Mann Ki Baat
-
పెన్సిల్ విలేజ్ ఆఫ్ ఇండియా గురించి తెలుసా?
ఏపీ సెంట్రల్ డెస్క్: జమ్ము కశ్మీర్లోని పుల్వామా జిల్లా ఓఖూ గ్రామం పెన్సిల్ విలేజ్ ఆఫ్ ఇండియాగా వినుతికెక్కింది. దేశం నుంచి పెన్సిల్ ఉత్పత్తికి కావాల్సిన 90 శాతం ముడి కలప ఇక్కడి నుంచే కంపెనీలకు ఎగుమతవుతోంది. పెన్సిళ్ల తయారీకి అవసరమైన కలపను ఒకప్పుడు చైనా, జర్మనీ నుంచి ఇక్కడివారు దిగుమతి చేసుకునేవారు. ఇప్పుడా అవసరం లేకుండా స్థానికంగా లభించే కలపను సమర్థవంతంగా నియోగించుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తమదైన ముద్ర వేసుకుంటున్నారు. మార్చి 30 జాతీయ పెన్సిల్ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం పాఠకుల కోసం.ప్రధాని ప్రస్థానంతో వెలుగులోకి.. దేశ ప్రధాని నరేంద్రమోదీ తన మనసులోని భావాలను ఆవిష్కరించే మన్ కీ బాత్ (mann ki baat) లో పెన్సిల్ విలేజ్ ఆఫ్ ఇండియాగా ఓఖూను అభివర్ణించారు. దీంతో ఈ గ్రామం వెలుగులోకి వచ్చింది. పుల్వామా జిల్లాలోని ఈ గ్రామం పెన్సిల్ తయారీకి ప్రధాన కేంద్రంగా గుర్తింపుపొందింది. దేశాన్ని విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో పుల్వామా కీలక భూమిక పోషిస్తోందని, విద్యార్థులు తమ హోంవర్క్ చేయడం, నోట్స్ రాసుకోవడంలో పెన్సిల్ (Pencil) వినియోగించినప్పుడల్లా పుల్వామా జిల్లా స్ఫురణకు వస్తుందని మన్ కీ బాత్ ప్రసంగంలో కితాబిచ్చారు. దిగుమతుల నుంచి ఎగుమతుల దాకా.. 1960 నుంచి ఇక్కడ పరిశ్రమల ప్రస్థానం ప్రారంభమైంది. మొదట్లో పెన్సిల్ తయారీకి దియోదార్ కలపను వినియోగించేవారు. 1992లో ఇక్కడి ప్రభుత్వం దియోదార్ వినియోగాన్ని నిషేధించడంతో చైనా, జర్మనీ దేశాల నుంచి కలపను దిగుమతి చేసుకునేవారు. అయితే ఇది వ్యయ ప్రయాసలతో కూడినది కావడంతో ప్రత్యామ్నాయానికి అన్వేషించారు. అలాంటి సమయంలో ఇక్కడ లోయల్లో లభించే పోప్లర్ కలప వీరికి వరంలా మారింది. ఆ కలపతో పెన్సిల్ పలకలను తయారుచేయడం మొదలెట్టారు. పోప్లర్ కలప పెన్సిల్ నాణ్యతను పెంచడంతో దిగుమతుల దశ నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి చేరింది. యూఏఈ, మెక్సికో, నేపాల్, పోలాండ్, ఫ్రాన్స్, భూటాన్, యూకే, బెల్జియం, మారిషస్, లెబనాన్, మాల్దీవులు, గ్రీక్, శ్రీలంక, బంగ్లాదేశ్ తోపాటు 85 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. నిరుద్యోగుల కల్పతరువు... ఓఖూ ఓఖూ... పుల్వామా జిల్లాకు చెందిన ఓ మారుమూల గ్రామం. ప్రపంచ స్థాయి మార్కెట్లో ఒకటిగా వెలుగొందుతోంది. గతంలో ముడి కలపను జమ్ము, చండీగఢ్లో ముక్కలుగా చేసి తెప్పించేవారు.స్థానిక ప్రభుత్వం వీరికి ఆధునికతను అందుబాటులోకి తీసుకురావడంతో పెన్సిల్ పలకలను ఇక్కడే తయారు చేస్తున్నారు. పెన్సిల్ రూపకల్పనకు అవసరమైన పలకలను ఎండబెడతారు. ఇవి బాగా ఆరాక ఒక్కో పెట్టెలో 800 పలకల లెక్కన ప్యాక్ చేస్తారు. నటరాజ్, అప్సర, హిందూస్థాన్ పెన్సిళ్ల తయారీ కర్మాగారాలకు ఇక్కడి నుంచే కలప వెళ్తోంది. ఏనాటికైనా కశ్మీర్ లోనే పూర్తిస్థాయి పెన్సిల్ ప్లాంట్ అందుబాటులోకి రావాలని, ప్రపంచ స్థాయిలో పెన్సిల్ ఉత్పత్తిలో దేశాన్ని అగ్రగామిగా నిలపాలన్నది ఓఖూ గ్రామస్తుల ఆకాంక్ష.చదవండి: వర్క్ షేరింగ్.. హ్యాపీనెస్ లోడింగ్ -
Mann Ki Baat: వేసవి సెలవులు.. నీటి సంరక్షణపై ప్రధాని మోదీ సందేశం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఈరోజు(ఆదివారం) ‘మన్ కీ బాత్’(Mann Ki Baat) 120వ ఎపిసోడ్లో ప్రజలతో వివిధ అంశాలపై సంభాషించారు.‘ఈ రోజు నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. భారతీయ నూతన సంవత్సరం కూడా ఈ రోజే మొదలువుతుంది. ఈ రోజు మొదలుకొని రాబోయే కొద్ది రోజుల్లో మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పలు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ పండుగల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.వేసవి సెలవులు సద్వినియోగం చేసుకోండి‘పరీక్షల సమయంలో వాటి గురించి చర్చించాను. త్వరలో వేసవి సెలవులు రాబోతున్నాయి. పిల్లలు వాటి కోసం వేచి చూస్తున్నారు. కొత్త అభిరుచులను మెరుగుపరుచుకునేందుకు తగిన సమయం ఇది. వేసవి సెలవుల కోసం రూపొందించిన ‘మై క్యాలెండర్’చిన్నారులకు ఎంతగానో ఉపకరిస్తుంది. అంబేద్కర్ జయంతి నాడు జరిగే పాదయాత్రలో పాల్గొనడం ద్వారా, మీరంతా రాజ్యాంగ విలువల గురించిన సమాచారాన్ని అందరికీ తెలియజేయగలుగుతారు’ అని మోదీ పేర్కొన్నారునీటిని పొదుపుగా వాడండి‘నీటి పొదుపు ప్రచారం వేసవి కాలంలోనే ముమ్మరంగా జరుగుతుంది. మనకు లభించిన సహజ వనరులను తదుపరి తరానికి అందించడం మన బాధ్యత. దేశంలో గత ఏడెనిమిదేళ్లలో కొత్తగా నిర్మించిన ట్యాంకులు, చెరువులు, ఇతర నీటి నిల్వల నిర్మాణాల ద్వారా నీటిని సంరక్షించారు. ఈ విషయంలో అందరూ ఇప్పటి నుండే ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. మీ ఇంటి ముందు ఒక కుండలో చల్లటి నీటిని అందరికీ అందుబాటులో ఉంచండి’ అని ప్రధాని మోదీ అభ్యర్థించారు.ప్రతిభచాటిన పారా గేమ్స్ ఆటగాళ్లు ఇటీవల ముగిసిన ఖేలో ఇండియా పారా గేమ్స్(Khelo India Para Games)లో ఆటగాళ్లు తమ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈసారి ఎక్కువ మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. వారిని అభినందిస్తున్నాను. దివ్యాంగ క్రీడాకారులు 18 జాతీయ రికార్డులను కూడా సృష్టించారు. మన దేశీయ ఆటలు ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఢిల్లీలో జరిగిన ఫిట్ ఇండియా కార్నివాల్లో వివిధ ప్రాంతాల నుండి సుమారు 25 వేల మంది పాల్గొన్నారు. వారందరి లక్ష్యం ఒక్కటే ‘ఫిట్గా ఉండటం.. ఫిట్నెస్ గురించి అందరికీ అవగాహన కల్పించడం’ అని ప్రధాని పేర్కొన్నారు.సవాల్గా మారిన వస్త్ర వ్యర్థాలుదేశంలో వస్త్ర వ్యర్థాలు కొత్త సవాలుగా మారాయి. మనం పాత దుస్తులను పారవేసినప్పుడు వాటిలో ఒక శాతం మాత్రమే రీసైకిల్ అవుతుంది. ప్రపంచంలో అత్యధిక వస్త్ర వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే మూడవ దేశం భారత్.ఈ సవాలును ఎదుర్కొనేందుకు పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివిధ స్టార్టప్లు పాత బట్టలు, బూట్లు, చెప్పులను రీసైక్లింగ్ చేసి ఉపయోగకరంగా మారుస్తున్నాయని ప్రధాని తెలిపారు.యోగా దినోత్సవానికి ఏర్పాట్లుయోగా దినోత్సవానికి ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంది. యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలి. ప్రపంచ మానవాళికి భారత్ ఇచ్చిన బహుమతి యోగా. ఇది భవిష్యత్ తరానికి ఉపయోగపడుతుంది. యోగా సాయంతో ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిద్దాం. నేడు పెద్ద సంఖ్యలో యువత యోగాను అభ్యసిస్తున్నారు. అలాగే ఆయుర్వేదాన్ని కూడా ఆశ్రయిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పుతిన్ కారులో భారీ పేలుడు.. జెలెన్స్కీ భవిష్యవాణి నిజమేనా? -
‘ఆరోగ్య భారతం’ అత్యావశ్యకం
న్యూఢిల్లీ: దేశంలో స్థూలకాయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఒబేసిటీ నేడు అతిపెద్ద సమస్యగా మారిందని అన్నారు. దేశంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు స్థూలకాయంతో బాధపడుతున్నట్లు పరిశోధనల్లో తేలిందని గుర్తుచేశారు. ఇండియాలో గత కొన్నేళ్లలో స్థూలకాయుల సంఖ్య రెండు రెట్లు పెరిగిందని చెప్పారు. ప్రధానంగా చిన్నారుల్లో స్థూలకాయ సమస్య విపరీతంగా పెరగడం నిజంగా ఆందోళనకరమేనని తెలిపారు. ఇండియా చక్కటి ఆరోగ్యకరమైన, దృఢమైన దేశంగా మారడం అత్యావశ్యకం అని ఉద్ఘాటించారు. ఆరోగ్య భారతం కోసం స్థూలకాయ సమస్యపై పోరాటం చేయాలని, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ వంటనూనెల వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించుకోవాలని సూచించారు. ఈ సూచన పాటించాలంటూ 10 మందికి తాను సవాల్ విసురుతున్నానని, ఆ 10 మందిలో ఒక్కొక్కరు మరో 10 మందికి ఇదే సవాల్ విసరాలని స్పష్టంచేశారు. ఈ శృంఖలాన్ని కొనసాగించాలని, అంతిమంగా ప్రజలంతా వంటనూనెల వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని, తద్వారా ఆరోగ్యానికి ఎనలేని మేలు జరుగుతుందని పిలుపునిచ్చారు. ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ చోప్రా సహా పలువురు ప్రముఖులు ఆడియో సందేశాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వినిపించారు. స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి వారు ఇచ్చిన సలహాలు, సూచనలు ఇందులో ఉన్నాయి. ప్రధాని మోదీ ఆదివారం ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతరిక్షం నుంచి క్రీడల దాకా పలు అంశాలను ప్రస్తావించారు. ఆయన ఏం మాట్లాడారంటే... మహిళల స్ఫూర్తిని గౌరవించుకోవాలి ‘‘వేర్వేరు రంగాల్లో మన మహిళలు ఎన్నో విజయాలు సాధించారు. వారిచ్చిన స్ఫూర్తిని మనం గౌరవించుకోవాలి. వచ్చే నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా భారతదేశ నారీశక్తికి నా సెల్యూట్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 8వ తేదీన నా సోషల్ మీడియా ఖాతాలను మహిళా విజేతలకే అప్పగిస్తా. వారు తమ కార్యాచరణ, ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు, అనుభవాలను అందులో పంచుకోవచ్చు. ప్రజలకు సందేశం ఇవ్వొచ్చు. ఇందులో మీరు పాల్గొనాలంటే నమో యాప్ ద్వారా పేర్లు నమోదు చేసుకోండి. నేడు ఎన్నో కీలక రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండడం సంతోషంగా ఉంది. ‘ఒక్కరోజు సైంటిస్టు’గా మారడానికి విద్యార్థులు, యువత ప్రయత్నించాలి. ఈ నెల 28వ తేదీన నేషనల్ సైన్స్ డే సందర్భంగా రీసెర్చ్ ల్యాబ్లు లేదా ప్లానిటోరియమ్స్ను సందర్శించాలని కోరుతున్నా. ‘ఇస్రో’ సెంచరీ హర్షణీయం ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ క్రికెట్ మ్యాచ్లు అభిమానులను అలరిస్తున్నాయి. ఎక్కడ చూసినా క్రికెట్ వాతావరణం, అభిమానుల సందడి కనిపిస్తోంది. క్రికెట్లో మన జట్టు సెంచరీ సాధిస్తే కలిగే ఆనందం అందరికీ తెలిసిందే. అంతరిక్ష రంగంలో మన దేశం ఇటీవలే సెంచరీ సాధించింది. గత నెలలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) 100వ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. స్పేస్సైన్స్లో నిత్యం కొత్త శిఖరాలను అధిరోహించాలన్న మన పట్టుదల, అంకితభావానికి ఇదొక ప్రతీక’’. జింక మహిళ అనూరాధ రావు అనూరాధ రావు గురించి మీకు చెప్పాలి. అండమాన్ నికోబార్ దీవుల్లో జంతువుల సంరక్షణ కోసం ఆమె ఎంతగానో శ్రమిస్తున్నారు. చిన్నప్పటి నుంచే జంతువుల సేవలో నిమగ్నమయ్యారు. జంతుజాలం సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేశారు. ప్రజలు ఆమెను ‘జింక మహిళ’ అని పిలుస్తుంటారు. వచ్చే నెలలో ‘వరల్డ్ వైల్డ్లైఫ్ డే’ నిర్వహించుకుంటాం. జంతుజాలం పరిరక్షణ కోసం శ్రమిస్తున్నవారిని ప్రోత్సహించండి’’ అని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
‘మన్కీ బాత్’లో తెలంగాణ టీచర్ ప్రస్తావన..కారణమిదే..
న్యూఢిల్లీ:మన్కీ బాత్లో తెలంగాణ టీచర్ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఆదివారం(ఫిబ్రవరి23) నిర్వహించిన మన్కీ బాత్లో ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడారు.‘ఇటీవల కృత్రిమమేధ (ఏఐ) సదస్సులో పాల్గొనేందుకు పారిస్ వెళ్లాను. ఏఐలో భారత్ సాధించిన విజయాలను ప్రపంచం ప్రశంసించింది. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్లోని ప్రభుత్వ స్కూల్ టీచర్ తొడసం కైలాష్ గిరిజన భాషలను కాపాడడంలో మాకు సాయం చేశారు. ఏఐ సాధనాలను ఉపయోగించి కొలామి భాషలో పాటను కైలాష్ కంపోజ్ చేశారు’ అని మోదీ కొనియాడారు. ‘ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేయడం దేశానికే గర్వకారణం. పది సంవత్సరాల్లో దాదాపు 460 ఉపగ్రహాలను ఇస్రో లాంచ్ చేసింది.చంద్రయాన్ విజయం దేశానికి ఎంతో గర్వకారణం.అంతరిక్షం, ఏఐ ఇలా ఏ రంగమైనా మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది.జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి జీవితాల్లో స్ఫూర్తి నింపేందుకు ఒక రోజు నా సోషల్ మీడియా ఖాతాను వారికే అంకిత చేస్తా’అని మోదీ తెలిపారు. -
ఈసీ చిత్తశుద్ధికి అభినందనలు
న్యూఢిల్లీ: ప్రజా శక్తిని సాంకేతికత దన్నుతో (Central Election Commission)కేంద్ర ఎన్నికల సంఘం మరింత బలోపేతం చేసిందని ప్రధాని , (Narendra Modi)మోదీ వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధితో ఎన్నికలను సజావుగా నిర్వహించిందంటూ అభినందించారు. ఆదివారం ఆయన , (Mann Ki Baat)‘మన్కీ బాత్’లో మాట్లాడారు. జనవరి 26న గణతంత్ర వేడుకల నేపథ్యంలో కార్యక్రమాన్ని చివరి ఆదివారానికి బదులు ఒక వారం ముందుకు జరిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకునే ఈసీ వ్యవస్థాపక దినోత్సవం జనవరి 25వ తేదీ సమీపిస్తున్న వేళ ఈసీని మోదీ పొగడటం విశేషం. ‘‘ 1951–52లో తొలిసారి ఎన్నికలు జరిగేటప్పుడు ప్రజాస్వామ్యం దేశంలో మనగలదా అని చాలా మంది అనుమానాలు వ్యక్తంచేశారు. అయితే వాళ్లందరి అనుమానాలను పటాపంచలుచేస్తూ భారత్ ప్రజాస్వామ్యానికి పుట్టిల్లుగా అవతరించింది. ఎప్పటికప్పుడు ఓటింగ్ విధానాన్ని ఆదునీకరిస్తూ, పటిష్టపరుస్తున్న ఈసీకి నా అభినందనలు’’ అని మోదీ అన్నా రు. ‘‘ ఈసారి గణతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకం. భారత గణతంత్రానికి ఇది 75వ వార్షికోత్స వం. ఇంతటి పవిత్ర రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగపరిషత్లోని మహనీయులకు నా సెల్యూ ట్. ఆనాటి వారి విస్తృతస్థాయి చర్చలు, రాజ్యాంగ సభలో సభ్యుల ఆలోచనలు, వారి ఉపదేశాలు మనకు గొప్ప వారసత్వ సంపద’’అంటూ నాటి చైర్మన్ రాజేంద్ర ప్రసాద్, బీఆర్ అంబేడ్కర్, శ్యామ ప్రసాద్ ముఖర్జీల ప్రసంగాల ఆడియో క్లిప్లను మోదీ వినిపించారు. ‘‘ భారత్ తరఫున తొలిసారిగా ప్రైవేట్ ఉపగ్రహాల కూటమి ఫైర్ఫ్లైను నింగిలోకి పంపి బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ ‘పిక్సెల్’ చరిత్ర సృష్టించిన విషయాన్ని చెప్పేందుకు గర్వపడుతున్నా’’ అని మోదీ అన్నారు. -
గ్రీన్ ఆర్మీ
ఉత్తరప్రదేశ్లో గతంలో ‘గులాబ్ గ్యాంగ్’ ఘనత విన్నాం. ఇప్పుడు ‘గ్రీన్ ఆర్మీ’. స్త్రీల మీద జరిగే దురాగతాలను స్త్రీలే ఉమ్మడిగా ఎదిరిస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. వారణాసిలో క్రియాత్మకంగా ఉన్న ‘గ్రీన్ ఆర్మీ’ మహిళా బృందాన్ని ప్రధాని మోదీ ఇటీవలి మన్కీ బాత్లో ప్రశంసించారు.వాళ్లంతా ఒక 50 మంది ఉంటారు. ఆకుపచ్చ చీరలో, చేతి కర్రతో వరుసగా నడుస్తూ ఊళ్లోకి వస్తారు. ఇక ఊళ్లోని మగాళ్లకు గుండె దడే. భార్యలను కొట్టేవాళ్లు, తాగుబోతులు, పేకాట రాయుళ్లు, మత్తు పీల్చేవాళ్ళు, కట్నం కోసం వేధించేవాళ్లు... ఎక్కడికక్కడ సెట్రైట్ కావాల్సిందే. ఎందుకంటే వారు ‘గ్రీన్ ఆర్మీ’. అందరి స్క్రూలు టైట్ చేసే ఆర్మీ. అందుకే మొన్నటి ‘మన్ కీ బాత్’లో వీరి గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ‘వీరి ఆత్మనిర్భరతకు, కృషికి అభినందనలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలిపారు. దాంతో గ్రీన్ ఆర్మీలో కొత్త జోష్ వచ్చింది.వారణాసి చుట్టుపక్కలగ్రీన్ ఆర్మీ 2014లో పుట్టింది. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్న రవి మిశ్రా వారణాసి చుట్టుపక్కల పల్లెల్లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఉత్తర జిల్లాలలో గృహ హింస ఎక్కువగా ఉందని గమనించాడు. స్త్రీలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే వారు ఆత్మరక్షణ చేసుకోగలరని అనుకున్నాడు. కొందరు విద్యార్థులతో కలిసి నిర్మలాదేవి అనే గృహిణిని గృహ హింసను ప్రతిఘటించమని కోరాడు. రైతు కూలీగా ఆమె సంపాదించేదంతా ఆమె భర్త లాక్కుని తాగేవాడు. కొట్టేవాడు. నిర్మాలా దేవి విద్యార్థుల స్ఫూర్తితో ఆత్మరక్షణ నేర్చుకుంది. అంతేకాదు గ్రామంలోని మరికొంతమందిని జమ చేసింది. అందరూ కలిసి ఇక గృహ హింసను ఏ మాత్రం సహించమని ఎలుగెత్తారు. అంతేకాదు.. కర్ర చేతబట్టి మాట వినని భర్తలకు బడితె పూజ చేశారు. నిర్మలాదేవి భర్త దారికొచ్చాడు. దాంతో గ్రీన్ ఆర్మీ పేరు వినపడసాగింది.270 పల్లెల్లో...వారణాసిలో, చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పుడు 270 గ్రామాల్లో గ్రీన్ ఆర్మీ ప్రతినిధులు ఉన్నారు. 2000 మంది స్త్రీలు ఇందులో భాగస్వాములు. ప్రతి ఊరిలో ఇరవై నుంచి యాభై మంది స్త్రీలు ఆకుపచ్చ చీరల్లో దళంగా మారి క్రమం తప్పక ఇంటింటికీ వెళ్లి సమస్యల ఆచూకీ తీస్తారు. వాటికి పరిష్కారాలు వెదుకుతారు. స్త్రీల మీద చెయ్యెత్తడం అనేది వీరు పూర్తిగా ఊళ్లల్లో నిర్మూలించారు. ఇక తాగుడు పరిష్కారం కోసం తాగుబోతులకు కౌన్సెలింగ్ ఇవ్వడంప్రారంభించారు. పేకాట, డ్రగ్స్కైతే స్థానమే లేదు. గ్రీన్ ఆర్మీతో స్థానిక పోలీస్ కాంటాక్ట్లో ఉంటుంది. ఎవరైనా గ్రీన్ ఆర్మీకి ఎదురు తిరిగితే పోలీసులు వచ్చి చేయవలసింది చేస్తారు. వరకట్న సమస్య ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉంది. ‘మీకు కట్నం ఎందుకు ఇవ్వాలి... సరంజామా ఎందుకివ్వాలి’ అని గ్రీన్ ఆర్మీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దాంతో గొంతెమ్మ కోరికలు పూర్తిగా తగ్గాయి. ఇచ్చింది పుచ్చుకుంటున్నారు.ఆడపిల్లే అదృష్టంకొన్ని జిల్లాల్లో ఇప్పటికీ ఆడపిల్ల పుడితే శోకం వ్యక్తం చేస్తారు. ఏడుస్తూ గుండెలు బాదుకుంటారు. కాని గ్రీన్ ఆర్మీ బయలుదేరి ఈ శోకానికి ముగింపు చెప్పింది.‘ఆడపిల్ల అంటే లక్ష్మీ అని ఇంటికి భాగ్యమనీ బాగా చదివిస్తే సరస్వతి అని, శక్తిలో దుర్గ అని... ఆడపిల్లను మగపిల్లాడితో సమానంగా చూడాల’ని ఇంటింటికి తిరిగి చైతన్యం కలిగించారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులకు రక్షణగా నిలబడ్డారు. ఇవన్నీ సాంఘికంగా చాలా మార్పు తెచ్చాయి. అందుకే ఒక్కరు కాకుండా సమష్టిగా ప్రయత్నిస్తే విజయాలు వస్తాయి. గ్రామీణ జీవితంలో స్త్రీలకు ఇంకా ఎన్నో ఆటంకాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కర్రచేత బట్టి ఆర్మీగా మారకపోయినా స్త్రీలు సంఘాలు ఏర్పరుచుకుంటే సమస్యలు దూరం కాకపోవడం ఉండదు. గ్రీన్ ఆర్మీ ఇస్తున్న సందేశం అదే. -
ఐక్యతా మహా కుంభ్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి నెలన్నర పాటు జరగనున్న మహా కుంభమేళాను ఐక్యత మహాకుంభ్గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ‘‘అందరూ కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరించాలి. సమాజంలో విద్వేషం, విభజనవాదాల నిర్మూలనకు సంకల్పం తీసుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. ఆదివారం 117వ ‘మన్ కీ బాత్’లో ప్రధాని మాట్లాడారు. ‘‘దేశమంతా ఏకం కావాలన్న గొప్ప సందేశాన్ని కుంభమేళా ఇస్తోంది. భారీతనంలో కాకుండా భిన్నత్వంలోనే దాని ప్రత్యేకత దాగుంది. అంతటి వైవిధ్యాన్ని ప్రపంచంలో ఎక్కడా చూడబోం. అవిశ్రాంత గంగా ప్రవాహంలా సమాజమంతా ఒక్కటిగా ఉండాలి’’ అన్నారు. కుంభమేళాలో 11 భారతీయ భాషల్లో ఏఐ చాట్బాట్ సేవలను భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు. ‘ఆయుష్మాన్’తో క్యాన్సర్కు చెక్ ‘‘మన దేశంలో 2015–2023 మధ్య మలేరియా కేసులు, మరణాలు 80 శాతం తగ్గినట్లు డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడించింది. ఇదో గొప్ప విజయం. మన దగ్గర క్యాన్సర్ చికిత్సను సకాలంలో ప్రారంభిస్తుండడం గణనీయంగా పెరిగిందని లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. ఆయుష్మాన్ భారత్ యోజన కింద 90 శాతం మంది క్యాన్సర్ బాధితులు సకాలంలో చికిత్స పొందగలుగుతున్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాల పట్ల విదేశీయులు ఆకర్షితులవుతున్నారు. ఫిజిలో తమిళ టీచింగ్ ప్రోగ్రాంకు ఎంతో ఆదరణ లభిస్తోంది. ఛత్తీస్గఢ్లోని బస్తర్లో విశిష్టమైన ఒలింపిక్స్ జరిగాయి. పేదరికం, కరువు, వలసలకు మారుపేరైన ఒడిశాలోని కలహండిలో కూరగాయల విప్లవం సాగుతోంది’’ అని మోదీ అన్నారు. వచ్చే జనవరి 26న రాజ్యాంగ 75వ వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు. ‘‘ఇది మనందరికీ గర్వకారణం. రాజ్యాంగం వల్లే ఈ రోజు నేనీ స్థాయికి చేరుకున్నా. మన రాజ్యాంగం ప్రతి సందర్భంలోనూ కాల పరీక్షకు నిలిచింది. దారిదీపంగా, మార్గదర్శిగా ముందుకు నపుడుతోంది’’ అన్నారు.అక్కినేనితో కొత్త శిఖరాలకు తెలుగు సినిమా సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు చేర్చారంటూ మోదీ ప్రశంసించారు. భారతీయ సంప్రదాయాలు, విలువలను ఆయన సినిమాలు ప్రతిబింబించాయని కొనియాడారు. ‘‘ఈ ఏడాది ఆయనతో పాటు రాజ్ కపూర్, తపన్ సిన్హా, మహ్మద్ రఫీ వంటి సినీ ఉద్ధండుల శత జయంతి వేడుకలు జరగడం హర్షణీయం. సృజనాత్మక రంగంలో మన ప్రతిభా పాటవాలను ప్రపంచానికి తెలిపేలా వచ్చే ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ దాకా ఢిల్లీలో తొలిసారిగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ (వేవ్స్) జరగనుంది. ప్రపంచ దేశాల నుంచి అగ్రశ్రేణి కంటెంట్ క్రియేటర్లు అందులో పాల్గొంటారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్లో ఇండియాను కేంద్రస్థానంగా మార్చే దిశగా ఈ సదస్సు మనకు చాలా కీలకం’’ అని తెలిపారు. ఇండియా ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడంలో కంటెంట్ క్రియేటర్లు చురుకైన పాత్ర పోషించాలన్నారు. దేశ ప్రజలందరికీ మోదీ నూతన సంత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యంగా, సంతోషంగా ‘ఫిట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
ఆయన వల్లే తెలుగు సినిమా ప్రపంచస్థాయికి వెళ్లింది: మన్ కీ బాత్లో ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మన్ కీ బాత్లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు పేరును మోదీ ప్రస్తావించారు. ఆయన వల్లే తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచస్థాయికి వెళ్లిందని గుర్తు చేసుకున్నారు.ఏఎన్నార్ నటించిన చిత్రాల్లో మన సంప్రదాయాలు, విలువలు చక్కగా చూపించారని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రస్తుతం ప్రపంచదేశాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూస్తున్నాని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే ఏడాది వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. మన్ కీ బాత్లో మన తెలుగు సినీ దిగ్గజం నాగేశ్వరరావును ప్రశంసించండంతో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
వికసిత భారత్లో యువత పాత్ర కీలకం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (ఆదివారం)తన రేడియో కార్యక్రమం ‘మన్కీ బాత్’లో మాట్లాడారు. ప్రధాని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇది 116వ ఎపిసోడ్. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వికసిక బారత్లో యువత పాత్ర కీలకమని అన్నారు.‘మన్ కీ బాత్’ కార్యక్రమం ప్రారంభంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ .. మన్ కీ బాత్ అంటే దేశానికి సంబంధించిన సమిష్టి కృషి గురించి మాట్లాడటమన్నారు. దేశం సాధించిన విజయాలు ఇక్కడి ప్రజల శక్తితో ముడిపడివున్నాయన్నారు. తాను ప్రజలతో నేరుగా కమ్యూనికేట్ కావడానికి మన్ కీ బాత్ కార్యక్రమం కోసం ఎదురు చూస్తుంటానని, వీలైనన్ని ఎక్కువ సందేశాలను అందించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాని, ప్రజలు అందించే సూచనల కోసం ఎదురుచూస్తుంటానని అన్నారు.'मन की बात' के 116वें एपिसोड में प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "मैंने लाल किले की प्राचीर से ऐसे युवाओं से राजनीति में आने का आह्वान किया है, जिनके पूरे परिवार की कोई राजनीतिक पृष्ठभूमि नहीं रही है। ऐसे एक लाख युवाओं को, नए युवाओं को राजनीति से जोड़ने के लिए देश में कई विशेष… pic.twitter.com/xcU1doulIi— ANI_HindiNews (@AHindinews) November 24, 2024ఈరోజు(ఆదివారం) చాలా ప్రత్యేకమైన రోజని, ఈరోజు ఎన్సీసీడీ అని ప్రధాని గుర్తుచేశారు. ఎన్సీసీ పేరు వినగానే మనకు స్కూల్-కాలేజీ రోజులు గుర్తుకొస్తాయని, తాను ఎస్సీసీ విద్యార్థిని అని, నాడు తాను పొందిన అనుభవం అమూల్యమైనదని మోదీ పేర్కొన్నారు. ఎన్సీసీ అనేది యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవా స్ఫూర్తిని పెంపొందిస్తుందన్నారు. విపత్తుల సమయంలో సహాయం చేయడానికి ఎన్సీసీ అభ్యర్థులు ఎల్లప్పుడూ ముందు ఉంటారని, ప్రతీ విద్యార్థి ఎన్సీసీలో చేరాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో యువత పాత్ర ఎంతో కీలకమని, యువత ఒక్కతాటిపైకి వచ్చి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే, ఖచ్చితంగా అభివృద్ధి త్వరితగతిన జరుగుతుందన్నారు.కార్యక్రమంలో స్వామి వివేకానందను స్మరించుకున్న ప్రధాని మోదీ 'వచ్చే ఏడాది స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా నిర్వహించనున్నామని అన్నారు. జనవరి 11, 12 తేదీల్లో ఢిల్లీలోని భారత్ మండపంలో ‘యంగ్ ఐడియాస్ మహాకుంభ్’ జరగనుందని, ఈ కార్యక్రమానికి రెండు వేల మంది యువత తరలిరానున్నారని తెలిపారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని యువతను రాజకీయాల్లోకి రావాలని ఎర్రకోట ప్రాకారాల నుంచి తాను పిలుపునిచ్చానని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇది కూడా చదవండి: శంకర నేత్రాలయ అట్లాంటాలో శాస్త్రీయ నృత్య కార్యక్రమాలతో నిధుల సేకరణ -
‘డిజిటల్ అరెస్టు’కు... భయపడకండి
న్యూఢిల్లీ: దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం వేశారు. ఇటీవల పెచ్చరిల్లుతున్న ‘డిజిటల్ అరెస్టు’ ఫ్రాడ్ను ఆదివారం ‘మన్కీ బాత్’లో ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘అన్ని వయసుల వారూ వీటి బారిన పడుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. సైబర్ నేరగాడికి, బాధితుడికి మధ్య జరిగిన సంభాషణను మోదీ ఉదాహరించారు. ‘‘సైబర్ నేరగాళ్లు తొలుత వ్యక్తిగత సమాచారం సేకరిస్తారు. తర్వాత ఫోన్లు చేసి మీరు నేరాల్లో ఇరుక్కున్నారంటూ భయభ్రాంతులకు గురి చేస్తారు. ఆలోచించుకొనే సమయం కూడా ఇవ్వరు. డబ్బులిస్తారా, అరెస్టవుతారా అంటూ బెదిరిస్తారు. భయపడితే మానసికంగా మరింత ఒత్తిడికి గురి చేసి డబ్బు గుంజుతారు. ‘ఆగడం, ఆలోచించడం, చర్య తీసుకోవడం’ ఈ మోసాలకు విరుగుడు’’ అన్నారు. ‘‘ఇలాంటి గుర్తు తెలియని బెదిరింపు ఫోన్లకు భయపడకుండా ధైర్యంగా ఉండండి. దర్యాప్తు సంస్థలు, పోలీసులు ప్రజలకు ఇలాంటి ఫోన్లు చేయరని, డబ్బులడగరని గుర్తుంచుకోండి. సాయం కోసం జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ ‘1930’కు ఫోన్ చేయండి. సైబర్ నేరగాళ్లతో సంభాషణను రికార్డు చేసి దర్యాప్తు సంస్థలకు అందించండి. సైబర్ మోసాలపై cybercrime. gov. in వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయండి’’ అని సూచించారు. ‘‘డిజిటల్ మోసాలు, ఆన్లైన్ స్కాములపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. అప్రమత్తతే డిజిటల్ భద్రత కల్పిస్తుంది’’ అని ఉద్ఘాటించారు. సైబర్ నేరగాళ్లను సమాజానికి శత్రువులుగా అభివరి్ణంచారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కలి్పంచాలన్నారు. అవి మరపురాని క్షణాలు సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఈ నెల 31న ఘనంగా నిర్వహించుకుందామని మోదీ అన్నారు. ‘‘గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతి వేడుకలు నవంబర్ 15న ప్రారంభమవుతాయి. గతేడాది జార్ఖండ్లో బిర్సా ముండా స్వగ్రామం ఉలిహాతును సందర్శించా. అవి మరపురాని క్షణాలు’’ అన్నారు.యానిమేషన్లో అద్భుతాలు ప్రతి రంగంలోనూ ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తి కనిపిస్తోందని మోదీ హర్షం వెలిబుచ్చారు. ‘‘మన రక్షణ ఉత్పత్తులు 85 దేశాలకు ఎగుమతవుతున్నాయి. యానిమేషన్ రంగంలో మన కళాకారులు గణనీయమైన ప్రగతి సాధించారు. చోటా భీమ్, హనుమాన్, మోటు–పత్లూ, ధోలక్పూర్ కా ధోల్ వంటి యానిమేషన్ సిరీస్లు విదేశాల్లోనూ ప్రజాదరణ పొందుతున్నాయి. భారత్ను ప్రపంచ యానిమేషన్ పవర్హౌస్గా మారుద్దాం. ఇండియాలో గేమింగ్ రంగం వేగంగా విస్తరిస్తోంది. మన గేమ్స్కు ప్రపంచమంతటా ఆదరణ ఉంది. ప ర్యాటకానికి వర్చువల్ రియాలిటీ (వీటీ) ఊతం ఇస్తోంది. ప్రపంచంలో తదుపరి సూపర్ హిట్ యానిమేషన్ చిత్రం మీ కంప్యూటర్ నుంచే రావొచ్చు. మరో గొప్ప గేమ్ను మీరే సృష్టించవచ్చు’’ అని యువతనుద్దేశించి పేర్కొన్నారు. -
యానిమేషన్ రంగంలో దూసుకుపోతున్న భారత్: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రతిసారిలాగే ఈ కార్యక్రమంలోనూ తన అభిప్రాయాలను అందరితో పంచుకున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలోని 115వ ఎపిసోడ్ నేడు ప్రసారమయ్యింది. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ‘భారతదేశం ప్రతి యుగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నదని చెబుతూ, నేటి మన్ కీ బాత్లో ధైర్యం, దూరదృష్టి కలిగిన ఇద్దరు గొప్ప హీరోల గురించి చర్చిస్తాను. సర్దార్ పటేల్ 150వ జయంతి అక్టోబర్ 31న జరగనుంది. బిర్సా ముండా 150వ జయంతి నవంబర్ 15న జరగనుంది. ఈ ఇద్దరు మహానుభావుల ముందున్న సవాళ్లు భిన్నమైనవి. అయినా వారి దృష్టి ఒక్కటే.. అదే దేశ సమైక్యత అని ప్రధాని పేర్కొన్నారు.నా జీవితంలో మరచిపోలేని క్షణాలు ఏవి అని మీరు నన్ను అడిగితే, చాలా సంఘటనలు గుర్తుకు వస్తాయి. అయితే వీటిలో ఒకటి చాలా ప్రత్యేకమైనది. అది గత ఏడాది నవంబర్ 15న బిర్సా ముండా జన్మదినోత్సవం సందర్భంగా నేను ఆయన జన్మస్థలమైన జార్ఖండ్లోని ఉలిహతు గ్రామానికి వెళ్లాను. ఈ ప్రయాణం నాపై చాలా ప్రభావం చూపిందని మోదీ అన్నారు.ఛోటా భీమ్లాగా మన ఇతర యానిమేషన్ సిరీస్ కృష్ణ, మోటు-పత్లు, బాల్ హనుమాన్లకు కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారతీయ యానిమేటెడ్ పాత్రలు, చలనచిత్రాలు వాటి కంటెంట్, సృజనాత్మకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతున్నాయి. యానిమేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే విధంగా భారతదేశం ముందుకు సాగుతోంది. భారతీయ క్రీడలు కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందుతున్నాయి. భారత్లో సృజనాత్మక శక్తి ఉప్పొంగుతోంది. ‘మేడ్ ఇన్ ఇండియా’, ‘మేడ్ బై ఇండియా’ అనేవి యానిమేషన్ ప్రపంచంలో దూసుకుపోతున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.10 సంవత్సరాల క్రితం, భారతదేశంలో సంక్లిష్టమైన సాంకేతికతను అభివృద్ధి చేయవచ్చని ఎవరైనా చెప్పినప్పుడు, చాలా మంది దానిని నమ్మలేదు. పైగా ఎగతాళి చేసేవారు. కానీ నేడు దేశం సాధించిన విజయాన్ని చూసి.. వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు మొబైల్ ఫోన్ల దిగుమతిదారుగా ఉన్న భారత్ నేడు ప్రపంచంలోనే మొబైల్ ఫోన్ల తయారీలో రెండవ అతిపెద్ద దేశంగా అవతరించింది. ఒకప్పుడు రక్షణ పరికరాలను అత్యధికంగా కొనుగోలు చేసిన భారతదేశం నేడు 85 దేశాలకు వాటిని ఎగుమతి చేస్తోంది. అంతరిక్ష సాంకేతికతలో చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గరకు చేరిన మొదటి దేశంగా భారతదేశం అవతరించింది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: దీపావళి తర్వాత జార్ఖండ్లో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ -
PM Narendra Modi: పదేళ్ల మన్కీ బాత్
న్యూఢిల్లీ: ‘‘మసాలా వార్తలు, ప్రతికూల అంశాలపైనే ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతారన్న వాదనలో నిజం లేదని మన్కీ బాత్ నిరూపించింది. సానుకూల కథనాలు, స్ఫూర్తిదాయక అంశాలకు అమితమైన ఆదరణ ఉంటుందని ఈ కార్యక్రమంతో తేటతెల్లమైంది’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడే ‘మన్కీ బాత్’ కార్యక్రమం పదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం 114వ మన్కీ బాత్లో మోదీ మాట్లాడారు. దేశ ప్రజల సామూహిక శక్తిని ప్రదర్శించే వేదికగా ఈ కార్యక్రమం మారిందంటూ ప్రశంసించారు. దీనికి పదేళ్లు పూర్తయిన సందర్భం తనను భావోద్వేగానికి గురి చేస్తోందన్నారు. ‘‘సరిగ్గా పదేళ్ల క్రితం అక్టోబర్ 3న విజయదశమి రోజున మన్ కీ బాత్ ప్రారంభమైంది. భారత స్ఫూర్తిని వేడుక చేసుకొనే విశిష్టమైన వేదికగా మారింది. దీనితో నాకెన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. ఈ ప్రయాణంలో శ్రోతలు నాతోపాటు కలిసి నడిచారు. దేశ నలుమూలల నుంచి నాకు సమాచారం చేరవేశారు. మన్కీ బాత్ అంటే నా వరకు దైవదర్శనానికి ఆలయానికి వెళ్లడం లాంటిదే. దీనితో అనుసంధానమైన ప్రతి అంశం ద్వారా సామాన్య ప్రజలను దర్శించుకున్నట్లే భావిస్తా. ప్రజలే నాకు దేవుళ్లు. 22 భారతీయ, 12 విదేశీ భాషల్లో ఈ కార్యక్రమం ప్రసారమవుతోంది. ఈ మలుపులో మరోసారి ప్రజల ఆశీస్సులు కోరుతున్నా’’ అన్నారు.పుణే మెట్రో తొలి దశ ప్రారంభం పుణే: ‘‘గత ప్రభుత్వాలు పట్టణాభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. అప్పట్లో ఒక ప్రణాళిక, దార్శనికత లోపించాయి. మేమొచ్చాక వచ్చాక పట్టణాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. పాత పని సంస్కృతికి చరమగీతం పాడాం’’ అని మోదీ చెప్పారు. ఆదివారం మహారాష్ట్రలో పుణే మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రూ.11,200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు ప్రారంభించారు. కొన్నింటికి శంకుస్థాపన చేశారు. ‘క్రాంతిజ్యోతి సావిత్రిబాయి ఫూలే స్మారక బాలిక పాఠశాల’ నిర్మాణానికి పునాదిరాయి వేశారు. గత ప్రభుత్వాల విధానాలు అమల్లో ఉంటే పుణే మెట్రో ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తయి ఉండేది కాదన్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే చొరవతో ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగుతున్నాయని చెప్పారు. వాటికీ పదేళ్లు ప్రతిష్టాత్మకంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కూడా పదేళ్లు పూర్తి చేసుకుందని మోదీ గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్కూ అక్టోబర్ 2న పదేళ్లు పూర్తవుతాయన్నారు. ‘‘ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ భారత్ విజయవంతమవుతోంది. జీవితాంతం పరిశుభ్రత కోసం తపించిన మహాత్మా గాం«దీకి ఇదో గొప్ప నివాళి. ఇక పారిశ్రామికవేత్తలతో పాటు చిరు వ్యాపారుల కృషితో ‘మేకిన్ ఇండియా’ విజయవంతమైంది. మన యువశక్తి కృషితో తయారీ రంగానికి భారత్ కేంద్రస్థానంగా మారింది. అటోమొబైల్స్ మొదలుకుని రక్షణ దాకా అన్ని రంగాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయి.స్థానికతకు జై స్థానిక ఉత్పత్తుల వాడకాన్ని పెంచి ప్రోత్సహిస్తే అంతిమంగా దేశానికే లబ్ధి చేకూరుతుందని మోదీ అన్నారు. ‘‘మన గడ్డపై మన కళాకారులు, కారి్మకుల రెక్కల కష్టంతో తయారైన ఉత్పత్తులే మనకు గర్వకారణం. పండుగల వేళ స్థానిక ఉత్పత్తులే కొనుగోలు చేయండి’’ అని పిలుపునిచ్చారు. జల సంరక్షణలో నూతన విధానాలు చక్కటి ఫలితాలిస్తున్నాయంటూ హర్షం వెలిబుచ్చారు. ‘‘కొన్నిచోట్ల మహిళా శక్తి జలశక్తిని పెంచుతోంది. మరికొన్నిచోట్ల జలశక్తి మహిళా శక్తికి తోడ్పడుతోంది. మధ్యప్రదేశ్లోని రాయ్పురా గ్రామంలో భారీ నీటి కుంట నిర్మించి భూగర్భ జలాలను పెంచారు. డ్వాక్రా మహిళలు అందులో చేపలు పెంచుతూ ఉపాధి పొందుతున్నారు’’ అని చెప్పారు. -
పదేళ్ల ‘మన్ కీ బాత్’లో.. ప్రధాని మోదీ భావోద్వేగం
న్యూఢిల్లీ: రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) ప్రసంగించారు. ఈ కార్యక్రమం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘ఈరోజు ఎపిసోడ్ నన్ను పాత జ్ఞాపకాలతో చుట్టుముడుతోంది. కారణం మన ‘మన్ కీ బాత్’ ప్రయాణం 10 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 10 సంవత్సరాల క్రితం ‘మన్ కీ బాత్’ అక్టోబర్ 3 న విజయదశమి రోజున ప్రారంభమయ్యింది. ‘మన్ కీ బాత్’ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. వాటిని నేను ఎప్పటికీ మర్చిపోలేను.కోట్లాది మంది శ్రోతలు ఈ ప్రయాణానికి సహచరులగా మారారు. వారి నుండి నేను ఎంతో ఆదరణ పొందాను. దేశంలోని నలుమూలల నుంచి సమాచారాన్ని సేకరించగలిగాను. ‘మన్ కీ బాత్’ శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన రూపశిల్పులు. సాధారణంగా స్పైసీ లేదా నెగటివ్ టాక్ ఉంటే తప్ప ఏదీ పెద్దగా దృష్టిని ఆకర్షించదు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంటుంది. సానుకూల సమాచారం కోసం దేశ ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారనేది ‘మన్ కీ బాత్’ రుజువు చేసింది. జనం స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు, ప్రోత్సాహకరమైన కథనాలను ఇష్టపడతారు. ఉదాహరణకు 'చకోర' అనే పక్షి ఉంది. అది వర్షపు చినుకులను మాత్రమే తాగుతుంది. ‘మన్ కీ బాత్’లో శ్రోతలు చకోర పక్షిలా దేశం సాధించిన విజయాలను ఎంతో గర్వంగా విన్నారు.‘మన్ కీ బాత్’లో వచ్చిన ఉత్తరాలు చదివినప్పుడు నా హృదయం విజయగర్వంతో నిండిపోతుంది. మన దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారని, దేశానికి, సమాజానికి సేవ చేయాలనే తపన వారిలో ఉందని గ్రహించాను. ‘మన్ కీ బాత్’ ప్రక్రియ నాకు గుడికి వెళ్లి దేవుడిని చూసినంత ఆనందం కలిగించింది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: సర్జికల్ స్ట్రైక్: పాక్పై ప్రతీకారం తీర్చుకున్న వేళ.. -
‘కామ్ కీ బాత్’ ఏనాడూ చెప్పలేదు
సురాన్కోట్(జమ్మూకశీ్మర్)/శ్రీనగర్: జమ్మూకశీ్మర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్య, ధరల కట్టడిని మోదీ నిర్లక్ష్యం చేశారని ఎండగట్టారు. సోమవారం పూంఛ్ జిల్లాలోని సురాన్కోట్ శాసనసభ నియోజకవర్గంలో, శ్రీనగర్లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాహుల్ ప్రసంగించారు. ‘‘నెలకోసారి ‘మన్ కీ బాత్’ముచ్చట్లతో మోదీ మోతెక్కిస్తారు. కానీ ఏనాడూ తాను పూర్తిచేయాల్సిన కీలక బాధ్యతలను ప్రస్తావించరు. బాధ్యతలను విస్మరించారు. ఉద్యోగాల కల్పన, ధరల కట్టడి వంటి చేయాల్సిన పనులపై ‘కామ్ కీ బాత్’ఏనాడూ చెప్పరు. గతంలో 56 అంగుళాల ఛాతి అంటూ గొప్పలు చెప్పుకుని తిరిగిన ఆనాటి మోదీ ఇప్పుడు లేరు. ఎందుకంటే ఆయన మూడ్ను లోక్సభ ఎన్నికల తర్వాత విపక్షాల ‘ఇండియా’కూటమి మార్చేసింది. ప్రధాని మోదీ సైకాలజీని మా కూటమి దెబ్బకొట్టింది’’అని రాహుల్ అన్నారు. కశ్మీర్ను ఢిల్లీ సర్కార్ కాదు, స్థానికులే పాలించాలి జమ్మూకశీ్మర్ను ఢిల్లీ ప్రభుత్వం కాకుండా స్థానికులే పాలించాలని రాహుల్ అన్నారు. జమ్మూకశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి మోదీ సర్కార్ నేరుగా పరిపాలిస్తున్న నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలుచేశారు. ‘‘కేంద్రపాలిత ప్రాంతా(యూటీ)లను రాష్ట్రాలుగా మార్చారుగాగానీ రాష్ట్రాన్ని యూటీగా మార్చడం భారత చరిత్రలో ఎన్నడూ జరగలేదు. పూర్తిస్థాయి రాష్ట్రమైన జమ్మూకశీ్మర్ను యూటీగా మార్చి ఇక్కడి పౌరుల హక్కులను కాలరాశారు’’అని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కాన్ఫెరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సైతం పాల్గొన్నారు. వాళ్లు చేయకుంటే మేమే చేస్తాం ‘‘జమ్మూకశీ్మర్కు మళ్లీ రాష్ట్ర హోదా కోసం కేంద్రప్రభుత్వంతో పోరాడతాం. అయినా వాళ్లు ఇవ్వకపోతే మేం కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మేమే హోదా ఇస్తాం. యూటీకాకమునుపు స్థానికులే కశీ్మర్ను పాలించేవారు. ఇక్కడి వారి భవిష్యత్తు, ప్రయోజనాలకనుగుణంగా నిర్ణయాలు జరిగేవి. ఇప్పుడు ‘బయటి’వ్యక్తులు మీ గొంతుక వినకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక్కడి ప్రభుత్వాన్ని ఢిల్లీ నడిపిస్తోంది. మేం మీ ప్రభుత్వాన్ని జమ్మూకశీ్మరే నడపాలని కోరుకుంటున్నాం. మీ సమస్యలను పార్లమెంట్ వేదికగా ఎలుగెత్తి చాటేందుకు మీ గొంతుకనవుతా’’అని స్థానికులనుద్దేశించి రాహుల్ అన్నారు. జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దఫాలో 26 స్థానాలకుగాను సెపె్టంబర్ 25న జరగబోయే పోలింగ్కు ప్రచారం సోమవారంతో ముగిసింది. కుల గణన అనడానికే మోదీ జంకుతున్నారు కుల గణన అనడానికి కూడా ప్రధాని మోదీ జంకుతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ, బీజేపీని విమర్శిస్తూ రాహుల్ సోమవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో హిందీలో పలు పోస్ట్లుచేశారు. ‘‘బీజేపీ పూర్తిగా బహుజనుల వ్యతిరేక పారీ్టగా తయారైంది. వాళ్లు ఎన్ని పుకార్లు పుట్టించినా, అబద్ధాలు వ్యాపింపజేసినా మేం మాత్రం రిజర్వేషన్లకు ఎలాంటి ముప్పు రానివ్వం. సమగ్ర కులగణన జరిగేదాకా మేం ఊరుకోం. సమాజంలోని ప్రతి వర్గానికి హక్కులు, వాటా, న్యాయం దక్కేలా చూస్తాం. అవసరమైతే 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేసి ఎక్కువ రిజర్వేష్లను కలి్పస్తాం. మోదీజీ కనీసం కులగణన అనడానికి కూడా భయపడుతున్నారు. బహుజనులకు న్యాయం దక్కడమనేది రాజకీయ అంశంకాదు అది నా జీవిత లక్ష్యం’’అని రాహుల్ అన్నారు. -
ప్రధానికి ‘మన్కీ బాత్’ పైనే ఎక్కువ దృష్టి: రాహుల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ప్రజల సమస్యలపై కంటే ఆయన ‘మన్ కీ బాత్’ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో సోమవారం ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు.మోదీకి తన మన్ కీ బాత్ గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ, ఉద్యోగాలు కల్పించడం, పెరుగుతున్న ధరలను నియంత్రించడం వంటి కామ్ కీ బాత్ గురించి మాట్లాడరని విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ ప్రభావం పెరుగుతండటంతో ప్రధాని మోదీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని అన్నారు. భారత కూటమి, కాంగ్రెస్లు మోదీ సైకాలజీని మార్చేశాయని అన్నారు.‘ఈ రోజుల్లో ప్రధాని మోదీ ముఖం మారిపోయింది, ఆయన మూడ్ మారిపోయింది. దీనికి కారణం భారత కూటమి, కాంగ్రెస్ పార్టీ, ఈ దేశ ప్రజలే. ప్రధాని, బీజేపీ విభజన రాజకీయాలు వ్యప్తి చేస్తున్నారు. గత 10 ఏళ్లలో మోదీ, బీజేపీ ఎక్కడికి వెళ్లినా విద్వేషాన్ని వ్యాపింపజేశారు. అన్నదమ్ములు ఒకరితో ఒకరు పోట్లాడుకునేలా చేశారు, మతాల మధ్య చిచ్చులు పెట్టారు. చదవండి: సోనియాపై ఆరోపణలు.. కంగనాకు కాంగ్రెస్ వార్నింగ్విద్యావంతులకు ఉద్యోగాలు కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. విద్యావంతులకు ఉద్యోగాలు దొరక్కపోవడంతో దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతోంది. ఇది నరేంద్ర మోదీ యువతకు ఇచ్చిన బహుమతి’ అంటూ సెటైర్లు వేశారు. జమ్మూ కాశ్మీర్ను రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా తగ్గించడం ద్వారా జమ్ముకశ్మీర్ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను హరించారని విమర్శించారు. ఇక్కడి ప్రజలు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణకు అర్హులని అన్నారు. కాగా జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ సెప్టెంబర్ 18న జరగ్గా, రెండో దశ ఓటింగ్ సెప్టెంబర్ 25న, మూడో దశ అక్టోబర్ 1న జరగనుంది. అక్టోబర్ 8న ఓట్లను లెక్కించనున్నారు. -
‘ఈ దుస్తులు కొనండి’.. ప్రధాని మోదీ
గ్రామాల్లో తయారుచేస్తున్న ఖాదీ వల్ల దేశవ్యాప్తంగా రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం సాగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళల్లో పెరుగుతున్న ఆదరణ, ఉద్యోగాల కల్పన కారణంగా 400 శాతం ఖాదీ, చేనేత దుస్తుల అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. భారత పౌరులు ఖాదీ దుస్తులు కొనుగోలు చేయాలని మన్ కీ బాత్ ప్రసారంలో భాగంగా మోదీ పౌరులకు సూచించారు.ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా గ్రామాల్లో తయారుచేస్తున్న ఖాదీ వ్యాపారం తొలిసారిగా రూ.1.5 లక్షల కోట్లకు చేరింది. గతంతో పోలిస్తే వీటి విక్రయాలు 400 శాతం పెరిగాయి. ఖాదీ, చేనేత విక్రయాలు పెరిగి పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఈ పరిశ్రమ పురోగతి వల్ల దీనిపై ఎక్కువగా ఆధారపడిన మహిళలకు ప్రయోజనం చేకూరుతోంది. ఇంతకుముందు ఖాదీ ఉత్పత్తులను ఉపయోగించని చాలా మంది ప్రజలు ఇప్పుడు గర్వంగా వీటిని ధరిస్తున్నారు. ఇప్పటి వరకు ఖాదీ దుస్తులు కొనకపోతే వాటిని కొనడం ప్రారంభించండి’ అని మోదీ చెప్పారు.ఇదీ చదవండి: అప్పు చెల్లించని వైజాగ్ స్టీల్ప్లాంట్!ఇదిలాఉండగా, ప్రభుత్వం చేనేత, ఖాదీ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహకాలు అందించాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి. కేంద్ర బడ్జెట్లో నేషనల్ హ్యాండ్యూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం రూ.200 కోట్లు కేటాయించారు. రానున్న బడ్జెట్లో ఆ నిధులను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ విధానాలతో గార్మెంట్ ఉత్పత్తులు తయారుచేస్తున్న కార్పొరేట్ కంపెనీలకు వెంటనే నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
Mann ki Baat: చీర్ఫర్ భారత్
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న మన క్రీడాకారులను మరింత ఉత్సాహపరుద్దామని, వారిని ప్రోత్సహిద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. భారత అథ్లెట్లకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. ఛీర్ ఫర్ భారత్ అని ఉద్ఘాటించారు. అంతర్జాతీయ వేదికపై భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించే అవకాశం ఒలింపిక్స్ క్రీడల ద్వారా మన ఆటగాళ్లకు వచ్చిందన్నారు. వారికి మనమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రధాని మోదీ ఆదివారం ‘మన్కీ బాత్’లో ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. వివిధ అంశాలను ప్రస్తావించారు. కొన్ని రోజుల క్రితం గణితశాస్త్రంలో ఒలింపిక్స్ జరిగాయని, నలుగురు భారతీయు విద్యార్థులు బంగారు పతకాలు, ఒకరు రజత పతకం సాధించారని ప్రశంసించారు. అస్సాంలోని అహోమ్ రాజుల సమాధులకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కట్టడాల జాబితాలో స్థానం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇది మనకు గర్వకారణమని అన్నారు. నేటి యువత మాదక ద్రవ్యాల విష వలయంలో చిక్కుకుంటుండడం బాధాకరమని అన్నారు. అలాంటి వారిని బయటకు తీసుకురావడానికి ‘మానస్’ పేరుతో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. డ్రగ్స్పై పోరాటంలో ఇదొక గొప్ప ముందడుగు అవుతుందన్నారు. మాదక ద్రవ్యాల వ్యసనానికి సంబంధించి ‘1933’ టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని సూచించారు.ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఎగరాలి ‘‘త్వరలో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. మువ్వన్నెల జెండాతో సెల్ఫీ దిగి హర్గర్తిరంగా.కామ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఖాదీ గ్రామోద్యోగ్ వ్యాపారం తొలిసారిగా రూ.1.5 లక్షల కోట్లకు చేరుకుంది. ఖాదీ, చేనేత వ్రస్తాల విక్రయాలు పెరుగుతున్నాయి. దీనివల్ల నూతన ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎంతోమందికి ఉపాధి లభిస్తోంది. ఖాదీ ఉత్పత్తులను ఉపయోగించడానికి ఇష్టపడినవారు ఇప్పుడు వాటిపై ఆసక్తి చూపుతున్నారు. ఖాదీ వస్త్రాలు ధరిస్తున్నారు. హరియాణాలోని రోహతక్లో 250 మంది మహిళలు బ్లాక్ పెయింటింగ్, డయింగ్ శిక్షణతో జీవితాలను తీర్చిదిద్దుకున్నారు’’ అని మోదీ ప్రశంసించారు.నల్లమల చెంచులు టైగర్ ట్రాకర్స్ ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవుల్లో నివసించే చెంచులను ప్రధాని మోదీ ప్రశంసించారు. వారిని టైగర్ ట్రాకర్స్గా అభివరి్ణంచారు. ‘‘ఆంధ్రప్రదేశ్లోని నల్లమల కొండలపై నివసించే చెంచు తెగల ప్రయత్నాలు చూస్తే ఆశ్చర్యపోతాం. టైగర్ ట్రాకర్స్గా వారు అడవిలో వన్యప్రాణుల సంచారంపై ప్రతి చిన్న సమాచారం సేకరిస్తారు. అటవీ ప్రాంతంలో అక్రమ కార్యక్రమాలపైనా నిఘా పెడతారు. టైగర్ ఫ్రెండ్స్గా వ్యవహరించే వీరు మానవులు, పులుల మధ్య ఎలాంటి వైరం లేకుండా చూస్తారు. చెంచుల కృషితో పులుల సంఖ్య పెరుగుతోంది’’ అని ‘మన్కీ బాత్’లో కొనియాడారు. దేశవ్యాప్తంగా పులుల జనాభా గొప్ప విజయమని పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం పులుల్లో 70 శాతం పులులు మన దేశంలోనే ఉన్నాయని చెప్పారు. ఇది మనకు చాలా గర్వకారణమని చెప్పారు.అభివృద్ధి, వారసత్వాలకు పెద్దపీటన్యూఢిల్లీ: భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా అవతరింపజేయడమే ఏకైక లక్ష్యంగా వికసిత్ భారత్ అజెండా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. అయితే వికసిత్ భారత్ అజెండాలో ప్రాచీన, వారసత్వ కట్టడాలు, సంస్కృతులను కాపాడుకుంటూనే అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఆయన అన్నారు. ఆదివారం ఢిల్లీలో బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘ముఖ్యమంత్రి పరిషత్’ భేటీలో 13 మంది సీఎంలు, 15 మంది డిప్యూటీ సీఎంలు పాల్గొన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దడం, సంక్షేమ పథకాల్లో ప్రజల భాగస్వామ్యంపై ప్రధాని మాట్లాడారు. సమాజంలోని భిన్న వర్గాల్లో చిట్టచివరి వ్యక్తికి సైతం కేంద్ర పథకాలు, సుపరిపాలన గురించి తెలిసేలా సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలని సీఎంలు, డిప్యూటీ సీఎంలకు మోదీ సూచించారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్, అమిత్షా, జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్ తదితరలు ఈ భేటీలో పాల్గొన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రాలు ఎలా సమర్థంగా అమలు చేయాలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. ‘‘సంక్షేమ పథకాలు లబ్దిదారులందరికీ అందేలా చూడటం మీ తక్షణ కర్తవ్యం. బీజేపీపాలిత రాష్ట్రాలు సుపరిపాలనకు సిసలైన చిరునామాగా మారాలి’’ అని మోదీ అన్నారు. -
ఆటగాళ్లను ప్రోత్సహించాలి: ప్రధాని మోదీ
‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) తన మసులోని మాటను దేశ ప్రజల ముందు ఉంచారు. ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ ఒలంపిక్స్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు, దేశానికి ఘనత సాధించిపెట్టేందుకు ఒలింపిక్స్ మన ఆటగాళ్లకు మంచి అవకాశం కల్పిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.దేశ ప్రజలంతా ఒలింపిక్ ఆటగాళ్లను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ విద్యార్థులతో ముచ్చటించారు. కొద్ది రోజుల క్రితం ప్రపంచ మ్యాథ్స్ ఒలింపిక్స్ నిర్వహించామని, వీటిలో భారత విద్యార్థులు అద్భుత ప్రదర్శన చూపారన్నారు. ఇందులో మన జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, నాలుగు బంగారు పతకాలు, ఒక రజత పతకాన్ని సాధించిందని పేర్కొన్నారు.అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో 100కు పైగా దేశాలకు చెందిన యువతీయువకులు పాల్గొన్నారని, ఓవరాల్గా మొదటి ఐదు స్థానాల్లో మన బృందం చోటు దక్కించుకుందని ప్రధాని పేర్కొన్నారు. దేశానికి కీర్తిని తీసుకువచ్చిన విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు. పూణేకు చెందిన ఆదిత్య వెంకట్ గణేష్, సిద్ధార్థ్ చోప్రా, ఢిల్లీకి చెందిన అర్జున్ గుప్తా, గ్రేటర్ నోయిడాకు చెందిన కనవ్ తల్వార్, ముంబైకి చెందిన రుషిల్ మాథుర్, గౌహతికి చెందిన ఆనందో భాదురితో ప్రధాని మాట్లాడారు.మన తల్లి కోసం, మాతృభూమి కోసం మనం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని ప్రధాని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మొక్కలు నాటే ప్రచారంలో మనమంతా భాగస్వాములు కావాలన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం కింద ఒకే రోజు రెండు లక్షల మొక్కలను నాటి, సరికొత్త సృష్టించామని మోదీ చెప్పారు. దేశ ప్రజలు ఖాదీ దుస్తులను కొనుగోలు చేయాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఎవరైనా ఖాదీ దుస్తులు కొనకుంటే ఇప్పుడే కొనుగోలు చేయాలని కోరారు. ఆగస్ట్ నెల వచ్చేస్తోందని, ఇది స్వాతంత్ర్య మాసమని, ఇది విప్లవానికి గుర్తు అని, ఖాదీని కొనడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
Mann Ki Baat: జన స్పందనకు వందనం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలైన భారత సార్వత్రిక ఎన్నికల్లో 65 కోట్ల మందికిపైగా ప్రజలు ఓటు వేశారని, దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రక్రియల పట్ల తిరుగులేని విశ్వాసం వ్యక్తం చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవంతంగా ఎన్నికలు నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ ఆదివారం తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి దాదాపు 30 నిమిషాలపాటు మాట్లాడారు. విభిన్నమైన అంశాలను ప్రస్తావించారు. తన అభిప్రాయాలు పంచుకున్నారు. వచ్చే నెలలో పారిస్ ఒలింపిక్స్లో పోటీ పడబోతున్న భారత క్రీడాకారులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. మన ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ సోషల్ మీడియాలో ‘ఛీర్4భారత్’ హ్యాష్ట్యాగ్తో పోస్టులు పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టోక్యోలో జరిగిన గత ఒలింపిక్స్లో భారత ఆటగాళ్ల ప్రదర్శన ప్రతి ఒక్కరి హృదయాలను దోచుకుందని ప్రశంసించారు. పారిస్ ఒలింపిక్స్కు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతున్న మనవాళ్లకు మద్దతు తెలపాలని సూచించారు. ఎన్నో రకాల క్రీడల్లో భారత ఆటగాళ్లు విశేషమైన ప్రతిభ చూపుతున్నారని హర్షం వ్యక్తంచేశారు. ఒలింపిక్స్కు వెళ్తున్న మన వాళ్లను త్వరలో కలుస్తానని, భారతీయులందరి తరపున వారికి ప్రోత్సాహం అందిస్తానని పేర్కొన్నారు. మన్ కీ బాత్లో మోదీ ఇంకా ఏమన్నారంటే..నా తల్లి పేరిట మొక్క నాటాను ‘‘పర్యావరణ పరిరక్షణ కోసం అడవుల పెంపకంపై మనమంతా దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా ‘తల్లి పేరిట ఒక మొక్క’ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. నా మాతృమూర్తికి గుర్తుగా మొక్క నాటాను. తల్లి పేరిట, తల్లి గౌరవార్థం మొక్కలు నాటే కార్యక్రమం వేగంగా ప్రజల్లోకి వెళ్తుండడం ఆనందంగా ఉంది. అమ్మతో కలిసి మొక్కలు నాటిన చిత్రాలను జనం సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కన్నతల్లిలాంటి భూగోళాన్ని కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. సంస్కృత భాషను గౌరవించుకుందాం ఆలిండియా రేడియోలో సంస్కృత వార్తల బులెటిన్కు 50 ఏళ్లు నిండాయి. ప్రాచీన భాషకు ప్రాధాన్యం ఇస్తున్న ఆలిండియా రేడియోకు నా అభినందనలు తెలియజేస్తున్నా. భారతీయ విజ్ఞానం, శా్రస్తాల పురోగతి వెనుక సంస్కృత భాష కీలక పాత్ర పోషించింది. సంస్కృత భాషను మనమంతా గౌరవించుకోవాలి. నిత్య జీవితంలో ఈ భాషతో అనుసంధానం కావాలి. బెంగళూరులోని ఓ పార్కులో స్థానికులు ప్రతి ఆదివారం కలుసుకుంటారు. సంస్కృత భాషలోనే మాట్లాడుకుంటారు. మరోవైపు దేశవ్యాప్తంగా గిరిజనులు ఈరోజు(జూన్ 30) ‘హూల్ దివస్’ జరుపుకుంటున్నారు. 1855లో సంథాల్ గిరిజన యోధులు వీర్ సింధూ, కాన్హూ అప్పటి బ్రిటిష్ పాలకులపై తిరగబడ్డారు. పరాయి పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. వీర్ సింధూ, కాన్హూకు నివాళులు అరి్పస్తున్నా. మన సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ భారతీయ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగాఎనలేని ఆదరణ లభిస్తోంది. ఇండియన్ కల్చర్పై కువైట్ ప్రభుత్వం కువైట్ నేషనల్ రేడియోలో ప్రతి ఆదివారం అరగంటపాటు హిందీ భాషలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేస్తోంది. మన సినిమాలు, కళలపై అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తుర్కమెనిస్తాన్లో ఈ ఏడాది మే నెలలో ఆ దేశ అధ్యక్షుడు 24 మంది ప్రపంచ ప్రఖ్యాత కవుల విగ్రహాలను ఆవిష్కరించారు. అందులో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం కూడా ఉంది. ఇది గురుదేవ్తోపాటు భారత్కు కూడా ఒక గొప్ప గౌరవమే. కరీబియన్ దేశాలైన సురినామ్, సెయింట్ విన్సెంట్, గ్రెనాడైన్స్లో ఇటీవల భారతీయ వారసత్వ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అంతేకాదు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న ప్రపంచమంతటా అమితోత్సాహంతో నిర్వహించుకున్నారు. సౌదీ అరేబియా, ఈజిప్టులో మహిళలు యోగా కార్యక్రమాలను ముందుండి నడిపించారు’’ అన్నారు.వోకల్ ఫర్ లోకల్ మన స్వదేశీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. మన వద్ద తయారైన ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయంటే అది మనందరికి గర్వకారణమే. కేరళలోని అట్టప్పాడీ గ్రామంలో గిరిజన మహిళలు తయారు చేస్తున్న కార్తుంబీ గొడుగులకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఈ గొడుగుల ప్రస్థానం ఒక చిన్న కుగ్రామం నుంచి బహుళ జాతి సంస్థల దాకా చేరుకుంది. ‘వోకల్ ఫర్ లోకల్’కు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది? లోకల్ ఉత్పత్తులను గ్లోబల్కు చేర్చడంలో జమ్మూకశ్మీర్ కూడా తక్కువేం కాదు. చలి వాతావరణంలో పండించే బఠాణీలు పుల్వామా నుంచి గత నెలలో లండన్కు ఎగుమతి అయ్యాయి. జమ్మూకశ్మీర్ సాధించిన ఈ ఘనత అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ విజయం జమ్మూకశీ్మర్ అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తుంది. ప్రజా సమస్యలపై ప్రస్తావనేది: విపక్షాలు‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ ప్రజా సమస్యలను ప్రస్తావించలేదని కాంగ్రెస్ పార్టీ మీడియా, ప్రచార విభాగం చైర్మన్ పవన్ ఖేరా ఆదివారం విమర్శించారు. నీట్– యూజీ పరీక్షలో అక్ర మాలు, రైల్వే ప్రమాదాలు, మౌలిక సదుపాయాల ధ్వంసంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో పైకప్పు కూలిపోయి ఒకరు మరణించారని, దీనిపై మోదీ నోరెత్తలేదని మండిపడ్డారు. నీట్–యూజీ పేపర్ లీకేజీ, అక్రమాలపై జనం దృష్టిని మళ్లించడానికి కేరళలో తయారయ్యే గొడుగుల గురించి మోదీ ప్రస్తావించారని విమర్శించారు. ప్రజల మనసులో మాటను మోదీ తెలుసుకోవాలని పవన్ ఖేరా హితవుపలికారు. -
అరకు కాఫీకి సలాం.!
సాక్షి, విశాఖపట్నం : ‘‘మన దేశంలో స్థానిక ఉత్పత్తులు ప్రపంచ స్థాయి గుర్తింపును సాధిస్తుండడం భారతీయులంతా గర్వించదగ్గ విషయం. అలాంటి ఉత్పత్తుల్లో అరకువ్యాలీ కాఫీ ప్రథమ శ్రేణిలో ఉంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని గిరిజనులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. శ్రేష్టమైన అరోమా రుచి గల ఇక్కడ పండే అరకు కాఫీ మంచి గుర్తింపు ఉంది. లక్షా 50 వేల మంది ఆదివాసీ కుటుంబాలు అరకు కాఫీ సాగు, ఉత్పత్తి, విక్రయాలతో ఆర్ధిక సాధికారత సాధిస్తున్నారు. కాఫీకి గ్లోబల్ గుర్తింపు తీసుకురావడంలో విశేషమైన కృషి చేస్తున్న జీసీసీ.. ఆదివాసీ రైతు సోదర,సోదరీమణుల్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి, కాఫీ సాగుకు ప్రోత్సహిస్తోంది.ఈ ప్రక్రియలో గిరిజనుల ఆదాయం గణనీయంగా పెరగడంతో పాటు గౌరవనీయమైన జీవనాన్ని సాగిస్తున్నారు. అరకు కాఫీ రుచి గురించి చెప్పాల్సిన అవసరంలేదు..అద్భుతంగా ఉంటుంది. అరకు కాఫీకి ప్రపంచస్థాయి అవార్డులు ఎన్నో వచ్చాయి. గతేడాది సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగిన జి 20 సమ్మిట్ లో కూడా అరకువ్యాలీ కాఫీకి ప్రాచుర్యం లభించింది. మీకు ఎప్పుడు వీలు దొరికినా అరకువ్యాలీ కాఫీ రుచిని ఆస్వాదించండి’’ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏపీలో గిరిజనులు సాగు చేస్తున్న అరకువ్యాలీ కాఫీ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించిన మాటలివీ. ప్రధాని ప్రశంసల వెనుక కాఫీకి రుచి తీసుకొచ్చి.. ప్రపంచ గుర్తింపు తీసుకురావడంలో గత ఐదేళ్లలో అనేక కృషి సల్పింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.2014–19 కాలంలో రాష్ట్రంలోని ప్రతి విభాగాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు.. గిరిజన సహకార సంస్థ (జీసీసీ)కీ అదే దుస్థితి పట్టించారు. ఇక కోలుకోలేదనుకున్న సంస్థకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త ఊపిరి పోసింది. జీసీసీనే నమ్ముకున్న గిరిజనుల జీవితాలకు కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఉత్పత్తుల కొనుగోలు దగ్గర నుంచి.. విక్రయాల వరకూ తిరుగులేని శక్తిగా అభివృద్ధి పథంలోకి దూసుకుపోయింది. కాఫీ తోటలకు పునరుజ్జీవం పోశారు. ఫలితంగా చంద్రబాబు కాలంలో టర్నోవర్ కంటే.. ఈ ఐదేళ్లలో రెట్టింపు టర్నోవర్ని జీసీసీ సొంతం చేసుకుంది.తొలిసారిగా కాఫీతోటలకు సేంద్రీయ ధృవీకరణ లభించడంతో పాటు.. ఐదు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. త్వరలోనే విదేశాలకు కాఫీని సొంతంగా ఎగుమతి చేసేందుకూ సిద్ధమవుతోంది. 2014–15 నుంచి 2018–19 వరకూ రూ.1209 కోట్లు మాత్రమే ఉన్న జీసీసీ టర్నోవర్ ఒక్కసారిగా గేర్ మార్చింది. గత సీఎం వైఎస్ జగన్ జీసీసీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో 2019–20 నుంచి 2023–24 మధ్య కాలంలో రెట్టింపై ఏకంగా టర్నోవర్ రూ.2,303 కోట్లకు చేరుకుంది.మేడిన్ ఆంధ్రా పేరుతో...ఓ వైపు అరకు కాఫీ టేస్టీగా ఉండటమే కాకుండా.. ఆర్గానిక్గా పండించడం వల్ల గిరాకీ సొంతం చేసుకుంది. అల్లూరి జిల్లాలో మొత్తం 2.27 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించాయి. ఈ తోటల్లో ఏడాదికి 71, 258 మెట్రిక్ టన్నుల కాఫీపండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో ప్రస్తుతానికి రెండు క్లస్టర్లలో 2,258.55 హెక్టార్ల విస్తీర్ణంలో ఆర్గానిక్ పద్ధతుల్లో కాఫీని పండిస్తున్నారు. చింతపల్లి క్లస్టర్ వరుసగా మూడో ఏడాది కూడా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్పీవోపీ) స్టాండర్డ్స్ సర్టిఫికెట్ తీసుకోగా.. జీకేవీధి క్లస్టర్ ఇప్పటికే రెండుసార్లు స్కోప్ సర్టిఫికెట్ దక్కించుకుంది. మూడో ఏడాదీ సేంద్రీయ సాగుకు సంబంధించి స్కోప్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం కాఫీ గింజల క్యూరింగ్, ప్రాసెసింగ్ అంతా బెంగళూరులోని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీతో టై–అప్ కారణంగా కాఫీ ప్రాసెసింగ్ వ్యయం పెరుగుతూ వస్తోంది. డౌనూరులో క్యూరింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటైతే ఈ ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. పాడేరు ఏజెన్సీలోని 11 మండలాల్లో 2,27,021 ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలున్నాయి. మొత్తం 93,521 మంది గిరిజనులు కాఫీ సాగులో పాల్గొంటున్నారు, వీరిలో 2,600 మంది రైతులు టాప్ గ్రేడ్ రకాన్ని సాగు చేస్తున్నారు. వీరి వద్ద నుంచి సేకరించిన బీన్స్ని ఫిల్టర్ కాఫీ ఉత్పత్తి కోసం బెంగళూరుకు, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉత్పత్తి, రిటైల్ మార్కెటింగ్ కోసం ఏలూరుకు పంపిస్తుంటారు. ఇకపై ఇక్కడి నుంచే చేసేలా క్యూరింగ్ వ్యవస్థ సిద్ధమవుతోంది. త్వరలోనే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో అరకు కాఫీ ఉత్పత్తుల్ని మార్కెట్లోకి పంపించేందుకు అవకాశం ఉంది.తొలిసారిగా భారీగా ధరలు పెంపుగిరిజన రైతుల జీవనోపాధి, ఆదాయ స్థాయిల్ని కాఫీ తోటల పెంపకం ద్వారా మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ పాడేరు ఏజెన్సీ పరిధిలోని 11 మండలాల్లో సుమారు లక్షకు పైగా ఎకరాల్లో కాఫీ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. గిరిజనులు పండించిన కాఫీకి జీసీసీ ద్వారా మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ఎన్నడూ లేని విధంగా గిరిజన రైతు పండించిన కాఫీని జీసీసీ భారీ మద్దతు ధరకు కొనుగోలు చేసింది. పార్చ్మెంట్ కాఫీ కిలోకి రూ.285, చెర్రీ కాఫీ కిలోకి రూ.145 మార్కెట్ ధరగా ప్రకటించి కొనుగోలు చేయడంతో మధ్యవర్తుల దోపిడిని నిరోధించింది. 2023–24లో ఇప్పటి వరకూ 564.48 మెట్రిక్ టన్నుల ముడి కాఫీని రైతుల నుంచి జీసీసీ కొనుగోలు చేసి రూ.13.39 కోట్లు కాఫీ రైతు బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేసింది.2019–24 మధ్యలో అరకు కాఫీ ఎదిగిందిలా..⇒ 2018–19 కాలంలో రూ.799.58 లక్షల కాఫీ కొనుగోలు చేయగా.. 2023–24 నాటికి రూ.1339.05 లక్షల కాఫీ కొనుగోలు చేసింది.⇒ డౌనూరులో ఇంటిగ్రేటెడ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ని స్థాపించేందుకు రూ.3 కోట్లుని ప్రభుత్వం మంజూరు చేయగా 2023 అక్టోబర్ 20న అప్పటి మంత్రులు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ⇒ కాఫీ తోటల నిర్వహణకు జీసీసీ ద్వారా గిరిజన రైతులకు ఏటా రూ.1.05 కోట్ల రుణాల్ని, వ్యవసాయ కార్యక్రమాల అమలుకు రూ.1.06 కోట్ల క్రెడిట్ రుణాల్ని పంపిణీ చేశారు.⇒ వివిధ నగరాలు, పట్టణాల్లో అరకు కాఫీ పేరుతో అవుట్లెట్స్ ఏర్పాటు చేశారు. ⇒ దేశానికి వచ్చే వివిధ దేశాల అతిథులకు, రాష్ట్రానికి వచ్చే ప్రముఖులకు అరకు కాఫీతో పాటు జీసీసీ ఉత్పత్తులు బహుమతులుగా అందించేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రోత్సహించింది. విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు హాజరైన దేశ, విదేశీ పెట్టుబడిదారులకు అరకు కాఫీతో పాటు జీసీసీ ఉత్పత్తులతో కూడిన కిట్స్ అందించారు.⇒ సేంద్రీయ పద్ధతుల్లో పండుతున్న కాఫీ ఘుమఘుమలకు విదేశీయులు ఫిదా అవుతోంది. విదేశీ విపణిలో పెరుగుతున్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై సొంతంగా ఎగుమతులు చేపట్టాలని జీసీసీ భావిస్తోంది. ఇప్పటికే ఎక్స్పోర్ట్ సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరిపారు.గిరిజనుల ఆర్ధిక సాధికారతకు ఊతమిస్తున్న అరకు కాఫీఅల్లూరి జిల్లాలో అరకు వ్యాలీ సాగు, గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం, జీసీసీ అందిస్తున్న ప్రోత్సాహాన్ని ప్రధానినరేంద్ర మోడి మన్ కి బాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించడం గర్వంగా ఉంది. సీఎం చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగానని చెప్పారు. ప్రధాని స్ఫూర్తివంతమైన వ్యాఖ్యలు, ప్రశంస గిరిజన కాఫీ రైతులకు, జీసీసీ సిబ్బందికి, కాఫీ సాగుతో ముడిపడి వున్న అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది, వర్గాల వారికీ ఎంతగానో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. గిరిజనుల ఆర్ధిక సాధికారతకు అరకు కాఫీ ఎంతగానో ఊతమిస్తోంది. –జి. సురేష్ కుమార్, జీసీసీ ఉపాద్యక్షుడు, ఎండీ -
మీ తల్లి పేరుతో మొక్కను నాటండి: ప్రధాని మోదీ
ఢిల్లీ: ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 111వ ఎపిసోడ్ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆదివారం పలు అంశాలపై మాట్లాడారు. లోక్సభ ఎన్నికల అనంతరం మోదీ పాల్గొన్న తొలి మన్ కీ బాత్ కార్యక్రమం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన్ కీ బాత్ కార్యక్రమం 111వ ఎపిసోడ్ దార్వా మరోసారి మీ ముందుకు వచ్చాను. ఫిబ్రవరిలో చెప్పినట్లుగానే మళ్లీ మీ ముందుకు వచ్చాను. మా ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసం చూపించారు. దేశంలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. రుతుపవనాలు రాక ప్రజలంతా సంతోషంగా ఉన్నారు.#WATCH | Prime Minister Narendra Modi addresses the 111th episode of 'Mann Ki Baat'.He says "Today, finally the day has some for which we all were waiting for since February. Through 'Mann Ki Baat', I am once again amongst you, amongst my family members. I told you in February… pic.twitter.com/m5zGtjpjaU— ANI (@ANI) June 30, 2024 ఎన్నికల కారణంగా మన్ కీ బాత్ కార్యక్రమం కొన్ని నెలల పాటు ఆగిపోయింది. కానీ దాని లక్ష్యం మాత్రం దేశంలో కొనసాగుతోంది. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలు ప్రపంచంలోనే చాలా పెద్దవి. సుమారు 65 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ విషయంలో తాను కేంద్ర ఎన్నికల సంఘాన్ని అభినందిస్తున్నానని తెలిపారు.#WATCH | Prime Minister Narendra Modi addresses the 111th episode of 'Mann Ki Baat'. He says "Mann Ki Baat radio program might have been closed for a few months...but the spirit of Mann Ki Baat...work done for the country, the society good work done every day, work done with… pic.twitter.com/DBlWkLym73— ANI (@ANI) June 30, 2024 ఈరోజు చాలా ప్రాధాన్యం ఉన్న రోజు. మన గిరిజన సోదరసోదరీమణులు ఈరోజును ‘హల్ దివాస్’గా జరుపుకుంటారు. వీర్ సిధు, కాన్హూలకు సంబంధించిన రోజు. వారు బ్రిటిష్ వారి వివక్ష చట్టాలు, నిబంధనలను వ్యతిరేకిస్తూ సంతాలి ప్రజలకు కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు.At the 111th episode of 'Mann Ki Baat', Prime Minister Narendra Modi says "Today, 30th June is a very important day. Our tribal brothers and sisters celebrate this day as 'Hul Diwas'. This day is associated with the courage of Veer Sidhu and Kanhu, who strongly opposed the… pic.twitter.com/av3l0c8ZK6— ANI (@ANI) June 30, 2024 పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ప్లాంట్ ఫర్ మదర్’ పేరుతో కొత్త ప్రచారం చేపడుతున్నాం. అమ్మ పేరుతో నేను ఒక మొక్క నాటాను. మీరు మీ తల్లితో లేదా, మీ అమ్మ పేరుతో మొక్కను నాటండి’ అని అన్నారు.At the 111th episode of 'Mann Ki Baat', Prime Minister Narendra Modi says "A special campaign has begun on World Environment Day this year named 'Ek Ped Maa Ke Naam'. I have also planted a tree in the name of my mother and I have appealed to all the countrymen to plant a tree… pic.twitter.com/8bG1vDgwTO— ANI (@ANI) June 30, 2024 అదే విధంగా ఒలింపిక్స్లో మన దేశ క్రీడాకారులు మంచి ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నాను. ‘చీర్4భారత్’ హ్యాష్ ట్యాగ్తో ఆటగాళ్లను ప్రజలు ప్రోత్సహించాలన్నారు. -
‘‘మన్ కీ బాత్ రిటర్న్స్’’.. 111వ ఎపిసోడ్ ఎప్పుడంటే..
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ రేడియో సందేశ కార్యక్రమం మన్ కీ బాత్ మళ్లీ ప్రారంభమవనుంది. జూన్ 30న 111వ ఎపిసోడ్తో ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభమవుతుందని ప్రధాని స్వయంగా వెల్లడించారు. ‘మన్కీ బాత్’ కార్యక్రమంపై ఆలోచనలు, సూచనలు పంచుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ‘మన్ కీ బాత్’కార్యక్రమానికి బ్రేక్ పడింది. ‘కొన్ని నెలల విరామం తర్వాత ‘మన్ కీ బాత్’మళ్లీ ప్రారంభమవనుందని చెప్పడం సంతోషంగా ఉంది. జూన్ 30న 111వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇందుకు మీ ఆలోచనలు, సూచనలను పంచుకోవాలని కోరుతున్నా. మై గవ్ ఓపెన్ ఫోరమ్, నమో యాప్ లేదా 1800 11 7800 ఫోన్ నంబర్ ద్వారా అభిప్రాయాలను పంచుకోవాలి’అని ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రధాని మోదీ కోరారు. కాగా, ప్రతి నెల చివరి ఆదివారంలో వచ్చే ‘మన్ కీ బాత్’110వ ఎపిసోడ్ ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రసారం అయ్యింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. -
రాజ్యాంగ నిర్మాతలకు శ్రీరాముడే స్ఫూర్తి
న్యూఢిల్లీ: అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోట్లాది మంది ప్రజలను ఏకం చేసిందని, ఆ మహత్తర సందర్భం దేశ సమష్టి బలాన్ని చాటిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ ఏడాదిలో మొదటిసారిగా ఆదివారం ప్రసారమైన మన్కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాతలకు ఆ శ్రీరాముడే ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు. అందుకే జనవరి 22వ తేదీన అయోధ్యలో జరిగిన ఉత్సవాన్ని ‘దేవుడు దేశానికి, రాముడు రాజ్యానికి’వచ్చిన సందర్భంగా పేర్కొంటున్నట్లు చెప్పారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం గురించి కోట్లాది మంది ప్రజలు కూడా ఇదేవిధంగా భావించారన్నారు. ‘ప్రతి ఒక్కరూ ఆ రోజు రామ భజన గీతాలు ఆలపించి ఆ రామునికే అంకితమిచ్చారు. రామ జ్యోతిని వెలిగించి దీపావళిని జరుపుకున్నారు. ప్రతి ఒక్కరి మాటల్లోనూ, ప్రతి ఒక్కరి గుండెల్లోనూ రాముడే నిండిపోయాడు’అని ప్రధాని అన్నారు. -
Mann ki Baat: ఆత్మనిర్భర్ వికసిత్ స్ఫూర్తి.. 2024లోనూ కొనసాగాలి
న్యూఢిల్లీ: ‘‘దేశ ప్రజల్లో వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి రగిలింది. నూతన సంవత్సరంలోనూ ఇదే స్ఫూర్తిని, వేగాన్ని కొనసాగించాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో ప్రతి ప్రాంతం ఆత్మవిశ్వాసంతో నిండిందన్నారు. ఆదివారం 108వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘ఫిట్ ఇండియా’ మన లక్ష్యం కావాలని, ఇందుకోసం భౌతిక, మానసిక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు వాసుదేవ్, భారత మహిళా క్రికెట్ టీమ్ కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్, చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని ఫిట్నెస్ సలహాలిచ్చారు. దేశం ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆవిష్కరణలు జరగకపోతే అభివృద్ధి నిలిచిపోతుందని అన్నారు. భారత్ ‘ఇన్నోవేషన్ హబ్’గా మారిందని, అభివృద్ధి పరుగును ఆపబోమనే సత్యాన్ని చాటిందని అన్నారు. నూతన ఆవిష్కరణల్లో 2015లో 81వ స్థానం నుంచి దేశమిప్పుడు 40వ స్థానానికి చేరిందని తెలిపారు. దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... సృజనాత్మకతను పంచుకోండి ‘‘2023లో మన దేశం ఎన్నో ప్రత్యేక ఘనతలు సాధించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పట్ల ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. వారి మనోభావాలను విభిన్న రీతుల్లో తెలియజేస్తున్నారు. గత కొన్ని రోజులుగా శ్రీరాముడిపై, అయోధ్యపై కొత్తకొత్త పాటలు, భజనలు రచించి స్వరపరుస్తున్నారు. చాలామంది కొత్త గేయాలు, పద్యాలు రచిస్తున్నారు. అనుభవజు్ఞలైన కళాకారులతోపాటు యువ కళాకారులు సైతం శ్రీరాముడిపై, అయోధ్యలో రామమందిర నిర్మాణంపై పాటలు, భజనలు రాస్తున్నారు. చక్కగా ఆలపిస్తున్నారు. కొన్నింటిని నా సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో కళాకారులు భాగస్వాములవుతుండడం హర్షణీయం. ‘శ్రీరామ్భజన్’ అనే హ్యాష్ట్యాగ్తో మీ సృజనాత్మకతను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని కోరుతున్నా. ఈ పాటలు, భజనాలన్నీ కలిపి ఒక భావోద్వేగ ప్రవాహంగా, ప్రార్థనగా మారుతాయి. శ్రీరాముడి బోధించిన నీతి, న్యాయం వంటి సూత్రాలతో ప్రజలు మమేకం అయ్యేందుకు తోడ్పడుతాయి. తెలుగు పాట ‘నాటు నాటు’కు 2023లో ఆస్కార్ అవార్డు లభించడం దేశ ప్రజలకు ఆనందాన్నిచి్చంది. అలాగే ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ అనే తమిళ డాక్యుమెంటరీకి కూడా ఆస్కార్ లభించింది. వీటిద్వారా భారతదేశ సృజనను, పర్యావరణంతో మనకున్న అనుబంధాన్ని ప్రపంచం గుర్తించింది.’’ ఎన్నెన్నో ఘనతలు ‘భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దీనిపై ప్రజలు లేఖలు రాసి ఆనందం పంచుకున్నారు. జీ20 సదస్సు విజయవంతం కావడంపైనా వారు లేఖలు రాశారు. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతంపై నాకిప్పటికీ సందేశాలు అందుతున్నాయి. దీపావళి సందర్భంగా దేశీయ ఉత్పత్తులు కొని ఉపయోగించడం ద్వారా మన శక్తిని నిరూపించాం. 2023లో మన క్రీడాకారులు సాధించిన విజయాలు దేశం గర్వపడేలా చేశాయి. మన అథ్లెట్లు అద్భుత ప్రతిభ ప్రదర్శించారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్లో 111 పతకాలు సొంతం చేసుకున్నారు. వన్డే క్రికెట్ ప్రపంచకప్లో భారత జట్టు అందరి మనసులు దోచేలా ప్రతిభ చూపింది. అండర్–19 టీ20 ప్రపంచకప్లో మహిళల జట్టు సాధించిన విజయం ప్రేరణగా నిలుస్తుంది. 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్కు భారత క్రీడాకారులు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, మేరీ మాటీ–మేరా దేశ్ వంటి కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలు భాగస్వాములయ్యారు’’. ఫిట్టర్ లైఫ్ కావాలి: అక్షయ్ కుమార్ సినిమా తారలను గుడ్డిగా అనుకరించవద్దని ప్రజలకు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సూచించారు. సినీ నటులను చూసి ‘ఫిల్టర్స్ లైఫ్’ ఎంచుకోవద్దని, ‘ఫిట్టర్ లైఫ్’ గడపాలని పేర్కొన్నారు. ఫిట్నెస్కి సంబంధించి ‘మన్ కీ బాత్’లో ఆయన పలు సూచనలు చేశారు. వాస్తవానికి నటులు తెరపై కనిపించినట్లుగా బయట ఉండరని అన్నారు. తెరపై వారు బాగా కనిపించడానికి వివిధ రకాల ఫిల్టర్లు, స్పెషల్ ఎఫెక్ట్స్ ఉపయోగిస్తారని వెల్లడించారు. నటులను చూసి యువత ఫిట్నెట్ కోసం దగ్గరిదారులు ఎంచుకుంటున్నారని, కండల కోసం స్టెరాయిడ్స్ వంటివి వాడుతున్నారని అక్షయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త సంత్సరంలో ఫిట్నెస్ సాధించడం ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవాలని అక్షయ్ పిలుపునిచ్చారు. -
ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలు సాధించింది: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లు ఈ ఏడాది(2023)లో ఆమోదం పొందిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా మారడం, జీ-20 విజయవంతంపై ప్రజలు ప్రజలు లేఖలు రాసి సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. ఈ ఏడాది(2023) దేశం ఎన్నో ఘనతలు సాధించిందని మోదీ తెలిపారు. ఆయన దేశ ప్రజలకు కొత్త ఏడాది(2024) శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భారత్ దేశం సాధించిన పలు ఘనతలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రస్తుతం భారత్లోని ప్రతి ప్రాంతం ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని, దేశ ప్రజల్లో వికసిత్, ఆత్మ నిర్బర్ భారత్ స్ఫూర్తి రగిలించిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. 2024లో సైతం ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీపావళి సందర్భంగా దేశీయ ఉత్పత్తుల ద్వారా మనమేంటో నిరూపించామని, శాస్త్రవేత్తల కృషితో చంద్రయాన్-3 విజయవంతం అందరికీ గర్వకారణమని తెలిపారు. ‘నాటు...నాటు’ పాటకు ఆస్కార్ దక్కడంతో దేశం మొత్తం ఉర్రూతలూగిందని, ఎలిఫెంట్ విస్పరర్సకు అవార్డు దక్కడంతో భారతీయుల ప్రతిభ వెలుగుచూసిందని ఆనందం వ్యక్తం చేశారు. భారత సృజనాత్మకతను ప్రపంచవ్యాప్తంగా చాటామని మోదీ అన్నారు. ఇది చదవండి: NEW YEAR 2024: న్యూ ఇయర్ దశకం ఈ ఏడాది క్రీడల్లో మన అథ్లెట్లు ప్రతిభ చూపారని గుర్తు చేశారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్లో 111 పతకాలతో సత్తా చాటామని పేర్కొన్నారు. అలాగే వన్డే ప్రపంచ కప్లో భారత క్రికెట్ జట్టు అందరి మనసులు దోచిందని అభిప్రాయపడ్డారు. అండర్-19 టీ20 ప్రపంచ కప్లో మహిళల జట్ట విజయం ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ఈ ఏడాది క్రీడాకారుల ఘనతలు దేశం గర్వించేలా చేశాయని తెలిపారు. 2024 పారిస్ ఒలింపిక్స్కు భారత క్రీడాకారులు సన్నద్ధం అవుతున్నారని చెప్పారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ విజయవంతంగా నిర్వహించామని, ‘మేరీ మాటీ-మేరా దేశ్’వంటి కార్యక్రమాలను విజయవంతం చేశామని మోదీ పేర్కొన్నారు. కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలు భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. దేశంలో 70 వేలకు పైగా అమృత్ సరోవర్ల నిర్మాణం జరిగిందని, ఆవిష్కరణలు జరగని దేశంలో అభివృద్ధి నిలిచిపోతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. భారత్ ఇన్నోవేషన్ హబ్గా మారిందని, 2015లో 81వ ర్యాంకులో ఉండగా ప్రస్తుతం 40వ ర్యాంకుకు చేరామని మోదీ అన్నారు. ఈ ఏడాది భారత్ నుంచి దరఖాస్తు చేసే పేటెంట్ల సంఖ్య పెరిగిందని దేశ ప్రజల శక్తిసామర్థ్యాలు అందరికీ ప్రేరణగా నిలుస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. చదవండి: New Year 2024: భారత్లో ఐదుసార్లు నూతన సంవత్సర వేడుకలు -
మోదీ ప్రశంసలు అందుకున్న ఎంట్రప్రెన్యూర్ వర్ష..
‘‘ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వింటే మనకు తెలియని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ మన్కీబాత్ కార్యక్రమంలో అనేక విషయాలను ప్రస్తావిస్తుంటారు. వాటిలో ఒకటి నన్ను ఏకంగా ఎంట్రప్రెన్యూర్గా మార్చింది. ఈరోజు నేను ఆర్గానిక్ ఎంట్రప్రెన్యూర్గా ఎదిగాను. అదే మన్కీ బాత్ కార్యక్రమంలో నన్ను ప్రశంసించడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని చెబుతూ తెగ మురిసిపోతోంది వర్ష. కర్ణాటకలోని చామరాజన్ నగర్ జిల్లా ఆలహళ్లీ గ్రామానికి చెందిన వర్ష ఎమ్టెక్ చదివింది. చదువు పూర్తి కాగానే అందరిలా ఉద్యోగం కోసం చూడకుండా సరికొత్తగా ఏదైనా చేయాలనుకుంది. ఈ క్రమంలోనే ఏం చేయాలా అని ఆలోచిస్తున్న వర్ష.. ఓ రోజు అనుకోకుండా మన్కీబాత్ వినింది. ఆ కార్యక్రమంలో అరటి ఆకులను ఉపయోగపడే వనరులుగా ఎలా మారుస్తున్నారో మోదీ ప్రస్తావించారు. ప్రకృతిని ఇష్టపడే వర్షకు ఇది బాగా నచ్చడంతో.. అరటి బోదె, ఆకులతో హ్యాండిక్రాఫ్ట్స్ తయారు చేయాలని నిర్ణయించుకుంది. వీడియో చూసి... అరటి కాండాలను ఉపయోగపడే వస్తువులుగా ఎలా మార్చాలో వర్షకు తొలుత అర్థం కాలేదు. తరువాత యూట్యూబ్లో వెతికి ఒక వీడియో ద్వారా కొంత సమాచారం తెలుసుకుంది. కోయంబత్తూరు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాల్లో అరటి వ్యర్థాలను అందమైన వస్తువులుగా ఎలా మారుస్తున్నారో వివరంగా తెలుసుకుంది. ఆ తరవాత వ్యాపారానికి కావాల్సిన యంత్రాలను కొనుగోలు చేసి ఉమ్మతూరు సమీపంలో ‘ఆకృతి ఇకోఫ్రెండ్లీ’ పేరిట ఎంటర్ప్రైజ్ను ఏర్పాటు చేసింది. అరటికాండాలు, ఆకులను సేకరించి యంత్రాలతో ప్రాసెస్ చేసి నారతీసి, ఫ్లోర్మ్యాట్స్, బ్యాగ్స్, పర్సులు, హ్యాండీ క్రాఫ్ట్స్, అరటి గుజ్జు నుంచి తీసిన రసంతో సహజసిద్ధమైన ఎరువులు తయారు చేసి విక్రయిస్తోంది. కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించడంతో ఆర్గానిక్ షాపులు, గూగుల్, ఫ్లిప్కార్ట్, అమేజాన్ వంటి ఆన్లైన్ షాపుల్లో సైతం ఆకృతి వస్తువుల విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా అరటి వ్యర్థాలను అందమైన వస్తువులుగా మారుస్తూ కొంతమందికి ఉపాధి కల్పించడంతో పాటు.. రైతులకు ఆదాయం వచ్చేలా చేస్తోంది వర్ష. వర్ష తన భర్త శ్రీకాంత్ సాయంతో చేస్తున్న ఈ ఇకో–ఫ్రెండ్లీ బిజినెస్ గురించి తెలియడంతో కొన్ని కంపెనీల నుంచి భారీగా ఆర్డర్లు వçస్తున్నాయి. ‘‘భవిష్యత్లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించి ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తాను’’ అని వర్ష చెబుతోంది. గ్రామాల్లోని మహిళలు సైతం వ్యాపారవేత్తలుగా మారేందుకు, ఉద్యోగం దొరకనివారు ఉపాధిని ఇలా సృష్టించుకోవచ్చని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తోంది వర్ష. నవంబర్ నెల మన్కీ బాత్ కార్యక్రమంలో వర్ష ఎంట్రప్రెన్యూర్ జర్నీ గురించి మోదీ ప్రస్తావించడం విశేషం. -
Loganathan: క్లీన్ హెల్ప్
మనకు దండిగా డబ్బులుంటే ఇతరులకు దానం గానీ, సాయం గానీ చేయగలుగుతాం కానీ మనకే లేనప్పుడు ఇతరులకు ఏం సాయం చేయగలుగుతాం అని నిష్ఠూరాలు పోతుంటాము. లోగనాథన్ మాత్రం అలాంటి వ్యక్తికాదు. తన దగ్గర డబ్బులు లేకపోయినా సాయం చేయాలనుకున్నాడు. ఇందుకు కావలసిన డబ్బు కోసం టాయిలెట్స్ను శుభ్రం చేయడానికి కూడా వెనకాడటం లేదు లోగనాథన్. అలా వచ్చిన కొద్దిమొత్తాన్ని కూడా నిరుపేద పిల్లల చదువుకోసం ఖర్చు పెడుతున్నాడు. ఈ విషయం తెలిసి ప్రధాని మోదీ సైతం మన్కీ బాత్లో లోగనాథన్ని ప్రశంసించారు. కోయంబత్తూరులోని కన్నంపాళయంకు చెందిన 55 ఏళ్ల లోగనాథన్ తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు. ఇంటి పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో ఆరోతరగతితోనే చదువు ఆపేశాడు. తల్లిదండ్రులకు సాయం చేసేందుకు కొబ్బరి బోండాలు అమ్మేవాడు. అలా కొబ్బరిబోండాల దగ్గర ఉన్నప్పుడు లోగనాథన్కు.. చిరిగిపోయిన బట్టలు వేసుకుని, చదువుకునే స్థోమత లేక రోడ్ల మీద తిరుగుతున్న పిల్లలు కనిపించేవారు. వారిని చూసి జాలిపడేవాడు. ఇలా చూసి చూసి.. ‘‘పేదరికంతో నాలా మరెవరూ చదువుని మధ్యలో ఆపేయకూడదు. నిరుపేద పిల్లలు చదువు కొనసాగేందుకు చేతనైన సాయం చేయాలి’’ అని నిర్ణయించుకున్నాడు. పార్ట్టైమ్ పనులు చేస్తూ వచ్చిన డబ్బులను పేద పిల్లలకు ఖర్చుచేయడం మొదలుపెట్టాడు. టాయిలెట్స్ కడుగుతూ... కొన్నాళ్లకు లోగనాథన్ తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం తనపై పడింది. దాంతో కొబ్బరి బోండాలు అమ్మడంతోపాటు పేపర్మిల్లో పనికి చేరాడు. అప్పుడు కూడా డబ్బులు సరిపోయేవి కావు. అయినా పేదపిల్లలకు సాయం చేయడం మానలేదు. తనకొచ్చే జీతంలో కొంతమొత్తాన్ని సాయంగా ఇస్తూ్తనే ఉన్నాడు. డబ్బులు చాలనప్పుడు టాయిలెట్స్ క్లీన్ చేసి వచ్చిన డబ్బులను పేదపిల్లలకు ఇస్తున్నాడు. పాతికేళ్లుగా సాయంచేస్తూ పదిహేను వందలమందికిపైగా నిరుపేద పిల్లలకి ప్రాథమిక విద్యను అందించాడు. సిగ్గుపడకుండా... వృత్తిపరంగా వెల్డర్ అయిన లోగనాథన్కు.. తన ఎనిమిది గంటల డ్యూటీ అయిపోయిన తరువాత ఖాళీ సమయం దొరికేది. వెల్డింగ్ షాపు పక్కనే కొంతమంది శానిటరీ వర్కర్స్తో పరిచయం ఏర్పడింది. వాళ్లు టాయిలెట్స్ క్లీన్ చేసి సంపాదిస్తున్నారని తెలుసుకుని, తను కూడా గత పదిహేడేళ్లుగా టాయిలెట్స్ శుభ్రం చేస్తూ నెలకు రెండువేల రూపాయల పైన సంపాదిస్తూ అనాథ ఆశ్రమాలకు విరాళంగా ఇస్తున్నాడు. సంపన్న కుటుంబాల దగ్గర నుంచి పుస్తకాలు, బట్టలు సేకరించి అనాథపిల్లలకు ఇవ్వడం, ఏటా ప్రభుత్వం నిర్వహించే అనాథ ఆశ్రమాలకు పదివేల రూపాయల విరాళంగా ఇవ్వడం వంటి చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు లోగనాథన్. ‘‘నాకు సాయం చేయాలని ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు చిన్నప్పటి నుంచి ప్రతికూలంగానే ఉన్నాయి. ఎలాగైనా సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో నాకు తోచిన విధంగా చేస్తున్నాను. టాయిలెట్స్ కడగడం మొదలు పెట్టిన తరువాత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విముఖత వ్యక్తంచేశారు. చాలాసార్లు హేళనకు కూడా గురయ్యాను. అయినా నాకు ఏమాత్రం బాధలేదు. ఏదోఒక విధంగా పేద పిల్లలకు సాయపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నీ అనుకూలిస్తే చారిటబుల్ ట్రస్టు పెడతాను’’. – లోగనాథన్ -
విదేశాల్లో పెళ్లిళ్ల ట్రెండ్: ప్రధాని మోదీ మరోసారి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్పై ప్రధానమంత్రి నరేంద మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 107వ మన్ కీ బాత్ ద్వారా ఆదివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 26/11ఉగ్రదాడి మృతులకు,అమరవీరులకు నివాళులు అర్పించారు. అలాగే ఈ సందర్బంగా ప్రజలకు కొన్ని కీలక విజ్ఞప్తులు చేశారు. ముంబై ఉగ్రదాడి: 2008 నవంబర్ 26వ తేదీ ముంబై ఉగ్రదాడికి నేటికి 15 ఏళ్లు. దాదాపు 60 గంటలకు పైగా సాగిన ఉగ్రవాదుల మారణకాండలో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది మరణించారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. విచారణ అనంతరం ఈ కేసులో కసబ్కు ఉరిశిక్ష అమలైంది. దీపావళి రోజున వస్తువుల కొనుగోలుకు నగదు వినియోగం వరుసగా రెండో ఏడాది తగ్గిందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో నెల రోజుల పాటు నగదును ఉపయోగించకూడదని, డిజిటల్ చెల్లింపులను మాత్రమే ఉపయోగిస్తామనే ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ఒక నెల తర్వాత ప్రజలు తమ సెల్ఫీలను పంచుకోవాలని ఆయన కోరారు. ప్రజలు స్థానిక ఉత్పత్తులకే మొగ్గు చూపాలని, భారతీయ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రధాని కోరారు. భారతీయ ఉత్పత్తుల పట్ల సెంటిమెంట్ కేవలం పండుగలకే పరిమితం కాకూడదన్నారు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలైంది. ఈ పెళ్లిళ్ల సీజన్లో దాదాపు రూ.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని కొన్ని వ్యాపార సంస్థలు అంచనా వేస్తున్నాయనీ, పెళ్లి షాపింగ్లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలను కోరారు. విదేశాల్లో పెళ్లిళ్లు అవసరమా? ఆలోచించండి! ఈ పెళ్లిళ్ల సీజన్లో దేశంలో జరిగే పెళ్లిళ్లు, దానికి సంబంధించిన వ్యయాలు భారత ఆర్థిక వ్యవస్థ వృధ్దిలో కీలక పాత్రను గుర్తు చేశారు. భారతీయులు విదేశాల్లో పెళ్లి చేసుకునే ట్రెండ్ ఇటీవలి కాలంలో పెరుగుతోందని, ఇది అవసరమా? అని మోదీ ప్రశ్నించారు. అంతేకాదు ‘‘పెళ్లిల సంగతి అటుంచితే.. చాలా కాలంగా నన్ను ఇబ్బంది పెడుతోంది, నా మనసులోని బాధను కుటుంబ సభ్యులతో చెప్పకపోతే ఎవరికి చెప్పుకోవాలి? అంటూ విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకునే ట్రెండ్ మారాలని ప్రధాని సూచించారు. ఈ గడ్డపై పెళ్లి చేసుకుంటే, ఆ డబ్బంతా దేశంలోనే ఉంటుంది. తద్వారా మీరు మీ దేశానికి, దేశంలోని పేదవారికి కూడా సేవ చేసిస అవకాశం పొందుతారని వ్యాఖ్యానించారు. (రాయల్ లైఫ్, అంబానీ కంటే రిచ్ : ఇపుడు అద్దె ఇంట్లో దుర్భరంగా..!) ఇది ఇలా ఉంటే గతంలో (మార్చి) కూడా “డెస్టినేషన్ వెడ్డింగ్లు టూరిజానికి భారీ అవకాశాల్ని కల్పిస్తాయని, మన దేశంలోని ధనవంతులు విదేశాలకు వెళతారు కానీ ఇప్పుడు మధ్యతరగతి ,ఎగువ మధ్యతరగతి వారు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ల కోసం విదేశాలకు వెళుతున్నారని వ్యాఖ్యానించారు. ‘డెవలపింగ్ టూరిజం ఇన్ మిషన్ మోడ్’ అనే అంశంపై మాట్లాడిన మోదీ ఆయా రాష్ట్రాలు ప్రత్యేక ప్యాకేజీలు కల్పించాలని సూచించారు. డెస్టినేషన్ వెడ్డింగ్లు టూరిజానికి భారీ అవకాశాలు కల్పిస్తాయన్నారు. -
Mann ki Baat: పటేల్ జయంతి నాడు... మేరా యువ భారత్
న్యూఢిల్లీ: జాతి నిర్మాణ కార్యకలాపాల్లో యువత మరింత చురుగ్గా పాల్గొనేందుకు వీలుగా మేరా యువ భారత్ పేరుతో జాతీయ స్థాయి వేదికను అందుబాటులోకి తేనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సర్దార్ వల్లభ్ బాయి పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న దీన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆ సందర్భంగా మేరా యువ భారత్ వెబ్సైట్ను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. MYBharat.Gov.in సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని యువతకు సూచించారు. దీన్ని యువ శక్తిని జాతి నిర్మాణానికి, ప్రగతికి వినియోగపరిచేందుకు తలపెట్టిన అద్భుత కార్యక్రమంగా మోదీ అభివర్ణించారు. ఆదివారం ఆయన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతినుద్దేశించి మాట్లాడారు. అక్టోబర్ 31 దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కూడానని గుర్తు చేసుకున్నారు. ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. నవంబర్ 15న ఆదివాసీ నేత బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయనకు కూడా మోదీ నివాళులర్పించారు. విదేశీ పాలనను ఒప్పుకోని ధీర నాయకునిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారన్నారు. తిల్కా మహరాజ్, సిద్ధూ, కాన్హు, తాంతియా భీల్ వంటి వీర గిరిజన నాయకులు దేశ చరిత్రలో అడుగడుగునా కనిపిస్తారన్నారు. గిరిజన సమాజానికి దేశం ఎంతగానో రుణపడిందన్నారు. స్థానికతకు మరింతగా పెద్ద పీట వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గాంధీ జయంతి రోజున ఖాదీ వస్తువుల అమ్మకం రికార్డులు సృష్టించిందని గుర్తు చేశారు. ఢిల్లీలో అమృత్ వాటిక రెండున్నరేళ్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అక్టోబర్ 31న ఘనంగా ముగియనుందని మోదీ చెప్పారు. ‘‘దీనికి గుర్తుగా ఢిల్లీలో అమృత్ వాటిక నిర్మించనున్నాం. ఇందుకోసం అమృత్ కలశ్ యాత్రల పేరుతో దేశవ్యాప్తంగా మట్టిని సేకరించి పంపుతుండటం హర్షణీయం’’అన్నారు. వ్యర్థాల నుంచి సంపద అన్నది మన నూతన నినాదమని మోదీ అన్నారు. గుజరాత్ల అంబా జీ మందిర్లో వ్యర్థౠల నుంచి రూపొందించిన పలు కళాకృతులు అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. దీన్ని దేశవాసులంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. బెర్లిన్లో తాజాగా ముగిసిన ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్లో భారత్ 75 స్వర్ణాలతో పాటు ఏకంగా 200 పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. గిరిజన వీరుల ప్రస్తావన ప్రధాని నరేంద్ర మోదీ మన్కీ బాత్లో గిరిజన వీరుల గురించి ప్రస్తావించారు. గిరిజన యుద్ధ వీరుల చరిత్రను ప్రశంసించారు. తెలంగాణలోని నిర్మల్, ఉట్నూరు, చెన్నూరు, అసిఫాబాద్ ప్రాంతాలను పరిపాలించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేంగా పోరాడి ఉరికొయ్యకు ప్రాణాలరి్పంచిన రాంజీ గోండు, ఛత్తీస్గఢ్లో బస్తర్ప్రాంతానికి చెందిన వీర్ గుండాధుర్, మధ్యప్రదేశ్కు చెందిన ప్రథమ స్వాతంత్య్ర సమర యోధుడు భీమా నాయక్ల వీర చరిత్రను కొనియాడారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన తిల్కా మాంఝీ, సమానత్వం కోసం పోరాడిన సిద్ధో–కన్హూ, స్వాతంత్య్ర యోధుడు తాంతియా భీల్లు ఈ గడ్డపై పుట్టినందుకు గరి్వస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గిరిజన ప్రజల్లో అల్లూరి సీతారామరాజు నింపిన స్ఫూర్తిని దేశం ఇప్పటికీ గుర్తుంచుకుందని పేర్కొన్నారు. గిరిజన సమాజానికి స్ఫూర్తినిచి్చన రాణి దుర్గావతి 500వ జయంతిని దేశం జరుపుకొంటోందని, గిరిజన సమాజానికి స్ఫూర్తినిచ్చిన వారి గురించి యువత తెలుసుకొని వారి నుంచి స్ఫూర్తి పొందాలని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
అది ప్రపంచ వాణిజ్యానికి అడ్డా
న్యూఢిల్లీ: భారత్–మధ్యప్రాచ్యం–యూరప్ ఆర్థిక నడవా(కారిడార్) రాబోయే కొన్ని శతాబ్దాలపాటు ప్రపంచ వాణిజ్యానికి ప్రధాన ఆధారం కాబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ కారిడార్ ఆలోచన భారత్ గడ్డపైనే పుట్టిందన్న విషయాన్ని చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. ఆదివారం 105వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. ప్రాచీన కాలంలో వాణిజ్య మార్గంగా ఉపయోగపడిన సిల్క్ రూట్ గురించి ప్రస్తావించారు. ఈ మార్గం ద్వారా భారత్ విదేశాలతో వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిందని అన్నారు. ఇటీవల జీ20 శిఖరాగ్ర సదస్సులో ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్ను భారత్ ప్రతిపాదించిందని గుర్తుచేశారు. ఈ కారిడార్తో శతాబ్దాల పాటు భారీ స్థాయిలో ప్రపంచ వాణిజ్యం జరుగుతుందని వెల్లడించారు. ఢిల్లీలో జీ20 సదస్సు జరిగిన ‘భారత్ మండపం’ ఒక సెలబ్రిటీగా మారింది. జీ20లో భాగంగా ఈ నెల 26న ఢిల్లీలో ‘జీ20 యూనివర్సిటీ కనెక్ట్ ప్రోగ్రాం’ నిర్వహించబోతున్నామన్నారు. అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు భారీ స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టబోతున్నారు. ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశీయంగా తయారైన ఖాదీ, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలను కోరుతున్నానన్నారు. హైదరాబాద్ బాలిక ఆకర్షణ కృషి ప్రశంసనీయం హైదరాబాద్కు చెందిన 11 ఏళ్ల ఆకర్షణ సతీష్ గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆకర్షణ సతీష్ ఏడో తరగతి చదువుతోందని, నిరుపేద విద్యార్థుల కోసం ఏడు గ్రంథాలయాలు నడుపుతోందని ప్రశంసించారు. ఇరుగుపొరుగు, బంధువులు, స్నేహితుల నుంచి పుస్తకాలు సేకరించి, లైబ్రరీల్లో అందుబాటులో ఉంచుతోందని చెప్పారు. ఏడు లైబ్రరీల్లో దాదాపు 6,000 పుస్తకాలు అంబాటులో ఉన్నాయని తెలిపారు. చిన్నారుల భవిష్యత్తు కోసం ఆకర్షణ సతీష్ కొనసాగిస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిని ఇస్తోందని ప్రధానమంత్రి కొనియాడారు. -
మహిళా సాధికారతకు చంద్రయాన్–3 చిహ్నం
న్యూఢిల్లీ: ఎటువంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించే నవ భారత స్ఫూర్తికి చంద్రయాన్–3 మిషన్ ఒక ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు. మహిళా సాధికారతకు ఈ కార్యక్రమం సజీవ ఉదాహరణ అని కొనియాడారు. ప్రతీ నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. అనంతమైన అంతరిక్షాన్ని భారతీయ మహిళలు సవాల్ చేస్తున్నారని అన్నారు. ‘ఇండియా డాటర్స్ ఇంత ప్రతిష్టాత్మకంగా ఉంటే భారత్ అభివృద్ధిని ఎవరు అడ్డుకోగలరు’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘మహిళల నేతృత్వంలో జరిగే అభివృద్ధి మన దేశ స్వాభావిక లక్షణంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అసాధ్యమైనది ఏదైనా ఉంటే మహిళా శక్తితో సుసాధ్యంగా చేయొచ్చు. చంద్రయాన్–3 మిషన్ దీనికి నిలువెత్తు ఉదాహరణ’ అని చెప్పారు. చంద్రయాన్ మిషన్లో ఎందరో మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ప్రత్యక్షంగా భాగస్వాములైన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. అందరినీ కలుపుకొనిపోయేలా జీ20 సదస్సు ‘సెపె్టంబర్లో ఢిల్లీలో జరిగే జీ20 సదస్సు అందరినీ కలుపుకొని పోయేలా ఉంటుంది. ఈ సదస్సుకు భారత్ నేతృత్వం వహించడమంటే ప్రజల ఆధ్వర్యంలో జరుగుతున్నట్టే. భారత్ సత్తా సెపె్టంబర్లో అందరికీ తెలుస్తుంది. ప్రపంచ క్రీడల్లో భారత్ రాణించాలి. అందుకు ప్రోత్సాహం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దేశీయ క్రీడలైన హాకీ, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడల్లో మనం వెనకబడకూడదు. సెపె్టంబర్ నుంచి దేశంలో ప్రతీ ఇంటి నుంచి, ప్రతీ గ్రామం నుంచి మట్టిని సేకరించే కార్యక్రమం జరుగుతుంది. ఆ మట్టిని అమృత కలశాల్లో భద్రపరిచి అమృత్ కలశ యాత్ర నిర్వహిస్తాం. ఆ మట్టితో ఢిల్లీలో అమృత వాటిక నిర్మాణం జరుగుతుంది’ అని మోదీ అన్నారు. తెలుగు కూడా ప్రాచీన భాషే ‘మన సంస్కృతి సంప్రదాయాలతో మమేకం కావాలంటే మాతృభాష శక్తిమంతమైన మాధ్యమం. తెలుగు భాష సాహిత్యంలో వారసత్వ సంపదలో ఎన్నో వెలకట్టలేని రత్నాలు దాగున్నాయి’ అంటూ తెలుగు భాషా ప్రాశస్త్యాన్ని మోదీ కొనియాడారు. ‘సంస్కృతం మాదిరిగా తెలుగు ప్రాచీన భాషే. ప్రతీ ఏడాది ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం’ అని గుర్తుచేసిన ప్రధాని మోదీ తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. -
ప్రధాని మోదీ నోట బ్రియాన్ డి ఖర్ప్రాన్ పేరు.. ఎవరీయన?
ఢిల్లీ: ప్రధాని మోదీ నేడు(ఆదివారం) మన్కీ బాత్ 104వ ఎపిసోడ్లో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మేఘాలయవాసి బ్రియాన్ డి ఖర్ప్రాన్పై ప్రశంసలు కురిపించారు. బ్రియాన్ తన బృందంతో కలిసి మేఘాలయాలో 1700లకు పైగా గుహలను కనుగొన్నారని చెప్పారు. బ్రియన్ చేసిన సేవలను కొనియాడారు. మేఘాలయ గుహలను సందర్శించాలని దేశ ప్రజలను కోరారు. ఎవరు ఈ బ్రియాన్ డి ఖర్ప్రాన్ ? మన్ కీ బాత్లో మాట్లాడిన ప్రధాని మోదీ బ్రియాన్ గురించి చెప్పారు.'1964లో పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే బ్రియాన్ డి ఖర్ప్రాన్ గుహలను కనుగొనడం ప్రారంభించారు. 1990నాటికి ఆయన తన స్నేహితులతో కలిసి ఓ సంఘాన్ని స్థాపించారు. వారందరూ కలిసి మేఘాలయాలో బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో గుహలను వెలుగులోకి తీసుకువచ్చారు. బ్రియాన్ డి ఖర్ప్రాన్ తన బృందంతో కలిసి 1700పైగా గుహలను కనిపెట్టారు. ప్రపంచ పటంలో మేఘాలయా గుహలకు స్థానం వచ్చింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అత్యంత లోతైన, పొడవైన గుహలు ఉన్నాయి' అని ప్రధాని మోదీ చెప్పారు. During #MannKiBaat, talked about Mr. Brian D. Kharpran Daly, who has done decades of work on discovering and popularising caves in Meghalaya. I also urge you all to travel to Meghalaya and explore the beautiful caves yourself. pic.twitter.com/pZDX1SOFuu — Narendra Modi (@narendramodi) August 27, 2023 టూరిస్టులు మేఘాలయా గుహలను తమ ప్రణాళికలో భాగం చేసుకోవాలని ప్రధాని మోదీ కోరారు. దేశంలోనే చాలా పొడవైన, లోతైన గుహలు మేఘాలయాలో ఉన్నాయని తెలిపారు. అది బ్రియాన్ చేసిన కృషి ఫలితమేనని అన్నారు. మేఘాలయ అడ్వెంచరర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేసిన బ్రియాన్ డి ఖర్ప్రాన్ ఇప్పటివరకు రాష్ట్రంలోని 537.6 కి.మీ గుహలను చుట్టివచ్చారు. ఇదీ చదవండి: మోదీ మన్కీ బాత్.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని -
మోదీ మన్కీ బాత్.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని
ఢిల్లీ: ప్రధాని మోదీ నేడు(ఆదివారం) మన్కీ బాత్ 104వ ఎపిసోడ్లో ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 విజయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-3 ప్రాజెక్టు మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిందని ప్రశంసించారు. అలాగే, జీ-20 సమావేశాలపై మాట్లాడారు. కాగా, మోదీ మన్కీ బాత్లో మాట్లాడుతూ.. సెప్టెంబర్లో ఢిల్లీలో జరిగే జీ-20 సమావేశాలకు భారత్ సిద్ధమవుతోందన్నారు. భారత్ జీ-20 అధ్యక్షత బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి గర్వించదగిన పరిణామాలు చాలా చోటు చేసుకున్నయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధిలు హాజరుకానున్నారని వెల్లడించారు. తొలిసారి భారత్ ఈ స్థాయి జీ-20లో భాగస్వామి అవుతోందని.. గ్రూపును మరింత బలోపేతం చేస్తుందన్నారు. జీ-20కి భారత్ నేతృత్వం అంటే.. ప్రజలే అధ్యక్షత వహిస్తున్నట్లు భావించాలని మోదీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈ సదస్సులు జరిగిన నగరాల్లో ప్రజలు విదేశీ అతిథులను సాదరంగా ఆహ్వానించారు. భారత్లోని వైవిధ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని చూసి విదేశీ అతిథులు చాలా ప్రభావితమయ్యారు. భారత్కు చాలా ఉజ్వల భవిష్యత్తు ఉందని వారు తెలుసుకొన్నారు. జీ-20 సదస్సు శ్రీనగర్లో జరిగిన తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. During his 104th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "The month of September is going to witness the potential of India. India is fully prepared for the G-20 Leaders Summit. Heads of 40 countries & many global organisations will be coming to Delhi to… pic.twitter.com/lgEdcd7XMy — ANI (@ANI) August 27, 2023 అలాగే, ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘సంస్కృత భారతీ’ ఆధ్వర్యంలో ‘సంస్కృతంలో మాట్లాడే క్యాంప్’ నిర్వహిస్తారు. ప్రజలకు ఈ భాషను బోధించడంలో భాగంగా జరిగే క్యాంపులో మీరూ పాల్గొనవచ్చు. సంస్కృతం అందరూ నేర్చుకోవాలన్నారు. అంతేకాదు.. తెలుగు కూడా సంస్కృతంలా పురాతనమైన భారతీయ భాష. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. During his 104th episode of Mann Ki Baat, Prime Minister Narendra Modi says, "From the Red Fort I had said that we have to strengthen women-led development as a national character. Where the capability of women's power is added impossible is made possible. Mission Chandrayaan is… pic.twitter.com/6K7TE81dVh — ANI (@ANI) August 27, 2023 -
నీతి–మనా లోయ మహిళలపై ప్రధాని మోదీ ప్రశంసలు
డెహ్రాడూన్: భోజపత్ర కాలిగ్రఫీని జీవనోపాధిగా మార్చుకున్న ఉత్తరాఖండ్లోని నీతి–మనా లోయ మహిళలను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో వారి కృషిని ఆయన ప్రస్తావించారు. ‘పురాతన కాలంలో మహాభారతాన్ని భోజపత్రపైనే రాశారు. మన సంస్కృతిలో భాగమైన భోజపత్రతో నీతి–మనా లోయ మహిళలు కళాఖండాలు, సావనీర్లు రూపొందిస్తున్నారు. దీనితో తమ జీవితాలనే మార్చేసు కున్నా రు’అని కొనియాడారు. ఈ లేఖనాలను అందరూ ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నార న్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సాంస్కృతిక వారసత్వాన్ని ఉపయోగించుకోవడం అభినందనీయమన్నారు. వీరి కృషి కారణంగా ఈ ప్రాంతం పర్యాటకపరంగా ప్రాచుర్యంలోకి వచ్చిందన్నారు. అక్టోబర్లో చైనా సరిహద్దు సమీపంలోని బద్రీనాథ్ను సందర్శించిన సమయంలో స్థానిక మహిళ ఒకరు అందమైన భోజపత్ర లేఖనాన్ని బహుమతిగా అందేజేసినట్లు గుర్తుకు తెచ్చుకున్నారు. నీతి–మనా లోయలోని మనా గ్రామాన్ని ప్రధాని మోదీ అప్పట్లో మొట్టమొదటి భారతీయ గ్రామంగా అభివర్ణించారు. -
mann ki baat: ‘మేరీ మాటీ.. మేరీ దేశ్’
న్యూఢిల్లీ: మన అమర జవాన్లను, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పౌరులను గౌరవించుకోవడానికి స్వాతంత్య్ర దినోత్సవం(ఆగస్టు 15) వరకూ దేశవ్యాప్తంగా మేరీ మాటీ.. మేరీ దేశ్ (నా మట్టి.. నా దేశం) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. వారి జ్ఞాపకార్థం ప్రతి గ్రామ పంచాయతీలో స్మారకాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. మేరీ మాటీ.. మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా అమృత్ కలశ్ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. దేశమంతటా వివిధ ప్రాంతాల నుంచి 7,500 కలశాల్లో పవిత్ర మట్టిని, దాంతోపాటు మొక్కలను దేశ రాజధాని ఢిల్లీకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఆ పవిత్ర మట్టితో ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం సమీపంలో ‘అమృత్ వాటిక’ను నిర్మించబోతున్నట్లు చెప్పారు. అక్కడే మొక్కలను నాటనున్నట్లు వివరించారు. ఈ అమృత్ వాటిక ‘ఏక్ భారత్.. శ్రేష్ట్ భారత్’కు ఒక గొప్ప చిహ్నం అవుతుందని స్పష్టం చేశారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలి ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఇప్పటికే 2 లక్షలకుపైగా కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. అమృత్ మహోత్సవ్ నినాదం అంతటా ప్రతిధ్వనిస్తోంది. గత ఏడాది ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమం కోసం దేశమంతా ఒక్కతాటిపైకి వచి్చంది. ప్రజలంతా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరేశారు. ఆ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి ప్రయత్నాలతో మన బాధ్యతలను మనం గుర్తించగలుగుతాం. దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన బలిదానాలను స్మరించుకుంటాం. స్వేచ్ఛా స్వాతంత్య్రాల విలువను గుర్తిస్తాం. అందుకే ప్రతి పౌరుడూ ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి. ప్రజల్లో సాంస్కృతి చైతన్యం ఇనుమడిస్తోంది. పుణ్య క్షేత్రాలను సందర్శించే యాత్రికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కాశీని ప్రతిఏటా 10 కోట్లకు పైగా యాత్రికులు సందర్శిస్తున్నారు. అయోధ్య, మథుర, ఉజ్జయిని లాంటి క్షేత్రాలను సందర్శించే భక్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీనివల్ల లక్షలాది మంది పేదలకు ఉపాధి లభిస్తోంది. మరో 50,000 అమృత్ సరోవరాలు ఇటీవల దేశంలో భారీ వర్షాలు కురిశాయి. వరదలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. జనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుకోవడానికి వారు కలిసికట్టుగా పని చేశారు. అలాగే జల సంరక్షణ కోసం జనం కృషి చేయడం సంతోషకరం. ఉత్తరప్రదేశ్లో ఒక్కరోజులో 30 లక్షల మొక్కలు నాటారు. జల సంరక్షణ కోసం దేశంలో ఇప్పటికే 60,000 అమృత్ సరోవరాలు నిర్మించారు. మాదక ద్రవ్యాలకు ప్రజలు దూరంగా ఉండాలని కోరుతున్నా. భవిష్యత్తు తరాలను కాపాడుకోవాంటే డ్రగ్స్ను దూరం పెట్టాల్సిందే. ఇందుకోసం 2020 ఆగస్టు 15న ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ ప్రారంభించాం. 11 కోట్ల మందికిపైగా జనం ఈ అభియాన్తో అనుసంధానమయ్యారు. రూ.12,000 కోట్ల విలువైన 10 లక్షల కిలోల డ్రగ్స్ను అధికారులు ధ్వంసం చేశారు. ఇదొక విశిష్టమైన రికార్డు. మధ్యప్రదేశ్లోని బిచార్పూర్ అనే గిరిజన గ్రామం ఒకప్పుడు అక్రమ మద్యం, డ్రగ్స్కు అడ్డాగా ఉండేది. ఇప్పుడు ఆ గ్రామస్థులు వ్యసనాలు వదిలేశారు. ఫుట్బాల్ ఆటలో నిష్ణాతులుగా మారారు. మనసుంటే మార్గం ఉంటుంది’ అని మోదీ ఉద్ఘాటించారు. కళాఖండాలు తిరిగొచ్చాయి మన దేశానికి చెందిన వందలాది అరుదైన, ప్రాచీన కళాఖండాలు ఇటీవలే అమెరికా నుంచి తిరిగివచ్చాయి. అమెరికా వాటిని తిరిగి మనకు అప్పగించింది. దీనిపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. అమెరికా నుంచి వచ్చిన వాటిలో 2,500 నుంచి 250 ఏళ్ల క్రితం నాటికి కళాఖండాలు ఉన్నాయి. 2016, 2021లో అమెరికాలో పర్యటించా. మన కళాఖాండలను వెనక్కి తీసుకురావడానికి కృషి చేశా. -
మొండి మౌనానికి మోక్షం ఎన్నడు?
రెండు నెలలుగా మణిపూర్ అతలాకుతలం అవుతోంది. అయినప్పటికీ ప్రధాని ఒక్క మాటా మాట్లాడటం లేదు. ఆయన తాజా ‘మన్ కీ బాత్’లో గుజరాత్లో తుపాను గురించి మాట్లాడారు కానీ, అంతకన్నా ప్రధానమైనదైన మణిపూర్ గాయాన్ని వదిలేశారు. టర్కీలో భయంకర భూకంపం సంభవించినప్పుడు మొదట సానుభూతి తెలిపిన వారిలో ఆయనా ఒకరు. మణిపూర్ విషయం వచ్చేటప్పటికి... తన సొంత ప్రజలు, ఇంకా చెప్పాలంటే తన ఓటర్లకు జరుగుతున్న దానిపై మొండిగా మౌనాన్ని ఆశ్రయించారు. మణిపూర్ సంక్షోభం గురించి తాను ప్రతి ఒక్క రోజూ ప్రధానికి వివరిస్తూనే ఉన్నానని హోమ్ మంత్రి చెబుతున్నారు. అందులో సందేహించడానికేం లేదు. కానీ మణిపుర్పై మాట్లాడేందుకు ప్రధాని ఉద్దేశపూర్వకంగా నిరాకరించడాన్ని అంగీకరించడమే మరింత కష్టతరంగా ఉంది. నేను ఇంతకు ముందెన్నడూ ఆరంభించని విధంగా ఈ వ్యాసాన్ని మొదలు పెట్టబోతున్నాను. ఒక ఉద్దేశ ప్రకటనతో. కొలిచినట్లుగా, సమతూకంతో, వేరుగా ఉండి చూస్తూ నాకు వీలైనంతగా ఇందులో న్యాయంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. విషయం మణిపూర్ అయినప్పుడు ఇలా ఉండటం తప్పనిసరి. నేనిక్కడ మూడు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించాలని అనుకుంటున్నప్పటికీ మానని గాయాల్ని రేపడం లేదా భావావేశాలను భగ్గుమనిపించడం మాత్రం నా ఆకాంక్ష కాదు. మొదటిది, ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ను ఎందుకు తొలగించలేదు? 65 రోజుల తర్వాత కూడా పరిస్థితిని అదుపు చేయలేక పోవడంలోని ఆయన అసమర్థత లేదా అశక్తత కచ్చితంగా రూఢి అయి నదే. సొంత శాసనసభ్యులకు కూడా ఆయనపై నమ్మకం పోయింది. మే నెలలో, ప్రత్యేక పాలన కోసం డిమాండ్ చేసిన ఏడుగురు బీజేపీ కుకీ ఎమ్మెల్యేలు తమ ముఖ్యమంత్రిపై తమకు విశ్వాసం లేదని బహిరంగంగానే ప్రకటించారు. జూన్లో ఎనిమిది మంది బీజేపీ మెయితీ ఎమ్మెల్యేలు, ‘‘మణిపూర్ ప్రజలు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం కోల్పోయారు’’ అని పేర్కొంటూ ప్రధానమంత్రికి వినతి పత్రం సమర్పించారు. అంటే తమ 32 మంది ఎమ్మెల్యేలలో 15 మంది. లెక్కల్ని పక్కన పెడితే, బీరేన్ సింగ్ను తొలగించాలనే డిమాండ్ వెనుక లోతైన నైతిక హేతువే ఉంది. మణిపూర్ జనాభాలో 16 శాతంగా ఉన్న కుకీలు... ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జరుగుతున్న దానికి ఆయనే కారణం అని నిందిస్తున్నారు. మెయితీ దురహంకారిగా, కుకీల వ్యతిరేకిగా వారు ఆయన్ని పరిగణిస్తున్నారు. గతవారం బీరేన్ సింగ్ అధికార ట్విట్టర్ అకౌంట్ ఈ ఆరోపణకు ఒక ధ్రువీకరణగా నిలిచింది. తనను విమర్శిస్తున్నది కుకీలు, మయన్మార్కు చెందిన వారు మాత్రమే నన్న అర్థం వచ్చేలా బీరేన్ సింగ్ ఒక ట్విట్టర్ యూజర్కు బదులి చ్చినట్లు ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ రాసింది. ‘‘మీరసలు ఎప్పుడో రాజీ నామా చేయవలసింది కదా?’’ అని ఆ యూజర్ చేసిన కామెంట్కు సమాధానంగా, ‘‘నీది భారతదేశమా? లేక మయన్మారా?’ అని బీరేన్ సింగ్ ప్రశ్నించినట్లు ట్విట్టర్ స్క్రీన్ షాట్లు చూపిస్తున్నాయి. కుకీలను అన్నిటి కంటే ఎక్కువగా ద్వేషించే వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగితే సయోధ్యపై ఏ విధమైన ఆశ ఉంటుంది? నేను లేవనెత్తాలని అనుకుంటున్న రెండవ అంశం, జూన్ నెలా ఖరులో జరిగిన ఒక సంఘటన. దాదాపు 1,500 మంది మెయితీ మహిళలు, బహుశా ‘మీరా పైబిస్’ మహిళా ఉద్యమ కార్యకర్తలు... తూర్పు ఇంఫాల్లోని 3వ ఆర్మీ దళ శిబిరాన్ని చుట్టుముట్టి మెయితీ వేర్పాటువాద ‘కంగ్లేయ్ యావోల్ కన్న లుప్’ గ్రూపునకు చెందిన 12 మంది మెయితీ తీవ్రవాదులను విడిపించుకుని వెళ్లారు. 2015లో చందేల్లో పొంచివుండి జరిపిన మెరుపుదాడితో 18 మంది సైనికులను హతమార్చింది ఈ ‘కంగ్లేయ్ యావోల్ కన్న లుప్’ గ్రూపు సభ్యులే. ఆ పన్నెండు మందిలో తనను తాను లెఫ్ట్నెంట్ కల్నల్ మెయి రంగ్థెమ్ తంబా అని చెప్పుకునే వ్యక్తి ఆనాటి దాడికి వ్యూహం రచించాడు. వీళ్లసలు ఎప్పటికీ విడుదల కావలసినవాళ్లు కాదు. కానీ విడు దలయ్యారు. ఇంకా ఘోరం ఏమిటంటే, విడిపించుకుని వెళ్లిన ఈ మహిళలందరికీ బీజేపీ మెయితీ ఎమ్మెల్యే తౌనోజం శ్యామ్కుమార్ సింగ్ మద్దతు ఉండటం. వారిని విడిపించుకుని వెళ్లేటప్పుడు తను అక్కడ ఉన్నానన్న విషయాన్ని ఆయన ఖండించడం లేదు కానీ, వాళ్లను విడుదల చేయాలని తను అడగలేదని మాత్రం గట్టిగా చెబు తున్నారు. అయితే భద్రతా అధికారులు ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’కు చెప్పిన కథనం భిన్నంగా ఉంది. ఎమ్మెల్యేనే స్వయంగా మిలిటెంట్ల విడుదలకు బలగాలతో చర్చలు జరిపారని! వైరుద్ధ్యం ఏమిటంటే కుకీలను వెళ్లి కలుసుకోవాలనీ, ద్వైపాక్షికంగా ఉండాలనీ బీరేన్ సింగ్కు హోమ్ మంత్రి చెప్పారని ‘ది హిందూ’లో వార్త వచ్చిన తర్వాతే ఈ ‘విడిపించుకు పోవడం’ జరగడం. ఇంఫాల్లోని బీజేపీ ఎమ్మెల్యేలు... హోమ్ మంత్రి చెప్పారంటున్న దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించారు. ఇంకొక సంగతి. శ్యామ్ కుమార్ సింగ్ వార్తను మిగతా పత్రికలు ఎందుకు వేయలేదు? ఇంఫాల్లో గానీ, ఢిల్లీలో గానీ ఎవరూ ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు? నా మూడో ఆందోళన... బాధను కలిగించేది మాత్రమే కాదు, భ్రాంతులను పోగొట్టేది కూడా! రెండు నెలలుగా మణిపూర్ అతలా కుతలం అవుతోంది. గృహ దహనాలు, మూకుమ్మడి హింస, ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుని హత్యలు, ఇప్పుడిక భయానకమైన శిరచ్ఛేదనం! అయినప్పటికీ మన ప్రధాని ఒక్క మాటా మాట్లాడటం లేదు. ఆయన తాజా ‘మన్ కీ బాత్’లో గుజరాత్లో తుపాను గురించి మాట్లాడారు కానీ, అంతకన్నా ప్రధానమైనదైన మణిపూర్ గాయాన్ని వదిలేశారు. టర్కీలో భయంకర భూకంపం సంభవించినప్పుడు మొదట సానుభూతి తెలిపిన వారిలో ఆయనా ఒకరు. మణిపూర్ విషయం వచ్చేటప్పటికి... తన సొంత ప్రజలు, ఇంకా చెప్పాలంటే తన ఓటర్లకు జరుగుతున్న దానిపై మొండిగా మౌనాన్ని ఆశ్రయించారు. ఈ విషయమై నేను ఇంటర్వ్యూ చేసిన ప్రతి మెయితీ, ప్రతి కుకీ, ప్రతి నాగా... నిరాశలో ఉన్నారు. మొదట వారు కలత చెందారు. తర్వాత ఆగ్రహించారు. ఆ తర్వాత తమకు నమ్మకద్రోహం జరిగి నట్లుగా భావించారు. ఇప్పుడు తాము ఎవరికీ అక్కర్లేదని నమ్ము తున్నారు. మణిపూర్ సంక్షోభం గురించి తాను ప్రతి ఒక్క రోజూ ప్రధానికి వివరిస్తూనే ఉన్నానని హోమ్ మంత్రి చెబుతున్నారు. అందులో సందే హించడానికేం లేదు. కానీ మణిపూర్పై మాట్లాడేందుకు మోదీ ఉద్దేశ పూర్వకంగా నిరాకరించడాన్ని అంగీకరించడమే మరింత కష్టతరంగా ఉంది. విధులు, రాజ్యాంగ అవసరాలను మించి దేశంలోని ఆందోళన కర పరిస్థితులపైన మాట్లాడవలసిన నైతిక ఒత్తిడి ప్రభుత్వాధినేతపై ఉంటుంది. ఆయన మాట్లాడారూ అంటే మనందరి తరఫున మాట్లాడి నట్లు. మన ప్రధానమంత్రిగా మాట్లాడినట్లు. కానీ ఆయనకు మాట్లా డేందుకు ఏమీ లేదంటే ఆయన మౌనం ఆయన ఒక్కరితోనే ఉంటుంది. ఆ మౌనం మనందరికి ప్రాతినిధ్యం వహించదు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
"మన్ కీ బాత్"లో "మణిపూర్ కీ బాత్" లేదా?
