
తమిళనాడులో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది.
విరుదనగర్: తమిళనాడులో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. విరుదనగర్ జిల్లా చతుర్ దగ్గర ఘటన జరిగింది. పేలుడు ధాటికి ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగారు. ఫ్యాక్టరీలో భారీగా దీపావళి పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు.