![Lawrence Bishnoi aide killed inside Delhi Tihar Jail - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/15/tika.jpg.webp?itok=QBB3LWsT)
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో శుక్రవారం ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయి ముఠా సభ్యుడు ప్రిన్స్ తేవాతియా మృతిచెందాడు. సాయంత్రం 5 గంటలకు జైలులో ఇరు వర్గాల మధ్య గ్యాంగ్వార్ జరిగినట్లు తెలిసింది.
తేవాతియా కత్తిపోట్లకు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని దీన్దయాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఘర్షణలో గాయపడిన మరో ఐదుగురు ఖైదీలను అధికారులు ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment