
సాక్షి, న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 47,905 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 86,83,917కు చేరాయి. బుధవారం 550 మంది కరోనాతో మరణించగా మరణాల సంఖ్య 1,28,121కు చేరింది. నిన్న దేశ వ్యాప్తంగా 52,718 మంది కోలుకోగా ఇప్పటి వరకు 80,66,501 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు గురువారం కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. చదవండి: కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఐదుగురిలో..
ప్రస్తుతం 4,89,294 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 11,93,358 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా మొత్తం 12,19,62,509 టెస్టులు పూర్తి చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. దేశంలో రికవరీ రేటు 92.89గా ఉంది. మరణాల రేటు 1.48గా ఉంది. చదవండి: ‘ఫైజర్’ వ్యాక్సిన్ భారత్కు వస్తుందా!?
Comments
Please login to add a commentAdd a comment