తామని, ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసులు పెంచుతామని పేర్కొన్నారు. గతంలో ఒక్కో రైలులో 1,000 మంది ప్రయాణించే వారని, కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రస్తుతం 300 మంది వరకు మాత్రమే ప్రయాణించడానికి అవకాశముందని తెలిపారు. స్మార్ట్కార్డుతో ప్రయాణాలు కాయిన్స్, కరెన్సీ వాడకం ద్వారా కరోనా వైరస్ వ్యాపించే అవకాశముందని మెట్రో అధికారులు తెలిపారు. అయితే ప్రయాణికులు ఇది వరకే కలిగి ఉన్న స్మార్ట్ కార్డు ద్వారా క్యూఆర్కోడ్ టికెటింగ్తో ప్రయాణాలు చేయవచ్చు. ప్రయాణం ముగిసిన ప్రతీసారి క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేయాలి. భౌతికదూరం పాటిస్తూ వెళ్లాల్సి ఉంటుంది. లిఫ్ట్లో కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతిస్తారు. కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించిన భరత్నగర్, మూసాపేట, యూసుఫ్గూడ, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్ స్టేషన్లలో రైలు ఆగదు. రైలులో క్రాస్ మార్కు పెట్టిన చోట కూర్చోకూడదు. మార్కు చేసిన ప్రాంతంలోనే నిలబడాల్సి ఉంటుంది. వైద్యం, అత్యవసర సేవల కోసం 7995999533 నంబర్ను సంప్రదించవచ్చని మెట్రో అధికారులు తెలిపారు. -
లిస్టులో కేసులున్న న్యాయవాదులకే ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 7(సోమవారం) నుంచి ప్రయోగాత్మకంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనంతోపాటు నలుగురు న్యాయమూర్తులు భౌతికంగా కేసులు విచారించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లిస్టులో కేసులు ఉన్న న్యాయవాదులు, పిటిషనర్లను మాత్రమే అనుమతించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయవాదులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మార్గదర్శకాలను రిజిస్ట్రార్ జనరల్ శుక్రవారం జారీచేశారు. ‘‘ఒక కేసుకు సంబంధించి పిటిషనర్ తరఫున ఒకరు, ప్రతివాది తరఫున ఒక న్యాయవాది మాత్రమే హాజరుకావాలి. కోర్టు హాల్లో మొత్తం న్యాయవాదులు, కేసులను నేరుగా వాదించుకునే (పార్టీ ఇన్ పర్సన్స్) వారి సంఖ్య ఆరుకు మించడానికి వీల్లేదు. కేసు విచారణ పూర్తవుతూనే ఈ కేసుకు సంబంధించిన న్యాయవాదులు హైకోర్టు ఆవరణ నుంచి వెళ్లిపోవాలి. జూనియర్ న్యాయవాదులు, న్యాయవాదుల క్లర్కులతోపాటు ఇతరులెవరికీ ప్రవేశం లేదు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వారెవరూ హైకోర్టు ఆవరణలోకి రావడానికి వీల్లేదు. న్యాయవాదులు సైతం తమ కేసు విచారణకు వచ్చే వరకూ వెయిటింగ్ హాల్స్ లేదా ఖాళీగా ఉన్న ఇతర కోర్టులో వేచి ఉండాలి. ఉదయం 7.30, 9.30 గంటలకు, సాయంత్రం 5 గంటల తర్వాత కోర్టు హాల్స్ను పూర్తిగా శానిటైజ్ చేస్తారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనంతోపాటు న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్రావు, జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ జి.శ్రీదేవి బెంచ్లు భౌతికంగా కేసులను విచారిస్తాయి. హైకోర్టు జారీచేసిన మార్గదర్శకాలతోపాటు కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి’’అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
దశల వారీగా మెట్రో జర్నీ
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఈనెల 7 నుంచి మెట్రో రైళ్లను దశలవారీగా తిరిగి ప్రారంభించనున్న నేపథ్యంలో అమలు చేయాల్సిన మార్గదర్శకాలను, రైళ్ల రాకపోకల షెడ్యూల్ను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం వెల్లడించింది. గురువారం రసూల్పురాలోని మెట్రోరైల్ భవన్లో నిర్వహించిన సుదీర్ఘ సమావేశం అనంతరం హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తాజా మార్గదర్శకాలను ప్రకటించారు. దశలవారీగా హైదరాబాద్లో మెట్రో రైళ్ల రాకపోకలను పెంచనున్నామని తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న ఐదు స్టేషన్లలో మెట్రో రైళ్లు నిలపబోమని స్పష్టంచేశారు. నగరంలోని గాంధీ ఆస్పత్రి, భరత్నగర్, మూసాపేట్, ముషీరాబాద్, యూసుఫ్గూడ స్టేషన్లలో మెట్రో రైలు ఆగదని.. ప్రయాణికులను స్టేషన్లలోకి అనుమతించబోరని వెల్లడించారు. సమావేశంలో ఎల్అండ్టీ మెట్రో రైల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనిల్కుమార్ సైనీ, డీవీఎస్ రాజు, దాస్ తదితరులు పాల్గొన్నారు. మార్గదర్శకాలివే.. ► ప్రతి 5 నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు రైళ్లను నడిపే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. ► స్టేషన్లు, బోగీల్లో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేందుకు ప్రత్యేకంగా వృత్తాకార మార్కింగ్లు అమర్చనున్నారు. బోగీల్లోనూ ప్రయాణికులు పక్కపక్క సీట్లలో కూర్చోకుండా ఏర్పాట్లు చేశారు. ► ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉందా లేదా అన్న విషయాన్ని సీసీటీవీలతో పాటు ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షించనున్నారు. ► మాస్క్లేని ప్రయాణికులను స్టేషన్లోనికి అనుమతించబోరు. మాస్క్లు విక్రయించేందుకు స్టేషన్లలో ఏర్పాట్లు చేయనున్నారు. ► మార్గదర్శకాలను అతిక్రమించిన వారికి జరిమానాలు విధిస్తారు. ► స్టేషన్లోకి ప్రవేశించే సమయంలోనే థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. ► ఆరోగ్య సేతు యాప్ని వినియోగించేలా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తారు. ► స్టేషన్లోనికి ప్రవేశించే ముందు శానిటైజర్ వినియోగించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ► భద్రత పరంగా మాక్డ్రిల్స్ను అవసరాన్ని బట్టి నిర్వహిస్తారు. ► మెట్రో సిబ్బందికి అవసరమైన మేర పీపీఈ కిట్లు, మాస్క్లు, శానిటైజర్లు సరఫరా చేస్తారు. ► స్మార్ట్మెట్రో కార్డ్, మొబైల్ క్యూఆర్ టికెట్లతో జర్నీ చేసేలా ప్రయాణికులను ప్రోత్సహించనున్నారు. ► ప్రయాణికులు స్వల్ప లగేజీ (మెటల్ కాకుండా)తో ప్రయాణించొచ్చు. శానిటైజర్ తెచ్చుకోవచ్చు. ► యథావిధిగా పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉంటాయి. ► ఆరోగ్యశాఖ, పోలీసు శాఖ సౌజన్యంతో మెట్రో స్టేషన్లు, పరిసరాల్లో రద్దీని క్రమబద్ధీకరిస్తారు. ఫేజ్–1 ఈనెల 7 నుంచి ప్రారంభమయ్యే మియాపూర్–ఎల్బీనగర్ (కారిడార్–1) రూట్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు మెట్రో రైళ్లు నడపనున్నారు. ఫేజ్–2 ఈ నెల 8 నుంచి ప్రారంభమయ్యే నాగోల్–రాయదుర్గం రూట్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు.. తిరిగి సాయంత్రం 4 నుంచి 9 రాత్రి గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. ఫేజ్–3 ఈ నెల 9వ తేదీ నుంచి జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో సేవలు ప్రారంభమవుతాయి. అయితే మొత్తం మూడు రూట్లలోనూ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. -
ఆన్లైన్ పాఠం అర్థమయ్యేనా?
కరోనా నేపథ్యంలో స్కూళ్లు తెరిచే అవకాశం లేకపోవడంతో విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం టీ శాట్ యాప్ ద్వారా డిజిటల్ తరగతులను నిర్వహించడంతో పాటు టీవీలోనూ తరగతులను కొనసాగించనున్నారు. అలాగే డీడీ యాదగిరి చానల్లోనూ నిర్దేశించిన సమయంలో వివిధ తరగతుల విద్యార్థులకు పాఠాలను బోధించనున్నారు. డిజిటల్, ఆన్లైన్ తరగతులకు సంబంధించి విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. సాక్షి, నిజామాబాద్: కరోనా మహమ్మారితో తరగతుల నిర్వహణ సాధ్యం కాని వేళ ప్రభుత్వం నేటి నుంచి విద్యార్థులకు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్లైన్ తరగతులను నిర్వహించబోతుంది. గతంలోనే అనుమతి లేనప్పటికీ కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలే ఆన్లైన్లో తరగతులను నిర్వహించాయి. ఈ విధానంలో బోధన అర్థం కావడం లేదని ఎక్కువశాతం మంది విద్యార్థులు చెబుతున్న వేళ ప్రభుత్వం ఆన్లైన్ తరగతుల వేపే మొగ్గు చూపింది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు అర్థం కావడం కష్టంగా మారనుంది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. టీ షాట్ చానల్ ద్వారా ఆన్లైన్ బోధనను ఎంత మంది విద్యార్థులు ఆసక్తిగా వింటారని, గత మార్చి నుంచి ఇప్పటి వరకు విద్యకు దూరమైనవారు ఇప్పుడు టీవీలో ప్రసారమయ్యే ఆన్లైన్ తరగతలు వినే పరిస్థితి ఉందని పలువురు ప్రశ్నిస్తున్నారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు ఎక్కువగా వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి వచ్చినవారే ఉంటారు. ఉదయమే తల్లిదండ్రులు పొలంబాట పట్టడంతో విద్యార్థులు ఆన్లైన్ పాఠాలను వినే పరిస్థితి ఉండదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రతి ఏడాది జూన్లో తరగతులు ప్రారంభమై విద్యార్థులు, ఉపాధ్యాయులు సిబ్బందితో పాఠశాలలు కళకళలాడుతూ ఉండేవి. ఈ ఏడాది కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న నేపథ్యంలో పాఠశాలలు పునఃప్రారంభానికి నోచుకోలేదు. 10,700 మంది పిల్లల ఇంట్లో టీవీలు, సెల్ఫోన్లు లేవు ప్రభుత్వం టీ శాట్ ద్వారా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్లైన్ తరగతుల నిర్వహణలో ముఖ్యంగా నిరుపేద విద్యార్థులకు ఇబ్బందిగా మారనుంది. ఇంట్లో టీవీ లేకపోవడంతో ఇతర విద్యార్థులపై ఆధారపడాల్సి వస్తుంది. ముఖ్యంగా తండాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. టీవీలు లేని కుటుంబాలు జిల్లాలో ఎన్నో ఉన్నాయి. ప్రతి కుటుంబంలో ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నప్పటికీ టీవీలు లేని ఇళ్ల చాలానే ఉన్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 10,700 మంది పిల్లలకు ఇళ్లల్లో టీవీలు, సెల్ఫోన్లు లేవని ఇటీవల విద్యాశాఖ నిర్వహించిన సర్వేలోనే తేలింది. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి జిల్లాలో 1,459 ప్రాథమిక పాఠశాలలు, 271 ప్రాథమికోన్నత పాఠశాలలు, 432 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధులకు హాజరవుతున్నారు. వారం రోజుల పాటు పునశ్చరణ తరగతులు ఆన్లైన్ తరగతులు ఆరంభిస్తున్న తరుణంలో వారం రోజుల పాటు విద్యార్థులకు పాత తరగతులకు సంబంధించి పాఠ్యాంశాలపై పునశ్చరణ తరగతులను నిర్వహించనున్నారు. మార్చిలో పూర్తి స్థాయిలో పాఠ్యాంశాలు ముగిసిపోక ముందే పాఠశాలలు మూసి వేశారు. అందువల్ల పాత తరగతులకు సంబంధించిన కొన్ని పాఠ్యాంశాల పునశ్చరణ తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తుంది. టీ శాట్ ద్వారా అందించే బోధనను తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టి వినేలా చూడాలి. సందేహాలు వస్తే వెంటనే ఉపాధ్యాయుడికి ఫోన్ ద్వారా నివృతి చేసుకోవాలి. –రాజు, డీఈవో, కామారెడ్డి ప్రతి విద్యార్థి డిజిటల్ పాఠాలు వినాలి ప్రతి తరగతి విద్యార్థి డిజిటల్ పాఠాలను కచ్చితంగా వినాల్సి ఉంది. డిజిటల్, ఆన్లైన్ తరగతులకు విద్యార్థులు హజరై హోం వర్క్ను పూర్తి చేయాలి. ఇప్పటికే అందరు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణి చేశాం. బడులకు విద్యార్థులు రాలేకున్నా డిజిటల్, ఆన్లైన్ తరగతులకు హజరు కావాల్సిందే. – ఆంధ్రయ్య, ఎంఈవో, మోర్తాడ్ టీవీ, ఫోన్ లేదు మా ఇంట్లో ఫోన్ లేదు, టీవీ లేదు. అమ్మ, నాన్న కూలీ పనులు చేసి మమ్మల్ని పోషిస్తున్నారు. పక్కింట్లో టీవీ చూసి పాఠాలు వినమంటుండ్రు. కరోనా భయంతో ఎక్కడివి వెళ్లే పరిస్థితి లేదు. - మహేందర్, తొమ్మిదో తరగతి, సింగితం ఉన్నత పాఠశాల -
కేంద్రంపై మాయావతి ప్రశంసలు
లక్నో : అన్లాక్-4లో భాగంగా కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను బీఎస్పీ అధినేత్రి మాయావతి స్వాగతించారు. ఇవి రాజకీయ పార్టీలు, వ్యక్తులకు అతీతంగా ప్రజలందరికీ సర్వజన సమ్మతంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. 'కోవిడ్19 పోరులో భాగంగా అన్లాక్కు సంబంధించి కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు ఏకీకృతంగా ఉన్నాయి. వాటిని స్వాగతిస్తున్నాం. బీఎస్పీ చాన్నాళ్లుగా ఈ డిమాండే చేస్తోంది. కరోనా ముసుగులో రాజకీయాలు చేయడం తగదని మేం ఎప్పటి నుంచో చెబుతున్నాం. కేంద్రం తాజాగా విడుదల చేసిన గైడ్లైన్స్ చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. దీని వల్ల ప్రజలకు మరిన్ని సౌకర్యాలు సైతం అందుతాయి' అంటూ మాయావతి పేర్కొన్నారు. (అందరూ స్వదేశీ యాప్లను వాడాలి: మోదీ) కంటైన్మెంట్ జోన్ల వెలుపల మరిన్ని కార్య కలాపాల పునరుద్ధరణకు వీలుగా కేంద్ర హోం శాఖ అన్లాక్–4 మార్గదర్శకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా పలు నగరాలకు ప్రాణాధారంగా మారిన మెట్రో రైళ్లు ఎట్టకేలకు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి దశలవారీగా మెట్రో రైళ్లను నడపడానికి కేంద్రం అనుమతించింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు మాత్రం సెప్టెంబర్ 30వ తేదీ దాకా మూసే ఉంటాయని ప్రకటించింది. విద్యా సంస్థలపై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను స్వల్పంగా సడలించింది. సెప్టెంబర్ 21 నుంచి 50 శాతం మించకుండా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది హాజరుకావొచ్చని, 9 నుంచి 12 తరగతుల మధ్య విద్యార్థులు స్వచ్ఛందంగా గైడెన్స్ కోసం హాజరుకావొచ్చని పేర్కొంది. (అన్లాక్ 4: 7 నుంచి మెట్రో..) -
అన్లాక్ 4.0 : మెట్రోకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కారణంగా విధించిన లాన్డౌన్ నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం అన్లాక్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో పలు కీలక రంగాలకు ఆంక్షల నుంచి సడలింపులు కల్పించింది. కేంద్రం తాజాగా ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. సెప్టెంబర్ 7 నుంచి దేశ వ్యాప్తంగా మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. దశల వారిగా మెట్రో సేవల ప్రారంభానికి కేంద్రం అనుమతినిచ్చింది. అలాగే సెప్టెంబర్ 30 వరకు పాఠశాలు, మాల్స్ తెరవకూడదని కేంద్రం పేర్కొంది. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం మరికొన్నాళ్ల పాటు కొనసాగిస్తామని మార్గదర్శకాల్లో పేర్కొంది. అన్లాక్ 4.0 గైడ్లైన్స్ .... సెప్టెంబర్ 7 నుంచి మెట్రోరైళ్లకు అనుమతి సెప్టెంబర్ 30 వరకు స్కూళ్లు, మాల్స్ బంద్ సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ బంద్ 100 మందికి మించకుండా స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, రాజకీయ సమావేశాలకు అనుమతి సభలు నిర్వహించే సమయంలో భౌతికదూరం, మాస్క్, శానిటైజర్ తప్పనిసరి సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి అంతరాష్ట్ర ప్రయాణాలకు నిబంధనలను తొలగింపు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలన్న కేంద్రం అత్యవసరమైతేనే బయటకు రావాలి సెప్టెంబర్ 30 వరకు కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగింపు -
కరోనా నియంత్రణ కష్టమేం కాదు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘1918–21 వరకు మూడేళ్ల వ్యవధిలో స్వైన్ ఫ్లూతో ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల (5 కోట్ల) మంది చనిపోయారు. 2010లోనూ అదే జాతికి చెందిన (బలహీనమైన) వైరస్ మన రాష్ట్రంపై దాడి చేసింది. కానీ అప్పటికే మందు అందుబాటులో ఉండటంతో ప్రాణనష్టం అంతగా జరగలేదు. ఇప్పుడు కోవిడ్–19 ప్రపంచంలో మరణ మృదంగం మోగిస్తోంది. కానీ 1918–21 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మన వద్ద మంచి వైద్యం అందుబాటులో ఉంది. ప్రజల్లో అవగాహన, చైతన్యం ఉంది. వైద్యులు సూచించిన మేరకు సలహాలు, సూచనలు పాటిస్తే కరోనాను నియంత్రించడం కష్టమేమీ కాదు. సరైన ఆహారం, కంటి నిండా నిద్ర, వ్యాయామం ఉంటే చాలు’అని షికాగోలోని ఇలినాయి హెల్త్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ ఎల్దండి స్పష్టంచేశారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శించిన ఆయన అందులో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కరోనా చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన, శిక్షణ ఇచ్చారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. అనవసర మందులు వాడితే ప్రాణాలకు ముప్పు.. కరోనా పాజిటివ్ అని తేలగానే బాధితులు భయాందోళనకు గురవుతున్నారు. కొందరు ఆస్పత్రుల్లో చేరితే చాలా మంది ఇళ్లలోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కరోనాపై ఎలాంటి అవగాహన లేని వైద్యులు చెప్పిన మందులు వాడుతున్నారు. ఇది మంచిది కాదు. అనుభవజ్ఞులైన వైద్యుల సలహాలు, సూచనలతోనే మందులు వాడాలి. పలు ఆస్పత్రుల్లోనయితే వైద్యులు కరోనా రోగులకు యాంటిబయోటిక్స్ ఇస్తున్నారు. ఎక్కువ మోతాదులో యాంటిబయోటిక్స్ ఇస్తే ప్రాణాలు పోతాయి. అసలు కరోనా ఉన్న వారికి ఇవి అనవసరమనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ప్రస్తుతం డెక్సామెతసోన్ మాత్రతోనే వైరస్ను కాస్త కట్టడి చేయగలం. అమెరికాలో ఇది నిర్ధారణ అయింది. ఈ మాత్ర మార్కెట్లో రూ.5 లోపే ఉంటుంది. ఇలాంటి నిరూపితమైన మందులు మన దగ్గర వాడటం లేదు. కానీ రూ.32 వేల ఖరీదు చేసే నిరూపితం కాని యాంటి వైరల్ డ్రగ్స్ వాడుతున్నారు. ఈ విషయంలో పలు ఆస్పత్రులు తమ తీరు మార్చుకోవాలి. ఈ వ్యవహారంపై ప్రభుత్వమూ దృష్టి సారించాలి. వైరస్ మళ్లీ మళ్లీ రావొచ్చు.. కరోనా చికిత్స పొందిన వ్యక్తికి మళ్లీ మళ్లీ ఆ వైరస్ సోకవచ్చు. సాధారణంగా వైరస్ సోకిన ఐదారు రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి. కొందరికి ఆ లక్షణాలూ ఉండవు. ఒకసారి నిర్ధారణ అయి చికిత్స పొందిన తర్వాత వైరస్ వెళ్లిపోతుంది. అయితే వైరస్ మూలాలు శరీరంలో అలానే ఉంటాయి. సదరు వ్యక్తి సరైన జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ మళ్లీ సోకే ప్రమాదం లేకపోలేదు. ప్రత్యేక ఆహారమనేది లేదు... కరోనా రోగులు మాంసం, చేపలు, గుడ్లు వంటి బలమైన ఆహారం ఎక్కువగా తీసుకోవాలని చాలా మంది అంటుంటే విన్నా. అయితే వైరస్ను తట్టుకోగలిగే వ్యాధి నిరోధక శక్తి మన శరీరంలో ముందే ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవడం, కంటి నిండా నిద్ర, వ్యాయామం చేస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మృతదేహం నుంచి వైరస్ సోకదు... కరోనాతో చనిపోయిన వ్యక్తి నుంచి వైరస్ సోకుతుందనే భయంతో మృతుడి కుటుంబీకులు, బంధువులు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకూ ఇష్టపడటం లేదు. సహజంగా కరోనా వ్యక్తి ఊపిరి తీసుకున్నప్పుడు గాలి ద్వారా లేదా అతని శరీరాన్ని ముట్టుకుంటే వైరస్ ఇతరులకు సోకుతుంది. చనిపోయిన తర్వాత అతను ఊపిరి తీసుకోలేడు, అతన్ని ముట్టుకునే అవకాశం ఉండదు. పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు చేయ వచ్చు. ప్రజలు తరచూ శానిటైజ్డ్ అవుతూ ఉండాలి. సబ్బు, నీళ్లను మించిన శానిటైజర్ ప్రపంచంలో ఏదీ లేదు. మాస్కులు సాధారణ బట్టతో చేసినవే మేలు. అది ఆందోళన కలిగించేదే... కరోనా బాధితుడికి ప్లాస్మా ఎక్కిస్తే ప్రయోజనం ఉంటుందని కొందరు వైద్యులు నమ్ముతున్నారు. ఇది వాస్తవం కాదు. బాధితుడి శరీరంలోకి ప్లాస్మా ఎక్కిస్తే రియాక్షన్ అయ్యే ప్రమాదముంది. ఇక 85 శాతం మందికి వైరస్ సోకినా లక్షణాలు లేకపోవడం ఆందోళన కలిగించే విషయమే. ఇప్పటి వరకు ఈ వైరస్ను తట్టుకోగలిగే, వ్యాధిని నిర్మూలించగలిగే ఎలాంటి వ్యాక్సిన్ ప్రపంచంలో ఎక్కడా లేదు. స్వీయనియంత్రణ, రక్షణతోనే వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోగలం -
సినిమా షూటింగ్లపై కేంద్రం మార్గదర్శకాలు జారీ
-
కరోనా: ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు ఇవే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఎలక్షన్ సమయంలో విధులు నిర్వహించే సిబ్బంది, ఓటర్లు ప్రతి ఒక్కరికి గ్లౌజులు ఇవ్వాలని, శానిటైజర్ అందుబాటులో ఉంచాలని ఈసీ ఆదేశించింది. ఓటరు రిజిస్టర్లో సంతకం చేయడం, ఓటేయడానికి ఈవీఎం బటన్ మీద నొక్కడం కోసం ఓటర్లందరికీ చేతి గ్లౌజులు ఇచ్చేలా ఈసీ మార్గదర్శకాలు రూపొందించింది.అలాగే ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఒక్కరికి టెంపరేచర్ చెక్ చేసేలా థర్మల్ స్స్ర్కీనింగ్ను ఏర్పాటు చేయాలని తెలిపింది. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవల్సిందిగా ఆదేశించింది. సెప్టెంబర్ 20వ తేదీన బిహార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. రాజకీయ పార్టీలు, వివిధ రాష్ట్రాల చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ల అభ్యర్థనలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అక్టోబర్-నవంబర్ నెలల్లో బిహార్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక ఈ ఏడాది చివరిలోగా జరిగే అవకాశం ఉంది. ఈసారి నామినేషన్లు, డిపాజిట్లు కూడా ఆన్లైన్లోనే స్వీకరించనున్నారు. ఎన్నికల కమిషన్ చరిత్రలో తొలిసారి ఆన్లైన్ ద్వారా నామినేషన్లు, డిపాజిట్లు స్వీకరిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా నామినేషన్ దాఖలు చేసి, ప్రింటౌట్ను రిటర్నింగ్ ఆఫీసర్కు అందజేయొచ్చని సూచించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు పాటిస్తూ బహిరంగ సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించడానికి ఈసీ అనుమతి ఇచ్చింది. అభ్యర్థితోపాటు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసే వారి సంఖ్య ఐదుకు మించొద్దని ఈసీ నిబంధన విధించింది. కరోనా బారిన పడిన వారు, 80 ఏళ్లు దాటిన వారు, వైకల్యం ఉన్న వారు, అత్యవసర సేవల్లో విధులు నిర్వహిస్తోన్న వారు పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ సడలింపులు ఇచ్చింది. ఓటు వేసే సమయంలో ఓటరు మాస్క్ను తొలగించి ఒకసారి నిర్ధారణ చేసుకున్న తరువాత ఓటు వేయడానికి అనుమతించనున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల సమయంలో ఎక్కువ మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఎందుకంటే ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎవరికైనా కరోనా సోకినట్లు తెలిస్తే వారి స్థానంలో మరొకరిని నియమించడానికి ఎక్కువ సిబ్బందిని విధుల్లోకి తీసుకోనున్నారు. అలాగే కౌంటింగ్ సమయంలోనూ వేరు వేరు గదులలో సామాజిక దూరం పాటిస్తూ ఓట్లను లెక్కించనున్నారు. చదవండి: ఎన్నికలపై 3 రోజుల్లో మార్గదర్శకాలు -
ఎన్నికలపై 3 రోజుల్లో మార్గదర్శకాలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడానికి విస్తృత మార్గదర్శకాలను జారీ చేసే అంశంపై మంగళవారం జరిగిన సమావేశంలో చర్చించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ పార్టీలు ఇచ్చిన అభిప్రాయాలు, సలహాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్టు వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులు చేసిన సూచనలు, సిఫారసులను కూడా పరిశీలిస్తున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఇవన్నీ పరిశీలించిన తరువాత, మూడు రోజుల్లో విస్తృత మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించినట్టు ఎన్నికల కమిషన్ అధికారిక ప్రతినిధి షెఫాలి శరణ్ అన్నారు. ఈ మార్గదర్శకాల ఆధారంగా, ఎన్నికలు జరిగే రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు, కోవిడ్-19 సంబంధిత చర్యలకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని, ఎన్నికల నిర్వహణ సమయంలో స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కమిషన్ ఆదేశించింది. ముఖ్యంగా బిహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం వంటి అనేక రాష్ట్రాలలో ఈ ఏడాది చివర్లో, 2021లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. చదవండి: ఎన్నికల కమిషనర్గా వైదొలగిన అశోక్ లావాస -
మొహర్రం రోజు పాటించాల్సిన కోవిడ్ నిబంధనలు ఇవే!
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన కోవిడ్–19 నిబంధనలు మొహర్రం పండుగలో భక్తులు తప్పకుండా పాటించాలని మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి మహమ్మద్ ఇలియాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 20 నుంచి పది రోజులు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. పండుగ రోజు పాటించాల్సిన కోవిడ్ నియమాలు: పీర్ల చావిడి వద్ద ముజావర్లు, ముతవల్లీలు, మేనేజింగ్ కమిటీ సభ్యులు కలిసి 10 మందికి మించకుండా ఉండాలి. భౌతిక దూరం పాటించాలి. ప్రజలకు, భక్తులకు తమ ఇళ్లలోనే పాతియా (భోజనం) అందించాలి. పీర్ల చావిడి వద్ద శానిటైజర్లు ఉంచాలి. దగ్గు, జలుబు, జ్వరం ఉన్న పెద్దలు, పిల్లలు పీర్ల చావిడి వద్దకు రాకుండా చూడాలి. మొహర్రం (షాహదత్) చివరి 9, 10వ రోజుల్లో పది మందికి మించకుండా ఊరేగింపు చేసుకోవచ్చు. పీర్లచావిడి వద్ద జంతు బలి, ఆర్కెస్ట్రా సంగీత బృందాలు నిషేధం. æ పై కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, విభాగాధిపతులను ప్రభుత్వం ఆదేశించింది. చదవండి: కరోనా కాదంటూ రోదించినా... -
తెరుచుకున్న జిమ్లు, యోగా కేంద్రాలు
-
అన్లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల
న్యూఢిలీ : కరోనా లాక్డౌన్ నిబంధనలను దశల వారీగా సడలిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జూలై 31తో అన్లాక్ 2.0 గడువు ముగియనుండటంతో.. కేంద్రం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్లాక్ 3.0లో రాత్రిపూట ఉన్న కర్ఫ్యూను పూర్తిగా తొలగించారు. అయితే కంటైన్మెంట్ జోన్లలో ఆగస్టు 31వరకు లాక్డౌన్ను కఠినంగా అమలు చేయనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. మార్గదర్శకాలు.. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఆగస్టు 31 వరకు మూసివేత ఆగస్టు 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్లకు అనుమతి సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్స్, మెట్రో రైలు మూసివేత కొనసాగింపు(అయితే పరిస్థితులను అంచనా వేసి వీటి అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్రం తెలిపింది) సాధారణ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు కంటైన్మెంట్ జోన్లలో అంక్షలు కొనసాగింపు భౌతిక దూరం, వైద్య నిబంధనలు పాటిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చు. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, మత పరమైన సమావేశాలపై నిషేధం కొనసాగింపు(అయితే పరిస్థితులను అంచనా వేసి వీటి అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్రం తెలిపింది) -
ఆఖరి మజిలీపై అపోహలు
సాక్షి, అమరావతి: అపోహలు.. భయాలతో మానవత్వం మంటగలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా చోటు చేసుకుంటున్న ఘటనలు హృదయాన్ని ద్రవింప చేస్తున్నాయి. సాటి మనిషికి తుది వీడ్కోలు పలికేందుకూ జంకుతుండటంతో ఆఖరి ప్రయాణం ఒంటరిగానే ముగుస్తోంది. మృతదేహాల నుంచి వైరస్ వ్యాప్తి ఉండదని పదే పదే చెబుతున్నా భయంతో వెనుకంజ వేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిపై కనీస అవగాహన లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఒక్క కేసూ లేదు: కుటుంబీకులు, బంధువులు ముందుకు రాకపోవడంతో కరోనాతో మృత్యువాత పడ్డ వారి దహన సంస్కారాలకు సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్తో మృతి చెందిన వారిలో ఏ ఒక్క మృతదేహం నుంచీ కరోనా కేసులు నమోదైన దాఖలాలు లేవు. కరోనా మృతుల అంత్యక్రియల కోసం రూ.15 వేలు చొప్పున ప్రకటించిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. స్నానం చేయించడం, హత్తుకోవడం వద్దు.. ► కరోనాతో చనిపోయిన వారి నుంచి వైరస్ సోకే అవకాశం లేదు. మృతి చెందిన 6 గంటల తర్వాత ద్రవాలు ఊరడం ఉండదు. ఉచ్ఛాశ్వ నిశ్వాసలు ఉండవు కాబట్టి ఇతరులకు సోకే అవకాశం లేదు. ► కాకపోతే మృతదేహానికి సంప్రదాయాల ప్రకారం స్నానం చేయించడం, హత్తుకోవడం లాంటివి చేయకూడదు. ► పీపీఈ కిట్లు, చేతికి గ్లౌజులు ధరించి తగినంత మంది అంత్యక్రియల్లో పాల్గొనవచ్చు. ► శవాన్ని దహనం చేశాక బూడిదలో ఎలాంటి వైరస్ ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్యహెవో) స్పష్టం చేసింది. ► కరోనా పాజిటివ్ పేషెంట్లకు ఎలాంటి పోస్టుమార్టం చేయడం లేదు కాబట్టి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదు. శవాన్ని భద్రపరిచే సమయంలోనే నోరు, ముక్కు, చెవులు నుంచి ద్రవాలు ఊరకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ► కరోనా పాజిటివ్ మృతుల శరీరం నుంచి ఊరిన ద్రవాలను తాకినప్పుడు మాత్రమే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందని అమెరికాకు చెందిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినర్స్ సంస్థ పేర్కొంది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు... ► డెడ్బాడీని తరలించే వ్యక్తులు గ్లౌజులు, పీపీఈ కిట్లు వాడాలి. ► కాన్యులాలు, సెలైన్ పైపులు తొలగించాలి. ► ఆస్పత్రినుంచి బాడీని ప్రత్యేకంగా శానిటైజ్ చేసి జిప్ కలిగిన బ్యాగులో తరలించాలి. ► హైపో క్లోరైడ్ సోడియం (1 పర్సెంట్) ద్రావణంతో శుద్ధి చేయాలి ► పూడ్చిపెట్టినప్పుడు గుంత ఆరడుగులకు తక్కువ కాకుండా చూడాలి. ► శవాన్ని తరలించిన వారు పీపీఈ కిట్లను అక్కడే తొలగించి బయో వ్యర్థాలుగా నిర్వీర్యం చేయాలి. ► దహనంలో జాప్యం జరిగితే బాడీని 4 డిగ్రీల సెల్సియస్లో భద్రపరచాలి. కేసులు పెరుగుతాయనే... ‘కరోనా మృతుల అంత్యక్రియల్లో భౌతిక దూరం పాటించకుండా ఎక్కువ మంది గుమిగుడితే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వమే దీన్ని నిర్వహిస్తోంది. కొన్నిచోట్ల అపోహలతో అడ్డుకుంటున్నారు. జిప్ చేసిన బ్యాగులో ఉంటుంది కాబట్టి శవం నుంచి ఎలాంటి వ్యాప్తి జరగదు. మృతిచెందిన ఆరు గంటల తర్వాత ఎలాంటి వ్యాప్తి ఉండదు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి’ –డా.కె.ప్రభాకర్రెడ్డి, హృద్రోగ నిపుణులు వస్తువును శానిటైజ్ చేస్తే ఎలాగో.. ‘సెల్ఫోన్ లేదా వాటర్ బాటిల్ తదితరాలపై శానిటైజ్ చేస్తే వైరస్ ఎలా పోతుందో కరోనా మృతదేహాలు కూడా అంతే. పూర్తిగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేస్తారు. పోస్ట్మార్టం చేయకుండా బాడీని తెస్తే కరోనా వ్యాపించదు. ఈ వాస్తవాన్ని గ్రహించాలి’ –డా.సుబ్బారావు, ఫోరెన్సిక్ వైద్య నిపుణులు, ఒంగోలు శ్వాసతోనే వైరస్ వ్యాప్తి ‘శ్వాస ప్రక్రియ ఉంటేనే ఈ వైరస్ వ్యాప్తి ఉంటుంది. డెడ్బాడీ నుంచి వైరస్ వ్యాప్తి చాలా తక్కువ. ప్రజలు భయాందోళన నుంచి బయటకు రావాలి. అంత్యక్రియలను అడ్డుకోవడం మంచిది కాదు’ –డా.నీలిమ, కమ్యూనిటీ మెడిసిన్ నిపుణులు, వైద్యవిద్యాశాఖ -
బ్రేక్ పడిన సినిమా షూటింగులకు అనుమతి!
కరోనా నేపథ్యంలో బ్రేక్ పడిన సినిమా షూటింగులకు పంజాబ్ ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తామని ప్రకటించింది. బుధవారం జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలువురు నటులతో మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. లాక్డౌన్ కారణంగా మూగబోయిన వెండితెరకు సరికొత్త రంగులు తీర్చే పనిలో దర్శకులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ప్రారంభించిన సినిమా షూటింగులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. (హీరోయిన్లపై కామెంట్స్ : సునిశిత్ అరెస్ట్ ) గత నెలలోనే షూటింగ్కి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. కేంద్రం లాక్డౌన్లో సడలింపులు ఇచ్చినా మొదటినుంచి సినిమారంగానికి మాత్రం ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. దీంతో లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి షూటింగులు నిలిచిపోయి చాలా మంది ఆర్థికంగా చితికిపోయారు. పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారికి కాస్త ఊరట లభించనట్లైంది. అయితే షూటింగుల్లో మాస్కులు, శానిటైజేషన్, థర్మల్ స్ర్కీనింగ్ వంటి నియమాలను కశ్చితంగా పాటించాల్సిందేనని ప్రకటించింది. (ఆ వార్తలో నిజం లేదు: అమితాబ్ బచ్చన్) -
స్వాతంత్ర్య వేడుకలకు కరోనా వారియర్స్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కష్టకాలంలో అత్యవసర సేవలందించిన కరోనా వారియర్స్ని ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్ర్య వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది. కరోనా నేపథ్యంలో స్వాతంత్ర్య వేడుకలపై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ర్ట రాజధాని ప్రాంతాల్లో ఉదయం 9 గంటలకు వేడుకలను నిర్వహించాలని పేర్కొంది. కరోనా దృష్ట్యా భారీ స్థాయిలో జనం వేడుకల్లో పాల్గొనకుండా చూడాలని అన్ని రాష్ర్ట ప్రభుత్వాలను కోరింది. స్వాతంత్ర్య వేడుకల్లో నిర్వహించే మార్చ్ఫాస్ట్కు పోలీసు, ఆర్మీ, పారామిలటరీ, ఎన్సీసీ దళాలు మాస్క్ ధరించాలని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. -
60 దాటిన వారిలో ఆందోళన!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ ఉధృతి పెరుగుతున్న కొద్దీ 60 ఏళ్లు పైబడిన వారిలో భయాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసుల వృద్ధితో తామెక్కడ ఆ వైరస్ బారిన పడతామోనన్న ఆదుర్దాతో మానసిక ఒత్తిళ్లకు గురవుతున్న వారూ ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి 60 ఏళ్లు పైబడిన వాళ్లు, పదేళ్ల లోపు పిల్లలు దీని బారిన ప్రమాదం ఎక్కువగా ఉన్నం దున, బయటకు రావొద్దంటూ ప్రభుత్వాలు, డాక్టర్ల నుంచి వెలువడిన హెచ్చరికలు కూడా వీరిలో భయాలు మరింత పెరిగాయి. మొదట సుదీర్ఘ లాక్డౌన్ విధింపు, ఆ తర్వాతా కోవిడ్ తీవ్రత పెరుగుతున్న సందర్భంలోనూ పెద్దలు, అందులోనూ బీపీ, షుగర్, ఇతర అనారోగ్య సమస్యలున్న వారు 4 నెలలకు పైగా ఇళ్లకే పరిమితం కావడంతో ఆందోళన మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇతర విషయాలపై సైకియాట్రిస్ట్లు ఎమ్మెస్రెడ్డి, నిశాంత్ వేమన, సైకాలజిస్ట్ సి.వీరేందర్ సాక్షి ఇంటర్వూ్యలో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాం శాలు.. వారి మాటల్లోనే.. ఆందోళనలొద్దు.. ప్రశాంతంగా ఉండండి: సైకియాట్రిస్ట్ ఎమ్మెస్ రెడ్డి మరో 6 నెలలు పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇప్పుడున్నట్టుగానే పెద్ద వయసు వారంతా మరికొంత కాలం గడపాల్సి ఉంటుంది. ఒకవేళ భార్యాభర్తలిద్దరే ఉంటుంటే అన్యోన్యం గా, ఉల్లాసంగా కాలం గడపండి. జాయింట్ ఫ్యామిలీలో ఉంటే కొడుకులు, కోడళ్లతో సఖ్యతగా ఉంటూ మనవలు, మనవరాళ్లతో ఎక్కువ సమయం గడపండి. పెద్దవాళ్లంతా ఇళ్లలోనే ఉంటున్నా రు కాబట్టి వారికి కరోనా దాదాపు సోకదు. బాల్కనీలో లేదా ఇళ్లలోనే కనీసం అరగంట పాటు నడక తప్పని సరి. దీనివల్ల రక్తప్రసారం పెరిగి ఆరోగ్యానికి మంచి చేయడంతో పాటు, మనసును ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. ప్రాణాయామం, ఇతర బ్రీథింగ్ ఎక్సర్సైజులతో లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. షుగర్, బీపీ వంటి వాటిని కంట్రోల్లో ఉంచుకోండి. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, ఆప్తులతో ఫోన్లో ముచ్చట్లు వంటి వాటితో గడపండి. టీవీల్లో కోవిడ్ సంబంధ వార్తలు ఎక్కువసేపు చూడొద్దు. యువతరం అవగాహన కల్పించాలి: సైకాలజిస్ట్ సి.వీరేందర్ ఆందోళన కలిగించే వార్తలు, బయటి పరిస్థితులు 60 ఏళ్లు పైబడిన వారిపై ప్రభావం చూపుతున్నాయి. కోవిడ్ గురించి అవగాహన ఉన్న కొంత వయసు పైబడిన వారి లో తమకు ఈ వ్యాధి సోకుతుందేమోనన్న భయాలు పెరుగుతున్నాయి. ఇక దీని గురిం చి తెలియని వారు, నిరక్షరాస్యులు తమకేమీ కాదని మా స్కులు, శానిటైజర్లు ఉపయోగించేందుకూ విముఖత చూపుతున్నారు. అందువల్ల ఇళ్లలోని యువతరం.. ఈ రెండు వర్గాల వారికి అవగాహన కల్పించాలి. ఇప్పుడు ఏర్పడిన క్లిష్ట పరిస్థితులను అంగీకరించి వాటిని ఎదుర్కొనేందుకు అంతా సిద్ధం కావాలి. శారీరకంగా, మానసికంగా శక్తి సామర్థ్యాలను పెంచుకోవడం, ఏదైనా వస్తే వైద్యపరంగా చికిత్స తీసుకోవడం, కుటుంబ, సామాజికపరంగా చేదోడువాదోడుగా నిలవడం వంటి చర్యల ద్వారా ప్రస్తుతం ఎదురయ్యే సమస్యలను సులభంగా అధిగమించొచ్చునని అందరూ గ్రహించాలి. పెద్దల్లో ఆ లక్షణాలుంటే లేట్ చేయొద్దు: సైకియాట్రిస్ట్ నిశాంత్ వేమన పెద్ద వయసు వారిలో ముఖ్యంగా వివిధ అనారోగ్య సమస్యలున్న వారు దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న లక్షణాలు స్వల్పంగా కనిపించినా ఆందోళన చెందుతున్నారు. ఈ ఆరోగ్య సమస్యలపై ఆసుపత్రులకు వెళ్లేందుకూ భయపడుతున్నారు. ఆస్పత్రికి వెళితే ఎక్కడ తమకు కరోనా వైరస్ అంటుకుంటుందో నని తమ డాక్టర్లను కూడా సంప్రదించేందుకు కొంద రు వెనుకాడుతున్నారు. అంతకుముందు జబ్బులు న్నా, పెద్ద వయసు వారైనా కోవిడ్ నుంచి అధిక శాతం కోలుకుంటున్నందున అనవసర ఆందోళనలకు గురికావొద్దు. ఆశావహ దృక్పథంతో ఉంటూ, బ్రీథింగ్, రెస్పిరేటరీ ఎక్సర్సైజులు చేస్తూ, ఆప్తులు, ఇష్టమైన వారితో తరచుగా ఫోన్లో మాట్లాడుతూ అహ్లాదంగా ఉంటే ఏ సమస్యలూ రావు. ఏమాత్రం లక్షణాలు బయటపడినా వెంటనే ఇంట్లో వాళ్లకు చెప్పాలి. తగిన చికిత్స తీసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేతప్ప కరోనా గురించి భయపడి, ఆలస్యం చేయొద్దు. -
ఆన్లైన్ సమస్యలు
రోజూ బడి బాదరబందీ ఏమిటన్న బెంగ లేదు... చండామార్కుల వంటి గురువుల ఆగ్రహ నయనాలు తమవైపే తీక్షణంగా చూస్తాయన్న భయం లేదు. అడిగిన ప్రశ్నకు బదులీయకపోతే వీపు పగలవచ్చునన్న బెరుకు లేదు. సెలవులు ఎప్పుడెప్పుడా అన్న చింత లేదు. కరోనా వైరస్ మహ మ్మారి పుణ్యమా అని కనీవినీ ఎరుగని రీతిలో నాలుగు నెలలుగా బడులన్నీ తలుపులు మూసుకున్నాయి. పిల్లలంతా వేసవికాలం, వర్షాకాలం తేడా లేకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికే వారిలో చాలామందికి బడికెళ్తేనే బాగుండునన్న అభిప్రాయం కలిగివుండొచ్చు. కానీ ఈ మహమ్మారి పీడ పోయేదాకా అది సాధ్యమయ్యేలా లేదు. అందుకే ఒకటి రెండు నెలలుగా ఆన్లైన్ బోధన అనే మాట వినబడుతోంది. లేడికి లేచిందే పరుగన్నట్టు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు ఇదే అదునుగా సొమ్ములు పోగేసుకోవచ్చునన్న దురాశతో ఆన్లైన్ బోధన మొదలుపెట్టేశాయి. కనుకనే తల్లిదండ్రుల నుంచి, విద్యారంగ నిపుణుల నుంచి ఆన్లైన్ బోధనపై మార్గదర్శకాలను విడుదల చేయాలన్న డిమాండు మొదలైంది. ఆలస్యంగానే అయినా మంగళవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వీటిని విడుదల చేసింది. ఆన్లైన్ బోధనంటూ మొదలుపెట్టిన పాఠశాలలు, కళాశాలలు మౌలికమైన అంశాలను విస్మ రించాయి. తరగతి గదిలో జరిగే బోధన మాదిరే ఆన్లైన్లోనూ బోధిస్తే సరిపోతుందని అవి భావిం చాయి. ఎదురుగా ఒక కెమెరా పెట్టుకుని బ్లాక్ బోర్డు ముందు టీచర్ నించుని చెప్తే ఎప్పటిలానే విద్యార్థికి అవగాహన కలుగుతుందని యాజమాన్యాలు అనుకున్నాయి. కానీ తరగతిలో పిల్లలనుద్దేశించి బోధించడం వేరు. ఆ పిల్లలకే ఆన్లైన్లో పాఠం చెప్పడం వేరు. పిల్లలు బడికొచ్చి టీచర్ చెప్పే పాఠాలు వినడం, నోట్సు రాసుకోవడం మాత్రమే చేయరు. తమ తోటివారితో సంభాషణల్లో నిమగ్నమవుతారు. అవి బోధనకు సంబంధించి కావొచ్చు... ఊళ్లో జరిగిన ఘటన గురించి కావొచ్చు... ఇంట్లో వచ్చిన కష్టసుఖాల గురించి కావొచ్చు... తమకు ఎదురైన అనుభవం గురించి కావొచ్చు. ఈ క్రమంలో వారికి తమ చుట్టూ వున్న సమాజం గురించి అర్థమవుతుంది. బుద్ధి విక సిస్తుంది. దేన్నయినా నేర్పుగా ఎలా ఎదుర్కొనాలో తెలుస్తుంది. తోటి పిల్లలను వారు అనునిత్యం గమనిస్తారు. ఒక అంశాన్ని వారు అవగాహన చేసుకుంటున్న తీరుకూ, తమ తీరుకూ పోల్చు కుంటారు. మరింత సులభంగా, ప్రభావవంతంగా చదవడం ఎలాగో తెలుసుకుంటారు. వివేచ నాత్మక అధ్యయన నైపుణ్యం అలవడుతుంది. తరగతి గది చర్చల్ని ప్రోత్సహిస్తుంది. ఏకకాలంలో ఉపాధ్యాయులనూ, విద్యార్థులనూ సానబడుతుంది. టీచర్లు చదువు చెప్పి ఊరుకోరు. తమ ముందున్నవారి ముఖకవళికలు గమనిస్తూ ఎవరికి అవగాహన కలుగుతున్నదో, ఎవరిలో ఇంకా సందేహాలున్నాయో పోల్చుకోగలుగుతారు. వాటిని అడిగేందుకు ప్రోత్సహిస్తారు. వారితో సంభాషిస్తూ... వారి స్థాయికి దిగి బోధించే ప్రయత్నం చేస్తారు. తాము చెప్పే పాఠంపై పిల్లల్లో ఒక రకమైన ఆసక్తిని, అనురక్తిని కలగజేస్తారు. ఈ క్రమంలో మరింత మెరుగ్గా బోధించడమెలాగో తాము కూడా నేర్చుకుంటారు. అటు విద్యార్థులు సైతం తమకు అర్ధమవుతున్నదేమిటో, కానిదేమిటో చెప్పగలిగే సామర్థ్యం అలవర్చుకుంటారు. అంతేకాదు... భిన్న అంశాలపై తార్కికంగా ఆలోచించడం, అభి ప్రాయాలు ఏర్పర్చుకోవడం సాధ్యపడుతుంది. బోధించడమనేది ఒక కళ అయినట్టే... వినడం కూడా కళే. ఆ లక్షణం వారిని ఉన్నతశిఖరాలకు ఎదిగిస్తుంది. చదువుకైనా, ఆటలకైనా, ఇతరత్రా కార్య కలాపాలకైనా తోటివారిని కూడగట్టడం పిల్లలు నేర్చుకుంటారు. ముందురోజు ఇచ్చిన హోంవర్క్ పూర్తి చేసుకోవడం, ఎప్పటికప్పుడు అసైన్మెంట్లు చేయడం, రోజూ నిర్ణీత సమయానికల్లా బడికి హాజరుకావడం వంటివి పిల్లలను నియమబద్ధ జీవితంవైపు అడుగులేయిస్తాయి. అనంతర కాలంలో సమాజంలో వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాయి. దురదృష్టవశాత్తూ ఆన్లైన్ విద్యాబోధనలో ఇదంతా సాధ్యం కాదు. అవసరమైన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఉన్నవారికీ... వాటిని సమకూర్చుకునే స్తోమత లేనివారికీ మధ్య ఎటూ అంతరాలు ఏర్పడుతున్నాయి. అన్నీ సమకూర్చుకోగలిగినవారు సైతం చదువుకునే క్రమంలో పొందవలసిన జ్ఞానానికి ఆన్లైన్ విధానం వల్ల దూరమవుతున్నారు. కొన్ని దశాబ్దాలక్రితం దూరవిద్యా విధానం మొదలైనప్పుడు విద్యారంగ నిపుణుల్లో చాలామంది దాన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఇదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్లైన్ బోధన తప్పేలా లేదు. పిల్లల్ని బడికి పంపాలంటే తల్లిదండ్రులు బెంబేలు పడుతున్నారు. బడిలో ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా అక్కడికి చేరేలోగా, అక్కడినుంచి తిరిగొచ్చేలోగా ఏమవుతుందోనన్న ఆందోళన వారికుంది. అందుకే సెల్ఫోన్లు లేదా కంప్యూటర్లు కొనిస్తే చదువుకుంటారని వారనుకున్నారు. అయితే ఎక్కువ సమయం ఆ ఉపకరణాలతో గడిపితే పిల్లల్లో ఏర్పడే సమస్యలపైనా తల్లిదండ్రులకు భయం వుంది. కనుకనే తగిన మార్గదర్శకాలు రూపొందించాలన్న అభిప్రాయం కలిగింది. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు రోజుకు అరగంట మించి బోధించరాదని, ఒకటి నుంచి 8వ తరగతి వరకూ రోజుకు రెండు క్లాసులు, అవి కూడా ఒక్కోటి 30–45 నిమిషాల మధ్య మాత్రమే ఉండాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. 9–12 తరగతుల వారికి గరిష్టంగా నాలుగు సెషన్లు మాత్రమే వుండాలని సూచిస్తున్నాయి. వీటిపైనా, ఇతర మార్గదర్శకాలపైనే మరింత లోతుగా చర్చించి, అవసరమైన సవరణలు చేస్తే పిల్లలకు ఉపయోగపడతాయి. బోధనకు రోజులో ఎంత కేటా యించాలన్న అంశంతోపాటు, ఆన్లైన్ విధానంలో దానికి సృజనాత్మకత జోడించి మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దడమెలాగన్న అంశంపైనా నిపుణులు శ్రద్ధ పెట్టాలి. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేవరకూ ఇదంతా తప్పదు. -
బాధ్యతతోనే భద్రత
సాక్షి, హైదరాబాద్: ‘కొన్ని దేశాల ప్రధాని స్థాయి వ్యక్తులు మొదలు వివిధ రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తుల వరకు అన్ని అధునాతన సదుపాయాలు అందుబాటులో ఉన్నా ఎవరూ కరోనాకు అతీతులు కాదు. ఇది అందరూ గ్రహించాలి’ అని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు, సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ దశరథరామారెడ్డి తేతలి చెప్పారు. ‘ఈ వైరస్కు కులం, మతం, ప్రాంతం, ఆడ–మ గ, ధనిక, పేద అనే తారతమ్యాలు లే వు. ఎవరికైనా వ్యాపించే ప్రమాదముంది. కాబట్టి ఇది సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందరి కీ సమానమే’నని చెబుతున్న ఆయ న ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ఎదురుకానున్న సవాళ్లు, తదితర అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. అంతా మన చేతుల్లోనే ఉంది.. కరోనా కేసులు పెరిగి, వైరస్ వ్యా ప్తి పెరిగిన నేపథ్యంలో దీనిని స మర్థవంతంగా అడ్డుకుని, పరిస్థి తి చేదాటకుండా చేసుకోవాలా? లేక మహమ్మారి తీవ్రంగా మారి అందరూ దాని బారినపడే వర కు చేతులు కట్టుక్కుని చూద్దా మా? అనేది అందరూ నిర్ణయించుకోవాలి. ప్రభుత్వాలు, డాక్టర్లు చేయగలిగినంత చేస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్ సోకినవారు, లక్షణాలున్న వారు ఏ మాత్రం తాత్సారం చేయకుండా ముందుకొచ్చి టెస్ట్లు చేసుకోవాలి. తప్పక మాస్క్లు ధరించడం, మనుషు ల మధ్య ఆరడగులదూరం, హ్యాండ్ శా నిటైజ్, వ్యక్తిగత శుభ్రత, మంచి ఆహా రం తీసుకుంటూ ఎలాంటి భయాల్లేకుండా ఆరోగ్యకర జీవితం గడపడం ఒక్కటే శ్రీరామరక్ష. త మకేమీ కాదని ఇష్టానుసారం రోడ్లపైకి రావడం, విచ్చలవిడిగా తిరగడం మానాలి. అన్ని జాగ్రత్త లు తీసుకుంటూ అంద రూ బాధ్యతగా ఉంటే ఈ వైరస్ నియంత్రణ సాధ్యమే. లాక్డౌన్ నేర్పిన పాఠాలు మనకు లాక్డౌన్ ఎంతో నేర్పింది. మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో తెలియక, ఏ స్థాయి రోగికి ఎలాంటి చికి త్స చేయాలో అర్థం కాక అభివృద్ధి చెందిన దేశా లు సైతం ఇబ్బందిపడ్డాయి. వాటి అనుభవా లు, పరిశోధనలు ఆ తర్వాత మనకు కొంతమేర పనికొచ్చాయి. మనదేశ పరిస్థితులకు తగ్గట్టుగా వివిధ మందులు, చికిత్స విధానాల ను రూపొందించుకుంటున్నాం. ఈ వైరస్ స్ట్రెయిన్లు దేశంలో 200 వరకు, హైదరాబాద్ లో వందకుపైగా ఉన్నట్టు అం చనా. ప్రస్తుత çసమయంలో ఏం చేయాలనేది ఎంత ముఖ్యమో, ఏం చేయకూడదనేదీ అంతకంటే ముఖ్యమే. అం దరూ సురక్షితులయ్యే వరకు ఎవరూ సురక్షితులు కాదు (నో బడీ ఈజ్ సేఫ్ అంటిల్ ఎవ్రీబడీ ఈజ్ సేఫ్), అందరినీ గౌరవించండి, అందరినీ అనుమానించండి (రెస్పెక్ట్ ఆల్ సస్పెక్ట్ ఆల్) అన్న మాటలను అందరూ గుర్తుపెట్టుకోవాలి. కరోనా వస్తే కళంకమేమీ కాదు మొదట్లో వయసు పైబడిన వారు, గుండె, శ్వా సకోశ, కిడ్నీ ఇతర సమస్యలున్న వారు కరోనా తీవ్రత వల్ల మరణించారు. ఇ ప్పుడు తక్కువ వయసున్న వారూ దీని బారిన పడుతున్నారు. వైరల్ లోడ్ పెరగడం, వ్యాధి ముదిరే వరకు దాచి పెట్టుకుని క్రిటికల్ స్టేజ్లో ఆసుపత్రులకు రావడం వల్లే ఇలా జరుగుతోంది. కరోనా వచ్చిం దంటే అదేదో కళంకంగా, ప్రతిష్టకు భంగంగా భావిం చొద్దు. వ్యాధి తీవ్రత ఎక్కువున్న కేసుల్లోనే మరణాలు సంభవిస్తున్నాయి. అలాఅని, అందరికీ టెస్ట్లు అవసరం లేదు. లక్షణాలు కనిపించే వారితో పాటు, పాజిటివ్ల తో కాంటాక్ట్ అయిన వారికి తప్పనిసరి చేయాలి. దీనివల్ల వైరస్ వ్యాప్తిని ఆపొచ్చు. అలా అయితే అది డేంజరే.. నెగెటివ్ వచ్చాక 14 నుంచి 28 రోజుల్లోగా రోగనిరోధకశక్తి స్వాధీనంలోకి వస్తుంది. యాంటీ బాడీస్ పెరిగి ఇమ్యూని టీ పెరుగుతుంది. అయితే ఏడాది పాటే ఈ ఇమ్యూనిటీ ఉంటుందని, మళ్లీ వ్యాధి తిరగబెట్టే అవకాశాలున్నాయనే వార్తలు కలవరపెడుతున్నాయి. దీనిపై ఇంకా పరిశోధన లు జరుగుతున్నాయి. మీజిల్స్, ఆటలమ్మ వంటివి మళ్లీ రావు. మలేరియా, టీబీ మళ్లీ తిరగబెడతాయి. కరోనా కూ డా ఆ జాబితాలో చేరితే అది మనకు హెచ్చరికలాంటిదే. అదే నిజమైతే.. వైరస్ తుంపర్ల (డ్రాప్లెట్ల) ద్వారా వ్యాపిస్తున్నట్టు నిర్ధారణైంది. కొన్ని పరిస్థితుల్లో గాలి ద్వారా కూడా ఇది సోకే అ వకాశాలున్నాయని డబ్ల్యూహెచ్వో చెబుతోంది. ఇది సైం టిఫిక్గా తేలాలి. ఈ హెచ్చరికను కూడా విస్మరించకూడ దు. కాబట్టి మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒకచోట కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నా మాస్క్ ధరించాలి. వ్యక్తు ల మధ్య దూరం కచ్చితంగా పాటించాల్సిందే. హ్యాండ్ శానిటైజేషన్, వ్యక్తిగత శుభ్రత, పోషకాహారం కలిగిన రోగనిరోధకశక్తి పెంచే ఆహారం తీసుకోవాలి. పరీక్షలు.. మందులు.. వ్యాక్సిన్ కరోనాలోని రకరకాల లక్షణాలు, రోగి స్థితిని బట్టి వ్యాధి తీవ్రత నిర్ధారణకు ఏ టెస్ట్లు చేయాలో డాక్టర్లు నిర్ణయిస్తా రు. యాంటీ బాడీస్, యాంటీ జెన్, హెచ్ఆర్సీటీ స్కాన్ ఫర్ లంగ్స్, సీబీపీ–సీఎస్ఆర్–సీ రియాక్టివ్ ప్రోటీన్, ఐ– ఎల్ 6, డీ–డైమర్ టెస్ట్లు.. ఇవన్నీ వివిధ పరీక్షల రకాలు. వ్యాధి తొలిదశలో ఉన్న వారి నుంచి వెంటిలేటర్పై ఉన్న పేషెంట్ల వరకు అవసరాన్ని బట్టి ఐవీ ఫ్లూయిడ్స్, పారాసిటమిల్, ఫాబిఫెరవీర్, రెమ్డిసివర్, టోసిలిజుమాబ్ మం దుల్ని వాడుతున్నారు. డెక్సామిటాజోన్ అనే స్టెరాయిడ్స్ లైఫ్ సేవింగ్ డ్రగ్గా ఉపయోగపడుతోంది. ఇంత కంటే ప్రభావితమైన మందుల కోసం పరిశోధనలు సాగుతున్నాయి. ఇక, కొందరు ఇదిగో వ్యాక్సిన్ అంటున్నారు. అయితే సరైన వ్యాక్సిన్ రావడానికి ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతానికివన్నీ పరిశోధనల దశలోనే ఉన్నాయి. -
గాలి ద్వారా వ్యాప్తిపై... ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజల్లో రకరకాల భయాలు పెరుగుతున్నాయి. కొన్ని పరిస్థితుల్లో గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని తాజాగా ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. జనంతో కిక్కిరిసిపోయిన చోట్లు, సరైన గాలి, వెలుతురు రాని గదుల్లో కరోనా బాధితులుంటే వారి ద్వారా ఇతరులకు వైరస్ సులభంగా వ్యాపిస్తుందనే భావనను తోసిపుచ్చలేమని స్పష్టం చేసింది. కరోనా సోకినా లక్షణాలు బయటకు కనిపించని అసింప్టమేటిక్ బాధితుల నుంచి కూడా వైరస్ గాలి ద్వారా సోకే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోని భయాలు, ఆందోళనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సాక్షితో సైకియాట్రిస్ట్లు డా. ఎమ్మెస్ రెడ్డి, డా. నిశాంత్, సైకాలజిస్ట్ డా.సి.వీరేందర్ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు... వారి మాటల్లోనే... వాతావరణంలో వ్యాప్తిపై భయాలొద్దు వాతావరణంలో ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో గాలిలో వైరస్ ఎక్కువసేపు బతికుండే అవకాశాలు లేవు. బయటకు వెళితే చాలు కరోనా వచ్చేస్తుందనే భయాలు వద్దు. అయితే మాస్క్లు ధరించడం, మనుషుల మధ్య దూరం, చేతులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం మాత్రం అన్నివేళల్లో తప్పనిసరి. కోవిడ్ విస్తరిస్తున్న కొద్ది ప్రజల్లో కొత్త భయాలు, ఆదుర్దాలు పెరుగుతున్నాయి. ఈ భయాలతోనైనా మాస్క్లు, ఇతర జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తే మంచిదే. కూరగాయలు, బయటి నుంచి తీసుకొచ్చే వస్తువులను సబ్బునీళ్లతో కడుక్కోవడం ఉత్తమం. తమకు ఈ లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తోంది, కోవిడ్ వస్తుందేమో లేక ఇప్పటికే వచ్చిందేమో నన్న భయాలు, ఆందోళనలు, అనుమానాలతో ప్రస్తుతం మమ్మల్ని స్వయంగా సంప్రదించడమో లేక ఫోన్లోనే సలహాలు, సూచనలు కోరుతున్నవారున్నారు. –డాక్టర్ ఎమ్మెస్ రెడ్డి, ప్రముఖ సైకియాట్రిస్ట్ గాలి, వెలుతురు బాగా ఉండేలా చూడాలి ప్రజల్లో ఆరోగ్య సంబంధ ఆందోళన పెరుగుతోంది. తాజాగా గాలి నుంచి సోకుతుందేమోనన్న వార్తలతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే తప్పనిసరిగా మాస్క్, హ్యాండ్ శానిటైజేషన్, వ్యక్తుల మధ్య దూరాన్ని పాటించడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో, ఇళ్లలోనూ మంచి, గాలి వెలుతురు ఉండేట్టు చూసుకోవాలి. మనుషులు మరీ దగ్గరగా గుమికూడకుండా నోరు, ముక్కు మూసి ఉంచేలా మాస్క్లు ధరించాలి. ఆఫీసులు, మూసి ఉన్న ప్రాంతాలు, ఇళ్లలో గాలి బయటకు వెళ్లే అవకాశం లేని చోట్ల ఏసీలు వంటివి ఉన్న ప్రాంతాల్లో ఒకేచోట గుంపుగా చేరరాదు. కరోనా వ్యాప్తికి ముందు గొంతులో గరగరగా ఉన్నా, దగ్గు, తుమ్ము వచ్చినా కోవిడ్ వచ్చిందేమో, ఇక బతకమేమోనన్న భయంతో ఫోన్లు వచ్చేవి. ఇప్పటికే తమకు సోకిందేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బయటికి వెళ్లి వచ్చామని, మొన్న కలిసిన వారికి పాజిటివ్ వచ్చింది వారి నుంచి మా ద్వారా ఇంట్లోవాళ్లందరికీ వస్తుందా అన్న సంశయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా లక్షణాలున్న వారితో పాటు 30, 40 శాతం దాకా అనుమానాలు, భయాలతోనే టెస్ట్లు చేయించుకోవడంతో హెల్త్కేర్ సిస్టమ్పై ఒత్తిడి పెరుగుతోంది. పాజిటివ్ రాగానే ఏదో అయిపోతుందని భయపడవద్దు. ఇది తీవ్రస్థాయిలో ఉన్న వారికి మాత్రమే ప్రమాదమని గ్రహించాలి. చెస్ట్ ఎక్స్రే, సీటీ స్కాన్తోనే సివియారిటీ తెలుస్తోంది. చాలామందికి గొంతులో ఇన్ఫెక్షన్తోనే వైరస్ వెళ్లిపోతోంది. ఊపిరితిత్తులను చేరుకోవడం లేదు. పాజిటివ్ వచ్చినా ఏమీ కాదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అనవసర ఆందోళనలకు గురికావొద్దు. –డాక్టర్ నిశాంత్, సైకియాట్రిస్ట్ చైతన్యపరచాలి: సైకాలజిస్ట్ డా.సి.