Water supply
-
తాగునీరే కాదు... తప్పుడు సమాచారమూ సవాలే!
సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో మన దేశం ప్రధానంగా రెండు సవాళ్లను ఎదుర్కోనుంది. వాటిలో ఒకటి తాగునీటి సరఫరా కాగా... మరొకటి తప్పుడు సమాచారం. ఈ రెండు 2025–2027 మధ్య దేశానికి అత్యంత క్లిష్టమైన సమస్యలుగా మారుతాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) హెచ్చరించింది. ఈ సమస్యలను ఇప్పటి నుంచే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలని సూచించింది. ఇటీవల దావోస్లో జరిగిన వార్షిక సమావేశానికి ముందు డబ్ల్యూఈఎఫ్ వార్షిక గ్లోబల్ రిస్క్ రిపోర్టు–2025ను విడుదల చేసింది.ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఎక్కువగా నీటి సరఫరా కష్టాలు ఎదుర్కొనే దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉందని ఈ నివేదిక వెల్లడించింది. మొదటి నాలుగు స్థానాల్లో మెక్సికో, మొరాకో, ట్యునీషియా, ఉజ్బెకిస్తాన్ ఉన్నట్టు ప్రకటించింది. మానవ తప్పిదాలు, పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలతోపాటు పర్యావరణ వ్యవస్థ దెబ్బతినడం వంటి అంశాలు తాగునీటి సమస్యకు కారణమవుతున్నట్లు వివరించింది. నీటి సరఫరా కొరతను ఎదుర్కొనే ‘టాప్ రిస్క్’ దేశాల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతున్నట్టు తెలిపింది. 2024లో నీటి సరఫరా సంక్షోభాన్ని ఏడు దేశాలు ఎదుర్కోగా, 2025 ప్రారంభంలో ఆ సంఖ్య 27కి పెరిగింది. రానున్న కాలంలో మరిన్ని దేశాల్లో ఈ సంక్షోభం తీవ్రతరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.రెండో స్థానంలో తప్పుడు సమాచారం భారతదేశం రానున్న రెండేళ్లలో నీటి సరఫరా సమస్యతోపాటు మరో నాలుగు ప్రమాదాలను ఎదుర్కోనుందని గ్లోబల్ రిస్క్ రిపోర్ట్–2025 వివరించింది. వీటిలో తప్పుడు సమాచారం రెండో స్థానంలో, మానవ హక్కుల ఉల్లంఘన–పౌర స్వేచ్చ క్షీణత మూడో స్థానంలోను, కాలుష్యం నాలుగో స్థానంలోను, కార్మికుల కొరత–ప్రతిభ కొరత ఐదో స్థానంలో ఉంటాయని వెల్లడించింది.గాలి, నీరు, నేల కాలుష్యం వల్ల భారతదేశానికి గణనీయమైన ఆరోగ్య, ఆర్థిక నష్టాలను కలిగిస్తుందని హెచ్చరించింది. వచ్చే రెండేళ్లల్లో ప్రపంచం ఎదుర్కొనే మరో అత్యంత తీవ్రమైన ప్రమాదం విపరీతమైన వాతావరణ మార్పులేనని కూడా ఈ నివేదిక తెలిపింది. అదేవిధంగా విపరీత వాతావరణ మార్పులు మానవ వినాశనానికి దారితీస్తున్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వార్షిక నివేదిక ప్రకటించింది. విపరీత వాతావరణ మార్పుల కారణంగా 2024లో దేశవ్యాప్తంగా 3,238 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. ఇది 2022తో పోలిస్తే 18 శాతం పెరిగినట్లు వెల్లడించింది. -
ఢిల్లీలో ‘24 గంటల స్వచ్ఛమైన నీరు’ అందిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోసం పెద్ద ఎన్నికల హామీలు చేస్తూనే ఉన్నారు. ఢిల్లీలో 24 గంటలు స్వచ్ఛమైన నీటిని అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. కాగా ఇంతకుముందు, కేజ్రీవాల్ మహిళా యోజన, సంజీవని యోజన, ఆటో డ్రైవర్లకు హామీ మరియు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తామని వాగ్దానం చేశారు. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓ కాలనీలో మంగళవారం నుంచి 24 గంటల స్వచ్ఛమైన నీటి సరఫరా ప్రారంభిస్తున్నట్లు ఆప్ అధినేత తెలిపారు. త్వరలో మొత్తం ఢిల్లీలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నామ ని వాగ్దానం చేశారు. మంగళవారం బూస్టర్ పంపింగ్ స్టేషన్ ప్రారం¿ోత్సవం తర్వాత, అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పాండవ్ నగర్ డీడీఏ ఫ్లాట్లకు వెళ్లి... అక్కడ నేరుగా కుళాయిలో నీరు తాగి నీటి నాణ్యతను తనిఖీ చేశారు. కాగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో మహిళా సమ్మాన్ యోజ న, సంజీవని యోజన కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఆతిషి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం తూర్పు కిద్వాయ్ నగర్ నుంచి మహిళా సమ్మాన్ యోజన కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. ఈ పథకం కింద మహిళలకు నెలకు రూ.2,100 అందించనున్నారు. అదేవిధంగా, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత చికిత్స కోసం సంజీవని యోజన కోసం రిజి్రస్టేషన్లు కూడా జంగ్పురా నుంచి ప్రారంభించారు. వీటితో పాటు దళితుల కోసం డాక్టర్ అంబేడ్కర్ సమ్మాన్ స్కాలర్షిప్ పథకాన్ని ప్రకటించారు. -
ఢిల్లీవాసుల హాహాకారాలు.. ఒకవైపు వాయు కాలుష్యం.. మరోవైపు నీటి ఎద్దడి
న్యూఢిల్లీ: ఒకవైపు వాయు కాలుష్యం, మరోవైపు నీటి ఎద్దడి.. ఢిల్లీవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీపావళి సమీపిస్తున్న సమయంలో ఏర్పడిన ఇటువంటి పరిస్థితి అక్కడి ప్రజల ఆనందాన్ని హరింపజేస్తోంది.దేశరాజధాని ఢిల్లీలో ఇప్పటికే పటాసులు కాల్చడంపై నిషేధం కొనసాగుతుండగా, తాజాగా అక్టోబర్ 31 వరకు నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంటుందని ఢిల్లీ జల్ బోర్డు ప్రకటించడం ఆందోళనకరంగా మారింది. ఢిల్లీలో గాలి ఇప్పటికే పూర్ కేటగిరీలో ఉంది. పలు ప్రాంతాల్లో గాలినాణ్యత(ఏక్యూఐ) 400గా ఉంది. ఈ నేపధ్యంలో వాయు కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించే అవకాశం ఉంది.అక్టోబర్ 31 వరకు ఢిల్లీలోని 60కి పైగా ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనున్నదని ఢిల్లీ జల్ బోర్డు తెలిపింది. ఢిల్లీకి పలు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి నీరు సరఫరా అవుతుంది. 110 ఎంజీడీ భార్గతి ప్లాంట్, 140 ఎంజీడీ సోనియా విహార్ ప్లాంట్కు నీరు ప్రధానంగా గంగా కెనాల్ నుండి వస్తుంది. యూపీ నీటిపారుదల బోర్డు దీనికి అక్టోబర్ 12 నుండి 31 వరకు మరమ్మతు పనులు చేయనుంది.ఈ కారణంగా ఈ ప్లాంట్లను మూసివేయనున్నారు. అటువంటి పరిస్థితిలో యమునా నది నుండి ఢిల్లీకి నీటిని సరఫరా చేయనున్నారు. అయితే యమునా నీటిలో అమ్మోనియా స్థాయి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ నీటిని పరిశుభ్రపరిచేందుకు ఇబ్బందులు ఎదురువుతుంటాయి. ఫలితంగా ఢిల్లీకి నీటి సరఫరా తగ్గిపోయింది. ఇదే ఢిల్లీలో నీటి ఎద్దడికి కారణంగా నిలుస్తోంది. అయితే అవసరమైన ప్రాంతాలకు ట్యాంకార్ల ద్వారా ప్రభుత్వం నీటిని సరఫరా చేస్తుంటుంది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల -
తిరుమలలో నీటి కోతలు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుమల: శ్రీవారి దివ్యక్షేత్రం తిరుమల చరిత్రలో ఎన్నడూలేని విధంగా నీటి సరఫరాపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆంక్షలు విధించింది. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో సకాలంలో వర్షం కురవనందున జలాశయాల్లో నీటి నిలువలు పూర్తిగా తగ్గిపోయాయని.. ఫలితంగా 130 రోజులకు సరిపడా మాత్రమే నీటి నిల్వలు ప్రస్తుతం ఉన్నాయని టీటీడీ ప్రకటించింది. అందుకే నీటి సరఫరాపై ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించింది. స్థానిక నివాస ప్రాంతమైన బాలాజీ నగర్తో పాటు వ్యాపార ప్రదేశాలకు, దాతలు నిర్మించిన అతిథి గృహాలకు సైతం కోతలు విధిస్తున్నామని.. ఈనెల 25 నుంచి ఇది అమలులోకి రానున్నట్లు తెలిపింది. కానీ, తిరుమలలో వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. తిరుమల చరిత్రలో ఎన్నడూలేని విధంగా నీటి సరఫరాపై ఆంక్షలు విధించటంపై స్థానికులతో పాటు శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా నీటి వృథాను అరికట్టేందుకు.. ఇక తిరుమలలో గత ఐదేళ్ల కాలంలో కురిసిన వర్షాలకు జలాశయాలన్నీ నిండిపోవటంతో నీటిని కిందికి సైతం విడిచిపెట్టారు. ఇరిగేషన్ అధికారుల లెక్కల ప్రకారం ఒక మనిషి రోజుకి 90 లీటర్ల నీరు అవసరం. అలాగే, టీటీడీ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం తిరుమలలో ప్రతిరోజూ 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు. అందులో 18 లక్షల గ్యాలన్ల నీటిని తిరుమలలోని డ్యాంల నుంచి, మిగిలిన నీటిని తిరుపతి కళ్యాణీ డ్యాం నుంచి సేకరిస్తున్నారు.తిరుమల గోగర్భం, ఆకాశగంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యాంల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు. అయితే, ప్రస్తుతం తిరుమలలో కేవలం 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉందని టీటీడీ చెబుతోంది. అక్టోబరు 4 నుంచి 12 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలను సందర్శించే వేలాది మంది భక్తుల ప్రయోజనాల దృష్ట్యా నీటి వృధాను అరికట్టడంతో పాటు నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు టీటీడీ చెబుతోంది. నిండుగా తిరుమల జలాశయాలు.. నిజానికి.. ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది జూలై, ఆగస్టు (వారం క్రితం వరకు) నెలల్లో మంచి వర్షాలు కురవగా.. తిరుమల జలాశయాలు నిండుగా ఉన్నాయి. ఇక తిరుమల జలాశయాలతో పాటు, తిరుపతి కళ్యాణీ డ్యాంలో 210 రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులూ చెబుతున్నారు. మరోవైపు.. తిరుమలకు సంబంధించి అక్టోబరులో భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు అధికారులు.ఇన్ని జలాశయాలు ఉన్నా.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. సాధారణ రోజుల్లో 60 వేల నుంచి 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటుండగా.. రద్దీ రోజుల్లో లక్షమంది వరకు భక్తులు వస్తుంటారు. తిరుమలలో నివాస ఉద్యోగులు, స్థానికులు మరో 20 వేల వరకు ఉంటారు. భక్తులు, స్థానికులు, వ్యాపార కేంద్రాలు, అతిథిగృహాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ తిరుమలలో గోగర్భం, పాపవినాశం, ఆకాశగంగా జలాశయాలతో పాటు కుమారధార, పసుధార జంట జలాశయాలను నిర్మించింది. వీటి ద్వారా నిత్యం పరిశుభ్ర జలాలు సరఫరా చేస్తున్నారు. అదే విధంగా తిరుపతిలోని కళ్యాణి డ్యాం నుంచి నీటిని వినియోగిస్తున్నారు. భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకుని శ్రీకాళహస్తి సమీపంలో కైలాసగిరి రిజర్వాయర్ నుంచి పైప్లైన్ ద్వారా నీటిని తిరుమలకు తరలించేందుకు టీటీడీ రూ.40 కోట్లు కేటాయించింది. దీంతో భవిష్యత్తులో కూడా తిరుమలకు తాగునీటి కష్టాలు తలెత్తవని భావిస్తున్న తరుణంలో టీటీడీ తాజా నిర్ణయం అందరినీ షాక్కు గురిచేస్తోంది.ఇదో అనాలోచిత నిర్ణయం.. ఎండా కాలంలోనే నీటి సరఫరా బాగా జరిగిందని, ఇప్పుడు వర్షాకాలంలో ఈ నీటి ఆంక్షలు, కోతలేంటంటూ భక్తులతో పాటు స్థానికులు టీటీడీ నిర్ణయంపై మండిపడుతున్నారు. పైగా.. తిరుమలలో వ్యాపారులకు, స్థానికులకు నీటి కష్టాలు ఎప్పుడూలేవు. కరువు సమయంలో కూడా నీటి సమస్య తలెత్తకుండా టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసింది. తిరుపతి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించిన ఉదంతాలను గుర్తుచేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితులు దీనికి భిన్నంగా మారిపోయాయని.. టీటీడీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా ఇది ఓ అనాలోచిత నిర్ణయమని వారంటున్నారు. కైలాసగిరి రిజర్వాయర్కు బ్రేక్.. కైలాసగిరి రిజర్వాయర్కి సంబంధించిన అదనపు పైప్లైన్ నిర్మాణం పనులు ఇప్పటికే 50 శాతం వరకు పూర్తయింది. దీనికి సంబంధించిన నిధుల కేటాయింపు జరిగి పనులు సకాలంలో పూర్తయితే నీటి కొరత సమస్య తలెత్తే అవకాశంలేదు. కానీ, టీటీడీలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుగుతుండడంతో కైలాసగిరి రిజర్వాయర్ పనులకు సంబంధించిన నిధుల చెల్లింపును ఆర్థిక శాఖ పక్కన పెట్టింది. నూతన పాలక మండలి ఆమోదం తెలిపిన అనంతరం నిధుల చెల్లింపు ప్రక్రియ చేపట్టాలని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టంచేయటంతో అవి నిలిచిపోయాయి. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోకుండా నీటి సరఫరాపై ఆంక్షలు విధించడం ఏమిటని స్థానికులతో పాటు భక్తులు ప్రశ్నిస్తున్నారు.నీటిపై ఆంక్షలిలా..ప్రస్తుతం తిరుమలలో సుమారు 130 రోజులకు సరిపడా నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని టీటీడీ అంటోంది. అందుకే నీటి సరఫరాపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా.. తిరుమలలో స్థానికులు నివాసం ఉంటున్న బాలాజీ నగర్లో ఆరు రోజులకు ఒకసారి నీటి సరఫరా చేస్తారు. వ్యాపార సంస్థలకు ఉ.4 గంటలు, సా.4 గంటలు మాత్రమే సరఫరా జరుగుతుంది. తిరుమలలో నిర్మిస్తున్న అతిథి గృహాలకు పూర్తిగా నీటి సరఫరా బంద్ చేస్తారు. నిర్మాణాలకు నీటి అవసరం ఉంటే తిరుపతి నుంచి ట్యాంకర్ ద్వారా దాతలు తరలించుకోవాల్సిందే. -
హైదరాబాద్కు మల్లన్నసాగర్ జలాలు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మంచి ‘నీటి’కబురు చెప్పింది. నగర తాగునీటి అవసరాలు తీర్చేందుకు గోదావరి మంచినీటి సరఫరా ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.5,560 కోట్లు కేటాయిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ మంగళవారం ఉత్తర్వులు (జీవో నంబర్ 345) జారీ చేశారు. ఈ పథకం ద్వారా నగరానికి అదనపు జలాలను తరలించడంతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలను పునరుజ్జీవింప చేయనుంది. హైబ్రిడ్ యాన్యుటీ (బీఓటీ + ఈపీసీ) మోడ్లో పనులు పూర్తి చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు వివిధ మార్గాల ద్వారా 580 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ పర్ డే)ల నుంచి 600 ఎంజీడీల నీటి సరఫరా జరుగుతోంది. అయితే 2030వ సంవత్సరం వరకు నీటి అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని అదనంగా 170 ఎంజీడీల జలాల్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండటంతో ఈ అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్–2ను చేపట్టాలని నిర్ణయించింది. 2030వ సంవత్సరం నాటికి హైదరాబాద్ నగర తాగునీటి డిమాండ్ 750 ఎంజీడీలకు పెరుగుతుందనే అంచనా ఉండగా, 2050 నాటికి ఇది 1,014 ఎంజీడీలకు పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. డీపీఆర్ సిద్ధం చేసిన వాప్కోస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను వాప్కోస్ కంపెనీ సిద్ధం చేసింది. ప్రాజెక్టులో భాగంగా పంప్హౌస్లు, సబ్స్టేషన్లు, మల్లన్నసాగర్ నుంచి ఘన్పూర్ వరకు 3,600 ఎంఎం డయా భారీ పైప్లైన్ నిర్మించనున్నారు. ఘన్పూర్ వద్ద 780 ఎంఎల్డీల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఘన్పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపడతారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో ఎస్టీపీ (సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)ల ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.3849.10 కోట్లు కేటాయించింది. తాజాగా రూ.5,560 కోట్లు కేటాయించడంతో మొత్తంగా నగరానికి రూ.9410 కోట్లు కేటాయించినట్లయింది. మొత్తం 15 టీఎంసీల తరలింపుగోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై (జీడీడబ్ల్యూఎస్) పథకం ఫేజ్–1 కింద నగర ప్రజల నీటి అవసరాల కోసం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీటిని తరలిస్తోంది. తాజాగా రెండో దశ పథకం ద్వారా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 15 టీఎంసీల నీటిని వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 15 టీఎంసీల్లో 10 టీఎంసీల నీటిని నగర ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మిగతా ఐదు టీఎంసీల నీటిని మూసీ ప్రక్షాళనతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలను పునరుజ్జీవింప చేసేందుకు ఉపయోగించనున్నారు. -
‘కృష్ణా’లో సిరుల పంట
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ప్రాజెక్టుల కింద ఈ ఏడాది సిరుల పంట పండనుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కృష్ణా నది పరీవాహకంలోని చిన్నా, పెద్దా అన్ని ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ సిద్ధమైంది. కృష్ణా ప్రాజెక్టుల కింద ఉన్న 14.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు 125 టీఎంసీలు.. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల కింద 17.95లక్షల ఎకరాల ఆయకట్టుకు 188 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. శనివారం జలసౌధలో నీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్కుమార్ నేతృత్వంలో రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశమైంది. కృష్ణా, గోదావరి బేసిన్ల లోని జలాశయాల్లో ప్రస్తుత నీటి లభ్యత, సమీప భవిష్యత్తులో రానున్న వరద ప్రవాహాల అంచనాపై విస్తృతంగా చర్చించింది. రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద.. ప్రస్తుత ఖరీ ఫ్లో మొత్తం 33లక్షల ఎకరాలకు 314 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని తీర్మానించింది. ఈ ప్రతిపాదనలను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించి ఆమోదం పొందనుంది. సమావేశంలో ఈఎన్సీ (ఓఅండ్ఎం) బి.నాగేందర్రావుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చీఫ్ ఇంజనీర్లు పాల్గొని తమ పరిధిలోని ప్రాజెక్టుల పరిస్థితి, ఆయకట్టుకు సాగునీటి సరఫరా కోసం ప్రతిపాదనలు సమరి్పంచారు. కృష్ణాలో ముగిసిన క్రాప్ హాలిడే.. గత ఏడాది కృష్ణా బేసిన్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నీళ్లు లేక వెలవెలబోయాయి. దీనితో గత రబీలో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చింది. ప్రస్తుతం బేసిన్ పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, మూసీ తదితర ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీటి లభ్యత ఉండటంతో.. అన్ని ప్రాజెక్టుల కింద పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందనుంది. జూన్లో వర్షాకాలం మొదలవగా.. రెండు నెలల్లోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండిపోయాయి. ఎగువ నుంచి కృష్ణాలో భారీ వరద కొనసాగుతోంది. దీనితో పరీవాహక ప్రాంతంలో ఆయకట్టుకు ఈ ఏడాది ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి శుక్రవారమే నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు సాగునీటి విడుదలను ప్రారంభించడం గమనార్హం. సాగర్ నుంచి ఇంత ముందే నీళ్లు విడుదల చేయడం గత పదేళ్లలో ఇది రెండోసారి. 2021లో సైతం ఆగస్టు 2వ తేదీనే సాగర్ నుంచి సాగునీటి విడుదల ప్రారంభించారు. గోదావరిలో లోయర్ మానేరు దిగువన కష్టమే..! గోదావరి నదిలో పైనుంచి వరదలు పెద్దగా రాక.. ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆశించిన మేరకు లేకుండా పోయింది. ఈ క్రమంలో లోయర్ మానేరు ప్రాజెక్టు వరకు ఉన్న ఆయకట్టు వరకే నీటి సరఫరాపై స్కివం కమిటీ నిర్ణయం తీసుకుంది. దాని దిగువన ఉన్న ప్రాజెక్టులతోపాటు సింగూరు ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై మరో 15 రోజుల తర్వాత సమావేశమై.. అప్పటి నీటి లభ్యత ఆధారంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 42.81 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఎగువ నుంచి కాస్త వరద కొనసాగుతోంది. దీనితో ఈ ప్రాజెక్టు కింద మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనికట్కు నీళ్లను తరలించి దాని కింద ఉన్న 21వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. -
హైదరాబాద్: పలు ప్రాంతాల్లో నేడు, రేపు నీటి సరఫరాకు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు(బుధ, గురు) నీటి సరఫరాలో అంతరాయం కలగనుందని జలమండలి వెల్లడించింది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 లోని కోదండాపూర్ పంప్ హౌజ్ లో రెండో పంపు ఎన్ఆర్వీ వాల్వ్ మరమ్మతులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్లు - 2, 3, 4, 5, 7, 9, 10(A), 10(B), 13, 14, 16, 20 పరిధిలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు తాగునీటి సరఫరాలో కొన్నిచోట్ల పూర్తి అంతరాయం కలుగుతుంది.ఎన్పీఏ, మిరాలం, బాలాపూర్, మైసారం, బార్కాస్ భోజగుట్ట, ఆళ్లబండ, మేకలమండి, భోలక్ పూర్, చిలకల గూడ, తార్నాక, లాలాపేట్, బౌద్ధ నగర్, మారేడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, MES, కంటోన్మెంట్, ప్రకాశ్ నగర్, పాటిగడ్డ, హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్, వైశాలి నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కపురి కాలనీ, మహీంద్రహిల్స్, ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కా నగర్, బీరప్పగడ్డ, బుద్వేల్, శాస్త్రిపురం, మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్ ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడుతుంది. ఆ ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు సూచించారు. -
ఢిల్లీలో దాహం.. దాహం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీవ్ర జల సంక్షోభం నెలకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి నీటి సరఫరా తగ్గడంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి దారుణంగా పెరిగింది. యమునా నదీ జలాల సరఫరా విషయంలో ఢిల్లీ, హరియాణా, హిమాచల్ప్రదేశ్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరడంతో నీటి కష్టాలు తీవ్రమయ్యే ప్రమాదకర పరిస్థితి దాపురించింది. మండుతున్న ఎండలకు తోడు నీటి కొరతతో ప్రజలు అల్లాడుతుంటే ట్యాంకర్ మాఫియా, రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ఈ సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. ఆగిన సరఫరా.. తగ్గిన నిల్వలుఢిల్లీ తాగునీటి అవసరాల్లో 90 శాతం యమునా నదీ మునాక్ కాలువ ద్వారా తీరుతోంది. మరికొంత ఉత్తర్ప్రదేశ్లోని ఎగువ గంగ కాల్వల ద్వారా వచ్చే నీటితో ఢిల్లీ నీటి కష్టాలు తీరుతున్నాయి. యమునా నదిపై ఉన్న చంద్రవాల్, వజీరాబాద్, ఓక్లా నీటి శుద్ధి కర్మాగారాలుసహా మరో నాలుగు ప్లాంట్ల ద్వారా ఢిల్లీకి అవసరమైన నీటి సరఫరా జరుగుతోంది. ఢిల్లీకి ప్రతి రోజూ 1,200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉండగా ఢిల్లీ జల్ బోర్డు 950 మిలియన్ గ్యాలన్ల నీటినే సరఫరా చేస్తోంది. హరియాణా ప్రభుత్వం మునాక్ ఉప కాల్వల ద్వారా 683 క్యూసెక్కులు, ఢిల్లీ చిన్న కాల్వల ద్వారా మరో 330 క్యూసెక్కుల నీటిని వజీరాబాద్ నీటి శుద్ధి రిజర్వాయర్కు సరఫరా చేయాల్సి ఉంది. మొత్తంగా రోజుకి 1,013 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉన్నా హరియాణా ప్రభుత్వం కేవలం 840 క్యూసెక్కుల నీటినే విడుదల చేస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. హరియాణా నీటి సరఫరాను తగ్గించడంతో ఉత్తర, పశ్చిమ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ రిజర్వాయర్లో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. రిజర్వాయర్లో సగటు నీటి మట్టం 674.5 అడుగులు కాగా ప్రస్తుతం 669 అడుగులకు పడిపోయింది. దీంతో రిజర్వాయర్ నుంచి రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే విడుదల అవుతోందని ఢిల్లీ జల వనరుల మంత్రి అతిశి ఆరోపించారు. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గి ట్యాంకర్లపై జనం ఆధారపడుతున్నారు. ఇదే అదునుగా ట్యాంకర్ మాఫియా రెచ్చిపోయింది. ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తోంది. నీటి ఎద్దడి అంశంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హరియాణా ముఖ్యమంత్రి నయాబ్సింగ్ షైనీతో మాట్లాడి, నీటి సరఫరా పెంచే విషయమై చర్చలు జరుపుతున్నారు. మునాక్ కాలువ, ఇతర కాల్వల నుంచి ట్యాంకర్ మాఫియా నీటి దోపిడీపై ప్రత్యేక దర్యాప్తు బృందంచే విచారణ చేపట్టాలని బుధవారం బీజేపీ రాష్ట్ర శాఖ డీజీపీకి విజ్ఞప్తి చేసింది. నీటి ఎద్దడికి రాజధానిలా మారుతున్న ఢిల్లీలో చాలా కాలనీల్లో ఎటు చూసినా మహిళలు, చిన్నారులు బిందెలు, బకెట్లు పట్టుకుని పెద్దపెద్ద క్యూ లైన్లలో నిల్చున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. మాట మార్చిన హిమాచల్ప్రదేశ్ఇన్నాళ్లూ నీటిని సరఫరా చేసిన హిమాచల్ ప్రదేశ్ మాట మార్చింది. తమ వద్ద 135 క్యుసెక్కుల మిగులు జలాలు లేవని, కావాలంటే యమునా బోర్డును ఆశ్రయించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హిమాచల్ నుంచి హరియాణాకు వచ్చిన మిగులు జలాలను ఢిల్లీ కోసం విడుదల చేయాలంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసిన నేపథ్యంలో ప్రతిగా హిమాచల్ సర్కార్ కోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఈ కేసును గురువారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బి.వరాలేల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ‘‘ నీటి నిర్వహణలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైంది. కాల్వల ద్వారా నీటి పంపిణీ నష్టాలను తగ్గించడంలో, నీటి చౌర్యాన్ని నియంత్రించడం, తలసరి నీటి వినియోగాన్ని నియంత్రించడంలో ఢిల్లీ వైఫల్యం చెందింది. అభివృధ్ధి చెందుతున్న దేశాల్లో పంపిణీ నష్టాలు 10శాతం ఉంటే ఢిల్లీలో ఏకంగా 52.35 శాతం నష్టాలు ఉన్నాయి. కేంద్ర పట్టణాభివృధ్ధి శాఖ నిర్దేశకాల ప్రకారం పట్టణ నీటి తలసరి సరఫరా 135 లీటర్లుగా ఉంటే ఢిల్లీలో అతిగా 172 లీటర్లు సరఫరాచేస్తున్నారు. హిమాచల్ వద్ద వాస్తవానికి మిగులు జలాలు లేవు. ఉన్నాయంటూ గతంలో ఇచ్చిన ప్రకటనను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వండి’ అని హిమాచల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ ఇదెంత తీవ్రమైన అంశమో మీకు తెలియట్లేదు. మీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలో వద్దో తర్వాత తేలుస్తాం’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో గత ప్రకటన ఉపసంహరణకు పద్దతి ప్రకారం అఫిడవిట్ సమర్పిస్తానని అడ్వకేట్ జనరల్ చెప్పారు.మాకంత నైపుణ్యం లేదుహిమాచల్ వాదనలు విన్నాక మానవతా దృక్పథంతో నీటిని సరఫరా చేయాలని సాయంత్రంకల్లా ఎగువ యమునా జలబోర్డ్ వద్ద దరఖాస్తు పెట్టుకోవాలని ఢిల్లీ సర్కార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘ యమునా నదీ జలాల పంపకం అనేది సంక్లిష్టమైన వ్యవహారం. ఇప్పటికిప్పుడు మధ్యేమార్గంగా నదీజలాల పంపకం సమస్యను తీర్చేంత స్థాయిలో మాకు సాంకేతిక నైపుణ్యం లేదు. 1994 అవగాహనా ఒప్పందం ద్వారా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న యమునా బోర్డే ఈ సమస్యకు పరిష్కారం చూపగలదు. అదనంగా 150 క్యూసెక్కుల కోసం ఢిల్లీ గతంలోనే దరఖాస్తు చేసుకుంది. దానిపై జలబోర్డ్ త్వరగా నిర్ణయం వెలువర్చాలి. లేదంటే శుక్రవారం నుంచి రోజువారీగా బోర్డ్ సమావేశమై సమస్యను పరిష్కరించాలి’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.ఢిల్లీ ప్రభుత్వ వాదనేంటి?నీటి ట్యాంకర్ల మాఫియాపై ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం తలంటిన నేపథ్యంలో గురువారం కేజ్రీవాల్ సర్కార్ అఫిడవిట్ సమర్పించింది. ‘‘ ట్యాంకర్ల మాఫియా హరియాణా వైపు ఉన్న యమునా నది వెంట రెచ్చిపోతోంది. ఆ ప్రాంతం ఢిల్లీ జలబోర్డ్ పరిధిలోకి రాదు. అసలు అక్కడ చర్యలు తీసుకునే అధికారం ఎవరికి ఉందో తేల్చాలని ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్కు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. స్పందన శూన్యం. హరియాణా నుంచి ఢిల్లీకి నీటి సరఫరా వృథాను 30 శాతం ఉంచి ఐదు శాతానికి తగ్గించాం’’ అని అఫిడవిట్లో పేర్కొంది. గురువారం ఢిల్లీ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదించారు. ‘‘ జలబోర్డులు ప్రభుత్వ అనుకూల అధికారులతో నిండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కమిటీ వేసి సుప్రీంకోర్టే సమస్యను పరిష్కరించాలి’ అని అన్నారు. ఈ వాదనతో హరియాణా విభేధించింది. ‘‘ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ బ్యారేజీలో కనీస నీట నిల్వలు ఉండాల్సిందే. అతి సరఫరా కుదరదు. ఈ అంశాన్ని యమునా బోర్డ్కు వదిలేస్తే మంచిది’ అని హరియాణా తరఫున లాయర్ శ్యామ్ దివాన్ వాదించారు. ఈ అంశాన్ని ఇకపై జలబోర్డే చూసుకుంటుందని అదననపు సొలిసిటర్ జనరల్ విక్రమ్జీత్ బెనర్జీ చెప్పారు. దీంతో జలబోర్డులో తేల్చుకోండంటూ ఢిల్లీ సర్కార్ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. మరోవైపు రోజుకు 5 కోట్ల గ్యాలెన్ల నీటి సరఫరా తగ్గడంతో నీటిని వృథా చేయకండని ఢిల్లీవాసులకు ప్రభుత్వం సూచనలు చేసింది. -
ఎండల తీవ్రత ముదురుతున్నా.. జూన్ వరకు నీటి సమస్య రాదు
సాక్షి, హైదరాబాద్: ఎండల తీవ్రత ముదురుతున్నా.. వచ్చే జూన్ వరకు రాష్ట్రంలో తాగునీటి సమస్య అధికం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో తాగునీటి ఎద్దడి కాస్త అధికంగా ఉన్నట్లు గుర్తించామనీ, అలాగే 67 మున్సిపాలిటీలను సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. తాగునీటి సమస్యపై ప్రతీరోజు ఉన్నతస్థాయిలో సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. తాగునీటి సమస్య పర్యవేక్షణకు ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించిన విషయాన్ని గుర్తు చేసింది. ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందన తాగునీటి సమస్య ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చినా, వార్తలు వచ్చినా వెంటనే అధికార యంత్రాంగం స్పందిస్తోందని ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 143 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఉంటే.. అందులో 130 మునిసిపాలిటీల్లో సాధారణ రోజులతో పోలిస్తే పదిశాతం మేరకు నీటి కొరత ఉన్నా.. ప్రజలకు సరిపడే తాగునీటి సరఫరా జరుగుతోందని వివరించింది. సాధారణ రోజుల్లో ఈ పట్టణాల్లో సగటున 1398.05 ఎల్ఎండీ(మిలియన్స్లీటర్స్ పర్ డే) తాటి సరఫరా జరిగితే ప్రస్తుతం 1371 ఎల్ఎండీల నీటి సరఫరా జరుగుతోందని, 26.31 ఎల్ఎండీల కొరత ఏర్పడిందని స్పష్టం చేసింది. పది మునిసిపాలిటీలతోపాటు, రెండు కార్పొరేషన్లలో అధికంగా నీటి ఎద్దడి ఉన్నట్లు గుర్తించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఖమ్మం, కరీంనగర్లో ప్రత్యామ్నాయ చర్యలు ఖమ్మం, కరీంనగర్లో ఎండలు ముదిరే కొద్ది నీటి ఎద్దడి పెరుగుతుందన్న అంచనాతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. 27 పట్టణాల్లో 135 ఎల్ పీసీడీ(లీటర్స్ పర్ పర్సన్ పర్డే) కంటే ఎక్కువ నీటి సరఫరా జరుగుతుంటే, 48 పట్టణాల్లో 100 నుంచి 135 ఎల్పీసీడీల మధ్య, 67 మునిసిపాలిటీల్లో 100 ఎల్పీసీడీ కంటే తక్కువ సరఫరా జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 23,839 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతుందని, గ్రామాల్లో నీటి ఎద్దడి లేదని భగీరథ అధికారవర్గాలు చెబుతున్నాయి. గ్రామాల్లో వంద ఎల్పీసీడీ నీటి సరఫరా జరుగుతోంది. అందుబాటులో గ్రిడ్, స్టాండ్ బై పంపులు మంచినీటి సమస్య ఎక్కడైనా తలెత్తితే గ్రిడ్ పంప్లతోపాటు, స్టాండ్బై పంపులు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా స్థాయిలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు జిల్లా కలెక్టర్లకు మొత్తం రూ. 100 కోట్లు నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. నాగార్జునసాగర్ నుంచి పాలేరు, ఉదయ సముద్రం రిజర్వాయర్ల నుంచి నల్గొండ, ఖమ్మం పట్టణాలకు నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేట్టింది. మిడ్ మానేర్, లోయర్ మానేరు నుంచి కరీంనగర్ నగరానికి నీటిని అందించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైతే కర్ణాటక లోని నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి కొంత నీటిని విడుదల చేయాలంటూ అక్కడి ప్రభుత్వాన్ని కోరాలని ఇప్పటికే ఇరిగేషన్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది. నారాయణపూర్ నుంచి జూరాల రిజర్వాయర్కు వచ్చే నీటితో గద్వాల మిషన్ భగీరథకు తాగునీటి సరఫరా చేసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు 131 పట్టణాల్లో అందుబాటులో ఉన్న 294 ప్రభుత్వ ట్యాంకర్లతో పాటు 97 ట్యాంకర్లను అద్దెకు తీసుకుని, అత్యవసరమైతే ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నీటి మట్టాలు తగ్గడం వల్లనే ఎద్దడి గడిచిన అక్టోబర్ నుంచి వర్షాలు లేకపోవడం, గోదావరి, కృష్ణా రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గడం వల్ల తాగునీటి సమస్య ఉత్పన్నం అయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
నీళ్లను దాచిపెట్టిన రేవంత్ సర్కార్..
-
వేసవిలోనూ పుష్కలంగా తాగునీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే జూన్ నెలాఖరు వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తి కావచ్చిన మంచినీటి పథకాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్పష్టంచేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ఆదేశించారు. తాగునీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వేసవి నీటి ఎద్దడిని అధిగమించేందుకు రూ.115 కోట్ల అంచనాతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. బోర్వెల్స్ సహా ఇతర తాగునీటి వనరులన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి ఎద్దడి గల ఆవాసాలు, శివారు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా ప్రతి రోజూ తాగునీరు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కుళాయిల ద్వారా రోజుకొకసారి తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. ఎక్కడైనా మంచినీటికి ఇబ్బంది కలిగితే 1904 కాల్సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. పశువులకు కూడా తాగునీటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ బోరులను అద్దెకు తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న బోరులను మరింత లోతు చేయడం.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపడం వంటి పనులు చేస్తున్నట్లు చెప్పారు. నీటి ఎద్దడి ఉన్న 1,354 ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయగా.. ఈనెలలో 109 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు అనుమతి మంజూరు చేశామని తెలిపారు. మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ శ్రీకేశ్ బాలాజీరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం 47 పట్టణ స్థానిక సంస్థల్లో రోజుకు ఒకసారి, 29 యూఎల్బీల్లో రోజుకు 2సార్లు, 43 చోట్ల 2 రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కడప, పెనుగొండ, ఒంగోలు, హిందూపురంలో మూడు రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా చేస్తున్నామని.. ఇక్కడ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు ఎస్ఎస్ రావత్, కేవీవీ సత్యనారాయణ, ఆర్వీ కృష్ణారెడ్డి, ఆనందరావు పాల్గొన్నారు. -
నల్లా ఇరుక్కు!
మీ ఇంట్లో నల్లాల ద్వారా నీరొస్తోందా.. దాన్ని నేరుగా తాగుతున్నారా? లేదా ఏదైనా ఫిల్టర్లో వేసి తాగుతున్నారా? అత్యధిక శాతం ప్రజలు ఫిల్టర్లనే వాడుతుంటారు. ఎందుకంటే.. మంచి నీళ్లని చెబుతున్నా.. అవన్నీ మంచిగా ఉన్నవేనా అన్న డౌటు. ఫిల్టరైజేషన్ చేయకుంటే.. రోగాల బారినపడతామన్న భయం. అయితే.. కొన్ని దేశాల్లో నల్లా నీటిని నేరుగా తాగేయొచ్చు. ఎందుకంటే.. తాగునీటి సరఫరా విషయంలో ఇవి కఠిన నిబంధనలు పాటిస్తున్నాయి. సురక్షితమైన నీటిని నల్లాల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నాయి. అందుకే ఈ కింది దేశాల్లోని నీరు ‘నల్లా ఇరుక్కు’అన్నమాట!! చాలా సినిమాల్లో ఈ మాట విన్నట్లు అనిపిస్తోంది కదూ.. ఈ తమిళ పదానికి అర్థం ఇది బాగుంది లేదా మంచిది అని. మార్చి 22న ‘అంతర్జాతీయ నీటి దినోత్సవం’ నేపథ్యంలో.. ఈ ‘నల్లా ఇరుక్కు’ దేశాల టాప్–10 వివరాలివీ.. ఫిన్లాండ్ ప్రకృతి సహజ వనరులకు పెట్టింది పేరైన ఫిన్లాండ్లో అత్యాధునిక వ్యవస్థలతో విస్తృతంగా నీటి శుద్ధి చేపడతారు. ఇక్కడ నల్లాల ద్వారా సరఫరా చేసే మంచి నీరు ప్రపంచంలోనే సురక్షితమైనదిగా పేరుపొందింది. ఐస్ల్యాండ్ ఈ దేశంలో హిమానీ నదాలు (గ్లేసియర్లు), వేడి నీటి ఊటల నుంచి వచ్చే నీరు సాధారణంగానే సురక్షితమైనది. ఆ నీటినే మరికాస్త శుద్ధిచేసి ఇళ్లకు సరఫరా చేస్తారు. స్విట్జర్లాండ్ కలుషితాల విషయంలో కఠిన నిబంధనలు, శుద్ధి చేసేందుకు అనుసరించే విధానాలతో ఈ దేశంలో నల్లా నీళ్లు సురక్షితమైనవిగా గుర్తింపు పొందాయి. ఆస్ట్రియా ఇక్కడి పర్వత ప్రాంతాలు, వాటికి అనుబంధంగా ఉన్న మంచి నీటి వనరులకు తోడు.. నీటి సంరక్షణ చర్యలు, కఠిన నిబంధనలతో నాణ్యమైన నీటిని ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. నార్వే హిమానీనదాలు, ఇతర మంచి నీటి వనరులు అందుబాటులో ఉండటం, నీటి శుద్ధికి అత్యంత ఆధునిక విధానాలు అవలంబించడంతో.. సురక్షిత నీరు సరఫరా చేసే దేశాల్లో నార్వే ఒకటిగా నిలిచింది. నెదర్లాండ్స్ మంచినీటి వనరులు మరీ ఎక్కువగా లేని దేశమే అయి నా.. నీటి శుద్ధి, నల్లాల ద్వారా పరిశుభ్రమైన నీటి సరఫరా విషయంలో ముందు నుంచీ మంచి ప్రమాణాలు పాటిస్తోంది. మాల్టా ఇది చుట్టూ ఉప్పునీరే కమ్ముకుని ఉన్న చిన్న ద్వీప దేశమే అయినా.. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే (డీసాలినేషన్ ప్రక్రియ) ద్వారా సురక్షిత నీటిని ఇళ్లకు సరఫరా చేస్తోంది. ఐర్లాండ్ ఇక్కడ మంచినీటి వనరులు పుష్కలంగా ఉండటంతోపాటు జలాల సంరక్షణ, శుద్ధి విషయంలో కఠిన నిబంధనలతో నాణ్యమైన నీటి సరఫరాలో టాప్–10 దేశాల్లో నిలిచింది. యునైటెడ్ కింగ్డమ్ కలుషితాల విషయంలో కఠిన నిబంధనలు పాటించడం, నీటి శుద్ధికి అత్యున్నత విధానాలను అవలంబించడంతో ప్రమాణాలతో కూడిన నీటిని ఈ దేశంలో సరఫరా చేస్తున్నారు. - సాక్షి సెంట్రల్ డెస్క్ -
బెంగళూరు దాహార్తి!
దేశంలో నీటి ఎద్దడి నిత్యజీవిత వ్యథగా పరిణమించి చాలా కాలమైంది. అది స్థలకాలాదులను అధిగమించింది. దాని బారిన పడని నగరమంటూ లేదు. బెంగళూరు దాహార్తి అందులో భాగమే. అది జనాభారీత్యా దేశంలో మూడో అతి పెద్ద నగరం. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో అది దేశానికే ఐటీ రాజధాని. కానీ తాగటానికి గుక్కెడు నీళ్లు కరువైతే ఆ భుజకీర్తులన్నీ దేనికి పనికొస్తాయి? 500 ఏళ్లనాటి ఆ నగరం గొంతెండి నీళ్ల కోసం అలమటిస్తోంది. టెకీలంతా నగరాన్నొదిలి స్వస్థలాల నుంచి పనిచేయటం మొదలుపెట్టారు. అపార్ట్మెంట్లన్నీ బేల చూపులు చూస్తున్నాయి. కోచింగ్ సెంటర్లు ఆన్లైన్ క్లాసులకు మళ్లాయి. రోడ్డుపై పోయే నీటి ట్యాంకర్ల వెనక జనం పరుగు లెడుతున్నారు. ఇది పరీక్షల కాలమైనా విద్యార్థులకు నీటి అన్వేషణ ముఖ్యమైపోయింది. కావేరి పరివాహ ప్రాంతాన్ని కరువు కాటేయటంతో నగరానికి వచ్చే నీరు తగ్గింది. భూగర్భ జలాలు అడుగంటాయి. మార్చి నెలాఖరుకు రావాల్సిన ఉష్ణోగ్రతలు బెంగళూరును ఫిబ్రవరి మూడోవారంలోనే పలకరించాయి. కోటిన్నర జనాభాగల ఆ నగరంలో వాల్మార్ట్ మొదలుకొని గూగుల్ వరకూ ఎన్నో అంతర్జాతీయ సంస్థలున్నాయి. ఇవిగాక బోలెడు స్టార్టప్లు కొలువుదీరాయి. బెంగళూరుకు సగటున రోజుకు కనీసం 185 కోట్ల లీటర్ల నీరు లభిస్తుండగా కనీసం మరో 168 కోట్ల లీటర్లు అవసరమని అంచనా. కానీ ఎక్కడుంది లభ్యత? ఇది దిక్కుతోచని స్థితి. ఆరా తీస్తే బెంగళూరు నగరానిది కూడా దేశంలోని అన్ని నగరాల వ్యథే. మౌలిక సదుపాయాల కల్పనపై కనీస స్థాయి దృష్టిపెట్టకుండా దశాబ్దాలుగా అభివృద్ధిని కేంద్రీకరించిన పర్యవసానమే ప్రస్తుత కష్టాలకు మూలకారణం. అభివృద్ధి పేరు చెప్పి వెనకా ముందూ చూడకుండా హరిత ప్రాంతాలను హరించటంవల్ల వర్షాలు గణనీయంగా తగ్గాయి. పెరుగుతున్న జనాభా పేరు చెప్పి ఆవాసప్రాంతాలను విస్తరించటం, అందుకోసం చెరువులనూ, సరస్సులనూ మాయం చేయటం అలవాటైపోయింది. 1961 నాటికి బెంగళూరు నగర పరిసరాల్లో 262 సరస్సులుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 81కి పడిపోయింది. వాస్తవానికి ఆ సరస్సుల్లో ఇప్పటికీ జీవంతో వున్నవి కేవలం 33 మాత్రమే. జనావాసాలకు అననుకూల ప్రాంతాల్లో వుండటంవల్లే ఇవి బతికిపోయాయి. మిగిలినవి పేరుకు సరస్సులుగా వున్నా వాటిలో చుక్క నీరు కూడా కనబడదు. ఇంకా దారుణం... ఇప్పుడున్న సరస్సుల్లో 90 శాతం కాలుష్యం కారణంగా పనికిరాకపోవచ్చని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనంలో తేలింది. లీటర్ నీటిలో కనీసం 4 మిల్లీగ్రాముల ఆక్సిజన్ వుంటేనే ఆ నీరు మెరుగ్గా వున్నట్టు లెక్క. కానీ అంతకన్నా తక్కువ స్థాయిలో ఆక్సిజన్ వున్నదని నిపుణులు తేల్చారు. ఎన్నడో 1971లో ఇరాన్లోని రాంసర్లో నీటి వనరుల సంరక్షణపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో కుదిరిన ఒడంబడికపై సంతకం చేసిన దేశాల్లో భారత్ కూడావుంది. కానీ దానికి అనుగుణంగా శ్రద్ధాసక్తులు కనబరిచిన దాఖలా లేదు. 2030 నాటికి నీటి అవసరాలు రెట్టింపవుతాయని నీతి ఆయోగ్ నివేదిక 2018లో చెప్పింది. మన దేశంలో కేవలం రక్షిత మంచినీరు అందక ఏటా 2 లక్షలమంది మరణిస్తున్నారని వివరించింది. అంతకు రెండేళ్లముందు దక్షిణ కన్నడ జిల్లాలోని మూద్బిద్రీలో సరస్సులపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. హరిత ఆచ్ఛాదనగా వున్న పట్టణ అడవులు, తడి నేలలు వగైరాలను పట్టణీకరణ కోసం మూడు దశాబ్దాలుగా డీ నోటిఫై చేస్తున్నారనీ, ఇది బెంగళూరుకు ముప్పు కలిగిస్తుందనీ సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. కానీ ఏళ్లు గడు స్తున్నకొద్దీ ఆ ధోరణి మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. అసలు పట్టణీకరణలో స్థానిక జీవావరణం, పర్యావరణం, నీటి లభ్యత వగైరాలకు చోటేలేదు. వాటిపై ఎలాంటి అధ్యయనమూ లేదు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల జనాభా అనేక రెట్లు పెరగటం, దాంతోపాటే మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్థం కావటం తరచు కనబడుతున్న వాస్తవం. స్థానికంగా వుండే చెరువులు, సరస్సులు వగైరాల్లో మురుగు నీరు విడిచిపెట్టే దురలవాటుతో అటు నీటి వనరులూ నాశనమవుతున్నాయి, ఇటు భూగర్భ జలాలు సైతం కాలుష్యం బారిన పడుతున్నాయి. నగరాలు నేల చూపులు విడిచిపెడుతున్న తీరు ఆందోళనకరం. నేల విడిచి ఆకాశంలోకి దూసుకుపోయే నగరాలకు చుక్కలు కనబడటం ఖాయమని కేప్టౌన్ అనుభవాలు ఆరేళ్ల క్రితమే చెప్పాయి. దక్షిణ అట్లాంటిక్ సముద్ర తీరాన దక్షిణాఫ్రికాలో వున్న ఆ నగరంలో కళ్లు చెదిరే స్థాయిలో భారీ భవంతులు దర్శనమిస్తాయి. ప్రపంచం నలుమూలల నుంచీ తరలివచ్చే వినియోగ వస్తువులతో అక్కడి మహా దుకాణాలు మెరిసిపోతుంటాయి. ఏటా కనీసం 20 లక్షలమంది ఆ నగర అందచందాల్ని చూడటానికి తరలివస్తారని అంచనా. 46 లక్షల జనాభాగల ఆ నగరం 2018లో నీటి సంక్షోభంలో చిక్కుకుని గుడ్లు తేలేసింది. ఇళ్లకూ, దుకాణ సముదాయాలకూ, కార్యాలయాలకూ నీటి సరఫరాను పూర్తిగా నిలిపేసింది. 200 నీటి కేంద్రాలవద్ద రోజుకు మనిషికి 25 లీటర్ల నీరిస్తామని అన్ని అవసరాలనూ దాంతోనే తీర్చుకోవాలని ప్రకటించింది. నీటి సంరక్షణను ఒక సంస్కృతిగా మార్చుకుని ఇప్పుడిప్పుడే కుదుటపడటం మొదలెట్టింది. కేప్టౌన్ కష్టాలూ, వాటిని ఆ నగరం అధిగమించిన తీరూ అధ్యయనం చేయటం ఒక్క బెంగళూరుకు మాత్రమే కాదు... అన్ని మెట్రొపాలిటన్ నగరాలకూ తక్షణావసరం. నీటి వృథాను, నష్టాలను అరికట్టడంలో... కాలాను గుణమైన ప్రణాళికల రూపకల్పనలో స్థానిక సంస్థల చొరవను పెంచితేనే ఈ సమస్యను అధిగమించగలమని పాలకులు గుర్తించటం మంచిది. -
fact check: పచ్చమీడియాకు ‘అతి’సారం!
సాక్షి ప్రతినిధి, గుంటూరు/నెహ్రూనగర్(గుంటూరు): పచ్చమీడియాకు అతిసారం సోకినట్టుంది. గుంటూరు నగరంలో కలుషిత జలం కాటేసిందంటూ మరోసారి విషాన్ని విరజిమ్మింది. తప్పుడు కథనాలతో పేట్రేగిపోయింది. చికెన్పాక్స్, న్యూమోనియా కారణాలతో శుక్రవారం మరణించిన మహ్మద్ ఇక్బాల్ డయేరియాతో మరణించాడని దుష్ప్రచారానికి దిగింది. గత వారంలో మరణించిన పద్మ మరణంపైనా ఇలాగే రాక్షస రాతలు రాసింది. గుంటూరులో నివాసం ఉంటున్న మహ్మద్ ఇక్బాల్ ఈ నెల 11న సాయంత్రం విరేచనాలు , వంటిమీద చీము పొక్కులతో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స అందించడంతో విరేచనాలు తగ్గాయి. పొక్కులను చికెన్పాక్స్గా వైద్యులు గుర్తించారు. బ్లడ్షుగర్ లెవల్స్ కూడా 400 దాటి ఉండటంతో డెర్మటాలజీ డాక్టర్లు పరీక్షించి గోరంట్లలోని అంటువ్యాధుల ఆస్పత్రి(జ్వరాల ఆస్పత్రి)లో చేరాలని సూచించారు. ఇక్బాల్ అక్కడికి వెళ్లేందుకు నిరాకరించాడు. జీజీహెచ్లోనూ ఉండకుండా వెళ్లిపోయాడు. రెండురోజల తర్వాత 15న న్యూమోనియా లక్షణాలతో ఊపిరితీసుకోవడానికి ఇబ్బందిపడుతూ మళ్లీ వచ్చాడు. అప్పుడు కూడా వైద్యులు జ్వరాల ఆస్పత్రికి వెళ్లాలని సూచించినా వెళ్లలేదు. ఇంటికి వెళ్లిపోయాడు. మళ్లీ తర్వాత రోజు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చికెన్పాక్స్, న్యూమోనియా లక్షణాలతో తీవ్రంగా ఇబ్బందిపడుతూ జీజీహెచ్కు వచ్చాడు. వచ్చిన అరగంటలోనే మృతి చెందాడు. వైద్యులు చికెన్పాక్స్, అదుపులో లేని మధుమేహం, న్యూమోనియా లక్షణాలతో చనిపోయాడని నివేదిక ఇచ్చారు. కుటుంబ సభ్యులు భీమవరం వెళ్లడంతో గుంటూరు మేయర్ కావటి మనోహర్నాయుడు వారితో ఫోన్లో మాట్లాడారు. వారు కూడా అనారోగ్యం వల్లే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన జరిగిన వెంటనే మృతుడు ఇక్బాల్ నివాసం ఉన్న రైలుపేట ప్రాంతాలలో తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షించారు. ఎక్కడా నీరు కలుషితం కాలేదని నివేదికలొచ్చాయి. గుండెపోటుతోనే పద్మ మరణం ఈనెల 10న మరణించిన ఎం.పద్మ(18) కూడా కార్డియాక్ అరెస్టుతో చనిపోయిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. వాంతులు, విరేచనాలతో రెండురోజుల పాటు ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకుని ఆఖరి ఘడియల్లో జీజీహెచ్లో చేరింది. అస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే కార్డియాక్ అరెస్టుతో మృతి చెందింది. కలుషిత నీరైతే ఒకరిద్దరే జబ్బున పడతారా? కలుషిత నీరైనా, అతిసారం అయినా ఒకరిద్దరే జబ్బున పడరని వైద్యులు చెబుతున్నారు. ఆ కలుషిత నీరు తాగిన అందరూ రోగం బారిన పడతారని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు ఒక వేళ కలుషిత నీటి వల్ల ఇక్బాల్, పద్మ జబ్బు బారిన పడితే వారి కుటుంబాలు ఎలా ఆరోగ్యంగా ఉన్నాయన్న ప్రశ్నకు ఎల్లోవీుడియా వద్దగానీ, టీడీపీ నేతల వద్దగానీ సమాధానం లేదు. అధికారులు అప్రమత్తం ఎల్లోవీుడియావి కట్టుకథలే అయినా గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈనెల పది నుంచి నగరంలో రోజుకు వెయ్యికిపైగా తాగునీటి శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ఎక్కడా కూడా తాగునీరు కలుషితం అయినట్లు ఆధారాలు దొరకలేదు. మినరల్ వాటర్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని రీజనల్ మెడికల్ ల్యాబ్ రిపోర్టు ఇచ్చింది. పలు ఆర్ఓ ప్లాంట్లలో ఉండాల్సిన పీహెచ్ కన్నా తక్కువ ఉండటం, బ్యాక్టీరియా ఉండడాన్ని గుర్తించారు. వీటిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు పానీపూరి కోసం వాడుతున్న నీరు కలుషితంగా ఉండటం వల్ల వ్యాధులు వస్తున్నాయని రీజినల్ ల్యాబ్ నిర్ధారించింది. ఈ విషయాలన్నీ తెలిసినా కేవలం ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా పచ్చమీడియా రెచ్చిపోతోంది. స్వచ్ఛనీరే సరఫరా చేస్తున్నాం గుంటూరు నగర ప్రజలకు నగరపాలక సంస్థ ద్వారా స్వచ్ఛనీరే సరఫరా చేస్తున్నాం. కొన్ని పత్రికలు రాజకీయ అజెండాతో కలుషిత జలాలు అంటూ విషం చిమ్ముతున్నాయి. రైలుపేటకు చెందిన ఇక్బాల్ చికెన్పాక్స్, న్యూమోనియాతోనే చనిపోయాడు. ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులూ, జీజీహెచ్ వైద్యులూ ధ్రువీకరించారు. గత ప్రభుత్వ హయాంలో 2018లో గుంటూరు నగరంలో 27 మంది అతిసారంతో మృతి చెందారు. అప్పట్లో జీజీహెచ్లో రెండు వేల మంది చికిత్స తీసుకున్నారు. డయేరియా అయితే వందల మంది ఆస్పత్రుల పాలవుతారు. ప్రజలకు సరఫరా చేసిన ప్రతినీటిబొట్టునూ పరీక్షించిన తర్వాతే కుళాయిలకు వదులుతున్నాం. సీజనల్ వ్యాధులు సోకుతున్నందున ప్రజలంతా కాచి చల్లార్చిన నీటినే తాగాలని ముందే సూచించాం. ఇంటింటి ప్రచారమూ చేపట్టాం. రీజనల్ మెడికల్ ల్యాబ్ నివేదిక మేరకు మినరల్ వాటర్ ప్లాంట్ల నిర్వహణపై తగిన చర్యలు తీసుకోవాలని ఫుడ్ కంట్రోల్ శాఖకు లేఖ రాశాం. – మీడియాతో మేయర్ కావటి మనోహర్నాయుడు, కమిషనర్ కీర్తిచేకూరి, డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు -
Fact Check: మీ బుద్ధే కలుషితం
సాక్షి ప్రతినిధి, గుంటూరు ః గుంటూరు నగరంలో ఎన్నడూ లేనివిధంగా నాలుగేళ్లలో రూ.కోట్ల ఖర్చుతో అంతర్గత నీటి సరఫరా, నూతన పైపులైన్లు, ఇంటర్ కనెక్షన్లు ఏర్పాటు చేశారు. కానీ రెండు రోజులుగా గుంటూరుతో పాటు పలు ప్రాంతాల నుంచి వాంతులు, విరోచనాలతో కొంతమంది ప్రభుత్వాసుపత్రిలో చేరడంతో దానిపై పచ్చమీడియా రాద్దాంతం చేస్తోంది. కలుషి త నీటితో ప్రాణాలు పోతున్నా పట్టవా అంటూ తుప్పు పట్టిన వార్తతో ఈనాడు పత్రికలో తప్పుడు కథనాలు రాసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. పైపు లైన్లు ప్రాణసంకటంగా మారాయని కలుషి త వార్తను వండివార్చింది. వాస్తవంగా పరిశీలిస్తే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక పైపులైన్లను మార్చుతూ వచ్చింది. కానీ ఇవన్నీ కప్పిపుచ్చి పైపులైన్లు మార్చకపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తుందంటూ పచ్చమీడియా కట్టుకథలు అల్లింది. వాతావరణ మార్పులు, కృష్ణానదిలో వస్తున్న నీటిలో తేడా వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత 15 రోజులుగా నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్న నీటిని కాచి చల్లార్చి తాగాలంటూ మున్సిపల్ కమిషనర్ ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. దశలవారీగా పైపులైన్లు మార్పు ఆరేడు దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా మారుస్తూ వస్తోంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంచినీటి సరఫరా మెరుగు కోసం చర్యలు చేపట్టలేదు. కొత్తగా పైపులైన్లు వేసిన చోట కూడా ఇంటర్ కనెక్షన్లు ఇవ్వకపోవడం వల్ల అవి నిరర్ధకంగా మారాయి. వైఎస్సార్సీపీ గుంటూరులో పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నడూ లేని విధంగా నగరంలో రూ.123.15 కోట్ల అంచనాలతో మంచినీటి సరఫరా కోసం ఖర్చు చేస్తున్నారు. అంతర్గత పైపులైన్లు మార్చడం కోసమే ప్రత్యేకంగా రూ. 44 కోట్లు ఖర్చు పెడుతున్నారు. గతంలో పైప్లైన్లు వేసినప్పటికీ ఇంటర్ కనెక్షన్, సంజీవయ్యనగర్ రైల్వే ట్రాక్ క్రాసింగ్ చేయకపోవడం వల్ల తాగునీటి సమస్యలు వచ్చేవి. ప్రస్తుతం సంజీవయ్య నగర్ వద్ద ట్రాక్ క్రాసింగ్ చేయడం, ఇంటర్ కనెక్షన్ ఏర్పాటు చేశారు. నెహ్రూనగర్ రిజర్వాయర్ నుంచి పశ్చిమ నియోజకవర్గానికి 800 డయాపైప్లైన్ అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా నీటి సరఫరాలో గతంలో ఉన్న సమస్యలు లేకుండా పోయాయి. తక్కెళ్లపాడు హెడ్వాటర్వర్క్స్ నుంచి గోరంట్ల కొండమీదకి పైపులైన్, కొండపై రిజర్వాయర్, కొండ నుంచి చిల్లీస్ రెస్టారెంట్ జంక్షన్ వరకూ 500 ఎంఎం గ్రావిటీ డి్రస్టిబ్యూషన్ పైపులైన్ కోసం రూ. 33 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కోటీ 15 లక్షల రూపాయలతో సంగం జాగర్లమూడి హెడ్వాటర్వర్క్స్లోని పాత ఫిల్టరేషన్ ప్లాంట్ను పునరుద్దరించారు. నెహ్రూనగర్ రిజర్వాయర్ నుంచి సంజీవ్నగర్ రైల్వేగేట్కు 900 ఎంఎం పైపు లైన్ కోసం రూ. కోటీ 15 లక్షలు, సంజీవ్నగర్ రైల్వే గేట్ వద్ద ఇంటర్ కనెక్షన్కు రెండు కోట్ల రూపాయలు, నగరంలో స్కాడా వ్యవస్థ ఏర్పాటుకు రూ. 12 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. నగరంలో కొత్త పైపులైన్లు ఇవి కాకుండా గుంటూరు నగరంలో ప్రధానమైన పైపులైన్లతో పాటు అంతర్గత పైపులైన్లను ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తున్నారు. తాజాగా అమృత్ పథకం కింద రూ. 184 కోట్ల రూపాయలు గుంటూరు నగరానికి మంజూరు అయ్యాయి. కృష్ణానది పక్కన ఉండవల్లి నుంచి మంగళగిరి వరకూ పాత పైపులైన్ మార్చడంతో పాటు అదనంగా కొత్త పైపులైన్ వేశారు. మంగళగిరి నుంచి గుంటూరు నగరంలోని తక్కెళ్లపాడుకు, సంగం జాగర్లమూడి నుంచి గుంటూరు నగరానికి కొత్త పైపులైన్లు వేయడంతో పాటు అంతర్గత పైపులైన్లు మార్చేందుకు ఈ రూ. 184 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. వీటికి సంబం«ధించిన డీపీఆర్లు సిద్ధం అవుతున్నాయి. వీటన్నింటిని మరుగునపెట్టి బురద జల్లడమే పనిగా పచ్చమీడియా పెట్టుకుంది. -
ఏడు రోజుల్లో పరిష్కరించాలి
సాక్షి, అమరావతి: కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అన్ని మౌలిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని అదే ప్రమాణాలతో నిరంతరం నాణ్యతగా నిర్వహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మన బడి నాడు – నేడు తొలి దశ పనులు పూర్తైన పాఠశాలల్లో మరమ్మతులు, నిర్వహణపై దృష్టి పెట్టి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా విద్యా శాఖ అధికారులు, ప్రాజెక్టు కో–ఆర్డినేటర్లకు పాఠశాల విద్య (మౌలిక సదుపాయాలు) కమిషనర్ కె.భాస్కర్ సూచించారు. నాడు–నేడు తొలి దశ స్కూళ్ల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయన జారీ చేశారు. మరమ్మతులు, నిర్వహణ సమస్యలపై ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు వారంటీ సంస్థలకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. మరమ్మతులు, నిర్వహణ సమస్యలను ఏడు రోజుల్లోగా ఆయా సంస్థలు పరిష్కరించాలన్నారు. ఈమేరకు ఈ నెల 21వ తేదీలోగా సమగ్ర నిర్వహణ, మరమ్మతుల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. బాలికలు, బాలురుకు వేర్వేరు టాయిలెట్లలో నిరంతరం నీటి సరఫరా ఉండాలని, ఇందులో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించే బాధ్యత ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులదేనని స్పష్టం చేశారు. తొలి దశలో సృష్టించిన అన్ని ఆస్తుల నిర్వహణ సజావుగా కొనసాగేలా చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులతో పాటు జిల్లా విద్యా శాఖ అధికారులు, ప్రాజెక్టు అదనపు కో–ఆర్డినేటర్లదేనని పేర్కొన్నారు. గ్రీన్ చాక్ బోర్డులు, ఐఎఫ్పీలలో సమస్యలు తలెత్తితే ఏడు రోజుల్లోగా మరమ్మతులు చేయించాలని సూచించారు. టాయిలెట్లలో అన్నీ సక్రమంగా పని చేస్తున్నాయో లేదో పరిశీలించి అవసరమైతే మరమ్మతులు లేదా రీప్లేస్మెంట్ కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. తరగతి గదుల్లో తలుపులు, కిటికీలు, సీలింగ్, అల్మారాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలన్నారు. తాగునీటి వ్యవస్థలు సక్రమంగా పని చేస్తున్నాయా లేదా అనేది నిర్ధారించుకుంటూ ప్రమాణాలకు అనుగుణంగా రక్షిత మంచినీటిని క్రమం తప్పకుండా పరీక్షించాలన్నారు. తాగునీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా పర్యవేక్షిస్తూ బ్యాటరీ, పంపులు, వాటర్ పైపుల మరమ్మతులతోపాటు అవసరమైన చోట ఫిల్టర్లను రీప్లేస్మెంట్ చేయాలన్నారు. ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు సరిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. స్కూళ్ల ఆవరణలో పెయింటింగ్ సరిగా లేకుంటే ఆయా సంస్థలకు తెలియచేసి రంగులు వేయించాలన్నారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు. -
గ్రామీణ ప్రాంతాల నీటిసరఫరాపై పర్యవేక్షణ ఉంచండి
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. ప్రతి గ్రామానికి రోజువారీ నీటి సరఫరా జరిగేలా చూడాలని శాఖ ఇంజనీర్లను కోరారు. మేడారం జాతరపై త్వరలోనే వివిధ విభాగాలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలపై చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో శుక్రవారం మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని, రిజర్వాయర్లు, నదులు తదితర తాగునీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాల గురించి ఆ శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ మంత్రికి వివరించారు. -
అది చెత్తకుండి కాదు..! కంట్రోల్ వాల్వ్..!!
కరీంనగర్: నగరంలోని పలు రిజర్వాయర్లకు తాగునీటిని సరఫరా చేసే మెయిన్ కంట్రోల్ వాల్వ్ అది. కానీ చెత్తచెదారం.. మూత్రవిసర్జనకు నిలయంగా మారింది. నగరంలోని ఫిల్టర్బెడ్ నుంచి తాగునీటి ప్రధాన పైప్లైన్ భగత్నగర్లోని అంబేడ్కర్ స్టేడియం నుంచి రిజర్వాయర్లకు వెళ్తుంది. అంబేడ్కర్ స్టేడియం మెయిన్ గేట్ సమీపంలోని నాలా పక్కన దీనికి కంట్రోల్ వాల్వ్ ఉంది. దీని నిర్వహణపై అధికారులు ఇన్నాళ్లు దృష్టి పెట్టకపోవడంతో డస్ట్బిన్గా మారింది. సమీపంలోని వ్యాపారులు చెత్తాచెదారాన్ని ఇందులో పడేస్తుండటంతో గుట్టలుగా పేరుకుపోయింది. అలాగే ఈ ప్రాంత వాసుల కువాల్వ్ చాంబర్ సులభ్ కాంప్లెక్స్గా మారింది. రిజర్వాయర్లకు సరఫరా చేసే తాగునీరు కలుషితమ య్యే ప్రమాదం ఏర్పడింది. శనివారం నగరపాలక సంస్థ సిబ్బంది వాల్వ్కు మరమ్మతు చేసేందుకు వచ్చారు. వారు చెత్త గుట్టను చూసి, ఖంగుతిన్నారు. వెంటనే దాన్ని తొలగించారు. వాల్వ్కు భవిష్యత్లో ఇలాంటి పరిస్థితి రాకూడదంటే చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
నీళ్లు ఊరికే రావు!
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రస్తుతం నీటికి భారీగా డిమాండ్ పెరుగుతోంది...అయితే నీటి లభ్యత పరిమితంగా ఉన్న దృష్ట్యా ఉచితంగా సరఫరా చేయొద్దు. గృహ, సాగు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేసే నీటికి ధరలు ఖరారు చేయాలి. కనీసం సాగునీటి ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడితోపాటు నిర్వహణ, పర్యవేక్షణ(ఓఅండ్ఎం) వ్యయాలు రాబట్టుకునే విధంగా నీటి ధరలు ఉండాలి’’...అని కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అన్ని రాష్ట్రాలకు సిఫారసు చేసింది. ‘ప్రైసింగ్ ఆఫ్ వాటర్ ఇన్ పబ్లిక్ సిస్టమ్ ఇన్ ఇండియా–2022’పేరుతో రూపొందించిన పంచవర్ష నివేదికలో నీటికి చార్జీలు వసూలు చేయాల్సిందేనని నొక్కి చెప్పింది. నీటి ధరలపై ప్రతి ఐదేళ్లకోసారి ఈ నివేదిక విడుదల చేస్తుండగా, గతేడాది రావాల్సిన నివేదిక తాజాగా బయటకొచ్చింది. ఉచితంగా/తక్కువ ధరలకు నీరు సరఫరా చేస్తే దుర్వినియోగం అవుతుందని, ఆదాయం రాక ప్రభుత్వంపై పెనుభారం పడుతుందని ఆ నివేదికలో స్పష్టం చేసింది. రాష్ట్రాలకు సరైన పాలసీ ఉండాలి పన్నులు, ఇతర మార్గాల్లో ప్రజల నుంచి వసూలు చేస్తున్న డబ్బు ద్వారా ప్రభుత్వాలు మధ్యతరహా, భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ ప్రాజెక్టుల పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి రాష్ట్రాలు సరైన పాలసీలు కలిగి ఉండాలి. తిరిగి వచ్చిన రాబడులతో కొత్త ప్రాజెక్టులు చేపట్టి సమాజంలోని ఇతర వర్గాలకు లబ్ధి చేకూర్చాలి. సాగునీటి చార్జీలు... రెండు రకాల వ్యయాలు పంట రకాలు, విస్తీర్ణం, తడుల సంఖ్య, మొత్తం నీటి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకొని సాగునీటి ధరలు ఖరారు చేయాలి. నీటి టారీఫ్ ఖరారు విధానాన్ని అన్ని రాష్ట్రాలు హేతుబద్దీకరించాలి. పంట దిగుబడి విలువ ఆధారంగా సాగునీటి చార్జీలు వసూలు చేయాలని ఇరిగేషన్ కమిషన్(1972) కోరింది. ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయంలో కొంత భాగంతోపాటు పూర్తిగా నిర్వహణ వ్యయం రాబట్టుకోవాలని వైద్యనాథన్ కమిటీ కోరింది. ► సాగునీటి చార్జీల వసూళ్లతో ప్రాజెక్టుల మొత్తం నిర్వహణ వ్యయాన్ని రాబట్టుకోవాల్సిందే. దీనికి అదనంగా.. ఆహార పంటలైతే హెక్టారులో వచ్చిన దిగుబడుల విలువలో కనీసం ఒక శాతం, వాణిజ్య పంటలైతే ఇంకా ఎక్కువ శాతాన్ని వసూలు చేయాలి. ఈ మేరకు సాగునీటి వినియోగానికి సంబంధించి రెండు రకాల చార్జీలు విధించాలి. నిర్వహణ చార్జీలతో ప్రాజెక్టుల నిర్వహణకు, దిగుబడుల విలువ ఆధారిత చార్జీలను ప్రాజెక్టుల ఆధునికీకరణకు వినియోగించాలి. నీటి లభ్యత లెక్కల ఆధారంగా 75శాతం, ఆపై లభ్యత ఉన్న ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయిలో సాగునీటి చార్జీలు వసూలు చేయాలి.75 శాతానికి తక్కువ లభ్యత ఉన్న ప్రాజెక్టుల కింద 50 శాతం మేరకు చార్జీలు తగ్గించాలి. ఎత్తిపోతల పథకాల నీటిచార్జీలు ఎక్కువే.. ఎత్తిపోతల పథకాలతో సరఫరా చేసే నీటికి చార్జీలు ఆయా ప్రాజెక్టుల పెట్టుబడి, నిర్వహణ వ్యయాల ఆధారంగా ఖరారు చేయాలి. ఎత్తిపోతల పథకాల ద్వారా సరఫరా చేసే నీటికి కచ్చితమైన లెక్కలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎంత నీరు సరఫరా చేస్తే ఆ మేరకు చార్జీలు వాల్యూమెట్రిక్ (నీటి పరిమాణం) ఆధారంగా వసూలు చేయాలి. ఎత్తిపోతల పథకాల నిర్వహణ వ్యయం ఎక్కువే కాబట్టి గ్రావిటీ ప్రాజెక్టుల నీటిచార్జీల కంటే వీటి ద్వారా సరఫరా చేసే నీటి చార్జీలు అధికంగా ఉంటాయి. నీటి ధరల ఖరారుకు రెగ్యులేటరీ కమిషన్ తాగు, పారిశుద్ధ్యం, సాగు, పారిశ్రామిక, ఇతర అవసరాలకు సరఫరా చేసే నీటికి సరైన ధరలు ఖరారు చేసేందుకు ప్రతి రాష్ట్రంలో చట్టబద్ధంగా స్వయంప్రతిపత్తి గల వాటర్ రెగ్యులేటరీ ఆథారిటీని ఏర్పాటు చేయాలి. నీటి పరిమాణం ఆధారంగా చార్జీలు వసూలు చేయడానికి 100 శాతం ఇళ్లలోని నల్లాలకు మీటర్లు, కాల్వలకు నీటిని కొలిచే యంత్రాలు బిగించాలి. పేదలకు రాయితీపై నీరు సరఫరా చేయవచ్చు. పూర్తి నిర్వహణ వ్యయంతోపాటు పెట్టుబడిలో కొంత భాగం వసూలు చేసేలా నీటిచార్జీలు ఉండాలి. వీటితో పాటుగా పెట్టుబడి రుణాల తిరిగి చెల్లింపులు, ఇతర అవసరాలకు నిధులు నిల్వ ఉండేలా చార్జీలు ఖరారు చేయాలి. సాగునీటి ప్రాజెక్టుల నీటిని వినియోగిస్తే హెక్టారుకు రూ.600, వినియోగించని పక్షంలో హెక్టారుకు రూ.300 చొప్పున నిర్వహణ చార్జీలు వసూలు చేయాలని జల వనరుల 11వ పణ్రాళిక సిఫారసు చేసింది. పేద, బలహీనవర్గాలకు రాయితీ కొనసాగాలి. నిర్వహణ, పెట్టుబడి రాబట్టుకోవాలి దేశంలో ప్రస్తుతం వసూలు చేస్తున్న నీటి ధరలు భారీ రాయితీతో ఉన్నాయి. దీంతో ఆదాయానికి గండిపడుతోంది. రైతుల శక్తిసామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని నీటి ధరలు రాష్ట్రాలు ఖరారు చేస్తున్నాయి. కనీసం సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం కూడా రావడం లేదు. దీంతో నిర్వహణ సరిగా ఉండడం లేదు. పూర్తి నిర్వహణ వ్యయంతో పాటు పాక్షికంగా పెట్టుబడి ఖర్చు రాబట్టుకునేలా నీటి ధరలు ఉండాలి. సెకండ్ ఇరిగేషన్ కమిషన్(1972), డాక్టర్ వైద్యనాథన్ కమిటీ(1991), వివిధ ఫైనాన్స్ కమిషన్లు, ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్–2016 నిబంధనలు సైతం సరైనరీతిలో నీటి ధరలు ఖరారు చేసి నీటిపారుదల చార్జీల రూపంలో కనీసం నిర్వహణ వ్యయం వసూలు చేసుకోవాలని సిఫారసులు చేశాయి. -
నేడు నగరంలో తాగునీటి సరఫరా బంద్
వరంగల్ అర్బన్: వరంగల్ అండర్ రైల్వే జోన్ పరిధిలో నేడు (శనివారం) నీటి సరఫరా ఉండదని బల్దియా ఈఈ బీఎల్ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద 60 ఎంఎల్డీ నీటి శుద్ధీకరణ కేంద్రంలో అంతర్గత నిర్వహణ (మెయింటెనెన్స్) పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల వరంగల్ అండర్ రైల్వే గేట్ పరిధిలోని ప్రాంతాలైన తిమ్మాపూర్, కరీమాబాద్, పెరకవాడ, రంగశాయిపేట, ఉర్సు, శంభునిపేట, శివనగర్, ఖిలా వరంగల్, చింతల్, మామునూరు, సింగారం, బొల్లికుంట, భట్టుపల్లి, కడిపికొండ, రాంపేట, రాంపూర్, మడికొండ తదితర ప్రాంతాల్లో ఒకరోజు నీటి సరఫరా బంద్ ఉంటుందని వివరించారు. ఆయా ప్రాంతాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేయూ ఫిల్టర్ బెడ్ పరిధిలో రెండు రోజులు.. ఫిల్టర్ బెడ్ (కేయూసీ) పరిధిలో రెండు రోజులు (శని, ఆదివారాల్లో)నీటి సరఫరా ఉండదని ఈఈ రాజయ్య తెలిపారు. యాదవ నగర్ ప్రాంతంలో పబ్లిక్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో అంతర్గత కనెక్షన్ పనులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో కేయూసీ ఫిల్టర్ బెడ్ పరిధిలోని విద్యారణ్యపురి, కొత్తూరు, గుడిబండల్, యాదవనగర్, పద్మాక్షికాలనీ, మచిలీబజార్, పలివేల్పుల, గుండ్ల సింగారం, పెగడపెల్లి, వంగపహాడ్, ముచ్చర్ల, భీమారం, చింతగట్టు, ఎరగ్రట్టు గుట్ట, హసన్పర్తి ప్రాంతాల్లో రెండు రోజులు నీటి సరఫరా నిలిపివేసినట్లు వివరించారు. అంతరాయానికి ఆయా ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు. -
నీరు లేదు.. వాన నీరే..
నార్నూర్(ఆదిలాబాద్): ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 15 రోజులుగా నీటి వసతిలేక 367 మంది విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదుకునేనాథుడే లేక వారికి వానదేవుడే దిక్కు అయ్యాడు. కొద్దిరోజులుగా నిల్వ చేసుకున్న వాననీటితోనే స్నానాలు చేస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ఇదీ ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, కళాశాల దుస్థితి. వంట చేయడానికి నీళ్లు లేక వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను ఎస్వో ప్రియాంక సర్పంచ్ మెస్రం జైవంత్రావు దృష్టికి తీసుకెళ్లగా రెండ్రోజులు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా నీరు సరఫరా చేశారు. తర్వాత పంచాయతీ వర్కర్లు సమ్మెలో ఉండటంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది దీంతో విద్యార్థినులు ఇంటిబాట పడుతున్నారు. నీటిసమస్యను డీఈవో ప్రణీత, కేజీబీవీ జిల్లా సెక్టోరియల్ అధికారి ఉదయశ్రీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని విద్యార్థినులు అంటున్నారు. కలెక్టర్ స్పందించి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. రెండ్రోజుల్లో నీటిసమస్య పరిష్కరించకుంటే కలెక్టర్ కార్యాలయానికి వెళ్తామని పేర్కొన్నారు. -
జలమండలి ఉద్యోగులకు 30% పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు (జలమండలి)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం వేతన సవరణ అమలు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా దాదాపు నాలుగు వేల మంది వాటర్ బోర్డు ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. మెట్రో వాటర్వర్క్స్ యూనియన్ అధ్యక్షుడు జి.రాంబాబుయాదవ్, ఇతర నేతలు సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో కలిసి ధన్యవాదాలు తెలిపారు. -
ఇక ఉద్దానం ‘సురక్షితం’
సాక్షి, అమరావతి: నలభై ఏళ్లుగా కిడ్నీ వ్యాధుల భయాలు వెంటాడుతున్న ఉద్దానం ప్రాంత ప్రజలకు భరోసా కల్పిస్తూ అక్కడకు వంద కి.మీ.పైగా దూరంలోని హిర మండలం రిజర్వాయర్ నుంచి సురక్షిత జలాలు కదిలాయి. భూగర్భ పైపులైన్ల ద్వారా ఉద్దానానికి నీటి తరలింపుపై గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వారం రోజులుగా నిర్వహిస్తున్న తొలిదశ ట్రయల్ రన్ విజయవంతమైంది. దాదాపు 132 కి.మీ. మేర భూగర్భ పైపు లైన్ను నిర్మించగా మార్గమధ్యంలో మెలియాపుట్టి వద్ద నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటైంది. మొదటి దశలో 32 కి.మీ. పొడవున భూగర్భ పైపులైన్ ద్వారా నీటిని తరలించారు. రానున్న 15 రోజులలో నీటి శుద్ధి కేంద్రం నుంచి ఉద్దానం చివరి ప్రాంతం ఇచ్ఛాపురం వరకు వంద కిలోమీటర్ల పొడవున ప్రధాన భూగర్భ పైపు లైన్ ద్వారా నీటి తరలింపు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా ప్రతి ఇంటికీ.. దాదాపు 807 నివాసిత ప్రాంతాలకు కొళాయిల ద్వారా తాగునీటి సరఫరాకు ఉద్దానం ప్రాంతాన్ని పది క్లస్టర్లుగా వర్గీకరించారు. అక్కడ నివసిస్తున్న దాదాపు 8 లక్షల మంది ప్రజలకు ఏడాది పొడవునా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ట్రయల్ రన్కు ఐదు కోట్ల లీటర్లు.. ఉద్దానం తాగునీటి అవసరాల కోసం రోజూ 8.40 కోట్ల లీటర్ల చొప్పున హిర మండలం నుంచి తరలిస్తారు. ఇందుకోసం 1,300 హెచ్పీ సామర్థ్యంతో మూడు భారీ నీటి పంపింగ్ మోటార్లను హీర మండలం రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేశారు. మొదటి దశ ట్రయల్ రన్ కోసం ఐదు కోట్ల లీటర్లను మెలియాపుట్టి నీటి శుద్ధి కేంద్రం వద్దకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మూడు మోటార్ల పనితీరును కూడా పరీక్షించారు. మాట ప్రకారం.. ఖర్చుకు వెనుకాడకుండా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు ఏడు మండలాల పరిధిలో ఉద్దానం ప్రాంతం విస్తరించి ఉంటుంది. స్థానికులను దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధుల సమస్యను పరిష్కరించేందుకు సీఎం జగన్ రూ.700 కోట్లతో ఉద్దానానికి సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేయడం తెలిసిందే. ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండటంతో ఖర్చుకు వెనుకాడకుండా హిర మండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపు చేపట్టాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా ఉద్దానం నీటి అవసరాలను తీర్చేందుకు ఒక టీఎంసీ కన్నా తక్కువ అవసరం కాగా హిర మండలం రిజర్వాయర్లో కనీస మట్టం స్ధాయిలోనూ 2.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో భాగంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వివిధ గ్రామాల్లో మొత్తం 571 ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రభుత్వం నూతనంగా నిర్మించింది. -
Hyderabad: తాగునీటి సరఫరా నిలిపివేతలో స్వల్ప మార్పులు
సాక్షి, హైదరాబాద్: నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై (జీడీడబ్య్లూఎస్ఎస్) ఫేజ్ – 1 లో సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద చేపట్టాల్సిన గోదావరి మెయిన్ 3000 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపు లైన్ బ్రిడ్జ్ పాసింగ్ – బైపాసింగ్, ఇంటర్ కనెక్షన్ పనులను 24 గంటల పాటు వాయిదా వేస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ వెల్లడించారు. హోలీ పండగ నేపథ్యంలో నగర ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈ నెల 8వ తేదీకి బదులు 9వ తేదీ గురువారం ఉదయం 6 నుంచి 11వ తేదీ శనివారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. సోమవారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి ఆయన సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి సరఫరా అంతరాయానికి సంబంధించి జీఎంలు తమ పరిధిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. దానికి అనుగుణంగా 24 గంటలు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. చదవండి: రంగుల పండుగ హోలీ విశిష్టత ఇదే.. ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలంటే..? -
హైదరాబాద్: నగరవాసులకు అలర్ట్.. 48 గంటలు నీళ్లు బంద్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాలకు 48 గంటల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ నెల 8వ తేదీ ఉదయం 6 నుంచి 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆదివారం జలమండలి ప్రకటించింది. మహానగరానికి తాగునీరు అందిస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ –1 లో మెయిన్ పైపులైన్ తరలింపు నేపథ్యంలో రెండు రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. ఇదీ పరిస్థితి.. దక్షిణ మధ్య రైల్వే శాఖ మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి సిరిసిల్ల జిల్లాలోని కొత్తపల్లి వరకు నూతనంగా రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు చేపడుతోంది. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద ఈ ట్రాక్ వేసే దగ్గర హైదరాబాద్కు నీటి సరఫరా చేసే గోదావరి మెయిన్ వాటర్ పైపులైన్ ఉంది. రైల్వే ట్రాక్ క్రాసింగ్ కోసం అక్కడ ఉన్న 3000 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపు లైన్కు బ్రిడ్జ్ పాసింగ్ – బైపాసింగ్, ఇంటర్ కనెక్ష¯న్ పనుల చేపడుతుండటంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. వాస్తవంగా పనుల పూర్తికి 66 గంటలు సమయం పడుతుందని ముందుగా భావించినప్పటిఈ వాటిని 48 గంటల్లో పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించే విధంగా జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు. పూర్తి అంతరాయం కలిగే ప్రాంతాలివే.. నగర శివారులోని షాపూర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, డిఫెన్స్ కాలనీ. నాగారం, దమ్మాయిగూడ, కీసర, బొల్లారం రింగ్ మెయిన్–3 లైన్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కొండపాక (జనగామ, సిద్దిపేట), ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేరు (భువనగిరి), ఘన్పూర్ (మేడ్చల్/శామీర్ పేట), కంటోన్మెంట్ ప్రాంతం, ఎంఈఎస్, తుర్కపల్లి బయోటెక్ పార్కు, కాప్రా మున్సిపాలిటీ పరిధి ప్రాంతాలు. పాక్షికంగా .. బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ ప్రాంతాలు, ఎర్రగడ్డ, అమీర్ పేట్, ఎల్లారెడ్డి గూడ, యూసుఫ్ గూడ, కేపీహెచ్బీ, మలేసియన్ టౌన్ షిప్ రిజర్వాయర్ ప్రాంతాలు. లింగంపల్లి నుంచి కొండాపూర్ వరకు గల ప్రాంతాలు, గోపాల్ నగర్, మయూర్ నగర్, రిజర్వాయర్ ప్రాంతాలు, ప్రగతి నగర్ ప్రాంతం, నిజాంపేట్ బాచుపల్లి. ట్యాంకర్ల ద్వారా ఉచితంగా ప్రభావిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటి సరఫరా జరగనుంది. ఇప్పటికే నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే డివిజన్ల సీజీఎం, జీఎం తదితర ఉన్నతాధికారులతో జలమండలి ఎండీ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా స్లమ్, బస్తీలకు ప్రాధాన్యమిస్తూ ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీరందించాలని, అవసరమైతే ట్రిప్పుల సంఖ్యను సైతం పెంచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అవసరాన్ని బట్టి ప్రైవేటు ట్యాంకర్ల సేవలను ఉపయోగించుకోవాలని, 24 గంటలూ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్లలో ఎప్పటికప్పుడు తగినంత నీరు ఉండేలా చూసుకోవాలని ఎండీ ఆదేశించారు. సంపులు, స్టోరేజీ సామర్థ్యం ఉన్నవాళ్లు నీటి నిల్వ చేసుకుని, నీటి వృథాను అరికట్టి, పొదుపుగా వాడుకోవాలని జలమండలి ఎండీ విజ్ఞప్తి చేశారు. చదవండి: ఆ నాలుగు గంటల్లో ఏం జరిగింది?.. టేప్ ఎందుకు వేశారు: ప్రీతి సోదరుడు -
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్ రాజధానిలో నీటి సరాఫరా బంద్
కీవ్: ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. రష్యా యుద్ధంతో ఉక్రెయిన్ పూర్తిగా ధ్వంసమవుతోంది. శత్రువు దాడి నుంచి తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ సేనికులు తీవ్రంగా పోరాడుతున్నారు. ఉక్రెయిన్ దేశ రాజధాని కీవ్పై రష్యా బలగాలు మరోసారి దృష్టి సారించాయి. రాజధాని ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. తాజాగా కీవ్ను లక్ష్యంగా చేసుకొని రష్యా భీకర దాడులు చేపట్టింది. శుక్రవారం తెల్లవారుజామున కీవ్ బాంబుల మోతతో దద్దరిల్లింది. రష్యా చర్యతో మౌలిక సదుపాయాలు దెబ్బతినడం వల్ల కీవ్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని కీవ్ మేయర్ విటాలీ క్విచ్కో వెల్లడించారు. మెట్రో సర్వీస్లు నిలిపివేయడంతో స్టేషన్లను షెల్టర్స్గా వినియోగించుకోవాలని తెలిపారు. కీవ్లోని సెంట్రల్ జిల్లాలు, డెస్న్యాన్ జిల్లాలో పేలుళ్ల మోత వినిపించిందని, స్థానిక ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని పేర్కొన్నారు. కాగా రష్యా వరుస దాడుల దాడులతో ఉక్రెయిన్ విద్యుత్ నెట్వర్క్ ఇప్పటికే తీవ్రంగా దెబ్బతింది. విద్యుత్ అంతరాయం కారణంగా లక్షలాది ఉక్రెనియన్లు అంధకారంలో చిక్కుకుపోయారు. ఉక్రెయిన్ విద్యుత్, ఇంధన, మౌలిక సదుపాయాల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని రష్యా ఈ దాడులు చేపట్టింది. చదవండి: కొండచరియలు విరిగిపడి 50 మంది గల్లంతు -
హైదరాబాద్ వాసులకు అలర్ట్: ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 26 (శనివారం) నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా ఉండదని, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరుగుతుందని జలమండలి ప్రకటించింది. కృష్ణా ఫేజ్– 2 పథకంలోని 1600 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైప్లైన్కు బాలాపూర్ శివాజీ చౌక్ వద్ద లీకేజీల నివారణ, హఫీజ్ బాబానగర్ వద్ద ఎయిర్ వాల్వ్లను మార్చనున్న నేపథ్యంలో నీటి సరఫరాను నిలిపివేయనున్నారు. శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం (27న) మధ్యాహ్నం 12 గంటల వరకు.. దాదాపు 18 గంటలపాటు మరమ్మతు పనులు కొనసాగనున్నాయని తెలిపింది. (చదవండి: ‘మీ సేవ’లో దరఖాస్తు చేసుకున్నా.. జీహెచ్ఎంసీకి వెళ్లాల్సిందేనట..!) నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు డివిజన్ 1: ఎన్పీఏ పరిధిలోని ప్రాంతా లు. డివిజన్ 2(బి): బాలాపూర్, మైసారం, బార్కాస్. డివిజన్ 20: అల్మాస్గూడ, లెనిన్ నగర్, బడంగ్పేట్, ఏఆర్సీఐ. తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరిగే ప్రాంతాలు: డివిజన్ 1: మీరాలం పరిధిలోని ప్రాంతాలు. డివిజన్ 3: భోజగుట్ట పరిధిలోని ప్రాంతాలు. డివిజన్ 16: బుద్వేల్ పరిధిలోని ప్రాంతాలు. డివిజన్ 20: శంషాబాద్ పరిధిలోని ప్రాంతాలు. -
గంటసేపట్లో పునరుద్ధరించండి
సాక్షి, హైదరాబాద్: దసరా సెలవుల కారణం చెప్పి ఉస్మానియా వర్సిటీలోని హాస్టళ్లలో విద్యుత్, నీటి సరఫరాను ఆపడం సరికాదని.. గంటసేపట్లో పునరుద్ధ రించాలని అధికారులను హైకోర్టు ఆదే శించింది. అలా చేయని పక్షంలో రిజి స్ట్రార్ తమ ముందు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. వర్సిటీ అధికారులు దసరా సెలవులను తొలుత అక్టోబర్ 3 నుంచి 10 వరకు పేర్కొ న్నారు. తర్వాత 26 వరకు పొడిగిండంతో పాటు విద్యుత్, నీటి సరఫరా నిలి పేశారు. వీటిని పునరుద్ధరించేలా ఆదే శాలివ్వాలని కోరుతూ ఎల్ఎల్బీ విద్యా ర్థులు నెరెళ్ల మహేశ్గౌడ్తో పాటు మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించి లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచా రణ చేపట్టారు. పిటిషన్ తరఫున న్యాయవాది గౌరారం రాజశేఖర్రెడ్డి వాదనలు వినిపించారు. ఎల్ఎల్బీ వి ద్యార్థులు, గ్రూప్–1 అభ్యర్థులు పరీక్ష లకు సిద్ధమవుతున్నారన్నారు. హాస్టళ్ల లో చదువుకుంటున్న విద్యార్థుల్లో చాలా మంది పేద, మధ్య తరగతి విద్యార్థు లేనని వెల్లడించారు. వర్సిటీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మరమ్మతులు చేయడం కోసం సరఫరా నిలిపినట్లు చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. విద్యుత్, నీటి సరఫరా ను పునరుద్ధరించాలని ఆదేశించారు. -
8% గృహాలకు వారంలో ఒక్క రోజే నీరు
న్యూఢిల్లీ: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 8% గృహాలకు వారంలో కేవలం ఒక్కరోజు నీరు సరఫరా అవుతుండగా, 74% మందికి వారమంతా అందుతున్నట్లు కేంద్రం జల్శక్తి శాఖ అధ్యయనంలో వెల్లడైంది. మరో 4% గృహాలకు వారంలో ఐదారు రోజులు, 14% మందికి కనీసం మూడు, నాలుగు రోజులు నీరు అందుతోందని ఆదివారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. మొత్తమ్మీద సరాసరిన రోజుకు మూడు గంటలు చొప్పున నీరు సరఫరా అవుతున్నట్లు వివరించింది. తమ ఇళ్లలోని కుళాయిల ద్వారా అందే నీటితో రోజువారీ అవసరాల్లో 80% వరకు తీరుతున్నట్లు ప్రతి ఐదుగురిలో నలుగురు తెలిపినట్లు నివేదిక పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, యూపీల్లో కుళాయి కనెక్షన్లు లేని గృహాలు అత్యధికంగా ఉన్నట్లు తెలిపింది. కనీసం ఆరు రాష్ట్రాల్లోని 30%పైగా గృహాలకు గత వారం రోజులుగా కుళాయి నీరు కాలేదని వెల్లడైంది. ‘హర్ ఘర్ జల్’ పథకం అమలవుతున్న 91% గృహాల్లోని కుళాయిలు సర్వే చేపట్టిన రోజు పనిచేస్తున్నట్లు గుర్తించారు (జాతీయ స్థాయిలో ఇది 86%). 91% గృహాలకు 88% గృహాలకు అవసరాలకు సరిపోను (రోజుకు ప్రతి వ్యక్తికి 55 లీటర్లకు మించి) నీరు అందుతుండగా, 84% ఇళ్లకు రోజూ సరఫరా అవుతోంది. 90% గృహాలకు కుళాయిల ద్వారా మంచినీరు అందుతోంది. -
మేడ్ ఇన్ ఇండియా వ్యవసాయం అంటే ఇదే.. రైతు తెలివికి సలాం!
పురాతన కాలం నుంచే భారతీయ సంస్కృతికి, వ్యవసాయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సింధు నాగరికత కాలంలో వ్యవసాయం గురించి మనం చదువుకునే ఉంటాము. అప్పటి వినూత్న వ్యవసాయ పద్దతులతో ప్రజలు.. పంటలను సమృద్ధిగా పండించారు. కాగా, ఓ రైతు తాజాగా వినూత్న తరహాలో వ్యవసాయం చేస్తున్నాడు. కాగా, సృజనాత్మకత విషయానికి వస్తే భారతీయులు ప్రతీ ఒక్కరినీ ఓడించగలరని మరోసారి రుజువైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ రైతు ట్రేడ్మిల్ వంటి యంత్రంపై ఎద్దును నడిపిస్తూ సాగుకు కావాల్సిన నీటిని, మోటర్ల సాయంతో కరెంట్ను ఉత్పత్తి చేస్తున్నాడు. కాగా, ఎద్దు ట్రేడ్మిల్ వంటి యంత్రంపై నడుస్తుండగా పైపుల ద్వారా నీరు పంట పొలాలకు చేరుతోంది. అలాగే, మోటర్ల సాయంతో కరెంట్ను సైతం ఉత్పత్తి చేసి పంటల సాగుకు వాడుకుంటున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సదరు వీడియోకు ‘రూరల్ ఇండియా ఇన్నోవేషన్. ఇట్స్ అమేజింగ్’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు సదరు క్రియేటివ్ రైతులను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. స్వదేశీ ఆవిష్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతాయని అన్నాడు. మరో యూజర్ మాత్రం.. జంతువులను శారీరకంగా హింసిస్తున్నాడంటూ కామెంట్స్ చేశాడు. RURAL INDIA Innovation. It’s Amazing!! pic.twitter.com/rJAaGNpQh5 — Awanish Sharan (@AwanishSharan) September 23, 2022 -
పోలవరం తొలిదశతో 2.98 లక్షల ఎకరాలకు సాగునీరు
సాక్షి, అమరావతి: పోలవరం తొలి దశ పూర్తైతే కుడి కాలువ కింద 1.57 లక్షల ఎకరాలు(తాడిపూడి ఎత్తిపోతల ఆయకట్టు), ఎడమ కాలువ కింద 1.14 లక్షల (పుష్కర ఎత్తిపోతల) ఎకరాలతో కలిపి మొత్తం 2.98 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) వాటర్ ప్లానింగ్, పాజెక్టుల విభాగం సభ్యుడు కె.వోహ్రాకు ప్రాజెక్టు సీఈ సుధాకర్బాబు వివరించారు. గోదావరి డెల్టాలో 10.13 లక్షలు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షలు వెరసి రూ.23.21 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చన్నారు. విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలతోపాటు కృష్ణా, గోదావరి డెల్టాల పరిధిలో తాగునీటి అవసరాలు తీర్చవచ్చన్నారు. తొలి దశ పనులు పూర్తి చేయడానికి రూ.10,911 కోట్లు అవసరమని తెలిపారు. దీంతో ఏకీభవించిన వోహ్రా.. తొలి దశ పనుల పూర్తికి అవసరమైన నిధుల మంజూరుకు నివేదిక ఇవ్వాలని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సభ్య కార్యదర్శి ఎం.రఘురాంను ఆదేశించారు. పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,587.87 కోట్లను ఆమోదించి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు రూ.పది వేల కోట్లను అడ్హక్గా ఇవ్వాలని ఇటీవల ప్రధాని మోదీని సీఎం వైఎస్ జగన్ కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని ఆదేశాల మేరకు పోలవరంతోపాటు సీఎం జగన్ ప్రస్తావించిన ఇతర అంశాల పరిష్కారంపై పీఎంవో నియమించిన కేంద్ర కమిటీ గత నెల 25న ఢిల్లీలో రాష్ట్ర అధికారుల కమిటీతో సమావేశమైంది. ఈ సమావేశంలో పోలవరానికి అడ్హక్గా రూ.పది వేల కోట్లను మంజూరు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్ర కమిటీ రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ సభ్యుడు కె.వోహ్రా మంగళవారం వర్చువల్ విధానంలో పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం, పోలవరం సీఈ సుధాకర్బాబు, సహాయ పునరావాస విభాగం కమిషనర్ సీహెచ్ శ్రీధర్ తదితరులతో సమావేశమయ్యారు. రెండోదశలో... పోలవరం రెండో దశ పూర్తైతే ఆయకట్టులో మిగిలిన 4.02 లక్షల ఎకరాలతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని, ఇందుకు మరో రూ.21 వేల కోట్లకుపైగా అవసరమని పోలవరం సీఈ సుధాకర్బాబు తెలిపారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాల ప్రభావం పోలవరం తొలిదశపై ఏమాత్రం ఉండదని వోహ్రాకు వివరించారు. పోలవరం పూర్తయితే పుష్కర, తాడిపూడి ఎత్తిపోతలతోపాటు పట్టిసీమ, పురుషోత్తపట్నం పథకాలను మూసేస్తామన్నారు. చింతలపూడి ఎత్తిపోతల వరద జలాలపై ఆధారపడి చేపట్టామని చెప్పారు. వెంకటనగరం పంపింగ్ స్కీం ఆయకట్టుపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. దీంతో పోలవరం తొలి దశ పూర్తికి నిధులపై నివేదిక పంపాలని పీపీఏ సభ్య కార్యదర్శిని వోహ్రా ఆదేశించారు. పీపీఏ నివేదిక ఆధారంగా కేంద్ర జల్ శక్తి శాఖకు నిధులు మంజూరు చేయాలని సిఫార్సు చేస్తామని చెప్పారు. -
గ్రామగ్రామాన సు‘రక్షిత’ నీరు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత సురక్షితమైన తాగు నీటిని ప్రజలకు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. గ్రామాల్లో ప్రజలు తాగు నీటికి నిరంతరం పరీక్షలు నిర్వహిస్తోంది. ఎక్కడైనా కలుషితాలు ఉంటే, ఆ నీటి శుద్ధికి చర్యలు చేపడుతోంది. ఫ్లోరైడ్ తదితర కలుషితాల్లేవని నిర్ధారించుకున్నాక ప్రజలు వినియోగించుకోవడానికి అనుమతిస్తున్నారు. ఇప్పుడు గ్రామీణ మంచి నీటి సరఫరా కేంద్రాల నుంచి అందిస్తున్న తాగు నీటిలో 97.15 శాతం స్వచ్ఛమైనదని పరీక్షలు తేటతెల్లం చేస్తున్నాయి. 2021 ఆగస్టు నుంచి 2022 ఆగస్టు మధ్య ఏడాది కాలంలో మొత్తం 9,51,337 నీటి శాంపిల్స్కు పరీక్షలు నిర్వహించింది. గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఒక విడత అన్ని గ్రామాల్లో బోర్లు, బావులు, చెరువులు, మంచి నీటి సరఫరా పథకాల నీటికి ప్రభుత్వం పరీక్షలు చేస్తోంది. అవసరమైతే ఏడాదిలో రెండో సారి కూడా పరీక్షలు చేస్తున్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలోని బోర్ల నీటికీ కూడా గత ఏడాది రెండు విడతలు కెమికల్, హానికర సూక్ష్మ క్రిముల పరీక్షలు చేసినట్లు ఎస్డబ్యూఎస్ఎం ప్రాజెక్టు డైరెక్టర్ హరే రామనాయక్, చీఫ్ కెమిస్ట్ కృష్ణమూర్తి ‘సాక్షి’కి తెలిపారు. గ్రామాలకే నీటి పరీక్ష కిట్లు సాధారణంగా గ్రామాల్లో తాగు నీటి శాంపిల్స్ను ఆర్డబ్ల్యూఎస్కు అనుబంధంగా పనిచేసే 107 ల్యాబ్లలో పరీక్షిస్తారు. గత మూడేళ్లుగా తాగే నీటి నాణ్యతపై అనుమానం కలిగినప్పుడు అక్కడికక్కడే పరీక్షించేందుకు ప్రభుత్వం అన్ని గ్రామాలకు ఎఫ్టీకే కిట్లను సరఫరా చేస్తోంది. వీటితో 8 రకాల ప్రమాదకర రసాయనాలను గుర్తించొచ్చు. ఒక్కొక్క కిట్తో వంద శాంపిల్స్ను పరీక్షించొచ్చు. ఈ ఏడాది ఈ కిట్లతో పాటు నీటిలో ప్రమాదకర బ్యాక్టీరియాను గుర్తించే హెచ్టూఎస్ కెమికల్ సీసాలను కూడా పంపిణీ చేశారు. మార్చిలోనే 7.50 లక్షల హెచ్టూఎస్ సీసీలు పంపిణీ చేసినట్టు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. నీటిని పరీక్షించే విధానంపై గ్రామ స్థాయి సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. దేశంలో ఏపీనే ఫస్ట్ గడిచిన ఏడాది కాలంలో నీటి నాణ్యత పరీక్ష కేంద్రాల్లో (ల్యాబ్లలో) పరీక్షల నిర్వహణలో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ ఏడాది ఆగస్టు 15 వరకు 6,12,458 శాంపిల్స్కు ల్యాబ్లలో కెమికల్, బ్యాకీరియా పరీక్షలు చేశారు. గ్రామాల్లోని ఎఫ్టీకే కిట్లతో మరో 3,38,879 పరీక్షలు జరిపారు. ఇలా పూర్తిస్థాయి శాస్త్రీయంగా ఉండే ల్యాబ్ పరీక్షల్లో ఏపీ తర్వాతి స్థానాల్లో తమిళనాడు (5.35 లక్షలు), పశ్చి మ బెంగాల్ (5.31 లక్షలు), మధ్య ప్రదేశ్ (5.28 లక్షలు) ఉన్నాయి. నాణ్యమైన నీరే రాష్ట్రంలోని గ్రామాల్లో తాగునీరు ఎంతో సురక్షితమైనదని అన్ని పరీక్షల్లోనూ నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. ఏడాది మొత్తంలో చేసిన పరీక్షల్లో 97.15 శాతం నీరు సురక్షితమైనదని తేలింది. 2.85 శాతం శాంపిల్స్లో మాత్రమే కలుషిత కారకాలు గుర్తించారు. ల్యాబ్లో 6.12 లక్షల శాంపిల్స్కు పరీక్షలు చేయగా 25,140 నమూనాల్లో కలుషితాలను గుర్తించారు. 3.38 లక్షల ఎఫ్టీకే పరీక్షల్లో 3,077 నమూనాల్లో కలుషితాలు ఉన్నట్టు గుర్తించారు. కేరళ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని గ్రామీణ నీటిలో అత్యధికంగా కలుషితాలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. -
నీటిపై రాతలు అవాస్తవం
ఫిరంగిపురం(పల్నాడు జిల్లా): ఫిరంగిపురం ఆరోగ్యనగర్లోని జగనన్న లేఅవుట్ల్లో సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా బోర్లు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా రూ.41లక్షలు వెచ్చించి పైపులైన్ ఏర్పాటు చేసి నీటి సరఫరా చేస్తున్నారు. కానీ కొన్ని పత్రికలు కట్టు కథలు ప్రచారం చేస్తున్నాయి. నీటి సరఫరాపై ఓ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటేశ్వరరావు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం లేఅవుట్లను సందర్శించారు. 3,4 నెంబర్గల లేఅవుట్లలో జరుగుతున్న పైపులైన్ పనులను పరిశీలించారు. బోర్లు రెండు నెలల కిందట వినియోగంలోకి వచ్చాయన్నారు. నాలుగో లేఅవుట్లో 625 గృహాల నిర్మాణం జరుగుతుందని, నీటి అవసరాల కోసం రేపూడి గ్రామంలోని సమగ్ర మంచినీటి పథకం ద్వారా తాళ్లూరు రోడ్డు నుంచి వసంతనగర్ మీదుగా ఆరోగ్యనగర్కు పైపులైను ఏర్పాటు చేశామన్నారు. పైపులైను వేసే సమయంలో స్థానికంగా ఉన్న వారితో కొన్ని ఇబ్బందులు ఏర్పడటంతో ఆసమస్యలను పరిష్కరించుకొని రెండురోజుల కిందట నీటి సరఫరా చేశామన్నారు. వాటిలో లోపాలు గుర్తించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చొరవతో పూర్తిస్థాయిలో నేడు నీటిని విడుదల చేసి 70 వరకు ట్యాప్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లబ్ధిదారులు నీటిని కొనుగోలు చేస్తున్నారని చెప్పడం అవాస్తవమన్నారు. లోతట్టులో గృహాలు లేవు ప్రధాన రహదారి లోతట్టులో లేదు. అంతర్గత రోడ్ల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలి. ప్రధాన రహదారితో పోల్చకూడదు. అంతర్గత రోడ్ల కన్నా ఇచ్చిన ప్లాట్లు లోతులో ఉంటే మాత్రమే మెరక చేయాలి, లేనిఎడల అవసరం లేదు. నీటికోసం రూ.41 లక్షలు మంజూరు చేశారని వాటితో పైపులైన్ వేశారు. లబ్ధిదారులు ఆ నీటినే వాడుకుంటున్నారు. – పింకి, ఏఈ, హౌసింగ్ శాఖ బోర్లు, కొళాయిలు ఏర్పాటుచేశారు.. ఆరోగ్యనగర్లోని జగనన్న కాలనీలో నీటి కోసం అధికారులు బోర్లు, కొళాయిలు ఏర్పాటుచేశారు. కొళాయిలు నుంచి నీరు కూడా వస్తుండటంతో ఆ నీటిని డ్రమ్ములతో పట్టుకుంటున్నాం. ఇల్లు కట్టుకోడానికి నీటికోసం ఇబ్బందులు లేవు. కొన్ని రోజులుగా వానలు పడుతుండటంతో పనివారు రాకపోవడంతో పనులు చేయలేక పోతున్నాం. – ఆర్.ఇన్నయ్య లబ్ధిదారుడు నీటి ఇబ్బందులు లేవు జగనన్న కాలనీలో నీటికి ఇబ్బందులు లేవు. రెండురోజుల కిందట అధికారులు నీటి సరఫరా చేశారు. రెండు నెలల కిందటే బోర్లు వేశారు. మా లేఅవుట్ ప్రాంతంలో 17 ట్యాప్లు ఏర్పాటుచేశారు. బజారుకో పంపు రెండు కొళాయిలు ఇచ్చారు. వాటిని వినియోగించుకుంటున్నాం. – పి.లూర్దుమరియన్న. గృహ లబ్దిదారుడు. -
ఇక సచివాలయాల్లోనే నీటితీరువా చెల్లింపులు
సాక్షి, అమరావతి: ఉన్న ఊళ్లో.. సమీప గ్రామ సచివాలయంలోనే నీటి తీరువా చెల్లించే సదుపాయాన్ని ఆయకట్టు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. వీటి వసూలు బాధ్యతలను డిజిటల్ అసిస్టెంట్కు అప్పగించింది. అలాగే, గ్రామ పంచాయతీ పరిధిలోని ఆయకట్టు రైతుల వివరాలను ఏపీ సేవ పోర్టల్లో ఇప్పటికే నమోదు చేసిన సర్కార్.. వాటి ఆధారంగా రైతుల నుంచి నీటి తీరువా వసూలుచేసి, అక్కడికక్కడే రసీదు ఇవ్వనుంది. అత్యంత పారదర్శకంగా వీటిని వసూలు చేయడంవల్ల రైతులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏపీలోనే నీటి తీరువా తక్కువ.. రాష్ట్రంలో 104.61 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం ఉంది. భారీ ప్రాజెక్టుల కింద 65.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఏపీ నీటి పారుదల అభివృద్ధి సంస్థ పరిధిలోని చిన్న ఎత్తిపోతల కింద 7.86 లక్షల ఎకరాలు.. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు, చెరువుల కింద 31.13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగుకు నీటిని సరఫరా చేసినప్పుడు.. ఖరీఫ్ పంటకు రూ.200, రబీ పంటకూ రూ.200 చొప్పున నీటి తీరువాగా వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో నీటి తీరువా అత్యంత తక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. మండల కేంద్రాలకు వెళ్లక్కర్లేదు ఇక నీటి సరఫరా ఆధారంగా ఆయకట్టు రైతుల నుంచి ఇప్పటిదాకా తహసీల్దార్ నేతృత్వంలో వీఆర్వోలు, ఆర్ఐలు ఈ నీటి తీరువాను వసూలు చేస్తున్నారు. తీరువా చెల్లించాలంటే రైతులు ఇప్పటివరకు మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా దేశంలో ఎక్కడాలేని రీతిలో గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే గ్రామ సచివాలయాల ద్వారా ఇప్పటికే 543కి పైగా సేవలను ప్రజలకు అందిస్తున్నారు. తాజాగా నీటి తీరువా చెల్లించే అవకాశాన్ని కూడా కల్పించారు. -
ముషీరాబాద్ చేపల మార్కెట్ కాలనీలో కలుషిత నీటి సరఫరా
-
కోటి ఎకరాలకు జలధారలు
సాక్షి, అమరావతి: ఈసారి రబీలో 31.10 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా జలవనరుల శాఖ అధికారులు రూపొందించిన ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా వృథాకు అడ్డుకట్ట వేసి శివారు భూములకు సైతం జలసిరులు అందించాలని దిశానిర్దేశం చేసింది. ఖరీఫ్లో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 70 లక్షల ఎకరాలకు నీళ్లందించిన నేపథ్యంలో రబీతో కలిపి మొత్తం 1.11 కోట్ల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా.. 2019–20, 2020–21లోనూ ఖరీఫ్, రబీల్లో కోటి ఎకరాలకు నీళ్లందించారు. వరుసగా మూడో ఏడాది కోటి ఎకరాల ఆయకట్టుకు నీటిని అందిస్తుండటం గమనార్హం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ వరుసగా మూడేళ్ల పాటు కోటి ఎకరాలకు నీళ్లందించిన దాఖలాలు లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. గత మూడేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళితో పాటు వాగులు, వంకలు ఉరకలెత్తాయి. చిన్న, మధ్య తరహా, భారీ ప్రాజెక్టులు కళకళలాడుతుండటంతో మూడేళ్లుగా ఖరీఫ్, రబీల్లో కోటి ఎకరాలకు నీళ్లందించేందుకు మార్గం సుగమమైంది. కృష్ణా డెల్టాలో మొదటిసారి... కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని 13.08 లక్షల ఎకరాల్లో కృష్ణా డెల్టా ఆయకట్టు విస్తరించింది. ఇప్పటివరకూ ఖరీఫ్లో మాత్రమే కృష్ణా డెల్టా ఆయకట్టుకు అధికారికంగా నీళ్లందిస్తున్నారు. అయితే గత మూడేళ్లుగా రబీలోనూ కృష్ణా డెల్టా ఆయకట్టుకు అధికారికంగా నీళ్లందిస్తుండటం గమనార్హం. 2019–20లో 1.10 లక్షలు, 2020–21లో 2.50 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేసిన ప్రభుత్వం ఈ ఏడాది ఏకంగా 8.52 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీళ్లందించడానికి సిద్ధమైంది. డెల్టా చరిత్రలో రబీలో ఇంత భారీగా నీళ్లందిస్తుండటం ఇదే తొలిసారి. ఈసారి రికార్డు స్థాయిలో పులిచింతల ప్రాజెక్టులో ఏకంగా 40.44 టీఎంసీలను నిల్వ చేశారు. ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించడం వల్లే కృష్ణా డెల్టాలో రికార్డు స్థాయిలో ఆయకట్టుకు నీరు అందుతోందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. వంశధార నుంచి చిత్రావతి దాకా.. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నుంచి వైఎస్సార్ కడప జిల్లాలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దాకా మధ్య, భారీ తరహా ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్న అన్ని జలాశయాల కింద రబీలో ఆయకట్టుకు నీళ్లందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లాలో వంశధారతోపాటు మధ్యతరహా ప్రాజెక్టైన మడ్డువలస ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి డెల్టాకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తోంది. పశ్చిమ గోదావరిలో ఎర్రకాల్వ, తమ్మిలేరు ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తోంది. ప్రకాశం జిల్లాలో సాగర్ కుడి కాలువ, కృష్ణా డెల్టాతోపాటు మధ్యతరహా ప్రాజెక్టులైన రాళ్లపాడు, మోపాడు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెన్నా డెల్టాలో ఆలస్యంగా సాగు చేపట్టిన ఖరీఫ్ పంటలకు నీటిని సరఫరా చేస్తోంది. కర్నూలు జిల్లా పరిధిలో కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టడం వల్ల తెలుగుగంగ ఆయకట్టుకు రబీలో నీటిని విడుదల చేయడం లేదు. ఎస్సార్బీసీ, తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ) ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలో తెలుగుగంగ, గండికోట ఎత్తిపోతల, గాలేరు–నగరి తొలిదశ, చిత్రావతి, పులివెందుల బ్రాంచ్ కెనాల్, హెచ్చెల్సీ(తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ) ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తోంది. లభ్యత ఆధారంగా రబీకి నీటి విడుదల ప్రభుత్వ ఆదేశాల మేరకు లభ్యత ఆధారంగా ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తాం. యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసి ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందిస్తాం. పులిచింతలలో ప్రభుత్వం దూరదృష్టితో 40.44 టీఎంసీలను నిల్వ చేయడం వల్లే కృష్ణా డెల్టా చరిత్రలో తొలిసారిగా రికార్డు స్థాయిలో రబీ పంటలకు నీళ్లందించగలుగుతున్నాం. నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని రైతులకు వి/æ్ఞప్తి చేస్తున్నాం. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ -
చెన్నైకి నీటి సరఫరా భేష్
సాక్షి, అమరావతి: చెన్నైకి నీటి సరఫరా విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని తమిళనాడు సర్కారు ప్రశంసించింది. చెన్నైకి ఏపీ పూర్తిస్థాయిలో నీరు సరఫరా చేస్తోందని కృష్ణా బోర్డుకు తెలిపింది. చెన్నైకి నీటి సరఫరాపై మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జలవనరుల అధికారులతో గురువారం కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ వర్చువల్ విధానంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలుగుగంగ చరిత్రలో తొలిసారిగా చెన్నైకి గత ఏడాది (2020లో) గరిష్టంగా 8.23 టీఎంసీలు ఏపీ సరఫరా చేసిందని తమిళనాడు అధికారులు చెప్పారు. ఈ ఏడాది ఇప్పటికే 5.5 టీఎంసీలు సరఫరా చేసిందని, పూండి జలాశయం నిండిపోవడంతో ఏప్రిల్ వరకు సరఫరా చేయొద్దని ఏపీని కోరినట్లు చెప్పారు. అయితే, ఒప్పందానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం చెన్నైకి తక్కువ నీటిని సరఫరా చేస్తోందని, ఏపీకి జరిమానా విధించాలని తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ మోహన్కుమార్ అన్నారు. దీనికి కర్నూలు ప్రాజెక్టస్ సీఈ మురళీనాథ్రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. కర్ణాటక, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య 1976లో కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందంలో, 1983లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య కుదిరిన ఒప్పందంలో జరిమానా నిబంధన లేదని స్పష్టం చేశారు. నీటి సరఫరాపై తమిళనాడు సంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. తెలంగాణ అధికారులకు ఎందుకు ఇబ్బంది అని నిలదీశారు. చెన్నైకి నీటి సరఫరా పేరుతో ఏపీ వందలాది టీఎంసీలను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మళ్లిస్తోందని తెలంగాణ అధికారులు చేసిన వ్యాఖ్యలను మురళీనాథ్రెడ్డి తోసిపుచ్చారు. కృష్ణా వరద జలాల మళ్లింపు అంశం తెలుగుగంగ ప్రాజెక్టు నివేదికలో ఉందని, కృష్ణా బోర్డుకు చెప్పే వృథాగా సముద్రంలో కలుస్తున్న వరదను మళ్లిస్తున్నామని స్పష్టం చేశారు. దాంతో.. రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్)కు నీటిని సక్రమంగా సరఫరా చేయడం లేదని తెలంగాణ సీఈ అనగా.. బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. చెన్నైకి మరింత మెరుగ్గా నీటి సరఫరా చేయడంపై అధ్యయనం బాధ్యతలను ఏపీ, తమిళనాడు ఈఎన్సీల నేతృత్వంలోని సాంకేతిక కమిటీకి అప్పగిస్తున్నామని చెప్పారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. 30 నుంచి 40 రోజుల్లేనే 12 టీఎంసీలు.. చెన్నైకి కేటాయించిన 15 టీఎంసీల్లో.. ఆవిరి, ప్రవాహ నష్టాలుపోనూ శ్రీశైలం నుంచి తమిళనాడు సరిహద్దుకు జూలై నుంచి అక్టోబర్ వరకూ 8, జనవరి నుంచి ఏప్రిల్ వరకూ 4 టీఎంసీలను ఏపీ సరఫరా చేయాలి. అప్పట్లో శ్రీశైలానికి వరద జూలైలోనే వచ్చేదని, ఇప్పుడు ఆగస్టులో వస్తోందని, వరద ఒకేసారి గరిష్టంగా రావడం వల్ల శ్రీశైలం నిండిపోయి సాగర్, ప్రకాశం బ్యారేజీ మీదుగా జలాలు సముద్రంలో కలుస్తున్నాయని ఏపీ సీఈ చెప్పారు. వరదను ఒడిసి పట్టి సోమశిల, కండలేరులో నిల్వ చేసిన నీరు సాగుకే సరిపోవడం లేదన్నారు. శ్రీశైలంలో 840 అడుగులకు పైన నీటి నిల్వ 100 రోజులు కూడా ఉండటం లేదన్నారు. వరద రోజులు ముగిశాక.. మహారాష్ట్ర, కర్ణాటకలు కేటాయించిన చెరో ఐదు టీఎంసీలను కూడా రోజుకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తే తప్ప తమిళనాడుకు జూలై నుంచి అక్టోబర్, ఏప్రిల్ నుంచి జనవరి మధ్య 12 టీఎంసీలు సరఫరా చేయలేమని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో చెన్నైకి 250 రోజుల్లో కాకుండా 30 నుంచి 40 రోజుల్లోనే 12 టీఎంసీలు సరఫరా చేస్తామన్నారు. ఆ మేరకు ఏపీ సరిహద్దు నుంచి పూండి రిజర్వాయర్ వరకు కాలువ సామర్థ్యాన్ని వెయ్యి నుంచి 2,500 క్యూసెక్కులకు, రిజర్వాయర్ల సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలని ప్రతిపాదించారు. ఎగువ రాష్ట్రాలు విడుదల చేసిన కోటా నీటిని శ్రీశైలం నుంచి తరలించడానికి చెన్నై వరకూ పైపులైన్ వేసుకోవాలని సూచించారు. చెన్నైకి నీటిని సరఫరా చేసినందుకు తమిళనాడు ఇంకా రూ.350 కోట్లకుపైగా బకాయి పడిందని, ఆ నిధులు విడుదల చేయాలని ఏపీ సీఈ మురళీనాథ్రెడ్డి కోరారు. ఈ విషయాలను తమ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తమిళనాడు అధికారులు చెప్పారు. -
నవంబర్ 15న బంజారాహిల్స్తోపాటు ఈ ప్రాంతాలకు నీళ్లు బంద్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న సోమవారం పలు ప్రాంతాలకు మంచినీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించింది. పంజగుట్ట శ్మశాన వాటిక ఎదురుగా రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో అక్కడున్న 1000 ఎంఎం డయా ఎయిర్ వాల్వ్ను మరోచోటకు మార్చాల్సిన నేపథ్యంలో సరఫరా నిలిచిపోనుంది. మరమ్మతు పనుల కారణంగా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయని తెలిపింది. నిర్వహణ డివిజన్ 6లో ఎర్రగడ్డ, బంజారాహిల్స్, ఎల్లారెడ్డిగూడ, ఎస్ఆర్నగర్, వెంగళ్రావునగర్, సోమాజిగూడ, వెంకటగిరి సెక్షన్ల పరిధిలోని ప్రాంతాల్లో, నిర్వహణ డివిజన్ 9లో మూసాపేట సెక్షన్ పరిధిలోని పాండురంగానగర్, కబీర్నగర్ ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదు. నిమ్స్కు నీటి సరఫరా బంద్ నిమ్స్కు 24 గంటలు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి శుక్రవారం నిమ్స్ యాజమన్యానికి సర్కులర్ జారీ చేసింది. ఈ నెల 15వ తేది సాయంత్రం నుంచి 16వ తేది రాత్రి వరకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో 24 గంటల పాటు శ్రస్త చికిత్సలు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. -
కూకట్పల్లి ప్రాంతానికి ఈ నెల 29న నీళ్లు బంద్..
సాక్షి, హైదరాబాద్: మంజీరా ఫేజ్– 2 పైపులైన్లకు మరమ్మతుల కారణంగా ఈ నెల 29న(శుక్రవారం) పలు ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించింది. కలగ్గూర్ నుంచి పటాన్చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్ పైప్లైన్కు వివిధ ప్రాంతాల్లో లీకేజీల నివారణకు మరమ్మతులు చేపడుతున్నామని.. కంది గ్రామం వద్ద పైప్లైన్ జంక్షన్ పనులు చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు నీటిసరఫరా నిలిచిపోనుంది. చదవండి: ఆంత్రాక్స్ వ్యాధి కలకలం: మటన్ కొంటున్నారా..? జర జాగ్రత్త! అంతరాయం ఏర్పడే ప్రాంతాలివీ డివిజన్ నం.9: హైదర్నగర్, రాంనరేష్నగర్, కేపీహెచ్బీ, భాగ్యనగర్, వసంత్ నగర్, ఎస్పీనగర్ తదితర ప్రాంతాలు. డివిజన్ నం.15: మియాపూర్, దీప్తి శ్రీనగర్, మాతృశ్రీనగర్, లక్ష్మీనగర్, జేపీ నగర్, చందానగర్ తదితర ప్రాంతాలు. డివిజన్ నం. 23: నిజాంపేట్, బాచుపల్లి, మల్లంపేట, ప్రగతినగర్. డివిజన్ నం. 32: బొల్లారం తదితర ప్రాంతాలున్నాయి. చదవండి: లీటర్ పెట్రోల్ రూ.112... భారీగా చార్జీలు పెంచేసిన జొమాటో, స్విగ్గీ, క్యాబ్స్! -
హైదరాబాద్కు ఒక్కరోజే ... 5,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరంగా మారుతున్న గ్రేటర్ హైదరాబాద్లో మురుగునీటి శుద్ధి, మంచినీటి సరఫరా కోసం ఒక్కరోజులోనే రూ.5 వేల కోట్లు మంజూరు చేశామని.. ఇలా నిధులివ్వడం దేశచరిత్రలో ఇదే మొదటిసారి అని ఐటీ, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మురుగునీటి శుద్ధి ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని.. శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నిధులిచ్చారని తెలిపారు. గురువారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంచినీటి సమస్యకు 95శాతం పరిష్కారం చూపాం. మిషన్ భగీరథ ప్రాజెక్టుతో రాష్ట్రమంతటా మంచినీటి సరఫరా చేస్తున్న ప్రభుత్వం మాది. జీహెచ్ఎంసీ పరిధిలో సగటు రోజుకు 1,650 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం 772 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధిచేసే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నా యి. అందుకే జీహెచ్ఎంసీలో 100% మురుగునీటి శుద్ధి చేయాలనే అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. భవిష్యత్తులో నాలాలు, చెరువులను బాగు చేయాలంటే మొదట మురుగునీటి శుద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాం. సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడున్న అవసరంతోపాటు రాబోయే పదేళ్ల అవసరాలకు ఎస్టీపీలు నిర్మించాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రణాళికలు తయారు చేశాం. ప్రస్తుతమున్న 772 ఎంఎల్డీల శుద్ధి సామర్థ్యానికి అదనంగా మరో 1,260 ఎంఎల్డీల శుద్ధి సామర్థ్యమున్న ఎస్టీపీలను నిర్మించడానికి ప్రభుత్వం రూ.3,866.20 కోట్లను గురువారం మంజూరు చేసింది..’’అని కేటీఆర్ తెలిపారు. నగరంలోని 31 ప్రాంతాల్లో ఎస్టీపీలను నిర్మిస్తామని.. అవి పూర్తయితే సిటీ పరిధిలోని, శివారు ప్రాంతాల్లోని చెరువులు, నాలాలు బాగుపడతాయని చెప్పారు. నాలాలను పునరుద్ధరిస్తాం.. ఎస్ఆర్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు) తరహాలో ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి ప్రాజెక్టు)ని ప్రభుత్వం చేపడుతోందని కేటీఆర్ తెలిపారు. ‘‘భారీ వర్షాలు, వరదలతో ఒక్క కుటుంబం కూడా ఇబ్బందిపడొద్దనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును తలపెట్టాం. నాలాల పరిధిలో ఉన్న ఇళ్లు, ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఇప్పటికే సర్వే నిర్వహించి నివేదిక తయారు చేశాం. ఇళ్లు కూడా నిర్మించి సిద్ధం చేశాం. ఒక్కో ఇంటిని రూ.9 లక్షలతో చేపట్టాం. బహిరంగ మార్కెట్లో వాటి ధర రూ.40–50 లక్షల వరకు ఉంటుంది..’’అని కేటీఆర్ వివరించారు. ప్రభుత్వ అనుమతితోపాటు ప్రజల సహకారం ఉంటేనే ఈ కార్యక్రమం సజావుగా సాగుతుందని పేర్కొన్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు రిజర్వాయర్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1,200 కోట్లు విడుదల చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్ శివార్లలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 137 మిలియన్ లీటర్ల సామర్థ్యమున్న రిజర్వాయర్లను నిర్మించనున్నాం. దాదాపు 2,100 కిలోమీటర్ల పొడవైన పైపులైన్లు ఏర్పాటు చేసి.. కొత్తగా 2లక్షల మంచినీటి కనెక్షన్లు ఇస్తాం. అదనంగా దాదాపు 20 లక్షల జనాభాకు శుద్ధమైన తాగునీరు అందుతుంది. రానున్న రెండేళ్లలోనే ఎస్టీపీలు, రిజర్వాయర్ల నిర్మణ పనులు పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం..’’అని కేటీఆర్ వెల్లడించారు. దేశంలో వందశాతం మురుగు నీటిని శుద్ధి చేసే నగరం కేవలం జీహెచ్ఎంసీ మాత్రమే అవుతుందని.. విశ్వనగర కల సాకారం దిశగా ఇదో గొప్ప పరిణామమని పేర్కొన్నారు. మంచినీటి సరఫరా పనులను పూర్తిగా ప్రభుత్వ పరిధిలో ఏర్పాటు చేస్తామని.. ఎస్టీపీల నిర్వహణను హైబ్రిడ్ యాన్యూటీ విధానంలో చేపడతామని వివరించారు. -
పంజాబ్ కొత్త సీఎం హామీలు: ఉచితంగా నీరు.. విద్యుత్ చార్జీలు తగ్గింపు
చండీగఢ్: పంజాబ్లో పేద కుటుంబాలకు ఉచితంగా నీరు సరఫరా చేస్తామని, విద్యుత్ బిల్లుల భారం తగ్గిస్తామని నూతన ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రకటించారు. పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. తనను తాను ఆమ్ ఆద్మీ(సామాన్యుడు)గా అభివర్ణించుకున్నారు. తాను గతంలో రిక్షా లాగానని, తన తండ్రి టెంట్ హౌస్ నడిపించారని గుర్తుచేశారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చన్నీ సోమవారం పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చండీగఢ్లోని రాజ్భవన్లో గవర్నర్ భన్వరీలాల్ ఆయనతో ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డుకెక్కారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన సుఖ్జిందర్ సింగ్ రంధావా, ఓ.పి.సోని ప్రమాణ స్వీకారం చేశారు. వారిద్దరినీ ఉప ముఖ్యమంత్రులుగా నియమించనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం చరణ్జిత్ సింగ్ చన్నీ మీడియాతో మాట్లాడారు. 200 లోపు చదరపు గజాల్లోపు ఉన్న ఇళ్ల నుంచి నీటి చార్జీలు వసూలు చేయబోమని అన్నారు. విద్యుత్ టారిఫ్ సైతం తగ్గిస్తామని చెప్పారు. ఇప్పటిదాకా సీఎంగా అమరీందర్ చక్కగా పనిచేశారని చన్నీ కితాబిచ్చారు. పంజాబ్ ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం చన్నీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని మోదీ ట్వీట్ చేశారు. చన్నీ, సిద్ధూ సారథ్యంలో ఎన్నికల్లో పోటీ సిద్ధూ ఆధ్వర్యంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ పంజాబ్ పార్టీ ఇన్చార్జి హరీష్ రావత్ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. ఓట్ల కోసమే దళితుడైన చన్నీని సీఎం చేశారని విమర్శలొచ్చాయి. దీంతో పంజాబ్లో రాబోయే ఎన్నికల్లో చన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూల సారథ్యంలో తమ పార్టీ పోటీకి దిగుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తాజా ప్రకటన చేశారు. చదవండి: తొలి మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురైన సీఎం -
పరిశ్రమలకు పుష్కలంగా నీటి వసతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు శాశ్వత నీటి వసతి కల్పన దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్లో భాగంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అభివృద్ధి చేస్తున్న వివిధ పారిశ్రామిక పార్కులకు పుష్కలంగా నీటిని అందించేలా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ప్రణాళికలు సిద్ధం చేసింది. కృష్ణపట్నం వద్ద నెలకొల్పే క్రిస్ సిటీతో పాటు నాయుడుపేట సెజ్, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి – ఏర్పేడు నోడ్, నెల్లూరు జిల్లా మాంబట్టు సెజ్, చిత్తూరు జిల్లా చిన్నపండూరు పారిశ్రామిక వాడ, శ్రీసిటీ సెజ్లకు పూర్తిస్థాయిలో నీటి సదుపాయం కలగనుంది. ప్రస్తుతం తొలి దశలో అభివృద్ధి చేస్తున్న పార్కుల అవసరాలకు తగినట్లుగా రోజూ 111.93 మిలియన్ లీటర్ల నీటిని అందించేలా ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసింది. కండలేరు రిజర్వాయర్ నుంచి కృష్ణపట్నం, శ్రీసిటీ వరకు సుమారు 205 కి.మీ పైప్లైన్ ద్వారా నీటిని తరలించనున్నారు. ఆయా పారిశ్రామిక పార్కుల వద్ద ఆరు భూగర్భ రిజర్వాయర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సుమారు రూ.550 కోట్లు వ్యయం కానుంది. ప్రత్యామ్నాయ మార్గాలకు డీపీఆర్లు... కండలేరు నుంచి నీటి తరలింపు పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే 30 శాతానికిపైగా పనులు పూర్తైనట్లు ఏపీఐఐసీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. తొలుత ప్రతిపాదించిన మార్గంలో కొన్ని చోట్ల అనుమతులకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కోసం ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. సెప్టెంబర్ 7లోగా బిడ్లు దాఖలు చేయాలని సూచించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీసిటీలోని పరిశ్రమలతో పాటు చిన్నపండూరు వద్ద ఏర్పాటైన హీరో మోటార్స్, అపోలో టైర్స్ లాంటి సంస్థల నీటి అవసరాలు తీరనున్నాయి. -
వైఎస్సార్–జగనన్న కాలనీల్లో రూ.920 కోట్లతో నీటిసరఫరా
సాక్షి, అమరావతి: పేదల కోసం పెద్ద ఎత్తున నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించిన వైఎస్సార్–జగనన్న కాలనీల్లో తొలిదశలో 8,679 లే అవుట్లలో రూ.920 కోట్లతో నీటిసరఫరా పనులను ప్రభుత్వం చేపట్టింది. తొలిదశలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 8,905 లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిలో 8,679 లే అవుట్లలో (గ్రామీణ ప్రాంతాల్లో 8,207, పట్టణ ప్రాంతాల్లో 472) నీటిని సమకూర్చాల్సి ఉందని అధికారులు గుర్తించారు. ఇప్పటికే 8,268 లే అవుట్లలో 8,483 నీటిసరఫరా పనులను మంజూరు చేయగా 6,410 లే అవుట్లలో 7,420 పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో ఇప్పటికే 1,730 లే అవుట్లలో 1,730 నీటిసరఫరా పనులు పూర్తయ్యాయి. 4,680 లే అవుట్లలో 5,690 నీటి సరఫరా పనులు పురోగతిలో ఉన్నాయి. పేదలకు సంబంధించి తొలిదశ ఇళ్ల నిర్మాణాల్లో ప్రత్యేకంగా నీటిసరఫరా కోసం ఏకంగా రూ.920 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. గతంలో ఏ ప్రభుత్వాలు ఇళ్ల నిర్మాణాల ప్రారంభానికి ముందే నీటిసరఫరా వసతిని కల్పించిన దాఖలాల్లేవు. దీన్నిబట్టి చూస్తే పేదల ఇళ్ల నిర్మాణాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో స్పష్టం అవుతోందని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నెలాఖరుకు నీటిసరఫరా పనులు పూర్తి వచ్చే నెల 1వ తేదీ నుంచి ఎట్టి పరిస్థితుల్లోను వైఎస్సార్–జగనన్న కాలనీల్లో పేదల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందేనని సీఎం ఆదేశించారు. దీంతో ఈ నెలాఖరుకల్లా ఈ కాలనీల్లో నీటిసరఫరా పనులను పూర్తిచేస్తాం. లే అవుట్ల సైజు ఆధారంగా ఒక్కోచోట రెండేసి చొప్పున, పెద్ద లే అవుట్లలో అయితే 3 లేదా 4 బోర్లు వేస్తున్నాం. దీంతో పాటు మోటారు కనెక్షన్ ఇవ్వడమే కాకుండా లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాల దగ్గరకు నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇళ్ల నిర్మాణాల కోసమే ఈ బోర్లు వేస్తున్నాం. ఆ తరువాత ఇవే బోర్లు ఆయా కాలనీల్లో ప్రజలకు ఉపయోగపడతాయి. రూ.920 కోట్లతో చేపట్టిన నీటిసరఫరా పనుల్లో రూ.641 కోట్ల పనులను గ్రామీణ నీటిసరఫరా ఇంజనీరింగ్ విభాగం, రూ.279 కోట్ల పనులను ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం చేపట్టాయి. – అజయ్జైన్, గృహనిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ -
Godavari Delta: గోదావరి డెల్టాకు భరోసా
సాక్షి, అమరావతి: గోదావరి డెల్టాలో నీటి వృథాకు పూర్తిగా అడ్డుకట్ట వేసి.. ఆయకట్టు శివారు భూములకు నీళ్లందించడమే లక్ష్యంగా చేపట్టిన ఆధునికీకరణ పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. డెల్టాలో ఖరీఫ్కు జూన్.. రబీకి డిసెంబర్లో నీటిని విడుదల చేస్తారు. ఏడాది మొత్తంలో కేవలం రెండు నెలలు మాత్రమే డెల్టాలో పంటలు సాగు చేయరు. ఆ రెండు నెలల్లోనే కాలువల ఆధునికీకరణ చేపట్టడానికి అవకాశం ఉంటుంది. రబీ పంట కాలం పూర్తయి, ఖరీఫ్ పంట సాగు ప్రారంభించే లోగా కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టి పూర్తి చేయాలని జల వనరుల శాఖ అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. గత ఏడాదిలో రెండు నెలలు, ప్రస్తుత రబీ పంట పూర్తయినప్పటి నుంచి డెల్టా ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం రూ.148.04 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది డెల్టా ఆధునికీకరణ పనులను భారీ ఎత్తున చేపట్టింది. సర్ ఆర్థర్ కాటన్ హయాంలో నిర్మించిన పురాతనమైన కాలువలు అస్తవ్యస్థంగా మారడంతో డెల్టా ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందని దుస్థితి నెలకొంది. దీంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో గోదావరి డెల్టా ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. కాలువలు, రెగ్యులేటర్లు ఆధునికీకరణకు రూ.802.59 కోట్లు వ్యయం చేశారు. ఆయన మరణం తర్వాత డెల్టా ఆధునికీకరణ పనులను టీడీపీ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. బ్యారేజీని పటిష్టం చేసేలా.. గోదావరి డెల్టాకు నీటిని సరఫరా చేసే ధవళేశ్వరం బ్యారేజీని మరింత పటిష్టం చేసే పనులపైనా దృష్టి పెట్టిన అధికారులు.. మరోవైపు బ్యారేజీలో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీరు నిల్వ చేసే పనులను చేపడుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.931 టీఎంసీలు. గోదావరికి వచ్చే భారీ వరద ప్రవాహంతో పెద్దఎత్తున ఇసుక కొట్టుకొచ్చి ధవళేశ్వరం బ్యారేజీలో మేటలు వేస్తోంది. ఇటీవల జల వనరుల శాఖ అధికారులు నిర్వహించిన బ్యాథమెట్రిక్ సర్వేలో సుమారు 80 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మేటలు వేసినట్టు గుర్తించారు. దీనిని డ్రెడ్జింగ్ ద్వారా తొలగించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. బ్యారేజీలో ఇసుక పూడికను తొలగించి.. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం ద్వారా 10.13 లక్షల ఎకరాల గోదావరి డెల్టా ఆయకట్టుకు మరింత సమర్థవంతంగా నీళ్లందించాలని నిర్ణయించారు. డిజైన్ మేరకు నీరు ప్రవహించేలా.. అత్యంత ఆధునాతన ఏడీసీపీ (అకాస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్) పరికరం ద్వారా ప్రస్తుతం కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని అధికారులు కొలుస్తున్నారు. డిజైన్ మేరకు ప్రవాహ సామర్థ్యం తగ్గితే, దాన్ని పెంచేలా ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. డెల్టాలోని 713.20 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కాలువలను ఇదే రీతిలో ఆధునికీకరిస్తున్నారు. డి్రస్టిబ్యూటరీలను అభివృద్ధి చేస్తున్నారు. తద్వారా నీటి వృథాకు పూర్తిగా అడ్డుకట్ట వేసి.. ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించడానికి చర్యలు చేపట్టారు. -
ఎకరం కూడా ఎండకుండా.. రైతన్న సంబరపడేలా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న, మధ్య, భారీతరహా ప్రాజెక్టుల కింద రబీలో 35.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రభుత్వం నీటిని సరఫరా చేస్తోంది. గతేడాది రబీలో 24 లక్షల ఎకరాలకు నీళ్లందించి రికార్డు సృష్టించిన సర్కార్.. ప్రస్తుత రబీలో అదనంగా 11.21 లక్షల ఎకరాలకు నీళ్లందించడం ద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పింది. యాజమాన్య పద్ధతుల ద్వారా ‘ఆన్ అండ్ ఆఫ్’ విధానంలో చివరి భూములకూ సమృద్ధిగా నీరందేలా జలవనరుల శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో రికార్డు స్థాయిలో పంట దిగుబడులు వస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి, కృష్ణా డెల్టాలు, సాగర్ కుడి కాలువ, గుండ్లకమ్మ తదితర ప్రాజెక్టుల కింద వరి ఎకరానికి సగటున 40 నుంచి 45 బస్తాల దిగుబడి వస్తుండటంతో వారిలో సంతోషం వెల్లివిరుస్తోంది. చిన్న, మధ్య, భారీతరహా ప్రాజెక్టులు, ఏపీఎస్ఐడీసీ (ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ) నేతృత్వంలోని ఎత్తిపోతల పథకాల కింద 1.05 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రభుత్వం అభివృద్ధి చేసింది. నైరుతి, ఈశాన్య రుతుపవనాలతో భారీ వర్షాలు పడడంతో గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా, ఏలేరు, వాగులు, వంకలు ఉప్పొంగాయి. వరద నీటిని ఒడిసి పట్టిన సర్కార్.. గతంలో ఎన్నడూ నిండని ప్రాజెక్టులను సైతం నింపింది. దీంతో ఖరీఫ్లో రికార్డు స్థాయిలో 78 లక్షల ఎకరాలకు నీళ్లందాయి. రికార్డు స్థాయిలో రబీలో నీటి సరఫరా.. రాష్ట్ర విభజన తర్వాత.. 2014 నుంచి 2019 వరకు గరిష్టంగా 2018లో మాత్రమే రబీలో 11.23 లక్షల ఎకరాలకు నీళ్లందించారు. అయితే గోదావరి డెల్టాలో పంటలను రక్షించడంలో నాటి సర్కార్ పూర్తిగా విఫలమైంది. గతేడాది రబీలో 24 లక్షల ఎకరాలకు నీళ్లందించిన జలవనరుల శాఖ.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో 35.21 లక్షల ఎకరాలకు నీటిని అందించింది. ప్రకాశం జిల్లా మల్లవరంలో గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కింద రబీలో సాగుచేసిన వరిపంట కోత పనులు కృష్ణా డెల్టా చరిత్రలో తొలిసారిగా.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్లో 13.08 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేస్తారు. కానీ.. 2019 వరకు రబీలో ఈ డెల్టాకు నీటిని సరఫరా చేసిన దాఖలాలు లేవు. గతేడాది 1.50 లక్షల ఎకరాలకు రబీలో నీటిని విడుదల చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది ఏకంగా 4.26 లక్షల ఎకరాలకు నీటిని అందించి చరిత్ర సృష్టించింది. దుర్భిక్ష సీమ కళకళ.. దుర్భిక్ష రాయలసీమలో రబీలో ఆయకట్టులో రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేశారు. తుంగభద్ర హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ) కింద అనంతపురం జిల్లాలో తొలిసారిగా గరిష్టంగా 1.10 లక్షల ఎకరాలకు అధికారులు నీటిని సరఫరా చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో తెలుగుగంగ, హెచ్చెల్సీ, పులివెందుల బ్రాంచ్ కెనాల్ కింద 2.01 లక్షల ఎకరాల్లో, కేసీ కెనాల్, తుంగభద్ర ఎల్లెల్సీ (దిగువ కాలువ) కింద 2.44 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. రికార్డు స్థాయిలో నీటి సరఫరా.. గోదావరి డెల్టాతో పోటీపడుతూ నెల్లూరు జిల్లాలో పెన్నా డెల్టా, తెలుగుగంగ, సోమశిల ప్రాజెక్టులు, కాన్పూర్ కెనాల్ కింద రైతులు 7.28 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. పెన్నా వరదను ఒడిసి పట్టి సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నింపడం వల్లే నీటిని సరఫరా చేయడం సాధ్యమైందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్టు కింద 40 వేల ఎకరాలకు, శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు కింద వరుసగా రెండో ఏడాది రబీలో పంటల సాగుకు నీటిని విడుదల చేశారు. గోదావరిలో సహజసిద్ధ ప్రవాహం తగ్గినా.. గోదావరి డెల్టాలో రబీలో 8,96,538 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. రబీ పంట పూర్తి కావాలంటే 94.50 టీఎంసీలను సరఫరా చేయాలని అధికారులు లెక్కలు కట్టారు. డిసెంబర్లో గోదావరిలో 26.502 టీఎంసీలుగా నమోదైన సహజసిద్ధ ప్రవాహం జనవరిలో 11.560, ఫిబ్రవరిలో 3.387, మార్చిలో 1.957 టీఎంసీలకు తగ్గింది. దీంతో సీలేరు నుంచి డిసెంబర్లో 10.260, జనవరిలో 12.668, ఫిబ్రవరిలో 13.871, మార్చిలో 18.882 టీఎంసీలను విడుదల చేసి గోదావరి డెల్టాకు సరఫరా చేశారు. మంగళవారం వరకు డెల్టాకు 92.87 టీఎంసీలను సరఫరా చేశారు. మరో పది రోజుల్లో పంట కోతలను ప్రారంభిస్తారు. సమృద్ధిగా నీటిని అందించడంతో వరి పంట రికార్డు స్థాయిలో దిగుబడులు ఇస్తోంది. చివరి భూములకూ నీళ్లందించాం.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు.. కృష్ణా, గోదావరి, వంశధార, పెన్నా, ఏలేరు, నాగావళి వరద నీటిని ఒడిసి పట్టి ప్రాజెక్టులను నింపాం. ఖరీఫ్లో రికార్డు స్థాయిలో ఆయకట్టుకు నీటిని విడుదల చేశాం. రబీలోనూ గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆయకట్టుకు నీటిని విడుదల చేశాం. ఆన్ అండ్ ఆఫ్ విధానంలో.. యాజమాన్య పద్ధతులను అమలు చేయడం ద్వారా చివరి భూములకు నీళ్లందేలా చేశాం. ఒక్క ఎకరంలో కూడా పంట ఎండకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ -
కొత్త కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు నీటి వసతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు నీటి వసతిని కల్పించే పనులు వేగవంతం అయ్యాయి. అదే వేగంతో నిర్మాణ పనులూ కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంత గూడు సమకూరనుంది. రాష్ట్రంలో మొదటి విడత 15.60 లక్షల ఇళ్లు నిరి్మంచాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇళ్లు మంజూరైన లబ్దిదారుల వివరాలతో ఈ నెల 31లోగా జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి నియోజకవర్గంలో సమీక్ష సమావేశాలు నిర్వహించి.. ఆ మేరకు పూర్తి సమాచారంతో ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్లకు సూచించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచే సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి పనులను పరిశీలించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా అత్యవసరంగా 8,316 చోట్ల నీటి సరఫరా చేయాల్సిన అవసరం ఉందని గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో కొత్తగా బోర్లు వేయించడంతోపాటు పైప్లైన్ పనులు చేస్తున్నారు. నీటి సరఫరా అవసరమని గుర్తించిన లేఅవుట్లు ఇవే.. తూర్పుగోదావరిలో 753, ప్రకాశంలో 432, కర్నూలులో 501, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో 249, వైఎస్సార్లో 405, చిత్తూరులో 942, శ్రీకాకుళంలో 745, విశాఖపట్నంలో 466, విజయనగరంలో 876, పశ్చిమ గోదావరిలో 890, గుంటూరులో 546, కృష్ణాలో 1,092, అనంతపురం జిల్లాలో 419 లేఅవుట్లలో బోర్లు తవ్వి పైప్లైన్లు వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే చాలాచోట్ల బోర్లు వేస్తున్నారు. ఇప్పటివరకు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 534 లేఅవుట్లలో నీటి వసతి ఏర్పాటు చేశారు. ఈ పనులను గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ నీటి పనుల విభాగం, పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య విభాగం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాగా, ఇంటి నిర్మాణంలో ఎక్కడా నాసిరకానికి ఆస్కారం లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించడంతో ఆ మేరకు గృహనిర్మాణ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలోగా కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. లబి్ధదారుల అవగాహన కోసం ప్రతి కాలనీలో మోడల్ హౌస్ను నిర్మిస్తున్నారు. -
పరిశ్రమలకు పుష్కలంగా నీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు తగినంత నీరు అందించేలా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఏర్పాటు అయ్యే పరిశ్రమలు ఒప్పందం కుదుర్చుకునే సమయానికే అన్ని రకాల మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏపీఐఐసి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కులను ప్లగ్ అండ్ ప్లే విధానంలో అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు వివిధ రిజర్వాయర్ల నుంచి నీటిని అందించే విధంగా ఏర్పాట్లు చేసింది. ఈ ప్రాజెక్టులకు నీటి సరఫరా కోసం సుమారు రూ.2,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఇందుకోసం ఏపీ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై పేరుతో ప్రత్యేకంగా ఒక కంపెనీ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం విశాఖ నగర వాసులతో పాటు అక్కడి పరిశ్రమలకు నీటిని అందించడానికి జీవీఎంసీతో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కంపెనీ (విస్కో) సేవలను రాష్ట్రమంతటా విస్తరించే యోచనలో ఉన్నట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ రవీన్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కొన్ని ప్రాజెక్టులకు ఈ నెలాఖరులోగా, మరికొన్నింటికి 2022లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. రోజుకు 288 మిలియన్ లీటర్ల నీరు రాష్ట్రంలో చేపడుతున్న వివిధ పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటయ్యే కంపెనీలకు రోజుకు 288 మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుందని ఏపీఐఐసీ ప్రాథమికంగా అంచనా వేసింది. ఏ పారిశ్రామిక పార్కుకు ఏ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించాలి.. అందుకు అయ్యే వ్యయం ఎంత.. అన్నది లెక్క తెల్చారు. కొప్పర్తి పారిశ్రామిక పార్కుకు సోమశిల నుంచి, ఓర్వకల్లుకు శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా.. కృష్ణపట్నం, నాయుడుపేట, చిత్తూరు జిల్లాలోని పార్కులకు కండలేరు నుంచి.. విశాఖకు గోదావరి జలాలను.. అనంతపురానికి హంద్రీ–నీవా నుంచి పైప్లైన్ల ద్వారా నీటిని తరలించనున్నారు. అదే విధంగా పారిశ్రామిక అవసరాలకు సముద్రపు నీటిని వినియోగంచుకునే విధంగా కృష్ణపట్నం వద్ద పైలెట్ ప్రాజెక్టు చేపట్టడానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 10 మంది సభ్యులతో నిపుణుల కమిటీని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చౌకగా నీటిని అందిస్తాం రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు ఇతర రాష్ట్రాలకంటే తక్కువ రేటుకే నీటిని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కంపెనీని ఏర్పాటు చేసి, దాని ద్వారానే రాష్ట్రంలోని అన్ని కంపెనీలకు నీటిని అందించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. అవాంతరాలు లేకుండా నీటిని పుష్కలంగా అందిస్తే కిలో లీటరుకు ఎంత ధరైనా చెల్లించడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల కంటే చౌకగా నీటిని అందించే విధంగా ఏపీఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది. – కే.రవీన్ కుమార్ రెడ్డి, వీసీ, ఎండీ, ఏపీఐఐసీ -
వేసవిలో తాగునీటి 'కష్టాలకు చెక్'
సాక్షి, అమరావతి: ఈ వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు రూ.109.81 కోట్లు అవసరమవుతాయని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అంచనా వేసింది. రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు సమృద్ధిగా ఉండటం, భూగర్భ జలమట్టాలు అందుబాటులో ఉండటంతో గతంతో పోలిస్తే ఈ ఏడాది గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తక్కువగానే ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ.. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పలుచోట్ల నీటిఎద్దడి తలెత్తే అవకాశం ఉందన్న అంచనాతో ముందస్తు చర్యలకు సిద్ధంగా ఉన్నారు. ఆర్డబ్ల్యూఎస్ విభాగం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 48 వేల గ్రామీణ నివాసిత ప్రాంతాలు ఉండగా.. మండు వేసవిలో 4,926 నివాసిత ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఆ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు రూ.89 కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. గోదావరి జిల్లాల్లోనూ.. వేసవిలో చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో నీటి ఎద్దడికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ 4 జిల్లాలతోపాటు అనుకోని పరిస్థితులు తలెత్తితే పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ పలు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి వస్తుందన్న భావనతో ముందస్తు ప్రణాళికలు రూపొందించారు. నీటిఎద్దడి ఉండే ప్రాంతాల్లో సరఫరా చేసే నిమిత్తం వివిధ జిల్లాల్లో రైతులకు చెందిన 418 వ్యవసాయ బావులను అద్దెకు తీసుకోవడానికి అంచనాలు రూపొందించారు. ట్యాంకుల ద్వారా నీటి సరఫరాలో అవకతవకలు జరగకుండా ట్యాంకర్ల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారైన యాప్ను ఉపయోగిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని మంచినీటి వనరులను సందర్శించి వాటికి అవసరమైన చిన్నపాటి మరమ్మతులు ఉంటే తక్షణం పనులు పూర్తి చేయించాలని నిర్ణయించారు. నీటి ఎద్దడిని పరిష్కరించడంలో గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సేవలను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వినియోగించుకోనున్నారు. పశువులకూ నీరు మండు వేసవిలో ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 732 నివాసిత ప్రాంతాల్లో పశువులకు సైతం నీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పశువుల అవసరాలకు నీటిని సరఫరా చేసేలా రూ.7 కోట్లు ఖర్చు కాగలదని అంచనాలను సిద్ధం చేశారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు ఫుల్ వివిధ గ్రామాల్లో ఓవర్హెడ్ ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరాకు అవసరమైన నీటిని నిల్వ ఉంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,501 సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు ఉన్నాయి. ఈ ట్యాంకులన్నిటినీ పూర్తిస్థాయిలో నింపారు. మరమ్మతుల కారణంగా కేవలం 10 ట్యాంకులలో మాత్రం నీటిని నిల్వ ఉంచలేని పరిస్థితి ఉంది. అత్యవసరమైతే సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను వివిధ మార్గాల ద్వారా నింపేందుకు సన్నద్ధతతో ఉన్నట్టు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. -
ఇదో మంచి 'బ్యాక్టీరియా'..
సాక్షి, విశాఖపట్నం: నగరంలో నిత్యం వస్తున్న మురుగునీటిని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) శుద్ధిచేసి పరిశ్రమలకు కొంత, మిగిలినది సముద్రంలోకి విడిచిపెడుతుంది. ఈ క్రమంలో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)లు.. వాటి పరిసరాలు చాలా దుర్వాసన వెదజల్లేవి. పాదచారులు, వాహనచోదకులు ఆ మార్గంలో వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. ఈ తరుణంలో జీవీఎంసీ అధునాతన బయో సాంకేతికతను అందిపుచ్చుకుంది. అదే బయోరెమిడేషన్. అంటే.. మంచి బ్యాక్టీరియాలతో మురుగునీటిని శుభ్రంచేయడం. ఇందుకోసం పయోనీర్ ఎన్విరాన్ కేర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని మూడు పద్ధతుల్లో.. ఈ మురుగునీటిని శుభ్రం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే.. మానవాళికి మంచి చేసే బ్యాక్టీరియాలుంటాయి. ఇందులో ఫొటోట్రోఫిక్, లాక్టోబాసిలస్, రోడో సుడోమాస్ అనే బ్యాక్టీరియాలను పయోనీర్ సంస్థ తమ ల్యాబ్లో ఉత్పత్తి చేస్తుంది. వీటిని అప్పుఘర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు తీసుకొచ్చి మంచినీటిలో పెంచుతారు. ఇవి పెరిగేందుకు మొలాసిస్ను ఆహారంగా వేస్తారు. 5–7 రోజుల్లో ఇవి పెరుగుతాయి. వీటికి కావల్సిన ఉష్ణోగ్రతను కూడా దశల వారీగా అందిస్తారు. మొదటి నాలుగు రోజులు 1–5 డిగ్రీలు, తర్వాత 5–15 డిగ్రీల ఉష్ణోగ్రతలో పెంచుతారు. ఇలా వారం రోజుల్లో 0–50 డిగ్రీల ఉష్ణోగ్రతని తట్టుకునేలా వీటిని తయారుచేస్తారు. ఫొటోట్రోఫిక్ బ్యాక్టీరియా చెత్తనీటిలో ఆక్సిజన్ లెవల్స్ను పెంచుతుంది. లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా సీవేజ్ వాటర్లో 80 శాతం ఆర్గానిక్ వ్యర్థాలను తినేస్తుంది. రోడో సుడోమాస్ కొన్ని ఎంజైమ్లు విడుదల చేసి.. మిగిలిన రెండు బ్యాక్టీరియాలకు అవసరమైన శక్తిని అందించి.. శుద్ధిచేసే పనిని వేగవంతం చేస్తుంది. వీటిని పెద్దపెద్ద డ్రమ్ముల్లో పెంచుతారు. 1 లీటర్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసేందుకు రూ.200 నుంచి రూ.300 వరకు ఖర్చవుతుంది. ఎరేషన్ ట్యాంకులో శుభ్రమవుతుందిలా.. వెయ్యి లీటర్ల మురుగుకు లీటర్ బ్యాక్టీరియా ఇలా పెరిగిన బ్యాక్టీరియాని ఎస్టీపీలోకి విడిచి పెడతారు. వెయ్యి లీటర్ల మురుగు నీటికి బ్యాక్టీరియా ఉన్న లీటర్ నీటిని కలుపుతారు. వివిధ మురుగు కాలువలు, మరుగుదొడ్ల నుంచి వచ్చిన నీరు స్టోర్ అయిన ఇన్లెట్లోకి బ్యాక్టీరియాని పంపిస్తారు. అక్కడి నుంచి ఎరేషన్ ట్యాంకులోకి వెళ్తుంది. ఈ ట్యాంకులో ఆక్సిజన్ శాతం సరైన మోతాదులో ఉంటే.. ఈ బ్యాక్టీరియాలు తమ పనిని వేగవంతం చేస్తాయి. చెత్తను, మురుగుని తినేయడం ప్రారంభిస్తాయి. మొత్తంగా నీటిని 4 గంటల వ్యవధిలోనే శుభ్రం చేసేస్తాయి. ఇలా శుభ్రం చేసిన నీటిని అవుట్లెట్లోకి పంపిస్తారు. అక్కడ మరోసారి శుభ్రంచేసి అక్కడి నుంచి సముద్రంలోకి విడిచిపెట్టడం, పరిశ్రమలకు అందించడం చేస్తారు. ఇన్లెట్లోకి బ్యాక్టీరియాని ఇలా విడిచిపెడతారు.. పర్యావరణహితంగా అమలుచేస్తున్నాం.. మురుగునీటిని శుద్ధిచేశాకే బయటకి విడిచిపెట్టాలన్నది నిబంధన. ఈ మేరకు ఎస్టీపీల్లో శుద్ధిచేస్తున్నాం. అయితే, మరింత అత్యాధునిక పద్ధతుల్లో మురుగునీటిని పునర్వినియోగం చేసేందుకు జీవీఎంసీ కమిషనర్ సంకల్పించారు. ఆమె సూచనల మేరకు రెండు ఎస్టీపీల్లో బయో రెమిడేషన్ అమలుచేశాం. సత్ఫలితాలిస్తోంది. వారం రోజుల్లోనే దుర్వాసన దాదాపు తగ్గిపోయింది. ఇక నగరంలోని అన్ని ఎస్టీపీల్లో దీనిని అమలుచేసేందుకు ప్రయత్నిస్తాం. – వేణుగోపాలరావు, జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఎస్ఈ ప్రాణవాయువు విడుదల చేసి స్వచ్ఛంగా మారుస్తాయి రసాయనాలతో పనిలేకుండా బయో టెక్నాలజీతో మురుగునీటి వనరుల్ని శుభ్రంచేస్తున్నాం. మానవాళికి మంచిచేసే బ్యాక్టీరియాలు నీటిలోని కాలుష్య కారకాల్ని ఆహారంగా తీసుకుని ప్రాణవాయువుని విడిచిపెట్టి.. వాటిని స్వచ్ఛంగా మారుస్తాయి. కేవలం నాలుగైదు గంటల్లోనే మురుగునీరు మంచి నీరుగా మారిపోతుంది. ఫార్మా కాలుష్యాలను కూడా దీని ద్వారా శుద్ధిచేయగలం. – దండు వెంకటవర్మ, పయోనీర్ ఎన్విరాన్ కేర్ సీఈఓ -
వెయ్యి లీటర్ల నీరు రూ. 1.21 పైసలే
సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం అత్యంత కారుచౌకగా పరిశ్రమలకు నీరు అందిస్తోంది. దేశంలోనే అత్యంత చౌకగా పరిశ్రమలకు కిలోలీటరు (వెయ్యి లీటర్లు) నీటిని రూ.1.21 పైసలకే ఇస్తోంది. పొరుగు రాష్ట్రం తమిళనాడులో అత్యధికంగా కిలోలీటరుకు రూ.80 వసూలు చేస్తున్నారు. రాజస్థాన్ రూ.52, కేరళ రూ.40 చొప్పున వసూలు చేస్తున్నాయి. పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన మహారాష్ట్ర కిలోలీటరుకు రూ.20, గుజరాత్ రూ.19.5 తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు అవసరమైన నీటితో పాటు పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో పరిశ్రమలకు నీటి వనరులను ఏర్పాటుచేసే దిశగా జల వనరుల శాఖతో కలిసి పరిశ్రమల శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 169 పరిశ్రమలు ఏటా 50 టీఎంసీల నీటిని వినియోగించుకుంటున్నాయి. ప్రస్తుత ధర ప్రకారం పరిశ్రమల నుంచి జల వనరుల శాఖకు ఏటా రూ.171 కోట్ల ఆదాయం వస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు 24 గంటలు నీటిసరఫరా ఉండే విధంగా మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో నామమాత్రపు ధరకు ఇస్తున్న నీటి చార్జీలను సవరించే దిశగా కసరత్తు చేస్తోంది. -
హైదరాబాద్కు నీటి సరఫరా అంశాన్ని తేల్చండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు తాగు, గృహ అవసరాలకు సరఫరా చేస్తున్న నీటిని లెక్కించడంలో ఎలాంటి విధానాన్ని పాటించాలో సూచించాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ ఆర్కే జైన్కు కృష్ణా బోర్డు చైర్మన్ ఎ.పరమేశం సోమవారం లేఖ రాశారు. తాగు, గృహ, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే నీటిలో 20 శాతాన్ని లెక్కలోకి తీసుకోవాలని కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1లో క్లాజ్–7లో పేర్కొన్నారని.. ఆ మేరకు హైదరాబాద్కు తాగు నీటి కోసం సరఫరా చేస్తున్న నీటిలో 20 శాతాన్నే పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డును కోరుతూ వస్తోంది. హైదరాబాద్కు సరఫరా చేస్తున్న నీటిలో తాగు నీటి అవసరాలకుపోనూ.. మిగతా నీరు మురుగునీటి కాలువల ద్వారా మూసీలో కలుస్తున్నాయని.. ఈ నేపథ్యంలో ఆ నీటిని కూడా లెక్కలోకి తీసుకోవాల్సిందేనని ఏపీ స్పష్టంచేస్తూ వస్తోంది. ఈ నెల 4న జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలోనూ ఈ అంశంపై చర్చ జరిగింది. ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో.. హైదరాబాద్కు సరఫరా చేసే నీటిని లెక్కలోకి తీసుకునే అంశంపై సీడబ్ల్యూసీతో అధ్యయనం చేయించి.. నిర్ణయం తీసుకుంటామని బోర్డు చైర్మన్ పరమేశం ప్రతిపాదించారు.ఇరు రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు అంగీకరించాయి. -
ఆ వార్తలు అవాస్తవం: భూటాన్
గువాహాటి: అస్సాంకు, భూటాన్ నుంచి వచ్చే నీటి సరఫరా సహజంగానే ఆగిపోయిందని, ఇరు దేశాల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తలేదని భారత ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అస్సాంకు వచ్చే నీటిని భూటాన్ నిలిపివేయడంతో పాకిస్తాన్, చైనా, నేపాల్ మాదిరిగా ఇప్పుడు భూటాన్ కూడా సరిహద్దుల్లో భారత్ను ఇబ్బందులకు గురిచేస్తుందంటూ గురువారం మీడియాల్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలను భూటాన్ ఖండిస్తూ ‘నీటి పారుదల సహజంగానే ఆగిపోయింది. అంతే కానీ మేము నీటిని నిలిపివేయలేదు. అస్సాంకు సరఫరా అయ్యే నీటిలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని మరమ్మత్తులు కూడా చేయిస్తున్నాం’ అని విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం వెల్లడిస్తూ.. భూటాన్, అస్సాం నీటి సరిహద్దు వివాదామంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ప్రకటించింది. (ఈ 10 దేశాలు, నగరాలు తప్పక చూడాల్సిందే!) #WATCH: Assam Chief Secy Kumar Sanjay Krishna says, "Irrigation water comes to Assam from hills of Bhutan, but there was boulder which stopped the flow. We talked to Bhutan & they immediately cleared it. There's no dispute & to say that they stopped the water to Assam is wrong." pic.twitter.com/aNPNxclgJO — ANI (@ANI) June 26, 2020 దీనిపై భూటాన్ అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ... ‘‘మేము అస్సాంలోని ప్రాంతాలకు నీటిపారుదల సరఫరాను నిలిపివేశామని ఆరోపించి ప్రచరించిన మీడియా నివేదికలు అవాస్తవం. ఇది నిజంగా బాధ కలిగించే విషయం. స్నేహపూర్వక ప్రజలు(భూటాన్-అస్సాం) మధ్య వివాదం సృష్టించేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారు. ఇది స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలు’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరుదేశాల వ్యవసాయం కోసం భూటాన్లో నిర్మించిన ఈ డాంగ్ ఛానెల్ నీటిని 1953 నుంచి అస్సాం, భూటాన్ రైతులు వ్యవసాయానికి ఉపయోగించుకుంటున్నారు. అస్సాం వరిసాగుకు ఈ నీరు ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీంతో భూటాన్ నీటి సరఫరాను నిలిపివేసినట్లు వార్తలు రావడంతో సరిహద్దుల్లో అస్సాం రైతులంతా ధర్నా చేసినట్లు గువాహటి ప్రజలు పేర్కొన్నారు. -
గ్రామాల్లో మంచినీటి ఎద్దడి నివారణకు రూ.277 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏడాది మంచినీటి ఇబ్బందుల నివారణకు ఇప్పటికే రూ.277.68 కోట్లు విడుదల చేసినట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తీవ్ర నీటి ఎద్దడి ఉండే గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు రెండు విడతల్లో రూ.177 కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు మరో రూ.100 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. రక్షిత మంచినీటి పథకాల నిర్వహణతో పాటు అవసరమైన చోట చిన్న మరమ్మతులు చేసుకోవడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిన కారణంగా ఈ ఏడాది వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాల్సిన గ్రామాల సంఖ్య తగ్గిందని మంత్రి వివరించారు. గత ఏడాది వేసవిలో 5,175 నివాసిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి వస్తే, ఈ ఏడాది వేసవిలో 3,314 నివాసిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. తీవ్ర నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లో పశువుల అవసరాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు చేపట్టినట్టు వివరించారు. -
పరిశ్రమలకు వేగంగా నీటి కేటాయింపులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీటి కేటాయింపులను పారదర్శకంగా, వేగంగా చేయడానికి జలవనరుల శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఈ నేతృత్వం వహించే ఈ విభాగానికి రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఒక్కో ఎస్ఈని నియమించనుంది. పరిశ్రమ ఏర్పాటు చేసే ప్రాంతంలో నీటి కేటాయింపు కోసం ఆ ప్రాంత ఎస్ఈకి పారిశ్రామికవేత్త దరఖాస్తు చేసుకోవాలి. ఆ ప్రాంతంలో నీటి లభ్యత, పరిశ్రమ అవసరాలపై అధ్యయనం చేసి ఎస్ఈ ఆ విభాగం సీఈకి నివేదిక ఇస్తారు. ఈ నివేదికపై సీఈ మరోసారి అధ్యయనం చేసి జలవనరుల శాఖ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. దీనిపై సర్కార్ తుది నిర్ణయం తీసుకుంటుంది. జాప్యం లేకుండా ఉండేందుకే.. ► పారదర్శక పాలన, అపార ఖనిజ సంపద, సుదీర్ఘ తీర ప్రాంతం, నైపుణ్యమున్న మానవవనరులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో పరిశ్రమల స్థాపనకు వివిధ రకాల అనుమతులను నిర్దేశించిన గడువులోగా ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. ► పరిశ్రమలకు అవసరమైన నీటి కేటాయింపుల కోసం ప్రస్తుతం ఆయా జిల్లాల సీఈలకు దరఖాస్తు చేసుకోవాలి. భారీ ఎత్తున చేపట్టిన ప్రాజెక్టుల పనుల పర్యవేక్షణ, ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం వంటి వాటి వల్ల సీఈలు, ఎస్ఈల పని భారం పెరిగింది. దాంతో పరిశ్రమలకు నీటి కేటాయింపుల కోసం చేసిన దరఖాస్తులపై గడువులోగా నివేదిక ఇవ్వలేకపోతున్నారు. ఇది పరిశ్రమల ఏర్పాటులో జాప్యానికి దారితీస్తోంది. ► ఈ నేపథ్యంలోనే పరిశ్రమలకు నీటి కేటాయింపుల కోసం జలవనరుల శాఖ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా అనుమతులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. -
లాక్డౌన్ నుంచి వీటికీ మినహాయింపు
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ నుంచి మరికొన్ని రంగాలకు మినహాయింపునిస్తూ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో ప్రకటించిన మినహాయింపులకు అదనంగా ఇవి ఉంటాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగానికి చెందిన నిర్మాణ పనులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల కార్యకలాపాలకు తాజాగా అనుమతినిచ్చింది. కలపేతర అటవీ ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు, ప్రాసెసింగ్.. తదితరాలకు కూడా అనుమతినిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని నిర్మాణ పనుల్లో.. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు, టెలికం ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఏర్పాటు.. మొదలైనవి ఉన్నాయి. హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు కొద్దిపాటి సిబ్బందితో పనులు చేసుకోవచ్చు. వెదురు, కొబ్బరి, వక్క, కొకొవా తదితర ఉత్పత్తుల ప్లాంటేషన్, ప్యాకేజింగ్, అమ్మకం, మార్కెటింగ్ మొదలైన పనులను ఈ లాక్డౌన్ కాలంలో చేసుకోవచ్చు. -
రూ. 1,700 కోట్లతో ‘సాగర్’ పునరుజ్జీవం
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలతో రాష్ట్రంలోని ప్రతి మూలకూ నీరు అందించాలని సంకల్పించిన ప్రభుత్వం తదనుగుణంగా కార్యాచరణ శరవేగంగా సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా గోదావరి జలాలపై ఆధారపడి చేపడుతున్న సీతారామ ఎత్తిపోతల ద్వారా పూర్వ ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని నాగార్జునసాగర్ కింది పూర్తి ఆయకట్టుకు నీరు అందించే ప్రణాళికకు కార్యరూపం ఇస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ సూచనల మేరకు రిటైర్డ్ ఇంజనీర్లు సాగర్లో భాగంగా ఉండే పాలేరు రిజర్వాయర్ దిగువన, ఎగువన 6.30 లక్షల ఎకరాలకు నీరందించేలా రూ. 1,700 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. దీనిపై ఈ వారంలోనే ముఖ్యమంత్రి సమీక్షించి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎగువ నుంచి రాకున్నా ఢోకా లేదు.. సాగర్ పరిధిలో మొత్తంగా 6.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఎగువ నుంచి వచ్చే కృష్ణా జలాలపైనే సాగు ఆధారపడి ఉంటోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసి అక్కడి కోయినా డ్యామ్, ఆల్మట్టి, నారాయణపూర్లు నిండాకే శ్రీశైలం మీదుగా వరద నీరు సాగర్కు చేరుతోంది. అయితే ఏటా ఆగస్టు తర్వాత కానీ కర్ణాటక ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి ప్రవాహాలు ఉండటం లేదు. సాగర్ పూర్తిస్థాయిలో నిండేందుకు సెప్టెంబర్, అక్టోబర్ పడుతోంది. దీంతో సాగర్ కింది ఆయకట్టుకు ఖరీఫ్లో నీరు అందించడం గగనమవుతోంది. ఒకవేళ ఎగువ నుంచి ప్రవాహాలు కరువైతే ఖరీఫ్, రబీలకు నీటి సరఫరా జరగడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండు సీజన్లలోనూ సాగర్ కింది పూర్తి ఆయకట్టుకు నీరు అందించేలా గోదావరి జలాల తరలింపు చేయాలని ముఖ్యమంత్రి గతంలోనే నిర్ణయించారు. సాగర్ ఆయకట్టు పునరుజ్జీవం కోసం ప్రతిపాదనలు రూపొందించాలని రిటైర్డ్ ఇంజనీర్లను ఆదేశించారు. దీంతో రిటైర్డ్ ఇంజనీర్లు చంద్రమౌళి, శ్యాంప్రసాద్రెడ్డి, అనంతరాములు, వెంకట రామారావు తదితరులు ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పర్యటించి నివేదికరూపొందించారు. మొత్తంగా సీతారామ ఏడు లిఫ్ట్ల ద్వారా 72 టీఎంసీల నీటిని ఎత్తిపోసి పాలేరు రిజర్వాయర్కు ఎగువన 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు, పాలేరు నుంచి సాగర్ రిజర్వాయర్కు మధ్య 3.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా పునరుజ్జీవ పథకాన్ని డిజైన్ చేశారు. నాగార్జునసాగర్ 21ఎల్ బ్రాంచ్ కెనాల్ను ఉపయోగించుకొని దాని పరిధిలోని 50 వేల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు పాలేరు రిజర్వాయర్ వరకు గల 2.50 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టును స్థిరీకరించడానికి 80 కి.మీ. నుంచి 104 కి.మీ. లింక్ కెనాల్ తవ్వాలని, దానికి 21ఎల్ బ్రాంచ్ కెనాల్ను కలపాలని సూచించారు. మొత్తంగా సాగర్ కాలువపై ఆరు లిఫ్టులు, మున్నేరు వద్ద నిర్మించబోయే బ్యారేజీ వద్ద ఒక లిఫ్ట్తో కలిపి మొత్తం ఏడు దశల్లో నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదించారు. ఇందులో పంప్హౌస్ల ఎలక్ట్రో మెకానికల్ వర్క్లకు రూ. 725 కోట్లు, సివిల్ పనులకు రూ. 980 కోట్లు, ఇతర పనులకు రూ. 265 కోట్లు, నాన్ కాంట్రాక్ట్ ఐటమ్స్కు రూ. 250 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు మొత్తానికి రూ. 2,700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినా ఇప్పటికే సీతారామ కింద చేపట్టిన నిర్మాణాలను మినహాయించడంతో రూ. 1,700 కోట్ల అంచనా వ్యయం అవుతుందని రిటైర్డ్ ఇంజనీర్లు తేల్చారు. -
వాటర్ గ్రిడ్కు అధిక నిధులివ్వండి
సాక్షి, అమరావతి: ప్రతి ఇంటిలో మంచి నీటి కొళాయి కనెక్షన్ ఏర్పాటు చేసి 365 రోజుల పాటు నీటి సరఫరా చేయడానికి ఉద్దేశించిన వాటర్ గ్రిడ్ పథకం అమలుకు కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత శాఖ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను కలసి వినతిపత్రం అందజేసేందుకు సోమవారం రాష్ట్రం నుంచి అధికారుల బృందం ఢిల్లీ బయలుదేరి వెళ్లనుంది. లోక్సభలో వైఎస్సార్సీపీ పక్ష నాయకుడు మిథున్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, వాటర్ గ్రిడ్ ఇన్చార్జి ఎండీ గిరిజా శంకర్, ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి ఈఎన్సీ కృష్ణారెడ్డిలు సోమవారం కేంద్రమంత్రిని కలుస్తారని అధికారవర్గాలు తెలిపాయి. 2024 నాటికి దేశంలో ప్రతి ఇంటికీ మంచినీటి కొళాయి ఏర్పాటు లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే కొత్తగా ‘జల జీవన్ మిషన్’ పేరుతో ఓ కొత్త కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అవసరమయ్యే నిధులను కేంద్రం– రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా సమకూర్చుకోవాలన్నది ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. కేంద్రం ప్రారంభించిన జలజీవన్ మిషన్ కార్యక్రమం లాంటి లక్ష్యాలతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందే వాటర్ గ్రిడ్ పథకానికి శ్రీకారం చుట్టిన అంశాన్ని అధికారుల బృందం కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది. అందుకనుగుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాటర్ గ్రిడ్ పథకం అమలుకు జలజీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా కేంద్రం నుంచి అధికంగా నిధులను రాష్ట్రానికి కేటాయించాలని కోరనుంది. వచ్చే 30 ఏళ్లకు అనుగుణంగా ప్రణాళికలు.. వాటర్ గ్రిడ్ పథకం అమలుకు మొత్తం రూ. 49,938 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు. ప్రతి వేసవిలోనూ నీటి సరఫరాకు ఆటంకం లేకుండా ఉండేందుకు సాగునీటి రిజర్వాయర్ల నుంచి నేరుగా పైపుల ద్వారా మంచినీటి పథకాలకు నీటి సరఫరా జరిగేలా ఈ వాటర్ గ్రిడ్ను డిజైన్ చేశారు. వచ్చే 30 ఏళ్లకు అనుగుణంగా పెరుగుతున్న అవసరాలకు తగ్గుట్టు గ్రామీణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికీ రోజుకి వంద లీటర్ల చొప్పున, మున్సిపాలిటీలో 135 లీటర్ల చొప్పున, నగరాల్లో 150 లీటర్ల చొప్పున సరఫరా చేయడంతో పాటు పారిశ్రామిక అవసరాలకు కూడా నీటి సరఫరాకు వీలుగా మొత్తం వాటర్ గ్రిడ్ పథకాన్ని రూపొందించారు. ఈ పథకానికి 2020–21 సంవత్సరంలో రూ. 8,040 కోట్లు, 2021–22లో రూ. 11,166 కోట్లు, 2022–23లో రూ. 13,409 కోట్లు, 2023–24లో రూ. 17,323 కోట్ల చొప్పున ఈ పథకానికి ఖర్చు చేయనున్నారు. -
ఐటీ కారిడార్కు జలహో
సాక్షి, సిటీబ్యూరో: రాబోయే వేసవిలో ఐటీ కారిడార్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా పరిధిలో తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాలకు లింగంపల్లి నుంచి రివర్స్ పంపింగ్ విధానంలో నీటి సరఫరా జరుగుతుండటంతో పలు ఐటీ, బీపీఓ, కేపీఓ సంస్థలు తీవ్ర నీటిఎద్దడి ఎదుర్కొంటున్నాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు భారీ రింగ్ మెయిన్ పైపులైన్ ఏర్పాటు చేయాలని జలమండలి సంకల్పించింది. గతంలో రూ.420 కోట్ల అంచనా వ్యయంతో ఘన్పూర్ భారీ స్టోరేజ్ రిజర్వాయర్ నుంచి.. ముత్తంగి జంక్షన్ వరకు భారీ పైపులైన్ ఏర్పాటు చేసిన విషయం విదితమే. దీనికి కొనసాగింపుగా.. ముత్తంగి జంక్షన్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోకాపేట వరకు భారీ రింగ్ మెయిన్ పైపులైన్ ఏర్పాటు చేయనున్నారు. సుమారు రూ.285 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేపట్టనున్న పనులకు సంబంధించి.. త్వరలో మున్సిపల్ శాఖ పరిపాలన పరమైన అనుమతులు జారీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ పనులను రెండు నెలల వ్యవధిలో పూర్తి చేయడం ద్వారా గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా, కోకాపేట్, నల్లగండ్ల, కొల్లూరు తదితర ప్రాంతాలకు తాగునీటి కష్టాలు సమూలంగా తీరనున్నాయి. ఈ పనుల పూర్తితో గ్రేటర్కు మణిహారంలా.. 158 కిలో మీటర్ల మేర విస్తరించిన ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు ముందడుగు పడనుండటం విశేషం. వాటర్ గ్రిడ్తో.. దాహార్తి దూరం.. మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్ఎంసీతో పాటు.. ఔటర్రింగ్ రోడ్డుకు లోపల ఉన్న 183 గ్రామ పంచాయతీలు, ఏడు నగరపాలక సంస్థల పరిధిలో నివసిస్తున్న సుమారు 1.20 కోట్ల మంది దాహార్తిని సమూలంగా తీర్చేందుకు ఈ భారీ రింగ్ మెయిన్ పైప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని నివాస, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు, ఐటీ, హార్డ్వేర్ పార్క్లు, నూతనంగా ఏర్పాటు కానున్న టౌన్షిప్లు, కాలనీలకు నిరంతరాయంగా 24 గంటలపాటు కొరత లేకుండా తాగునీటిని అందించడంతోపాటు.. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి వ్యక్తికీ తలసరి నిత్యం 150 లీటర్ల తాగునీటిని (లీటర్ పర్ క్యాపిటా డైలీ) అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వాటర్గ్రిడ్ పథకానికి జలమండలి శ్రీకారం చుట్టనుంది. ఏడు చోట్ల వాటర్ గ్రిడ్ జంక్షన్లు.. ఔటర్రింగ్రోడ్డు చుట్టూ కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు, హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాల నీటిని వాటర్గ్రిడ్ రింగ్మెయిన్ భారీ పైప్లైన్కు అనుసంధానించేందుకు ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ 7 చోట్ల గ్రిడ్ జంక్షన్లను ఏర్పాటు చేయనున్నారు. పటాన్చెరు వద్ద ఏర్పాటుచేయనున్న జంక్షన్కు మంజీరా నీళ్లు, కండ్లకోయ వద్ద ఎల్లంపల్లి జలాశయం నుంచి తరలించే గోదావరి జలాలను గ్రిడ్ పైపులైన్కు అనుసంధానించనున్నారు. ఇక శామీర్పేట్ వద్ద కేశవాపూర్ భారీ స్టోరేజి రిజర్వాయర్ నుంచి తరలించే గోదావరి జలాలను గ్రిడ్కు కలపనున్నారు. వెలిమాల జంక్షన్ వద్ద సింగూరు జలాలను గ్రిడ్కు అనుసంధానిస్తారు. జంటజలాశయాలు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ల నీటిని కిస్మత్పూర్ వద్ద, బొంగ్లూరు జంక్షన్ వద్ద కృష్ణా మూడు దశల ప్రాజెక్టు నుంచి తరలించే కృష్ణా జలాలను కలుపుతారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నిర్మించనున్న దేవులమ్మ నాగారం (చౌటుప్పల్) నుంచి తరలించే కృష్ణా జలాలను పెద్ద అంబర్పేట్ ఔటర్ జంక్షన్ వద్ద గ్రిడ్కు అనుసంధానిస్తారు. దీంతో ఆయా జలాశయాల నుంచి తరలించే నీటితో నిత్యం 600 మిలియన్ గ్యాలన్ల శుద్ధిచేసిన తాగునీరు ఈ గ్రిడ్లో నిరంతరం అందుబాటులో ఉంటుంది. ఈ నీటిని ఔటర్రింగ్ రోడ్డు లోపల ఏమూలకైనా తరలించే అవకాశం ఉంది. వాటర్గ్రిడ్ కాన్సెప్ట్ అమెరికా, బ్రిటన్ దేశాల్లోని పలు మహానగరాల్లో అమల్లో ఉంది. -
ధర, వాస్తు, నీళ్లకే ప్రాధాన్యం
అందుబాటు ధర, వాస్తు, మెరుగైన నీటి సరఫరా.. ఇవే గృహాల కొనుగోళ్లలో కస్టమర్ల ప్రధాన ఎజెండాలు. ఆ తర్వాతే రవాణా సౌకర్యాలు, ఆధునిక వసతులను కోరుకుంటున్నారని రియల్టీ పోర్టల్ నోబ్రోకర్.కామ్ తెలిపింది. రూ.60 లక్షల లోపు దర, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లకే జై కొడుతున్నారు. భద్రత, స్కూల్స్, ఆసుపత్రుల వంటి సోషల్ ఇన్ఫ్రా కస్టమర్లూ ఉన్నారండోయ్! సాక్షి, హైదరాబాద్: నోబ్రోకర్.కామ్ ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై, పుణే, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోని 70 లక్షల రిజిస్టర్ యూజర్లతో ఆన్లైన్ సర్వే నిర్వహించింది. వీటిలో 84 శాతం మంది అందుబాటు ధర, 83 శాతం మంది నీటి సరఫరా, 73 శాతం మంది గృహ వాస్తు, 59 శాతం మంది మెరుగైన రవాణా సౌకర్యాలున్న ఇళ్ల కొనుగోళ్లకే ఆసక్తి చూపించారు. 53 శాతం మంది కార్ పార్కింగ్, 42 శాతం మంది భద్రత, 24 శాతం మంది లిఫ్ట్, 19 శాతం స్కూల్స్, 13 శాతం మంది ఆసుపత్రులు, 9 శాతం మంది జిమ్, స్విమ్మింగ్ పూల్ ఉండాలని కోరుకున్నారు. కూకట్పల్లి, మియాపూర్, మణికొండ, ఉప్పల్, నిజాంపేట ప్రాంతాల్లో కొనుగోళ్లకు ఆసక్తిగా ఉన్నారు. 2020 గృహ విభాగానిదే.. గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గడం, ప్రభుత్వం అందుబాటు గృహాలకు రాయితీలు అందిస్తుండటం వంటి కారణాలతో 2020లో గృహ విక్రయాలు జోరందుకుంటాయి. మెట్రో నగరాల్లోనూ మూలధన వృద్ధి స్థిరంగా ఉండటం, ఇన్వెంటరీని తగ్గించుకునేందుకు డెవలపర్లు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుండటం వంటివి కూడా విక్రయాల వృద్ధికి కారణాలే. ఈ ఏడాది 64 శాతం మంది అద్దెదారులు సొంతిల్లు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారని సర్వే తెలిపింది. గతేడాది ఇది 54 శాతంగా ఉంది. ఇందులోనూ 64 శాతం మంది 35 ఏళ్లలోపే సొంతింటి కలను తీర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. 35–45 ఏళ్ల మధ్య 26 శాతం, 45 ఏళ్ల పైన 10 శాతం మంది కస్టమర్లు ఆసక్తిగా ఉన్నారు. గృహ కొనుగోళ్లలో అత్యంత ఆసక్తిగా హైదరాబాదీలే ఉన్నారు. ఇక్కడ 69 శాతం సొంతింటి ఎంపికలో నిమగ్నమై ఉంటే.. బెంగళూరులో 65 శాతం, ముంబైలో 59 శాతం, చెన్నైలో 55 శాతం, పుణేలో 56 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 58 శాతంగా ఉంది. హైదరాబాద్లో రూ.54 కోట్లు నో బ్రోకర్.కామ్తో 2019లో మెట్రో నగరాల్లో రూ.1,154 కోట్ల బ్రోకరేజ్ తగ్గిందని కంపెనీ తెలిపింది. నగరాల వారీగా చూస్తే బెంగళూరులో అత్యధికంగా రూ.372 కోట్లు, ముంబైలో రూ.342 కోట్లు, పుణేలో రూ.206 కోట్లు, చెన్నైలో రూ.180 కోట్లు, హైదరాబాద్లో రూ.54 కోట్ల బ్రోకరేజ్ ఆదా అయింది. బ్రోకర్లు తగ్గుతున్నారు రియల్టీ రంగంలో బ్రోకర్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 2018లో గృహ కొనుగోళ్లలో 14 శాతంగా ఉన్న మధ్యవర్తులు.. 2019లో 11 శాతానికి తగ్గింది. బ్రోకర్ల క్షీణత కొనుగోలుదారులకే లాభం. ఇళ్ల కొనుగోళ్లలో 35 శాతం స్నేహితులు, బంధువుల ద్వారా, 28 శాతం రియల్టీ వెబ్సైట్స్, 26 శాతం టులెట్ బోర్డ్స్ ద్వారా సంప్రదిస్తున్నారు. – సౌరభ్ గార్గ్, కో–ఫౌండర్, నోబ్రోకర్.కామ్ -
రబీకి సాగర్ నీరు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సాగర్ ఆయకట్టులో ఈ ఏడాది రెండో పంట రబీకి నీటిని పుష్కలంగా అందించనున్నారు. మంగళవారం నుంచి రబీకి నీటి సరఫరాను పాలేరు రిజర్వాయర్ నుంచి ప్రారంభించారు. వారబందీ విధానంలో ఈ నీటిని సరఫరా చేయనున్నారు. 9 రోజుల పాటు జిల్లాలోని ఆయకట్టుకు నీటిని సరఫరా చేయనుండగా.. 6 రోజుల పాటు నిలుపుదల చేయనున్నారు. ఇలా 8 విడతల్లో మార్చి చివరివరకు నీటిని సరఫరా చేస్తారు. అయితే రైతులు ఆరుతడి పంటలనే సాగు చేయాలని, దీంతో కాల్వ పరిధిలోని చివరి భూములన్నింటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు అందించడం సులువుగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు ఖమ్మం జిల్లాలో ఎన్నెస్పీ పరిధిలో 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ మొత్తంలో 17 వేల ఎకరాలు మినహా మిగిలింది జోన్–2 పరిధిలో ఉంది. 17 వేల ఎకరాలు జోన్–3 పరిధిలో ఉండటంతో ఏపీలోని ఆయకట్టు ద్వారా నీరు రావాల్సి ఉంటుం ది. ఈ కారణంగా ఖరీఫ్లో జోన్–3లో రెండు, మూడు తడులు మాత్రమే అందించారు. ఇక జోన్–2 పరిధిలో ఉన్న దాదాపు 8 వేల ఎకరాలను ప్లాట్లుగా మార్చారు. ఇక మిగిలిన ఆయకట్టులో ఖరీఫ్లో సగం వరి పంటలు వేయగా.. మరో సగం మెట్ట పైర్లను సాగు చేసినట్లు ఎన్నెస్పీ అధికారులు లెక్కలు చూపించారు. అయితే ఈ ఆయకట్టు మొత్తానికి సాగర్ నీరు పుష్కలంగా సరఫరా చేశారు. 20 నుంచి సరఫరా చేయాల్సి ఉన్నా.. సాగర్ నీటి విడుదలపై ఖమ్మం జిల్లా అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలను పంపించారు. ఈనెల 20 నుంచి నీటిని విడుదల చేయాలని కోరారు. అయితే ఖమ్మం డివిజన్ పరిధిలోని బోనకల్, కొణిజర్ల, ముదిగొండ తదితర మండలాల పరిధిలో నీటి అవసరముందని రైతుల నుంచి డిమాండ్ రావడంతో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జోక్యంతో జిల్లా ఆయకట్టుకు షెడ్యూల్ కంటే 10 రోజులు ముందే పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం రోజుకు 600 క్యూసెక్కులు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది సాగర్ ఆయకట్టు ఎడమ కాల్వ మొత్తానికి 60 టీఎంసీలు అవసరముంటుందని అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. జోన్–2లోని ఖమ్మం జిల్లా (టేకులపల్లి సర్కిల్) పరిధిలో రబీకి 29 టీఎంసీలు అవసరముంటుందని లెక్కలు తయారు చేశారు. -
కడప స్టీల్ ప్లాంట్కు 23 లేదా 24న సీఎం శంకుస్థాపన
సాక్షి, అమరావతి: రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నమైన కడప ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23 లేదా 24వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల పరిధిలో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కంపెనీని ఏర్పాటు చేసి.. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, మైనింగ్ శాఖ కార్యదర్శి కె.రాంగోపాల్లను డైరెక్టర్లుగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో కడపలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇవ్వడం తెలిసిందే. అయితే ఐదేళ్లు గడిచినా అది కార్యరూపం దాల్చకపోవడం తెలిసిందే. కాగా రాష్ట్రానికి భారీ పరిశ్రమలను తీసుకు రావడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని తమ మేనిఫెస్టోలో పేర్కొన్న వైఎస్ జగన్.. ఇందులో భాగంగా కడప ఉక్కు కర్మాగారం నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ దిశగా దృఢచిత్తంతో ముందుకు సాగుతున్నారు. స్టీల్ప్లాంట్ కోసం బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించడమేగాక దీనికి అవసరమైన ముడి ఇనుమును సరఫరా చేసేలా ఎన్ఎండీసీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో కడప స్టీల్ ప్లాంట్ కోసం తక్షణం రూ.62 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యూనిట్ ఏర్పాటుకు సేకరించిన 3,295 ఎకరాలను చదును చేసి అభివృద్ధి చేయడం, డీపీఆర్ నివేదిక, ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్కు మూలధనం.. కోసం ఈ మొత్తాన్ని వ్యయం చేయనున్నారు. నెలాఖరుకు డీపీఆర్.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను తయారుచేసే బాధ్యతను మెకాన్ సంస్థకు అప్పగించినట్టు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలాఖరుకు నివేదిక వస్తుందని పేర్కొన్నారు. ఈ యూనిట్కు అవసరమైన నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చామన్నారు. పీపీపీ విధానంలో కంపెనీ ఏర్పాటు చేయడానికి వివిధ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఒకవేళ ప్రతిపాదిత పీపీపీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చకపోతే రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా యూనిట్ను ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. -
విశాఖకు కొత్త దశ, దిశ
ఇజ్రాయెల్ దేశంలో మొత్తం అన్నింటికీ డీశాలినేషన్ నీటి (ఉప్పు నీటిని మంచి నీరుగా మార్చి)నే వాడుతున్నారు. పరిశ్రమలకు ఫ్రెష్ వాటర్ కాకుండా డీశాలినేషన్ నీటిని వాడే ఆలోచన చేయాలి. ఇందుకు వెయ్యి లీటర్లకు 57 సెంట్స్ అంటే లీటర్ నీటికి 4 పైసలు ఖర్చు అవుతుంది. ఇలా శుద్ధి పరిచిన నీటినే పరిశ్రమలకు కేటాయించాలి. ఇలాంటి ప్లాంట్లను అవసరం మేరకు ఏర్పాటు చేయాలి. మనం ఏం చేసినా చరిత్ర గుర్తుంచు కోవాలి. ఇవాళ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. వచ్చే తరాలు మెచ్చుకునే రీతిలో పనులు ఉండాలి. మంచి నిర్మాణ శైలిని ఎంపిక చేసుకోవాలి. ముంబై మెట్రో నిర్మాణంలో పిల్లర్ డిజైన్ను పరిశీలించి, మెట్రో రైల్ కోచ్ల నుంచి స్టేషన్ల నిర్మాణం వరకు అత్యుత్తమ విధానాలు పాటించాలి. ప్రతి స్టేషన్ వద్ద, ప్రధాన జంక్షన్ల వద్ద పార్కింగ్ స్థలాలు ఉండేలా చూడాలి. - సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రవాణా, తాగు నీరు, రోడ్లు, పర్యాటక ప్రాజెక్టులపై దృష్టి సారించి విశాఖపట్నం నగర రూపురేఖలు మార్చేందుకు సత్వరమే ప్రణాళికలు రూపొందించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. విశాఖ నగర సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోలవరం నుంచి నగరానికి నిరంతర నీటి సరఫరాపై సమావేశంలో చర్చించారు. పోలవరం వద్దే నీటిని ఫిల్టర్ చేసి అక్కడి నుంచి విశాఖకు తరలించాలని, వాటర్ గ్రిడ్లో భాగంగా నగర అవసరాలకు సరిపడా తాగు నీరు సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు సైతం తాగునీటి వసతి కల్పిస్తూ, పరిశ్రమల అవసరాలు తీర్చేలా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. విశాఖ భవిష్యత్ అవసరాలను తీర్చేలా తాగునీటి సరఫరా ప్రతిపాదనలు ఉండాలని సీఎం సూచించారు. వ్యర్థాలను శుద్ధి చేద్దాం.. కొన్నేళ్లుగా డంపింగ్ చేసిన వ్యర్థాల వల్ల కాలుష్యం ఏర్పడకుండా, భూగర్భ జలాలు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. కాపులుప్పాడలోని డంపింగ్ యార్డులో బయో మైనింగ్ ప్రక్రియ (చెత్తను శుద్ధి చేయడం) ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అక్కడున్న డంపింగ్ యార్డులో క్రమేణా బయో మైనింగ్ చేయడం ద్వారా కాలుష్యం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విశాఖపట్టణంలో అన్ని రహదారులను బాగు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ఇందుకు సంబంధించి ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. నగర పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బీచ్ రోడ్డులో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం ఏర్పాటుపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. నిర్మాణ శైలిలో మార్పులను సూచించారు. సబ్ మెరైన్ మ్యూజియం, ఫుడ్ కోర్టుల ఏర్పాట్ల గురించి అధికారులు సీఎంకు వివరించారు. కైలాసగిరిలో ప్లానెటోరియం పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్చంద్, ఏఎంఆర్సీ ఎండీ ఎన్.పి.రామకృష్ణారెడ్డి, విశాఖ మున్సిపల్ కమిషనర్ సృజన, వీఎంఆర్డీఏ వైస్ చైర్మన్ కోటేశ్వర్రావు పాల్గొన్నారు. 10 విడతలు, 10 కారిడార్లతో మెట్రో రైలు మార్గం విశాఖపట్టణం మెట్రో రైలు మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలను సంబంధిత అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 10 విడతలు, 10 కారిడార్లతో మెట్రో రైలు మొత్తం మార్గం 140.13 కిలో మీటర్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. తొలి దశలో మొత్తం 46.40 కిలోమీటర్లు ఉంటుందని, స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.23 కిలో మీటర్లు, గురుద్వార ృ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ 5.26 కిలోమీటర్లు, తాడిచెట్ల పాలెం నుంచి ఆర్కే బీచ్ వరకు 6.91 కిలో మీటర్లు ఉంటుందని చెప్పారు. దీనిని 2020 ృ 2024 మధ్య పూర్తి చేయాలని ప్రతిపాదించామని వివరించారు. ఈ సందర్భంగా ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లోని మెట్రో రైల్ మోడళ్లను వారు చూపించగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. -
ఔరా అనిపిస్తున్న ఆడబిడ్డ
ఆకాశంలో సగమంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు అంతర్జాతీయంగా విమానాలు, దేశీయంగా మెట్రో రైళ్లు నడుపుతూ మగవాళ్లకు దీటుగా నిలుస్తున్నారు. మెట్రో నగరాల్లో పురుషులతో పోటీ పడుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కట్టుబాట్లు, ఆచార వ్యవహారాల మూలంగా బయటికి రాలేక తమలోని ప్రతిభను మరుగున పడేస్తున్నారు. కానీ ఇలాంటి కట్టుబాట్లను తెంచుకుని ఆచారాలను పాటిస్తునే స్వంతంగా వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న స్వాతిపై ‘సాక్షి’ కథనం. – ఎస్ఎస్తాడ్వాయి నీటి సరఫరా కోసం డ్రైవింగ్ సాక్షి, ములుగు : తన వ్యాపారాన్ని విస్తరించుకునే బాధ్యతను తనే మీద వేసుకుంది స్వాతి. దీని కోసం ఏకంగా ఆటోడ్రైవింగ్ నేర్చుకుంది. ఉదయం వేళ హోటల్ నిర్వాహణకు సంబంధించిన పనులు పూర్తయిన తర్వాత ఆటోలో క్యాన్లు వేసుకుని మేడారం చుట్టు పక్కల ఉన్న ఊరట్టం, కన్నెపల్లి, నార్లపల్లి, వెంగళరావునగర్, ప్రాజెక్టు నగర్, తాడ్వాయి, కామారం వరకు ఉన్న పల్లెలకు వెళుతూ నీటిని సరఫరా చేస్తోంది. మధ్యాహ్నం సమయానికల్లా మేడారం చేరుకుని హోటల్ పనుల్లో నిమగ్నమవుతోంది. సాయంత్రం వేళ తిరిగి వాటర్ ప్లాంట్ మెయింటనెన్స్ను చేపడుతోంది. మహిళా సాధికరత, ధైర్య సాహసాలకు నిలువెత్తు నిదర్శంగా నిలిచే సమ్మక్క సారలమ్మ చెంత స్వాతి ఆటో నడిపిస్తున్న తీరు చూసి ఇక్కడకు వచ్చే భక్తులు, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన మహిళలు ఔరా అనుకుంటున్నారు. సమస్యలు వస్తే తమ వైపు చూడకుంటా తన కాళ్లపై తాను నిలబడుతూ తన పిల్లలకు మంచి భవిష్యత్ అందించేందుకు స్వాతి పడుతున్న తపన చూసి ఆమె తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. ఈ అంశంపై స్వాతిని ’సాక్షి‘ పలకరించగా ఒకరిపై ఆధారపడకుండా ఉండేందుకు డ్రైవింగ్ నేర్చుకున్నాని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని చెబుతుంది. ఆడవాళ్లు ఏ అంశంలో తక్కువ కాదని, ఏ రంగంలోనైనా రాణించగలరని అంటుంది. అడవుల గుండా ఆటో నడిస్తున్నప్పుడు భయంగా ఉండదా అని ప్రశ్నిస్తే సమ్మక్క సారలమ్మ సన్నిధిలో ఉంటూ భయమెందుకు అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది. ఈ మాటతీరు చూస్తేనే తెలుస్తుంది స్వాతి ఎంత ధైర్యంగా ముందుకెళ్తుందో.. తాగునీటి సరఫరా.. ఉపాధి మేడారం వంటి ఏజెన్సీ ఏరియాల్లో తాగునీటి కోసం సామాన్యులు పడుతున్న ఇబ్బందులు గమినించింది. ప్రజల కష్టాలు తీర్చడంతో పాటు తనకు ఉపాధి దొరుకుతుందనే అంచనాతో ధైర్యం చేసి దట్టమైన అడవుల మధ్య ఉన్న మేడారంలో వాటర్ ప్లాంటు నెలకొల్పింది. ప్లాంటు నెలకొల్పిన తర్వా త మేడారంతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. దీంతో వారికి కూడా నీటిని అందించాల ని అనుకుంది కానీ సరఫరా చేయడం కష్టంగా మారింది. ఆదివారం, సెలవు రోజులు తప్పితే మేడారం వైపు వచ్చే ఆటోలు తక్కువ. దీంతో మినరల్ వాటర్ను కావాల్సిన వాళ్ల కు సరఫరా చేయడం తలకు మించిన భారమైంది. స్థానికంగా ఉన్న ఆటో వాళ్లను సర్వీస్ అడిగితే రానన్నారు. ఏజెన్సీ పల్లెల్లో తాగునీటికి డిమాండ్ ఉంది, తన దగ్గర వాటర్ ఉం ది, సమస్యల్లా సరఫరా చేయడం. రోజుల తరబడి ఎదు రు చూసినా నీటిని సరఫరా చేసేందుకు ఎవరూ ముందుకు రా లేదు. సమస్య ఉన్న చోటనే అవకాశం ఉంటుందనే నానుడిని అనుసరిస్తూ తానే ఆటో డ్రైవింగ్ చేసేందుకు స్వాతి ముందుకొచ్చింది. పది రోజుల వ్యవధిలో డ్రైవింగ్ నేర్చుకుంది. -
రూ.46,675 కోట్లతో వాటర్ గ్రిడ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా మండు వేసవిలో సైతం తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రూ.46,675 కోట్లతో భారీ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. 2022 నాటికి ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారానే మంచినీరు సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, బొత్స, అనిల్కుమార్, పలు శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పెరిగే జనాభాను అంచనా వేసి, 30 ఏళ్ల పాటు వినియోగించుకునేలా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ డిజైన్ను అధికారులు రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 46,982 నివాసిత ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోని 110 పట్టణ, నగర పాలక ప్రాంతాలకు వాటర్గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా తాగునీరు సరఫరా చేస్తారు. రెండు దశల్లో ఈ ప్రాజెక్ట్ను అమలు చేయాలని, మొదటి దశలో రూ.37,475 కోట్లు, రెండో దశలో రూ.9,200 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు అమలుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) నుంచి రూ.2,500 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించారు. భూగర్భ జలాల వినియోగం నిలిపివేత! వాటర్ గ్రిడ్ పథకంలో.. సాగునీటి ప్రాజెక్టుల నుంచి పైప్లైన్ల ద్వారా నీటిని శుద్ధి కేంద్రాలకు తరలిస్తారు. అక్కడి నుంచి కుళాయిల ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తారు. తాగునీటి కోసం భూగర్భ జలాలపై ఆధారపడే పరిస్థితి ఇకలేదని ప్రభుత్వం నిర్ణయానికొచి్చంది. గిరిజన ప్రాంతాల్లో నదులు, నీటి వనరులు, రిజర్వాయర్ల నుంచి తాగునీరు సరఫరా చేస్తారు. వాటర్గ్రిడ్ ప్రాజెక్టు అమలుకు అవసరమైన నిధుల కోసం జలజీవన్ మిషన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా వినియోగించుకోవాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. ప్రాంతాల వారీగా ఎంత నీరు అవసరం? జలాశయాలు, నదులు, ఇతర వనరుల్లో ఉన్న నీటి లభ్యత ఎంత? అనేదానిపై సమగ్ర సమాచారం సేకరించాలని మంత్రులు ఆదేశించారు. తాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలకు నీటి సరఫరాలో సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ప్రకాశం: జిల్లాకు 2,250 క్యూసెక్కుల నీటి సరఫరా
సాక్షి, ప్రకాశం(త్రిపురాంతకం) : నాగార్జున సాగర్ ప్రధాన కాలువ ద్వారా జిల్లాకు 2,250 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. సాగర్ ప్రధాన కాలువ ద్వారా జిల్లాకు నీటి సరఫరా క్రమేనా పెరుగుతోంది. దాంతో మేజర్లకు అవసరమైన మేర నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో డ్యాములు నిండి వరద నీరు ప్రవహించడంతో ప్రధాన కాలువకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి చెరువులు నింపాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇదే విధంగా మేజర్లకు పూర్తిగా నీరు విడుదల చేయాలన్న డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతోంది. పూర్తిగా నీటిని విడుదల చేస్తే త్వరితగతిన నారుమళ్లు పోసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే నారుమళ్లు పెంచిన రైతులు వరినాట్లను పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని రైతులు, రైతు సంఘ ప్రతినిధులు సాగర్ అధికారులను కోరుతున్నారు. -
జీవజలం..
ఆహారం లేకుండా రెండుమూడు రోజులైనా ఉండగలమేమో గానీ.. నీరు తాగకుండా ఉండటం కష్టం. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలని వైద్యులు చెబుతుంటారు. తాగడానికే కాదు.. ఎన్నో రకాల అవసరాలకు మనకు నీరు వినియోగం తప్పదు. పల్లెల్లో ఎలా ఉన్నా.. పట్టణాల్లో మాత్రం రోజూ వేల లీటర్లు కావాలి. ఇక హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి కార్పొరేషన్లలో అయితే మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం. రాష్ట్రంలోని ఆరు కార్పొరేషన్ల్లో రోజూ ఆయా వాటర్ బోర్డులు ప్రజలకు అవసరమైన మేర నీటి సరఫరా చేస్తున్నాయి. అయినా కొన్ని చోట్ల మాత్రం కొరత తప్ప డం లేదు. రోజురోజుకు నగర జనాభా పెరుగుతుండటంతో అంతమందికి నీటి సరఫరా కత్తి మీద సాము లాంటిదే... కార్పొరేషన్లలో నీటి సరఫరా తీరుపై ఓ లుక్కేస్తే.... - సాక్షి, నెట్వర్క్ -
కర్నూలుకు కన్నీరు!
కర్నూలు (టౌన్)/ఓల్డ్సిటీ: కర్నూలు నగరానికి తాగునీటి ముప్పు ముంచుకొస్తోంది. వారం రోజుల్లో ప్రత్యామ్నాయం చూపకపోతే తీవ్ర కష్టాలు తప్పవు. ఇప్పుడే నగరంలోని శివారు కాలనీలకు వారం రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. అది కూడా ట్యాంకర్ల ద్వారానే. చాలాప్రాంతాల్లో కుళాయిలు బంద్ అయ్యాయి. నీటి కష్టాల వల్ల వ్యాపార సముదాయాలు, హోటళ్లను సైతం మూసేయాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న అన్నపూర్ణ హోటల్ మూత పడింది. డబ్బు పెట్టినా నీళ్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో హోటల్ను తాత్కాలికంగా మూసేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్యూరిఫైడ్ వాటర్ ధరకు రెక్కలొచ్చాయి. క్యాన్ వాటర్ రూ.30–40 మధ్య విక్రయిస్తున్నారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు మరో వారం రోజుల్లో పూర్తిగా ఖాళీ కానుంది.ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించడం లేదు. సుంకేసుల, జీడీపీ వెలవెల నగర తాగునీటి అవసరాలకు ప్రధానమైన సుంకేసుల, గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) ఇప్పటికే డెడ్ స్టోరేజీలో ఉన్నాయి. వీటి నుంచి నెల క్రితమే నీటి సరఫరా నిలిపివేశారు. అప్పటి నుంచి సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నీటిని మాత్రమే నగరవాసులకు సరఫరా చేస్తున్నారు. ఇది కూడా డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ఫిల్టర్ బెడ్కు కూడా సరిగా నీరందని పరిస్థితి. ఇందులో ప్రస్తుతమున్న నీటి మట్టం చూస్తే వారంలోపే పరిస్థితులు మరింత దిగజారే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. 2005వ సంవత్సరంలో నిర్మించిన సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో 14 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి నీటినిల్వ తగ్గిపోయింది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేల్కొనకపోతే కర్నూలు వాసులకు 2001 సంవత్సరం నాటి కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్లుగా ఇబ్బందులు వర్షాభావ పరిస్థితుల వల్ల గత రెండేళ్లుగా కర్నూలు వాసులకు నీటి కష్టాలు తప్పడం లేదు. గత ఏడాది వేసవిలో సుంకేసుల డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా పందికోన రిజర్వాయర్ నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు నీటిని తరలించారు. అక్కడి నుంచి సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు సరఫరా చేసి నగర వాసులను కష్టాల నుంచి గట్టెక్కించారు. ఈ ఏడాది కూడా వర్షాలు లేక నగరవాసులకు తీవ్ర నీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డిమాండ్కు తగినట్లు తాగునీటిని సరఫరా చేయకపోవడంతో ఇప్పటికే ప్రజలు అల్లాడుతున్నారు. ప్రతిరోజూ నగర ప్రజలకు 83 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేయాలి. ప్రస్తుతం నగరపాలక సంస్థ 69 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తోంది. కాలనీల్లో కటకట కర్నూలు నగరంలోని పలు కాలనీల్లో ఇప్పటికే నీటి సమస్య ఉధృతరూపం దాల్చింది. శివారు కాలనీలైన మామిదాలపాడు, మునగాలపాడు, స్టాంటన్పురం, బాలాజీ నగర్, మమతానగర్, సమతానగర్, సోనియాగాంధీ నగర్ వంటి అనేక కాలనీలలో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. పాతబస్తీ నుంచి కొత్త కాలనీలు, కల్లూరు కాలనీలలో నాలుగు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. పాతబస్తీలోని చిత్తారిగేరికి మూడు రోజులు, పెద్దపడఖానాకు ఐదు రోజులుగా నీళ్లు రావడం లేదు. రొటేషన్ ప్రకారం పాతబస్తీలోని పలు కాలనీలకు మంగళవారం నీళ్లు రావాలి. కానీ ట్యాంకులోకే నీళ్లు ఎక్కలేదంటూ లైన్మెన్లు చేతులెత్తేశారు. అధికారులు నీటి ట్యాంకర్లు పంపినా అందరికీ అందడంలేదు. కర్నూలు, కల్లూరు ఏరియాలో ఉన్న మొత్తం 23 ఓవర్ హెడ్ ట్యాంకుల్లోనూ పూర్తి స్థాయిలో నీటిని నింపలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. నగర పాలక సంస్థకు చెందిన 8 ట్యాంకర్లతో పాటు 23 ప్రైవేటు ట్యాంకర్లను ఏర్పాటు చేసి.. ఫిర్యాదులు వస్తున్న కాలనీలకు నీటిని సరఫరా చేస్తున్నారు. పెరిగిన నగర జనాభాకు అనుగుణంగా మరొక సమ్మర్ స్టోరేజీ ట్యాంకును నిర్మిస్తే తప్ప వేసవి కష్టాలు తీరవు. ఎస్ఎస్ ట్యాంకులో నీరు 7 రోజులకు సరిపోతుంది సుంకేసుల, జీడీపీ నుంచి నెల క్రితమే నీళ్లు బంద్ అయ్యాయి. ప్రస్తుతం సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుంచి అందిస్తున్నాం. ప్రస్తుతం ఈ ట్యాంకులో 301.72 లక్షల లీటర్ల నీరు ఉంది. ఇది వారం రోజులకు మాత్రమే సరిపడుతుంది. ఆ తరువాత ఇబ్బందిగా ఉంటుంది. ఎల్లెల్సీ నుంచి నీటిని వదిలినట్లు సమాచారం ఉంది. – వేణుగోపాల్, నగరపాలక ఎస్ఈ 5 రోజులుగా రావడం లేదు పెద్దపడఖానాలోని పాఠశాల ప్రాంతానికి నాలుగు రోజులుగా నీళ్లు రావడం లేదు. శుక్రవారం నీళ్లు పట్టుకున్నాం. ఆదివారం కొందరికే వచ్చాయి. తిరిగి మంగళవారం సరఫరా చేయాలి. కానీ బిందె నీళ్లు కూడా రాలేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? – అయ్యమ్మ -
వారం, పది రోజుల్లో సర్పంచ్లకు చెక్పవర్
సాక్షి, హైదరాబాద్: వారం, పదిరోజుల్లో సర్పంచ్లకు చెక్ పవర్తోపాటు అధికారాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మిషన్ భగీరథ పథకం పనుల పురోగతిపై మంత్రి శుక్రవారం హైదరాబాద్లో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. సమీక్షాసమావేశంలో ఈఎన్సీ కృపాకర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు. రోజువారీ నీటి సరాఫరా, ఓవర్హెడ్ ట్యాంక్లు, గ్రామాల్లో అంతర్గత నీటి సరాఫరా పనులపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఇంటింటికీ శుద్ధమైన తాగునీటి పంపిణీలో ఇబ్బందుల్లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నీటి సరఫరాలో అవాంతరాలు ఉండొద్దని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ పథకం కోసం కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునేలా ప్రయత్నిద్దామని చెప్పారు. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇటీవల కేంద్ర ప్రభుత్వ సమావేశంలోనూ ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రతినిధులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు. మిగిలిపోయిన పనులకు జూలై 15 డెడ్లైన్ ‘మిషన్ భగీరథ పనులు బాగా జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. మీ పని తీరువల్లే ఇది సాధ్యమైంది. మిగిలిపోయిన పనులను కూడా జూలై 15 లోపు పూర్తి చేసి ఇంకా మంచిపేరు తెచ్చుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ఎంతో గొప్పది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఇదే. నా 33 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నా. ఎప్పుడు ప్రచారానికి వెళ్లినా బిందెలు, కుండలతో నీళ్ల కోసం మహిళలు ఎదురుపడేవారు. మిషన్ భగీరథతో ఇలాంటి పరిస్థితి లేకుండా పోయింది. ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరా విషయంలో ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడింది’అని మంత్రి అన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా ప్రక్రియను మరింత పటిష్టం చేయాలని, వారం, పది రోజుల్లో సర్పంచ్లకు చెక్పవర్, అధికారాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ‘గ్రామపంచాయతీ నిధులతో వాటర్ట్యాంకుల మరమ్మతు పనులు చేయించండి. సర్పంచ్లతో సమన్వయం చేసుకుంటూ వేగంగా పనులు పూర్తి అయ్యేలా చూడండి. ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం గడువులోపు పూర్తి కావాలి. గ్రామాల్లో అంతర్గత నీటి సరఫరా పనులు కీలకం. ఈ పనుల కోసం తవ్విన సిమెంట్ రోడ్లను వెంటనే పునరుద్ధరించాలి. పాత రోడ్డు తరహాలోనే ఈ మరమ్మతులుండాలి.. గ్రామాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీలకు కచ్చితంగా నీటి సరఫరా చేయాలి. దీనికి తగినట్టుగా పనులు చేయాలి’’అని అధికారులకు మంత్రి దయాకర్రావు సూచించారు. -
హెచ్సీయూలో విద్యార్థులకు షాక్
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పలు హాస్టళ్లలో విద్యుత్, నీటి సరఫరాను బుధవారం నిలిపివేశారు. వేసవి కావడంతో నీటి సమస్య ఉందని దీంతోపాటు సెలవులుండడంతో కొన్ని హాస్టళ్లను మూసివేయాలని చీఫ్ వార్డెన్ వాసుకి అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు క్యాంపస్లోని ఎల్హెచ్–8, ఎంహెచ్ ఎల్ అండ్ ఐ హాస్టళ్లకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారు. వాటిలో ఉండే విద్యార్థులు ఇతర హాస్టళ్లకు మారాలని సూచించారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మూడు రోజుల క్రితం కూడా ఇలాగే నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయగా విద్యార్థులు నిరసనకు దిగారు. దీంతో వెంటనే పునరుద్ధరించారు. ప్రస్తుతం క్యాంపస్లో సీఎస్ఐఆర్, జేఆర్ఎఫ్, నెట్ పరీక్షల కోసం పలువురు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. వీరిని ఇబ్బంది పెట్టకుండా పరీక్షలు అయ్యేంత వరకు విద్యుత్, నీటి సరఫరా కొనసాగించాలని విద్యార్థి యూనియన్లుడిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఇప్పటికే సమాచారం ఇచ్చామని, వేసవిలో సెలవుల దృష్ట్యా కొన్ని హాస్టళ్ల మూసి వాటిలో ఉండేవారికి తెరిచి ఉంచే హాస్టళ్లలో ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఓబీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బైఠాయింపు హెచ్సీయూ క్యాంపస్లోని చీఫ్ వార్డెన్ కార్యాలయం ముందు ఓబీసీ ఫెడరేషన్ ముందు ఆ విద్యార్థి సంఘం నాయకులు బైఠాయించారు. అక్కడే కూర్చొని చదువుకోవడం ప్రారంభించారు. సీఎస్ఐఆర్, జేఆర్ఎఫ్, నెట్ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని ఓబీసీ ఫెడరేషన్ నాయకులు నినాదాలు చేశారు. నీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించేంత వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిరసనలో ఓబీసీ ఫెడరేషన్ నాయకులు రవికుమార్ యాదవ్, ధీరజ్ సంగోజి, శ్రీరామ్ పట్లోళ్ళ, సాయికుమార్, షేక్ హుస్సేన్, దాసరి అభిలాష్, చిన్మయ సుబుద్ధి, మణిసాయి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన మరోపక్క చీఫ్ వార్డెన్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. నిలిపివేసిన విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించేంత వరకు నిరసన కొనసాగిస్తామని ఎస్ఎఫ్ఐ నాయకులు నినాదలు చేశారు. ఇందులో ఎస్ఎఫ్ఐ నాయకులు, హాస్టల్ ఎల్అండ్ఐ హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. -
ఐదేళ్ల అలక్ష్య పాలన.. తీవ్ర దుర్భిక్షం
కరువుకాటకాలతో గ్రామాలు అల్లాడుతున్నాయి..గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు లేవు..తినడానికి తిండిలేదు.. చేయడానికి పని లేదు..మనుషులు వలసబాట పడుతున్నారు..కనీస గ్రాసమూ దొరక్క పశువులు కబేళా దారిలో కనిపిస్తున్నాయి..వేసవికి ముందే తీసుకోవలసిన జాగ్రత్తల ఊసేలేదు..ఖరీఫ్లో వర్షాభావం దెబ్బతీసినా రబీకి ఏం చేయాలనేదానిపై కసరత్తు లేదు..కమీషన్ల కక్కుర్తే తప్ప సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేదు..ఇలాంటి అత్యవసర సమయంలో గ్రామీణ నిరుపేదలకు ఎంతో ఉపయోగపడే ఉపాధిహామీకి మంగళం పలికేశారు..ఆ పథకం నిధులన్నీ కైంకర్యం చేసి కూలీల కడుపుకొట్టారు.. అనాలోచిత నిర్ణయాలు.. అస్తవ్యస్థ పాలన ఫలితమే ఇది..ఐదేళ్లుగా ఇదే పరిస్థితి.. ఈ వేసవిలో రాష్ట్రమంతటా పరిస్థితి మరింత విషమించింది.. అనంతపురం జిల్లాలో మేత లేక కబేళాకు తరలించడానికి సిద్ధంగా ఉంచిన లేగదూడలు, గేదెలు - గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అడుగంటిన బోర్లు (చేతిపంపులు) నుంచి నీటిని తోడుకోవాలన్నా, కిలోమీటర్ల నుంచి కాలినడకన, సైకిళ్లపై నీరు తెచ్చుకోవాలన్నా, ఎప్పుడో వచ్చే ట్యాంకర్ల వద్ద వరుసలో నిలబడి బిందెడు నీరు దక్కించుకోవాలన్నా యుద్ధమే చేయాల్సి వస్తోంది. నీటి క్యాన్ కొనుగోలు చేయాలన్నా ఎదురు చూడాల్సి వస్తోంది. - మా ఊళ్లో చిన్నబావి దగ్గర 1,170 అడుగులు రిగ్గు వేయిస్తే చెంబెడు నీళ్లు కూడా రాలేదు, ఏ బావి, బోరులో కూడా నీళ్లు లేవు, ఏడెనిమిది గంటలు దఫదఫాలుగా మోటార్లు వేస్తున్నా ఒక ఎకరం కూడా తడవడం లేదు, అరటి తోటలు మాడిపోతున్నాయి అని వాపోయాడు కడప జిల్లా పుల్లంపేట మండలం అనంతయ్యగారిపల్లె రైతు. - పదిహేనేళ్ల బత్తాయి తోట సార్. బాగా దిగుబడి ఇవ్వాల్సిన తోటలో ఎండిపోతున్న కొమ్మలను రోజుకు కొన్ని చొప్పున కొట్టేయలేక మొత్తం తోటే నరికేయాల్సి వచ్చిందని కంటతడి పెట్టాడు ప్రకాశం జిల్లా పెద్దారవీడుకు చెందిన రైతు వెంకటేశ్వర్లు. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి/సాక్షి నెట్వర్క్: ఎండిపోయిన చెరువులు, కాలువలు, బోర్లు.. పంటలు సాగు చేయక బీళ్లుగా మారిన భూములు.. కబేళాలకు తరలిపోతున్న పశువులు.. పొట్ట చేతపట్టుకుని వలస వెళ్తున్న రైతులు, వ్యవసాయ కూలీలు.. ఇళ్లకు వేలాడుతున్న తాళాలు.. జనం లేక బోసిపోతున్న పల్లెలు.. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులన్నీ కొత్తగా ఈ రోజే తలెత్తినవి కాదు. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా కరువు కాటకాలు కొనసాగుతున్నాయి. తాగు, సాగునీటి సమస్య వేధిస్తోంది. పశుగ్రాసం కొరతతో పశువుల డొక్కలు ఎండుతున్నాయి. దుర్భిక్షాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి ముందుచూపు, సరైన ప్రణాళిక లేకుండా పోయాయి. ఉన్నదల్లా కమీషన్ల కక్కుర్తి, అవినీతి, అక్రమాలు, వనరులను ఇష్టారాజ్యంగా కొల్లగొట్టడం. ఐదేళ్లుగా ప్రజలను గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అంటూ భ్రమలు కల్పించడంలోనే కాలం గడిపేసింది. రాజధాని నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సర్కారు ఆడని డ్రామాలే లేవు. ప్రాజెక్టులపై సమీక్షలు అంటూ పాలకులు కమీషన్లు వసూలు చేసుకోవడంలో తీరిక లేకుండా గడిపారు. నీరు–చెట్టు పేరిట అధికార పార్టీ నాయకులు రూ.వేల కోట్లు మింగేశారు తప్ప భూగర్భ జలాలు అంగుళం కూడా పెరగలేదు. వరుస కరువుల వల్ల పల్లెలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంటుందని తెలిసినా ముందస్తు చర్యల్లేవు. పశువులకు మేత అందించాలన్న ఆలోచన సైతం ప్రభుత్వానికి లేకపోవడం గమనార్హం. వర్షాల్లేక వ్యవసాయ పనులు లేకపోవడంతో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించి, వలసలను నియంత్రించాలన్న స్పృహ సర్కారులో కొరవడింది. ఐదేళ్లుగా దుర్భిక్షంతో బాధలు పడుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని, తమను కనీసం ఆదుకున్న పాపాన పోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాతాళానికి చేరిన భూగర్భ జలాలు రాష్ట్రంలో కరువు ధాటికి భూగర్భ జలాలు సగటున 14.71 మీటర్ల లోతుకు పడిపోయినట్లు ఈ నెలారంభలోనే లెక్కతేలింది. 208 మండలాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. 1.65 లక్షలకు పైగా బోరు బావులు ఎండిపోయాయి. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గత ఏడాది ఏప్రిల్ నెలతో పోల్చితే ఈ ఏడాది రాయలసీమ జిల్లాల్లో భూగర్భ జల మట్టాలు మరింత లోతుకు పడిపోయాయి. సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లోనూ వేసవి ఆరంభంలోనే నీరు అడుగంటిపోయింది. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలు ఉండగా, 4,982 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 3,494 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నట్టు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఇక నగరాలు, పట్టణాల్లో తాగునీటి కొరత వేధిస్తోంది. పలు కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రెండు, మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. రైతన్నలను ముంచేసిన ఖరీఫ్, రబీ ప్రస్తుత రబీ సీజన్లో 257 మండలాలను అధికారికంగా కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి నయాపైసా సాయం కూడా అందలేదు. కరువు సహాయక చర్యలు కనుమరుగయ్యాయి. పంటల నష్ట పరిహారం అటకెక్కింది. గత ఖరీఫ్లో 347 మండలాలను కరవు మండలాలుగా సర్కారు ప్రకటించింది. ఏడు జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం ఉన్నట్లు వెల్లడించింది. వరుస కరువులతో అల్లాడుతున్న రాష్ట్రం ప్రత్యేకించి 2018 రబీ నుంచి గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడని తీవ్ర దుర్భిక్షాన్ని చవిచూసింది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా అటు ఖరీఫ్, ఇటు రబీ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరువు నుంచి రైతులు కష్టపడి కాపాడుకున్న పంటలకు కూడా కనీస మద్దతు ధరలు దక్కడం లేదు. రైతుబజార్లు, మార్కెట్లలో కూరగాయల ధరలు మండిపోతుంటే ఉత్పత్తిదారులకు మాత్రం కనీస ఆదాయం రావడం లేదు. కాగా, కరవు పరిస్థితుల్లో ప్రజలకు ఉపాధి చూపాల్సిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రమంగా నీరుగారిపోతోంది. దాదాపు 1,307 గ్రామాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూలీలకు పనులు కల్పించలేదని సమాచారం. ఉన్న ఊళ్లో వ్యవసాయ పనులు లేక, ఉపాధి హామీ పథకం అమలు కాక ఆయా గ్రామాల నుంచి నిరుపేదలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. వేధిస్తున్న పశుగ్రాసం కొరత పాలకుల ఉదాసీనత, పశు సంవర్థక శాఖ మొద్దునిద్ర పశువుల పాలిట శాపంగా మారింది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర దుర్భిక్షం మనుషులనే కాదు, పశువులను సైతం కాటేస్తోంది. ఆకలి తీర్చుకోవడానికి కాసింత మేత, గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు లేక పశువులు విలవిల్లాడుతున్నాయి. ఇన్నాళ్లూ సొంత కుటుంబ సభ్యుల్లాగా పెంచుకున్న పశువుల ఆకలి కేకలు వినలేక రైతులు వాటిని అయినకాడికి అమ్మేస్తున్నారు. పాడి ఆవులు, గేదెలను సైతం పోషించలేక దళారులకు విక్రయిస్తున్నారు. మార్కెట్ యార్డులు, సంతల నుంచి పశువులు లారీల్లో కబేళాలకు తరలిపోతున్న దృశ్యాలు రాష్ట్రమంతటా కనిపిస్తున్నాయి. రైతుల నుంచి దళారీలు తక్కువ ధరకే పశువులను కొనేసి కేరళ, తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో వేసవి ప్రారంభంలోనే పశుగ్రాసం కొరత తీవ్రమైంది. గుంటూరు జిల్లా మొదలు రాయలసీమలోని అన్ని జిల్లాలను పశుగ్రాసం కొరత వేధిస్తోంది. ఆయా ప్రాంతాల్లో లారీ వరిగడ్డి ధర రూ.30 వేల నుంచి రూ.40 వేలు పలుకుతోంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి ప్రతిరోజూ వందల సంఖ్యలో వరిగడ్డి లారీలు రాయలసీమకు రవాణా అవుతున్నాయి. అంత ధర పెట్టి వరి గడ్డిని కొనలేని రైతులు పశువులను అమ్ముకుంటున్నారు. కబేళాలకు తరలిన పశువుల సంఖ్య మూడు నెలల్లోనే రెండు లక్షలకు చేరుకుంది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల గేదెలు, 12 లక్షల ఆవులు, 40 లక్షల గొర్రెలు, 8 లక్షల మేకలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ వేసవిలో గ్రాసం కొరత లేకుండా చూస్తామంటూ ప్రవేశపెట్టిన ‘ఊరూర పశుగ్రాస క్షేత్రాల పథకం’ ఆచరణలో విఫలమైంది. అనంతపురం జిల్లాలోని 63 మండలాల్లో కేవలం 10 మండలాల్లోనే పశుగ్రాసం లభ్యమవుతున్నట్లు సమాచారం. పిట్టల్లా రాలుతున్న ‘ఉపాధి’ కూలీలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసే కూలీలు ఎండల తీవ్రతను తట్టుకోలేక కన్నుమూస్తున్నారు. రాష్ట్రంలో ఈ వేసవిలో పదుల సంఖ్యలో కూలీలు మృత్యువాత పడ్డారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఐదుగురు మరణించారు. ‘ఉపాధి’ పనులు చేస్తున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవడం వల్ల కూలీలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. నిబంధనల ప్రకారం.. వేసవిలో పనులు చేసే కూలీలకు కచ్చితంగా నీడ కల్పించాలి. ఇందుకోసం టార్పాలిన్ షెడ్లు వేయాలి. కానీ, క్షేత్రస్థాయిలో ఇది ఎక్కడా అమలు కావడం లేదు. కూలీల దాహం తీర్చేందుకు మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాల్సి ఉన్నా.. ఇవి అందుబాటులో ఉండడం లేదు. ఉదయం ఇళ్ల వద్ద నుంచి బిందెలు, సీసాల్లో తీసుకెళుతున్న నీళ్లు కొద్దిసేపటికే అయిపోతుండడంతో దాహంతో కూలీల గొంతులు ఎండుతున్నాయి. కూలీల తాగునీరుకు ప్రత్యేకంగా ఎలాంటి బడ్జెట్ను విడుదల చేయలేదు. పనుల ప్రాంతంలో ప్రథమ చికిత్స చేసేందుకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా అందుబాటులో ఉండడం లేదు. నిలువ నీడ లేదు.. నీరు లేదు ఎండలు మండిపోతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పనులు చేస్తున్న ప్రాంతంలో సేద తీరేందుకు చెట్లు లేవు. అధికారులు కనీసం టార్పాలిన్ టెంట్లు కూడా వేయడం లేదు. ఎండలకు తట్టుకోలేకపోతున్నాం. తాగేందుకు మంచినీరు సైతం అందుబాటులో ఉంచడం లేదు. – రంగప్ప, కూలీ, తెర్నేకల్, కర్నూలు జిల్లా గ్లూకోజ్ నీరు ఒక్కరోజే ఇచ్చారు ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న మాకు కేవలం ఒక్కరోజు మాత్రమే గ్లూకోజ్ నీటిని అందించారు. తాగునీరు లేకపోవడం వల్ల దూరంగా ఉన్న వ్యవసాయ బోర్ల దగ్గరకు వెళ్లి బిందెతో తెచ్చుకుంటున్నాం. ఎండలు తట్టుకోలేక చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు – వేణుగోపాల్, కూలీ, రాంపురం, కర్నూలు జిల్లా పల్నాడులో ఊళ్లకు ఊళ్లే ఖాళీ ఆర్థిక ప్రగతిలో ఇతర జిల్లాల కంటే గుంటూరు జిల్లా ముందంజలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం కాగితాలపై వృద్ధి రేటు గణాంకాలను గొప్పగా చూపిస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు సర్కారు గణాంకాలను వెక్కిరిస్తున్నాయి. జిల్లాలో పల్నాడు సహా ఇతర ప్రాంతాల్లో కరువు విలయ తాండవం చేస్తోంది. మండు వేసవిలో గుక్కెడు తాగునీరు దొరక్క జనం అల్లాడిపోతున్నారు. కృష్ణానది పక్కనే ఉన్నప్పటికీ సాగు, తాగు నీరు లేక పల్నాడు ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక రైతులు, రైతు కూలీలు ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేసి వలస పోతున్నారు. కరువు నివారణ చర్యలు చేపట్టడంతో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. కనీసం ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం సున్నా. పల్నాడు ప్రాంతంలోని వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం గండిగనుమల గ్రామంలో 600 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామంలో ఆరు బోర్లు ఉండగా, ప్రస్తుతం ఏ ఒక్క బోరులోనూ సరిపడా తాగునీరు లభించడం లేదు. దీంతో గ్రామంలో 400 కుటుంబాలు వలస వెళ్లాయి. చక్రాయపాలెం తండాలో 275 కుటుంబాలు నివసిస్తుండగా, ఇక్కడ తాగునీటికి తీవ్ర కటకట నెలకొంది. మేకలదిన్నె తండా, మన్నేపల్లి తండా, రెవిడిచెర్ల తదితర గ్రామాల్లోనూ బోర్లు పనిచేయడం లేదు. మండలంలో 17కు పైగా పంచాయతీల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఇదే మండలం పమిడిపాడు గ్రామంలో వాటర్ ట్యాంకుల వద్ద రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదంలో ఒక వ్యక్తి మరణించాడంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బోర్లు వేసి అప్పుల పాలయ్యాం... గ్రామాల్లో ఉన్న బోర్లన్నీ ఎండిపోయాయి. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదు. సాగు నీరు లేక పత్తి, మిర్చి పంటలు ఎండిపోయాయి. నీళ్ల కోసం బోర్ల మీద బోర్లు వేసి అందరం అప్పుల పాలయ్యాం. ఈ దుర్భిక్ష పరిస్థితులను ఎన్నడూ చూడలేదు. – బి.గురువయ్య, రైతు, షోలాయేపాలెం, బొల్లాపల్లి గ్రామాల్లో వృద్ధులు, పిల్లలే ఉన్నారు నేను ఎంటెక్ చదువుతున్నా. ప్రస్తుతం సెలవుల్లో సొంతూరికి వచ్చా. కరువు పరిస్థితుల వల్ల గ్రామంలో అందరూ వలస వెళ్లారు. మా తల్లిదండ్రులు కూడా వేరే ప్రాంతాలకు వెళ్లారు. వృద్ధులు, వేసవి సెలవుల్లో ఇళ్లకు వచ్చిన పిల్లలు మాత్రమే ఊళ్లో ఉన్నారు. – బాణావత్ వెంకటేశ్ నాయక్, గంగుపల్లి తండా -
వే‘గంగా’ పడిపోతోంది..!
సాక్షి, హైదరాబాద్: పాతాళగంగ రోజురోజుకూ పడిపోతోంది. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వేసవి తీవ్రత పెరగడం, చివరిదశలో ఉన్న పంటలకు బోర్ల ద్వారా భూగర్భ జల వినియోగం ఎక్కువ కావడంతో భగూర్భమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్ర సగటు భూగర్భ నీటిమట్టం 13.40 మీటర్లకు అడుగంటింది. గతేడాది మార్చి మట్టాలతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 1.52 మీటర్ల దిగువకు పడిపోయాయి. ఈ ఏడాది మార్చిలో సాధారణ వర్షపాతం 865 మిల్లీమీటర్లు ఉండగా, కేవలం 724 మిల్లీమీటర్ల మేర మాత్రమే వర్షపాతం నమోదైంది. ఏకంగా 16 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. 33 జిల్లాలకు గానూ 16 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, 17 జిల్లాలో 20 నుంచి 59 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ ప్రభావంతో చాలా జిల్లాలో చెరువులు నిండలేదు. ప్రాజెక్టుల్లోనూ నీటి చేరిక తక్కువగా ఉండటంతో కాల్వల ద్వారా నీటి విడుదల జరగలేదు. ఈ కారణంగా భూగర్భమట్టాల్లో పెద్దగా పెరుగుదల కనిపించలేదు. రాష్ట్రంలో 5 మీటర్ల కన్నా తక్కువమట్టంలో భూగర్భజలాల లభ్యత కేవలం 4.6 శాతం ప్రాంతాల్లో మాత్రమే ఉండగా, 5 నుంచి 10 మీటర్ల పరిధిలో 33.5 శాతం, 10 నుంచి 15 మీటర్ల పరిధిలో 27 శాతం, 15 నుంచి 20 శాతం పరిధిలో 19.2 శాతం, 20 మీటర్లకు ఎక్కువన 15.6 శాతం మేర భూగర్భ మట్టాలున్నాయి. 4 మీటర్ల కంటే లోతుకు భూగర్భ జలమట్టం రాష్ట్రంలోని 584 మండలాల పరిధిలో భూగర్భమట్టాలను పరిశీలించగా గతేడాది మార్చిలో రాష్ట్ర సగటు నీటిమట్టం 11.88 మీటర్లు ఉండగా, ఈ ఏడాది అది 13.40 మీటర్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే 1.52 మీటర్ల మేర తగ్గుదల కనిపించింది. గతేడాదితో పోలిస్తే 4 మీటర్ల కంటే లోతుకు భూగర్భ జలమట్టం పడిపోయిన జిల్లాల్లో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్ , నారాయణపేట, మేడ్చల్, హైదరాబాద్ ఉన్నాయి. వికారాబాద్ మండల బట్వారంలో ఏకంగా 41.51 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పడిపోగా, మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట, షాద్నగర్ మండలం ఫరూఖ్నగర్లో 40 మీటర్ల మేర భూగర్భమట్టం పడిపోయింది. రాష్ట్రంలోని 69 శాతం బోరుబావుల్లో నీరు ఇంకిపోయినట్లు భూగర్భ జలవిభాగ నివేదిక వెల్లడిస్తోంది. -
ఆదివారం స్నానానికి సెలవు
ఆదివారం.. హాయిగా సేద తీరుదామనుకున్న నగరవాసులుఉదయం లేచింది మొదలు.. ఉరుకులు పరుగులు పెట్టారు.ఎక్కడైనా చుక్కనీరు దొరుకుతుందా అని ఎదురు చూశారు.లేచింది మొదలు.. ట్యాప్ కనెక్షన్ వైపు చూస్తూ గడిపారు. చివరికిస్నానానికి కాదు.. కనీసం తాగడానికి నీరు దొరికితే చాలన్నపరిస్థితికి వచ్చేశారు. సండే రోజున చాలా మంది స్నానానికి కూడాసెలవిచ్చేశారంటే తాగునీటి ఇబ్బందులు నగర ప్రజలు ఎలాఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏలేరుకాలువకు పడిన గండి కారణంగా నగరంలో ఈ పరిస్థితిదాపురించిందని, సోమవారం మధ్యాహ్నానికి పరిస్థితి చక్కబడేఅవకాశముందని అధికారులు భావిస్తున్నారు. విశాఖసిటీ: మహా నగరం నీటి చుక్క దొరక్క విలవిలలాడింది. ఇళ్లల్లో నీటి ఎద్దడి కారణంగా ఆదివారం సెలవు సందడి కనిపించకుండా పోయింది . ఇంట్లో ఉన్న కొద్దిపాటి నీరు ఎక్కడ అయిపోతుందోనని సగానికి పైగా నగరవాసులు స్నానానికి సెలవిచ్చేశారు. నగర వ్యాప్తంగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీరు దొరక్కపోతే.. ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనన్న విషయాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు. ఉదయం లేచింది మొదలు.. నీటి సరఫరా ఆదివారం లేదని తెలుసుకున్న మరుక్షణమే నగర వాసుల గుండె గుభేలంది. అసలే భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో మోటర్ల ద్వారా నీరు తోడుకుందామంటే చుక్క నీరు రాకపోవడంతో మానసికంగా ఇబ్బంది పడ్డారు. ఓవైపు మోటర్ల ద్వారా నీరు రాక.. మరోవైపు.. జీవీఎంసీ నీటి సరఫరా లేకపోవడంతో బిందెడు నీరైనా సంపాదించుకోవాలన్న ఆలోచనతోనే ఆదివారమంతా గడిపేశారు. మరికొందరు చుట్టు పక్కల ఉన్న బోర్లపై ఆధారపడ్డారు. ఇంకొందరు.. సమీప ప్రాంతాల్లో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లడం గమనార్హం. మంచినీటి దోపిడీ ఓ వైపు నీటి కొరతతో నగర జనం విలవిల్లాడుతుంటే.. ఇంకోవైపు ఆ నీటిని అమ్ముకుంటూ అడ్డంగా దోచేశారు. ఆర్వో ప్లాంట్లు, ట్యాంకర్ల ద్వారా నీటిని అమ్ముతున్న వ్యాపారులు ధరల్ని అమాంతం పెంచేశారు. సాధారణ రోజుల్లో రూ.30 ఉండే 20 లీటర్ల వాటర్ క్యాన్ ఇవాళ రూ.70కి, రూ.50 ధర గల క్యాన్ రూ.100కి పైనే అమ్మకాలు చేశారు. 2 వేల లీటర్ల ట్యాంకర్ రూ.250 ఉండగా.. ఆదివారం డిమాండ్ పెరగడంతో రూ.500 నుంచి రూ.700 వరకు ముక్కుపిండి మరీ వసూలు చేశారు. 5వేల లీటర్ల ట్యాంకర్ రూ.450కి విక్రయించాల్సి ఉండగా.. రూ.1000 నుంచి రూ.1500 వరకూ అడ్డగోలుగా అమ్మకాలు జరిపారు. అవసరం ఎంత ధరకైనా కొనేలా చేస్తుందనడానికి నిదర్శనంగా.. నీటి విక్రయదారులు చెప్పిన ధరకే కొనుగోలు చేసిన ప్రజలు ఉసూరుమన్నారు. నీటి విలువ తెలిసిందా చిన్నా... సోమవారం మధ్యాహ్నం వరకూ.. ఏలేరు కాలువ గండి కారణంగా ఆదివారం జీవీఎంసీ పరిధిలోని 80 శాతం వరకు మంచినీటి సరఫరా బంద్ కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలువ గండిని పూడ్చి వేసినా ఏలేశ్వరం నుంచి నీటి ప్రవాహం నగరానికి చేరుకోవాలంటే సుదీర్ఘ సమయం పడుతుంది. ఈ కారణంగా ఆదివారం సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తొలి రోజున గండికి మళ్లీ ఏదైనా ప్రమాదం సంభవిస్తుందోనన్న ఉద్దేశంతో 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, ఆదివారం మరో 150 పెంచి 250 క్యూసెక్కుల నీటిని ఏలేశ్వరం నుంచి విడుదల చేశామని జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఈఈ రాజారావు తెలిపారు. పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసేందుకు గురువారం వరకు సమ యం పట్టే అవకాశముందన్నారు. మరోవైపు తక్కువ స్థాయిలో నీరు వస్తుండటంతో పంపింగ్ చేసేందుకు సమయం పడుతుండటంతో సోమవారం మధ్యాహ్నానికి కొంత మేర సమస్య పరిష్కారమవుతుందని.. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని ఈఈ వివరించారు. నరకం చూశాం కుళాయినీరు రాక చాలా ఇబ్బందులు పడ్డాం. నీరు లేక అవసప్ధలు పడుతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీటి కోసం చూసినా రాకపోవడంతో స్నానం చేయలేని పరిస్థితి, అధికారులు స్పందించి కుళాయినీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి– శైలజ, నక్కవానిపాలెం మంచినీటి సమస్య పరిష్కరించండి ప్రజల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. నగరంలో నీటి కొరత ఉన్నప్పటికీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కుళాయి నీరు రాక రెండు రోజులుగా ఇబ్బందులు పడుతున్నాం. ఎండా కాలం ప్రతిరోజు కుళాయి నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.శ్యామలదేవి, సీతమ్మధార -
సాగర్ ఆయకట్టుకు ‘సీతారామ’ అండ!
సాక్షి, హైదరాబాద్: నీటి లభ్యత పుష్కలంగా ఉన్న గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలించి, వీలైనంత ఎక్కువ ఆయకట్టును సాగులోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా నాగార్జునసాగర్ ఎడమకాల్వ కింద నీరందని ఆయకట్టుకు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నీరందించేందుకు కసరత్తు చేస్తోంది. సాగర్ కింద ఖమ్మం జిల్లాలోని ఆయకట్టుకు ఖరీఫ్లో ఏటా సెప్టెంబర్, అక్టోబర్ వరకు నీటిసరఫరా జరగకపోవడం, రబీలో అయితే నీటిలభ్యతే లేకపోవడంతో ఈ ఆయకట్టును గోదావరినీటితో పునీతం చేసేలా సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచుతున్నారు. ఈ ఆగస్టు నాటికే సీతారామలో మెజార్టీ పనులు పూర్తి చేసి సాగర్ కింద నీరిచ్చేలా కాల్వలు, పంప్హౌస్ల పనులు చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో పెరిగిన వేగం.. దుమ్ముగూడెం ఆనకట్ట నుండి గోదావరి నీటిని తరలించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 3.28 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 3.45 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేసేలా సీతారామ ప్రాజెక్టు చేపట్టారు. ఆ ప్రాజెక్టుతో 3 జిల్లాల్లో 180 గ్రామాలకు ప్రయోజనం చేకూరుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీరందించడంతోపాటు దారి పొడవునా చెరువులను నింపడం, పూర్తయిన ప్రాజెక్టులకు నీటి సరఫరా చేసేలా డిజైన్ చేశారు. ప్రాజెక్టు తొలి ఫలితాలు ఈ ఏడాది జూలై, ఆగస్టు నాటికి పొందేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎగువ కర్ణాటక, మహారాష్ట్రల నుంచి సాగర్కు ఆగస్టు, సెప్టెం బర్ వరకు నీరు రాకపోవడం, ఈ తర్వాత నీటి విడుదల జరిగినా ఖమ్మం పరిధిలోని ఖరీఫ్ పంటలు చివరిదశకు చేరుతుండటంతో మేలు జరగని దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా దుమ్ముగూడెం నుంచి 114 కిలోమీటర్ల కాల్వల తవ్వకాలను మొదట పూర్తి చేసి సాగర్ ఎడమ కాల్వ కింద పూర్వ ఖమ్మం జిల్లాలో ఉన్న 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు మొదలయ్యాయి. ఇప్పటికే రూ.972 కోట్లతో చేపట్టిన కాల్వపనుల్లో రూ.783 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. 7.19 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపనిలో ఇప్పటికే 4 కోట్ల క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. మిగతా పనులు వేగంగా జరుగుతున్నా, రెవెన్యూ, పోడుభూముల పట్టాల అంశం కొంత అడ్డంకిగా మారింది. సాగర్ ఆయకట్టుకు నీరందించాలంటే మూడు పంప్హౌస్ల నిర్మాణం పూర్తి చేయాలి. ఒక్కో పంప్హౌస్లో 6 మోటార్లు అమర్చాల్సి ఉండగా, మూడేసి పంపులను సిద్ధం చేసేలా లక్ష్యాలు విధించారు. ఇందులో మొదటి పంప్హౌస్ను జూన్, జూలై నాటికి, రెండో పంప్హౌస్ను ఆగస్టు, సెప్టెంబర్ నాటికి, మూడో పంప్హౌస్ను అక్టోబర్, నవంబర్ నాటికి పూర్తి చేసేలా ఇటీవల సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నాగార్జునసాగర్ పరిధిలో ఖమ్మం జిల్లాలో నీళ్లందని ఆయకట్టుకు సీతారామ ద్వారా వచ్చే ఖరీఫ్లోనే నీళ్లందించేలా ఈ పనులు జరగాలని సూచించారు. దీనికోసం 114 కిలోమీటర్ల కాల్వల తవ్వకాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట తూములు ఏర్పాటు చేసి సాగర్ కింది కాల్వలకు కలపాలని, చెరువులు నింపాలని సీఎం సూచించారు. సీఎం ఆదేశాలకు తగ్గట్లే పనులు జరుగుతున్నాయి. ఇటీవలే సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి తదితరులు ప్రాజెక్టు పరిధిలో పర్యటించి వచ్చారు. అటవీ, పోడు భూముల అంశానికి సంబంధించి ఉన్న చిన్న, చిన్న అడ్డంకులను వారు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. -
నేడు నీటి సరఫరా బంద్
సాక్షి, సిటీబ్యూరో: ఎస్ఆర్డీపీ పనులతో పాటు కృష్ణా రెండోదశ రింగ్మెయిన్–2 పైపులైన్ల లీకేజీలు, మరమ్మతు పనుల కారణంగా బుధవారం పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపి వేయనున్నట్లు జలమండలి మంగళవారం ప్రకటించింది. బుధవారం ఉదయం 11గంటల నుంచి గురువారం ఉదయం 11గంటల వరకు ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. మరమ్మతులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామని పేర్కొంది. వైశాలినగర్, బీఎన్రెడ్డినగర్, ఆటోనగర్, వనస్థలిపురం, మీర్పేట్, బాలాపూర్, బార్కాస్, మైసారం, ఎలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, హబ్సిగూడ, నాచారం, చిల్కానగర్, తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్, మారేడ్పల్లి, కంట్రోల్రూమ్, మేకలమండి, భోలక్పూర్, హస్మత్పేట్, సికింద్రాబాద్ రైల్వేస్, ఎంఈఎస్, కంటోన్మెంట్ బోర్డు, ప్రకాశ్నగర్, పాటిగడ్డ తదితర ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. -
నగరపాలక సంస్థలో వసూల్ రాజా..
సాక్షి, నెల్లూరు(క్రైమ్): ప్రతి పనికీ ఓ రేటు విధించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అవినీతి తిమింగళాన్ని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం తమదైన శైలిలో అతిడిని విచారించగా విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఐదేళ్లుగా నగరంలోని ఓ లాడ్జీలో ఉంటూ అవినీతి దందాను కొనసాగించినట్లు అధికారులు గుర్తించారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కల్లూరుపల్లి హౌసింగ్బోర్డుకు చెందిన ఇసనాక సురేంద్రరెడ్డి నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. గతేడాది జూలై 22న, అక్టోబర్ ఒకటిన ¯ðనెల్లూరు నగరం 25వ డివిజన్ పరిధిలోని ఇందిరమ్మకాలనీ, ఇందిరమ్మ కొత్తకాలనీ, కనుపర్తిపాడు ఎస్సీ, బీసీ కాలనీల్లో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తోలేందుకు మూడు వర్క్ఆర్డర్లు సురేంద్రరెడ్డికి వచ్చాయి. దీంతో ఆయన నిర్దేశిత ప్రాంతాల్లో నీటిని సరఫరా చేశారు. కాలపరిమితి ముగియడంతో నీటి సరఫరా తాలూకా రూ.2,63,250 బిల్లు అతడికి రావాల్సి ఉంది. దీంతో ఆయన అదే ఏడాది డిసెంబర్లో పలుమార్లు ఎంబుక్ల్లో పనులకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్లో వాటర్సప్లై, రోడ్స్ విభాగం ఏఈ బీఎస్ ఆంజనేయులరాజును కోరారు. ఏఈ రేపు మాపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. సురేంద్రరెడ్డి గతేడాది డిసెంబర్ 27న దుబాయిలో నివాసం ఉంటున్న తన కుమార్తె వద్దకు వెళ్లాడు. అక్కడున్న సమయంలోనే ఏఈని వివిధ ఆరోపణల నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు కుక్కలగుంటలోని కలరా హౌస్లోని వెహికల్స్ డిపో విభాగానికి బదిలీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన సురేంద్రరెడ్డి దుబాయి నుంచి తిరిగి వచ్చి బిల్లుల విషయమై ఏఈని కలిసేందుకు నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడినుంచి ఏఈని వేరే విభాగానికి మార్చాడని చెప్పారు. దీంతో ఫిబ్రవరి 28వ తేదీన బాధితుడు ఏఈని కలిసి బిల్లుల విషయమై మాట్లాడాడు. ఎంబుక్లు అతని వద్దనే.. ఏఈ వేరే విభాగానికి మారినా సురేంద్రరెడ్డి పనులకు సంబంధించిన ఎంబుక్స్ అతని వద్దనే ఉన్నాయి. పనులు తాలూకా వివరాలను ఎంబుక్లో నమోదు చేసి ఉన్నతాధికారులకు ఏఈ పంపాల్సి ఉంది. అందుకు గానూ రూ.30 వేలు ఇవ్వాలని ఏఈ సురేంద్రరెడ్డిని డిమాండ్ చేశాడు. తాను కష్టాల్లో ఉన్నానని బాధితుడు చెప్పినా పట్టించుకోలేదు. ఈనెల రెండో తేదీన సురేంద్రరెడ్డి మరోమారు ఏఈని కలిసి ప్రాధేయపడ్డాడు. అయినా అతను కనికరించకపోగా రూ.30 వేలు ఇస్తేనే ఎంబుక్లను ఉన్నతాధికారులకు పంపుతానని తేల్చిచెప్పాడు. నాలుగైదురోజుల్లో నగదు ఇస్తానని చెప్పి బాధితుడు అక్కడినుంచి వచ్చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు అదేరోజు నెల్లూరు ఏసీబీ డీఎస్సీ సీహెచ్డీ శాంతోను కలిసి ఏఈపై ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన పత్రాలు, ఏఈతో మాట్లాడిన ఆడియో సంభాషణలకు సంబంధించిన సీడీలను డీఎస్పీకి అందజేశారు. ఆయన ఆదేశాల మేరకు రూ.30 వేలు ఇస్తానని ఏఈకి తెలిపారు. రెడ్హ్యాండెడ్గా పట్టివేత గురువారం ఉదయం ఏఈ (కలరా హాస్లోని తన కార్యాలయంలో) రూ.30 వేలు సురేంద్రరెడ్డి వద్ద నుంచి లంచం తాలుకా నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం అక్కడే ఏఈకి రసాయన పరీక్షలు నిర్వహించారు. బీరువాలో ఉన్న ఎంబుక్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ లంచం తీసుకున్న వైనం ఇదిలా ఉండగా సురేంద్రరెడ్డికి గతంలో రూ.8.40 లక్షలకు సంబంధించిన బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. అందుకు సంబంధించి ఎంబుక్లో వివరాలు నమోదుచేసి ఉన్నతాధికారులకు పంపేందుకు ఇదే ఏఈ బాధితుడి నుంచి రూ.1.40 లక్షలు లంచం తీసుకున్నట్లు ఏబీబీ అధికారులు పేర్కొన్నారు. ఇలా పలువురి కాంట్రాక్టర్ల వద్ద నుంచి ఏఈ ముక్కుపిండి వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఎవరి ప్రమేయం ఉంది? అక్రమ వసూళ్లలో తనతోపాటు ఉన్నతాధికారులకు వాటా ఉందని సదరు ఏఈ ఏసీబీ అధికారుల ఎదుట పేర్కొన్నట్లు సమాచారం. దీంతో అధికారులు నగరపాలక సంస్థలోని ఉన్నతాధికారులను విచారించేందుకు సిద్ధమైయ్యారు. ఓ డీఈ అక్రమ వసూళ్లలో భాగస్తుడని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చినట్లు సమాచారం. సదరు డీఈపై అనేక అవినీతి ఆరోపణలున్నాయని తాజాగా పలువురు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఏఈ అరెస్ట్ అవినీతి ఏఈని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి తమ కార్యాలయానికి తరలించారు. మామూళ్ల వెనుక ఉన్నతాధికారుల ప్రమేయంపై అతడిని పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. శుక్రవారం ఏఈని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ సీహెచ్ శాంతో, ఇన్స్పెక్టర్లు శివకుమార్రెడ్డి, రమేష్బాబు, శ్రీహరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఐదున్నరేళ్లుగా.. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన బీఎస్ ఆంజనేయులరాజు 2013 జూలైలో నెల్లూరు నగరపాలక సంస్థలో ఏఈగా బాధ్యతల్లో చేరాడు. సుమారు ఐదున్నరేళ్లుగా ఆయన కార్పొరేషన్లోనే పనిచేస్తున్నారు. గతంలో వాటర్ సప్లై, రోడ్స్ విభాగంలో పనిచేశారు. ఈక్రమంలోనే పలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. అతడిపై పలు ఆరోపణలు వినిపించడంతో మూడునెలల క్రితం కలరా హౌస్లోని మున్సిపల్ వెహికల్స్ డిపోకు మార్చారు. ఇక్కడ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఔట్సోర్సింగ్ డ్రైవర్లను బెదిరించి వారి వద్దనుంచి సంతకాలను తీసుకుని డీజిల్ డ్రా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే విషయం ఏసీబీ అధికారులు సైతం గుర్తించినట్లు తెలిసింది. కాగా సదరు ఏఈ నగరపాలక సంస్థలో చేరిన నాటినుంచి బృందావనంలోని లాడ్జీలో ఉంటున్నాడు. అనధికార కార్యకలాపాలను లాడ్జీ నుంచే నడిపిస్తున్నాడని అధికారులు గుర్తించారు. -
నీటి సరఫరాలోనూ ‘పచ్చ’పాతం!
అనంతపురం , పామిడి:ప్రభుత్వ పథకాలను కేవలం టీడీపీ నా యకులు, కార్యకర్తలు, సానుభూతి పరులకు ధారదత్తం చేసే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఎంతకు దిగజారరంటే సామాన్యులు నిత్యం వినియోగించే తాగునీటి విషయంలో కూడా పక్షపాతం చూపుతున్నారు. దీంతో పీ కొండాపురం దళితవాడ ప్రజలు ఆ నాయకులను ఛీ కొడ్తున్నారు. వివరాల్లోకెళ్తే.. పట్టణ మున్సిపాలిటీలోని పీ కొండాపురం దళిత వాడలో 250 కుటుంబాలకు 750 మంది జనాభా ఉంది. కాలనీలో ఉన్న ఒక్క బోరు కాలనీవాసుల నీటి అవసరాలను తీర్చడం లేదు. దీంతో మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్ల ద్వారా దళితవాడకు నీటిని సరఫరా చేస్తున్నారు. నీటి సరఫరాలో అధికార పార్టీ పక్షపాతం చూపుతోంది. దళితకాలనీలోని అధికార పార్టీ వారి ఇళ్ళ వద్దకే మున్సిపల్ అధికారులు ట్యాంకర్ను పంపుతూ అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు కాలనీలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారింది. కాలువలు పూడికతీతకు నోచుకోకపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో కాలనీవాసుల రాకపోకలకు ఇబ్బందులకు గురౌతున్నారు. తాగునీటి కోసం తల్లడిల్లుతున్నాం.. గ్రామంలోని ఎస్సీ కాలనీలో నెల రోజులుగా పక్షపాత ధోరణితో ట్యాంకర్లను కాలనీకి సక్రమంగా పంపడం లేదు. తాగునీరు లేక తల్లడిల్లి పోతున్నాం. గత్యం తరం లేక గ్రామానికి రెండు ఫర్లాంగుల దూరంలోని వ్యవసాయబావులను ఆశ్రయిస్తున్నాం – సుంకమ్మ, దళితవాడ వాసి, పీ కొండాపురం -
చంద్రబాబు సమర్పించు.. తిత్లీ సినిమా!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార యావ అధికారులనే విస్మయ పరుస్తోంది. ఇదే ప్రచార యావతో గోదావరి పుష్కర కార్యక్రమాల నిర్వహణను సినిమా తరహాలో చిత్రీకరణకు పూనుకుని తొక్కిసలాటకు కారణమయ్యారని, 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినా చంద్రబాబు వైఖరిలో ఎలాంటి మార్పూ రాలేదని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను ఎక్కడికక్కడ వీడియోల్లో చిత్రీకరించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా శాఖల వద్ద వీడియో కెమెరాలు ఉంటే సరేనని.. లేనిపక్షంలో తక్షణమే వీడియో గ్రాఫర్లను నియమించుకోవాలని సూచించింది. బాధితులకు భోజనం అందించడం, మంచినీటి సరఫరాతో పాటు పడిపోయిన చెట్లు తొలగించడం, విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్లు తుపాను బాధితులతో కలసి ఉన్న ఫొటోలతో కూడిన వీడియోలను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ వీడియోలన్నింటితో డాక్యుమెంటరీని రూపొందించి సినిమా థియేటర్లలో ప్రదర్శించడం ద్వారా ప్రచారం పొందాలనేది ముఖ్యమంత్రి యోచన అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒక పక్క బాధితులను ఆదుకోవడానికి విరివిగా విరాళాలు ఇవ్వాల్సిందిగా పిలుపునిస్తూ మరోపక్క ప్రజా ధనాన్ని ఇలా ప్రభుత్వ ప్రచారం కోసం దుర్వినియోగం చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హుద్హుద్ తుపాను సమయంలో కూడా ప్రచారం కోసం రూ.36.63 లక్షల రూపాయలను వ్యయం చేశారని, సహాయక చర్యలతో ప్రచార ప్రకటనలను జారీ చేశారని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. -
206 టీఎంసీలు అవసరం!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది బేసిన్లో లభ్యత జలాల కేటాయింపులు మళ్లీ చేపట్టాలని, పరీవాహకం, ఆయకట్టు ఆధారంగా తెలంగాణకు కోటా పెంచాలని విన్నవిస్తూ వస్తున్న తెలంగాణ.. ప్రస్తుతం మరో కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, తాగు అవసరాలు, పారిశ్రామిక అవసరాలు కలిపి రాష్ట్రానికి మొత్తం గా 936.58 టీఎంసీలు అవసరమని పేర్కొన్న తెలంగాణ.. అందులో 206 టీఎంసీలు తాము భవిష్యత్తులో చేపట్టాలని భావిస్తున్న కొత్త ప్రాజెక్టులకు అవసరమని ట్రిబ్యునల్కు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. వీటి ద్వారా కొత్తగా 23,37,570 ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రణాళిక తమవద్ద ఉందని స్పష్టంచేసింది. జూరాల వరద కాల్వ కిందే ఏకంగా 100 టీఎంసీలతో 4.57 లక్షల హెక్టార్లకు సాగునీరు ఇస్తామని అందులో తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల పంపిణీకి గాను బ్రిజేశ్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణలో భాగంగా తెలంగాణ తన అఫిడవిట్ను సమర్పించింది. ఇందులో కొన్ని కీలకాంశాలను పేర్కొంది. తమకు మొత్తంగా 936.58 టీఎంసీల అవసరాన్ని పేర్కొన్న తెలంగాణ ఇందులో గృహ, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే నీళ్లు తిరిగి 80శాతం వివిధ రూపాల్లో బేసిన్లోకే చేరుతున్నందున తమ నీటి వినియోగాన్ని 771.47 టీఎంసీలుగా చూపాలని కోరింది. ఏడు ప్రాజెక్టులు.. 9.34 లక్షల హెక్టార్లు.. నిర్మాణం పూర్తయినా, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయినా కృష్ణా బేసిన్లో ఇంకా చాలా ఆయకట్టుకు నీరందలేని పరిస్థితులు ఉన్నాయని, ఈ దృష్ట్యా తమకు నీటి కేటాయింపులు పెంచితే కొత్తగా 9.34 లక్షల హెక్టార్లలో సాగునీటిని ఇచ్చేలా 7 కొత్త ప్రాజెక్టులు చేపడతామని పేర్కొంది. ఖమ్మం జిల్లాలో మున్నేరు ద్వారా 4 టీఎంసీలతో 12,950 హెక్టార్లు, వరంగల్ జిల్లాలో 2 టీఎంసీలతో 5వేల హెక్టార్లు, మున్నేరు నదిపై బ్యారేజీల ద్వారా మరో 5 టీఎంసీలతో 20,235 హెక్టార్లు సాగులోకి వచ్చేలా ప్రణాళికలు ఉన్నాయని తెలిపింది. ఇక కోయిల్కొండ–గండేడు ఎత్తిపోతల ద్వారా 50 టీఎంసీలతో 2,28,686 హెక్టార్లు, రేలంపాడు ఎత్తిపోతలతో 10.50 టీఎంసీతో 48 వేల హెక్టార్లు, ఎస్ఎల్బీసీ విస్తరణతో 35 టీఎంసీలతో 1,61,473 హెక్టార్లు, జూరాల వరద కాల్వతో 100 టీఎంసీల నీటితో 4,57,684 ఎకరాలకు నీరిచ్చేలా తమ భవిష్యత్ ప్రణాళిక ఉందని స్పష్టం చేసింది. మొత్తంగా 206.50 టీఎంసీల నీటితో 9.34 లక్షల హెక్టార్ల సాగుభూమికి నీటిని అందించాలన్న లక్ష్యానికి అనుగుణంగా నీటి కేటాయింపులు చేయాలని విన్నవించింది. వీటిపై ట్రిబ్యునల్ బుధవారం నుంచి 3 రోజుల పాటు వాదనలు జరగనున్నాయి. -
‘మిడ్ మానేరు’కు ఎల్లంపల్లి నీళ్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అక్టోబర్ నాటికి 6,7,8 ప్యాకేజీలు అందుబాటులోకి వస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్మానేరుకు నీటి సరఫరా చేస్తామని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్రావు అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామ పరిధిలోని కాళేశ్వరం ప్రాజెక్టులోని 8వ, ప్యాకేజీ అండర్ గ్రౌండ్ టన్నెల్లో మొదటి విద్యుత్ మోటారును డ్రైరన్ చేసి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడో ప్యాకేజీకి సంబంధించి 50 కిలోమీటర్ల ట్విన్ టన్నెల్ డ్రిల్లింగ్ పనుల్లో 49.988 కి.మీ. పని పూర్తయిందని, 12 మీటర్ల టన్నెల్ డ్రిల్లింగ్ మాత్రమే ఉన్నప్పటికీ లూజ్సాయిల్ వల్ల జాగ్రత్తగా పనులు చేయాల్సి వస్తోందన్నారు. మరో 10 రోజుల్లో మిగిలిన 12 మీటర్ల టన్నెల్ డ్రిల్లింగ్ పూర్తి చేసి.. ఆ తర్వాత లైనింగ్ పనులు చేపడుతామని చెప్పారు. మొదటి పంపు డ్రైరన్ విజయవంతం ‘కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి పంపుమోటార్ను విజయవంతంగా డ్రైరన్ నిర్వహించామని మంత్రి తెలిపారు. 139 మెగావాట్ల సామర్థ్యంతో ఈ మోటారు ప్రపంచ సాగునీటి రంగంలోనే అతి పెద్దదన్నారు. స్వదేశీ టెక్నాలజీతో బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో ఈ పంపు మోటారు తయారైందని, మోటారు గరిష్టంగా 214 ఆర్పీఎం స్పీడ్తో నడుస్తుందన్నారు. ఇవాల్టి డ్రైరన్లో పూర్తి సామర్థ్యంతో పని చేసిందన్నారు. 13 పంపుహౌస్ల్లో 86 మోటార్లు కాళేశ్వరం ప్రాజెక్టులో 13 పంపు హౌస్ల్లో మొత్తం 86 మోటార్లు పెడుతున్నామని, వాటిలో మొదటి మోటార్ శనివారం విజయవంతం అయిందని హరీశ్రావు అన్నారు. నీటిని లిఫ్ట్ చేయడానికి అవసరమైన కరెంట్ కోసం 18 సబ్స్టేషన్ల నిర్మాణం జరగుతోందని చెప్పారు. లక్ష్మిపూర్లో 400 కేవీ సబ్స్టేషన్ పూర్తి కావడంతో అదే కరెంట్తో ఇవాల్టి మోటార్ డ్రై రన్ చేశామని, 8వ ప్యాకేజీలోని మిగతా మోటార్లన్నీ సెప్టెంబర్ నాటికి పూర్తవుతాయని మంత్రి స్పష్టం చేశారు. మేడారం దగ్గర 6వ ప్యాకేజీ కి సంబంధించి గ్యాస్ బేస్డ్ 400 కేవీ పవర్ సబ్స్టేషన్ ఈనెల 25లోగా పూర్తవుతుందని చెప్పారు. ఇది కూడా ప్రపంచంలో గ్యాస్ ఆధారిత అది పెద్ద సబ్స్టేషన్ అని పేర్కొన్నారు. 6వ ప్యాకేజీ సబ్ స్టేషన్ పూర్తయితే ఆగస్టు 2వ వారంలో ఇక్కడి మోటార్ల డ్రై రన్ కూడా చేస్తామన్నారు. కాగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు. -
21 కి.మీ. రైలు మార్గం.. 44 కి.మీ. వాటర్ పైపు లైన్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థ సుమారు రూ.766 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు భారీ నిర్మాణాలను ప్రారంభించేందుకు ఆ సంస్థ చురు గ్గా ఏర్పాట్లు చేస్తోంది. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరాకు అవసరమైన 21 కి.మీ రైలుమార్గం, రెండు టీఎంసీల నీటి సరఫరాకు సంబంధించి 44 కి.మీ పొడవైన పైపులైన్లను సింగరేణి సంస్థ నిర్మించింది. ఈ రెండు నిర్మాణాలను ఈ నెల 15న ట్రయల్రన్తో ప్రారంభించనున్నారు. ఈమేరకు ఆ సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ మీడియాకు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంపై జరిగిన సమీక్షలో కొత్త నిర్మాణాల ట్రయల్ రన్కు సంబంధించి అధికారులతో చర్చించారు. ఏటా రూ.50లక్షల టన్నుల బొగ్గు సరఫరా కొత్తగా ప్రారంభించనున్న రైలు మార్గం ద్వారా ఏడాదికి అవసరమైన రూ.50 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయనున్నారు. రూ.460 కోట్లతో రెండున్నరేళ్లలోనే ఇంత పొడవైన రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ రైల్వే లైనుతో పాటు లోడింగ్, అన్ లోడింగ్ వద్ద సైడింగ్ తదితరాలకు మరో 20 కి.మీ. పొడవుగల రైలు మార్గాన్ని నిర్మించారు. రూ.306 కోట్లతో పైపులైను సింగరేణి సంస్థ రూ. 306 కోట్లతో 44 కి.మీ. పొడవైన పైపులైను ద్వారా ప్రాణహిత నది నుంచి సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి రెండు టీఎంసీల నీటిని సరఫరా చేయనున్నారు. నీటి పంపింగ్ కోసం దేవులవాడ వద్ద 1,050 కిలోవాట్ల సామర్థ్యంతో మూడు పంపులను, మార్గమధ్యంలో చెన్నూరు వద్ద 1,200 కిలోవాట్ల సామర్థ్యంగల మరో మూడు పంపులు ఏర్పాటు చేశారు. వీటితో గంటకు సగటున ఏడు వేల క్యూబిక్ మీటర్ల నీటిని తీసుకునే అవకాశం ఉంది.