జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం | Jharkhand Jamtara Train Accident Latest News Updates In Telugu - Sakshi
Sakshi News home page

Jamtara Train Accident: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు దాటుతున్న పలువురి దుర్మరణం!

Feb 28 2024 8:50 PM | Updated on Feb 29 2024 10:00 AM

Jharkhand Train Accident: Jamtara Train Accident Updates - Sakshi

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతున్న వ్యక్తుల్ని రైలు ఢీ కొట్టడంతో.. 

రాంచీ: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌ దాటుతున్న వ్యక్తులను ఓ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది.  ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడి పరిస్థితుల ఆధారంగా..  మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.

బుధవారం సాయంత్రం జంతారా జిల్లా  కళాఝారియా రైల్వే స్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అసాన్సోల్‌-ఝాఝా మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు వీళ్లను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది.  ఘటనాస్థలానికి చేరుకున్న వైద్య బృందాలు, అంబులెన్స్‌లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement