exgratia
-
గల్ఫ్ మృతుల కుటుంబాలతో సీఎం రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనం
గల్ఫ్ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబాలతో హైదరాబాద్, ప్రజాభవన్లో త్వరలో 'గల్ఫ్ అమరుల సంస్మరణ సభ' ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యులతో సీఎం ఏ. రేవంత్ రెడ్డి సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొని వారికి భరోసా ఇవ్వనున్నారని ఆయన తెలిపారు. తన విజ్ఞప్తి మేరకు స్పందించిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి 94 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.4 కోట్ల 70 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా సొమ్ము వారి ఖాతాలకు ఈనెల ఒకటిన జమ చేయించారని అనిల్ ఈరవత్రి తెలిపారు. గల్ఫ్ కార్మికులు ఆయురారోగ్యాలతో, క్షేమంగా మాతృభూమికి తిరిగి రావాలని కాంగ్రేస్ ప్రభుత్వం ఆశిస్తున్నది. కానీ... దురదృష్ట వశాత్తు గల్ఫ్ దేశాలలో అకాల మరణం చెందిన మన తెలంగాణ ప్రవాసీ కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం సంకల్పించిందని ఆయన తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!భారత దేశ సరిహద్దులు దాటి ఎడారి దేశాలలో పనిచేస్తూ మృతి చెందిన కార్మికులు సైనికుల లాంటి వారని, విదేశీ మారక ద్రవ్యం పంపిస్తూ ఆర్థిక జవాన్లుగా సేవలందించిన వారిని 'గల్ఫ్ అమరులు' గా స్మరించుకొని వారిని గౌరవించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఈ 'గల్ఫ్ భరోసా' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అనిల్ ఈరవత్రి తెలిపారు. -
అమెరికా ఎన్ఆర్ఐ కుటుంబానికి భారీ పరిహారం
హైదరాబాద్: విదేశాల్లో ఉన్న భారత విద్యార్థుల హక్కులను పరిరక్షించడంలో కోర్ ట్రాకర్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలోని లివ్ అపార్ట్మెంట్స్ స్విమ్మింగ్ పూల్ వద్ద జరిగిన ఘటనలో మృతి చెందిన ఎన్ఆర్ఐ విద్యార్థి కొల్లి మణిదీప్ కుటుంబానికి ఆ సంస్థ స్ఫూర్తిదాయకమైన సేవలను అందించిందంటూ సంస్థ చైర్మన్ విక్రంసాగర్ పసాలను అభినందించారు.శనివారం మాదాపూర్ టీ హబ్లో జరిగిన కార్యక్రమంలో మణిదీప్ కుటుంబానికి భారీ నష్టపరిహారం (5.4 కోట్ల రూపాయలు) చెక్కును మంత్రి ఆందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ఐటీ టెక్నాలజీ సంస్థ కోర్ ట్రాకర్ కృషి ఫలితంగా బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందిందని పేర్కొన్నారు. అమెరికాలో ప్రముఖ న్యాయవాది, హైదరాబాద్కు చెందిన అబ్దుల్ క్యూ ఆరిఫ్ బలమైన ఆధారాలు సేకరించి అపార్ట్మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమని వాదనను సమర్థవంతంగా వినిపించారని కొనియాడారు.చదవండి: కెనడా నుంచి అమెరికాలోకి.. చొరబాటుదారుల్లో ఇండియన్సే ఎక్కువ -
గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా: పొన్నం
లక్డీకాపూల్ (హైదరాబాద్): గల్ఫ్ దేశాల్లో ప్రమాదాల్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్టు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిందన్నారు. గల్ఫ్లో పనిచేసే కార్మికుల కుటుంబాల పిల్లల చదువుకు ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో సీట్లు కలి్పస్తున్నామని చెప్పారు. శుక్రవారం బేగంపేట్లోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రవాసీ ప్రజావాణి కౌంటర్ను ప్రారంభించిన మంత్రి పొన్నం.. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న షేక్ హుస్సేన్ కుటుంబం నుంచి మొదటి అభ్యర్థనను స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో గల్ఫ్ కార్మికుల కోసం సలహా కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ప్రజావాణి ఇన్చార్జి డాక్టర్ జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య, ఎన్నారై విభాగం సలహాదారుడు బొజ్జ అమరేందర్రెడ్డి, ప్రతినిధులు భీంరెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, నరేశ్రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్ రావు, తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు మహ్మద్ జబ్బార్, ఉపాధ్యక్షుడు మహ్మద్ మిస్రీ తదితరులు పాల్గొన్నారు. పగటి వేషగాళ్ల మాటలు నమ్మొద్దుసాక్షి, హైదరాబాద్: హైడ్రాపై పగటి వేషగాళ్ల మాటలు నమ్మొద్దని, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట...అధికారం కోల్పోయిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. సచివాలయంలో శుక్రవారం పొన్నం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్లో అక్రమ కట్టడం కడితే కూల్చేస్తామని నాడు కేసీఆర్ అన్నారా లేదా అని పొన్నం ప్రశ్నించారు. మూసీలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని స్వయంగా నాటి మంత్రి కేటీఆర్ చెప్పిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్లో 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని, మూసీ మీద ఉన్న ఇళ్లను మాత్రమే తొలగిస్తున్నామని, వాళ్లకు సొంత ఇళ్లు వచ్చేలా, మెప్మా ద్వారా ఉపాధి అవకాశాలు కలి్పంచడానికి కార్యాచరణ చేస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. -
అచ్యుతాపురం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో భారీ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. ఘటన తనను ఎంతో బాధించిందన్న ఆయన.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అలాగే గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్లు ప్రకటించారు. Pained by the loss of lives due to a mishap at a factory in Anakapalle. Condolences to those who lost their near and dear ones. May the injured recover soon. An ex-gratia of Rs. 2 lakhs from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs.…— PMO India (@PMOIndia) August 21, 2024అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో బుధవారం రియాక్టర్ పేలిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా 18 మంది మృతి చెందగా.. 35 మంది తీవ్ర గాయాలతో అనకాపల్లి, విశాఖ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. -
గీతాంజలి కుటుంబానికి ఎక్స్గ్రేషియా అందజేత
తెనాలి: టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకల అసభ్యకర పోస్టింగులకు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడిన గొల్తి గీతాంజలి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన రూ. 20 లక్షల ఎక్స్గ్రేషియా ఆ కుటుంబానికి అందింది. గీతాంజలి కుమార్తెలు రిషిత, రిషికల పేరిట చెరొక రూ.10 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆ పత్రాలను గురువారం సాయంత్రం గీతాంజలి భర్త బాలచంద్ర సమక్షంలో చిన్నారులకు అందజేశారు. ముందుగా గీతాంజలి చిత్రపటానికి పార్టీ నియోజకవర్గ పరిశీలకులు మందపాటి శేషగిరిరావుతో కలిసి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం డిపాజిట్ పత్రాలను చిన్నారులకు అందజేశారు. ప్రభుత్వం ద్వారా తన కుటుంబానికి జరిగిన మేలును గీతాంజలి బహిరంగంగా మీడియాలో చెప్పటాన్ని జీర్ణించుకోలేని టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకలు వికృత పోస్టింగులతో ఆమె బలవన్మరణానికి కారకులయ్యారని ఎమ్మెల్యే శివకుమార్ ధ్వజమెత్తారు. తన చేత్తో ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలను అందుకున్న గీతాంజలి భౌతికకాయానికి తానే పూలమాల వేయాల్సి రావటం ఎమ్మెల్యేగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఎంతగానో కలచివేసిందన్నారు. అమాయక మహిళలపై ఇలాంటి వేధింపులకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నారై పంచ్ ప్రభాకర్ రూ.2 లక్షల సాయం టీడీపీ, జనసేన సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి కుటుంబానికి ఎన్నారై పంచ్ ప్రభాకర్ రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేశారు. ఆయన పంపిన డబ్బును గురువారం సాయంత్రం వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కళ్లం హరికృష్ణారెడ్డి, స్థానిక నేతలు గీతాంజలి భర్త బాలచంద్ర, చిన్నారులు రిషిత, రిషికలకు అందజేశారు. ఈ నగదు సాయం చేసిన ఎన్నారై పంచ్ ప్రభాకర్ వీడియో కాల్ ద్వారా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆందోళన చెందవద్దని, ఇద్దరు పిల్లలు ఎంతవరకు చదువుకున్నా ఖర్చులను తన మిత్ర బృందంతో కలిసి తామే భరిస్తామని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇలాంటి వేధింపులు బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆర్థిక సాయం అందించిన పంచ్ ప్రభాకర్కు బాలచంద్ర ధన్యవాదాలు తెలిపారు. -
కానిస్టేబుల్ సత్యకుమార్ కుటుంబానికి 30 లక్షల ఎక్స్ గ్రేషియా
-
కానిస్టేబుల్ కుటుంబానికి చెక్ అందించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: విధి నిర్వహణలో.. అనూహ్యంగా ప్రాణాలు పొగొట్టుకున్న ఏపీ కానిస్టేబుల్ సత్యకుమార్ కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది. సత్యకుమార్ కుటుంబానికి స్వయంగా పరిహారం అందజేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అంతేకాదు పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా సీఎం జగన్ అన్నారు. కానిస్టేబుల్ సత్య కుమార్ డిసెంబర్ 5వ తేదీన డ్యూటీకి వెళ్తుండగా.. కడప-చెన్నై జాతీయ రహదారిపై జరిగిన యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ విషయాన్ని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సత్యకుమార్ కుటుంబానికి సానుభూతి తెలియజేయడంతో పాటు ప్రభుత్వం తరఫు నుంచి ఎక్స్గ్రేషియాగా రూ.30 లక్షలను ప్రకటించారాయన. శుక్రవారం సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయానికి సత్యకుమార్ కుటుంబ సభ్యుల్ని డీజీపీ తీసుకెళ్లి సీఎం జగన్ను కలిపించారు. సత్యకుమార్ భార్యా కొడుకుకి సీఎం జగన్ స్వయంగా చెక్ అందించారు. అంతేకాదు సత్యకుమార్ కొడుకు ప్రస్తుతం ఇంటర్ చదువుకున్నట్లు తెలియడంతో.. డిగ్రీ పూర్తైన వెంటనే అతనికి ప్రభుత్వం తరఫున ఉద్యోగం ఇప్పించాలని, అందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇప్పుడే జారీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. సత్యకుమార్ది 2004 ఏపీఎస్పీ బ్యాచ్. డిసెంబర్ 5వ తేదీన భాకరాపేట సమీపంలో జరిగిన ప్రమాదంలో మరణించారు. మిచాంగ్ తుఫాన్ బీభత్సంతో చెట్టు విరిగి బైక్పై వెళ్తున్న ఆయన మీద పడడంతో దుర్మరణం పాలయ్యారు. -
మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా
-
రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందజేత
మాడుగుల రూరల్: ఇటీవల విజయనగరం జిల్లా కంటకాపల్లి సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన మహిళ కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాను డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు గురువారం అందజేశారు. ప్రమాదంలో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన ముర్రు లక్ష్మి (52) ఆదివారం రాత్రి రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. విశాఖ కింగ్జార్జి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం పరామర్శించి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. -
బాధితులకు సత్వర భరోసా
సాక్షి ప్రతినిధి, విజయనగరం/ఆరిలోవ (విశాఖ తూర్పు): బాధితులకు సహాయం చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనితీరు మరోసారి రుజువైంది. జెట్స్పీడ్తో ఆయన తీసుకున్న నిర్ణయాలు విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో ప్రాణనష్టాన్ని కనిష్టస్థాయికి తీసుకురాగలిగాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును సంఘటన స్థలికి పంపించారు. క్షతగాత్రులను త్వరగా ఆస్పత్రికి తరలించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు. మిగతా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేలా బస్సులు ఏర్పాటు చేయించారు. విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్షతగాత్రుల కోసం రెండు వార్డులను సిద్ధం చేశారు. తీవ్ర రక్తస్రావంతో వచి్చనవారికి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వెనువెంటనే వైద్యులు తగిన చికిత్స చేశారు. దీంతో కొంతమందికి ప్రాణాపాయం తప్పింది. సోమవారం మధ్యాహ్నం సీఎం వైఎస్ జగన్ విజయనగరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 23 మంది క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎక్స్గ్రేషియాను ప్రకటించడంలోనూ, రెండురోజుల వ్యవధిలోనే వారి చేతికి చెక్కులను అందించడంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవను విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు. మానవతా దృక్పథంతో ఎక్స్గ్రేషియా.. రైల్వే శాఖ ప్రకటించిన నష్టపరిహారంతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా మంజూరుచేశారు. 13 మంది మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున రూ.1.30 కోట్లు, క్షతగాత్రులకు తీవ్రతను బట్టి రూ. 2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కులను క్షతగాత్రులకు మంగళవారం, బుధవారం ఇచ్చారు. బుధవారం చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని నాలుగు కుటుంబాలకు మంత్రి బొత్స సత్యనారాయణ, శృంగవరపుకోట నియోజకవర్గం పరిధిలో ఒక కుటుంబానికి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చెక్కు అందజేశారు. మిగతావారికి గురువారం అందించనున్నారు. విశాఖలో రైలు ప్రమాద బాధితులకు పరిహారం విజయనగరం జిల్లా రైలు ప్రమాదంలో మృతిచెందిన రైల్వేగార్డు మరిపి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నష్టపరిహారాన్ని ప్రజాప్రతినిధులు బుధవారం అందించారు. విశాఖపట్నం ఆరిలోవ బాలాజీనగర్లో ఉంటున్న ఆయన కుటుంబసభ్యులకు నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి వైఎస్సార్సీపీ నాయకుడు గొలగాని శ్రీనివాస్, అధికారులతో కలిసి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. హెల్త్సిటీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్వతీపురం మన్యం జిల్లా ఇందిరాకాలనీకి చెందిన కోలా నానాజీకి రూ. 5 లక్షల చెక్కు ఇచ్చారు. ఇక, కేజీహెచ్లో చికిత్స పొందుతున్న నల్లా కుమారికి రూ. 5 లక్షలు, రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బి.తేజేశ్వరరావుకు రూ. 2 లక్షల చొప్పున చెక్కులను ఎమ్మెల్యే వాసుపల్లి గణే‹Ùకుమార్ అందజేశారు. రైలు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి మహారాణిపేట (విశాఖ దక్షిణ): విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముర్రు లక్ష్మి (40) మృతి చెందారు. గాజువాకకు చెందిన ఆమె బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ తెలిపారు. కుటుంబంలో ముగ్గురూ ఒకేచోట.. రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విజయనగరం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ వ్యక్తి పేరు జక్కల వెంకటరమణ. ఆ పక్కనున్న బెడ్పై ఉన్నవారు అతని భార్య బంగారుతల్లి, చిన్నారి కుమార్తె కోమలి. విశాఖపట్నం గాజువాకకు చెందిన ఆ కుటుంబం విజయనగరం జిల్లా గరివిడిలోని అత్తారింటికి వస్తూ ఈ ప్రమాదం బారినపడ్డారు. తండ్రి, తల్లి, చిన్నబిడ్డ.. ఇలా ముగ్గురు ఒకేచోట గాయాలతో ఉండటం చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చలించిపోయారు. వారికి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బంగారుతల్లికి రూ.10 లక్షలు, వెంకటరమణకు రూ.5 లక్షలు, కోమలికి రూ.2 లక్షలు.. మొత్తం రూ. 17 లక్షలు ఎక్స్గ్రేషియా మంజూరు చేశారు. ఆ చెక్కులను మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం అందజేశారు. సీఎం జగన్కు రుణపడి ఉంటాం రైలు ప్రమాదంలో నా భర్త రాము చనిపోయాడని తెలిసి కుప్పకూలిపోయాను. మా కుటుంబానికి ఆ దేవుడే దిక్కు అని కుమిలిపోయాను. అంతటి విషాదంలో ఉన్న మాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అండగా నిలబడటంతో కొండంత ధైర్యం వచ్చింది. రూ. 10 లక్షలు ఇచ్చిన ఆయనకు రుణపడి ఉంటాం. వైఎస్సార్ బీమా కింద మరో రూ. 5 లక్షలు సాయం అందుతుందని చెప్పారు. తక్షణ సాయం కింద రూ. 10 వేలు ఇచ్చారు. – మజ్జి శారద, గదబవలస, గరివిడి మండలం, విజయనగరం జిల్లా చెప్పిన వెంటనే సాయమందించారు నా భర్త పిళ్లా నాగరాజు రైలు ప్రమాదంలో చనిపోయారు. ఎలా బతకాలో తెలియక కుటుంబమంతా రోదిస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో మా పట్ల ముఖ్యమంత్రి స్పందించిన తీరు మరచిపోం. ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పిన వెంటనే చెక్కు పంపించారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. – పిళ్లా కళావతి, కాపుశంభాం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా -
రైలు ప్రమాద ఘటన బాధితులకు ఎక్స్గ్రేషియా అందజేత
-
మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా..
-
బిహార్ రైలు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా
బిహార్ రైలు ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందగా.. 100 మందికి పైగా తీవ్ర గాయలయ్యాయి. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. బిహార్లో బుధవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి కామాఖ్య వెళ్తున్న నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ బక్సర్ సమీపంలో పట్టాలు తప్పింది. 23 బోగీలున్న రైలులోని 21 బోగీలు పట్టాలు తప్పాయి. మూడు బోగీలు పల్టీలు కొట్టాయి. సమాచారం అందుకున్న రెస్యూ టీం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించింది. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పట్టాలపై నుంచి బోగీలను అధికారులు తొలగిస్తున్నారు. దెబ్బతిన్న ట్రాక్ పునరుద్దరణ పనులు చేపట్టారు. మృతుల కుంటుంబాలకు రూ.10 లక్షల పరిహారం రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రైల్వేశాఖ రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున అందించనున్నట్లు పేర్కొంది. అదే విధంగా బిహీర్ సీఎం నితీష్ కుమార్ కూడా మృతుల కుటుంబాలకు 4 లక్షల పరిహారం ప్రకటించారు. చదవండి: కాంగ్రెస్ కీలక సమావేశం.. క్యాండీ క్రష్ ఆడుతూ ఛత్తీస్గఢ్ సీఎం రైలు ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పట్టాలు తప్పిన బోగీల నుంచి ప్రయాణికులు బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ప్రమాదంపై దర్యాప్తు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైలు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. దెబ్బతిన్న పట్టాల పునరుద్ధరించే ప్రక్రియ పూర్తయ్యిందని పేర్కొన్నారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అన్ని కోచ్లను తనిఖీ చేసినట్లు చెప్పారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను కూడా పరిశీలిస్తామని, దీనిపై దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. A Terrible Train Accident Happened Near #Buxar In Bihar Last Night 🙏🙏. #TrainAccident #NorthEastExpress pic.twitter.com/wiOSDCr7si — Sai Mohan 'NTR' (@sai_mohan_9999) October 12, 2023 బక్సర్ నుంచి బయల్దేరిన అరగంటలోపే.. 12506 నెంబర్ గల నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ బుధవారం ఉదయం ఢిల్లీలోని ఆనంద్ విహార్ టర్మినల్ నుంచి బయలు దేరింది. చివరి స్టేషన్ కామాఖ్యకు చేరుకోవడానికి 33 గంటల ప్రయాణించాల్సి ఉంటుంది. బక్సర్ స్టేషన్ నుంచి బయలుదేరిన అరగంట తర్వాత బుధవారం రాత్రి 9.53 గంటలకు రఘునాథ్పూర్ రైల్వే స్టేషన్కు వెళ్తుండగా రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. దాదాపు అన్నీ బోగీలు పట్టాలు తప్పాయి . పలు రైళ్ల రీషెడ్యూల్ నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో ఆ మార్గంలో ప్రయాణించే మొత్తం 40 రైలు ప్రభావితమయ్యాయి. 21 రైళ్లను దారిమళ్లీంచగా.. మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఎలక్ట్రిక్ వైర్లు, పోల్స్, రైలు పట్టాలు ధ్వసం అయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. అయితే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో సమాచారం, సాయం కోసం ప్రయాణికులకు రైల్వే అధికారులు అత్యవసర హెల్ప్లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. పాట్నా రైల్వే స్టేషన్- 9771449971 ధనాపూర్ రైల్వే స్టేషన్- 8905697493 అర జంక్షన్- 8306182542 కమర్షియల్- నార్త్ సెంట్రల్ రైల్వేస్- 7759070004 ప్రయాగ్రాజ్ 0532-2408128 0532-2407353 0532-2408149 కాన్పూర్ 0512-2323016 0512-2323018 0512-2323015 ఫతేపూర్ 05180-222026 05180-222025 05180-222436 తుండ్ల 05612-220338 05612-220339 05612-220337 ఇతావా 7525001249 అలీఘర్ 2409348 -
కళ్లముందే ఘోరం.. 16 మంది మృతి, రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో సంభవించిన విద్యుదాఘాత ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అనూహ్య ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాక్షించారు. ఈ మేరకు హిందీలో ట్వీట్ చేశారు. కాగా, చమోలీ జిల్లాలోని అలకనంద నది ఒడ్డున ఉన్న చమోలీ బ్రిడ్జిపై ట్రాన్స్ఫార్మర్ పేలి విద్యుత్ ప్రసరించింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ఉన్నవారికి షాక్ తగిలి 16 మంది ప్రాణాలు విడిచారు. నమామి గంగా ప్రాజెక్టులో భాగంగా అలకనంద నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. బుధవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. (దంచికొట్టిన వాన.. గంటల్లోనే 30 సెం.మీ వర్షం.. రిజర్వాయర్లకు హై అలర్ట్) మృతుల్లో ముగ్గురు గార్డులు, ఒక పోలీసు వ్యక్తి కూడా ఉన్నారు. కళ్లముందే కరెంట్ షాక్తో అంతమంది విగతజీవులుగా మారడం స్థానికంగా భయోత్పాతం సృష్టించింది. తీవ్రంగా గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సీఎం విచారం.. ఎక్స్గ్రేషియా ప్రకటన చమోలీ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులకు రూ.1 లక్ష చొప్పున అందిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఉత్తరాఖండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ వెల్లడించింది. ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని చమోలీ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. సత్వర విచారణ చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సీఎం ధామితో ఫోన్లో మాట్లాడారు. చమోలీ ఘటనపై ఆరా తీశారు. ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. (డిప్యూటీ స్పీకర్పై పేపర్లు విసిరిన 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..) -
ట్రాక్టర్ బోల్తా ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రూ. 5లక్షల ఎక్స్గ్రేషియా
సాక్షి, తాడేపల్లి: గుంటూరు జిల్లా ట్రాక్టర్ బోల్తా ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ దురదృష్టకర ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు రూ. 5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం జగన్. అదే సమయంలో తీవ్రంగా గాయపడ్డవారికి రూ. లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. స్వల్ప గాయాలైన వారికి రూ. 25వేలు సాయం అందించాలని బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు. ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రత్తిపాడు మండలం కొండేపాడు నుంచి పొన్నూరు మండలం జూపూడి ఫంక్షన్ కి ట్రాక్టర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 30 మంది ఉన్నట్లు సమాచారం. మృతులు..మిక్కిలి నాగమ్మ, మామిడి.జాన్సీరాణి, కట్టా.నిర్మల, గరికపూడి.మేరిమ్మ, గరికపూడి.రత్నకుమారి, గరికపూడి. సుహొసినిగా గుర్తించారు. -
రైలు ప్రమాదంలో ఏపీ బాధితులకు పరిహారం
సాక్షి, అమరావతి: ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన బాధితులందరికీ పరిహారం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో రైలు ప్రమాద దుర్ఘటన, అధికారులు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి ఆదివారం అధికారులతో సమీక్షించారు. రాష్ట్రం నుంచి ఒడిశాకు వెళ్లిన మంత్రి అమర్నాథ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తీసుకుంటున్న చర్యలను, విశాఖపట్నంలో మరో మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పర్యవేక్షణ కార్యకలాపాలను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఘటనలో రాష్ట్రానికి చెందిన వారు ఎవరైనా మరణించి ఉంటే.. వారి కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.లక్ష చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్న సహాయానికి ఇది అదనం అని స్పష్టం చేశారు. బాలాసోర్లో నివాసం ఉంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మరణించారని, ఇది తప్ప రాష్ట్రానికి చెందిన వారెవరూ ఈ ఘటనలో మరణించినట్టుగా ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదని అధికారులు వెల్లడించారు. గాయపడ్డ వారికి మంచి వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
గురుమూర్తి కుటుంబానికి 10లక్షల ఎక్స్గ్రేషియా: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కాగా, బాలాసోర్ ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన గురుమూర్తి మృతిచెందారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు అండగా నిలుస్తూ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఒడిశా రైలు ప్రమాదం ఘటనలో సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైలు ప్రమాదంలో మృతిచెందిన గురుమూర్తి కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్రం సాయానికి అదనంగా పరిహారం ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇది కూడా చదవండి: AP: రైలులో ప్రయాణించిన వాళ్ల ఫొటో, వివరాలు వాట్సాప్ చేయండి.. నెంబర్ ఇదే.. -
ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలం ఎల్లకటవ గ్రామంలో బాణసంచా గోడౌన్ ప్రమాదం ఘటనలో ముగ్గురు మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాణా సంచా గోడౌన్లో ప్రమాదంలో మరణించిన వారంతా చాలా పేదవాళ్లని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రోజువారీ కూలీలని సమాచారం తెలుసుకున్న సీఎం.. వెంటనే స్పందించారు. ఆయా కుటుంబాలను ఆదుకునేలా ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే ఎక్స్గ్రేషియాను వారి కుటుంబాలకు అందించాలన్నారు. చదవండి: ఏపీలో హై అలర్ట్.. రాబోయే ఐదు రోజులూ అప్రమత్తంగా ఉండాల్సిందే..! -
స్వప్నలోక్ ప్రమాదం బాధించింది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు పోవడం తనను ఎంతో బాధించిందన్న ఆయన.. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ.. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటనలో బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి బాధిత కుటుంబాలకు ఆ సాయం అందజేయనున్నట్లు.. అలాగే గాయపడిన వాళ్లకు రూ.50వేల సాయం అందించనున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఉత్తర ప్రదేశ్లో ఇవాళ ఘోరం జరిగింది. సంబల్లోని చందౌసి ప్రాంతంలో బంగాళాదుంప కోల్డ్ స్టోరేజ్ కుప్పకూలి ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన నుంచి మరో పదకొండు మందిని రక్షించారు. ఈ ఘటనపైనా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, పీఎంఎన్ఆర్ఎఫ్ సాయం ప్రకటించారు. Pained by the loss of lives due to a fire tragedy in Swapnalok Complex, Secunderabad. My thoughts are with the bereaved families. May the injured recover soon: PM @narendramodi — PMO India (@PMOIndia) March 17, 2023 PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF to the next of kin of each deceased in the tragedies in Chandausi and Secunderabad. Those injured would be given Rs. 50,000. — PMO India (@PMOIndia) March 17, 2023 -
స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
సాక్షి, హైదరాబాద్: స్వప్నలోక్ కాంప్లెక్స్ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటన విచారకరం: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. ప్రభుత్వం అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటోంది.. ఫైర్ సేఫ్టీ పాటించాలని వ్యాపార సముదాయ నిర్వాహకులకు చెబుతున్నామని, అయినా ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదంలో బయటికి రాలేక ఆరుగురు 5 అంతస్తులోనే చిక్కుకుని మరణించిన సంగతి తెలిసిందే. వారంతా క్యూనేట్ అనే సంస్థలో పనిచేస్తున్నట్టు తెలిసిందన్న ఆయన.. ఆ సంస్థపై ఫిర్యాదులు కూడా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ సహాయం కాకుండా యూనిట్ నుంచి కూడా బాధితులకు సాయమందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ అగ్ని ప్రమాదాలు అన్నీ 40 ఏళ్ల నాటివని.. ఈ క్రమంలో పాత బిల్డింగులు ఫైర్ సేఫ్టీ లేని భవనాలు సుమారుగా 30 లక్షల దాకా ఉన్నాయని తెలిపారు. వీటిపై చర్యలు తీసుకునే క్రమంలో ఒక రెవల్యూషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత మాట్లాడుతూ.. ప్రమాద ఘటన పై ఒక కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఈ పరిధిలో రెండు మూడు ప్రమాదాలు జరిగాయన్న ఆమె..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్టు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రకటించారు. ప్రీతి మృతి బాధాకరమని, ప్రభుత్వపరంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆవేదన, విచారం వ్యక్తం చేశారని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారని వివరించారు. దోషులు ఎంతటి వారైనా సరే చట్టప్రకారంగా కఠినంగా శిక్షిస్తామని ఎర్రబెల్లి తెలిపారు. ప్రీతి ఘటన బాధాకరం: మంత్రులు ప్రీతి మృతి అత్యంత బాధాకరమని, ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం శక్తివంచన లేకుండా ప్రయత్నించిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కాగా.. ప్రీతి మృతి బాధాకరమని, ఆమె కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని జూడాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కౌశిక్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే దారుణం : బండి సంజయ్ ప్రీతిది ముమ్మాటికీ హత్యేనని, ఫిర్యాదు చేయగానే ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రీతి మరణం బాధాకరమన్నారు. ‘‘ఈ దారుణ ఘటనపై సీఎం ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు? మీరిచ్చే రూ.10 లక్షల సాయం ఆ తల్లిదండ్రుల గుండెకోతను చల్లార్చుతాయా? గిరిజన విద్యార్థిని కాబట్టి ఏమైనా ఫరవాలేదనే సీఎం స్పందించలేదా? కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుంటే క్రిమినల్స్ ఏం చేసినా చెల్లుతుందని ప్రీతి ఘటన నిరూపిస్తోంది’’అని విమర్శించారు. విచారణకు రేవంత్ డిమాండ్ ప్రీతి మరణంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. ప్రీతి మరణానికి గల కారణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కల్లు తీస్తూ ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి మరణించిన, శాశ్వత అంగవైకల్యం బారిన పడే కల్లు గీత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ గీత కార్మిక భరోసా’ పథకాన్ని ప్రకటించింది. ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబానికి కూడా రూ.10లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. చెట్టుపై నుంచి పడి శాశ్వత అంగవైకల్యం బారినపడే కల్లుగీత కార్మికునికి కూడా రూ.10లక్షలు పరిహారం అందిస్తారు. ఇందులో రూ.5 లక్షలు కార్మిక శాఖ, మరో రూ.5లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా రూపంలో అందిస్తాయి. కల్లు తీస్తూ ప్రమాదవశాత్తూ అంగవైకల్యం బారిన పడినవారు దరఖాస్తు చేసుకుంటే ఎక్సైజ్ శాఖ నిబంధనలకు అనుగుణంగా వైకల్యం సర్టిఫికెట్ను జారీచేస్తుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన రాష్ట్ర కల్లుగీత విధానం 2022–2027 ప్రకారం ఈ పరిహారాన్ని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. కల్లు గీత కార్మికులకు నిజమైన భరోసా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ‘వైఎస్సార్ గీత కార్మిక భరోసా’ పథకం రాష్ట్రంలోని లక్షలాది మంది గీతకార్మిక కుటుంబాలకు అండగా నిలవనుంది. రాష్ట్రంలో 95,245 కల్లు గీత కుటుంబాలు తమ కులవృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఏటా 1,200 మంది గీత కార్మికులు కల్లు తీస్తూ ప్రమాదానికి గురవుతున్నారు. వారిలో దాదాపు 40శాతం మంది దుర్మరణం చెందుతుండగా మిగిలిన వారు శాశ్వతంగా వైకల్యం బారినపడుతున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రమాదవశాత్తూ మరణించిన కుటుంబాలకు రూ.2లక్షలే పరిహారంగా అందించేవారు. దీనిని పెంచాలని గీత కార్మిక కుటుంబాలు డిమాండ్ చేయడంతో చంద్రన్న బీమా పథకం నుంచి రూ.5లక్షలు ఎక్స్గ్రేషియా అందిస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ సక్రమంగా అమలుచేయలేదు. ఈ నేపథ్యంలో.. ఎవరూ డిమాండ్ చేయకుండానే ప్రమాదవశాత్తూ మరణించే, శాశ్వతంగా వైకల్యం బారినపడే కల్లు గీత కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10లక్షల పరిహారాన్ని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తద్వారా కల్లు గీత వృత్తిపై ఆధారపడిన 95,245 కుటుంబాలకు ముఖ్యమంత్రి భరోసానిచ్చారు. చదవండి: ప్రకృతి ప్రియులకు స్వర్గధామం.. చుట్టూ నీరు, మధ్యలో ఊరు -
బెంగుళూరు ఘటన: సెకనులో అంతా అయిపోయింది..సర్వం కోల్పోయా!
మంగళవారం బెంగుళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి మహిళ, ఆమె కుమారుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాధితురాలి భర్త, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో తాను సర్వ కోల్పోయానంటూ బాధితురాలి భర్త కన్నీటిపర్యంతమయ్యారు. మంగళవారం. ఈ మేరకు బాదితురాలి భర్త లోహిత్ ఆ సంఘటన గూర్చి వివరిస్తూ..."తాము నలుగురు బైక్పై వెళ్తున్నాం. వారిని స్కూల్ వద్ద దించి ఆఫీసుకి బయలుదేరాల్సి ఉండగా..సెకను వ్యవధిలో ఘెరం జరిగిపోయింది. వెనక్కి తిరిగి చూసేటప్పటికీ నా భార్య, పిల్లలు పడిపోయి ఉన్నారు. ఏం చేయాలో కూడా పాలుపోలేదు" అని లోహిత్ ఆవేదనగా చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని బాధితురాలి భర్త లోహిత్ ప్రభుత్వాన్ని కోరారు. మరోకరు ఎవరూ ఈ పరిస్థితిని ఎదుర్కొనకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి మదన్కుమార్ మాట్లాడుతూ..ఆ కాంట్రాక్ట్ పనులు నిలిపి వేసేంత వరకు తమ కుమార్తె మృతదేహ్నాన్ని తీసుకోమని కరాఖండీగా చెప్పారు. ఆ కాంట్రాక్ట్ లైసెన్స్ రద్దు చేసేంత వరకు కూడా కూతురి మృతదేహాన్ని తీసుకోను అని చెప్పారు. అయినా ఇంత ఎత్తైన స్తంభాలు నిర్మించేందుకు వారికి ఎవరూ అనుమతిచ్చారని ప్రశ్నించారు. అలాగే టెండర్ రద్దు చేసి పనులు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. తాను కోర్టులో ఈ విషయం గూర్చి తేల్చకుంటానంటూ మండిపడ్డారు. కాగా మృతురాలి అత్తగారు నిర్మల మాట్లాడుతూ..."దావణగెరె నుంచి 10 రోజుల క్రితం బెంగళూరు వచ్చి పిల్లలను స్కూల్కి దింపెందేకు వెళ్లింది. ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉన్నతాధికారులెవరూ ఘటనాస్థలికి రాలేదని వాపోయారు. అలాగే బాధితురాలి మామగారు, బావగారు కూడా ..కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోకుండా నిర్మాణ పనులు చేపట్టారంటూ సీరియస్ అయ్యారు. దయచేసి వెంటనే వాటిని నిలిపేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, బెంగళూరు మెట్రో పిల్లర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతురాలి కుటుంబానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సుమారు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అంతేగాదు ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని, ఈ నిర్మాణ పనుల్లో లోపాలు ఉంటే వెంటనే విచారణ చేయాల్సిందిగా అదికారులను ఆదేశించారు కూడా. (చదవండి: బెంగుళూరులో విషాదం.. మెట్రో పిల్లర్ కూలి తల్లీ, మూడేళ్ల కొడుకు మృతి) -
కోవిడ్ మృతుల ఎక్స్గ్రేషియాకు రూ.10 కోట్లు
సాక్షి, అమరావతి: కోవిడ్–19తో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే కోవిడ్–19తో చాలా మంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించింది. ఇంకా మిగిలిపోయిన మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున చెల్లించేందుకు జిల్లాల వారీగా రూ.10 కోట్లను విడుదల చేసింది. పరిహారం చెల్లించాక ఆ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా కలెక్టర్లకు సూచించింది. -
కందుకూరు బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందజేత
సాక్షి, నెల్లూరు: కందుకూరు చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాట దుర్ఘనటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తరపున సాయం అందజేశారు మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి. శుక్రవారం కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో.. రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా చెక్లను కాకాణి ఆ కుటుంబాలకు అందజేశారు. కందుకూరు ఘటన దురదృష్టకరమన్న మంత్రి కాకాణి.. ఘటనపై దర్యాప్తు వీలైనంత త్వరగతిన పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దురదృష్టవశాత్తూ జరిగిన ఘటన ఇదని, బాధిత కుటుంబాలకు అండగా ఉండాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా అందిస్తున్నట్లు ప్రకటించారు. -
ఎఫ్ఆర్వో మృతి.. సీఎం కేసీఆర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు సహించబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తి కోయల దాడిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతి చెందిన ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఆయన. ఉద్యోగులపై దాడులను సహించబోమన్న సీఎం కేసీఆర్.. దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. అంతేకాదు.. శ్రీనివాసరావు కుటుంబానికి పూర్తి జీతభత్యాలు అందుతాయని, రిటైర్మెంట్ వయసు వరకు కుటుంబ సభ్యులకు వేతనం చెల్లిస్తామని తెలిపారు. చంద్రుగొండ మండలం బెండలపాడులో మంగళవారం ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణలో శ్రీనివాసరావు ప్రాణాలు పొగొట్టుకోవడంతో ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అధికార లాంఛనాలతో ఎఫ్ఆర్వో శ్రీనివాస రావుకు అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. -
అనంతపురం దుర్ఘటన.. సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం దర్గహొన్నూర్లో బుధవారం కరెంట్ తీగలు తెగిపడి వ్యవసాయ కూలీలు మృతి చెందారు. ఈ ఘటన గురించి తెలిసిన సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారులకు, సీఎం జగన్ సూచించారు. కాగా, వ్యవసాయ కూలీలున్న ట్రాక్టర్పై విద్యుత్ తీగలు తెగిపడడంతో ఘోరం జరిగింది. నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకి చేరింది. ఇక ఈ ఘటనపై ఏపీఎస్పీడీసీఎల్ విచారణకు ఆదేశించింది. కార్పొరేట్ కార్యాలయం నుంచి చీఫ్ జనరల్ మేనేజర్ (పి&ఎంఎం) డి.వి. చలపతి నేతృత్వంలో చీఫ్ జనరల్ మేనేజర్ (ఓ&యం) కె. గురవయ్య, విజిలెన్స్ ఇన్స్ పెక్టర్ (అనంతపురం) యం. విజయ భాస్కర్ రెడ్డిలతో కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (కళ్యాణ దుర్గం) ఎస్. మల్లికార్జున రావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (బొమ్మనహాళ్) ఎం.కె. లక్ష్మీరెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ప్రొటెక్షన్) హెచ్, హమీదుల్లా బేగ్, లైన్ మ్యాన్ ( దర్గా హొన్నూర్) కె బసవ రాజులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అనంతపురం సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. నాగరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆపరేషన్స్/ రాయదుర్గం) శేషాద్రి శేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (యం &పి/ అనంతపురం) కె. రమేష్ ల నుంచి వివరణ కోరుతూ ఏపీఎస్పీడీసీఎల్ ఆదేశాలు జారీ చేసింది. -
గల్ఫ్ కార్మికులను అన్యాయం చేయొద్దు: గల్ఫ్ జేఏసీ
-
గల్ఫ్ కార్మికులను అన్యాయం చేయొద్దు: గల్ఫ్ జేఏసీ
గల్ఫ్ దేశాలలో మృతి చెందిన కార్మికులకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తానని మాట తప్పినందుకు నిరసనగా ఇక నుంచి అధికార ప్రజా ప్రతినిధుల ఇంటి ముందు గల్ఫ్ నుంచి వచ్చిన శవపేటికలను ఉంచుతామని గల్ఫ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిల్ల రవిగౌడ్ అన్నారు. ఇటీవల దుబాయిలో ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ముల్క నాగరాజు (25) అంత్యక్రియలు ఆయన స్వగ్రామం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేటలో జరిగాయి. గల్ఫ్ కార్మికుల అంత్యక్రియల్లో పాల్గొని మృతుడు నాగరాజుకు రవిగౌడ్ నివాళులు అర్పించారు. పని ప్రదేశంలో (వర్క్ సైట్) లో జరిగిన ప్రమాద మరణానికి దుబాయిలో ఫ్యాక్టరీ యాజమాన్యం బాధ్యత వహించి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని రవిగౌడ్ అన్నారు. కార్మికులకు హెల్త్ అండ్ సేఫ్టీ గురించి తగిన శిక్షణ ఇవ్వాలని, ఈ విషయంలో భారత ప్రభుత్వం, గల్ఫ్ ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలని అన్నారు. ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికుడు 'ప్రవాసి భారతీయ బీమా యోజన' అనే ప్రమాద బీమా ను తీసుకోవాలని రవిగౌడ్ కోరారు. రూ. 325 చెల్లిస్తే రెండు సంవత్సరాలు అమలులో ఉండే రూ. 10 లక్షల ప్రార్ద బీమా పాలసీ పొందవచ్చు. ఈ విషయమై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రవిగౌడ్ కోరారు. -
సికింద్రాబాద్ ప్రమాద ఘటనపై ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్లో ఓ లాడ్జిలో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సెల్లార్లో ఈ-బైకులు పేలి.. ఆ అగ్నిప్రమాదంతో అదే కాంప్లెక్స్లోని లాడ్జిలో బస చేసిన ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ.. గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక ఈ ప్రమాదంలో మరణించిన వాళ్లకు పీఎంఎన్ఆర్ఎఫ్(ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి) తరపున రూ.2 లక్షలు, గాయపడిన వాళ్లకు రూ.50వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్విటర్లో ఓ ట్వీట్ చేసింది. Saddened by the loss of lives due to a fire in Secunderabad, Telangana. Condolences to the bereaved families. May the injured recover soon. Rs. 2 lakh from PMNRF would be paid to the next of kin of each deceased. Rs. 50,000 would be paid to the injured: PM @narendramodi — PMO India (@PMOIndia) September 13, 2022 -
విషాదం: కుటుంబాన్ని కాటేసిన కరెంటు.. వైరు అంచు విద్యుత్ ఫ్యూజ్కు తాకడంతో..
కామారెడ్డి: వెలుగులు నింపే విద్యుత్ ఓ కుటుంబంలో చీకటి నింపింది. విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. రెండేళ్ల బాబు అనాథయ్యాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన ఎండీ అహ్మద్ (40) ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నాడు. అతడికి భార్య పర్వీన్ బేగం (32), కూతురు మాహీన్ (6), కుమారులు అద్నాన్ (3), ఫైజాన్ (2) ఉన్నారు. ఫైజాన్ సమీపంలో ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. బట్టలు ఆరేయడానికి వారు నివసించే రేకుల ఇంటి ముందు గోడకు రెండువైపులా మేకులు కొట్టి వైరుకట్టారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పర్వీన్ బేగం దుప్పటిని వైరుపై ఆరేస్తుండగా బరువు కారణంగా వైరు కిందకు జారింది. వైరు అంచుకు కొద్దిదూరంలోనే విద్యుత్ ఫ్యూజ్ ఉంది. దానికి వైరు తాకడంతో విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో పర్వీన్ బేగం విద్యుదాఘాతానికి గురైంది. ఆమె అరుపు విని ఇంట్లో ఉన్న అహ్మద్, పిల్లలు బయటకు పరుగెత్తుకొచ్చారు. ఆమెను కాపాడబోయే ప్రయత్నంలో ఒకరి వెంట మరొకరు విద్యుదాఘాతానికి గురై నలుగురూ మృతిచెందారు. చుట్టుపక్కలవారు గమనించి విద్యుత్శాఖ అధికారులు, పోలీసులకు సమాచారమిచ్చారు. 3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశా రని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. ఆయన ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబొద్దీన్తో కలిసి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం కేసీఆర్ ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారని గోవర్ధన్ తెలిపారు. -
ఆటో ప్రమాదం: సీఎం జగన్ దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియాకు ఆదేశం
సాక్షి, అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లా ఘోర ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పారిస్ పర్యటనలో ఉన్న ఆయన.. సీఎంవో ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గురువారం ఉదయం ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద హైటెన్షన్ విద్యుత్ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు మహిళా కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయాల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద ఆటోపై హైటెన్షన్ విద్యుత్తు తీగ పడిన ఘటనలో.. ఐదుగురు మహిళలు సజీవదహనం అయ్యారు. ప్రమాద సమయంలో 12 మంది ఆటోలో ప్రయాణిస్తున్నారు. మృతిచెందిన వారిని గుడ్డంపల్లి వాసులు కాంతమ్మ, రాములమ్మ, రత్తమ్మ, లక్ష్మీదేవి, పెద్దకోట్లకు చెందిన కుమారిగా గుర్తించారు. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
ఎలుగుబంటి దాడి బాధితులకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా
-
గల్ప్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి
విదేశాలలో అసువులు బాసిన ప్రవాసీ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరుతూ గ్రామ ప్రజలు, గల్ఫ్ వాపసీలు గల్ఫ్ జెఏసి డిమాండ్ చేసింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో శుక్రవారం జరిగిన ఓ గల్ఫ్ కార్మికుడి శవయాత్రలో జేఏసీ నేతలు పాల్గొన్నారు. వాల్గొండకు చెందిన గుంటి బర్నబ్బ (42) ఇటీవల యూఏఈ రాజధాని అబుదాబిలో గుండెపోటుతో చనిపోయారు. అబుదాబి నుండి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించడానికి ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ కృషి చేసింది. సహచర కార్మికుడు గజ్జి శంకర్ అబుదాబి నుండి శవపేటికతో పాటు వచ్చారు. హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి వాల్గొండ వరకు శవపేటిక రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించింది. మృతుడికి భార్య అమృత, కుమారులు అజయ్, హర్షవర్ధన్ ఉన్నారు. గల్ఫ్ దేశాలలో సంవత్సరానికి సుమారు 200 మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు చనిపోతున్నారు. గత ఎనిమిది ఏళ్లలో సుమారు 1,600 మంది తెలంగాణ ప్రవాసీల మృతదేహాలు శవపేటికలలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా వారి స్వగ్రామాలకు చేరుకున్నాయి. కొందరి మృతదేహాలకు గల్ఫ్ దేశాలలోనే అంత్యక్రియలు జరిగాయని జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలలో చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా (మృత ధన సహాయం) ఇవ్వాలని గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ కోరారు. గల్ఫ్ ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్ లో ప్రతి సంవత్సరం రూ. 500 కోట్లు కేటాయించాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల కోరారు. ప్రవాసి అంతిమయాత్రలో సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గుగ్గిల్ల రవిగౌడ్, స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసి నాయకుడు మెంగు అనిల్, గ్రామ సర్పంచ్ దండిగ గంగు - రాజన్న, గ్రామస్తులు, గల్ఫ్ వాపసీలు తదితరులు పాల్గొన్నారు. చదవండి: ప్రాణాలతో గల్ఫ్ కు ఎగుమతి.. శవపేటికల్లో దిగుమతి -
విజయవాడ ఆస్పత్రి ఘటన.. రూ.10 లక్షల పరిహారం
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు)/విజయవాడ స్పోర్ట్స్ : విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై జరిగిన అత్యాచార ఘటన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఉపేక్షించవద్దని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సీఎంఓ అధికారులకు ఆయన ఆదేశాలి చ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని, ఆ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. మరోవైపు.. ఈ ఉదంతానికి సం బంధించి సీఎం జగన్, డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి ఆ దేశాల మేరకు.. విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణాలపై సీఐ హనీష్కుమార్, సెక్టార్ ఎస్సై శ్రీని వాస్ను సస్పెండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాణా శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. మహిళలపై జరుగుతున్న దాడులు, శాంతిభద్రతల రక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ కూడా ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకుంది. నిందితులను ఫాగింగ్ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించి వారిని విధుల నుంచి తొలగించింది. విజయవాడ ఆస్పత్రిలో సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫా గింగ్ ఏజెన్సీకి టెర్మినేషన్ నోటీసు జారీచేసింది. ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఆర్ఎం ఓకి షోకాజ్ నోటీసు జారీచేశారు. శాఖాపరంగా పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని మెడికల్ ఎడ్యుకేష న్ డైరెక్టర్కు ఆదేశాలిచ్చారు. నివేదిక తర్వాత మరి న్ని చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. మరోవైపు.. అత్యాచార ఘటనపై శాఖా పరంగా పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని డీఎంఈ రాఘవేంద్రరావును ఆదేశించారు. దర్యాప్తు నివేదిక అందిన వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టంచేశారు. ఇక అత్యాచార ఘటనలో దోషులను కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి తానేటి వనిత వెల్లడిం చారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. విజయవాడలోని పాత ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు, ఆమె కుటుంబాన్ని శుక్రవారం మంత్రులు తానేటి వనిత, విడదల రజని, జోగి రమేష్, మాజీమంత్రి వెలంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, కలెక్టర్ ఢిల్లీరావు పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చెక్కును బాధితురాలికి అందజేసి, అన్ని విధాలా ఆదుకుంటామని వారి కి భరోసా ఇచ్చారు. అనంతరం తా నేటి వనిత మీడియాతో మాట్లాడుతూ.. ఘటన జరగడం దురదృష్టకరమని, నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. నిందితులను అరెస్టు చేశామన్నా రు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారని చెప్పా రు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ మహిళలపై ఎన్నో దాడులు జరిగాయని గుర్తుచేశారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఆర్థికసాయం అందించే కార్యక్రమాన్ని డైవర్ట్ చేసేందుకే ఈ టనను రాజకీయం చేశారని విమర్శించారు. వైద్య సిబ్బందిపైనా చర్యలు మంత్రి రజని మాట్లాడుతూ.. నిందితులు పెస్ట్ కంట్రోల్ ఉద్యోగులు కావడంతో ఆస్పత్రిలో పెస్ట్ కాంట్రాక్టుతో పాటు, సెక్యూరిటీ ఏజెన్సీలను తొలగిస్తున్నామన్నారు. సంఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, తమది బాధ్యత కలిగిన ప్రభుత్వమని మంత్రి జోగి రమేష్ అన్నారు. ప్రతిపక్ష నాయకులు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను మహిళ అని కూడా చూడకుండా అడ్డుకోవడం చాలా బాధాకరమన్నారు. బాధితురాలిని పరామర్శించిన వారిలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సబ్ కలెక్టర్ ప్రవీణ్చంద్ కూడా ఉన్నారు. -
విజయవాడ ఆస్పత్రి ఘటన.. బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం
సాక్షి, అమరావతి: విజయవాడ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, బాధ్యులపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు సీఎంఓ అధికారులకు ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని, ఆ కుటుంబానికి కూ.10 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణాలపై ఒక సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ కూడా చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడ ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. నిందితులు ఫాగింగ్ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించి.. వారిని విధులనుంచి తొలగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ ఆస్పత్రిలో సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫాగింగ్ ఏజెన్సీకి టెర్మినేషన్ నోటీసు జారీ చేశారు. సీఎస్ ఆర్ఎంఓకి షోకాజ్ నోటీసు జారీచేశారు. శాఖా పరంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు ఆదేశాలిచ్చారు. నివేదిక తర్వాత మరిన్ని చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించారు. చదవండి👉 విజయవాడ: టీడీపీ కార్యకర్తల వీరంగం.. వాసిరెడ్డి పద్మపై దాడి -
ఏలూరు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారంగా ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయవల్సిందిగా జిల్లా కలెక్టర్ను, ఎస్పీని ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధాని మోదీ సంతాపం న్యూఢిల్లీ: ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చదవండి: ఏలూరు: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి -
మృతులు పరాయి రాష్ట్రమైనా సరే ఆదుకోండి: సీఎం జగన్ ఆదేశాలు
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. రైలు ప్రమాద ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ నివేదించిన తాజా వివరాలను అధికారులు సీఎంకు అందించారు. రైలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించారని, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. మరణించిన వారిని గుర్తింపు కార్డులు ఆధారంగా ఇద్దరు అసోం రాష్ట్రానికి చెందినవారుగా తేల్చారన్నారు. మిగిలిన ముగ్గురిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారు కూడా వేరే రాష్ట్రానికి చెందినవారై ఉంటారని, ఇదే విషయాన్ని అధికారులు తెలిపారని సీఎంకు వివరించారు. ఈ ఘటనలో గాయపడ్డ ఒక వ్యక్తిని అదే రైలులో శ్రీకాకుళం తీసుకు వచ్చారని, వెంటనే అతన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారని వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే స్థానిక ఆర్డీఓ ప్రమాద స్థలాన్ని సందర్శించి అవసరమైన చర్యలు తీసుకున్నారని వివరించారు. గాయపడ్డ వ్యక్తికి అందుతున్న వైద్యాన్ని కలెక్టర్ స్వయంగా రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి పరిశీలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారని, అక్కడ అందుతున్న వైద్యంపైనా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. మరణించిన వారు పరాయి రాష్ట్రం వారైనా, మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలని ఆదేశాలు జారీచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఇవ్వాలని, ఈ సహాయం వెంటనే అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చదవండి: (శ్రీకాకుళంలో ఘోర రైలు ప్రమాదం.. సీఎం జగన్ దిగ్భ్రాంతి) -
ఘోర ప్రమాదం.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
గుజరాత్లో భరూచ్లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ఆరుగురు పనివాళ్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. అహ్మదాబాద్కు 235 కిలోమీటర్ల దూరంలోని దహేజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన అర్ధరాత్రి 3గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీలోని ఓ రియాక్టర్ దగ్గర పని చేస్తుండగా పేలుడు సంభవించి వాళ్లంతా మృత్యువాత పడ్డట్లు భరూచ్ ఎస్పీ లీనా పాటిల్ తెలిపారు. ప్రమాదంలో ఇంకెవరూ గాయపడలేదని వెల్లడించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి 2 లక్షల రూపాయల సాయం బాధిత కుటుంబాలకు అందజేయనున్నట్లు ట్వీట్ చేసింది ప్రధాని కార్యాలయం. అలాగే ఎవరైనా గాయపడితే రూ. 50 వేలు అందించనున్నట్లు తెలిపింది. PM @narendramodi has expressed grief on the loss of lives due to a mishap at a factory in Bharuch. He extends condolences to the bereaved families. An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of the deceased. The injured would be given Rs. 50,000. — PMO India (@PMOIndia) April 11, 2022 -
భాకరాపేట బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: తిరుపతి సమీపంలోని భాకరాపేట వద్ద ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మరణించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సహాయం అందించాలని, గాయపడ్డవారికి రూ. 50 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. అంతేకాకుండా బాధితులు కోలుకునేంతవరకూ క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలను, సహాయక చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారని వెల్లడించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారని సీఎంకు వివరించారు. క్షతగాత్రుల్ని తిరుపతిలోని స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని అన్నారు. చదవండి: (చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు) -
హైదరాబాద్ అగ్ని ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో తెల్లారిపోతుందనగా వారి జీవితాలు తెల్లారిపోయాయి. పొట్టకూటి కోసం నగరానికి వలస వచ్చిన కార్మికుల బతుకుల బుగ్గిపాలైంది. బోయిగూడ స్క్రాప్ గోడౌన్ అగ్ని ప్రమాదం పెను నగరంలో విషాదాన్ని నింపింది. అగ్నిప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. కాగా బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్లో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుందది. భారీగా మంటలు చెలరేగడం, దట్టమైన పొగ కమ్ముకోవడంతో గోడౌన్ పైకప్పు కూలింది. ఈ ఘటనలో బీహార్ చెందిన 11మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. హైదరాబాద్లోని భోయిగూడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. PMNRF నుండి ఒక్కొక్కరికి 2 లక్షలు ఎక్స్ గ్రేషియా మరణించిన వారి కుటుంబాలకు ఇవ్వబడుతుంది: PM @narendramodi — PMO India (@PMOIndia) March 23, 2022 -
విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం
సాక్షి,విజయనగరం: విజయనగరం జిల్లా కురుపాంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు పాముకాటుకు గురైన సంగతి తెలిసిందే. పాము కాటేసిన ముగ్గురు విద్యార్థులలో 8 తరగతి చదువుతున్న రంజిత్కుమార్ మృతి చెందాడు. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థి రంజిత్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. (చదవండి: విషాదం: ఆశల దీపాన్ని దేవుడు ఆర్పేశాడు.. ) -
వివాహ వేడుకల్లో విషాదం: 11 మంది మృతి.. మోదీ సంతాపం
లక్నో: ఉత్తర ప్రదేశ్లో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. ఖుషీనగర్ జిల్లాలోని నెబువా నౌరంగియా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 11 మంది బావిలో పడి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వివాహ కార్యక్రమానికి హాజరయిన వీరంతా బావి స్లాబ్పై కూర్చున్నారు. ఈ క్రమంలో అధిక బరువు కారణంగా స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో స్లాబ్పై కూర్చున్న 13 మంది బావిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో 9 మంది బాలికలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఖుషీనగర్ ప్రమాదంలో మరణించిన వారికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. UP | 11 people died & two are seriously injured after they accidentally fell into a well. During a wedding program, some people were sitting on a slab of a well and due to heavy load the slab broke. An ex-gratia of Rs 4 lakh will be given to the kin of the deceased: DM Kushinagar pic.twitter.com/6PHeVYATp0 — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 16, 2022 ప్రధాని మోదీ సంతాపం ఉత్తర ప్రదేశ్లోని ఖుషీనగర్లో జరిగిన ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటనను హృదయ విదారకంగా అభివర్ణించారు. మరణించిన కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవలని ప్రార్థించారు. उत्तर प्रदेश के कुशीनगर में हुआ हादसा हृदयविदारक है। इसमें जिन लोगों को अपनी जान गंवानी पड़ी है, उनके परिजनों के प्रति मैं अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं। इसके साथ ही घायलों के जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूं। स्थानीय प्रशासन हर संभव मदद में जुटा है। — Narendra Modi (@narendramodi) February 17, 2022 -
ముంబై అగ్ని ప్రమాదం.. పోటాపోటీ ఆర్థిక సాయం
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో శనివారం చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. దురదృష్టకర అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం ఇవ్వనుందని మంత్రి ఆదిత్యా ఠాక్రే తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ ముంబైలో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ముంబైలోని టార్డియోలో భవనం అగ్ని ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఒక్కొక్కరికీ రూ.2లక్షల ఎక్స్గ్రేషియాను మోదీ ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50వేలు అందజేస్తామమని పీఎంఓ వెల్లడించింది. PM Narendra Modi has approved an ex-gratia of Rs. 2 lakh each from Prime Minister’s National Relief Fund for the next of kin of those who have lost their lives due to the tragic hospital fire in Bhandara, Maharashtra. Rs 50,000 would be given to those seriously injured: PMO — ANI (@ANI) January 11, 2021 అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం: డిప్యూటీ సీఎం అజిత్ పవార్ టార్డియో ప్రాంతంలోని కమలా భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశించామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. మంత్రి ఆదిత్య ఠాక్రే, ముంబై నగర సంరక్షక మంత్రి అస్లాం షేక్ ఘటన స్థలాన్ని పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 15 మందిపైగా గాయపడ్డారని బృహన్ముంబై కార్పొరేషన్ అధికారులు తెలిపారు. చదవండి: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి -
బస్సు ప్రమాదం: సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రూ.5లక్షల ఎక్స్గ్రేషియా
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులో బస్సు పడిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. మంత్రి ఆళ్లనాని తీవ్ర దిగ్భ్రాంతి జిల్లేరు వాగులో బస్సు బోల్తా ఘటనలో 10 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రి బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను మంత్రి ఆళ్ల నాని అదేశించారు. ఈ ప్రమాదంలో 20మందికి పైగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం కోసం జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా అధికారులు వెంటనే ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. చదవండి: (జంగారెడ్డిగూడెంలో ఘోర బస్సు ప్రమాదం.. 9 మంది మృతి) -
ఆ కుటుంబానికి కోటి ఎక్స్గ్రేషియా.. ప్రభుత్వ ఉద్యోగం: సీఎం
భోపాల్: డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన నాయక్ జితేంద్ర కుమార్ వర్మ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఆదివారం ఉదయం ధామండ గ్రామంలో జితేంద్ర కుమార్ వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి సీఎం చౌహాన్ నివాళులర్పించారు. అనంతరం చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘అమర్ షహీద్ జితేంద్ర కుమార్ జీ ధమందాకే కాదు.. యావత్ దేశానికే గర్వకారణం. ఈ పుణ్యాత్ముడికి, ఆయన తల్లిదండ్రులకు, భార్యకు నేను వందనం చేస్తున్నాను' అని అన్నారు. చదవండి: (అడగండి అది మన హక్కు..పెట్రోల్ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం) అనంతరం తన ట్విటర్ ఖాతాలో.. 'హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు జితేంద్ర కుమార్ జీకి నేను నివాళులర్పిస్తున్నాను. అతని కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వబడుతుంది. అమరవీరుని భార్య, కుమార్తె సునీతను ప్రభుత్వ ఉద్యోగంలోకి తీసుకుంటాం. అతని పేరు మీద ఒక పాఠశాలకు 'అమర్ షహీద్ జితేంద్ర కుమార్ విద్యాలయ' అని పేరు పెట్టడం జరుగుతుంది. ధమండ గ్రామంలో సైనికుని జ్ఞాపకార్థం స్మారక చిహ్నం నిర్మించబడుతుంది అంటూ సీఎం చౌహాన్ ట్వీట్ చేశారు. చదవండి: (గంట వ్యవధిలో మూడు ఒమిక్రాన్ కేసులు.. థర్డ్వేవ్ తప్పించుకోలేమా?) కాగా, సెహోర్ జిల్లాకు చెందిన వర్మ అంత్యక్రియలు పూర్వీకుల గ్రామమైన ధమండాలో నిర్వహించారు. కార్యక్రమం మొత్తం అతని సోదరుడు దగ్గరుండి నిర్వహించాడు. ఆ సమయంలో వర్మ తండ్రి, 13 నెలల కొడుకు కూడా అక్కడే ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
వికేంద్రీకరణపై ప్రజల్లో అపోహ ఉంది: మంత్రి పేర్నినాని
సాక్షి, అమరావతి: మూడు రాజధానుల పరిపాలన వికేంద్రీకరణ బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు రాష్ట్రశాసన సభ ప్రకటించింది. ఈ సందర్భంగా మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. రాజధాని వికేంద్రీకరణపై ప్రజల్లో కొంత అపోహ ఉందని మంత్రి పేర్నినాని తెలిపారు. ఈ క్రమంలో.. మరోసారి అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుంటామని తెలిపారు. ఈ వికేంద్రీకరణ బిల్లు ఎందుకు పెట్టాం.. మూడు రాజధానుల అంశంపై మరోసారి ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తామని తెలిపారు. ఆయా జిల్లాల ప్రజల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోని.. త్వరలోనే పూర్తిస్థాయి బిల్లుతో ముందుకు వస్తామని మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. అదే విధంగా.. వరదలు, వర్షాలపై మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి పేర్నినాని తెలిపారు. ప్రతి ఇంటికి రూ. 2 వేలు, ఇతర నిత్యవసరాలు అందిస్తామని పేర్కొన్నారు. పునరావాసం కోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనికోసం ప్రజలు.. 104 సేవలను.. నాలుగు జిల్లాలకు మరింత విస్తృతంగా విస్తరిస్తున్నామని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులున్న104 సేవలు వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విధినిర్వహణలో ముగ్గురు ఉద్యోగులు చనిపోయారని.. వారి కుటుంబాలకు 25 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. భారీ వరదలకు.. 10 మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. వీరి కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామన్నారు. అదే విధంగా పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో రైతులకు విత్తనాలు సరఫరా చేస్తామని .. నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం తరపున పరిహారం ఇస్తామని తెలిపారు. వరద బీభత్సాన్ని ఎదుర్కొవడానికి అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామని మంత్రి పేర్నినాని తెలిపారు. -
బస్సు లోయలో పడిన ఘటన: బాధిత కుటుంబాలకు రూ.లక్ష పరిహారం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ బస్సులోయలో పడిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం లక్షచోప్పున ఎక్స్గ్రెషియాను ఇస్తున్నట్లు జిల్లా పాలనాధికారి రాజేశ్కుమార్ తెలిపారు. అదే విధంగా తీవ్రంగా గాయపడిన వారికి 40,000 వేల రూపాయలను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్న (ఆదివారం) బైల గ్రామం నుంచి వికాస్నగర్కు బయలు దేరిన బస్సు.. చక్రాటా అనే ప్రాంతంలో అదుపుతప్పి 300 అడుగుల లోతున పడింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన విషయం తెలిసిందే. చదవండి: 300 అడుగుల లోతున పడిన బస్సు.. 13 మంది మృతి -
జమ్మూ కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున థాత్రి నుంచి దోడాకు వెళ్తున్న మినీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ఒక్కొక్కరికి ₹ 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి ₹ 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారని పీఎంఓ తన అధికారిక ట్విట్టర్లో పేర్కొంది. చదవండి: Covid-19: టీకా తీసుకున్నా, రెండోసారి కరోనా బారిన మహారాష్ట్ర హోంమంత్రి -
Lakhimpur Incident: ‘మృతుల కుటుంబాలకు రూ.45లక్షల పరిహారం’
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, రైతుల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. ఆదివారం లఖీమ్పూర్ ఖేరీలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ.45లక్షలు, గాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. ఆదివారం ఉత్తరప్రదేశ్లోని లఖీమ్పూర్ ఖేరి జిల్లాలో రైతు ఆందోళన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. కేంద్రమంత్రి కుమారుడి కారు రైతులపైకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. ఆగ్రహంతో వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. నిరసనకారుల దాడిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, డ్రైవర్ మృతి చెందారు. సోమవారం లఖీమ్పూర్ ఖేరీలో ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు మృతి చెందారు. -
కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల ఎక్స్గ్రేషియా
న్యూఢిల్లీ: కోవిడ్ బారిన పడి మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియా సహాయాన్ని చెల్లించాలని నిర్ణయించినట్లు కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ మొత్తాన్ని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(రాష్ట్రాల విపత్తు సహాయ నిధి) ద్వారా ఎక్స్గ్రేషియా ఇస్తామని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే కోవిడ్ మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం ఇవ్వనుంది. ఈ మేరకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ గైడ్లైన్స్ విడుదల చేసింది. కాగా ఇప్పటి వరకు దేశంలో 4.45 లక్షలమంది మహమ్మారి బారిన పడి మరణించారు. అయితే ఇప్పటి వరకు మరణించిన వారితోపాటు భవిష్యత్తులోనూ కోవిడ్తో ప్రాణాలు విడిచిన వారందరికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. అయితే సదరు వ్యక్తి కోవిడ్ మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ మార్గదర్శకాల ప్రకారం సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఇదిలా ఉండగా ఇప్పటికే బిహార్ కోవిడ్తో మరణించిన వారికి లక్షలు, మధ్యప్రదేశ్ లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: Susmita Basak: వారి కోసం ప్రత్యేకంగా లోదుస్తులు, అవయవాలు.. -
24 గంటల్లో మత్స్యకారులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, శ్రీకాకుళం: మత్స్యకారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఆయన ఆదివారం బందరువానిపేట గ్రామానికి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుతో కలిసి వచ్చారు. పడవ బో ల్తా పడి మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాల ను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు మేర ఆర్థిక సాయం అందజేశారు. ప్రమాదం జరిగిన ఒక్క రోజులోనే ఆర్థిక సాయం అందించడంపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. మృతులు పుక్కళ్ల గన్నయ్య, పుక్కళ్ల గణేష్, రాయితీ సూర్యనారాయణ కుటుంబ సభ్యులకు చెక్లను అందజేయడంతో పాటు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున నగ దు సాయం కూడా ఆ కుటుంబాలకు అందించారు. మృతుల కుటుంబానికి వైఎస్సా ర్ ఫించను కానుక త్వరితగతిన మంజూరు చేయాల ని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సూచించారు. కార్యక్రమంలో తూర్పు కాపు చైర్మన్ మామిడి శ్రీకాంత్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, జిల్లా మత్స్యకార సంఘ అధ్యక్షుడు కోనాడ నర్సింహులు, మత్స్యశాఖ జేడీ పీవీ శ్రీనివాసరావు, ఎఫ్డీఓ బగాది సురేష్కుమార్, మైలపల్లి జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాకి ఒక హార్బర్ మంజూరు రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో గల ప్రతి జిల్లాకు ఒక హార్బర్ మంజూరు చేసినట్లు మంత్రి అప్పలరాజు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు బుడగట్లపాలేంకు మంజూరు చేశామని, త్వరలోనే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. మంచినీళ్లపేట వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే హార్బర్గా అప్గ్రేడ్ చేస్తామన్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా పనులు జరుగుతున్నాయని తెలిపారు. బందరువానిపేట లేదా కళింగపట్నం, ఇద్దివానిపాలేం, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రాళ్లపేటకు ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి నిపుణుల కమిటీ పర్యటన జరిగిందన్నారు. హార్బర్లు లేదా ఫ్లోటింగ్ జె ట్టీల నిర్మాణం తర్వాత అత్యాధునిక బోట్లు మంజూరు చేసి మత్స్య సంపద దొరికేలా ప్రణాళిక వేస్తున్నామని వెల్లడించారు. -
గొల్లపల్లి వద్ద రోడ్డుప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా
సాక్షి, కృష్ణాజిల్లా: మార్చిలో గొల్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి రాష్ట్రప్రభుత్వం ఎక్స్గ్రేషియా మంజూరు చేసింది. బాధిత గిరిజన కుటుంబాలకు ఆర్థిక సహాయం ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే మెకాప్రతాప్ అప్పారావు ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్ధన మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మృతులు 7 గురికి ఒక్కొక్కరికి రూ.5లక్షలు, తీవ్రంగా గాయపడిన 7గురికి ఒక్కొక్కరికి రూ.1లక్ష చొప్పున మొత్తం 42 లక్షల ఏక్సిగ్రేషియోను ప్రభుత్వం మంజూరు చేస్తూ జి.ఓ.జారీ చేసింది. కాగా నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద మార్చి 14 న జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దార్ధనగర్ గిరిజన కుటుంబాల సభ్యులు మృతి చెందగా, కొందరు తీవ్రంగా గాయపడ్డారు. -
జవాన్ జశ్వంత్రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత
సాక్షి, గుంటూరు: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ జశ్వంత్రెడ్డి భౌతికకాయం వద్ద ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, హోంమంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్ వివేక్ యాదవ్ నివాళులు అర్పించారు. అనంతరం జవాన్ జస్వంత్రెడ్డి కుటుంబానికి రూ. 50 లక్షల చెక్కును హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అందించారు. తర్వాత హోంమంత్రి మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. జస్వంత్రెడ్డి యువతకు స్ఫూర్తిదాయకమని, అతి చిన్న వయసులోనే అతను మరణించటం బాధాకరమన్నారు. దేశ రక్షణ కోసం తన ప్రాణాలు కోల్పోయిన జస్వంత్ త్యాగం మరువ లేనిదని కొనియాడారు. దేశం కోసం బిడ్డ ప్రాణాలు ఇచ్చిన అతని తల్లిదండ్రుల జన్మ చరితార్థమని, ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. జస్వంత్ వంటి సైనికుల బలిదానాల వల్లే మనం క్షేమంగా ఉన్నామని, ముఖ్యమంత్రి సీఎం జగన్ ప్రకటించిన రూ. 50 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను కుటుంబ సభ్యులకు అందించామని పేర్కొన్నారు. జశ్వంత్ రెడ్డి తల్లిదండ్రులు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అడుగుతున్నారని, దానిపై సీఎం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ.. చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన జస్వంత్ రెడ్డి అందరికీ స్ఫూర్తిదాయకమని, అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. వీర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, దేశం కోసం జస్వంత్ రెడ్డి ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉందదని తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలోని కొత్తపాలెం స్మశానవాటికలో జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక సైనిక లాంఛనాలతో పూర్తి అయ్యాయి. -
హేతుబద్ధంగా వనరుల వినియోగం
న్యూఢిల్లీ: దేశ వనరులను హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా ఉపయోగించాలన్నదే తమ ఉద్దేశమని, అందుకే కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వలేకపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇందులో ఆర్థిక భారం ప్రసక్తే లేదని, అది కారణం కాదని పేర్కొంది. కరోనా బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లపై న్యాయస్థానం తన తీర్పును జూన్ 21న రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం 39 పేజీల అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోందని, ఇది జీవిత కాలంలో ఒకసారి ఎదురయ్యే విపత్తు అని పేర్కొంది. ఈ పరిణామాన్ని ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు గుర్తుచేసింది. నిపుణుల సూచన ప్రకారం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్(ఎస్డీఆర్ఎఫ్)తోపాటు సంచిత నిధి నుంచి సైతం నిధులు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది. 2015 నుంచి 2020 వరకూ అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. జాతీయ స్థాయిలో గుర్తించిన 12 రకాల విపత్తులకే ఆర్థిక సాయం అందించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ జాబితాలో ‘కరోనా వ్యాప్తి’ లేదని వివరించింది. అయినప్పటికీ సహజ విపత్తుల వల్ల నష్టపోయిన వారికోసం ఎస్డీఆర్ఎఫ్ నుంచి 10 శాతం నిధులు ఖర్చు చేయవచ్చని వెసులుబాటు కల్పించినట్లు గుర్తుచేసింది. జులై చివరికల్లా 51.6 కోట్ల డోసులు జులై చివరికల్లా రాష్ట్రాలకు 51.6 కోట్ల డోసులు అందిస్తామని, అందులో ఇప్పటికే 35.6 కోట్ల డోసులు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా పిల్లలకు వ్యాక్సిన్పై కోర్టుకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్న జైడస్ క్యాడిలా 12–18 ఏళ్ల లోపు వారిపై ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసిందని, కోవాగ్జిన్కు 2–18 ఏళ్లలోపు పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డీసీజీఐ అనుమతి ఇచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. చట్టబద్ధమైన అనుమతులు లభిస్తే సమీప భవిష్యత్తులో పిల్లలకు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో వస్తాయని కోర్టుకు తెలిపింది. భవిష్యత్తులో మరోవేవ్ వస్తే ఎదుర్కొనేలా రాష్ట్రాలను నిరంతరం సిద్ధం చేస్తున్నామని, మౌలిక సదుపాయాలను పెంచుతున్నామని పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా మరోవేవ్ వచ్చే అవకాశాలు.. వైరస్ మ్యుటేషన్లు, ప్రజలు తగిన కోవిడ్ ప్రొటోకాల్ను పాటించడంపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది. ► దేశంలో 18 ఏళ్లు దాటినవారు పేదలైనా, ధనవంతులైనా కరోనా టీకా ఉచితంగా పొందడానికి సరిసమానంగా అర్హులేనని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అర్హులందరికీ సురక్షితమైన, ప్రభావవంతమైన టీకాను సాధ్యమైనంత త్వరగా ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించింది. ► కరోనా టీకా కోసం కోవిన్ పోర్టల్లో ముందే అపాయింట్మెంట్ పొందడం, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సెల్ఫ్–రిజిస్ట్రేషన్ తప్పనిసరేమీ కాదని కేంద్రం స్పష్టం చేసింది. నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకొని, టీకా పొందవచ్చని సూచించింది. -
కోవిడ్తో మరణించిన జర్నలిస్టులకు రూ.2 లక్షలు
నాంపల్లి (హైదరాబాద్): సీనియర్ జర్నలిస్టులతో సహా దాదాపు 70 మంది జర్నలిస్టులు కోవిడ్తో మృతి చెందారని, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని మీడియా అకాడమీ నిర్ణయించిందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. బాధిత కుటుంబాలకు ఐదేళ్ల పాటు నెలకు రూ.3 వేల రూపాయల పింఛన్ లభిస్తుందని పేర్కొన్నారు. మరణించిన జర్నలిస్టు కుటుంబంలో పదవ తరగతి లోపు చదువుకుంటున్న వారిలో గరిష్టంగా ఇద్దరికి వెయ్యి రూపాయల చొప్పున ఉపకార వేతనం అందుతుందని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడిన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.5.15 కోట్లు ఆర్థిక సహాయం చేసి ఆదుకుందని వివరించారు. మీడియా అకాడమీ ఆర్థిక సహాయం పొందేందుకు దరఖాస్తులను కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి,ఇంటి నం.10–2–1, సమాచార భవన్, రెండవ అంతస్తు, ఏసీగార్డ్స్, మాసబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్కు పంపాలని కోరారు -
కొవిడ్ పరిహారం 4 లక్షలు.. ఏం తేల్చారు?
న్యూఢిల్లీ: కొవిడ్-19తో మరణించిన బాధితులకు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించే విషయంపై సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ అభ్యర్థనల వ్యహారంలో ఏం తేల్చారని శుక్రవారం సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆరా తీసింది. దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, సహేతుకమైన ఈ అంశం పరిశీలనలో ఉందని, దీనిపై బదులు ఇవ్వడానికి మరికొంత టైం కావాలని కోర్టును కోరాడు. బిహార్ ప్రభుత్వం కరోనా వైరస్తో చనిపోయిన బాధితులకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద నాలుగు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ విషయం మీడియా ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని బెంచ్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ అభ్యర్థనల విషయంలో ఏం తేల్చారని, కరోనా మరణాల ఎక్స్గ్రేషియా స్పష్టమైన రూల్స్ తెలపాలని బెంచ్ కోరింది. అంతేకాదు మరో పిటిషన్లో కొవిడ్ డెత్ సర్టిఫికెట్లు మంజూరు చేయడంలో అవకతవకలు, జాప్యం జరుగుతోందన్న ఆరోపణలపై ఏం స్పందిస్తారని కోర్టు ఆరా తీసింది. దీనిపై మెహతా స్పందిస్తూ.. ఈ సమస్యలు తమ దృష్టికి వచ్చా యని, వీటిని పరిష్కరించడంపైనే కేంద్రం దృష్టి సారించిందని పేర్కొన్నాడు. అయితే సొలిసిటర్ జనరల్ రెండువారాల గడువు కోరగా కోర్టు అందుకు ఒప్పుకోలేదు. మే 24నే పిటిషన్లు దాఖలు కావడంతో.. ఇంకెంత గడువు ఇవ్వాలని బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 18న కేంద్రం తన వివరణను అందించాలని డెడ్లైన్ విధిస్తూ, జూన్21న తదుపరి విచారణ ఉంటుందని మెహతాకు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 12(ii) ప్రకారం.. కరోనాతో చనిపోయిన వాళ్లకు నాలుగు లక్షల ఎక్స్గ్రేషియా ఇప్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అంతేకాదు బాధిత కటుంబాల బాధ్యతల్ని ప్రభుత్వాలే భరించాలని ఓ పిటిషన్దారుడు పేర్కొన్నాడు. ఇక మరో పిటిషన్లో కొవిడ్ మరణాల సర్టిఫికెట్ల జాప్యంపై పేర్కొనగా, ఐసీఎంఆర్ గైడ్లెన్స్ ప్రకారం సర్టిఫికెట్లు మంజూరు చేయాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. చదవండి: వాక్సినేషన్.. దేవుడ్ని ప్రార్థించండి -
బెంగాల్లో పిడుగులు పడి 20 మంది మృతి
కోల్కతా: పశ్చిమబెంగాల్లో సోమవారం పిడుగులు పడటంతో మూడు జిల్లాల్లో 20 మంది మరణించారని రాష్ట్ర విపత్తు నిర్వహణాధికారులు వెల్లడించారు. ముర్షిదాబాద్, హుగ్లీ జిల్లాల్లో 9 మంది చొప్పున మరణించగా, పూర్వ మేడినిపూర్ జిల్లాలో ఇద్దరు మరణించారు. ముర్షిదాబాద్ జిల్లాలో మరో ముగ్గురు గాయపడ్డారని, జంగిపూర్ ఆస్పత్రిలో వీరు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. గాయపడిన వారికి రూ. 50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో రుతుపవనాలు బెంగాల్ను తాకనున్న నేపథ్యంలో ఈ మెరుపులు రావడం గమనార్హం. -
కొవిడ్ మృతుల కుటంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం
భోఫాల్: మధ్యప్రదేశ్లో కరోనా విజృంభన కొనసాగుతుంది.కరోనా మృతుల విషయంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి వల్ల మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. గురువారం ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించించిన అనంతరం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వల్ల తమ వారిని కోల్పోయిన లోటు తీరలేనదని, ఆ బాధలలో ఉన్నవారికి కొంత ఉపసమనం కలిగించాలని నిర్ణయించామని సీఎం అన్నారు. ఇందులో భాగంగా వారికి కొంతమేరకు కొంత ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.కరోనా బారినపడినవారిని కాపాడాలని తాము తీవ్రంగా ప్రయత్నించం ,కానీ రక్షించలేకపోయాం. అందువల్ల వారిని వారి కుటుంబాలకు రూ.లక్ష నష్టపరిహారం ఇస్తుమని వెల్లడించారు. కాగా, ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు కరోనాతో చనిపోతే వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు అక్కడి ప్రభుత్వం అందిస్తున్నది. (చదవండి:పెళ్లికి వెళ్లిన అతిథులు.. ఊహించని పని చేసి వచ్చారు) -
అనాథలైన చిన్నారులకు రూ.10 లక్షల డిపాజిట్
సాక్షి, అమరావతి: కోవిడ్ సోకి తల్లిదండ్రులు మృతిచెంది అనాథలైన చిన్నారులకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనుంది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇలాంటివారిని గుర్తించి తక్షణమే నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎక్స్గ్రేషియాకు అర్హులైనవారి పేరుతో ఏదైనా జాతీయ బ్యాంకులో రూ.10 లక్షలు జమ చేసి బాండ్ను వారికి అప్పగిస్తారని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. వారికి 25 ఏళ్ల వయసు నిండాక మాత్రమే ఈ డబ్బు తీసుకునేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. అప్పటివరకు ఈ డిపాజిట్పై వచ్చే వడ్డీని నెలవారీగానీ, మూడు నెలలకు ఒకసారిగానీ తీసుకోవచ్చని తెలిపారు. ఎక్స్గ్రేషియాకు అర్హులైన అనాథ చిన్నారులను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ చైర్మన్గా కమిటీ వేశారు. జిల్లా వైద్యాధికారి సభ్యులుగా ఉండే ఈ కమిటీకి స్త్రీ శిశుసంక్షేమశాఖ పీడీ మెంబర్ కన్వీనర్గా ఉంటారు. వచ్చిన దరఖాస్తులను ముందుగా స్త్రీ శిశుసంక్షేమశాఖ పీడీ పరిశీలించి కలెక్టర్కు పంపిస్తారు. ఎక్స్గ్రేషియాకు ఇవీ అర్హతలు ► దరఖాస్తు తేదీ నాటికి 18 ఏళ్లలోపు వయసు ఉండాలి ► కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన వారి పిల్లలు ► తల్లిదండ్రుల్లో ఒకరు ఇంతకుముందే మరణించి, ఇప్పుడు కోవిడ్ కారణంగా మరొకరు మృతిచెందిన వారి పిల్లలు ► కుటుంబ ఆదాయం దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి ► కోవిడ్ పాజిటివ్ రిపోర్టును విధిగా చూపించాలి ► ఇతర బీమా సంస్థల నుంచి లబ్ధి పొందనివారు మాత్రమే అర్హులు. -
కరోనాతో మహిళా వలంటీర్ మృతి.. రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా
సాక్షి, తూర్పు గోదావరి: తూర్పు గోదావరి జిల్లాలో వలంటీర్గా పని చేస్తున్న ఎరుసు లక్ష్మీ కరోనాతో మృతి చెందింది. ఆమె రమణయ్య పేట-3 గ్రామ సచివాయం వలంటీర్గా పని చేస్తుంది. కరోనా రావడంతో జిజిహెచ్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ లక్ష్మీ కన్నుమూసింది. ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్మీ మృతి పట్ల సంతాపం తెలుపుతూ రూ.5 లక్షలను సాయంగా ఆమె కుటుంబానికి అందజేయాలని ఆదేశించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. ( చదవండి: ‘వలంటీర్’ సేవ; ఆత్మ బంధువులే తోడుగా.. ) -
హోటల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు: తీవ్ర విషాదం
సాక్షి, పట్నా: బిహార్లోని నలందా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జెహానాబాద్ జిల్లా నుంచి వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు రోడ్డు పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. దీంతో సిబ్బందితో సహా 8 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతను రాజేసింది. నలందా జిల్లాలోని తెలహాడ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. అతివేగంతో దూసుకువచ్చిన ట్రక్కు అదుపుతప్పి టెల్హడా ప్రాంతంలోని హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో హోటల్ సిబ్బందితోపాటు కస్టమర్లు కూడా ఉన్నారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ ట్రక్కును అక్కడే వదిలేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలకు తరలిస్తున్న క్రమంలో కోపోద్రిక్తులైన స్థానికులు ట్రక్కుకు నిప్పంటించారు. పోలీసులు, అధికారులు, వాహనాలపై కూడా రాళ్లు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది. మరోవైపు ఈ ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు వెంటనే కోలుకోవాలన్నారు. -
వలంటీర్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, శ్రీకాకుళం: రెండు రోజుల క్రితం జిల్లాలోని పలాసలో కరోనా వ్యాక్సిన్ వికటించి వలంటీర్ పిల్లా లలిత మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరణించిన వలంటీర్ లలిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 50 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన లలితతో పాటు మరో 8 మంది వలంటీర్లు, వీఆర్వో ప్రసాద్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అప్పటి నుంచి అందరికీ స్వల్పంగా జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. లలితలో ఈ లక్షణాలు తీవ్రంగా ఉండటంతో ఇంట్లోనే ఉంటూ టాబ్లెట్లు వేసుకున్నారు. కానీ లాభం లేకపోయింది. అస్వస్థతకు గురైన లలిత ఫిబ్రవరి 8(సోమవారం) తెల్లవారుజామున మృతి చెందారు. -
రోడ్డు ప్రమాద మృతులకు రూ. 25 లక్షలు ఇవ్వాలి: బీజేపీ
సాక్షి, పెద్దఅడిశర్లపల్లి/కొండమల్లేపల్లి: నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజీ సమీపంలోని హైదరాబాద్ – నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక నేడు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు. దేవరకొండ ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత ఇక ప్రమాదంలో మరణించిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాల్సిందిగా బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దేవరకొండ ప్రభుత్వాస్పత్రి బయట ఆందోళన చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం: సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి) దేవరకొండ మండలం చింతబాయి గ్రామానికి చెందిన 20 మంది కూలీలు పెద్ద అడిశర్లపల్లి మండల పరిధిలోని రంగారెడ్డిగూడెం, పోతునూరు గ్రామాల్లో వరి నాట్లు వేసేందుకు ఆటోలో వెళ్లారు. సాయంత్రం పని ముగించుకుని అదే ఆటోలో తిరుగు పయనమయ్యారు. పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట క్రాస్రోడ్ సమీపంలోని ఎస్ఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే హైదరాబాద్ నుంచి సాగర్ వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఓ లారీ ఓవర్టేక్ చేయబోయింది. ఈ క్రమంలో ఎదురుగా కూలీలు వెళ్తున్న ఆటోను లారీ వేగంగా ఢీ కొట్టింది. బొలోరో వాహనం కూడా అదుపుతప్పి బోల్తాపడింది. -
నివర్ తుపాన్: మృతులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా
-
చక్రవడ్డీ మాఫీపై ఆర్థిక శాఖ వివరణ
న్యూఢిల్లీ: మారటోరియం వ్యవధిలో రుణాలపై చక్రవడ్డీ మాఫీపై కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. సాధారణ వడ్డీ, చక్రవడ్డీకి మధ్య వ్యత్యాసాన్ని రుణ గ్రహీతల ఖాతాల్లో బ్యాంకులు జమ చేసే అంశంపై స్పష్టతనిచ్చింది. ఎక్స్గ్రేషియా లెక్కింపునకు ఫిబ్రవరి 29 నాటికి బాకీ ఉన్న అసలు మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని పేర్కొంది. రూ. 2 కోట్ల దాకా ఎంఎస్ఎంఈ, విద్య, గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల బకాయిలు మొదలైన వాటికి ఈ స్కీము వర్తిస్తుంది. ఫిబ్రవరి ఆఖరు నాటికి ఇవి మొండిపద్దులుగా మారి ఉండకూడదు. మార్చి 1 నుంచి ఆగస్టు 21 దాకా కాలానికి (184 రోజులు) రీఫండ్ చేస్తారు. మారటోరియం ఎంచుకున్న వారికి, ఎంచుకోని వారికి, పాక్షికంగా ఉపయోగించుకున్న వారికి కూడా ఎక్స్గ్రేషియాను చెల్లిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనక్కర్లేదు. నవంబర్ 5 కల్లా రుణగ్రహీతల ఖాతాల్లో ఎక్స్గ్రేషియా జమ చేయాలంటూ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని బ్యాంకులకు కేంద్రం తర్వాత రీయింబర్స్ చేస్తుంది. -
భారీ వరదలు: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : గతవారం రోజులుగా తెలంగాణ ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు, వరదలతో మృతిచెందిన 50 మంది కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 101 చెరువుల కట్టలు తెగాయని, 7.35 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగాయని తెలిపారు. వరదల కారణాంగా సంభవించిన పంట నష్టం 2 వేల కోట్లు ఉంటుందని సీఎం కేసీఆర్ అంచనా వేశారు. ఈ మేరకు భారీవర్షాలు, వరదలపై గురువారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. (భారీ వరద: ఏ క్షణామైనా తెగిపోయే ప్రమాదం) సమీక్ష సందర్భంగా అధికారులతో కేసీఆర్ మాట్లాడుతూ..‘1916 తర్వాత ఒకేరోజు హైదరాబాద్లో 31 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీనివల్ల చాలా ప్రాంతాలు జలమయ్యాయి. ఎఫ్పీఎల్ పరిధిలో ఉన్న కాలనీల్లో పెద్దఎత్తున నీరు చేరింది. కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 11 మంది మృతిచెందారు. అపార్ట్మెంట్ల సెల్లార్లో కూడా నీరు చేరడంతో ప్రజలకు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్లోని 72 ప్రాంతాల్లో 144 కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి. 35 వేల కుటుంబాలు వరద ముంపునకు గురయ్యాయి. (మరో 3 రోజులపాటు తెలంగాణలో వర్షాలు) ఎల్బీనగర్, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లలో.. వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. హైదరాబాద్లో 72 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రతిరోజు లక్షా 10 వేల మందికి భోజన వసతి కల్పిస్తున్నాం. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించాం. ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు, ప్రతి ఇంటికి 3 రగ్గులు అందించాలి. సహాయక కార్యక్రమాల కోసం జీహెచ్ఎంసీకి రూ.5 కోట్లు విడుదల చేశాం. ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్త ఇల్లు మంజూరు చేస్తాం. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు ఆర్థిక సహాయం అందిస్తాం. సెల్లార్లలో నీటిని తొలగించిన తర్వాతే అపార్ట్మెంట్లకు విద్యుత్ సరఫరా ఇవ్వాలి. ఒకట్రెండు రోజులు ఇబ్బంది కలిగినా ప్రాణనష్టం ఉండకూడదు. విద్యుత్ అధికారులకు ప్రజలు కూడా సహకరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 వేల కోట్లకు పైగా నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చాం’ అని పేర్కొన్నారు. కాగా తక్షణ సహాయం, పునరావాస చర్యల కోసం.. రూ.1350 కోట్లు సహాయాన్ని అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేసీఆర్ రాశారు. -
ఏపీ ప్రభుత్వం ఇచ్చినట్లు నష్టపరిహారం ఇవ్వాలి
చాదర్ఘాట్ (హైదరాబాద్): ఆంధ్రప్రదేశ్లో ఎల్జీ పాలిమార్స్ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు అక్కడి ప్రభుత్వం రూ. కోటి నష్టపరిహారం ప్రకటించిన తీరుగా.. తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీశైలం ప్రమాద బాధితులకు రూ. కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎంపీ రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ ఆజంపురలోని ఏఈ ఫాతిమా కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, మంత్రి జగదీశ్వర్రెడ్డి, సీఎండీ ప్రభాకర్రావులపై కేసు నమోదు చేయాలన్నారు. ఇంతవరకు మంత్రి వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతురాలు ఫాతిమా మెరిట్ విద్యార్థి అని, ఆమె కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఇక్కడ ఎంపీ రేవంత్ వెంట మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఉన్నారు. గవర్నర్కు లేఖ..: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం వెనుక మానవ తప్పిదం ఉందని, ఈ ఘటనకు కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు లేఖ రాశారు. ప్రమాద బాధ్యులపై చర్యలు తీసుకునేలా సీఎం కేసీఆర్ను ఆదేశించాలని కోరారు. ప్రమాదం జరిగే అవకాశాలపై అక్కడి సిబ్బంది రెండ్రోజుల క్రితమే హెచ్చరించినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఆ లేఖలో ఆరోపించారు. -
శ్రీశైలం ప్రమాదం: పరిహారం ప్రకటించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డీఈ శ్రీనివాస్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే ఏఈలతో పాటు సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాషియా ప్రకటించి అండగా నిలిచింది. అంతేకాకుండా మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రమాదం అనంతరం అత్యున్నత స్థాయి అధికారులతో అత్యవసర సమావేశమైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. (విషాదం: లోపలున్న 9 మందీ మృతి) గురువారం అర్థరాత్రి అనంతరం చోటుచేసుకున్న ప్రమాదంలో 9 మంది దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుని చనిపోయిన విషయం తెలిసిందే. ఘటనలో మరో 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంపై సీఎం కేసీఆర్ ఇదివరకు విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది ఉద్యోగులు మృత్యువాత పడటం బాధకరమన్నారు. మృతుల వివరాలు 1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ 2.AE వెంకట్రావు, పాల్వంచ 3.AE మోహన్ కుమార్, హైదరాబాద్ 4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్ 5.AE సుందర్, సూర్యాపేట 6. జూనియర్ ప్లాంట్ ఆపరేటర్ రాంబాబు, ఖమ్మం జిల్లా 7. జూనియర్ ప్లాంట్ ఆపరేటర్ కిరణ్, పాల్వంచ 8. టెక్నీషియన్ మహేష్ కుమార్ 9.హైదరాబాద్కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ ఉద్యోగి వినేష్ కుమార్ -
మృతుల కుటుంబాలకు కేంద్రం ఆర్థిక సాయం
సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడ అగ్నిప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50వేలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి నిధులను విడుదలు చేసింది. ఇక ఇప్పటికే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.50లక్షల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, విజయవాడలోని ఏలూరు రోడ్డు చల్లపల్లి బంగ్లా సమీపంలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో నిర్వహిస్తున్న ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో 30 మంది చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనలో 10మంది ప్రాణాలు కోల్పోయారు. (విజయవాడ అగ్ని ప్రమాదం: 10 మంది మృతి) -
మృతుల కుటుంబాలకు ఎయిరిండియా ఎక్స్గ్రేషియా
సాక్షి,తిరువనంతపురం: కేరళ కోళీకోడ్ విమాన ప్రమాదంపై ఎయిరిండియా ఎక్స్ప్రెస్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. ఈ ఘటన చాలా దురదృష్టకరమైనదిగా అభివర్ణించింది. ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించిది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. (కోళీకోడ్ ప్రమాదం : అచ్చం అలానే జరిగింది) 12 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మృతుల కుటుంబాలకు 10లక్షల రూపాయలు, 12 ఏళ్లలోపు మృతుల కుటుంబీకులకు 5 లక్షల రూపాయలు చొప్పున తక్షణ మధ్యంతర పరిహారం చెల్లించనున్నామని ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే తీవ్రంగా గాయపడిన ప్రయాణికులకు 2 లక్షలు, గాయపడినవారికి 50 వేలు చెల్లిస్తామని పేర్కొంది. బీమా నిబంధనల ప్రకారం బాధితులకు సంబంధిత పరిహారం చెల్లిస్తామని చెప్పింది. ప్రయాణీకులకు తగిన సమాచారాన్ని అందించేందుకు సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 1800222271టోల్ ఫ్రీ నంబర్ ను ప్రకటించింది. (ఘోర ప్రమాదం : ఎంత విషాదమీ దృశ్యం) మరోవైపు కేరళ ప్రభుత్వం కూడా పరిహారాన్ని ప్రకటించింది. 10 లక్షల రూపాయలను మృతుల కుటుంబాలకు చెల్లిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. అలాగే గాయపడిన వారి చికిత్స ఖర్చులను మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. (విమాన ప్రమాదం : కరోనా కలకలం) -
‘హాజీపూర్’ ఘటన; అమలు కాని హామీలు
బొమ్మలరామారం (ఆలేరు) : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది హాజీపూర్ ముగ్గురు బాలికల వరుస హత్యల సంఘటన. ఈ ఘోరం జరిగి 16 నెలలు గడుస్తున్నా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం భరోసా అందించడంలో విఫలం అయింది. నల్లగొండ పోక్సో కోర్టు ఫిబ్రవరి 6న సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్రెడ్డికి ఉరి శిక్ష విధించింది. కోర్టు తీర్పుతో బాధిత కుటుంబ సభ్యులు కొంత ఊరట పొందారు. కాని నిందితుడికి ఉరి శిక్ష అమలు కోసం బాధిత కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందిన పరిహారం తమను పరిహాసం చేస్తుందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబసభ్యులతోపాటు గ్రామస్తుల ప్రధాన డిమాండ్ అయిన హాజీపూర్ గ్రామ సమీపంలోని వాగుపై బ్రిడ్జి నిర్మాణం హామీ ఇంకా అమలుకాలేదు. నెరవేరని డిమాండ్లు.. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా, బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం ప్రకటించింది. మూడు బాధిత కుటుంబాల వారు నిరుపేదలే.. లీగల్ సెల్ నుంచి సైతం నేటికీ ఎలాంటి సహాయ సహకారాలు అందకపోవడంతో వారు ఆందోళనలో ఉన్నారు. ఉపాధి కోసం ఉద్యోగం లేదు, శిథిలావస్థలో చేరుకున్న ఇళ్లలోనే కాలం వెల్లదీస్తున్నారు. ఏ ఒక్క హామీ నెరవేరకపోవడంతో బాధితులు ప్రభుత్వ సాయం వైపు ధీనంగా ఎదురుచూస్తున్నారు. దయనీయ స్థితిలో మైసిరెడ్డిపల్లి బాధిత కుటుంబం.. సైకో శ్రీనివాస్రెడ్డి దురాగతాలకు బలైన ముగ్గురు బాలికల కుటుంబాల వారు నిరుపేదలే. వీరిలో ఇద్దరు హాజీపూర్ గ్రామానికి చెందిన వారు కాగా, మరో అమ్మాయిది మైసిరెడ్డిపల్లి గ్రామం. ఈ కుటుంబాన్ని విధి వెక్కిరించి మరింత దయనీయంగా మారింది. మృతురాలికి ఉన్న ఒక్క తమ్ముడు దివ్యాంగుడు. ఇతనికి ప్రభుత్వం పరంగా నాణ్యమైన వైద్యం అందజేస్తామని పింఛన్ మంజూరు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినా నెరవేరలేదు. పింఛన్ కోసం మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నా నేటికీ మంజూరు కాలేదు. ఎప్పుడు కూలుతుందో తెలియని స్థితిలో ఉన్న ఇంటిలోనే కాలం వెల్లదీస్తున్నారు. అందిన సాయం లక్షలోపే.. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి అందిన సాయం రూ. లక్షలోపే ఉంది. బీసీ కార్పొరేషన్ నుంచి రూ. 50 వేల చొప్పున రుణ సాయంతోపాటు మరో రూ. 25 వేల చొప్పున ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 75 వేల ఆర్థిక సాయం మాత్రమే అందింది. కల్పన కుటుంబ సభ్యులు: పెద్దసార్లు కనికరించాలి కూతురు పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్నాం. సర్కారు నుంచి సాయం చేస్తామని మాటిచ్చి ఏడాది దాటింది. ఇకనైనా తమను ఆదుకునేలా పెద్దసార్లు కనికరించాలి. సైకో శ్రీనివాస్ రెడ్డిని వెంటనే ఉరితీయాలి. మా పిల్లల ఉసురు తీసునోన్ని ఇంకా ఎన్ని రోజులు మేపుతారో అర్థం కావడం లేదు. – తిప్రబోయిన మల్లేష్, బాధితురాలి తండ్రి, హాజీపూర్ మనీషా కుటుంబ సభ్యులు : ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాం ఘటన జరిగి 16 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నాం. తమ్ముడు దివ్యాంగుడు కావడంతో నాకు ఉద్యోగం కల్పిస్తే మా కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. ఇల్లు కూడా ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరీ చేసి ఎక్స్గ్రేషియా అందజేయాలి. నిందితుడిని ఉరి తీసిన రోజే మాకు సంపూర్ణ న్యాయం జరిగినట్లు. – తుంగని మీనా, బాధితురాలి సోదరి, మైసిరెడ్డిపల్లి హామీలు అమలు కాలేదు మా కూతురు మృత్యువాత పడి ఏడాది దాటినా ప్రభుత్వ హామీలు అమలు కాలేదు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటారని ఎదురుచూస్తున్నాం. కాని కాలయాపన జరుగుతోంది. మమ్మల్ని ఆదుకునేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలి. నిందితుడిని ఉరి తీయకుండా ప్రజాధనంతో మేపుతున్నారు. శ్రీనివాస్రెడ్డిని ఉరి తీసినప్పుడే పిల్లల ఆత్మలు శాంతిస్తాయి. – పాముల నర్సింహ, బాధితురాలి తండ్రి, హాజీపూర్ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం హాజీపూర్ బాధితులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి, లీగల్ సెల్ అథారిటీకి నివేదికలు పంపాం. బొమ్మలరామారం మండలంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు పనులు ప్రారంభించగానే బాధితులకు ఇళ్ల నిర్మాణం చేపడుతాం. బాధిత కుటుంబంలోని ఒకరికి విద్యార్హతను నిర్ధారించి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. – కలెక్టర్ అనితా రామచంద్రన్ -
హిందూస్థాన్ షిప్యార్డ్ మృతుల కుటుంబాలకు భారీ పరిహారం
-
మృతుల కుటుంబాలకు భారీ పరిహారం
సాక్షి, విశాఖపట్నం : హిందూస్థాన్ షిప్యార్డ్ ప్రమాదంపై యాజమాన్యంతో మంత్రి అవంతి శ్రీనివాస్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయల సహాయం ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకుంది. అలాగే మృతుల కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. (చదవండి : కుప్పకూలిన భారీ క్రేన్) కాగా, షిప్ యార్డ్ మృతులకు రూ.50లక్షల పరిహార ప్రకటనపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పెద్దమొత్తంలో ఎక్స్గ్రేషియా ప్రకటించినందుకుగాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కార్మిక సంఘం నాయకులు మంత్రి రాజశేఖర్, బద్రీనాథ్, రఘు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, భారత రక్షణ రంగ సంస్థ ఆధీనంలో ఉన్న హిందూస్థాన్ నౌకా నిర్మాణ కేంద్రంలో శనివారం ట్రయల్ రన్ జరుగుతుండగా ఈ భారీ క్రేన్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. -
డాక్టర్ గుప్తా కుటుంబానికి రూ. కోటి పరిహారం
ఢిల్లీ : కరోనాతో పోరాడుతూ మరణించిన వైద్యుడు అసీమ్ గుప్తా (52 ) కుటుంసభ్యులను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా నష్ట పరిహారంగా కోటి రూపాయల చెక్కును కుటుంబసభ్యులకు అందజేశారు. ఇతరుల కోసం ప్రాణాలు పణంగా పెట్టి వైద్య సేవలందించిన వారి కుటుంబాలను ఆదుకోవడం ప్రభుత్వ కర్తవ్యం అని కేజ్రివాల్ పేర్కొన్నారు. అసీమ్ గుప్తాను పీపుల్స్ డాక్టర్గా అభివర్ణించిన సీఎం..చనిపోయిన వారిని తీసుకురాలేమని, కానీ వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కరోనా చికిత్సలో భాగంగా విధులు నిర్వర్తించే వైద్యులు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోతే కోటి రూపాయల ఎక్స్గ్రేషియాను అందిస్తామని ప్రకటించారు. (ప్లాస్మా బ్యాంక్ను ప్రారంభించిన కేజ్రీవాల్ ) ఢిల్లీలోని ప్రభుత్వ ఎల్ఎన్జెపి ఆసుపత్రిలో కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్ అసీమ్ గుప్తా.. విధి నిర్వహణలో భాగంగా పలువురు కరోనా బాధితులకు చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో జూన్ 6న డాక్టర్ గుప్తాకు కరోనా సోకడంతో క్వారంటైన్కి తరలించారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో జూన్7న ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తరలించారు. తర్వాత అక్కడ్నుంచి ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. (జులై 31 వరకూ విమాన సేవలు రద్దు ) -
‘వేదాద్రి’ మృతులకు 5 లక్షల పరిహారం
సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వారికీ ఎక్స్గ్రేషియా వర్తింపచేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర భూభాగంలోనే ప్రమాదం జరిగినందున మానవతా దృక్పథంతో మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు 2లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. (చదవండి : వేదాద్రి ఘటన : ఎక్స్గ్రేషియా ప్రకటన) కాగా, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి వద్ద బుధవారం మధ్యాహ్నం భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ను వేగంగా వచ్చిన బొగ్గు లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు, ఖమ్మం జిల్లా మధిరకు చెందిన 9 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. (చదవండి : మద్యం మత్తు మృత్యువైంది) -
వేదాద్రి ఘటన : ఎక్స్గ్రేషియా ప్రకటన
సాక్షి, ఖమ్మం : ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి పువ్వాడకు సూచించారు. ఎపీకి చెందిన ముగ్గురితో పాటు మొత్తం 12 మంది కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించాలని ఆదేశించారు. (చదవండి : మద్యం మత్తు మృత్యువైంది) కాగా, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి వద్ద బుధవారం మధ్యాహ్నం భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ను వేగంగా వచ్చిన బొగ్గు లారీ ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు, ఖమ్మం జిల్లా మధిరకు చెందిన 9 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. -
వాలంటీర్ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం
సాక్షి, అమరావతి : కరోనా సమయంలో విధులు నిర్వర్తిస్తూ ఆకస్మికంగా మృతి చెందిన గ్రామ వాలంటీర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేస్తూ వాలంటీర్ గబ్బాడ అనురాధ (26) గుండెపోటుతో మరణించింది. దినపత్రికల్లో ఈ వార్తను చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం అనురాధ కుటుంబానికి రూ. 5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. (కష్టకాలంలో కొండంత ధైర్యమిచ్చారు) సీఎంఓ అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విపత్తు సమయంలో పని చేస్తున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. గబ్బాడ అనూరాధ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటిస్తూ, ఈ సహాయం వెంటనే కుటుంబ సభ్యులకు అందేలా చూడాలని విశాఖ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. కాగా పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సాయంగా రూ.10వేలు అందించారు. (రూ. 1,299.14 కోట్ల పింఛను ఒక్కపూటలో పంపిణీ ) -
రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న రూ.1,500 సరిపోవట్లేదని, వారికి రూ.5 వేలు ఇవ్వాలని కోరారు. ఉత్తమ్ నేతృ త్వంలోని అఖిలపక్ష బృందం గురువారం స చివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను కలసి రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించింది. కోదండరాం (టీజేఎస్), చాడ వెంకటరెడ్డి (సీపీఐ), ఎల్.రమణ (టీడీపీ), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటి పార్టీ)లు సీఎస్ను కలసి పలు సూచనలతో కూడిన వినతిపత్రం అందించారు. అనంతరం మీడియాతో మా ట్లాడారు. 40 రోజుల లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, అనివార్యమైన ఇబ్బందులను స్ఫూర్తితో ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. అఖిలపక్ష నేతలు ఎవరేమన్నారంటే రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పని చేయట్లేదు. గాంధీ, ఉస్మానియాలో మిగతా ఆరోగ్య సేవలు పునరుద్ధరించాలి.’ –చెరుకు సుధాకర్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసిన వారికి కూడా రేషన్ బియ్యం ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేలు ఇవ్వాలి. సంగారెడ్డిలో నిరసన తెలిపిన కార్మికులకు జీతం ఇప్పించాలి. చాడ వెంకట్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ‘రేషన్లో బియ్యంతో పాటు, పప్పు, నూనె ఇవ్వాలి. వాహనాల పన్నును 3 నెలల పాటు రద్దు చేయాలి. కోదండరామ్, టీజేఎస్ ‘రైతు రుణమాఫీ చేయాలి. సూరత్, భివండి, ముంబైలలో ఉన్న వలస కార్మికులను సొంత రాష్ట్రానికి తీసుకురావాలి. – ఎల్.రమణ, టీటీడీపీ అధ్యక్షుడు -
కరోనాతో మృతి చెందితే ఎక్స్గ్రేషియా..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో విపక్ష నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో భేటీ అయ్యారు. కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఇచ్చిన 15 వందల రూపాయలు సరిపోవుని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. 12 కేజీల దొడ్డు బియ్యం కాకుండా నాణ్యమైన బియ్యం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తరుగు పేరుతో రైతుల నుంచి ఎక్కువ ధాన్యం తీసుకుంటున్నారని ఉత్తమ్ ఆరోపించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 80 వేల మందికి కరోనా పరీక్షలు చేస్తే.. తెలంగాణలో ఎందుకు పరీక్షలు చేయడం లేదని ప్రశ్నించారు. కాగా పేదలకు పంచేందుకు కందిపప్పు కేంద్రం నుంచి రాగానే పంపిణీ చేస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్లు ఉత్తమ్ చెప్పారు. సీఎస్తో భేటీ అయిన వారిలో ఉత్తమ్తో పాటు, చాడ వెంకట్రెడ్డి, కోదండరామ్, తదితరులు ఉన్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1341281459.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘ఆ ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది’
సాక్షి, విజయవాడ: లాక్డౌన్లో విధులు నిర్వర్తిస్తూ కరోనా తో మృతి చెందిన పరిగి ఏఎస్ఐ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ డీజీపీ గౌతమ్సవాంగ్ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ... బాధిత కుటుంబానికి చెక్ అందజేసినట్లు చెప్పారు. దేశంలోనే యాభై లక్షల పరిహారం ప్రకటించిన ఘనత జగన్ ప్రభుత్వానిదే అని గౌతమ్సవాంగ్ కొనియాడారు. దేశంలోనే అత్యధిక మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. (‘నాడు-నేడు’పై సీఎం జగన్ సమీక్ష) కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు తగవని హితవు పలికారు. వ్యవసాయ కార్యకలాపాలు, పరిశ్రమలకు అనుమతిచ్చినట్లు తెలిపారు. అన్ని శాఖలతో పోలీసుల వారు సమన్వయం చేసుకుంటున్నారని, పోలీసులకి పీపీఈ కిట్లకోసం 2.89 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఇక ఏపీకి విదేశాల నుంచి 28000 మంది, ఢిల్లీ జమాత్ నుంచి 1185 మంది వచ్చారని తెలిపారు. వారందరిని క్వారంటైన్లో ఉంచినట్లు చెప్పారు. (అష్ట దిగ్భందంలో పాతపట్నం) -
ఘోర ప్రమాదం : మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు
తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని అవినాషిలో కేరళకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కేరళ ప్రభుత్వం రూ .10 లక్షల ఎక్స్గ్రేషి యా ప్రకటించింది. అత్యవసర సహాయంగా రూ .2 లక్షలు వెంటనే అందిస్తామని రవాణా శాఖ మంత్రి ఏకే ససీంద్రన్ తెలిపారు. అలాగే గాయపడిన వారి చికిత్స ఖర్చులను కూడా కేరళ ప్రభుత్వం భరించనుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాలు ఇచ్చినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే మృతుల బంధువులు తమ వస్తువులను తీసుకొనేందుకు పాండి పోలీస్ స్టేషన్ అధికారులను 8300044804 లేదా 9498177908 నెంబర్లో సంప్రదించవచ్చని పాలక్కాడ్ జిల్లా కలెక్టర్డి బాలమురళి తెలిపారు. మృతదేహాలను తీసుకురావడానికి కేరళ ఇప్పటికే 20 అంబులెన్స్లను కోయంబత్తూరుకు పంపించినట్టు చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలుకోల్పోయిన కేఎస్ ఆర్టీసీ డ్రైవర్ గిరీష్, కండక్టర్ బైజు అలాగే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కేరళ ఆర్టీసీ వివిధ బీమా పథకాల ప్రకారం ఒక్కొక్కరికి రూ.30 లక్షలు పొందనున్నారని ససీంద్రన్ తెలిపారు. ఈ ప్రమాదంలో కేరళ ఆర్టీసీ బస్సు డ్రైవర్ గిరీష్, కండక్టర్ బైజు కూడా మరణించారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డుప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 20కి పెరిగినట్టు సమాచారం. స్వల్ప గాయాలతో 20 మంది ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘కిరాతకుడిని ఉరి తీయండి’
సాక్షి, హైదరాబాద్: హన్మకొండలో ముక్కుపచ్చలారని పసిపాపను పైశాచికంగా హత్య చేసిన దుర్మార్గుడిని ఉరి తీయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షులు మద్దికుంట లింగం నాయీ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చి, అన్నివిధాలుగా అండదండలు అందించాలని ఇవ్వాలని కోరారు. ఊహించని విధంగా కూతురిని కోల్పోయి పుట్టేడు శోకంలో ఉన్న బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మంగళవారం చోటుచేసుకున్న దారుణోదంతంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 9 నెలల పసికందుపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కిరాతకుడు ప్రవీణ్ను కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. -
హుద్హుద్ సాయం.. అందని వారెందరో?
హుద్హుద్ తుపాను వచ్చి నాలుగున్నరేళ్లు పూర్తి కావచ్చినా నేటికి నిలువ నీడలేక పరాయి పంచన కాలం గడుపుతున్న వారెందరో ఉన్నారు. హుద్హుద్ ఇళ్ల నిర్మాణాలు నాలుగేళ్లుగా సాగుతూ..నే ఉన్నాయి. మరో వైపు తుపాన్ దెబ్బకు ధ్వంసమైన వంతెనలు, రోడ్లు నేటికి వెక్కిరిస్తూనే ఉన్నాయి. వేల కోట్లల్లో నష్టం వాటిల్లినట్టు లెక్క తేల్చినా అందిన సాయం మాత్రం అంతంత మాత్రమే. ఒక్క విశాఖ జిల్లాలోనే 1,46,799 ఇళ్లు దెబ్బ తిన్నట్టు లెక్క తేల్చిన అధికారులు 1,30,993 మందికి మాత్రమే పరిహారం అందించగలిగారు. పూర్తిగా ఇళ్లు కోల్పోయిన 15,219 మందికి ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదించినా చివరకు 4483 ఇళ్లకు మాత్రమే పరిపాలనామోదం ఇచ్చారు. కానీ వాటి నిర్మాణం నేటికి పూర్తి కాని దుస్థితి నెలకొంది. పరిహారం అందని వారు వేలల్లో ఇక పంటల విషయానికి వస్తే 32,167 ఎకరాల్లో వ్యవసాయ పంటలు దెబ్బతినగా 1,52,806 మందికి రూ.46.46కోట్ల ఇన్పుట్సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా..1,52,225 మందికి మాత్రమే ఇచ్చారు. ఇంకా 593 మందికి రూ.30 లక్షల మేర పరిహారం చెల్లించాల్సి ఉంది. 61,618 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినగా 1,94,038 మందికి పరిహారం చెల్లించాల్సి ఉండగా 1,88,382 మందికి రూ.143.72కోట్ల పరిహారం ఇచ్చారు. ఇంకా రూ.18కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. 2487 మంది పాడి రైతులకు రూ.19.38కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా 2264 మందికి రూ.18.63 కోట్లే ఇచ్చారు. 223 మందికి రూ.75లక్షల çపరిహారం అందనేలేదు. బోట్లు, తెప్పలు దెబ్బతిన్న మత్స్యకారులకు రూ.49.69 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.6.95కోట్లు మాత్రమే 3850 మందికి ఇవ్వగలిగారు. ఇలా దాదాపు ప్రతిశాఖలోనూ పరిహారం అందని వారు లెక్కకు మించే ఉన్నారు. తిరిగి తిరిగి వేసారి విసిగిపోయారు. నష్టం రూ.వెయ్యి కోట్లు.. ఇచ్చింది రూ.346 కోట్లు రంగాల వారీగా చూస్తే ఏపీఈపీడీసీఎల్కు అత్యధికంగా రూ.498.95 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ తర్వాత జీవీఎంసీకి రూ.66.79 కోట్లు, ఇరిగేషన్కు రూ.59.81 కోట్లు, విద్యా శాఖకు రూ.29.41 కోట్లు, అటవీ శాఖకు రూ.28.81 కోట్లు, ఏపీఎంఎస్ఐడీసీకి రూ.19.50 కోట్లు, జూపార్కుకు రూ.17.37 కోట్లు, సిటీ పోలీస్ కమిషనరేట్కు రూ.16.10కోట్లు, వుడాకు రూ.10.26 కోట్లు, ఆర్అండ్ బీకి రూ.9.71 కోట్లు, ఆర్డబ్ల్యూఎస్కు రూ.9.18కోట్లు, కశింకోట ఆర్ఈ సీఎస్కు రూ.9 కోట్లు, ఏపీఎస్ఆర్టీసీకి రూ.4.54 కోట్లు ఇలా వివిధ శాఖలకు రూ.వెయ్యికోట్లకు పైగా నష్టం వాటిల్లితే ప్రభుత్వం విదిల్చింది మాత్రం రూ.346 కోట్లు మాత్రమే. పరిహారం పక్కదారి తుపాను బాధిత రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పంట నష్టపరిహారాన్ని అడ్డంగా దోచుకున్నారు. ఇటీవల ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హుద్హుద్ పరిహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బుచ్చెయ్యపేట మండలం మల్లాం గ్రామంలో ఏకంగా రూ.10.61 లక్షలు పక్క దారి పట్టినట్టుగా పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేశారు. సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఒకే కుటుంబానికి చెందిన టీడీపీ నే తలు పేర్లు మార్చి ఒకే అకౌంట్ నంబర్లతో పరిహారాన్ని దర్జాగా కాజేశారు. గజం భూమి కూడా లేని వారికి సైతం భర్త, తండ్రి పేర్లు మార్చి పరిహారం స్వాహా చేశారు. 20 ఏళ్ల క్రితం చనిపోయిన వారి పేరిట కూడా పరిహారం కాజేశారు. ఒక్క మల్లాం గ్రామంలోనే ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటే ఇక జిల్లా వ్యాప్తంగా ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవస రం లేదు. మరో పక్క పరిహారం అందక వేలాది మంది కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. తుపాను బాధిత రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పంట నష్టపరిహారాన్ని అడ్డంగా దోచుకున్నారు. ఇటీవల ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హుద్హుద్ పరిహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బుచ్చెయ్యపేట మండలం మల్లాం గ్రామంలో ఏకంగా రూ.10.61 లక్షలు పక్క దారి పట్టినట్టుగా పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేశారు. సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఒకే కుటుంబానికి చెందిన టీడీపీ నే తలు పేర్లు మార్చి ఒకే అకౌంట్ నంబర్లతో పరిహారాన్ని దర్జాగా కాజేశారు. గజం భూమి కూడా లేని వారికి సైతం భర్త, తండ్రి పేర్లు మార్చి పరిహారం స్వాహా చేశారు. 20 ఏళ్ల క్రితం చనిపోయిన వారి పేరిట కూడా పరిహారం కాజేశారు. ఒక్క మల్లాం గ్రామంలోనే ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటే ఇక జిల్లా వ్యాప్తంగా ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవస రం లేదు. మరో పక్క పరిహారం అందక వేలాది మంది కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. తుపాను దెబ్బకు విశాఖ స్టీల్ప్లాంట్కు రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న యంత్రాలకు కాకుండా మరో రూ.200 కోట్లు కనీస నష్టాలు వాటిల్లాయి. ఇక హెచ్పీసీఎల్కు రూ.108 కోట్ల నష్టం వాటిల్లింది. విశాఖ పోర్టు ట్రస్ట్కు సైతం రూ.250 కోట్ల నష్టం వాటిల్లింది. కానీ కేంద్రం నుంచి వీటిలో ఏ ఒక్క పరిశ్రమకు పైసా పరిహారం దక్కలేదు. హిందుస్థాన్ షిప్ యార్డుకు రూ.450కోట్ల నష్టం వాటిల్లగా బీమా ద్వారా వచ్చింది కేవలం రూ.30 కోట్లు మాత్రమే. -
అమరుల కుటుంబాలకు పరిహారం ప్రకటన..!
సాక్షి, న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో మృతిచెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలిచాయి. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అమరుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున ప్రకటించగా, ఒడిశా 12 లక్షలు పరిహారం ప్రకటించింది. ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు రూ.21 లక్షల పరిహారం ఇస్తున్నట్లు త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ ప్రకటించగా, రూ.12 లక్షల పరిహారం ఇస్తున్నట్లు పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ తెలిపారు. (పాలం ఎయిర్బేస్లో అమర జవాన్లకు నివాళి) హిమాచల్ ప్రదేశ్ రూ.21 లక్షలు పరిహారం ప్రకటించగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.25 ఎక్స్గ్రేషియాను ప్రకటించి అమరుల కుటుంబాలకు అండగా నిలిచింది. ఆర్థిక సహాయంతో పాటు కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పిస్తామని పలు ప్రభుత్వాలు ప్రకటించాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో శనివారం ఉదయం రెండు నిమిషాలు మౌనం పాటించి అమరులైన జవాన్లకు నివాళి అర్పించాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించారు. కాగా మృతిచెందిన వారిలో అత్యధికంగా 12 మంది జవాన్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, నలుగురు పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇక అమర జవాన్ల అంత్యక్రియాల్లో పాల్గొనాలని బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, పార్టీ నేతలకు ప్రధాని మోదీ ఆదేశాలు ఇచ్చారు. (ఉగ్రదాడిని ఖండించిన యావత్ భారతావని) -
సీఎం యోగి కీలక నిర్ణయం
లక్నో: జాతీయ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో ఉన్నపుడు ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారులకు నష్టపరిహారాన్ని రెండింతలు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆయన శనివారం లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. విధుల్లో ఉన్నపుడు ప్రాణాలు కోల్పోయే పోలీసు అధికారులకు నష్టపరిహారాన్ని రూ. 20 నుంచి 40 లక్షలకు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా పోలీసు శాఖకు సంబంధించిన అవార్డుల సంఖ్యను 200 నుంచి 950కి పెంచుతామని ఆయన హామీయిచ్చారు. రాష్ట్రంలో శాంత్రిభద్రతలను మెరుగుపరచాలని, అందుకు పోలీసు శాఖ మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. UP govt has decided to double ex-gratia amount for Police officials martyred on duty: CM Yogi Adityanath at Police Commemoration Day Parade pic.twitter.com/9ts50ztECe — ANI UP (@ANINewsUP) 21 October 2017 -
వైఎస్ జగన్పై కేసు నమోదు
విజయవాడ : ప్రతిపక్ష పార్టీపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఎదురుదాడికి దిగింది. ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసు నమోదు అయింది. వైఎస్ జగన్ సహా పార్టీ నేతలు పార్థసారధి, ఉదయభాను, జోగి రమేష్, అరుణ్ కుమార్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆస్పత్రి సిబ్బంది విధులుకు ఆటంకం కలిగించారంటూ వైఎస్ జగన్ సహా పార్టీ నేతలపై సెక్షన్ 353, 503,34 కింద కేసులు నమోదు అయ్యాయి. నందిగామ ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్పై దురుసుగా ప్రవర్తించారని టీడీపీ నేత వాసిరెడ్డి సత్యనారాయణ ప్రసాద్ బుధవారం నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హుటాహుటీన కేసు నమోదు చేయడం గమనార్హం. కాగా రాజకీయ కక్షతోనే టీడీపీ నేతలతో ఫిర్యాదు చేయించి ప్రతిపక్షంపై కేసులు నమోదు చేయిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు వ్యాఖ్యానించారు. కాగా కృష్ణాజిల్లా నందిగామ మండలం ముండ్లపాడు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకున్న ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను వాకబు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే మూటకట్టేయడం , రహస్యంగా తరలించే ప్రయత్నం చేయడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సంబంధిత వార్తలు.... ఇలాగైతే జైలుకెళ్తారు -
వైఎస్ జగన్పై కేసు నమోదు
-
ఇలాగైతే జైలుకెళ్తారు
⇒ డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకపోయినా చేసినట్లు కలెక్టర్ చెప్పడంపై జగన్మోహన్రెడ్డి ఆగ్రహం ⇒ డ్రైవర్ తాగి ఉన్నాడో లేదో తెలిసేదెలా? ⇒ టీడీపీ ఎంపీ ట్రావెల్స్ కాబట్టి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ⇒ రిపోర్ట్ కాపీ ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి? సాక్షి, అమరావతిబ్యూరో: రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే మూటకట్టేయడం , రహస్యంగా తరలించే ప్రయత్నం చేయడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకున్న జగన్మోహన్రెడ్డి ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను వాకబు చేశారు. అనంతరం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబీకులను పరామర్శించారు. ప్రమాద కారణాలను గుర్తించడానికి తీసుకున్న చర్యలపై అధికారులు సూటిగా సమాధానం చెప్పలేదు. అక్కడే మూటగట్టి ఉన్న డ్రైవర్ ఆదినారాయణ మృతదేహాన్ని చూస్తూ వైద్యులను జగన్ ప్రశ్నించారు. ‘‘డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేశారా?’’ అని అడగ్గా డాక్టర్ స్పందిస్తూ... ‘‘ఆ!... ఇంకా చేయలేదు. చేస్తాం’’ అంటూ ముక్తసరిగా సమాధానం చెబుతూ కొన్ని నివేదికల ప్రతులు చూపించారు. ఆ నివేదికలను చూసి వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘‘డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకపోతే ప్రమాదానికి గల కారణాలు ఎలా తెలుస్తాయి? తాగి ఉన్నారో లేదో తెలుసుకోవద్దా? పోస్టుమార్టం చేయకుండానే మృతదేహాన్ని ఎందుకు మూటగట్టేశారు? గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని నిలదీశారు. అదే విషయాన్ని అక్కడే ఉన్న కలెక్టర్ బాబు.ఎను కూడా అడిగారు. పోస్టుమార్టం చేయలేదని డాక్టర్ ఓ వైపు చెబుతుండగా కలెక్టర్ మాత్రం మాట దాటవేసేందుకు యత్నించడం గమనార్హం. ‘‘బాధ్యతాయుత ప్రతిపక్ష నేతగా అడుగుతుంటే సరైన సమాచారం ఇవ్వరా? ట్రావెల్స్ యాజమాన్యం టీడీపీ ఎంపీకి చెందినది కాబట్టి తప్పును కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నారా?’’ అని ప్రశ్నించారు. వైద్యులు రూపొందించిన రిపోర్టు కాపీలను తాను తీసుకుంటానని చెప్పారు. అప్పటికే కలెక్టర్ ఆగ్రహంతో చూస్తుండటంతో ఆ డాక్టర్ తడబడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతి నుంచి పత్రాలను తీసుకునేందుకు యత్నించారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. ‘‘ఆ పత్రాలు నేను ఉంచుకుంటాను. మూడు కాపీలు తయారు చేస్తారు కదా? మిగిలిన కాపీలు మీ వద్ద ఉంటాయి కదా’’ అని అన్నారు. తన వద్ద ఇక కాపీలు లేవని చెబుతూ డాక్టర్ వాటిని తీసుకునేందుకు మరోసారి యత్నించారు. దాంతో వైఎస్ జగన్ స్పందిస్తూ... ‘‘మీరు జిరాక్స్లు తీసుకోండి. నా వద్ద ఈ కాపీలు ఉండనివ్వండి’’ అని చెప్పారు. కానీ, కలెక్టర్ మాత్రం ఆ పత్రాలు ఇచ్చేయాలని జగన్తో చెప్పడం గమనార్హం. దీనిపై జగన్ తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతకు సమాచారం ఇవ్వరా? పత్రాలు ఇవ్వరా? నాకు అధికారులు అంటే పూర్తి గౌరవం ఉంది. పోస్టుమార్టం జరగకపోయినా జరిగినట్లు చెప్పడం, ఇలా ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం సరికాదు. బాధితులకు న్యాయం జరిగేలా వ్యవహరించకపోతే అందరూ జైలుకు వెళ్లాల్సి వస్తుంది’’ అని స్పష్టం చేశారు. నిబంధనలకు నీళ్లొదిలేశారు బస్సు ప్రమాదానికి గల కారణాలను విచారించాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ ఆదినారాయణ అక్కడిక్కడే మృతి చెందాడు. నిబంధనల ప్రకారం... ఆ డ్రైవర్ తాగి డ్రైవింగ్ చేశాడా లేదా అన్నది నిర్ధారించాలి. అందుకు మృతదేహానికి పోస్టుమార్టం చేయడం ఒక్కటే మార్గం. ఆ విషయాన్ని అధికారులు ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. డ్రైవర్ మృతదేహాన్ని ప్యాక్ చేసి, ఆయన స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక బస్సులో ఉండాల్సిన రెండో డ్రైవర్ ఏమయ్యాడో పోలీసులు, అధికారులు పట్టించుకోలేదు. రెండో డ్రైవర్కు లైసెన్స్ ఉందా? అతడు కూడా తాగి ఉన్నాడా? అనే విషయాలను తెలుసునేందుకు అధికారులు ప్రయత్నించిన పాపానపోలేదు. మధ్యాహ్నం 1.45 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎ కూడా అలాగే వ్యవహరించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నారా లేదా అన్నది పరిశీలించలేదు. పోస్టుమార్టం తప్పనిసరి స్పష్టం చేస్తున్న న్యాయ, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు అధికారులు కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్, మరికొందరు మృతుల దేహాలకు పోస్టుమార్టం చేయకుండానే వారి దేహాలను తరలించే ప్రయత్నం జరిగింది. అసలు ఈ విధంగా పోస్టుమార్టం చేయకుం డా మృతదేహాలను తరలించవచ్చా అంటే అలా కుదరదని, అది చట్ట రీత్యా నేరమని న్యాయ, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రమాదాల్లో మృతుల దేహాలకు పోస్టుమార్టం నిర్వహించడం మన దేశంలోనే కాదు.. అనేక దేశాల్లో చట్ట ప్రకారం తప్పనిసరి అని వారు చెబుతున్నారు. ముఖ్యంగా మంగళవారం జరిగిన ప్రమాదం వంటి ఘటనల్లో పోస్టుమార్టం నివేదిక అత్యంత కీలక సాక్ష్యమని, ఇది లేకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు, ఇతర ప్రయోజనాలు కోరడం సాధ్య పడదని వారు చెబుతున్నారు. అందువల్ల పోస్టుమార్టం చేయకపోవడం మృతుల కుటుంబాలకు అన్యాయం చేయడమేనని తెలిపారు. ప్రమాదానికి గురైన వాహన డ్రైవర్ చనిపోతే అతని మృతదేహానికి తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించాలని స్పష్టంగా చెప్పారు. ఏ కారణం చేత ప్రమాదం జరిగిందో అతని పోస్టుమార్టం నివేదిక ద్వారా ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పోస్టుమార్టం బాధ్యతల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని, ఈ నివేదికలు లేకుండా చట్ట ప్రకారం ముందుకెళ్లడం సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. -
ఏపీ పౌరుడి ప్రాణం విలువ రూ.3లక్షలు!
ఓ ప్రాణమంటే ఓ కుటుంబం.. ఓ సముదాయం.. ఓ గమనం.. అది కాస్త పోయిందా ఇక అంతే.. తిరిగి ఆ వ్యక్తికి చెందిన కుటుంబం సామాన్యజనాల్లో కలిసేందుకు తరాలు పట్టొచ్చు.. అసలు కలవలేకపోవచ్చు.. అంతమైపోయినా ఆశ్చర్యంకాకపోవొచ్చు. ఎవరి ప్రాణం వారికి విలువైంది. గుడిసెలో ఉన్నవాడి ప్రాణం ఆ గుడిసెలో ఉండేవారికి.. ధనవంతుల ప్రాణం ఆ ధనవంతుల కుటుంబానికి.. ఏదేమైనా ప్రాణానికి విలువకట్టే శక్తి ఏ పౌరుడికీ లేదు ప్రభుత్వానికి లేదు. అలా ఉందనుకుంటే పొరపాటే. అందుకే ప్రమాదాల్లో పడి ప్రాణాలుకోల్పోయినవారికి, క్షతగాత్రులకు ముందుగా మేమున్నామనే భరోసా ఇవ్వాలి. అది నిలబడేందుకు మంచి ఆర్థిక సహాయం చేయాలి. అది ఇతరుల దృష్టిలో నష్టపరిహారంగా కనిపించొచ్చు.. ఆపన్నహస్తమని పిలుచుకోవచ్చు మరింకేదైనా పేరుతో కావచ్చు.. కానీ, ఆ సాయం వారికి కచ్చితంగా ఊతం అవ్వాలేగానీ, మా వాళ్ల ప్రాణం, మా ప్రాణం విలువ ఇంతేనా అనే ఆలోచన అస్సలు రానివ్వకూడదు. అలా చేయగలిగే పాలకులే మంచి పాలకులు.. అలా చేసే ప్రభుత్వమే మంచి ప్రభుత్వం. గత ప్రమాదాల విషయం ఎట్లున్నా మంగళవారం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ములపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం మరోసారి సామాన్యుడి దయనీయ పరిస్థితిని నడిరోడ్డుపై స్పష్టంగా చూపించింది. తమకు ప్రభుత్వం కట్టిన విలువ ప్రాణంపోయిన వారికి మళ్లీ తెలుసుకునే అవకాశం ఉండి తెలుసుకోగలిగితే అది నిజంగా వారికి అంతకు పదిసార్లు చనిపోయినంత అవమానం. సాక్షాత్తు బలి పశువులకు ప్రకటించినట్లుగా నష్టపరిహారం ప్రకటించిన తీరు చూస్తుంటే విస్మయం చెందే పరిస్థితి. సాక్షాత్తు తనకు చాలా అనుభవం ఉందని చెప్పుకునే అమాత్యుడి ప్రభుత్వమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ ప్రభుత్వ పెద్దలు కనీసం చదువుకున్నారా? ఒక వేళ చదివితే అందులో మానవత్వ పాళ్లు ఉన్నాయా? నిజంగా వీరికి సామాన్యుల కుటుంబాలు అంటే తెలుసా? వారి జీవనక్రమం ఏనాడైనా అనుభవించారా? పోనీ చూశారా అంటే అనుమానమే. పోని, ఇలాంటి ప్రకటనలు వచ్చే సమయంలో వాటిని అమలు చేసే అధికారులు నిరక్షరాస్యులా? కనీసం ఇదెలా సాధ్యం అని ప్రశ్నించే ధైర్యం లేనంత బలహీనమైన ఉద్యోగాలు పాలకుల కింద చేస్తున్నారా అని ఎన్నో సమాధానాలు దొరకని ప్రశ్నలు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం, అండగా ఉంటామని ప్రకటించడం, చివరకు చిల్లర వేసినట్లుగా వారికి నష్టపరిహారాలు ప్రకటించడం ప్రభుత్వాలకు బాగా అలవాటయ్యాయి. అదీ కాకుండా ప్రాంతాల వారీగా ప్రాణాలకు విలువకట్టడం కాస్తంత సిగ్గుగా అనిపించే అంశమే. మంగళవారం పెనుగ్రంచి పోలు వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయినవారికి చంద్రన్నబీమా కింద రూ.3లక్షలు ఆంధ్రులకు, రూ.2లక్షలు తెలంగాణ ఇతర ప్రాంతాలకు చెందినవారి కుటుంబాలకు అని ప్రకటించారు. ఇది ఎంతమేరకు సమంజసమైన ప్రకటనో ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇచ్చిన బత్తెం అరకొర.. అందులోనూ కొరుకుడుబడని కొర్రీలు. పైగా ప్రమాదానికి కారణమైన బస్సు యాజమాన్యంపై చర్యలకు బలమైన ప్రకటనగానీ, బాధితులకు నష్టపరిహారం ఇప్పించే ప్రకటనగానీ ప్రభుత్వం చేయలేదు. అదీకాకుండా ప్రభుత్వ పెద్దలు మరిచిపోయిన విషయాలను గుర్తు చేసేందుకు ప్రతిపక్షాలు ముందుకు కదిలితే వారికంటే ముందు పోలీసులతో చకచకా పనులు చేయించుకోవడం, ప్రతిపక్షాలను అడ్డుకోవడం, పార్టీ కార్యకర్తలతో గందరగోళానికి గురిచేయించడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో షరామాములైంది. ఇన్నేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు నిజంగా తన అనుభవాన్ని మరిచిపోయారా? పరిపాలనకు కొత్త భాష్యం లిఖిస్తున్నారా అని చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంత తత్తరపాటు? ఎందుకా బెదురు? సాధారణంగా ప్రమాదం జరిగినప్పుడు ఒక్క ప్రభుత్వమే కాదు.. సహృదయంతో ఉన్న ప్రతి వ్యక్తి స్పందిస్తాడు. ప్రభుత్వపరంగా చేయాల్సిన చర్యలు చేసుకుంటూ వెళితే.. ప్రతిపక్ష పార్టీల నేతలు, అంతకుముందు పరిపాలనలో ఉన్న సీనియర్ నాయకులు బాధితులకు భరోసా ఇచ్చేందుకు వస్తుంటారు. పరామర్శిస్తారు. ప్రభుత్వ లోపాలు ఉంటే ఎండగడతారు.. ప్రభుత్వం తరుపున బాధితులకు అందాల్సిన సహాయం గురించి డిమాండ్ చేసి వారికి దన్నుగా నిలుస్తారు. ఇది ఇప్పుడే వచ్చిన సాంప్రదాయం కాదు.. ఆనాదిగా ఉంది. కానీ, మంగళవారంనాటి ప్రమాదంలో ఏపీ ప్రభుత్వ తీరు మాత్రం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదానికి కారణమైన బస్సు యాజమాన్యంపై ఈగ కూడా వాలకుండా పనులు పూర్తి చేయాలని పనిచేసినట్లు పరిణామలు స్పష్టం చేశాయి. ప్రతిపక్ష నేత వస్తున్నారని తెలిసి ప్రమాద స్థలం నుంచి బస్సును తొలగించడమే కాకుండా నందిగామ ఆస్పత్రి వద్ద హడావుడి మొదలుపెట్టారు. ఎవ్వరినీ రానివ్వకుండా పోలీసులను మోహరించారు. దానికి అదనంగా ప్రభుత్వ పార్టీ కార్యకర్తలు పోలీసులకంటే ముందే కొలువుతీరారు. ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పాటుచేసి హడావుడిగా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడం, శవాలను తరలించేందుకు అంబులెన్స్లు నిలపడం, పోలీసులే ఈ సపర్యలు చేయడం, బస్సు రెండో డ్రైవర్ని పంపిచేయడం.. ఇలా మొత్తం వ్యవహారమంతా చూస్తుంటే అసలు ప్రభుత్వానికెందుకు ఇంత తత్తరపాటు అని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్గ్రేషియా పెంచాల్సి వస్తుందని ఈ పరిస్థితులు సృష్టించారా? లేక బస్సు యాజమాన్యం తమ ప్రభుత్వంలో ఒక భాగస్వామి కాబట్టి ఆయనను రక్షించేందుకు ఈ పనిచేశారా? అసలు చావుల దగ్గర రాజకీయ వాతావరణం సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతిపక్షం అంటే కేవలం అసెంబ్లీలో సభలో మాత్రమే కనిపించాలా? మరెక్కడ కనిపించినా వారు రాజకీయం చేసేందుకు వస్తున్నారని ఎలా అనుకోగలుగుతారు? నిజానికి ఎలాంటి లోపాలు లేని పాలక వర్గానికి ఇంత బెదురు ఎందుకుంటుంది? అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకుంటున్నారు. మొత్తానికి సామాన్యుడి ప్రాణాలకు ఏపీ ప్రభుత్వం ప్రాంతాలవారిగా విలువకట్టిన తీరు చూస్తుంటే మానవత్వం కలత చెందే పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. -
బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం
అమరావతి: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ములపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. చంద్రన్న బీమా ఉన్నవారికి 5 లక్షలు, చంద్రన్న బీమా లేనివారికి 3 లక్షలు, ఇతర రాష్ట్రాల వారికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. అతివేగమే కారణం: బస్సు ప్రమాదానికి అతివేగమే కారణమని ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు. ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈ రోజు ఉదయం బస్సు ప్రమాదంలో 11 మంది మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. -
ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యే
మృతుడు రాంబాబు కుటుంబానికి రెండెకరాల భూమి ఇవ్వాల్సిందే వైఎస్సార్సీపీ నాయకుల డిమాండ్ పార్టీ తరఫున రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటన రాజమహేంద్రవరం సిటీ : చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటాలే తప్ప ప్రభుత్వ సంక్షేమాన్ని విస్మరించిందని, దాని పర్యవసానమే పుష్కరఘాట్లో రాంబాబు మృతి ఘటన అని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. రాంబాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, గ్రేటర్ రాజమహేంద్రవరం పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, సిటీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు ధ్వజమెత్తారు. శనివారం వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ శివరాత్రి పుణ్యస్నాన మాచరించేందుకు వచ్చిన రాంబాబు ప్రభుత్వ నిర్వాకం వల్లే మృత్యువాత పడ్డాడన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని అన్నారు. మృతుడి కుటుంబానికి రెండు ఎకరాల పంటభూమి, రూ.50 వేల సహాయం అందజేయాలన్నారు. భర్తను కోల్పోయిన బాధితురాలు న్యాయం కోసం రోడ్డెక్కితే ఆమెపై పోలీసులు వ్యవహరించిన తీరు హేయమన్నారు. గ్రేటర్ రాజమహేంద్రవరం పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ విద్యుదాఘాతానికి గురైన రాంబాబుకు వెంటనే చికిత్స అందించి ఉంటే బతికేవాడన్నారు. రెండు గంటల పాటు నరక యాతన అనుభవించాడని, పుష్కరఘాట్లో కనీసం ప్రాథమిక చికిత్సా కేంద్రం ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. 108 రావడానికి రెండు గంటలపైనే పట్టిందన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో 28 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం ఏర్పాట్ల విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా పోయిందన్నారు. సిటీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పుష్కరాలు నిదర్శనమన్నారు. శివరాత్రి సమయంలో సైతం అదే తప్పిదం బయట పడిందన్నారు. కార్పొరేషన్ ఫ్లోర్లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, మాజీ కార్పొరేటర్ పోలు విజయలక్ష్మి, సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, యువజన విభాగం సహాయ కార్యదర్శి పోలు కిరణ్మోహన్రెడ్డి, పార్టీ నాయకులు మజ్జి అప్పారావు, పెంకే సురేష్, చిక్కాల బాబులు తదితరులు పాల్గొన్నారు. -
మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు, ఏపీ ప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియాగా ప్రకటించాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి కేంద్రం తరఫున 50 వేల రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి హీరాఖండ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 41 మందికి పైగా మరణించగా, మరో 100 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందినవారు ముగ్గురు ఉన్నట్టు గుర్తించారు. గాయపడినవారిలో ఒడిశా, ఏపీకి చెందిన ప్రయాణికులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. -
బాధితులకు రూ. ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు అమలాపురం రూరల్ : సూదాపాలెం ఘటనలో బాధితులకు ప్రభుత్వం రూ. ఐదు లక్షల ఎక్స్గ్రేషియా, ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్న బాధితులను ఆయన, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ పీఏసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, నియోజకవర్గ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్ గురువారం పరామర్శించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కన్నబాబు డిమాండ్ చేశారు. బాధితులకు ప్రభుత్వపరంగా రూ. ఐదు లక్షల ఎక్స్గ్రేషియా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ద్వారా వచ్చే సహాయం అందజేయాలన్నారు. బాధితులకు కాకినాడ లేదా రాజమహేంద్రవరంలలోని కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యసేవలందించాలని కన్నబాబు డిమాండ్ చేశారు. బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని విశ్వరూప్, చిట్టబ్బాయి పేర్కొన్నారు. దళితులపై దాడులు చేస్తున్న నిందితులకు కఠినమైన శిక్షలు పడనందునే ఇటువంటి దాడులు తరచూ జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, పితాని బాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జి కొయ్యే మోషీన్రాజు, ఎస్సీ, ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి మూర్తి నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు సుంకర సీతారామ్, ఎం.రామసతీష్, సంయుక్త కార్యదర్శి మెల్లం మహాలక్ష్మి ప్రసాద్, రాష్ట్ర నాయకులు ఎడ్ల ప్రసాద్నవీన్, సంయుక్త కార్యదర్శి ముత్తాబత్తుల మణిరత్నం, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, బొమ్మి ఇజ్రాయిల్, మిండగుదిటి మోహన్, గుత్తుల సాయి, లింగాల రవి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పెట్టా శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అడ్డగళ్ల సాయిరాం, ఆర్గనైజింగ్ కార్యదర్శులు మోకా వీరరాఘవులు, కాశి మునికుమారి, జిల్లా కార్యదర్శులు జంపన రమేష్రాజు, మట్టా వెంకట్రావు, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు గనిశెట్టి రమణ్లాల్, వాసంశెట్టి సుభాష్, కడిమి చిన్నవరాజు, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర, బొంతు గోవింద్శెట్టి పాల్గొన్నారు. -
మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి
కావలిఅర్బన్ : హైదరాబాదులోని ఫిలింనగర్లో నాసిరకంగా నిర్మిస్తున్న భవనం కూలి ఆదివారం మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేమిరెడ్డి కృష్ణారెడ్డి, జలదంకి కొండయ్య డిమాండ్ చేశారు. స్థానిక లత సినీ థియేటర్ వద్ద ఉన్న ఆ సంఘం కార్యాలయంలో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాదులోని ఫిలింనగర్లో సినీ అసోషియేషన్ భవనం నిర్మాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగిందని, నాశిరకంగా నిర్మించడం వల్లే అది కూలిపోయిందని ఆరోపించారు. ఈ ప్రమాదంలో కర్నాటకకు చెందిన భవన నిర్మాణ కార్మికులు ఇద్దరు మృతిచెందగా మరో 12 మంది క్షతగాత్రులయ్యారని పేర్కొన్నారు. భవనాన్ని నాశిరకంగా నిర్మిస్తుంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అసోసియేషన్ సభ్యులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇటువంటి సంఘటనలు పునారావృతం కాకుండా ఉండేందుకు అధికారులు భవన నిర్మాణాల విషయంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల మృతికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం ట్రెజరర్ కోదండరామయ్య, గౌరవాధ్యక్షుడు మార్తాటి శ్రీరాములు, మల్లిఖార్జున, మాల్యాద్రి, శిల్పి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి
కావలిఅర్బన్ : హైదరాబాదులోని ఫిలింనగర్లో నాసిరకంగా నిర్మిస్తున్న భవనం కూలి ఆదివారం మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేమిరెడ్డి కృష్ణారెడ్డి, జలదంకి కొండయ్య డిమాండ్ చేశారు. స్థానిక లత సినీ థియేటర్ వద్ద ఉన్న ఆ సంఘం కార్యాలయంలో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాదులోని ఫిలింనగర్లో సినీ అసోషియేషన్ భవనం నిర్మాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగిందని, నాశిరకంగా నిర్మించడం వల్లే అది కూలిపోయిందని ఆరోపించారు. ఈ ప్రమాదంలో కర్నాటకకు చెందిన భవన నిర్మాణ కార్మికులు ఇద్దరు మృతిచెందగా మరో 12 మంది క్షతగాత్రులయ్యారని పేర్కొన్నారు. భవనాన్ని నాశిరకంగా నిర్మిస్తుంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అసోసియేషన్ సభ్యులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇటువంటి సంఘటనలు పునారావృతం కాకుండా ఉండేందుకు అధికారులు భవన నిర్మాణాల విషయంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల మృతికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం ట్రెజరర్ కోదండరామయ్య, గౌరవాధ్యక్షుడు మార్తాటి శ్రీరాములు, మల్లిఖార్జున, మాల్యాద్రి, శిల్పి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
ఎక్స్గ్రేషియా చెల్లించాలి
గోపాల్పేట: హైదరాబాద్ ఫిలింనగర్లో అక్రమంగా నిర్మిస్తున్న కల్చరర్ క్లబ్ కూలి మతిచెందిన కూలీల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల విష్ణువర్ధన్రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఫిలింనగర్ కల్చరర్ కమిటీ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని, శిథిలాల కింద కూరుకుపోయిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం సేవలు అందించాలని కోరారు. హైదరాబాద్లో ఎవరి ఇష్టానుసారంగా వారు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఫిలింనగర్ కమిటీపై నాన్బెయిలబుల్ కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని -
పరిహారానికే 6,500 కోట్లు!
► కాళేశ్వరం ప్రాజెక్టు కింద 7,200 ఇళ్ల ముంపు ► 80 వేల ఎకరాల భూసేకరణ అవసరం ► ‘పాలమూరు’ మాదిరే ఇంటి రకాన్ని బట్టి పరిహారం ► రెండు వారాల్లో ప్రక్రియ మొదలు సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద రిజర్వాయర్లు, ఇతరత్రా అవసరాలకు భూసేకరణ, నివాస గృహాల పరిహారానికి రూ. 6,500 కోట్లు అవసరమవుతాయని నీటిపారుదలశాఖ లెక్కలు వేసింది. ప్రాజెక్టు కింద 80 వేల ఎకరాల భూసేకరణ అవసరం ఉండగా రిజర్వాయర్ల కింద 7,200 ఇళ్లు ముం పునకు గురవుతాయని అంచనా వేసింది. మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం త్వరలోనే జరుగుతుండటం, 18 నెలల్లో బ్యారేజీల నిర్మా ణ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకు న్న దృష్ట్యా 2 వారాల్లో పరిహార చెల్లింపు ప్రక్రియను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పాత డిజైన్లో 12 టీఎం సీలు కూడా లేని రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 160 టీఎంసీలకు పెంచింది. దీంతో ముంపు కూడా అదేస్థాయిలో పెరిగింది. మారిన డిజైన్ కారణంగా ప్రాజెక్టు వ్యయం రూ.38,500 కోట్ల నుంచి రూ.75 వేలకోట్ల వరకు ఉండనుండగా అందులో భూపరిహారానికే రూ. 5 వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ‘పాలమూరు’ మాదిరే ఇళ్లకు పరిహారం ముంపునకు గురవుతున్న 7,200 ఇళ్లకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో కొత్తగా తెచ్చిన విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఇంటి నిర్మాణం ప్రాథమిక అంచ నా రూ. 4 లక్షలు, అంతకన్నా తక్కువగా ఉం టే నిర్మాణ వైశాల్యం (ప్లింత్ ఏరియా) రేట్ల ఆధారంగా పరిహారం లెక్కిస్తారు. రూ.4 లక్షలకుపైగా ఉన్న గృహ నిర్మాణాలకూ గృహ ర్మాణ రకాన్ని అనుసరించి ముందుగా నిర్ణయించిన రేట్లకు అనుగుణంగా చదరపు మీటర్ చొప్పున చెల్లిస్తారు. నిర్మాణాల్లో వాడే సాధారణ కలప, టేకు కలపకు చెల్లించే ధరలకు విడిగా ధరలను నిర్ణయించారు. కలప పరిహా రానికి రూ. 1,500 కోట్లు అవసరమవుతాయని అధికారుల అంచ నా. మరో రెండు వారాల్లో ఈ పరిహార చెల్లింపు ప్రక్రియను మొదలుపెట్టే అవకాశాలున్నాయని నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
పరిహారంలో వివక్షపై తల్లి పోరు
విశ్లేషణ అసాంఘిక శక్తులతో పోరాడవలసిన సైనికుడు లేదా పోలీసు వలెనే అసాధారణ రోగాలతో పోరాడే డాక్టరు కూడా హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవచ్చు. చనిపోవ డానికి కారణం ఏదైనా వారి కుటుంబానికి జరిగే నష్టంలో తేడా ఉండదు. కుమారుడిని అర్దాంతరంగా కోల్పోయిన తల్లిదండ్రుల మనోవేదనకు ప్రతిబింబం ఒక తల్లి ఆర్టీఐ దరఖాస్తు. ఢిల్లీ చాచా నెహ్రూ బాల చికిత్సాలయంలో స్వైన్ఫ్లూ వ్యాధిగ్రస్తులైన పిల్లలకు చికిత్స చేస్తూ ఆ వ్యాధికే గురై డాక్టర్ దినేశ్ కుమార్ సింగ్ (సీనియర్ రెసిడెంట్ అనస్తీషియా) మార్చి 3, 2015న మరణించారు. మీరు ఎలాంటి పరిహారం ఎప్పుడిస్తార న్నది ఆ డాక్టర్ తల్లి ప్రశ్న. సహజంగానే సర్కారు బాబులు తలా తోకా లేని సమాధానం ఇచ్చారు. ప్రభు వుల వారి డొల్లతనం బయటపడేయటమే ఆర్టీఐ మహిమ. పరిహారం ఇవ్వనే లేదు. ఫిర్యాదుల విభాగం (పీజీఎంఎస్) మూడు సార్లు వీరి పిటిషన్ను తిరస్కరిం చింది. కారణాలు ఇవ్వలేదు. ఆ తల్లి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆర్టీఐ దరఖాస్తు పంపితే వారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ, ఆర్థిక, రెవెన్యూ డివిజన్ల కమిషనర్ కార్యాలయాలకు బదిలీ చేశారు. కార్మిక నష్టపరిహార చట్టం 1923 ప్రకారం పని చేస్తూ గాయపడిన, మరణించిన వారికి పరిహారం చెల్లించే బాధ్యత యాజమాన్యానిదే. ప్రమాదవశాత్తూ గాయపడడం అనే మాటలో జబ్బుపడడం, మరణిం చడం అర్థాలను కూడా అన్వయించాలి. యాజమాన్యం కోసం పనిచేస్తూ గాయపడినా, ప్రాణాలు కోల్పోయినా, అది వారికోసం చేసిన త్యాగమే. గాయపడినా జబ్బు పడినా, ఆ కార్మికుడికి లేదా ఉద్యోగికి నష్టపూర్తి చేయాలి. ఒక వేళ మరణిస్తే ఆ కుటుంబానికి అతని మరణం వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేయాలి. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు, భద్రతాదళాల సభ్యులకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఢిల్లీ ప్రభుత్వం ఇస్తున్నది. ఏప్రిల్ 2016లో కొందరి దారుణ దాడిలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారి మహ్మద్ తాజిల్ అహ్మద్, బిహార్లో ఫిబ్రవరి 2016లో మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్ నరోత్తం దాస్, డిసెంబర్ 2013లో కానిస్టేబుల్ వినోద్ కుమార్ మరణిస్తే వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఇచ్చారు. ఎన్డీఎంసీ ఎస్టేట్ అధికారి ఎంఎం ఖాన్ దుండగుల దాడిలో చనిపోయారు. కేంద్రం 25 లక్షలు, ఢిల్లీ కోటి రూపాయల పరిహారం ప్రకటించింది. 2016, ఏప్రిల్ 1న ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానం ప్రకారం ఢిల్లీకి చెందిన పోలీసులు, అర్ధసైనిక, సాయుధ దళాలు లేదా హోంగార్డులు, సివిల్ డిఫెన్స్ తదితర దళాలకు చెందిన వారెవరైనా ఎక్కడైనా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లిస్తారు. ఎన్నికల కమిషన్ 2014 నియమాల మేరకు ఎన్నికల విధి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కనీసం రూ. 10 లక్షలు చెల్లించాలి. తీవ్ర వాదులు, అసాంఘిక శక్తుల మందుపాతర్లకు, బాంబు దాడులకు బలైతే 20 లక్షలు పరిహారం చెల్లిస్తారు. అంగవైకల్యం వచ్చినా, కన్ను లేదా కాలు కోల్పోయినా కనీస ఎక్స్గ్రేషియా రూ. 5 లక్షలు, అదే తీవ్రవాదులు, అసాంఘిక శక్తుల దాడిలో జరిగితే రెట్టింపు సొమ్ము చెల్లించాలి. విధి నిర్వహణలో మరణించిన డాక్టర్ల కుటుంబాలకు కూడా ఈ పాలసీ వర్తిస్తుందో లేదో తెలియదు. ఎందుకు వర్తించదో చెప్పరు. అసాంఘిక శక్తులతో పోరాడవలసిన సైనికుడు లేదా పోలీసు వలెనే, అసాధారణ రోగాలతో పోరాడే డాక్టరు కూడా హఠా త్తుగా ప్రాణాలు కోల్పోవచ్చు. చనిపోవడానికి కారణం ఏదైనా, వారి కుటుంబానికి జరిగే నష్టంలో తేడా ఉండదు. అయినప్పుడు పరిహారంలో తేడాలు ఎందుకు ఉండాలో వివరించాల్సి ఉంటుంది. టైస్టులు, గూండాలతో పోలీసులు పోరాడడం ఎంత ప్రమాద కరమో స్వైన్ఫ్లూ వంటి కొత్త రకం అంటువ్యాధులతో డాక్టర్ల పోరాటం కూడా అంతే ప్రాణాంతకం. ఎదురు కాల్పుల్లో చనిపోతే ఎక్కువ నష్టం, రోగులకు చికిత్స చేస్తూ చనిపోతే తక్కువ నష్టం ఉంటుందా? పోలీసు, డాక్టరు కాకుండా ఎస్టేట్ ఆఫీసర్ వంటి ఉద్యోగికి కూడా ప్రమాదమూ, నష్టమూ అంతే సమానంగానే ఉంటుంది. ప్రభుత్వ బంగళాలలో గడువుతీరిన తర్వాత కూడా కొనసాగే ప్రముఖులచేత ఎస్టేట్ ఆఫీసర్ ఇళ్లు ఖాళీ చేయించడం కూడా రౌడీలతో కొట్లాడడం, రోగాలతో వేగడం వంటిదే. ఖాళీ చేయించకపోతే అవినీతిపరుడని నేరారోపణలు, ఖాళీ చేయిస్తే వీఐిపీల ప్రతీకార దాడులు విపరీతంగా ఉంటాయి. అందరి ప్రాణాలూ సమానమే అనీ, పోతే నష్టం కూడా సమానమే అనే సైరైన విధానం ఉండాలి. ఉంటే ఆ విధానం వివరాలు తమంత తామే ఇవ్వాలి. అసలు విధానమే లేకపోతే ఆర్టీఐ చట్టం సెక్షన్ 4(1)(సి) కింద కారణాలు చెప్పాలి. 4(1)(డి) కింద పాలనా నిర్ణయాలకు, అర్ధన్యాయ నిర్ణయాలకు కార ణాలు తమంత తామే చెప్పే బాధ్యత ప్రభుత్వ అధికార సంస్థలపైన ఉంటుంది. చెప్పకపోతే ఆర్టీఐ సెక్షన్ 3, 6 కింద అడిగే హక్కు ఉంది. సమస్యల పరిష్కార వేదిక వారిపైనఅనితా సింగ్ ఫిర్యాదును ఎందుకు తిరస్క రించారో వివరించవలసిన బాధ్యత ఉంది. డాక్టర్ దినేశ్కుమార్ సింగ్కు సంబంధించిన మొత్తం ఫైల్ను ఈ సమాచార దరఖాస్తును, ఈ తీర్పు ప్రతిని తదితర అన్ని దస్తావేజులను ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం ముందుకు తేవాలని.. సమాచారం ఇవ్వనందుకు పరిహారం ఇవ్వాలని ఎందుకు ఆదేశించకూడదో తెలియ జేయాలని, జరిమానా ఎందుకు విధించకూడదో కూడా తెలపాలని కమిషన్ ఆదేశించింది. (అనితా సింగ్ వర్సెస్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం ఇఐఇ/అ/ అ/2016/000353 కేసులో మే 31 నాటి తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీదర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
-
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: చంద్రబాబు
విజయవాడ: కల్తీ మద్యం ఘటనపై సమగ్రవిచారణ చేపడతామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. కల్తీ మద్యం మృతుల కుటుంబాలకు సోమవారం రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ విభాగాలు సరిగా పని చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. -
చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.6లక్షల ఎక్స్గ్రేషియా
హైదరాబాద్ : ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం రూ.6లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జూన్ 2, 2014 నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఈ పరిహారం వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. రోజూ ప్రతి జిల్లాలో ఏదో ఒక గ్రామంలో రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. అసలే అప్పుల్లో వున్న కుటుంబాలు కుటుంబ పెద్దను కూడా కోల్పోవడంతో మరిన్ని కష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇస్తున్న ఎక్స్ గ్రేషియాను ఆరు లక్షల రూపాయలకు పెంచిన ప్రభుత్వం ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు వర్తింపచేయకపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దీంతో మొదట ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం తాజాగా సవరించింది. కాగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకూ తెలంగాణలో వేర్వేరు జిల్లాల్లో 11మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. -
'పరిహారం పెంచినా రైతుల ఆత్మహత్యలు ఆగవు'
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలు దేశానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పరిహారం పెంచినంత మాత్రాన ఆత్మహత్యలు ఆగవని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, మూలాల్లోకి వెళ్లి కారణాలను ఆన్వేషించి పరిష్కారాలను కనుగొన్నప్పుడే ఆత్మహత్యలు ఆగుతాయని అభిప్రాయపడింది. రైతుల ఆత్మహత్యలపై ప్రతీ రోజూ పత్రికల్లో వార్తా కథనాలు వస్తున్నాయని, వారి పరిస్థితి హృదయ విదారకంగా ఉంటోందని వ్యాఖ్యానించింది. రైతుల కోసం పథకాలు ప్రవేశపెడితే సరిపోదని, అవి క్షేత్రస్థాయిలో వారికి చేరుతున్నాయో లేదో చూడాలంది. రైతుల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై మంగళవారం హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై ఓ ప్రాథమిక నివేదికను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల ఆత్మహత్యల నివారణకు ఉభయ రాష్ట్రాలు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం లేదంటూ వ్యవసాయ జన చైతన్య సమితి అధ్యక్షుడు రామయ్యయాదవ్ సోమవారం హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది బాలాజీ వదేరా వాదనలు వినిపిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ రోజూ పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్లో కూడా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని వివరించారు. దీనిపై ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వ వివరణ కోరింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (స్పెషల్ జీపీ) ఎస్.శరత్కుమార్ స్పందిస్తూ, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ పలు పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. అలాగే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే నష్ట పరిహారాన్ని రూ.1.5 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచామని తెలిపారు. -
వడదెబ్బ మృతులకు రూ. లక్ష ఎక్స్గ్రేషియా
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వడదెబ్బతో మృతిచెందినవారి కుటుంబాలకు ప్రభుత్వం లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.శుక్రవారం కలెక్టర్లతో సదస్సు అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. మృతుల జాబితాను రూపొందించి, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు. తీవ్ర ఎండ, వడగాల్పుల ధాటికి గత రెడు రోజుల్లో ఏపీలో దాదాపు 300 మంది మృత్యువాత పడ్డారు. శుక్రవారం ఒక్క ప్రకాశం జిల్లాలోనే 50 మంది మరణించినట్లు సమాచారం. -
విశాఖ మృతులకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం
విశాఖ జిల్లాలో విషాదం రేపిన బాణాసంచ గోడౌన్ పేలుడు ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని విశాఖ జిల్లా కలెక్టర్ను ఆదేశించిన సీఎం.. పరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనకాపల్లి ఎంపీ, డీఐజీ, విశాఖ ఎస్పీతోపాటు జాయింట్ కలెక్టర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆదివారం సాయంత్రం జిల్లాలోని ఎస్. రాయవరం మండలం గోకులపాడులోని బాణాసంచా గోడౌన్లో సంభవించిన పేలుడు ఘటనలో ఇప్పటివరకూ ఏడుగురు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ బాణాసంచా తయారీ కేంద్రంలో 16నుంచి 18మంది వరకు కూలీలు పనిచేస్తున్నట్టు అక్కడి స్థానికులు చెబుతున్నారు. బాణాసంచా పేలుడు ఘటనలో బాధితులంతా కూలీలేనని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్, నక్కపల్లి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్టు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు చేపట్టకుండా మందుగుండును నిలువ ఉంచడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గౌడన్ యజమానిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
గెయిల్ దుర్ఘటన బాధితులకు వైఎస్ఆర్ సీపీ సాయం
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా నగరం గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలిన దుర్ఘటన బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సాయం అందజేసింది. మృతుల కుటుంబ సభ్యులకు లక్ష రూపాయిల ఎక్స్గ్రేసియా, గాయిపడినవారికి 25 వేల రూపాయిల చొప్పున వైఎస్ఆర్ సీపీ సాయం చేసింది. నాణ్యత లోపం వల్లే నగరం ప్రమాదం జరిగిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పైపులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాద బాధితులకు అండగా ఉంటామని జ్యోతుల నెహ్రూ చెప్పారు. -
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి
విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(హెచ్ పీసీఎల్) రిఫైనరీలో జరిగిన భారీ ప్రమాదంపై వెంటనే న్యాయ విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని, తీవ్రంగా గాయపడిన వారందరికీ రూ.25 లక్షల పరిహారం, శాశ్వత ఉపాధి కల్పించాలని పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. విశాఖ నగరం చుట్టూ ఉన్న అనేక పెట్రో, రసాయనిక, ఫెర్టిలైజర్స్, ఫార్మా వంటి పరిశ్రమలలో భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కార్మికులకు రక్షణ కరువైందని విమర్శించారు. వీటిని పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ విభాగాలన్నీ ఉద్ధేశ్యపూర్వకంగానే బలహీన పరుస్తున్నారని పేర్కొన్నారు.