
హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపించబోవని ట్వీట్ చేశారాయన.
కేరళ స్టోరీ సినిమా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ప్రజలను ఆకట్టుకోవడంలో ఎలా విఫలమైందో.. అదే విధంగా కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపబోవని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విభజనవాద రాజకీయాలను తిరస్కరించిన కర్ణాటకవాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
హైదరాబాద్, బెంగళూరుల మధ్య ఆరోగ్యకర పోటీ నెలకొనాలని ఆకాంక్షించారు. కర్ణాటకలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు అని తెలియజేశారాయన.
Just the way Kerala Story failed to amuse people of Karnataka, similarly Karnataka election results will have NO bearing on Telangana
— KTR (@KTRBRS) May 13, 2023
Thanks to the people of Karnataka for rejecting ugly & divisive politics 🙏
Let Hyderabad and Bengaluru compete healthily for investments &…
ఇదీ చదవండి: సీఎం అభ్యర్థిపై ఖర్గే క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment