బోర్డర్‌లో పాక్‌ కాల్పులు.. ధీటుగా స్పందించిన ఆర్మీ | Pakistan Firing Along With Boarder In Jammu | Sakshi
Sakshi News home page

సరిహద్దులో పాక్‌ సైన్యం కాల్పులు.. ధీటుగా సమాధానమిచ్చిన భారత ఆర్మీ

Published Sat, Jun 29 2024 7:38 PM | Last Updated on Sat, Jun 29 2024 7:54 PM

Pakistan Firing Along With Boarder In Jammu

జమ్మూ: సరిహద్దులో పాకిస్తాన్‌ మరోసారి దుశ్చర్యకు ఒడిగట్టింది. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌జిల్లాలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శుక్రవారం(జూన్‌28) రాత్రి పాక్‌సైన్యం కాల్పులకు దిగింది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

క్రిష్టఘాటి సెక్టార్‌ వద్ద సరిహద్దు వద్ద భారత్‌వైపు నుంచి ఎలాంటి చర్యలు లేకుండానే పాక్‌ సైన్యం కాల్పులకు దిగినట్లు తెలుస్తోంది. పాక్‌ సైన్యం జరిపిన ఈ కాల్పులకు భారత సైన్యం ధీటుగా సమాధానమిచ్చినట్లు సమాచారం. 

సరిహద్దు వెంట చొరబాటుదారులను పంపే సమయంలో దృష్టిని మరల్చడానికే పాక్‌ సైన్యం కాల్పులకు పాల్పడినట్లు చెబుతున్నారు. దీంతో చొరబాట్లను  అడ్డుకోవడానికి సైన్యం అప్రమత్తమైంది.    

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement