45 కోట్ల ‘మహా’ కుంభ్‌ | Mahakumbh 2025: Prayagraj Declares No Vehicle Zone for Maghi Purnima Snan on Feb 12 | Sakshi
Sakshi News home page

45 కోట్ల ‘మహా’ కుంభ్‌

Published Wed, Feb 12 2025 5:56 AM | Last Updated on Wed, Feb 12 2025 6:03 AM

Mahakumbh 2025: Prayagraj Declares No Vehicle Zone for Maghi Purnima Snan on Feb 12

అంచనాలకు మించి భారీగా భక్తులు 

మాఘ పూర్ణిమ సందర్భంగా నేడు పోటెత్తనున్న జనం 

మేళా ప్రాంతంలో ఇప్పటికే నో వెహికిల్‌ జోన్‌గా ప్రకటన

సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో జరుగుతున్న కుంభమేళాకి భక్తులు ఊహించని స్థాయిలో పోటెత్తుతున్నారు. కుంభమేళా(Kumbh Mela) జరిగే 45 రోజుల్లో మొత్తంగా 45 కోట్ల మంది భక్తులు పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేయగా, కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆ సంఖ్య దాటిపోయింది.

ఈ నెల 11 నాటికే కుంభమేళాకు వచ్చిన భక్తుల సంఖ్య 45 కోట్లకు చేరిందని, మహా కుంభమేళా చరిత్రలో అతిపెద్ద మతపరమైన సమావేశాలలో ఇది ఒకటిగా మారిందని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, గొప్ప ఆచారాలు, అత్యాధునిక సాంకేతిక సమ్మిళితంగా, ఈ కుంభమేళా జనసమూహ నిర్వహణ, పారిశుధ్యం, డిజిటల్‌ సౌకర్యాలలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని ప్రకటించింది. 

నేడు నో వెహికిల్‌ జోన్‌గా మేళా ప్రాంతం.. 
కాగా బుధవారం మాఘ పూర్ణిమ(Magha Purnima) సందర్భంగా కోట్ల మంది భక్తులు అమృత్‌ స్నానాలను ఆచరించే అవకాశం ఉందని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. మాఘ పూర్ణిమ స్నానం, గురు బృహస్పతి పూజతో సంబంధం కలిగి ఉండటం, గంధర్వుడు స్వర్గం నుండి పవిత్ర సంగమానికి దిగుతాడనే నమ్మకానికి ప్రసిద్ధి చెందడంతో ఈ స్నానమాచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు రానున్నారు.

ఈ నేపథ్యంలో మాఘ పూర్ణిమ స్నానం సమయంలో జనసమూహ నిర్వహణను నిర్ధారించడానికి , రాష్ట్ర ప్రభుత్వం నెల 11 ఉదయం 5 గంటల నుంచే మేళా ప్రాంతాన్ని ’వాహనాలు నిషేధించబడిన ప్రాంతం’(నో వెహికిల్‌ జోన్‌’)(No Vehicle Zone)గా ప్రకటించింది. అవసరమైన, అత్యవసర సేవలను అందించే వాహనాలను మాత్రమే అనుమతిస్తుంది. మాఘ పూర్ణిమ తర్వాత ఈ నెల 26 శివరాత్రి రోజున అధిక సంఖ్యలో భక్తులు స్నానమాచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.  

7 లక్షల మందికి పైగా వైద్య సేవలు.. 
ఇక మేళాకు వచ్చే భక్తులకు విస్తృతమైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా 7 లక్షలకు పైగా యాత్రికులు వైద్య సంరక్షణ పొందారని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 23 అల్లోపతి ఆసుపత్రులలో 4.5 లక్షలకు పైగా వ్యక్తులకు చికిత్స అందించామని, 3.71 లక్షలకు పైగా పాథాలజీ పరీక్షలు చేయించుకున్నారని తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement