
ఎన్నికల వేళ మరో హామీ ఇచ్చిన కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోసం పెద్ద ఎన్నికల హామీలు చేస్తూనే ఉన్నారు. ఢిల్లీలో 24 గంటలు స్వచ్ఛమైన నీటిని అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. కాగా ఇంతకుముందు, కేజ్రీవాల్ మహిళా యోజన, సంజీవని యోజన, ఆటో డ్రైవర్లకు హామీ మరియు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తామని వాగ్దానం చేశారు. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓ కాలనీలో మంగళవారం నుంచి 24 గంటల స్వచ్ఛమైన నీటి సరఫరా ప్రారంభిస్తున్నట్లు ఆప్ అధినేత తెలిపారు.
త్వరలో మొత్తం ఢిల్లీలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నామ ని వాగ్దానం చేశారు. మంగళవారం బూస్టర్ పంపింగ్ స్టేషన్ ప్రారం¿ోత్సవం తర్వాత, అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పాండవ్ నగర్ డీడీఏ ఫ్లాట్లకు వెళ్లి... అక్కడ నేరుగా కుళాయిలో నీరు తాగి నీటి నాణ్యతను తనిఖీ చేశారు. కాగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో మహిళా సమ్మాన్ యోజ న, సంజీవని యోజన కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
ముఖ్యమంత్రి ఆతిషి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం తూర్పు కిద్వాయ్ నగర్ నుంచి మహిళా సమ్మాన్ యోజన కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. ఈ పథకం కింద మహిళలకు నెలకు రూ.2,100 అందించనున్నారు. అదేవిధంగా, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత చికిత్స కోసం సంజీవని యోజన కోసం రిజి్రస్టేషన్లు కూడా జంగ్పురా నుంచి ప్రారంభించారు. వీటితో పాటు దళితుల కోసం డాక్టర్ అంబేడ్కర్ సమ్మాన్ స్కాలర్షిప్ పథకాన్ని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment