Madhya Pradesh: బీజేపీ కార్యకర్తల సంబరాలు | MP Assembly Election Results 2023 BJP celebrations | Sakshi

Madhya Pradesh: బీజేపీ కార్యకర్తల సంబరాలు

Published Sun, Dec 3 2023 5:06 PM | Last Updated on Sun, Dec 3 2023 5:23 PM

MP Assembly Election Results 2023 BJP celebrations - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ పైచేయి సాధించి మెజారిటీ మార్కును సునాయాసంగా అధిగమించి భారీ మెజారిటీతో రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో సంబరాలు మిన్నంటాయి.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం భోపాల్‌లోని తన నివాసంలో సంతోషంగా కనిపించారు. తన కుటుంబంతో కలిసి విజయ సంకేతాన్ని చూపుతూ కార్యకర్తలకు అభివాదం చేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ మార్కును దాటడంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చారు. స్వీట్లు పంచకుని సందడి చేశారు.  

చౌహాన్ తన కుటుంబంతో సహా భోపాల్‌లో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను పలకరించారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. ఈ సంబరాల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం మధ్యప్రదేశ్‌లోని 230 స్థానాల్లో బీజేపీ 161 ​​స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 66 స్థానాల్లో ముందంజలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement