PM Modi Condoles Loss of Life at Chemical Factory in Bharuch, Gujarat - Sakshi
Sakshi News home page

Bharuch Blast: ఘోర ప్రమాదం.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Published Mon, Apr 11 2022 4:50 PM | Last Updated on Mon, Apr 11 2022 5:50 PM

Gujarat Bharuch Blast: PM Modi Express Grief Announce Exgretia - Sakshi

అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు అగ్నికి ఆహుతి అయ్యారు.

గుజరాత్‌లో భరూచ్‌లోని ఓ కెమికల్‌ ఫ్యాక్టరీ సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ఆరుగురు పనివాళ్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. 

అహ్మదాబాద్‌కు 235 కిలోమీటర్ల దూరంలోని దహేజ్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఈ ఘటన అర్ధరాత్రి 3గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీలోని ఓ రియాక్టర్‌ దగ్గర పని చేస్తుండగా పేలుడు సంభవించి వాళ్లంతా మృత్యువాత పడ్డట్లు భరూచ్‌ ఎస్పీ లీనా పాటిల్‌ తెలిపారు. ప్రమాదంలో ఇంకెవరూ గాయపడలేదని వెల్లడించారు. 

ఈ ఘటనపై  ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నేషనల్‌ రిలీఫ్‌ ఫండ్‌ నుంచి 2 లక్షల రూపాయల సాయం బాధిత కుటుంబాలకు అందజేయనున్నట్లు ట్వీట్‌ చేసింది ప్రధాని కార్యాలయం. అలాగే ఎవరైనా గాయపడితే రూ. 50 వేలు అందించనున్నట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement