Published
Fri, Aug 26 2022 10:38 AM
| Last Updated on Fri, Aug 26 2022 10:38 AM
సాక్షి, న్యూఢిల్లీ : హైదర్నగర్ భూములకు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబరు 7కు వాయిదా వేసింది. హైదర్నగర్ సర్వే నంబర్ 172లోని 98 ఎకరాల భూమి తమదేనంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ గురువారం జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది.
పిటిషన్లో లోపాలుంటే సరిచేసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. ఈ భూములకు సంబంధించి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గోల్డ్స్టోన్ ఎక్స్పోర్ట్స్, ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ సంస్థలు కూడా పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment