
న్యూఢిల్లీ: అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోట్లాది మంది ప్రజలను ఏకం చేసిందని, ఆ మహత్తర సందర్భం దేశ సమష్టి బలాన్ని చాటిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ ఏడాదిలో మొదటిసారిగా ఆదివారం ప్రసారమైన మన్కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాతలకు ఆ శ్రీరాముడే ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు.
అందుకే జనవరి 22వ తేదీన అయోధ్యలో జరిగిన ఉత్సవాన్ని ‘దేవుడు దేశానికి, రాముడు రాజ్యానికి’వచ్చిన సందర్భంగా పేర్కొంటున్నట్లు చెప్పారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం గురించి కోట్లాది మంది ప్రజలు కూడా ఇదేవిధంగా భావించారన్నారు. ‘ప్రతి ఒక్కరూ ఆ రోజు రామ భజన గీతాలు ఆలపించి ఆ రామునికే అంకితమిచ్చారు. రామ జ్యోతిని వెలిగించి దీపావళిని జరుపుకున్నారు. ప్రతి ఒక్కరి మాటల్లోనూ, ప్రతి ఒక్కరి గుండెల్లోనూ రాముడే నిండిపోయాడు’అని ప్రధాని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment