breaking news
chemical factory
-
శిథిల బతుకులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/పటాన్చెరు: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించిన చోట శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నా యి. బుధవారం మరో రెండు మృతదేహాలు లభించినట్టు సమాచారం. తీవ్రగాయాల పాలై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు మరణించినట్టు సమాచారం. దీంతో మృతుల సంఖ్య 45కు చేరువైనట్టు అనధికారిక అంచనా. సిగాచి పరిశ్రమ యాజమాన్యం మాత్రం 40 మంది చనిపోయారని ప్రకటించింది. ప్రమాదం జరిగి రెండు రోజులు గడుస్తున్నా పదిమంది ఆచూకీ లభించడం లేదని అధికారులు ప్రకటించారు. మరోవైపు పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ బుధవారం కూడా కొనసాగింది. డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. వర్షం, సాంకేతిక కారణాలతో సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. దీంతో శిథిలాల తొలగింపు ప్రక్రియ గురువారం కూడా కొనసాగనుంది. డీఎన్ఏ రిపోర్టుల రాక ఆలస్యం శిథిలాల్లో బయటపడిన మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేస్తున్నారు. మొత్తం 37 మృతదేహాలు పటాన్చెరు ఆస్పత్రికి చేర్చారు. ఈ మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. డీఎన్ఏలు సరిపోయాకే మృతదేహాలను అప్పగిస్తున్నారు. అయితే ఈ రిపోర్టులు రావడానికి 24 గంటల నుంచి 48 గంటలు పడుతుందని అధికారులు చెప్పారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు మృత్యువాత తీవ్ర గాయాలపాలై సంగారెడ్డి జిల్లాతోపాటు, హైదరాబాద్లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో బుధవారం ముగ్గురు మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. పేలుడు ధాటికి కారి్మకులు చాలామంది 70 శాతం వరకు కాలిన గాయాలైన విషయం విదితమే. ఇందులో పలువురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు మృతి చెందినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారుల విడుదల చేసిన సమాచారం ప్రకారం.. – ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో పనిచేస్తున్నవారు : 143 – ప్రమాదం నుంచి బయటపడిన వారు : 60 – గాయపడి చికిత్స పొందుతున్నవారు : 35 – మరణించిన వారిలో పేర్లు గుర్తించిన మృతదేహాలు : 18 – పేర్లు గుర్తించని మృతదేహాల సంఖ్య : 20 – ఆచూకీ లభించకుండా పోయినవారు : 10 డీఎన్ఏ రిపోర్టుల సమాచారం : డీఎన్ఏ టెస్ట్ అయ్యాక ఆయా కుటుంబాలకు అప్పగించిన మృతదేహాల సంఖ్య : 18 – ల్యాబ్ నుంచి డీఎన్ఏ రిపోర్టుల రావాల్సిన మృతదేహాలు : 18 – డీఎన్ఏ పరీక్షల కోసం సేకరించాల్సిన శాంపిల్స్ : 2 – ల్యాబ్లో ప్రాసెస్ చేయాల్సిన కుటుంబసభ్యుల రక్త శాంపిల్స్ : 25 – ఇప్పటి వరకు జాడ తెలియని కుటుంబాల సంఖ్య : 3 – ప్రాసెస్ చేయబడిన, సరిపోలిన శాంపిల్స్ సంఖ్య : 5 మంత్రి దామోదర వాహనం అడ్డగింత రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించేందుకు వస్తున్న మంత్రి దామోదర రాజనరసింహ వాహనాన్ని సిగాచీ పరిశ్రమ వద్ద బాధిత కుటుంబాలు అడ్డున్నాయి. జస్టిన్ ఆచూకీ చెప్పాలని బాధిత కుటుంబ సభ్యులు మంత్రి వాహనానికి ఎదురుగా వెళ్లారు. దీంతో వాహనం దిగి వచ్చిన మంత్రి వారిని సుముదాయించి దైర్యం చెప్పారు. 18 బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం 18 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.18 లక్షలు చెల్లించారు. గాయపడిన 34 మందికి రూ.50 వేల చొప్పున రూ.17 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆచూకీ లభించని వారి కుటుంబాలకు తాత్కాలికంగా రూ.10 వేల ఆర్థిక సాయం అందించినట్టు అధికారులు తెలిపారు. పరిశ్రమలోకి దూసుకెళ్లేందుకు బాధిత కుటుంబాల యత్నం..ఉద్రిక్తత సిగాచీ పరిశ్రమలోకి కొందరు బాధిత కుటుంబ సభ్యులు దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. బుధవారం సాయంత్రం వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిశ్రమ గేటు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదం జరిగి మూడు రోజులైనా, తమ వారి మృతదేహాలను అప్పగించకపోవడం దారుణమన్నారు. అధికారుల వైఫల్యం కారణంగానే మట్టి దెబ్బల కింద ఎంతోమంది విగతజీవులుగా పడి ఉన్నారన్నారు. ‘మీకు చేతకాకపోతే చెప్పండి.. ఎముకలైనా తవ్వుకొని తీసుకెళతాం’అని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ప్రమాదం జరిగిన రోజే శిథిలాలను తొలగించి వెతికి చూస్తే ఇంకా చాలామంది బతికే వారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రెండు మృతదేహాలు వెలికి తీశారని, అది కూడా తమ ఒత్తిడి మేరకే జరిగిందని వారు వివరించారు. ఒక మృతదేహంపై దుస్తులు కూడా ఉన్నాయని, శవాన్ని గుర్తించే స్థితిలో ఉందని వారు చెప్పారు.ఆ రోజే శిథిలాలను తొలగించి ఉంటే ఇంకొంతమంది ప్రాణాలతో బయటపడే వారిని బండ్లగూడకు చెందిన శిల్ప పేర్కొన్నారు. ఇద్దరి పరిస్థితి విషమం గచ్చిబౌలి: ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మదీనాగూడలోని ప్రణమ్ హాస్పిటల్లో 18 బాధితులకు చికిత్స అందిస్తున్నామని, గురువారం 10 మందిని డిశ్చార్జ్ చేస్తామని హాస్పిటల్ ఎండీ మనీష్గౌర్ తెలిపారు. ప్రమాదం జరిగిన రోజే ఈ హాస్పిట్కు 22మందిని తీసుకొచ్చారు. వీరిలో హేమసుందర్, లగ్నాజిత్, శశిభూషణ్లు మృత్యువాత పడ్డారు. ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. జనరల్ వార్డులో 13 మందికి చికిత్స అందిస్తున్నారు. వెస్ట్ బెంగాల్కు చెందిన తారక్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషయంగా ఉందని డాక్టర్లు తెలిపారు. మిషనరీ కాలం చెల్లిందని చెప్పినా... సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన విషయంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్కు చెందిన రాజనాల సాయియశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భానూరు పోలీసులు మంగళవారం కేసు (క్రైం నెం.184/2025) నమోదు చేశారు. అయితే ఈ పరిశ్రమలో మిషనరీ కాలం చెల్లిపోయిందని.. పాతబడిన ఈ మిషనరీని మార్చాలని.. తన తండ్రి రాజనాల వెంకట్జగన్మోహన్ పలుమార్లు యాజమాన్యం దృష్టికి తెచ్చారని సాయియశ్వంత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణం ఈ యంత్రాలను మార్చకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లుతుందని ముందుగానే యాజమాన్యానికి చెప్పారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిశ్రమలో 20 సంవత్సరాలుగా తన తండ్రి వెంకటజగన్మోహన్ (55) పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ఘటనలో ఆయన మరణించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు భానూరు పోలీసులు సిగాచీ పరిశ్రమ యాజమాన్యంపై బీఎన్ఎస్ 105, 110, 117 సెక్షన్ల కింద జూన్ 30న కేసు నమోదు చేశారు. వెంకటజగన్మోహన్ది స్వస్థలం ఒడిశాలోని గంజామ్ జిల్లా చత్రాపూర్. -
తానొకటి తలిస్తే.. విధి ఒకటి తలిచింది..
తూర్పు గోదావరి: బాగా చదువుకుంది. జీవితంలో ఏదో సాధించాలనే తపనతో ఉద్యోగంలో చేరింది. చిరుద్యోగులైన తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకుంది. తానొకటి తలిస్తే.. విధి ఒకటి తలచిందని.. ఉద్యోగంలో చేరిన రెండు నెలలకే ఆమెను మృత్యువు కబళించింది. ఆమె ఆశలన్నీ కల్లలయ్యాయి.తెలంగాణలో పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో చాగల్లుకు చెందిన యువతి మృతి చెందడంతో చాగల్లులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన పొలిశెట్టి శ్రీనివాసరావు కుమార్తె ప్రసన్న(22) ఈ దుర్ఘటనలో మృతి చెందింది. రెండు నెలల క్రితమే ఫ్యాక్టరీలో కెమిస్ట్గా ఉద్యోగంలో చేరిన ప్రసన్న మరణాన్ని కుటుంబ సభ్యులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. తండ్రి శ్రీనివాసరావు మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, అనాథ పిల్లల కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి రామలక్ష్మి ఆశా కార్యకర్తగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ప్రసన్న కాగా, చిన్న కుమార్తె ప్రభుకుమారి ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతుంది. ప్రాణాపాయం నుంచి తప్పించుకుని.. ప్రసన్న అత్త కొడుకు కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామానికి చెందిన యాతం మహేష్ సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రసన్న కూడా రెండు నెలల క్రితమే అదే ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరింది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీ పనిపై మహేష్ బయటకు వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దుర్ఘటన విషయం తెలుసుకుని.. అదే సమయంలో డ్యూటీలో ఉన్న ప్రసన్న కూడా ప్రమాదానికి గురైందని గ్రహించి ఆమె తల్లిదండ్రులకు మహేష్ సమాచారం అందించాడు. సోమవారం సాయంత్రం శ్రీనివాసరావు, రామలక్ష్మి హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు.ఎన్నో ఆశలతో..దుర్ఘటనలో మృతిచెందిన ప్రసన్న బీ–ఫార్మసీ చది వింది. ఉన్నత చదువు అభ్యసించి జీవితంలో మంచి స్థానం సాధించాలని ఆశించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని ఫ్యాక్టరీలో స్టైఫండ్ తీసు కుంటూ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఉద్యోగంలోకి చేరింది. ఎం–ఫార్మసీ చేయాలన్న తపనతో ఓ శిక్షణ సంస్థలో కూడా చేరింది. ఇదే విషయాన్ని దుర్ఘటనకు ముందురోజు ఆమె తల్లితో ఫోన్లో చెప్పింది. తాను ఎం–ఫార్మసీ చదివేందుకు ఫీజు చెల్లించానని ఆనందం పంచుకుంది. సోమవారం సాయంత్రం ఏడు గంటల నుంచి జరిగే క్లాసులకు వెళుతున్నానని తల్లికి చెప్పింది. ఎంతో ఆనందాన్ని పంచుకున్న కుమార్తె తమను విషాదంలో విడిచి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు రోదించారు.కన్నీరుమున్నీరైన చెల్లెలు చిన్ను(ప్రసన్న) కుటుంబ సభ్యులందరితో కలివిడిగా ఉండేదని, తామిద్దరం అక్కాచెల్లెలైనా.. స్నేహితుల్లా కలిసిమెలిసి ఉండేవాళ్లమని ప్రసన్న చెల్లెలు ప్రభుకుమారి కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. ప్రసన్న ఇంటి వద్ద బంధువుల రోదనలు హృదయవిదారకంగా మారాయి. -
పాశమైలారంలో నిలిచిపోయిన సహాయక చర్యలు.. ఎండీపై సర్కార్ సీరియస్
Pashamylaram incident Updates..మంత్రి దామోదరను అడ్డుకున్న బాధితులు..ఉదయం నుంచి బాధితులను పట్టించుకున్న నాథుడే లేడుతమ వారి ఆచూకీ కోసం కళ్ళు కాయలు కాచేలా కంపెనీ వద్దే నిలబడ్డ బాధితులుఉదయం నుండి ఘటనా స్థలంలో పత్తా లేని అధికారులుమంత్రితో పాటు ఇతర నాయకులు రావడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన అధికారులునిస్సహాయంగా ఓ మంత్రి రావడంతో తిరగబడ్డ బాధితులుమీడియాలో బాధితుల వర్షెన్ వస్తుండటంతో కంపెనీ లోపలికి తీసుకెళ్ళిన మంత్రిగేటు బయటికి మీడియాను పంపించి బాధితులతో మాట్లాడుతున్న మంత్రి సంఘటన స్థలాన్ని మరోసారి పరిశీలిస్తున్న కాంగ్రెస్ నేతలుమంత్రి దామోదర, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, జగ్గారెడ్డి పరిశీలనఘటన స్థలం లో మంత్రి దామోదరను అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితులుమీడియాపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ ప్రమాదంలో 13 మంది మిస్సింగ్13 మంది ఆచూకీ కోసం బంధువుల, కుటుంబ సభ్యుల రోదనలు..సుభదీప్ సర్కార్, సిద్ధార్థ గౌడ్, లక్ష్మీముఖ్య, శ్యాంసుందర్, తస్లిముద్దీన్, ప్రశాంత్, జేపీ పటేల్, వెంకటేషం, అఖిల్, ప్రవీణ్ కుమార్, బాలకృష్ణ, చోటే లాల్, రామాంజనేయులు మిస్సింగ్. సిగాచి యాజమాన్యంపై సర్కార్ సీరియస్సిగాచి యాజమాన్యం వైఖరిపై ప్రభుత్వం సీరియస్ఇప్పటికే కూడా ఘటన స్థలానికి చేరుకొని సిగాచి ఎండీనిన్న స్వయంగా సిగాచి ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చిన సీఎం24 గంటలు గడచిన హైదరాబాద్ కి రాకపోవడం తో కఠిన చర్యలు తప్పవని సిగాచి ఎండీకి వార్నింగ్ఇప్పటికే యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నిలిచిపోయిన సహాయక చర్యలుపాశమైలారంలో నిలిచిపోయిన సహాయక చర్యలుశిథిలాలను తొలగించడానికి పలు అడ్డంకులుసగం కూలిన భవనం కిందకి వెళ్ళి సహాయక చర్యలు చేయడానికి ఇబ్బందులుఏ క్షణంలో భవనం కూలుతుందోనన్న ఆందోళనపేలుడు ధాటికి కుప్పకూలిన సగం భవనంఆచూకీ లభించని 17 మంది సిగాచి కంపెనీ కార్మికులుఆందోళనలో కార్మికుల కుటుంబ సభ్యులుఇప్పటి వరకు చనిపోయిన వారు 37 మందిపలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మరో 34 మందిపటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి 36 మృతదేహాలువీటిలో 11 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించిన అధికారులుమార్చురీలోనే మరో 25 మృతదేహాలుమృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి ప్రత్యేక ఫ్రీజర్లలో భద్రపరిచిన సిబ్బందిఇప్పటికే డీఎన్ఏ పరీక్షల కోసం ఎఫ్ఎస్ఎల్కు శాంపిల్స్ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు రావడానికి మరో 36 గంటల సమయంరిపోర్ట్ ఆధారంగా డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్న అధికారులుచికిత్స పొందుతున్న వారిలో మరో ఐదుగురి పరిస్థితి విషమం..ఇప్పటికే పాశమైలారం సిగాచి పరిశ్రమపై కేసు నమోదు చేసిన పోలీసులుBNS లోని 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన BDL భానుర్ పోలీసులుఫిర్యాదు చేసిన మృతుల కుటుంబ సభ్యులు..పొంతన లేని మృతుల సంఖ్య..సిగాచి పరిశ్రమ ప్రమాదంలో పొంతన లేని మృతుల సంఖ్య.ప్రమాదంలో 45 మంది మృతి చెందినట్టుగా చెబుతున్న రెస్క్యూ టీమ్.అధికారికంగా 39 మంది అంటున్న కలెక్టర్.మాకు 35 మృతదేహాలే హ్యాండ్ ఓవర్ చేశారు అంటున్న పటాన్ చెరువు ఆసుపత్రి సిబ్బంది.మరి మిగతా వారు ఎక్కడ?.డిపార్ట్మెంట్ల మధ్య పొంతన లేని సమాధానాలు.. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిపోస్టుమార్టం పూర్తి అయిన 11 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించిన అధికారులుపోస్టుమార్టం పూర్తయిన వారి వివరాలు1.రాజనాల జగన్మోహన్, ఒరిస్సా2.రామ్ సింగ్ రాజ్ బార్, యూపి3.శశి భూషణ్ కుమార్, బీహార్4.లగ్నజిత్ దావూరి, ఒరిస్సా5.హేమ సుందర్, చిత్తూరు 6.రక్సూనా ఖాతూన్, బీహార్7.నిఖిల్ రెడ్డి, కడప8.నాగేశ్వరరావు, మంచిర్యాల9.పోలిశెట్టి ప్రసన్న, ఈస్ట్ గోదావరి10.శ్రీ రమ్య, కృష్ణా జిల్లా11. మనోజ్ , ఒరిస్సాఏపీకి చెందిన వారు నలుగురుతెలంగాణకు చెందిన వారు ఒకరుఒడిషాకు చెందిన వారు ముగ్గురుబీహార్కు చెందిన వారు ఇద్దరుగా గుర్తింపు. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..పాశమైలారం ఘటనలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ఇంకా 13 మందికి పైగా కార్మికుల ఆచూకీ గల్లంతువారి కోసం కోసం ప్రయత్నాలు చేస్తున్న పోలీస్, రెవెన్యూ సిబ్బందితమ వాళ్ళ ఆచూకీ తెలపాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్న కుటుంబ సభ్యులుఇప్పటికే కూలిపోయిన శిథిలాలు మొత్తాన్ని తొలగించిన అధికారులుశిథిలాల కింద ఎవరూ లేరని తేల్చిన అధికారులుమరోవైపు పటాన్ చెరువు ఆస్పత్రిలో కుప్పలుగా మృతదేహాలు..డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాత మృతదేహాలను అప్పగిస్తామంటున్న అధికారులు.👉సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు మహా విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘోర దుర్ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం రాత్రి వరకు మృతుల సంఖ్య 40 దాటినట్లు తెలిసింది. వీరిలో 15 మంది వివరాలు తెలిశాయి. పలువురు కార్మికులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.👉మిగతా వారి జాడ తెలియాల్సి ఉంది. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగే కొద్దీ ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటకు వస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో 143 మంది ఉన్నట్లు భావిస్తుండగా, ఇందులో 58 మంది ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు గుర్తించారు. అలాగే ప్రమాదంలో 36 మంది మాత్రమే మరణించారని ప్రకటించారు.అర్ధరాత్రి వరకు సహాయక చర్యలు 👉పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో అడ్మినిస్ట్రేషన్, క్వాలిటీ కంట్రోల్ విభాగం భవనాలు కుప్పకూలాయి. శిథిలాల తొలగింపు ప్రక్రియ మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. మరోవైపు యంత్రాలు, వాటి విడిభాగాలు, పైపులు, రేకులు చెల్లా చెదురయ్యాయి. శిథిలాలను తొలగించేందుకు ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు శ్రమిస్తున్నాయి. బయటపడిన కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పటాన్చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి ఏకంగా 36 మృతదేహాలు రావడంతో మార్చురీ గదిలో శవాల గుట్ట తయారైంది. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాకే.. 👉మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా ఛిద్రం కావడంతో వాటిని బంధువులకు అప్పగించేందుకు డీఎన్ఏ పరీక్షలు చేయడం అనివార్యమైంది. ఉస్మానియా ఆసుపత్రికి చెందిన ఫోరెన్సిక్ బృందాలు..తమవారి ఆచూకీ చెప్పాలంటూ వస్తున్న మృతుల కుటుంబీకుల రక్తనమూనాలు సేకరిస్తున్నారు. పేలుడు ఘటనలో గల్లంతైన వారి వివరాల సేకరణకు ఐలా క్లినిక్లో హెల్ప్ డెస్క్ను నిర్వహిస్తున్నారు. మంగళవారం అక్కడ రక్త పరీక్షలను నిర్వహించారు.👉అలాగే పటాన్చెరు ప్రభుత్వాస్పత్రిలో కూడా డీఎన్ఎ టెస్టులు చేస్తున్నారు. డీఎన్ఏలు సరిపోల్చుకున్నాకే మృతదేహాలను అప్పగిస్తున్నారు. డీఎన్ఏ రిపోర్టు రావడానికి 48 గంటల వరకు సమయం పడుతుండటంతో మృతదేహాల అప్పగింత ఆలస్యమవుతోంది. మంగళవారం రాత్రి వరకు 13 మృతదేహాలను గుర్తించిన అధికారులు.. ఇందులో 11 మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆస్పత్రుల్లో చేరినవారిలో కొందరు మరణించారని తెలుస్తుండగా, అధికారులు మాత్రం ధ్రువీకరించడం లేదు. -
మావాళ్లు ఎక్కడ?.. పాశమైలారం ఘటన.. హృదయ విదారకం (చిత్రాలు)
-
పాశమైలారం ఘటన.. సిగాచి బాధితులకు సీఎం పరామర్శ
పెను విషాదాన్ని మిగిల్చిన సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మరణించిన వారి సంఖ్యను 45గా అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ అడ్మిన్ భవన శిథిలాల ప్రక్రియ కొనసాగుతోంది. తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టత రానుంది. Updates: 42కు చేరిన మృతులుమృతుల సంఖ్య పెరిగే అవకాశంమృతుల్లో ఎక్కువ మంది తమిళనాడు, బిహార్, జార్ఖండ్ వాసులుమృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలుఆసుపత్రుల్లో 35 మంది బాధితులకు చికిత్స12 మంది పరిస్థితి విషమం, ఐసీయూలో చికిత్సపేలుడు ఘటనలో 27 మంది కార్మికులు గల్లంతుశిథిలాల కింద మృతదేహాల కోసం గాలిస్తున్న డీఆర్ఎఫ్ టీమ్సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, హైడ్రా సిబ్బందితమవాళ్ల ఆచూకీ కోసం బాధిత కుటుంబాల ఆందోళన బాధితులకు సీఎం పరామర్శసిగాచి ఫ్యాక్టరీ బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి పరామర్శధృవ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎంఆరోగ్య స్థితిపై ఆరాకార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీమార్చురీ వద్ద రోదనలతో పడిగాపులుపటాన్ చెరులో డిఎన్ఏ శాంపుల్స్ సేకరణ కోసం ప్రత్యేక చర్యలుగుర్తుపట్టేందుకు వీలులేని మృతదేహాలకు డీఎన్ఏ టెస్ట్ లుతమ వారిని గుర్తించలేని కుటుంబ సభ్యుల నుండి డీఎన్ఏ సేకరణఇప్పటివరకు 18 మంది డిఎన్ఏ శాంపుల్ సేకరణ మృతదేహాలడీఎన్ఏ రిపోర్ట్ వచ్చిన తరువాతే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్న అధికారులుఇవాళ 11 మంది డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్న అధికారులుతమవాళ్ల మృతదేహాల కోసం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోదనలతో కుటుంబ సభ్యుల పడిగాపులుఘటనపై NHRC కేసు నమోదుపాశమైలారం ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల సంఘం కేసు నమోదుఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన న్యాయవాది రామారావుకేసు నమోదు చేసిన ఎన్హెచ్ఆర్సీమృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం యాజమాన్యం నుంచి ఇప్పించాలని పిటిషన్తాజా ప్రమాదం నేపథ్యంలో.. తెలంగాణలోని పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలని కోరిన పిటిషనర్త్వరలో ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు? యాజమాన్యం ఎక్కడ? 24 గంటలు దాటినా యాజమాన్యం రాకపోవడం బాధాకరమన్న మంత్రి శ్రీధర్బాబుఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్న శ్రీధర్బాబుప్రమాద ఘటనను కార్మిక, వైద్యశాఖ మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు: మంత్రి శ్రీధర్బాబుఅంతకుముందు.. యాజమాన్యం ఎక్కడ? అని అధికారులను ఆరా తీసిన సీఎం రేవంత్ బాయిలర్ల పనితీరుపై యాజమాన్యానికి చెప్పారా? అని ప్రశ్న యాజమాన్యం రాకపోవడంపై సీఎం ఆగ్రహం సిగాచి ఘటనపై సీఎం కీలక ఆదేశాలుసిగాచి పరిశ్రమను పరిశీలించిన సీఎం, మంత్రులుఅనంతరం ప్రమాద స్థలిలోనే అధికారులతో సీఎం సమీక్షఫ్యాక్టరీ ప్రమాదంపై అధికారులను ఆరా తీసిన సీఎం రేవంత్సిగాచి పరిశ్రమ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై అధికారులను ప్రశ్నించిన సీఎం రేవంత్పరిశ్రమను తనిఖీ చేశారా?.. తనిఖీల్లో ఏమైనా లోపాలను గుర్తించారా?పరిశ్రమ బోర్డు సభ్యులు ఎవరు? అంటూ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ను అడిగిన సీఎంఘటనపై కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా?.. కారణాలు తెలుసుకోండిఇప్పటికే తనిఖీలు చేసినవాళ్లతో కాకుండా.. కొత్త వాళ్లతో విచారణ జరిపించండిఈ ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపించి నివేదిక ఇవ్వండిఇలాంటి ప్రమాదాలపై అధికారులు అలర్ట్గా ఉండాలితక్షణ సాయం కింద.. మృతుల కుటుంబాలకు రూ.లక్ష, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించాలని సీఎం ఆదేశంపాశమైలారం ఘటనా స్థలిలో సీఎం రేవంత్పాశమైలారం సిగచి ఫ్యాక్టరీ ప్రమాద స్థలికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డివెంట మంత్రులు పొంగులేటి, వివేక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి..ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రిప్రమాదం జరిగిన తీరును.. సహాయక చర్యలపై అధికారులను ఆరా తీస్తున్న సీఎం రేవంత్పటాన్చెరు మార్చురీలో 37 మృతదేహాలు11 మృతదేహాల గుర్తింపు పూర్తి పూర్తిగా కాలిపోయి గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలుడీఎన్ఏ టెస్ట్కు ఒకరోజు నుంచి రోజున్నర టైం పడుతుందంటున్న అధికారులు సిగచి ప్రమాద స్థలికి కేంద్రమంత్రి కిషన్రెడ్డిసంగారెడ్డి పటాన్ చెరువు సిగచి కంపెనీ ప్రమాద స్థలానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డిమధ్యాహ్నం ప్రమాద స్థలిని పరిశీలించి.. బాధితులను పరామర్శించనున్న కిషన్రెడ్డికిషన్రెడ్డి వెంట బీజేపీ నూతన అధ్యక్షుడు రాంచందర్రావు కూడాకొనసాగుతున్న మృతదేహాల గుర్తింపుపాశమైలారం ఘటనలో కొనసాగుతున్న మృతదేహాల గుర్తింపుడీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపునకు ఏర్పాట్లుఘటనాస్థలానికి వచ్చిన డీఎన్ఏ పరీక్షలు చేసే బృందాలుఇప్పటిదాకా కేవలం 6 మృతదేహాలకు మాత్రమే గుర్తింపుపటాన్చెరు బయల్దేరిన సీఎం రేవంత్రెడ్డికాసేపట్లో పటాన్చెరు పాశమైలారం పారిశ్రామికవాడకు సీఎం రేవంత్ రెడ్డిఫ్యాక్టరీ ప్రమాద బాధితులకు ఆస్పత్రిలో పరామర్శపాశమైలారం ప్రమాద స్థలిని పరిశీలించనున్న సీఎంసీఎం వెంట మంత్రులు కూడాసిగచి ఆవరణలో పోలీసు ఆంక్షలుసిగచి ప్రమాద స్థలానికి సీఎం రేవంత్ రెడ్డిఅంతకంటే ముందు.. ఆస్పత్రిలో క్షతగాత్రులకు పరామర్శసీఎం రాక నేపథ్యంలో సిగచి కంపెనీ పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలుసిగచి కంపనీ వైపు ఎవరిని అనుమతించని పోలీసులునిన్న ప్రమాదం తర్వాత బాధిత కుటుంబాలతో పోలీసులకు వాగ్వాదంతమ వారి గురించి సరైన సమాచారం లేదని ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులుతోసేసిన పోలీసులు.. ఫ్యాక్టరీ వద్ద కాసేపు ఉద్రిక్తత42కు చేరుకున్న మృతుల సంఖ్యశిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగింపు..మరో రెండు గంటల పాటు శిధిలాల తొలగించే ప్రక్రియ కొనసాగే అవకాశం..కుప్పకూలిన సిగచి ప్రొడక్షన్ బిల్డింగ్చనిపోయిన వారిలో ఎక్కువ మంది తమిళనాడు బీహార్ జార్ఖండ్ కు చెందిన వారే..వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 34 మంది క్షతగాత్రులుమూడు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులుశిథిలాల కింద మరో 20 మంది42కి చేరిన మృతుల సంఖ్యశిథిలాల కిందే మరో 20 మంది?మృతుల సంఖ్య 55కి చేరే అవకాశంకొనసాగుతున్న శిథిలాల తొలగింపుధ్వంసమైన ప్లాంట్ను పక్కకు తొలగించిన సహాయక బృందాలుగుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలుమృతుల్లో తమిళనాడు, యూపీ వాసులేక్కువడీఎన్ఏ పరీక్షల అనంతరమే కుటుంబ సభ్యులకు అప్పగించే ఛాన్స్ఇప్పటివరకు గుర్తు పట్టినవి ఆరు మృతదేహాలు మాత్రమేఅంతకు ముందు.. ఈ ఉదయం ప్రమాదంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారిక ప్రకటన చేశారు. ఘటన వివరాలతో పాటు సహాయక చర్యలు ఇతరత్రా వివరాలను వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో 47 మంది గల్లంతు అయ్యారుఇప్పటివరకు 26 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. అందులో నాలుగు మృతదేహాలను మాత్రమే గుర్తించాం.ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరికొందరు మృతిగుర్తుపట్టలేని స్థితిలో 20 మృతదేహాలు ఉన్నాయి మరో 27 మంది జాడ తెలియాల్సి ఉందిఆస్పత్రిలో తీవ్ర గాయాలతో 35 మందికి చికిత్స అందుతోంది.. అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది57 మంది సరక్షితంగా ఇంటికి వెళ్లారుప్రమాద సమయంలో మూడు అంతస్తుల భవనం కూలిపోయిందిశిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉన్నారు.. వారిని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయిసహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, హైడ్రా సిబ్బంది పాల్గొంటున్నారు ఇదీ చదవండి: పరిశ్రమల్లో ప్రాణాలు.. గాలిలో దీపాలు సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూం సిగాచీ పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సహాయం కోసం సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూంతక్షణ సహాయం కోసం సంబంధిత వ్యక్తులు 08455–276155 నంబర్ను సంప్రదించవచ్చన్న కలెక్టర్ ప్రావీణ్యబ్లోయర్ పేలి.. రియాక్టర్కు అంటుకుని.. మందుల తయారీకి సంబంధించిన ఈ పరిశ్రమలో కన్సిస్టెన్స్ మైక్రోస్టెల్లయిన్ సెల్యులర్ పౌడర్ ఉత్పత్తి ప్రాథమికం సమాచారం ప్రకారం.. ఉదయం 9.10 గంటల ప్రాంతంలో మొత్తం 111 మంది కార్మికులు, ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. అంతా పనిలో నిమగ్నమై ఉండగా తొలుత హెయిర్ బ్లోయర్ పేలింది. ఎగసిన మంటలు సమీపంలో ఉన్న రియాక్టర్కు అంటుకోవడంతో చెవులు చిల్లులు పడిపోయేంత శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. భూమి కంపించినట్టు అయ్యిందన్న ప్రత్యక్ష సాక్షులు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్న కొందరు కార్మికులు అయితే ఎయిర్ ఫైర్ సిస్టమ్లో ప్రెషర్ వల్లే సిగాచీ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ స్పష్టం చేశారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారని తెలిపారు. మృతుల్లో యాజమాన్య ప్రతినిధి?మృతులు, గాయపడిన వారిలో ఎక్కువగా ఒడిశా, బిహార్, యూపీ వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన గోవన్ అనే వ్యక్తి కూడా ఉన్నారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఆయన ఫ్యాక్టరీలోకి వచ్చిన కొద్ది సేపటికే ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి. అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సిగాచి పరిశ్రమ భవనాల శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయి ఉంటారనే అంచనాతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. భారీ కట్టర్లు, క్రేన్లు, హిటాచీలతో శిథిలాల తొలగింపును చేపట్టారు. సాయంత్రం కురిసిన చిన్న పాటి వర్షం సహాయక చర్యలకు కొంత అంతరా యం కలిగించింది. అయితే రెస్క్యూ ఆపరేషన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంగళవారం కూడా శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగనున్నాయి. మిన్నంటిన రోదనలు.. ఆందోళన కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. విధులకు హాజరై ఆచూకీ లేకుండా పోయిన వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి ఆచూకీ అధికారులను ఆరా తీశారు. సరైన స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడుసంగారెడ్డి జిల్లాలోని సిగాచీ కంపెనీలో రియాక్టర్ పేలడంతో ప్రమాదం చెల్లాచెదురుగా ఎగిరిపడిన కార్మికులు, ఛిద్రమైన శరీరాలు అగ్నికీలల్లో పలువురి సజీవదహనం.. కార్మికులు, ఉద్యోగులు దుర్మరణం! సమీప ఆసుపత్రులకు క్షతగాత్రుల తరలింపు మృతుల్లో ఎక్కువమంది ఒడిశా, బిహార్, యూపీ వారే.. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ సహా ప్రముఖుల సంతాపం 36 మందికి కాలిన గాయాలు.. పలువురి పరిస్థితి విషమం కుప్పకూలిన భవనాలు.. శిథిలాల కింద మరికొందరు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్... ఘటనా స్థలాన్ని,ఆస్పత్రులను సందర్శించిన మంత్రులు.. నేడు ఘటనా స్థలానికి సీఎం రేవంత్ ఆస్పత్రిలో బాధితులకు సీఎం పరామర్శ -
బతుకులు బుగ్గి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్చెరు టౌన్/పటాన్చెరు/రామచంద్రాపురం/జిన్నారం/చందానగర్: ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరున్న పాశమైలారంలోని సిగాచి అనే ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. కంపెనీలోని రియాక్టర్ పేలిపోగా దాని తీవ్రతకు మూడంతస్తుల భవనాలు రెండు కుప్పకూలిపోయాయి. పరిశ్రమ పైకప్పు, రేకులు, ఇతర యంత్ర భాగాలు ఎగిరి వంద మీటర్ల దూరంలో పడ్డాయి. యంత్రాల భాగాలు చెల్లాచెదురయ్యాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఆ ప్రదేశమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న 100 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిపోయారు. శరీరాలు ఛిద్రమైపోయాయి. 10 మంది అక్కడికక్కడే సజీవ దహనం కాగా ఇద్దరు ఆస్పత్రుల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. మొత్తం 16 మంది మరణించినట్లు అనధికారిక సమాచారంకాగా, మంత్రులు దామోదర, వివేక్ మాత్రం 12 మంది మరణించినట్లు ప్రకటించారు. మృతదేహాలను గుర్తించలేని పరిస్థితి నెలకొంది. సుమారు 36 మంది గాయపడ్డారు. 20 మందికి పైగా కార్మికులకు 80 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను సమీపంలో ఉన్న పటాన్చెరు, చందానగర్, మదీనాగూడ, మియాపూర్లలోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనాల శిథిలాల కింద మరింత మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పరిశ్రమ ఆవరణలో భీతావహ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలాన్ని మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు సందర్శించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఘోర దుర్ఘటనపై ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తదితర ప్రముఖులు ది్రగ్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. బ్లోయర్ పేలి.. రియాక్టర్కు అంటుకుని.. మందుల తయారీకి సంబంధించిన ఈ పరిశ్రమలో కన్సిస్టెన్స్ మైక్రోస్టెల్లయిన్ సెల్యులర్ పౌడర్ను ఉ త్పత్తి చేస్తారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. ఉదయం 9.10 గంటల ప్రాంతంలో మొత్తం 111 మంది కార్మికులు, ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. అంతా పనిలో నిమగ్నమై ఉండగా తొలుత హెయిర్ బ్లోయర్ పేలింది. దీంతో ఎగసిన మంటలు సమీపంలో ఉన్న రియాక్టర్కు అంటుకోవడంతో చెవులు చిల్లులు పడిపోయేంత శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. భూమి కంపించినట్టు అయ్యింది. కొందరు కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. మృతుల్లో యాజమాన్య ప్రతినిధి? మృతులు, గాయపడిన వారిలో ఎక్కువగా ఒడిశా, బిహార్, యూపీ వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన గోవన్ అనే వ్యక్తి కూడా ఉన్నారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఆయన ఫ్యాక్టరీలోకి వచ్చిన కొద్ది సేపటికే ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి. అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ సిగాచి పరిశ్రమ భవనాల శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయి ఉంటారనే అంచనాతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. భారీ కట్టర్లు, క్రేన్లు, హిటాచీలతో శిథిలాల తొలగింపును చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కురిసిన చిన్న పాటి వర్షం సహాయక చర్యలకు కొంత అంతరా యం కలిగించింది. అయితే రెస్క్యూ ఆపరేషన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంగళవారం కూడా శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగనున్నాయి. మిన్నంటిన రోదనలు.. ఆందోళన కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. విధులకు హాజరై ఆచూకీ లేకుండా పోయిన వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి ఆచూకీ అధికారులను ఆరా తీశారు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి దామోదర రాజనర్సింహ నాలుగు గంటల పాటు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్కు పలు సూచనలిచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని పరిశ్రమల శాఖ ఫైర్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. ఎయిర్ ఫైర్ సిస్టమ్లో ప్రెషర్ వల్లే సిగాచీ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ స్పష్టం చేశారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వం తరఫున మెరుగైన ఎక్స్గ్రేషియా అందించేందుకు కృషి చేస్తామన్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న మంత్రులు దామోదర, వివేక్ రాజకీయం చేయొద్దు: మంత్రులు పేలుడు ఘటనలో గాయపడిన వారిలో హేమ సుందర్, ధర్మరాజ్ ప్రసాద్, రాజేష్ కుమార్ చౌదరి, కమలేష్ ముఖియా, చందన్కుమార్ నాయక్, నగ్నజిత్, అభిషేక్ కుమార్, అజిత్ తివారి, సంజయ్కుమార్, యశ్వంత్ కుమార్, ధన్వీర్ కుమార్, సంజయ్ ముఖియా, రాజశేఖర్రెడ్డి, దేవనంద్, గణేష్ కుమార్, సంజయ్కుమార్ యాదవ్, నీలాంబర్ బట్రా, సమీర్, అమర్జిత్, అర్జున్కుమార్, అజిమ్ అన్సారీలను మియాపూర్ మదీనాగూడలోని ప్రణామ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ అభిషేక్ కుమార్, అజిత్ తివారి మృతి చెందారు. ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రిలో ఉన్నవారిని మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. దీనిపై ఎవరూ ఎలాంటి రాజకీయం చేయవద్దని కోరారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఇందుకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూం.. సిగాచీ పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సహాయం కోసం సంగారెడ్డి కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. తక్షణ సహాయం కోసం సంబంధిత వ్యక్తులు 08455–276155 నంబర్ను సంప్రదించవచ్చని కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. నేడు సీఎం సందర్శన సిగాచి పరిశ్రమను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం ఉదయం 10 గంటలకు సందర్శించనున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించనున్నారు. అక్కడి కార్మికులతో మాట్లాడనున్నారు. సహాయక చర్యలను కూడా పరిశీలిస్తారు. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: కేసీఆర్ సిగాచి పరిశ్రమ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని, చనిపోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఇలావుండగా పాశమైలారం పరిశ్రమలో రియాక్టర్ పేలుడు అత్యంత విషాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పలువురు కార్మికులు చనిపోయారన్న వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. రూ.2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధానిసాక్షి, న్యూఢిల్లీ: సంగారెడ్డి జిల్లాలో సంభవించిన పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రధాని తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున, గాయపడ్డ వారికి రూ.50 వేలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ‘ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నా. తమకు ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నా. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా..’ అని మోదీ పేర్కొన్నారు. ‘ఈ ఘోర ప్రమాదం గురించి విని చాలా బాధ కలిగింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు తక్షణ సహాయ, రక్షణ చర్యలు చేపడుతున్నారు..’ అని రాహుల్ పేర్కొన్నారు. ‘ఈ ఘోర ప్రమాదంలో అమూల్యమైన ప్రాణాలు పోవడం ఎంతో దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం..’ అని ఖర్గే అన్నారు.సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. ప్రమాదంపై ఆరా సాక్షి, హైదరాబాద్: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర ప్రమాదంఫై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ను అడిగి తెలుసుకున్నారు. డీజీపీ జితేందర్, సీఎస్ రామకృష్ణారావుతో సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరాయంగా కొనసాగించేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తరఫున సీఎస్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. డిజాస్టర్మేనేజ్మెంట్స్పెషల్ సీఎస్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఫైర్సరీ్వసెస్అడిషనల్డీజీని సభ్యులుగా నియమించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేసే బాధ్యతను కమిటీకి అప్పగించారు. -
రియాక్టర్ మొదట బ్లాస్ట్ కాలేదు.. ఫ్యాక్టరీ ప్రమాదంపై మంత్రి వివేక్
పటాన్చెరు పారిశ్రామికవాడ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కనిపిస్తోంది. షిఫ్ట్లో 150 మంది కార్మికులు ఉండగా.. ప్రమాదం జరిగిన బ్లాక్లోనే 90 మంది దాకా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.. మృతుల సంఖ్య 15కి చేరింది. కంపెనీ మేనేజర్ ఒకరు సైతం మృతి చెందినట్లు సమాచారం. 26 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. అందులో పలువురిపరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. సంగారెడ్డి, సాక్షి: పటాన్చెరు పారిశ్రామికవాడ పాశమైలారంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. సిగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్ సహా చాలా భాగం దెబ్బతింది. ఆ సమయంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పరిసరాల్లోనే భారీ సంఖ్యలో కార్మికులు ఉన్నట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం 9గం. సమయంలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలి మంటలు వ్యాపించాయి. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డారు. కంపెనీలో ఎక్కడ పడితే అక్కడ క్షతగాత్రులు పడిపోయారు. ప్రమాద సమయంలో లోపల కార్మికులు చాలామందే ఉన్నారు. మంటల్లో.. శిథిలాల కింద పలువురు కార్మికులు చిక్కుకునిపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని తెలిపారు. అలాగే అధికారులు సకాలంలో స్పందించి చుట్టపక్కల ప్రజలను ఖాళీ చేయించడంతో మరింత ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో.. సహాయక చర్యలపై మంత్రులు కీలక ప్రకటనలు చేస్తున్నారు.భవన శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కార్మికులుశిథిలాలను తొగించిన కొద్దీ బయటపడుతున్న మృతదేహాలుగుర్తు పట్టరాని స్థితిలో మృతదేహాలుపాశమైలారంలోని ప్రమాద స్థలం నుంచి మరో రెండు మృత దేహాలు వెలికితీత15కి చేరిన మృతుల సంఖ్యమరణాలు, క్షతగాత్రుల సంఖ్యపై వెలువడని అధికారిక ప్రకటనపరిశ్రమ వద్ద, ఆస్పత్రుల వద్ద కార్మికుల కుటుంబాల నిరీక్షణ.. రోదనలుఆచూకీ లభించక శోకసంద్రంలో కుటుంబాలుభారీ వర్షంలోనూ కొనసాగుతున్న సహాయక చర్యలురేపు సంగారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్రెడ్డిరేపు ఉదయం పాశమైలారం ప్రమాద ఘటన స్థలానికి వెళ్లనున్న రేవంత్పాశమైలారం ఘటనపై సీఎం విచారంక్షేత్ర స్థాయిలో జరుగుతున్న సహాయక చర్యలపై సీఎం ఆరాప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని అధికారులకు ఆదేశంగాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన సీఎంబాధాకరం: ప్రధాని మోదీ సంగారెడ్డి ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతిచాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరంతమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానుక్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.మృతుల బంధువులకు PMNRF నుండి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తాంసీఎం రేవంత్ విచారంపాశమైలారం ఫ్యాక్టరీ పేలుడు ఘటనపై సీఎం రేవంత్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనలో పలువురు మరణించడం బాధాకరమన్న ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా ఆదేశాలిచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. కేటీఆర్ దిగ్భ్రాంతిపటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన రియాక్టర్ పేలుడుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతికార్మికులు చనిపోవడం అత్యంత విషాదకరంగాయపడిన వారిని రక్షించి అత్యుత్తమ వైద్య సహాయం అందించాలిమృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలిప్రమాదానికి కారణాలు తెలుసుకుని బాధ్యులను శిక్షించాలి 15 నిమిషాల్లో స్పందించాం: మంత్రి వివేక్ఘటన జరిగిన 15నిమిషాల్లో స్పందించాం. కలెక్టర్, జిల్లా యంత్రాగ సమన్వయంతో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. వెంటనే 34మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం.. 12మంది ఐసీయూలో ఉన్నారు. వెంటిలేటర్ పై చికిత్స అందుతోంది. మొత్తం ఘటనలో12మంది చనిపోయారు. ప్రమాదంలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. చర్మం, శరీరం తీవ్రంగా కాలిపోయాయి. హైడ్రా కూడా చేరుకుంది.. షాకిలాలను తీసివేస్తున్నారు. ఆ తర్వాత క్లారిటీ వస్తుంది.. రియాక్టర్ మొదట బ్లాస్ట్ కాలేదు. నిర్లక్ష్యం ఏంటి అనేది ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ తర్వాత క్లారిటీ వస్తుంది. నిజంగా విచారణ జరిపి బాద్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం అని మంత్రి వివేక్ మీడియాకు తెలిపారు.ఎక్కడా నిర్లక్ష్యం లేదు: మంత్రి రాజనర్సింహసిగాచి కంపెనీ ప్రమాదంపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందని.. సకాలంలో స్పందించి ఉంటే ప్రాణాలు పోయేవి కావని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలను మంత్రి దామోదర రాజనర్సింహ ఖండించారు. సిగచి కంపెనీ ప్రమాదం బాధాకరం. ఉదయం 9గం.ప్రాంతంలో ప్రమాదం జరిగింది. మూడు గంటల నుంచి ప్రమాద స్థలంలోనే ఉన్నాం. సంఘటన జరిగినా వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. ఎమర్జెన్సీ సిస్టం ద్వారా త్వరితగతిన క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాం. ఫ్యాక్టరీలో మైక్రో క్రిస్టల్ పౌడర్ ని తయారు చేస్తుంటారు. మార్నింగ్ 60మంది వర్కర్స్ పనిలో ఉన్నారు. జనరల్ వాళ్ళు 20మంది ఉన్నారు. ఆస్పత్రిలో 34మందికి చికిత్స అందుతోంది. 12 మృతదేహాలను ఇప్పటిదాకా వెలికి తీశాం. ప్రతి కార్మికుడికి ప్రభుత్వం వైద్యం అందిస్తుంది.. ఎక్కడ నిర్లక్ష్యం లేదు. మృతుల కుటుంబాలను పరామర్శిస్తాం. ప్రభుత్వం తరపున బాధితులకు అండగా ఉంటాం. ప్రతి కార్మిక కుటుంబాన్ని అదుకుంటాం. ఈ ప్రమాదాన్ని రాజకీయం చేయడం సరికాదు అని మంత్రి రాజనర్సింహ అన్నారు. ఇదీ చదవండి: ఫ్యాక్టరీ ప్రమాదం.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే!👉ఐజీ సత్యనారాయణ ప్రమాదంపై మీడియాతో మాట్లాడారు. రియాక్టర్ పేలడంతో ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన టైంలో.. షిఫ్ట్లో 150 మంది ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటిదాకా 8 మంది మరణించారు. మూడు ఆస్పత్రుల్లో 26 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకొక బ్లాక్ ఓపెన్ చేయాల్సి ఉంది.. అందులో కార్మికులు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది అని తెలిపారు. 👉ప్రమాదం తర్వాత.. ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగసి పడ్డాయి. ప్రమాదం గురించి తెలియగానే కలెక్టర్, ఐజీ, సంగారెడ్డి ఎస్పీ, అడిషనల్ కలెక్టర్.. అధికార యంత్రాంగమంతా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. సీఎం రేవంత్రెడ్డి ప్రమాదంపై ఆరా తీశారు. ప్రమాద వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 👉ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగ, ఘాటైన వాసనలు వెలువడుతుండడంతో అక్కడున్నవాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో అటువైపుగా ఎవరూ రావొద్దని స్థానికులను పోలీసులు కోరుతున్నారు. మొత్తం 8 ఫైర్ ఇంజిన్లు అక్కిడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నంలో ఉన్నాయి. ప్రమాద స్థలానికి భారీగా ఆంబులెన్స్లు చేరుకుని క్షతగాత్రుల్ని తరలిస్తున్నాయి. భారీ క్రేన్లు, కట్టర్ల సాయంతో ఘటనా స్థలానికి చేరుకున్న హైడ్రా బృందం.. అడ్మిన్స్ట్రేషన్ బిల్డింగ్ శిథిలాల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. -
కెమికల్ ఫ్యాక్టరిలో భారీ పేలుడు.. ఆరుగురి మృతి
ముంబై: మహారాష్ట్రలో భారీ పేలుడు సంభవించింది. థానే డొంబివాలిలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరిలోని బాయిలర్లో గురువారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరిలో భారీగా మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. భారీగా ఎగిసిన పడిన మంటలు మరో రెండు బిల్డింగ్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 25 మంది గాయపడ్డారు.Dombivli MIDC Blast: Fire breaks out at Amber chemicals factory after boiler explosion, at least 35 injured#Dombivli #DombivliFire #Maharashtra #DombivliBlast #Thane #ThaneBlast #MIDC #MIDCBlast pic.twitter.com/Eolghrk4UL— Siraj Noorani (@sirajnoorani) May 23, 2024 దీంతో సమాచారం అదుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని 15 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. ఫ్యాక్టరి భవనంలో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా రెస్క్యూ చేసి పోలీసులు కాపాడారు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు, పక్కనే ఉన్న కొన్ని ఇళ్లు పాక్షికంగా కాలిపోయినట్లు తెలుస్తోంది.#THANE: Massive explosion in #Dombivli MIDC, preliminary information about explosion in amber company's boiler, fire tenders have rushed to the spot. Smoke billowing in the area. pic.twitter.com/mOFdJwylKu— Siraj Noorani (@sirajnoorani) May 23, 2024 -
సంగారెడ్డి ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్.. ఏడుగురు కార్మికుల మృతి
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం.. చందాపూర్ గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎస్బీ ఆర్గానిక్ ఫ్యాక్టరీలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీలో పనిచేసే మేనేజర్ రవితోపాటు ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. రియాక్టర్ పేలుడుతో కార్మికులు వందల మీటర్ల దూరం ఎగిరిపడ్డారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది ఫైరింజన్లతో మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దుర్ఘటన జరిగిన సమయంలో కంపెనీలో 50 మంది కార్మికులు పని చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న బాధితులు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే ఒక రియాక్టర్ నుంచి మరో రియాక్టర్కు మంటలు వ్యాపించాయి.దీంతో ఇంకో రియాక్టర్ పేలితే ప్రమాదం మరింత త్రీవతరం అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు పరిశ్రమ పరిసరాల నుంచి ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. గాయపడిన క్షతగాత్రుల్ని సిబ్బంది అత్యవసర చికిత్స కోసం సంగారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి ఎస్బీ ఆర్గానిక్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్ళి సహాయక చర్యలను పర్యవేక్షించల్సిందిగా ఫైర్ సర్వీసెస్ డి.జి. నాగిరెడ్డిని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీని కోరారు. పరిశ్రమ ప్రమాదంపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందజేయాలని జిల్లా అధికారులకు సూచించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే హరీష్ రావు సానుభూతి సంగారెడ్డి పరిశ్రమలో రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. -
రసాయన కర్మాగారంలో పేలుడు.. ఆరుగురు దుర్మరణం!
రాజస్థాన్లోని జైపూర్ పరిధిలో గల బస్సీలోని షాలిమార్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. గాయపడిన ఇద్దరిని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళానికి చెందిన వాహనాలు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మృతులను మనోహర్, హీరాలాల్, కృష్ణలాల్ గుర్జార్, గోకుల్ హరిజన్లుగా పోలీసులు గుర్తించారు. ఆసుపత్రిలో చేరిన వారిని ఇంకా గుర్తించలేదు. పరిశ్రమలోని బాయిలర్ పేలడంతో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక దళం, రెస్క్యూ టీం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. -
రసాయనాల ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం
సూరత్: గుజరాత్లోని సూరత్లోని ఓ రసాయనాల కర్మాగారంలో సంభవించిన పేలుడు, ఘోర అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. మరో 25 మంది గాయాలపాలయ్యారు. సచిన్ పారిశ్రామిక ప్రాంతంలోని ఈథర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో గురువారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో రసాయనాలు నిల్వ ఉన్న ట్యాంకులో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. అనంతరం చెలరేగిన మంటలు కర్మాగారాన్ని చుట్టుముట్టాయి. అగ్నిమాపక సిబ్బంది సుమారు 9 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. -
రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి
అహ్మదాబాద్: గుజరాత్లోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మృతి చెందారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు. ఈథర్ రసాయనం తయారు చేయు పరిశ్రమలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున ఇండస్ట్రీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణ్లాలోనే అగ్ని కీలలు ఫ్లోర్ అంతా వ్యాపించాయి. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు అదృశ్యమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఏడుగురు కార్మికుల మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియదు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగించినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి అసలు కారణాన్ని వెల్లడిస్తామని తెలిపారు. అయితే.. ఈ ప్రమాదంలో దాదాపు 1.3 మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం సంభవించినట్లు పరిశ్రమ యజమాని అశ్విన్ దేశాయ్ తెలిపారు. ఇదీ చదవండి: నూతన రామాలయ ప్రారంభోత్సవంలో పాక్ కళాకారుల ప్రదర్శనలు -
నల్లగొండ జిల్లాలో భారీ ప్రమాదం.. రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్
-
నల్గొండలో భారీ అగ్నిప్రమాదం.. పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో..
సాక్షి నల్గొండ: జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హిందీస్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీ నుంచి భారీ శబ్ధం రావడంతో భయంతో జనాలు పరుగులు తీశారు. ఘటనా స్థలంలో మంటలు భారీగా ఎగిపడుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొస్తుంది. చదవండి: Dellhi Liquor Scam: సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట.. -
పోరస్ ఫ్యాక్టరీ బాధిత కుటుంబాలకు పరిహారం
ముసునూరు: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ ఫ్యాక్టరీ ప్రమాద ఘటనలో మృతి చెందిన, తీవ్రంగా గాయాలపాలైన బాధిత కుటుంబాలకు జిల్లా రెవెన్యూ అధికారి ఏవీ సత్యనారాయణమూర్తి, నూజివీడు ఆర్డీవో కంభంపాటి రాజ్యలక్ష్మి శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిహారం చెక్కులను అందజేశారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ప్రమాదంలో మృతి చెందిన బిహార్కు చెందిన మనోజ్ మోచి, అవదేశ్ రవిదాస్, కారు రవిదాస్, సుభాష్ రవిదాస్లకు సంబంధించి పరిహారం చెక్కులను వారి భార్యలైన కాజల్ కుమారి, అసర్ఫి దేవి, రుమాదేవి, శాంతిదేవిలకు రూ.50 లక్షల చొప్పున రూ.2 కోట్లను అందజేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రౌషన్ మోచి, వరుణ్ దాస్, సుధీర్ రవిదాస్, సుధీర్ కుమార్ అలియాస్ సుధీర్ రవిదాస్ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెక్కులను వారి భార్యలైన రేణుదేవి, కంచన దేవి, రింకు దేవిలకు రూ.15 లక్షలను డీఆర్వో సత్యనారాయణమూర్తి అందజేశారు. కార్యక్రమంలో నూజివీడు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి, ముసునూరు తహశీల్దార్ ఎస్.జోజి, కలెక్టరేట్ సిబ్బంది రాజ్కుమార్ పాల్గొన్నారు. -
24 గంటలలోపే.. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు
అక్కిరెడ్డిగూడెం (ముసునూరు)/నూజివీడు: ప్రమాదాలు, విపత్తుల వేళ తమ ప్రభుత్వం తక్షణం స్పందిస్తూ.. పరిహారం ప్రకటించిన 24 గంటలలోపే బాధిత కుటుంబాలకు అండగా నిలబడి ఆదుకుంటోందని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ కంపెనీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన బొప్పూడి కిరణ్ కుటుంబ సభ్యులను శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ అరుణ్బాబు, అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్కుమార్రెడ్డి, ఇతర అధికారులతో కలసి ఎమ్మెల్యే పరామర్శించారు. మృతుని భార్య బొప్పూడి సుధారాణికి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడగా.. వారిలో ఒకరు ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదపకు చెందిన ఉదరుపాటి కృష్ణయ్య. మృతుడి భార్యకు, కుటుంబ సభ్యులకు వివాదం ఉండటంతో ఎక్స్గ్రేషియాను భార్యకు ఇవ్వాలా, మృతుడి తల్లిదండ్రులకు ఇవ్వాలా అనే దానిపై స్పష్టత రాకపోవడంతో ప్రస్తుతానికి పెండింగ్లో ఉంచారు. బీహార్కు చెందిన నలుగురు మృతులకు సంబంధించిన లీగల్ హెయిర్ కోసం ఏలూరు జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ బీహార్లోని నలంద జిల్లా కలెక్టర్కు లేఖ పంపారు. అక్కడి నుంచి లీగల్ హెయిర్ వచ్చిన తరువాత వారికి నష్టపరిహారం చెల్లిస్తామని ఆర్డీవో కంభంపాటి రాజ్యలక్ష్మి తెలిపారు. ఇదిలాఉండగా.. ఆరుగురి మృతికి కారణమైన పోరస్ కెమికల్స్ కంపెనీపై ముసునూరు పోలీస్ స్టేషన్లో ఐపీసీ 337, 338, 304 (జీజీ) సెక్షన్ల కింద శుక్రవారం కేసు నమోదైంది. తాత్కాలికంగా మూసివేసిన పోరస్ కంపెనీ వద్ద పోలీస్ పహారా నిర్వహిస్తున్నారు. ఫ్యాక్టరీని డ్రగ్ కంట్రోల్ ఏడీ పాండురంగ వరప్రసాద్ సందర్శించి లైసెన్స్ ఉందా, లేదా అని తనిఖీ చేశారు. క్షతగాత్రులకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేత కాగా, ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్గ్రేషియాను శుక్రవారం నూజివీడులో అందజేశారు. ప్రమాదంలో రమణక్కపేటకు చెందిన సాయిల నాగేశ్వరరావు, సూరేపల్లికి చెందిన షేక్ సుభాని, చాట్రాయి మండలం తుమ్మగూడేనికి చెందిన కంచర్ల జోసెఫ్, నూజివీడు పట్టణానికి చెందిన చందోలు రాజీవ్ గాయపడగా.. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్బాబు చెక్కుల రూపంలో అందజేశారు. కార్యక్రమాల్లో జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్, ఆర్డీవో కె.రాజ్యలక్ష్మి, డీఎస్పీ బుక్కాపురం శ్రీనివాసులు, తహసీల్దార్ కేఎస్ జోజి పాల్గొన్నారు. -
పోరస్ ఫ్యాక్టరీ మూసివేత
సాక్షి, అమరావతి/నూజివీడు/ముసునూరు/లబ్బీపేట/భవానీపురం: బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆరుగురి మృతికి కారణమైన ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ను మూసివేస్తూ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. నీటి (కాలుష్య నివారణ, నియంత్రణ)చట్టం 1974లోని 33ఏ, గాలి (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం 1981ను అనుసరించి ఫ్యాక్టరీపై చర్యలు తీసుకున్నారు. విద్యుత్ కనెక్షన్ను కూడా తొలగించారు. బుధవారం రాత్రి 10.55 గంటలకు ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించడంతో గురువారం సాయంత్రం వరకు ఆరుగురు మృతి చెందడంతో పాటు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికితోడు పర్యావరణానికి సైతం నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. సీఎఫ్వో నిబంధనలు పాటించకపోవడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలుష్యానికి కారణమైనట్టు గుర్తించారు. ఫ్యాక్టరీలోని వ్యర్థాలను క్రమపద్ధతిలో తొలగించాలని ఆదేశాలు జారీ చేశామని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఎ.కె.పరీడా తెలిపారు. ఇదిలా ఉండగా ప్రమాద ఘటనపై గురువారం ఉదయం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారాన్ని పరిశ్రమ యాజమాన్యం ప్రకటించింది. గ్యాస్ లీక్ వల్లే మంటలు ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులు తయారయ్యే ఈ ఫ్యాక్టరీలోని డీబ్లాక్లో ఉన్న 3కేఎల్ సామర్థ్యం గల స్టెయిన్లెస్ స్టీల్ రియాక్టర్లో ఒత్తిడి కారణంగా పేలుడు సంభవించి గ్యాస్ ఒక్కసారిగా లీకైంది. దీంతో వెంటనే మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఉద్యోగులు మంటల్లో చిక్కుకున్నారు. ఐదుగురు అక్కడికక్కడే సజీవ దహనమవ్వగా, మరొక వ్యక్తిని విజయవాడలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుల్లో నలుగురు బిహార్ రాష్ట్రం నలంద జిల్లాకు చెందినవారు. మిగిలిన ఇద్దరిలో ఒకరిది అక్కిరెడ్డిగూడెం కాగా మరొకరిది ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదప. ఈ ప్రమాదంలో ఉదురుపాటి కృష్ణయ్య (34), అవదేష్ రవిదాస్ (30), కారు రవిదాస్ (25), మనోజ్కుమార్ (25), సువాస్ రవిదాస్ (32), బొప్పూడి కిరణ్ (32) మృతి చెందారు. వీరిలో కృష్ణయ్య కెమిస్ట్గా పని చేస్తున్నాడు. తీవ్రంగా గాయపడ్డ 12 మందిని తొలుత విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. గురువారం కంపెనీ యాజమాన్యం అక్కడికి చేరుకుని వారిని మెరుగైన చికిత్స కోసం ఆంధ్రా ఆస్పత్రికి తరలించింది. క్షతగాత్రులను హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఇక్కడ రోష¯Œ (30), సుధీర్ రవిదాస్ (30), రవి (36), వరుణ్దాస్ (30), మునారక్ (30), సుధీర్కుమార్ (35), జోసెఫ్ (30), వికారి రవిదాస్ (30)తో పాటు స్థానిక గ్రామాలకు చెందిన నాగేశ్వరరావు(30), ముల్లపూడి నాగరాజు (35), ఎస్కే సుభానీ(30) ఉన్నారు. వీరిలో ఏడుగురు బిహార్కు చెందిన వారు. సీహెచ్ రాజీవ్ (38)కు 5% గాయాలే కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాక ఇంటికెళ్లాడు. అంతకు ముందు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్ గురువారం స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్బాబు, డీఐజీ పాల్రాజు, ఎస్పీ రాహుల్దేవ్ శర్మ తదితరులు ఘటన స్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాల గురించి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. తక్షణ సాయంగా రూ.లక్ష అందించనున్నట్టు తెలిపారు. వాల్వ్ సరిగా లేనందునే ప్రమాదం! ఫ్యాక్టరీ దుర్ఘటనకు గ్యాస్ లీకే కారణంగా ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు ఫ్యాక్టరీ డైరెక్టర్ చంద్రశేఖర్ వర్మ ‘సాక్షి’కి వెల్లడించారు. రియాక్టర్ వద్ద వాల్వ్ సరిగా కట్టకపోవడం వల్ల గ్యాస్ లీక్ కావడంతో ఉష్ణోగ్రతలు పెరిగి రియాక్టర్ పేలి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సేకరించిన వస్తువులను తదుపరి పరీక్షల కోసం ల్యాబొరేటరీకి పంపామని, నివేదిక వచ్చాక వాస్తవ కారణాలు తెలుస్తాయన్నారు. పాలిమర్స్ గ్రాన్యూల్స్ తయారీలో వినియోగించే 4ఎంపీఐ పౌడర్ను ఇక్కడ తయారు చేస్తున్నారు. 4వ రియాక్టర్లో 1,500 కేజీలకుపైగా పాథలిక్ ఎన్హైడ్రేడ్ అనే కెమికల్ కాంపౌండ్ తయారీలో భాగంగా మిథేల్మెన్ అనే రసాయనాన్ని పంపుతున్నప్పుడు ఉష్ణోగ్రత పెరిగి రియాక్టర్ పేలినట్లుగా తెలుస్తోంది. మృతి చెందిన బిహార్ వాసుల బంధువులతో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ రాహుల్దేవ్ శర్మ ప్రధాని మోదీ సంతాపం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్ సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదే ఘటనపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారని రాజ్భవన్ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్ ఫ్యాక్టరీలో బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారంగా ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్ను, ఎస్పీని ముఖ్యమంత్రి ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందించాలని చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ ప్రమాదంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఆరా తీశారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్తో గురువారం ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. -
పోరస్ లేబొరేటరీస్ మూసివేత
సాక్షి, అమరావతి: ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడం పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అధికారులు జరిపిన దర్యాప్తులో ఫ్యాక్టరీలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తేలింది. దీంతో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ ఏకే ఫరీడ పోరస్ లేబొరేటరీస్ను మూసేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. కాగా.. పోరస్ లేబొరేటరీస్లో అర్థరాత్రి రియాక్టర్ పేలడంతో యూనిట్-4లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు బీహార్కు చెందిన వారున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా వాతావరణ కాలుష్యం కూడా జరిగింది. -
ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని మోదీ సీఎం వైఎస్ జగన్ సంతాపం..
-
ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
-
పోరస్ బాధితులకు సీఎం జగన్ రూ. 25 లక్షల పరిహారం..
-
అవసరమైతే పోరస్ ఫ్యాక్టరీని సీజ్ చేస్తాం: హోంమంత్రి తానేటి వనిత
-
పోరస్ ఫ్యాక్టరీ ప్రమాదం చాలా బాధాకరం: హోంమంత్రి తానేటి వనిత
-
అవసరమైతే పోరస్ ఫ్యాక్టరీని సీజ్ చేస్తాం: హోంమంత్రి తానేటి వనిత
సాక్షి, విజయవాడ: పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన బాధితుల్ని ఆంధ్రా ఆస్పత్రిలో హోం మంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పోరస్ ఫ్యాక్టరీ ప్రమాదం చాలా బాధాకరం. బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. బాధితులందరికీ అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఫ్యాక్టరీ యాజమాన్యం తరపున రూ.25 లక్షల పరిహారం అందజేస్తాం. ఇక్కడ ఫ్యాక్టరీ వద్దని స్థానికులు అంటున్నారు. ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించాం. అవసరమైతే ఫ్యాక్టరీని సీజ్ చేస్తాం' అని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. చదవండి: (ఏలూరు: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి) -
ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: మంత్రి జయరామ్
సాక్షి, అమరావతి: పోరస్ ఇండియా కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాద ఘటనపై కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి, ప్రమాద పరిస్థితిపై సమీక్షించారు. సంబంధిత అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆరుగురు కార్మికుల మృతిపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో వ్యక్తులకు గాయాలు అయిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందించాలని మంత్రి గుమ్మనూరు ఆదేశించారు. ప్రమాదంపై తక్షణమే విచారణ చేపట్టి, పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద ఘటనలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షలు, ఫ్యాక్టరీ యాజమాన్యం రూ. 25లక్షలు అందిస్తుంది. ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు వారికి రూ.5లక్షలు, చిన్న గాయాలు అయిన వారికి రూ. 2లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు, వారు కోలుకునే వరకు వారికి ఫ్యాక్టరీ తరుపున జీతం ఇవ్వడం జరుగుతుంది. ప్రమాదానికి కారుకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. చదవండి: (ఏలూరు: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి) తాత్కాలికంగా మూసేస్తున్నాం: జిల్లా కలెక్టర్ హై ప్రెషర్ కెమికల్ రియాక్షన్ వల్లే పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. అయితే ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స జరుగుతున్నంతకాలం కంపెనీ వేతనం అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఫోరస్ కంపెనీని తాత్కాలికంగా మూసేస్తున్నట్లు తెలిపారు. అయితే కంపెనీ నిబంధనలు ఏమైనా ఉల్లంఘించిందా..? ప్రమాదకర రసాయనాల వినియోగం ఏమైనా ఉందా? అనే అంశంపై విచారణ చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. చదవండి: (అగ్నిప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం) -
అగ్నిప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి..మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటన
-
ఏలూరు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారంగా ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయవల్సిందిగా జిల్లా కలెక్టర్ను, ఎస్పీని ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధాని మోదీ సంతాపం న్యూఢిల్లీ: ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చదవండి: ఏలూరు: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి -
ఏలూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు మృతి
-
ఏలూరు: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి
సాక్షి, ఏలూరు: ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడం పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. యూనిట్-4లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు బీహార్కు చెందిన వారున్నారు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో గాయపడిన వారందరినీ ఏడు 108 అంబులెన్స్లలో నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వారిని విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. విజయవాడ ఆస్పత్రిలో 12 మందిని చేర్చారు. మార్గమాధ్యలో ఒకరు మృతి చెందారు. 12 మందికి చికిత్స అందిస్తున్నాం. ఒకరిద్దరు తప్ప అందరి పరిస్థితి విషమంగా ఉంది. 70 శాతంపైగా గాయాలయ్యాయి. బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్నామని భాగ్యలక్ష్మి అన్నారు. ఘటనపై సూపర్వైజర్ రాజు స్పందిస్తూ.. ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా భారీ శబ్ధం వచ్చింది. చూసేసరికి ఫ్యాక్టరీ మొత్తం మంటలు అలుముకున్నాయి. కింది విభాగంలో పనిచేస్తున్న అందరం బయటకు పరుగులు తీశాం. పైవిభాగంలో పనిచేస్తున్న కొంతమంది మంటల్లో సజీవదహనమయ్యారు. ప్యాక్టరీలో ఎప్పుడూ ఇలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు. -
ఘోర ప్రమాదం.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
గుజరాత్లో భరూచ్లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ఆరుగురు పనివాళ్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. అహ్మదాబాద్కు 235 కిలోమీటర్ల దూరంలోని దహేజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన అర్ధరాత్రి 3గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీలోని ఓ రియాక్టర్ దగ్గర పని చేస్తుండగా పేలుడు సంభవించి వాళ్లంతా మృత్యువాత పడ్డట్లు భరూచ్ ఎస్పీ లీనా పాటిల్ తెలిపారు. ప్రమాదంలో ఇంకెవరూ గాయపడలేదని వెల్లడించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి 2 లక్షల రూపాయల సాయం బాధిత కుటుంబాలకు అందజేయనున్నట్లు ట్వీట్ చేసింది ప్రధాని కార్యాలయం. అలాగే ఎవరైనా గాయపడితే రూ. 50 వేలు అందించనున్నట్లు తెలిపింది. PM @narendramodi has expressed grief on the loss of lives due to a mishap at a factory in Bharuch. He extends condolences to the bereaved families. An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of the deceased. The injured would be given Rs. 50,000. — PMO India (@PMOIndia) April 11, 2022 -
రసాయన ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
ముంబై: పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో రసాయన కర్మాగారంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. పూణేకు 250 కిలోమీటర్ల దూరంలోని కొల్హాపూర్ జిల్లాలోని ఇచల్కరంజి నగర శివార్లలోని వస్త్ర పారిశ్రామిక ఎస్టేట్లో ఉన్న యూనిట్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందడంతో ఉదయం 7.30 గంటలకు నాలుగు అగ్నిమాపక ట్యాంకర్లు సంఘటనా స్థలానికి చేరుకుని ఉదయం 11 గంటలకు మంటలు ఆర్పివేసినట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
మేడ్చల్ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం..
హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని పారిశ్రామికవాడలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. జీడిమెట్లలోని నాసెన్స్ రసాయన పరిశ్రమలో నుంచి మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. కాగా, స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ క్రమంలో.. పోలీసులు, ఫైర్సెఫ్టీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాగా, క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను నాలుగు ఫైరింజన్ల సహయంతో అదుపులోనికి తేవడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఆకాశంలో నల్లని పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటనకు బాయిలర్ పేలుడే కారణమని స్థానికులు తెలిపారు. కాగా, ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పుణె రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం
పుణె: పుణె పారిశ్రామిక వాడలోని ఓ రసాయన కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 18 మంది చనిపోయారు. పుణె శివారు పిరంగూట్లోని ఎస్వీఎస్ ఆక్వా టెక్నాలజీస్ పరిశ్రమలో సోమవారం సాయం త్రం 4 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ‘ఈ ఘటనలో కాలిపోయి, గుర్తు పట్టేందుకు వీలుకాని స్థితిలో ఉన్న 18 మృతదేహాలను వెలికి తీశాం. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే. పరిశ్రమ ఆవరణలో ప్లాస్టిక్ మెటీరియల్ను ప్యాక్ చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది’అని పుణే చీఫ్ ఫైర్ ఆఫీసర్ దేవేంద్ర వెల్లడించారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్లాస్టిక్ కారణంగానే మంటలు వేగంగా వ్యాపించి ఉంటాయని ఆయన అన్నారు. నీటి శుద్ధికి వాడే క్లోరిన్ డయాక్సైడ్ ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. చదవండి: Iran: అతిపెద్ద యుద్ధనౌక కథ విషాదాంతం -
కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ముగ్గురి మృతి
సాక్షి, నెల్లూరు: వింజమూరు మండలం చండ్రపడియాలో విషాదం చోటు చేసుకుంది. చండ్రపడియాలోని కెమికల్ ఫ్యాక్టరీలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ లీకై ముగ్గురు మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో గతంలోనూ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. చదవండి: ఏపీలో కరోనా నిబంధనలు మరింత కఠినతరం మామిళ్లపల్లి పేలుడు కేసులో ఇద్దరి అరెస్ట్ -
భారీ పేలుడు, ఆరుగురు దుర్మరణం
సాక్షి ముంబై: మహారాష్ట్రలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని నింపింది. రత్నాగిరి జిల్లాలోని ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఘర్డా కెమికల్స్ వద్ద శనివారం ఉదయం ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే సజీవ దహనం కాగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఇరుక్కున్న 40 -50మందిని అగ్నిమాపక దళ సిబ్బంది రక్షించింది. క్షతగాత్రులను సమీపంలోని సివిల్ ఆసుపత్రికి తరలించిన అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. తీవ్రంగా గాయపడినవారిని ముంబైకి తరలిస్తున్నారు. ఈ ప్రమాదం వెనుక గల కారణాన్ని ఇంకా నిర్ధారించలేదు. అయితే బాయిలర్ పేలుడు ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. -
పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి
సాక్షి, సంగారెడ్డి : జిల్లాలోని సదాశివపేట మండలం నందికందిలో బ్లూ క్రాఫ్ట్ కెమికల్ కంపెనీలో రియాక్టర్లో పేలుడు సంభవించింది.. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఒకరు వరంగల్ జిల్లా వాసి అరవింద్ కాగా మరొకరు కర్ణాటకకు చెందిన బస్వరాజ్. అయితే మృత దేహాలను గుట్టు చప్పుడు కంపెనీ యాజమాన్యం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించింది. (మోదీ పుట్టిన రోజు వేడుకలో ఒక్కసారిగా మంటలు) -
పాల్ఘర్ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు
పాల్ఘర్ : మహారాష్ర్టలోని పాల్ఘర్ జిల్లా తారాపూర్లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ధాటికి ఇద్దరు కార్మికులు మరణించారు. గతరాత్రి జరిగిన ఈ పేలుడు ఘటనలో మరో నలుగరు తీవ్రంగా గాయపడగా, ఆ సమయంలో 20 మంది కార్మికులు ఫ్యాక్టరీ లోపలే ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలను ముమ్మరం చేయడంతో ప్రాణహాని తగ్గిందని అధికారులు అంచనా వేశారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. (ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు) కర్మాగారంలో సుగంధ రసాయనాలు, ఔషదాలును తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది. రియాక్టర్ పేలుడు శబ్ధం దాదాపు 10 కిలోమీటర్ల దాకా వినిపించిందని స్థానికులు తెలిపారు. అయితే రియాక్టర్లో నీటి పీడనం పెరగడం వల్ల పేలుడు సంభవించిందని ప్లాంట్లోని సందీప్ సింగ్ అనే ఆపరేటర్ పోలీసులకు తెలిపారు. ఈ ఏడాది ఎంఐడిసి ప్రాంతంలో జరిగిన రెండో పేలుడు ఇదేనని అధికారులు తెలిపారు. కంపెనీ ఉపయోగించే కొన్ని రసాయనాలు ప్రమాదకరమైనవిగా గుర్తించారు. ఇదే యూనిట్లో గతంలోనూ ప్రమాదాలు జరిగినట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు వివరించారు. (విచారణకు సిట్ ఏర్పాటు) -
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
అహ్మదాబాద్ : గుజరాత్లోని వల్సద్ జిల్లా వాపీ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు చుట్టుపక్కల కమ్ముకున్నాయి. ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే దాదాపు 8 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాయి. ప్రమాద కారణాలు, ఏ మేరకు ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందని తెలియాల్సి ఉంది. -
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
-
నెల్లూరు: కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
-
ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: ఐదుగురు మృతి
గాంధీనగర్: గుజరాత్లోని ఓ రసాయన ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం మధ్యాహ్నం దాహెజ్ పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుళ్లు సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. ఫ్యాక్టరీ మొత్తాన్ని మంటలు దహించివేస్తుండటంతో చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, పరిశ్రమలో పనిచేసే సుమారు 40 మంది సిబ్బంది గాయాలపాలైనట్లు బరూచ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నికీలలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. (కళ్ల ముందే కష్టం బూడిద) మరోవైపు అధికారులు ముందస్తు జాగ్రత్తగా పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనపై బరూచ్ జిల్లా కలెక్టర్ ఎండీ మోడియా మాట్లాడుతూ.. నేడు మధ్యాహ్నం అగ్రో కెమికల్ కంపెనీలో బాయిలర్ పేలుళ్లు సంభవించాయని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కాగా సోషల్ మీడియాలోనూ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. (భారీ అగ్ని ప్రమాదం: ఏడుగురు సజీవ దహనం) -
విశాఖ ఘటనతోనైనా మేల్కొనాలి
విశాఖ ఎల్జీ పాలిమర్ ఘటనతో జిల్లాలోని పారిశ్రామికవర్గాలు, అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. పారిశ్రామిక కారిడార్గా ఉన్న జిల్లాలో అమ్మోనియా గ్యాస్, ఎల్పీజీ ఆధారిత, కెమికల్ ఫ్యాక్టరీ చాలా ఉన్నాయి. ఆయా పరిశ్రమల్లో కూడా అడపాదడపా అగ్నిప్రమాదాలు, గ్యాస్ లీకేజీలు జరుగుతున్నాయి. మరణాలు సంభవించిన ఘటనలూ ఉన్నాయి. గత అనుభవాలు, విశాఖ ప్రమాద ఘటనతో జిల్లాలోని పరిశ్రమల్లో భద్రతా చర్యలకు దారితీశాయి. నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రత్యేక బృందాలతో తనిఖీ చేస్తున్నారు. సాక్షి, నెల్లూరు/నెల్లూరు(టౌన్): జిల్లాలో సుమారు 5,400 కుపైగా పరిశ్రమలున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో చాలావరకూ మూతపడ్డాయి. ఇటీవల సడలింపు చేసి నాన్ కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే పరిశ్రమల నిర్వహణకు అనుమతి ఇచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 70 శాతం పరిశ్రమల్లో పనులు ప్రారంభించారు. ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, నిత్యావసర వస్తువుల తయారీ తదితర కంపెనీలకు అనుమతులు జారీ చేశారు. పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించేందుకు అనుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని స్వీయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని చెప్పారు. ప్రధానంగా మాంబట్టు, కావలి, గూడూరు, కొడవలూరు, వెంకటాచలం, ముత్తుకూరు తదితర ప్రాంతాల్లోని పరిశ్రమలకు అనుమతులు జారీ చేశారు. పొంచి ఉన్న ప్రమాదం జిల్లాలో రసాయనాలు వెలువడే పరిశ్రమలు నడుస్తున్నాయి. వాటిల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఫార్మా, కెమికల్ ఫ్యాకర్టీలున్నాయి. వాటితోపాటు అమ్మోనియా గ్యాస్ ప్రాసెసింగ్ నిర్వహణతో నడిచే చిన్న తరహా పరిశ్రమలున్నాయి. గతంతో పలుచోట్ల కాలుష్యం వెదజల్లి ప్రజలు ఇబ్బందులు పడిన సంఘటనలున్నాయి. అలాగే ఎస్ఈజెడ్లలో ఏర్పాటైన పలు అమ్మోనియా గ్యాస్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల్లో కూడా గ్యాస్ లీకైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్నిచోట్ల బాయిలర్స్ ప్రమాదం జరిగి కొందరు చనిపోయారు. నిర్వహణలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ముప్పు వాటిల్లే అవకాశం లేకపోలేదు. జిల్లాలో సుమారు 50 పరిశ్రమలకు ఎన్ఓసీ లేదని తెలిసింది. ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన ఓ ఫ్యాక్టరీకి అనుమతి లేదని అధికారులు గుర్తించారు. తనిఖీల కోసం.. ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు స్టాండర్డ్స్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ను పాటిస్తున్నారా? లేదా? అని ప్రతిరోజూ తనిఖీలు నిర్వహించేందుకు జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్యర్యంలో టీములు ఏర్పాటు చేశారు. నెల్లూరు, కావలి, గూడూరు, నాయుడుపేట, ఆత్మకూరు డివిజన్లకు ఒక్కో బృందాన్ని నియమించారు. అవి ప్రతిరోజూ పరిశ్రమలను తనిఖీ చేస్తాయి. ప్రభుత్వ నిబంధనలు అమలు చేస్తున్నారా? లేదా? అని పరిశీలిస్తారు. ఆటోనగర్లో స్వీయ ధ్రువీకరణపత్రం సమర్పించి అనుమతి పొంది పనులు ప్రారంభించిన శ్రీ వెంకటేశ్వర వైర్స్ ప్రాడెక్ట్స్, పీఎల్ ప్లాస్ట్లను గురువారం అధికారులు తనిఖీ చేశారు. అయితే అవి కంటైన్మెంట్ జోన్లలో ఉండడంతో మూయించేశారు. విశాఖలో జరిగిన ఘటన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో పరిశ్రమలను పూర్తిస్థాయిలో తనిఖీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో జరిగిన ప్రమాదాలు ♦ తడ మండలంలోని మాంబట్టు సెజ్ పరిధిలో ఉన్న ఇండస్ కాఫీ పరిశ్రమలో 2015లో బాయిలర్ శుభ్రం చేసే సమయంలో ముగ్గురు యువకులు మరణించారు. బాయిలర్లో దిగిన ఒకరిని రక్షించే క్రమంలో మరొకరు దిగి ఊపిరాడక ప్రాణాలొదిలారు. ♦ ముత్తుకూరు మండలంలోని పడమటినాగలదొరువులో ఇటీవల శ్రీసాయి సుబ్రహ్మణ్యేశ్వర పామాయిల్ ప్యాకెట్ల తయారీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. రూ.3 కోట్లకుపైగా ఆస్తినష్టం జరిగింది. ♦ గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలంలోని బూదనం సమీపంలో ఉన్న పాల డెయిరీలో రెండున్నరేళ్ల క్రితం అమ్మోనియా గ్యాస్ లీకైంది. ఆ సమయంలో కార్మికులు కొందరు స్పృ కోల్పోయారు. అలాగే పున్నపువారిపాళెం ప్రాంతంలో ఉన్న రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలో కూడా అమ్మోనియా గ్యాస్ లీకై కొందరు అస్వస్థతకు గురయ్యారు. రెండేళ్ల క్రితం కోట మండలం చిట్టేడు వద్ద ఉన్న రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలో ఒక వ్యక్తి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మృతిచెందాడు. అయినా పరిశ్రమ యాజమాన్యం తగిన జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతో ఈ ఏడాది మార్చి నెలలో మరో వ్యక్తి బలయ్యాడు. ♦ కొడవలూరు మండలంలో గతంలో ఓ రొయ్యల పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీకవడంతో దివ్యాంగుడైన ఓ కార్మికుడు మృతిచెందాడు. ఏమి చేయాలంటే.. ♦ కరోనా వైరస్ నేపథ్యంలో పరిశ్రమలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పరిశ్రమల శాఖ అధికారులు చెబుతున్నారు. ♦ రెడ్జోన్ పరిధిలో ఉండే ఉద్యోగులు, కార్మికులను అనుమతించకూడదు. పరిమిత సంఖ్యలో సిబ్బంది చేత పని చేయించుకోవాలి. ♦ సిబ్బంది భౌతికదూరం తప్పకుండా పాటించాలి. ప్రతిఒక్కరికీ స్క్రీనింగ్ టెస్ట్ చేసి టెంపరేచర్ చెక్ చేయాలి. ♦ పరిశ్రమ లోపలి భాగంతోపాటు బయట శానిటైజర్ను స్ప్రే చేయాలి. ♦ ఏళ్ల తరబడి ఉన్న వైరింగ్, పైపులైన్లను ఒకసారి చెక్ చేసి లీకేజీలు ఉంటే వాటికి మరమ్మతులు చేయడం లేదా, కొత్త వాటిని బిగించడం చేయాలి. ♦ ఫైర్ సేఫ్టీ ధ్రువీకరణపత్రం, పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. -
విషాదం; గ్యాస్ లీకై ఏడుగురి మృతి
-
విషాదం; గ్యాస్ లీకై ఏడుగురి మృతి
సీతాపూర్ : కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ పైప్లైన్ లీకవడంతో పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందిన ఘటన గురువారం ఉత్తర్ప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలోని చోటుచేసుకుంది.కాగా మృతి చెందినవారిలో ముగ్గరు పిల్లలు ఉన్నట్లు తేలింది. స్థానికులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని తమ పరిధిలోకి తీసుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. జిల్లా ఎస్పీ ఎల్ఆర్ కుమార్ మాట్లాడుతూ.. బిస్వాన్ ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ పైప్లైన్ లీకై పేలుడు సంభవించిందని తెలిపారు. అయితే పేలుడు జరిగిన ప్రదేశం పక్కనే కార్పెట్ తయారీ కంపెనీ ఉండడంతో వాటికి మంటలు అందుకొని దట్టంగా పొగలు అలుముకున్నాయి. కాగా కార్పెట్ కంపెనీని ఆనుకొని ఏడుగురు పడుకొని ఉన్నారని , మంటలు వేగంగా వ్యాపించడంతో వారికి మంటలు అంటుకున్నాయని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న తాము లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా పొగలు కమ్ముకొని దుర్వాసన రావడంతో మృతదేహాలను బయటికి తీయడంలో ఇబ్బందులకు గురయ్యామని ఎస్పీ వెల్లడించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ ఘటనపై ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు నష్ట పరిహారం కింద రూ. 4లక్షలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
మహారాష్ట్ర కెమికల్ ఫాక్టరీలో ప్రమాదం
సాక్షి, ముంబై/పాల్ఘర్: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా బోయిసర్లోని కెమికల్ ఫాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఆంక్ అనే నిర్మాణంలో ఉన్న ఫార్మా కంపెనీలో శనివారం రాత్రి 7.20 గంటల సమయంలో కొన్ని కెమికల్స్ను పరీక్షిస్తున్న క్రమంలో పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు. పేలుడు శబ్దం 15 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని, పేలుడు ధాటికి కంపెనీ సమీప ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల కిటికీలు బద్ధలయ్యాయని తెలిపారు. -
ముంబైలో రసాయన కర్మాగారంలో పేలుడు
ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబై లోని ఓ రసాయన కర్మాగారంలో శనివారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందగా, చాలా మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ముంబై సమీపంలోని తారాపూర్ కెమికల్ జోన్లో ఈ పేలుడు సంభవించిది. సమాచారం తెలుసుకున్న ముంబై పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
13 మంది సజీవదహనం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని ధులే జిల్లాలో విషాదఘటన చోటుచేసుకుంది. రసాయన కర్మాగారంలో సంభవించిన భారీ పేలుడులో 13 మంది చనిపోగా 65 మంది గాయపడ్డారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. శిరపూర్ సిటీ పోలీస్స్టేషన్ ఏఎస్ఐ సంజయ్ ఆహీర్ తెలిపిన వివరాల మేరకు.. శిరపూర్ సమీపంలోని వాఘాడీ గ్రామ సమీపంలో ఉన్న రుమిత్ కెమికల్ కంపెనీలో శనివారం ఉదయం సుమారు 9.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పెద్దఎత్తున మంటలు కూడా వ్యాపించాయి. పేలుడు తీవ్రతకు కంపెనీ ఆవరణలోని రేకుల షెడ్లు, పైకప్పు కూలిపోయాయి. దీంతో అనేక మంది కార్మికులు శిథిలాల కింద కూరుకుపోయారు. మంటల తీవ్రతకు కంపెనీ పరిసరాల్లో పార్కింగ్ చేసిన వాహనాలతోపాటు చెట్లు కూడా మంటలకు కాలిపోయాయి. ఈ ఘటనలో 13 మంది చనిపోగా 65 మంది గాయాలపాలయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలను ఆర్పారు. ముందు జాగ్రత్తగా పరిసరప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. -
పరిశ్రమలో పేలుడు.. 13 మంది మృతి
-
భారీ పేలుడు; ఇరవై మంది మృతి!
ముంబై: మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో సుమారుగా 20 మంది మృత్యువాత పడ్డారు. మరో 22 మంది తీవ్ర గాయాలపాలు కాగా 70 మంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ధూలే జిల్లాలోని వాఘాది గ్రామంలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం సిలిండర్ పేలింది. దీంతో ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో అక్కడున్న వారంతా హాహాకారాలు చేస్తూ బయటికి పరుగులు తీశారు. కాగా ప్రమాద సమయంలో అక్కడ సుమారు వంద మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం చెల్లాచెదురుగా పడి ఉన్న ఎనిమిది మృతదేహాలను వెలికితీశామని, మిగతా వాటి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తు సహాయక సంస్థ సిబ్బంది ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. -
పాశమైలారంలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న నిర్మల్ కెమికల్ ఫ్యాక్టరీలో కెమికల్ పదార్థం పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటలు చుట్టు పక్కల ఉన్న పరిశ్రమలకు వ్యాపించడంతో అక్కడి స్థానికుల భయాందోళనలు గురవుతున్నారు . మంటలను అదుపులోకి తేవడానికి సిబ్బంది ఐదు ఫైరింజన్లతో ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్రి ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
భగీరథపై భగ్గు..భగ్గు..
సాక్షి, ఒంగోలు: భగీరథ కెమికల్స్ ఫ్యాక్టరీపై ఆరు గ్రామాల ప్రజలు భగ్గుమన్నారు. ఫ్యాక్టరీ నుంచి వస్తున్న విషవాయువులు, రసాయనాల నుంచి తమను రక్షించాలని కోరుతూ ఒంగోలు నగర శివారులోని వెంగముక్కలపాలెం, చెరువుకొమ్ముపాలెం, యరజర్ల, పెళ్లూరు, సర్వేరెడ్డిపాలెం గ్రామస్తులు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఒంగోలులో సోమవారం నిరసన తెలియజేశారు. తొలుత ఒంగోలు పాత జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్కు ర్యాలీ, నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ భగీరథ కంపెనీ ప్రమాదకర రసాయనాలను తయారు చేస్తూ, వ్యర్థాల రూపంలో వచ్చే భయంకరమైన రసాయనాలను పరిసరాల్లో ఉన్న ఎర్రవాగు, చెరువు, కుంటల్లోకి వదులుతుండటంతో భూగర్భజలాలు తీవ్రంగా కలుషితమయ్యాయన్నారు. గాలిలో కూడా రసాయనాలతో కలుషితం అయ్యిందన్నారు. ఇప్పటికే ఈ గ్రామాల పరిధిలోని నవజాత శిశువులు, గర్భిణులు కాలుష్యం బారిన పడ్డారన్నారు. ఈ వ్యర్థ రసాయనాలతో చర్మవ్యాధులు, ఊపిరితిత్తులు, క్యాన్సర్, గుండెజబ్బులు వస్తున్నాయన్నారు. ఈ కాలుష్యం కొద్ది దూరంలోనే ఉన్న సమ్మర్స్టోరేజీ ట్యాంకుకు కుడా చేరే ప్రమాదం ఉందన్నారు. అయినా కంపెనీ అవేమీ పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూపోతోందన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఫ్యాక్టరీ బారి నుంచి తమను రక్షించాలని గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. కాలుష్యం బారిన పడి అనారోగ్యం పాలైన వారిని కంపెనీచే చికిత్స అందించాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ భగీరథ కెమికల్స్ వల్ల సమీప ప్రాంతాల గ్రామస్తులు తీవ్రంగా కాలుష్యానికి గురవుతున్నారన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అయిల్ రంగుకు మారిన నీటితో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఫ్యాక్టరీ కారణంగా తాము ఇటువంటి నీటిని తాగునీటిగా తీసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పి.గోపాల్రెడ్డి, డి.కోటేశ్వరరావు, కృష్ణారెడ్డి, ఎం.అంజిరెడ్డి, బి.కోటేశ్వరరావు, పి.సంజీవరెడ్డి, జె.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
చైనాలో భారీ అగ్ని ప్రమాదం
-
కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని పుడూర్ మండలం రాకంచర్ల సమీపంలో గల కెమికల్ ఫ్యాక్టరీలో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్మికులు కెమికల్ కాంపౌండింగ్ చేస్తున్న సమయంలో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రసాయన వాయువు పీల్చడంతో ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో రసాయన వాయువు తీవ్రంగా వెలువడుతోంది. ఫ్యాక్టరీ యాజమాన్యం ఎటువంటి సేఫ్టీ పరికరాలు లేకుండా కార్మికులతో పనిచేయిస్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
-
మహారాష్ట్రలో భారీ పేలుడు: ముగ్గురి మృతి
-
మహారాష్ట్రలో భారీ పేలుడు: ముగ్గురి మృతి
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని పాల్గర్లో గురువారం అర్ధరాత్రి భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. బోయిసార్ - తారాపూర్ ఇండస్ట్రీయల్ కారిడార్లోని నోవాపెనే స్ఫెషాలిటీస్ లిమిటెడ్లో పేలుడు సంభవించడంతో భారీగా మంటలు ఎగిసిపడి ఇతర యూనిట్లకి మంటలు వ్యాపించాయి. పేలుడు ప్రభావంతో 12 కిలోమీటర్ల పరిధిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మండే స్వభావం ఉన్న ఎల్ఈడీని ఎక్కువ మోతాదులో నిల్వ ఉంచడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. భారీ ఎత్తున ప్రమాదం సంభవించటంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తం హై అలర్ట్ ప్రకటించామని తెలిపారు. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లు, భవనాలు కంపించడంతో ఏం జరిగిందో తెలియక తీవ్ర గందరగోళానికి గురైనట్టు స్థానికులు తెలిపారు. -
‘యూనియన్ లీడర్’ వస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్లోని ఓ రసాయనిక ఫ్యాక్టరీలో కార్మికులు ఎదుర్కొంటున్న ప్రాణాంతకమైన పరిస్థితులను కళ్లకు కట్టేలా చూపించడానికి ‘యూనియన్ లీడర్’ అనే బాలీవుడ్ సినిమా మన ముందుకు వస్తోంది. గుజరాత్లో ఏడేళ్లు, ఆ తర్వాత కెనడాలో కెమికల్ ఇంజనీర్గా పనిచేసిన సంజయ్ పటేల్ ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఇదే ఆయన మొదటి చిత్రం. యూనియన్ నాయకుడుగా రాహుల్ భట్, ముఖ్యపాత్రలో తిలోత్తమ షోమ్ నటించిన ఈ చిత్రం జనవరి 21వ తేదీన దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. అప్పుడప్పుడు రక్తం కక్కుకుంటూ బాధ పడుతున్న ఓ రసాయనిక ఫ్యాక్టరీ కార్మికులు తమకు సరైన భద్రతా పరిస్థితులను కల్పించడంతోపాటు ఇతర హక్కుల కోసం పోరాటం చేయడమే ఇతివత్తంగా ఈ సినిమాను తెరకెక్కించానని పటేల్ తెలిపారు. ఇది కల్పిత గాథే అయినప్పటికీ తాను ఇంజనీరుగా పనిచేసిన కాలంలో ఫ్యాక్టరీలలో ఎదురైన అనుభవాలను మిలితం చేసి ఇందులో చూపించేందుకు ప్రయత్నించానని ఆయన చెప్పారు. నాడు తాను యాజమాన్యం తరఫున ఇంజనీరుగా పనిచేసినప్పటికీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు స్పందించానని, వాటిని యజామన్యం దష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించానని, అప్పటికీ ఇప్పటికీ గుజరాత్ రసాయనిక ఫ్యాక్టరీల్లో పరిస్థితులు మారలేదని, అందుకనే అలాంటి యజమాన్యాలకు కనువిప్పు కలిగించే అంశాలతో ఈ సినిమాను పూర్తి చేశానని ఆయన చెప్పారు. రసాయన ఫ్యాక్టరీల్లో వెలువడే ప్రమాదకర వాయువుల వల్ల వచ్చే క్యాన్సర్తో ఏటా దేశంలో పది లక్షల మంది మరణిస్తున్నారన్నది వైద్యుల అంచనా. -
‘యూనియన్ లీడర్’ వస్తున్నారు
-
బాయిలర్ పేలుడు: యువకుడి మృతి
- ఆరుగురికి గాయాలు నెల్లూరు: కెమికల్ పరిశ్రమలో బాయిలర్ పేలిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా గూడూరు మండలం మేగనూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామ శివారులోని ఓ రసాయన పరిశ్రమలో ప్రమాదవశాత్తు బాయిలర్ పేలడంతో అక్కడే పనిచేస్తున్న ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. -
గంపల బస్తీ కెమికల్ గోదాములో మంటలు
-
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
► ఒకరికి తీవ్రగాయాలు ► భారీగా ఆస్తి నష్టం ఒంగోలు: ఒంగోలులోని వ్వవసాయ రసాయనాల తయారీ కేంద్రం భగీరథ కెమికల్స్లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీ నుంచి మంటలు వెలువడి మూడంతుస్తుల ప్రధాన ఉత్పత్తి కేంద్రం నిలువునా అగ్నికి ఆహుతైంది. నాలుగు అగ్నిమాపక వాహనాలతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బందిలో కిరణ్ అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. మిగిలిన కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చారని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పరిశ్రమ యాజమాన్య వర్గాలు తెలిపాయి. గాయపడిన కార్మికుడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రధాన రియాక్టర్ల వేడివల్లే అగ్ని ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. మంటలు ఇంకా చెలరేగుతున్నాయి. ప్రమాద స్థలాన్ని కలెక్టర్ వినయ్చంద్ పరిశీలించి కార్మికులతో ప్రమాదం ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. -
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
-
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
ఒంగోలు: ఒంగోలులోని వ్యవసాయ రసాయనాల తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక కెమికల్స్ ఫ్యాక్టరీలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో ఓ మూలన చిన్నగా ప్రారంభమైన మంటలు నిమిషాల్లో మూడంతస్తులకు వ్యాపించాయి. మంటలు తీవ్రతరం కావడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వెలువడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. అయితే అప్పటికే ఆసల్యమైపోయింది. రసాయనాల ఉత్పత్తి కేంద్రం అగ్నికి పూర్తిగా ఆహుతైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో అదే భవనంలో ఉన్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
-
ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరిగణాల జిల్లాలో భారీ అగ్రి ప్రమాదం సంభవించింది. మధ్యంగ్రామ్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం వేకువజామున ఈ భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి 38 ఫైరింజన్లు చేరుకున్నాయి.కెమికల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా యత్నిస్తోంది. అయితే సహాయక చర్యల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తుండగా ముగ్గురు ఫైర్ సిబ్బందికి కాలిన గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కెమికల్ ఫ్యాక్టరీలో కూలీ మృతి
భిక్కనూరు : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న కెమికల్ ఫ్యాక్టరీ పిల్లర్లో పడి ఓ దినసరి కూలీ మరణించాడు. ఎస్సై కృష్ణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సదాశివనగర్ మండలానికి చెందిన సొన్నాయిల నర్సింలు (30) అనే యువకుడు దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. శనివారం భిక్కనూరు మండల కేంద్రం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న కెమికల్ ఫ్యాక్టరీలో పనికి వెళ్లాడు. అక్కడ పిల్లర్ గుంతలో పడి మరణించాడు. ఆ సమయంలో ఎవరూ గమనించలేదు. ఆదివారం దీపావళి పండుగ కావడంతో పనులు జరగలేదు. సోమవారం పనులకు వెళ్లినవారికి పిల్లర్ గుంతలోని నీటిలో తేలుతూ నర్సింలు మృతదేహం కనిపించింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పైకి తీయించి, పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పనిచేస్తున్న సమయంలో ఫిట్స్కు గురై గుంతలో పడి మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడికి భార్య వసంత, కూతురు పల్లవి, తండ్రి గంగయ్య ఉన్నారు. -
కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు: ఒకరి మృతి
-
కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు: ఒకరి మృతి
హైదరాబాద్: హయత్నగర్ మండలం బాచారంలోని ఓ రసాయనాల కర్మాగారంలో మంగళవారం వేకువజామున పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ ఘటనను ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం గోప్యంగా ఉంచిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పటాన్చెరు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
మెదక్: మెదక్ జిల్లాలోని పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో మంగళవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. శ్రీ లియో ఎంటర్ ప్రైజెస్ కెమికల్ ఫ్యాక్టరీలో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. కెమికల్ డబ్బాలు లీక్ అవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కడప కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు
-
జీడిమెట్లలోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో బుధవారం వేకువజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక గంపలబస్తీలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకోవటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదానిక గల కారణాలు తెలియాల్సిఉంది. -
కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు, ముగ్గురు మృతి
ముంబయి: ముంబయి సమీపంలో గురువారం ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు సంభవించి ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. డాంబివాలేలోని ఆచార్య కెమికల్ ఫ్యాక్టరీలో ఈ రోజు ఉదయం ఈ ప్రమాదం జరిగింది. పేలుడు థాటికి ఫ్యాక్టరీ భవనం కుప్పకూలడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా థానే జిల్లా కలెక్టర్ మహేంద్ర కల్యాణ్కర్ పేలుడు ఘటనకు ఫోన్లో ఆరా తీశారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు ఈ సంఘటనలో ఫ్యాక్టరీ పక్కనే ఉన్న మరో భవనాలు కూడా దెబ్బతిన్నాయి. -
మెక్సికో పేలుడులో పెరిగిన మృతుల సంఖ్య
కోట్జాకోల్కోస్: మెక్సికో స్టేట్ ఆయిల్ కంపెనీ పెట్రోల్ మెక్సికనోస్లలో బుధవారం సంభవించిన భారీ పెట్రోకెమికల్ పేలుడులో ఇప్పటివరకు మృతి చెందిన కార్మికుల సంఖ్య 24కు పెరిగినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో 19 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా 13 మంది పరిస్ధితి విషమంగా ఉంది. కాగా, ఫ్యాక్టరీలోని మరికొన్ని ప్రదేశాల్లో మృతుల కోసం వెతకాల్సి ఉంది. 18 మంది కార్మికుల ఆచూకీ తెలియాల్సి ఉందనే యాజమాన్య ప్రకటన అనంతరం దాదాపు 30 కుటుంబాలకు చెందిన వారు ఫ్యాక్టరీలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించి అడ్డుపడ్డ సైనికుల వాహనాలపై రాళ్లు రువ్వారు. ఫ్యాక్టరీ లోపలికి వెళ్లనివ్వకపోవడంతో ఆగ్రహించిన బాధితుల కుటుంబసభ్యులు గేటు ముందే బైఠాయించారు. సెక్యూరిటీ సిబ్బంది ఎంత చెప్పినా వినకుండా అక్కడే కూర్చున్న కుటుంబాలకు కొంతమంది వాలంటీర్లు ఆహారం, నీరు అందించారు. దీంతో దిగొచ్చిన యాజమాన్యం చిన్నచిన్న గ్రూపులుగా కుటుంబసభ్యుల మృతదేహాలను చూసేందుకు లోపలికి అనుమతించింది. విషపూరిత వాయువులు గాలిలో కలుస్తుండటంతో అధికారులు చుట్టుపక్కల నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉందని పెమెక్స్ డెరెక్టర్ తెలిపారు. -
'మాకొద్దీ కెమికల్ ఫ్యాక్టరీ..'
పాణ్యం (కర్నూలు) : ప్రజల ప్రాణాలను హరించే ఫ్యాక్టరీలు మాకొద్దంటూ ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొండజూటురు గ్రామంలో గురువారం సాయంత్రం జరిగింది. గ్రామ సమీపంలో నూతనంగా రూ. 900ల కోట్లతో నిర్మించ తలపెట్టిన కెమికల్ ఫ్యాక్టరీని నిర్మించకూడదని గ్రామస్థులంతా ఏకతాటిపైకి వచ్చి తమ నిరసన తెలిపారు. శాంతీరాం నానో కెమికల్ ఇండస్ట్రీ కోసం భూ సేకరణ పూర్తైన క్రమంలో ఈ రోజు గ్రామస్తుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఆర్డీవో సమక్షంలో గ్రామసభ నిర్వహించారు. ఇందులో గ్రామస్తులంతా ఫ్యాక్టరీ నిర్మించకూడదని తీర్మానించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్తులు ర్యాలీ
కర్నూలు(పాణ్యం): గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటన కర్నూలు జిల్లా పాణ్యం మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని కొండజూడూరు గ్రామంలో రూ. 900 కోట్లతో 150 ఎకరాల్లో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు ఇటీవల అధికారులు భూ సర్వే నిర్వహించారు. దీనిని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. -
కెమికల్ ఫ్యాకర్టీలో రియాక్టర్ పేలుడు; నలుగురికి తీవ్రగాయాలు
నల్లగొండ: ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని చౌటప్పల్ మండలం దండుమల్కాపురం శివారులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. అయితే తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
ఆదోని: ఆదోని పట్టణ శివారులోని సిరుగుప్ప క్రాస్ వద్ద ఉన్న మాజీ మంత్రి టీజీ వెంకటేష్ సోదరుడు టీజీ రాఘవేంద్రకు చెందిన స్టార్ న్యూయోకెం కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు కార్మికులకు 90 శాతం, మరో కార్మికుడికి 75 శాతానికి పైగా గాయాలైనట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఫ్యాక్టరీలో కార్మికులకు సరైన భద్రత చర్యలు లేవని, కెమికల్ వ్యర్థాలతో వాతావర ణ, వాయు, నీటి కాలుష్యం ఏర్పడుతోందని పలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా కలకలం సృష్టించింది. ఫ్యాక్టరీలోని సోడియం మెటల్ ప్రాసెస్సింగ్ యూనిట్లోని రియాక్టర్లో అకస్మాత్తుగా చెలరేగి అక్కడ పని చేస్తున్న మధ్యప్రదేశ్లోని దివాస్సిటి గ్రామానికి చెందిన సమీర్ శ్రీవాత్సవ్(27), జార్ఖండ్లోని గొలుమారుకు చెందిన పట్టి (28), మెదక్ జిల్ల బుదరి గ్రామానికి చేందిన సంగమేష్(37)కు మంటలు వ్యాపించాయి. సమీపంలో పని చేస్తున్న కార్మికులు మంటలను ఆర్పివేసి క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. రియాక్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే ప్రమాదం చోటుచేసుకుందని ఫ్యాక్టరీ మేనేజర్ నారాయణ రెడ్డి తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్సీ శ్రీనివాసులు, సీఐలు లక్షుమయ్య, శ్రీనివాసులు, ఎస్ఐలు నాగరాజు, మన్మథవిజయ్బాబు, ఈశ్వరయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నామని డీఎస్సీ తెలిపారు. -
ఎర్రటి మంటలు.. నల్లటి పొగలు
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఆదివారం ఉదయుం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జీడిమెట్ల ఫేజ్-1లో పద్మావతి కెమికల్స్ పేరుతో డీఆర్ జైన్ సాల్వెంట్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఉదయం 9 గంటల సమయం లో కంపెనీ నుంచి పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మధ్యాహ్నం 12.30 గంటల వరకు దట్టమైన పొగలు కమ్ముకుని, మంటలతో కెమికల్ సాల్వెంట్ డబ్బాలు గాల్లో ఎగిరి పడుతూ ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కంపెనీలో టౌలిన్, ఇథైల్ ఎసిటేట్, ఐటిఏ, ఎనెగ్జిన్ వంటి రసాయనాలతో కూడిన డ్రమ్ములు ఉండగా ఇందులో ఎనెగ్జిన్, టౌలిన్ పెట్రోలియాన్ని తలపించేలా ఉంటాయి. శనివారం రాత్రే టౌలిన్ తీసుకువచ్చి డ్రమ్ముల్లో డంప్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆదివారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగగా ఈ డ్రమ్ములు గాల్లో ఎగురుతూ భయాన్ని రేకెత్తించాయి. ఈ ఘటనతో పక్కనే ఉన్న సూర్య ఇండస్ట్రీ ఎక్విప్మెంట్, సిమ్టెక్ కంపెనీల కార్మికులు పరుగులు తీశారు. ఈ రెండు కంపెనీలకూ మం టలు వ్యాపించడంతో ఫైర్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి భారీ ప్రమాదాన్ని నివారించారు. సాల్వెం ట్ నిల్వ చేసిన గోదాము మాత్రం పూర్తిగా దగ్ధమైంది. నష్టం ఎంత ఉంటుందన్న విషయం స్పష్టంగా తెలియరాలేదు. నష్టం కోట్లలో ఉంటుందని అగ్నివూపక అధికారు లు అంచనా వేస్తున్నారు. జీడిమెట్ల, సికింద్రాబాద్, మౌలాలి, కూకట్పల్లి, సనత్నగర్, మాదాపూర్ ఫైర్ స్టేషన్ల నుంచి వచ్చి ఫైర్ సిబ్బంది వుూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. -
జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం.
-
ప్రమాదంలో తీరం?
అందరికి ఆహ్లాదం పంచే తీరప్రాంతంపై కాలుష్య మేఘాలు కన్నెశాయి. సముద్ర సంపదకు ఆనవాళ్లుగా నిలిచిన దిండి పరిసర ప్రాంతాలను కలుషితం చేసే సమయం ఆసన్నమైనట్టు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. తీరప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీల ఏర్పాటును ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి వ్యతి రేకించి ప్రజాభిప్రాయానికి పెద్ద పీట వేశారు. అప్పట్లో ఆయన నిర్ణయానికి ప్రజలు కూడా సంతసించారు. అయితే ఇందుకు భిన్నంగా తీర ప్రాంతంలో కాలుష్య కలకలానికి తెరతీసినట్టు తెలుస్తోంది. నిజాంపట్నం: తీరప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు ‘దిండి కెమికల్ ఫార్మా పార్కు ప్రైవేటు లిమిటెట్’ సంస్థ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం దిండి ప్రాంతంలో 1600 ఎకరాల భూములు కేటాయించాలని 2008 ఏప్రిల్లోనే అప్పటి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ సంస్థ ప్రతిపాదనలను తిరస్కరించారు. రసాయన ఫ్యాక్టరీల నిర్మాణంతో తీర ప్రాంతానికి కాలుష్య ముప్పు ఉంటుందని, ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. ఆ తరువాత కూడా ఆ సంస్థ 1200 ఎకరాలైనా కేటాయించాలని దరఖాస్తు చేసుకుంది. ఆ ప్రతిపాదనా అదే రీతిలో నిలిచిపోయింది. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే ఆ నాడు దరఖాస్తు చేసుకున్న దిండి కెమికల్ ఫార్మా పార్కు ప్రైవేటు లిమిటెడ్ సంస్థ పావులు కదపనారంభించింది. ప్రస్తుతం ఆ సంస్థకు అనుమతి లభించినట్టు ఇక్కడ ప్రచారం జరగడం కలకలం రేపుతోంది. అనుమతులు నిలిపివేయాలి : దిండి పరిసర ప్రాంతంలో కెమికల్ ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వచ్చిన ప్రచారం ఊపందుకుంది. తీరప్రాంతంలో ఏర్పాటు చేసే ఫ్యాక్టరీలు వదిలే కలుషిత వ్యర్థాల వల్ల మత్స్యసంపదకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తీరప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీలను ఎలా అనుమతిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంజూరు చేసిన అనుమతులను తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
రియాక్టర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
బొమ్మలరామారం, న్యూస్లైన్: నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామంలోని నైట్రోజన్ కెమికల్ కంపెనీలో ఈ నెల 12న జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు కార్మికుల్లో ఇద్దరు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ప్రొడక్షన్ మేనేజర్ భీమిరెడ్డి వెంకట్రెడ్డితోపాటు మరో ముగ్గురు కార్మికులకు గాయాలైన సంఘటన విదితమే. గాయపడిన కార్మికులను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ప్రొడక్షన్ మేనేజర్ భీమిరెడ్డి వెంకట్రెడ్డి(35), మల్యాల గ్రామానికి చెందిన ఊట్ల రాములు(36)లు శుక్రవారం మృత్యువాత పడ్డారు. వెంకట్రెడ్డిది గుంటూరు జిల్లా. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నర్సింగ్రావు తెలిపారు. -
బీబీ నగర్ లో భారీ అగ్నిప్రమాదం
నల్గొండ:జిల్లాలోని బీబీనగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీయం అగ్రో కెమికల్ ఫ్యాక్టరీలో హఠాత్తుగా మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. రియాక్టర్లు పేలడంతో అగ్నిప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షలు చెప్తున్నారు. జనావాసాల మధ్య ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ ఉండటంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు 150 మంది సురక్షిత ప్రాంతాలను తరలించారు. సంఘటనాస్థిలికి చేరుకున్న ఫైర్సిబ్బంది మంటలు అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. భారీ ప్రమాదం జరగడంతో ఫ్యాక్టరీ చుట్టుపక్క ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకుంది.ఈ ప్రమాదంలో రూ.18 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. -
రసాయనాల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
మేడ్చల్/మేడ్చల్ రూరల్, న్యూస్లైన్: మేడ్చల్ పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రూ. కోటికి పైగా ఆస్తి నష్టం జరిగింది. కంపెనీ యాజమాన్యం, మేడ్చల్ పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పారిశ్రామికవాడలోని ఎస్కిటోన్స్ రసాయనాల కంపెనీలో శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన కార్మికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. నగరంలోని జీడిమెట్ల, సనత్నగర్, ప్యారాడైజ్ ప్రాంతాల నుంచి ఫైరింజన్లు వచ్చాయి. అప్పటికే కంపెనీలో ఉన్న రసాయన పదార్ధాలు, తయారీకి వినియోగించే సాల్వెంట్ రియాక్టర్లు పేలిపోయాయి. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో రూ. కోటికి పైగా ఆస్తినష్టం జరిగిందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. కాగా రసాయనాలను కలిపే సమయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్రావు, పరిశ్రమల శాఖా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి, మేడ్చల్ సీఐ రాంరెడ్డిలు చేరుకొని పరిస్థితిని సమీక్షిచారు. -
రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
జీడిమెట్ల, న్యూస్లైన్: పారిశ్రామికవాడలోని ఓ రసాయనాల తయారీ పరిశ్రమలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలంటుకున్న వెంటనే కార్మికులు పరిశ్రమ నుంచి పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. కాగా, లక్షల్లో ఆస్తినష్టం ఉంటుందని తెలిసింది. వివరాలు... జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఫేజ్-3లో యూసుఫ్, అక్రమ్, హుస్సేన్లు భారత్ ఫ్లెక్సో గ్రాఫైట్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను నిర్వహిస్తున్నారు. ఇక్కడ కెమికల్ సాల్వెంట్స్ను తయారు చేసి విక్రయిస్తుంటారు. కాగా ఆదివారం ఉదయం డ్యూటీకి వచ్చిన ఐదుగురు కార్మికులు సాల్వెంట్స్ను తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు లేచాయి. కార్మికులు భయంతో బయటకు పరుగు తీశారు. పరిశ్రమలో భారీ ఎత్తున సాల్వెంట్స్ నిల్వ ఉండటంతో మంటలు ఒక్కసారిగా అంటుకుని క్షణాల్లో పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. మంటల ధాటికి పరిశ్రమలోని డ్రమ్ములు 50 అడుగుల మేర గాల్లోకి ఎగిరి పడటంతో భయాందోళనలతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల, సనత్నగర్ ఫైర్స్టేషన్ల సిబ్బందితో పాటు హెటిరో పరిశ్రమ ఫైర్ సిబ్బంది వచ్చి.. ఆరు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. జీడిమెట్ల సీఐ సుదర్శన్ ఇతర ప్రాంతాల నుంచి ఫోమ్, వాటర్ ట్యాంకర్లను తెప్పించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు కృషి చేశారు. ప్రమాదంలో సుమారు 200 కెమికల్ డ్రమ్ములు కాలిపోయాయి. పరిశ్రమ యజమానులు అందుబాటులో లేకపోవడంతో ఎంత నష్టం జరిగిందనేది తెలియరాలేదు. అయితే, లక్షల్లో ఆస్తినష్టం ఉంటుందని స్థానికులంటున్నారు. సంఘటనా స్థలా న్ని బాలానగర్ ఏసీపీ నాగరాజురెడ్డి, వైఎస్సాఆర్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు సురేశ్రెడ్డి, ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ కార్మిక విభాగం కార్యదర్శి సురేందర్రెడ్డి తదితరులు సందర్శించారు. అనుమతి లేని పరిశ్రమ.. ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ పరిశ్రమను నిర్వహిస్తున్నారు. సాల్వెంట్స్ను తయారు చేసి భారీగా నిల్వ చేస్తున్నారు. వీరి వద్ద ఫైర్సేఫ్టీ సర్టిఫికెట్ కూడా లేదు. అగ్నిప్రమాదం జరిగితే అదుపు చేసేందుకు అవసరమైన నియంత్రణ పరికరాలు కూడా ఇక్కడ అందుబాటులో లేవు. ఈ పరిశ్రమకు చెందిన మరో బ్రాంచ్లో 2012 ఆగస్టు 15న అగ్ని ప్రమాదం జరిగింది. తరుచూ ప్రమాదాలు.. పట్టించుకోని పీసీబీ ఇటీవల సుభాష్నగర్లోని పరిశ్రమలోన రసాయనాలు పేలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, స్టాలిన్ పెయింట్స్లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగి 10 రోజులు గడవక ముందే ‘భారత్ ఫ్లెక్సో’ పరిశ్రమలో ప్రమాదం జరగడం పీసీబీ అధికారుల పని తీరుకు అద్దం పడుతోంది. మామూళ్ల మత్తులో జోగుతూ అధికారులు అనుమతి లేని పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పీసీబీ అధికారులు నిబంధనలు పట్టించుకోని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.