వీరేందర్ కోవిడ్ మహమ్మారి ఆలోచనలు ప్రజలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆందోళనలకు గురిచేస్తున్నాయి. కరోనా వైరస్ కంటే దీనికి సంబంధించిన ఆలోచనలు, భయాలు వీరిని ఎక్కువగా బాధిస్తున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత ఒత్తిడికి గురికావడంతో, వారిలో మానసిక ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ వైరస్ది గాలి ద్వారా వ్యాపించే గుణం కాబట్టి తుమ్ములు, దగ్గుల ద్వారా వెలువడే తుంపర్లతో వ్యాప్తి జరుగుతోందని మాస్క్ ఇతర జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయితే బహిరంగ ప్రదేశాల్లో వైరస్ ప్రవేశించాక కాలుష్యం కారణంగా కొంతసేపు గాలిలోనే ఉండిపోయే అవకాశాలున్నాయి. సాధారణంగా ప్రజలు ముందు తమకేమీ కాదు, ఈ వైరస్ తమకు వ్యాపించదు, తనకు తప్ప ఇతరులకు వస్తుంది అనే భావనతో ‘డినయెల్ మోడ్’(తిరస్కరణ) ఉంటారు. ఒకవేళ వ్యాధి వచ్చాక కూడా అదీ తమకు రాలేదనే భ్రమల్లోనే ఉంటారు. మొదట విదేశాల్లో వచ్చినపుడు రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉండడం, వేడి ప్రదేశం కాబట్టి భారత్లో రాదని అనుకున్నారు. ఆ తర్వాత ఇక్కడా రావడంతో డిప్రెషన్ మోడ్లోకి వెళ్లారు. ఇప్పుడు ఎట్లా వస్తుందో, ఎవరి నుంచి వస్తుందో తెలియక ‘యాక్సెప్టెన్స్ మోడ్’(అంగీకరణ)లోకి వెళ్లిపోయి, వచ్చిన దాంతో కలిసి జీవించాలన్న భావనతో చాలా మంది ఉంటున్నారు. యాక్సెప్టెన్స్ మోడ్లో కొందరు మరికొంత ముందుకెళ్లి వచ్చేది రాకతప్పదు అన్నట్టుగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. అయితే పాజిటివ్ వచ్చిన వారు ఏం చేయాలి ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాధి తీవ్రత పెరిగితే ఎవరిని సంప్రదించాలి? వంటి వాటితో పాటు ›ఆదుర్దా, ఆందోళనలు, అనుమానాలు దూరం చేసేందుకు ప్రజలను చైతన్యపరిచే, జాగరూకులను చేసే మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతైతే ప్రస్తుతం బాగా కనిపిస్తోంది. -
మాస్టార్లూ... రోజూ రానక్కర లేదు!
విజయనగరం అర్బన్: కరోనా విస్తృతి కారణంగా ఉపాధ్యాయులు రోజూ బడులకు హాజరుకానక్కర లేదని రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటికే పాఠశాలల పునఃప్రారంభంపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో విద్యాశాఖ ఈ నెలాఖరు వరకు ఉపాధ్యాయుల హాజరు షెడ్యూల్ను ప్రకటించింది. 10వ తేదీలోగా పాఠశాలల సమగ్ర నివేదిక యూ–డైస్లో పొందు పరిచాక 13వ తేదీ నుంచి వారంలో కొన్ని రోజులు మాత్రమే ఉపాధ్యాయులు బడులకు హాజరుకావాలని సూచించింది. మరోవైపు బ్రిడ్జికోర్సుల ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనకు కసరత్తు యధావిధిగా కొనసాగుతుంది. కంటైన్మెంట్ జోన్లు పెరగడం వల్లే... జిల్లాలో 2019–20 యు–డైస్ ప్రకారం ప్రభుత్వ యాజమాన్యంలోని 2,238 ప్రాథమిక పాఠశాలల్లో 1.2 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 212 ప్రాధమికోన్న త పాఠశాలల్లో 47,764 మంది, 366 ఉన్నత పాఠశాలల్లో 1.5 లక్షల మంది చదువుతున్నారు. మొత్తం వివిధ కేడర్ ఉపాధ్యాయులు 10,650 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా కచ్చితంగా పాఠశాలలకు హాజరై యూడైస్నమోదు పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఉపాధ్యాయులు సైతం రోజూ బడులకు వెళ్లి బయోమెట్రిక్ వేసుకుని రికార్డుల నిర్వహణ చేపడుతున్నారు. అయితే జిల్లాలో ఇటీవలి కాలంలో రోజురోజుకూ కంటైన్మెంట్జోన్లు పెరగుతున్నాయి. ఇప్పటికే అధికారుల లెక్కల్లో 92 ఉన్నట్టు తేలింది. దీనివల్ల ఉపాధ్యాయుల హాజరు అంతంత మాత్రంగానే ఉంది. కరోనా వ్యాప్తి, రవాణా సమస్యలను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల పదిలోగా యూ–డైస్ పోర్టర్లో వివరాల నమోదు పూర్తి చేసుకోవాలి. 13వ తేదీ నుంచి రో జూ స్కూళ్లకి వెళ్లనక్కర లేకుండా కొత్త షెడ్యూల్ విడుదలైంది. 13 నుంచి పరిమిత రోజుల్లోనే డ్యూటీ... పూర్తి స్థాయిలో పాఠశాలలు పునఃప్రారంభించే వరకు వారంలో కొన్ని రోజులు మాత్రమే టీచర్లు హాజరు కావాలని ఆ మేరకు షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయులు వారంలో ఒక రోజు (మంగళవారం), ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వారంలో రెండు రోజులు (సోమ, గురువారం) హాజరు కావాలని పేర్కొంది. జిల్లాలో ‘మనబడి నాడు నేడు’ పనులకు ఎంపికైన 1,053 స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎప్పటిమాదిరిగానే రోజూ హాజరై నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయాలని సూచించింది. యధావిధిగా బ్రిడ్జి కోర్సుల బోధన జిల్లాలో కరోనా కారణంగా జిల్లా కేంద్రం, ఇతర మండల కేంద్రాల నుంచి పాఠశాలలకు తక్కువ శాతంలోనే ఉపాధ్యాయులు హాజరవుతున్నట్టు గురువారం వచ్చిన హాజరు నివేదికలు చెపుతున్నాయి. జిల్లాలో నమోదైన 1,600 మంది ఉపాధ్యాయుల అత్యవసర సెలవుల్లో దాదాపు 700 మంది కరోనా కంటైన్మెంట్ జోన్ల సెలవులే ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గకపోవడంతో పాఠశాలలను తెరిచే అవకాశం కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు బ్రిడ్జి కోర్సుల ద్వారా పాఠ్యాంశాలను బోధించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. సాధారణ పరిస్థితులు నెలకొంటే ఆగస్టు 3వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో తెరిచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆ తరువా త సవరించిన సిలబస్ ప్రకారం పండుగ సెలవులను తగ్గించి పాఠ్యాంశాలు బోధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే దూరదర్శన్, ఎఫ్ఎం రేడియో, యూట్యూబ్ ఆధారంగా పాఠాలను విద్యాశాఖ బోధిస్తోంది. విద్యాపరంగా నిమగ్నం చేసేందుకు బ్రిడ్జ్కోర్సులు చేపడుతోంది. నిబంధనల మేరకు హాజరవ్వాలి పాఠశాల విద్యాశాఖ అదేశాల మేరకు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులందరూ నిబంధనలమేరకు విధిగా హాజరుకావాలి. ఈ నెల 13 నుంచి హాజరు షెడ్యూల్ మారింది. ఆ మేరకు పాఠశాలలకు హాజరైతే సరిపోతుంది. అలా హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు పాల్గొంటున్న బ్రిడ్జి కోర్సుల్లో సందేహాలు ఉంటే నివృత్తి చేయాలి. – జి.నాగమణి, డీఈఓ -
కోవిడ్-19 : కేరళ కీలక నిర్ణయం
తిరువనంతపురం: కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారిని దీటుగా నిలువరించేందుకు కోవిడ్-19 నిబంధనలను ఏడాది పాటు పొడిగిస్తూ ఎపిడెమిక్ డిసీజ్ ఆర్డినెన్స్ను సవరించింది. రాష్ట్రంలో కోవిడ్-19 క్రమంగా వ్యాప్తి చెందుతుండటంతో కేరళ ప్రభుత్వం మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలు వచ్చే ఏడాది జులై వరకూ లేదా తదుపరి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసేవరకూ అమల్లో ఉంటాయని పేర్కొంది. తాజా నిబంధనల ప్రకారం 2021 జులై వరకూ ప్రజలు మాస్క్లను ధరించడం, భౌతిక దూరం పాటించడం, జనసమూహాలకు దూరంగా ఉండటం వంటి ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కోవిడ్-19 నిబంధనలు సరిగ్గా అమలయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (ఆ ఔషధం ట్రయల్స్ నిలిపివేత: డబ్ల్యూహెచ్వో) నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేరళ ఎపిడెమిక్ డిసీజెస్ ఆర్డినెన్స్ నిబంధనల కింద చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక కోవిడ్-19 నిబంధనల ప్రకారం వివాహ వేడుకల్లో 50 మందికి మించకుండా పాల్గొనడంతో పాటు మాస్క్లు ధరించి, శానిటైజర్ ఉపయోగించాలి. అతిథుల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలి.అంత్యక్రియలకు 20 మందికి మించకుండా కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాలు, ఫుట్పాత్లపై ఏ ఒక్కరూ ఉమ్మివేసినా కఠిన చర్యలు చేపడతారు. అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి వేడుకలు, గెట్ టు గెదర్, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించడం నిషేధం. ఈ తరహా కార్యక్రమాలకు ముందస్తు అనుమతితో కేవలం 10 మందిని అనుమతిస్తారు. అలాగే షాపులు, వాణిజ్య సంస్థలు సైతం వచ్చే ఏడాది జులై వరకూ కోవిడ్-19 నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. చదవండి : ఇల్లు ఖాళీ చెయ్ -
ఆన్లైన్ విద్యపై మార్గదర్శకాలకు నో
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ప్రైవేట్ పాఠశాలలు ఆన్లైన్ తరగతులు నిర్వహించడంపై ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేయాలన్న ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. మార్గదర్శకాలు జారీ చేయడమంటే ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయంలో జోక్యం చేసుకోవడమే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యార్థుల సమస్యలను, తల్లిదండ్రుల ఇబ్బందులపై ప్రభుత్వమే తగిన నిర్ణయం తీసుకుంటుందని, ప్రభుత్వం చేయాల్సిన విధాన నిర్ణయాలను కోర్టులు తీసుకోబోవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డిల ధర్మాసనం పేర్కొంది. కరోనా సమయంలో ఆన్లైన్ తరగతులకు ఫీజులు చెల్లించాలని ప్రైవేట్ విద్యా సంస్థలు ఒత్తిడి చేస్తు న్నాయని, దీనిపై కూడా ప్రభుత్వానికి తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని హైదరాబాద్కి చెందిన మహమ్మద్ అబ్దుల్ రహీంఖాన్ హైకోర్టును ఆశ్రయించారు. పశ్చిమబెంగాల్లో ఫీజుల్ని రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఉత్తరాఖండ్లో ఫీజులపై మార్గదర్శకాలను జారీ చేసిందని, మన రాష్ట్రానికి సర్క్యులర్ జారీ చేయాలని పిటిషనర్ న్యాయవాది నిజాముద్దీన్ కోరారు. ఆ 2 రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్న తర్వాతే ఆయా హైకోర్టులు ఉత్తర్వులిచ్చాయని ధర్మాసనం గుర్తుచేసింది. లాక్డౌన్ లో ఏప్రిల్ నుంచి ఫీజుల్ని వసూలు చేయరాదని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, లాక్డౌన్ రద్దు చేసిన తర్వాత హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపింది. అలాగే ఉత్తరాఖండ్లో ప్రైవేట్ అన్ఎయిడెడ్ విద్యాసంస్థలు ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో అక్కడి హైకోర్టు జోక్యం చేసుకుందని స్పష్టం చేసింది. మార్గదర్శకాలు విధాన నిర్ణయంలో భాగమని, ఈ విషయంలో కోర్టు తన పరిధిని దాటి ఉత్తర్వులు ఇవ్వదని వివరించింది. అందుకే పిల్ను తోసిపుచ్చుతున్నట్లు తెలిపింది. నింగీ నేలా వదిలేశారేం..! పోలీసులు, హోంగార్డులకు పలు వరాలు ఇచ్చేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలనే ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నింగీ నేలా అని లేకుండా గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. కరోనా నేపథ్యంలో పోలీసులు, హోంగార్డులను నియమించాలని, కరోనా వల్ల చనిపోయిన వాళ్ల కుటుంబసభ్యులకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, హోంగార్డులకు బోనస్, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని, ఈపీఎఫ్, ప్రమాద, ఆరోగ్య బీమా కల్పించాలని కోరుతూ దాఖలైన పిల్ను కొట్టివేసింది. అడగటానికి అంతనేది ఒకటి ఉంటుందని, నింగీ నేలను కూడా వదలకుండా కోరుతున్నారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డిల ధర్మాసనం అభిప్రాయపడింది. పిల్ను న్యాయవాది రాపోలు భాస్కర్ దాఖలు చేయగా న్యాయవాది రంగయ్య వాదనలు వినిపిస్తూ, సొంతంగా ఇళ్లు లేని పోలీసులు, హోంగార్డులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. కరోనా నేపథ్యంలో మాస్క్లు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో పోలీసుల నియామకాలు, వారికి అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలే గానీ తాము కాదని స్పష్టం చేసిన ధర్మాసనం పిల్ను తోసిపుచ్చింది. -
ఢిల్లీలో ప్రతి ఇంట్లో కరోనా పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జులై 6 నాటికి ఢిల్లీలోని ప్రతి ఇంటికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం బుధవారం అధికారులను ఆదేశించింది. దేశంలో కరోనా వైరస్ అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఢిల్లీ రెండవ స్థానంలో ఉంది. అంతేగాక గడిచిన 24 గంటలలో అత్యధికంగా 3,947 కేసులు నమోదయ్యాయి. దీంతో కంటైన్మెంట్ జోన్లలోని ప్రతి ఇంటిలో తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలో ప్రతిరోజూ 2,500లకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా దాదాపు 75 మరణాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిలో 45 శాతం కేసులు కంటైన్మెంట్ జోన్లలోనే నమోదవుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. కాగా కరోనా పాజిటివ్ వ్యక్తులు తప్పనిసరిగా కోవిడ్-19 సంరక్షణ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంట్లోనే ఐసోలేషన్ సౌకర్యం ఉన్నవారు హోంక్వారంటైన్లో ఉండాలని ప్రభుత్వం సూచించింది. (కరోనా అంటిస్తున్నాడని ఇటుకతో..) కరోనా నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇందుకోసం అమలులో ఉన్న ప్రణాళికలను సవరించి వాటి అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. జిల్లా స్థాయిలో పోలీసు కమిషనర్, సివిల్ బాడీ అధికారులు, ఎమ్సీడీ(మున్సిపల్ కార్కొరేషన్ ఆఫ్ న్యూఢిల్లీ) ఎపిడెమియాలజిస్టులు, కోవిడ్-19 టాస్క్ఫోర్స్ న్యాయాధికారులు కరోనా కట్టడి చర్యలను పర్యవేక్షిస్తారు. ఆరోగ్య సేతు యాప్ను పర్యవేక్షించడానికి.. కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ప్రత్యేకంగా ఐటీ నిపుణులను ప్రభుత్వం నియమించింది. కాబట్టి ఇకపై ఆరోగ్యసేతు యాప్ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలని, ముఖ్యంగా కాలుష్య ప్రభావిత పరిసరాల్లోని వారు తప్పనిసరి అని ప్రభుత్వం ఆదేశించింది. (ప్రాణాలే పణంగా..!) సీసీ కెమెరాల ద్వారా పోలీసులు కంటైన్మెంట్ జోన్ల కదలికను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వం చెప్పింది. రాష్ట్ర టాస్క్ఫోర్స్కు ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు. ఇక జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ వ్యక్తులను కోవిడ్-19 సంరక్షణ కేంద్రాలకు పంపించే ఏర్పాట్లు చేయడంతో పాటు కంటైన్మెంట్ జోన్లో 5 నుంచి 10 రోజుల మధ్య కరోనా పరీక్షలు జరుపుతారు. శనివారం(జూన్ 27) నుంచి దేశ రాజధానిలో కరోనా వైరస్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు రోజుకు ఇరవై వేల చొప్పున సేకరించిన నమూనాల ఫలితాలను జూలై 10న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
వీధి వ్యాపారుల గుర్తింపునకు సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారులను గుర్తించేందుకు సర్వేను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన ప్రాజెక్టు (మెప్మా)కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. సర్వే చేయాల్సిన తీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో మంగళవారం సమీక్ష జరిగిన నేపథ్యంలో బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. వీధి వ్యాపారుల కోసం కేంద్రం ప్రవేశ పెట్టిన ‘పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి’పథకంలో లబ్ది దారులను ఎంపిక చేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మున్సిపల్ జనాభాలో కనీసం రెండు శాతం మంది వీధి వ్యాపారులను గుర్తించాలి. ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 0.58శాతం మందినే గుర్తించారు. ఇప్పటి వరకు గుర్తింపునకు నోచుకోని వీధి వ్యాపారులతో పాటు పట్టణ పరిసరాల్లోని వారిని కూడా గుర్తించి ఈ నెల 25వ తేదీలోగా గుర్తింపు కార్డు, వెండింగ్ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించింది. వీధి వ్యాపారుల సర్వే కోసం ప్రత్యేక యాప్ను ఇప్పటికే రూపొందించారు. వారు లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ సర్వేను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్తో పాటు, మెప్మా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు రోజూవారీగా పర్యవేక్షించాలని ఆదేశించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ కార్పోరేషన్లను మినహాయించి రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లో 1.46కోట్ల జనాభా ఉంది. వీరిలో 2,92లక్షల మందిని వీధి వ్యాపారులుగా గుర్తించాల్సి ఉండగా, ఇప్పటి వరకు సుమారు 85వేల మందిని మాత్రమే గుర్తించారు. మరో 2.06లక్షల మందిని వీధి వ్యాపారులుగా గుర్తించేందుకు ప్రస్తుత సర్వేను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. -
షూటింగ్లు ఇలా.. మార్గదర్శకాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ కారణంగా రెండు నెలలకుపైగా నిలిచిపోయిన సినిమా, టీవీ షూటింగులకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు జారీచేసింది. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కారణంగా సినీ పరిశ్రమలో షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇటీవల సడలింపులిచ్చినా.. సినీ పరిశ్రమకు మాత్రం అందులో ఊరట దక్కలేదు. సినీ పెద్దల వినతితో తెలంగాణ సర్కారు షరతులతో షూటింగులు, నిర్మాణానంతర పనులు చేసుకోవచ్చని మంగళవారం అధికారికంగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవీ షరతులు.. ► నిర్మాణానంతర పనులైన డబ్బింగ్, ఎడిటింగ్, సౌండ్మిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, స్క్రిప్టు రైటింగ్ వంటివి చేసుకోవచ్చు. కనిష్టంగా ఇద్దరి నుంచి గరిష్టంగా పదిమందికి మించకూడదు. వీరంతా మాస్కు, శానిటైజర్, భౌతికదూరం తప్పక పాటించాలి. ► చిత్ర/నిర్మాణ ప్రాంగణంలో రోజూ థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. కరోనా సేఫ్టీ గైడ్లైన్స్ విధిగా పాటించాలి. ► సినీ కార్యాలయాల్లో పరిసరాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. ► సభ్యుల ఆరోగ్యంపై నిర్మాత హెల్త్ డిక్లరేషన్ ఇవ్వాలి. అంతా విధిగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలి. ► కలిసి భోజనం చేయడం, తినుబండారాలను పక్కవారితో పంచుకోవడం కూడదు. ► బయటివారిని అనుమతించకూడదు. సభ్యులందరికీ చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్, సోప్ తదితర సౌకర్యాలను విధిగా కల్పించాలి.