మణిపూర్ అల్లర్లు మొదలై నెల రోజులు దాటుతోంది. కానీ ఇంతవరకు ప్రధానమంత్రి నోరు మెదపలేదు. ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు, అఖిలపక్షాల వారిని ఎందుకు పిలిచి మాట్లాడలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ అధినేత మల్లిఖార్జున్ ఖర్గే. "మన్ కీ బాత్"లో ముందు "మణిపూర్ కీ బాత్" గురించి మాట్లాడండని ధ్వజమెత్తారు. మే 3న మొదలైన మణిపూర్ అల్లర్లలో సుమారుగా 80 మంది ప్రాణాలు కోల్పోయారు. మెయిటీ వర్గానికి ఎస్టీల్లో చేర్చాలన్న ప్రతిపాదన విషయమై రాజుకున్న గొడవల్లో కుకీ వర్గానికి, మెయిటీ వర్గానికి తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఊహించని ప్రాణనష్టం తోపాటు భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. మధ్యలో కొద్దిరోజులు శాంతించిన ఇరువర్గాలు ఇప్పుడు మళ్ళీ విజృంభిస్తున్నాయి. ఒకపక్క ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతుంటే భారత ప్రధాని నరేందర్ మోదీ మాత్రం చలనం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు మల్లిఖార్జున్ ఖర్గే. మణిపూర్ కీ బాత్.. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. మొదట మీ "మన్ కీ బాత్"లో "మణిపూర్ కీ బాత్"ని చేర్చండి. సరిహద్దు రాష్ట్రంలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. మీరు ఇంతవరకు నోరు విప్పింది లేదు, ఒక సమావేశం నిర్వహించింది లేదు, అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది లేదు. మణిపూర్ భారత్ దేశానికి చెందినది కాదనుకుంటున్నారా.. ఇది సహించదగినది కాదు. రాష్ట్రం తగలబడిపోతుంటే పట్టించుకోరా? రాజధర్మాన్ని అనుసరించండి. శాంతికి భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించండి. ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ సాధారణ పరిస్థితులను నెలకొల్పండి. రాష్ట్రంలో పరిస్థితిని మెరుగుపరచడానికి అఖిలపక్షాలను ఆహ్వానించండని రాశారు. .@narendramodi ji, Your ‘𝐌𝐚𝐧𝐧 𝐊𝐢 𝐁𝐚𝐚𝐭’ should have first included ‘𝐌𝐚𝐧𝐢𝐩𝐮𝐫 𝐊𝐢 𝐁𝐚𝐚𝐭’, but in vain. The situation in the border state is precarious and deeply disturbing. ▫️You have not spoken a word. ▫️You have not chaired a single meeting. ▫️You have… — Mallikarjun Kharge (@kharge) June 18, 2023 ఇది కూడా చదవండి: మణిపూర్లో మరోసారి ఉద్రిక్తత... కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను మృతి -
‘జనశక్తి’ ఎగ్జిబిషన్లో మోదీ
న్యూఢిల్లీ: మన్కీ బాత్ 100వ ఎపిసోడ్ పూర్తయిన సందర్భంగా నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్(ఎన్జీఎంఏ)లో ఏర్పాటైన ఎగ్జిబిషన్ను ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. ‘జన శక్తి: ఒక సమ్మిళిత శక్తి’ఇతి వృత్తంతో ఏర్పాటైన ఈ ఎగ్జిబిషన్లో ప్రముఖులైన 13 మంది కళాకారుల కళా ఖండాలున్నాయి. ఎగ్జిబిషన్లో ఆయన కలియదిరిగారని సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మన్కీ బాత్లో తమకు ప్రేరణనిచ్చిన అంశాల గురించి కళాకారులు ప్రధానికి వివరించారని పేర్కొంది. -
'మన్ కీ బాత్' వినకపోతే నన్ను కూడా శిక్షిస్తారా?.. మహువా మొయిత్రా ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్కు హాజరుకాలేదని 36 మంది విద్యార్థులకు శిక్ష విధించింది చండీగఢ్ పీజీఐఎంఈఆర్ కళాశాల. వీరిని వారం రోజుల పాటు హాస్టల్ నుంచి కాలు బయటపెట్టొద్దని ఆదేశించింది. దీంతో ఆ విద్యార్థులు వసతిగృహానికే పరిమితమయ్యారు. పీజీ వైద్య కళాశాల తీసుకున్న ఈ నిర్ణయంపై టీఎంపీ ఎంపీ మహువా మొయిత్రా ఫైర్ అయ్యారు. అసలు మోదీ రేడియా కార్యక్రమానికి హాజరుకాకపోతే శిక్షించడం ఏంటి? అని మండిపడ్డారు. ఇప్పటివరకు తాను మన్ కీ బాత్ ఒక్క ఎపిసోడ్ కూడా వినలేదని, అందుకు తనను కూడా ఇంట్లో నుంచి వారం రోజులు బయటకు రాకుండా శిక్షిస్తారా? అని ప్రశ్నించారు. కాలేజీ యాజమాన్యం తీరును తప్పుబట్టారు. ఇది తీవ్రంగా ఆందోళన చెందాల్సిన విషయం అన్నారు. అలాగే మోదీ మన్ కీ బాత్ను మంకీ బాత్ అంటూ వ్యంగ్యాస్త్రాలుసంధించారు మహువా. ఈమేరకు ట్వీట్ చేశారు. విద్యార్థులకు శిక్షపడిన విషయంపై ఓ జాతీయ పత్రికలో వచ్చిన కథానాన్ని కూడా ట్వీట్కు జతచేశారు. I haven’t listened to monkey baat either. Not once. Not ever. Am I going to be punished as well? Will l be forbidden from leaving my house for a week? Seriously worried now. pic.twitter.com/HaqEQwsWOj — Mahua Moitra (@MahuaMoitra) May 12, 2023 మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న జరిగింది. ఆరోజు విద్యార్థులంతా తప్పకుండా కార్యక్రమానికి హాజరుకావాలని పీజీఐఎంఆర్ కాలేజీ విద్యార్థులకు సర్కులర్ జారీ చేసింది. అయితే నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతున్న 28 విద్యార్థులు, ఫస్ట్ ఇయర్కు చెందిన 8 మంది విద్యార్థులు ఈ కార్యక్రమాని డుమ్మా కొట్టారు. ఎలాంటి కారణం కూడా చెప్పలేదు. దీంతో కాలేజీ యాజమాన్యం వీరిపై చర్యలు తీసుకుంది. వారం రోజుల పాటు హాస్టల్ నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది. ఈ విషయంపై ప్రశ్నించగా కాలేజీ యాజమాన్యం తమ చర్యను సమర్థించుకుంది. ఈ ఎపిసోడ్కు విద్యార్థులు కచ్చితంగా హాజరుకావాలని ముందుగానే చెప్పామని, ఆరోజు గెస్ట్ లెక్చర్స్, ఇతర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కానీ సరైన కారణం లేకుండా 36 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అందుకే వాళ్లపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. చదవండి: ఉద్ధవ్ను సీఎంగా నియమించలేం.. శివసేన సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు -
మన్ కీ బాత్ మొత్తం ఎపిసోడ్లకు రూ. 830 కోట్లు! ట్వీట్ దుమారం
ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రోగ్రాం 100వ ఎపిసోడ్ను ఆదివారం బీజేపీ చాలా అట్టహాసంగా జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన నెలవారి రేడియో కార్యక్రమం మన కీ బాత్ కోసం రూ. 8.3 కోట్లు ఖర్చు అవుతుందని, మొత్తంగా అన్ని ఎపిసోడ్లకు కలిపి రూ. 830 కోట్లు ఖర్చుపెట్టారంటూ ఒక ట్వీట్ దుమారం రేపింది. ఈ ట్వీట్ని గుజరాత్ ఆమ్ఆద్మీ పార్టీ నాయకుడు గాధ్వీ చేశారు. దీంతో గాధ్వీపై ఏప్రిల్ 29న సైబర్ క్రై బ్రాంచ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వం తరపును ఫిర్యాదుదారుగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎలాంటి విశ్వసనీయమైన డేటా లేకుండా గాధ్వి ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఆప్ బీజేపిపై ఫైర్ అయ్యింది. బీజేపీ రాజకీయ హత్యకు పాల్పడుతూ ఇలా తమ నాయకులపై కేసు నమోదు చేస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఆప్ రాజ్యసభ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి రాఘవ్ చద్ధా మాట్లాడతూ..కొత్త రోజు కొత్త ఎఫ్ఆర్ అంటూ ట్విట్టర్లో విమర్శించారు. దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. చిన్న రాజకీయ తర్జభర్జన చేసినందుకే గాధ్విపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే..పతకాలు గెలుచుకున్న రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ నాయకుడిని మాత్రం చూసి చూడనట్టు వదిలేశారు ఈ పోలీసులు అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నిరసనలు చేసినా.. సదరు బీజేపీ నాయకుడిపై కేసు నమోదు చేయలేదని, సుప్రీం కోర్టుని ఆశ్రయించాక పోలీసులు కేసు నమోదు చేసిన విషయాన్ని చద్ధా గుర్తు చేశారు. ఇదిలా ఉండగా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ప్యాక్ట్ చెక్ యూనిట్ గాధ్వీ చేసిన ట్వీట్ని అవాస్తవమని, తప్పుదోవ పట్టించేదిగా ఉందని పేర్కొంది. వాస్తవానికి ఆ వైరల్ మెసేజ్లో చెప్పినట్లుగా ఒక్క ఎపిసోడ్కు రూ. 8.3 కోట్లు కాదని మొత్తం మన్కి బాత్ ఎపిసోడ్ల ప్రకటనల మొత్త ఖర్చు రూ. 8.3 కోట్లని వెల్లడించింది. ప్రతి ఎపిసోడ్కు ప్రకటనల మద్దతు ఉందని ఊహిస్తోంది అది తప్పు అని పీఐబీ పేర్కొంది. (చదవండి: బతికే ఉన్నా, పెళ్లైంది అంటూ సీఎం, డీజేపీలకి లేఖ..తీరా చూస్తే ఆ వ్యక్తి..) -
నూరు మాసాల మాట
మాటలు మంచివే. అందులోనూ మాటల్లో మనసు పరిచి, ప్రజలతో పంచుకోవడం ప్రజాస్వామ్య లక్షణం. పాలకులకు వన్నె తెచ్చే విషయం. ప్రధాని మోదీ గడచిన తొమ్మిదేళ్ళ పాలనాకాలంలో ప్రతి నెలా రేడియో వేదికగా పంచుకున్న ‘మన్ కీ బాత్’ (ఎంకేబీ) విశిష్టమైనది అందుకే. 2014 అక్టోబర్ 3న మొదలైన ఈ నెలవారీ ప్రసంగాలు ఈ ఏప్రిల్ 30తో వరుసగా 100 నెలలు, 100 భాగాలు పూర్తి చేసుకున్నప్పుడు అదొక మహోత్సవమైంది. ఏకంగా 20 దేశాల్లో 200 చోట్ల, న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో, దేశవ్యాప్తంగా బీజేపీ ఏర్పాటు చేసిన 4 లక్షల వేదికల్లో ఈ వందో ఎపిసోడ్ వినే వసతులు కల్పించడమే అందుకు నిదర్శనం. రాజ్భవన్లలో ఎంకేబీ శతమాసోత్సవాన్ని ఆహ్వానితుల ముంగిట సంబరంగా చేసుకోవడం కనివిని ఎరుగని ఘట్టం. ఇది కోట్లాది భారతీయుల మనో వాణి అని అధికార పక్షం అంటుంటే, ప్రజాసమస్యలపై మోదీ మౌనం వహిస్తున్నందున ఇది వట్టి ‘మౌన్ కీ బాత్’ అని ప్రతిపక్షాల విమర్శ. అసలు నిజం ఈ రెంటికీ మధ్య ఉందనేది విశ్లేషణ. రాజకీయ రంగస్థలిపై ప్రత్యర్థుల్ని చిత్తుచేసే పాత్రలో పేరు తెచ్చుకున్న మోదీ తెలివిగా ఎంకేబీని జనంతో సంభాషణగానే మొదటి నుంచి మలిచారు. ‘స్వచ్ఛ భారత్’, ‘హర్ ఘర్ తిరంగా’, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లాంటి ఉద్యమాలను ఈ ప్రసంగాలతో ముందుకు నడిపారు. ఉన్నత లక్ష్యాలకు అంకితమైన ఉదాత్త పాలన, పాలకుడనే భావన కలిగించడంలో కృతకృత్యులయ్యారు. ఇది తొమ్మిదేళ్ళుగా ఆయన పెంచుకున్న పెట్టుబడి. పైకి రాజకీయ ప్రస్తావనలేమీ లేకుండానే సాగినా ఈ ప్రసంగ పరంపర ఇప్పుడు చేసుకున్న శతమాసోత్సవ ప్రచార పటాటోపంలో మాత్రం అస్సలు రాజకీయాలు లేవని అనలేం. వంద రూపాయల ప్రత్యేక నాణెం, సమాచార ప్రసారశాఖ సంపాదకీయ వ్యాఖ్యలు, ఎంకేబీ వింటున్న మంత్రుల ఫోటోలు – ఇలా దేశమంతా ఓ సంరంభం. తిరుగులేని నాయకుడి మనోధర్మ వాణి ఆసరాగా, ప్రజల్ని తమ వైపు తిప్పుకోవాలన్న కమలనాథుల ఆశ అర్థం చేసుకోదగినదే. అధికారంలో ఎవరున్నా కాస్త హెచ్చుతగ్గులుగా ఇది చేసే పనే. అదే సమయంలో ఈ ప్రసంగ పరంపరతో సమాజంలో సానుకూల ఫలితాలే లేవనుకోవడమూ తప్పే. ఎంకేబీలో ప్రస్తావించిన అనేక అంశాలు, సామాన్యుల విజయగాథలు శ్రోతలకు విజ్ఞానాన్నీ, విశేషంగా స్ఫూర్తినీ అందించాయి. నెలకోసారి అలాంటి అంశాలనూ, వ్యక్తులనూ ఎంపిక చేయడా నికి ప్రభుత్వ శాఖలు, పార్టీ యంత్రాగం ఎంతటి శ్రమ, క్షేత్రపరిశీలన చేస్తున్నాయో ఊహించవచ్చు. నిజానికి, వార్తల నుంచి వ్యవసాయ సలహాల దాకా అన్నిటికీ రేడియోనే ఆధారమై, రచ్చబండ వద్ద ఊరంతా రేడియోల ముందు పోగైన రోజుల నుంచి ఇవాళ సమాజం చాలా మారింది. దూరదర్శన్, ప్రైవేట్ కేబుల్ టీవీలు, శాటిలైట్ టీవీ ఛానల్స్, ఇప్పుడు ఓటీటీ దాకా కొత్త వేదికలతో 1990ల నుంచి రేడియో ప్రాచుర్యం తగ్గుతూ వచ్చింది. అలాంటి వేళ 2014లో మోదీ రేడియో మాధ్యమాన్ని ఎంచుకోవడం ఆశ్చర్యంతో పాటు ఫలితంపై అనుమానాలూ పెంచింది. కానీ, 501 ప్రసార కేంద్రాలతో, 23 భాషల్లో కార్యక్రమాలతో దేశంలో భౌగోళికంగా 90 శాతాన్నీ, జనాభాలో 98 శాతాన్నీ చేరుతున్న రేడియోను బలంగా వినియోగించుకున్నారు. గ్రామీణ, దిగువ మధ్యతరగతి జనానికి దగ్గరవుతూ, వారిదైన భాషలో మోదీ సమాచార ప్రసారం చేయగలిగారు. లేఖలతో వారినీ ఇందులో భాగస్వా ముల్ని చేశారు. వెరసి, ఎంకేబీని కీలక ప్రసార, ప్రచారోద్యమంగా మలుచుకున్నారు. ఇది కేవలం బీజేపీ కార్యకర్తలు వినే కార్యక్రమమని విమర్శలు వచ్చాయి. కానీ, ఎంకేబీలోని అంశాలతో సామాన్య జనం మమేకమయ్యేలా, ఆకాశవాణి, దూరదర్శన్ సహా ప్రైవేట్ టీవీ ఛానళ్ళలో, మర్నాటి పత్రికల్లో అవి ప్రధాన వార్తలుగా మారేలా తీర్చిదిద్దిన రూపకర్తల దూరదృష్టినీ, వ్యూహ చతురతనూ కొట్టిపారేయలేం. ఇంటి పెద్ద మిగతా కుటుంబ సభ్యులతో తన భావాలు పంచుకుంటున్న పద్ధతిలో సాగడం ఎంకెబీ విజయసూత్రం. ప్రసారభారతి సీఈఓ విడుదల చేసిన ఐఐఎం–రోహ్ తక్ తాజా నివేదిక 10 వేల మందిని సర్వే చేసి, ఇప్పటికి 100 కోట్ల మంది ఈ కార్యక్రమం విన్నారని పేర్కొంది. 96 శాతానికి ఎంకేబీ గురించి తెలుసనీ, 23 కోట్ల మంది క్రమం తప్పక వింటున్నారనీ తెలిపింది. సదరు ఐఐఎం డైరెక్టర్ వివాదచరిత అటుంచితే, ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్తలున్న సీఎస్డీఎస్ సంస్థ నిరుడు నవంబర్లో విడుదల చేసిన నివేదిక మాత్రం దేశంలో అయిదింట మూడొంతులు ఎన్నడూ ఎంకేబీ వినలేదంటోంది. లెక్కలెలా ఉన్నా... సాక్షాత్తూ ఉపరాష్ట్రపతి సైతం వదలకుండా ప్రతి నెలా ఎంకెబీ వింటానన్నారు. ఇలాంటి వీరవిధేయ శ్రోతలు తక్కువేమీ కాదు. మోదీ ‘ఆధ్యాత్మిక ప్రయాణం’గా పేర్కొన్న ఈ కార్యక్రమం ఎంతగా ప్రభుత్వ అండ ఉన్నా,ఇంతకాలం శ్రోతల ఆసక్తిని నిలబెట్టుకోవడం విశేషమే. రేడియో పునర్వైభవానికీ తోడ్పడుతున్న ఈ ప్రసార ఉద్యమం అక్కడి కన్నా ఆన్లైన్లో, టీవీలో ఎక్కువమందిని ఆకర్షిస్తోంది. దేశంలో పెరిగిన డిజిటలీకరణకు కొండగుర్తుగా నిలుస్తోంది. ప్రజల మనసుకు దగ్గరైన అంశాలతో, ‘బేటీ బచావో బేటీ పఢావో’ లాంటి నినాదాలతో మోదీ మంత్రముగ్ధం చేస్తున్నారు. ఇప్పటి దాకా ఒక్కసారైనా పూర్తిస్థాయి విలేఖరుల సమావేశం జరపని తొలి భారత ప్రధాని అన్న విమర్శలకు వెరవకుండా నిత్యం జనంలో ఉంటూ, వారిని ఉద్దేశించి మాట్లాడుతూ కమ్యూనికేషన్ కింగ్ అనిపించుకున్నారు. ఎంకేబీతో కొత్త వాతావరణం సృష్టించారు. మనోవాణిని తెలపడం మంచిదైనా, ఏకపాత్రాభినయ స్వగతం కన్నా స్వేచ్ఛాయుత మీడియా సంభాషణలు ప్రజాస్వామ్యానికి మరింత మేలు. మౌనం కన్నా మాట ప్రభావమే ఎక్కువని ‘మౌన్ కీ బాత్’ శతమాసోత్సవం సైతం నిరూపిస్తోంది. -
మన్కీబాత్ కార్యక్రమంలో అనూహ్య ఘటన..ఓ మహిళకి నొప్పులు రావడంతో..
డిల్లీలో జరిగిన మన్ కీ బాత్ 100వ ఎపీసోడ్ని బీజేపీ కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగానే కాకుండా 11 విదేశీ భాషల తోపాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో కూడా అట్టహాసంగా ప్రసారమైంది. ఐతే ఎంతో విజయవంతంగా నిర్వహించిన ఈ మన్కిబాత్ కార్యక్రమంలో ఓ అనూహ్య ఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన 24 ఏళ్ల పూనమ్ దేవికి అకస్మాత్తుగా నొప్పులు రావడం మొదలైంది. దీంతో పూనమ్ను హుటాహుటినా రాజధానిలోని ఆస్పత్రికి తరలించారు ఆమె భర్త. పూనమ్ ఉత్తరప్రదేశ్లోని స్వయం సహాయక సంఘానికి చెందిన మహిళ. ఆమెకు అదేరోజు(ఆదివారం) సాయంత్రం 6.42 నిమిషాలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రాజధానిలోనే తమ బిడ్డ పుట్టడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తమ బిడ్డకు ఆదిత్య అని పేరు పెట్టుకుంటామని పూనమ్ భర్త ప్రమోద్ కుమార్ చెప్పారు. సదరు మహిళ పూనమ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితురాలిగా రాజధాని ఢిల్లీకి వచ్చారు. అంతేగాదు ప్రధాని నరేంద్ర మోదీ తన నెలవారీ మన్ కీ బాత్ ఎపిసోడ్లలో ఒక ఎపిసోడ్లో మహిళలకు ఆదాయపు వనరులను సృష్టించడం కోసం ఆమె చేసిన కృషి, సాధించిన విజయాల గురించి ప్రసంసించడం విశేషం. ఐతే తన భార్య గర్భం దాల్చడంతో రాజధానికి వెళ్లేందుకు తాను అంగీకరించలేదని ఆమె భర్త పేర్కొన్నారు. ఐతే తన భార్య స్వయం సహాయక బృందంలో తను చేసిన పనిని గుర్తించారని, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఈ కార్యక్రమానికి వెళ్లాలంటూ పట్టుబట్టడంతో వచ్చినట్లు ఆమె భర్త చెప్పారు. పూనమ్ లఖింపూర్ ఖేరీలోని సమైసా గ్రామంలో సరస్వతి ప్రేరణ గ్రామ్ సంగతన్ అనే స్వయం సహాయక బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఆమె అరటి కాండం నుంచే వచ్చే ఫైబర్తో హ్యాండ్బ్యాగ్ల, చాపలు వంటి ఇతర వస్తువులను ఉత్పత్తి చేస్తోంది. ఇది గ్రామంలోని మహిళలకు మంచి అదనపు ఆదాయ వనరులను అందించడమే గాక గ్రామంలో వ్యర్థాలను తొలగించడానికి కూడా దోహదపడింది. ఈ మేరకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన 100 మంది ఆహ్వానితుల్లో ఆమె కూడ ఒకరు. ప్రధాని మోదీ తన మన్కీ బాత్ ఎపిసోడ్లో సమాజానికి విశేషమైన సహాయ సహకారాలు అందించిన వారి గురించి మాట్లాడుతున్నప్పుడూ.. ఆమె గురించి కూడా ప్రస్తావించారు. కాగా, ఆదివారం జరిగిన 100వ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ ప్రారంభించారు. ఈ కార్యకమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్, సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: గుజరాత్ సీఎం ప్రసంగిస్తుండగా ఆఫీసర్ కునుకు.. ఆ కమిట్మెంట్కు ఫలితంగా..) -
Mann Ki Baat: మన్ కీ బాత్... నా ఆధ్యాత్మిక ప్రయాణం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఆదివారంతో 100 వారాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ఆయన ఉద్విగ్నంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని తనకు ఆధ్యాత్మిక ప్రయాణంగా అభివర్ణించారు. ‘‘ఇది కేవలం కార్యక్రమం కాదు. నా విశ్వాసానికి సంబంధించిన అంశం. 2014లో ఢిల్లీ వచ్చాక నాలో ఉన్నట్టనిపించిన ఖాళీని భర్తీ చేసింది. కోట్లాది ప్రజలకు నా భావాలను తెలియజేసేందుకు ఉపయోగపడింది. ప్రజల నుంచి ఎప్పుడూ దూరంగా లేనన్న భావన కలిగించింది’’ అంటూ మన్ కీ బాత్తో ముడిపడ్డ తన జ్ఞాపకాలు, అనుభవాలు, అనుభూతులను నెమరేసుకున్నారు. గత మన్ కీ బాత్ల్లో ప్రస్తావించిన పలువురు విశిష్ట వ్యక్తులతో ఈ సందర్బంగా ఫోన్లో మాట్లాడారు. గత ఎపిసోడ్లలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి చెందిన వెంకటేశ్ ప్రసాద్ ను ప్రస్తావించారు. మోదీ ఇంకా ఏం చెప్పారంటే... ఇతరుల నుంచి ఎంతో నేర్చుకున్నా... ‘‘2014 అక్టోబర్ 3న విజయ దశమి నాడు మన్ కీ బాత్కు శ్రీకారం చుట్టాం. ఇప్పుడదో పండుగలా మారింది. 100వ ఎపిసోడ్ సందర్భంగా శ్రోతల నుంచి వేలాది లేఖలందాయి. అవి భావోద్వేగాలకు గురిచేశాయి. కోట్లాది భారతీయుల మనసులో మాటకు, వారి భావాల వ్యక్తీకరణకు ప్రతిబింబం మన్ కీ బాత్. స్వచ్ఛ భారత్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వంటి వాటిని తొలుత మన్ కీ బాత్లోనే ప్రస్తావించాం. తర్వాత ప్రజా ఉద్యమాలుగా మారాయి. ఈ రేడియో కార్యక్రమం రాజకీయాలకతీతం. ఇతరుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి కీలక మాధ్యమంగా మారింది. శత్రువులైనా మంచి గుణాలను గౌరవించాలని నా గురువు లక్ష్మణ్రావు ఈనాందార్ చెప్పేవారు. ఇతరుల్లోని సద్గుణాలను ఆరాధించడంతో పాటు వారి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మన్ కీ బాత్ నాకో కసరత్తులా ఉపయోగపడింది. మన్ కీ బాత్ నిజానికి మౌన్ (నిశ్శబ్దం) కీ బాత్ అంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. చైనాతో వివాదం, అదానీ అక్రమాలు, ఆర్థిక అసమానతలు, మహిళలపై అరాచకాల వంటి కీలకాంశాలను 100వ ఎపిసోడ్లో మోదీ ఎందుకు ప్రస్తావించలేదని ఆక్షేపించింది. దేశ ప్రజలే నాకు సర్వస్వం ‘‘గుజరాత్ సీఎంగా తరచూ ప్రజలను కలుస్తూ, మాట్లాడుతూ ఉండేవాన్ని. 2014లో ఢిల్లీకి చేరాక భిన్నమైన జీవితం, పని విధానం, బాధ్యతలు! చుట్టూ పటిష్ట భద్రత, సమయపరమైన పరిమితులు. ఇలా ప్రజలను కలవని రోజంటూ వస్తుందని అనుకోలేదు. నాకు సర్వస్వమైన దేశ ప్రజల నుంచి దూరంగా జీవించలేను. ఈ సవాలుకు మన్ కీ బాత్ పరిష్కార మార్గం చూపింది. ఇది నాకు ఒక ఆరాధన, ఒక వ్రతం. గుడికెళ్లి ప్రసాదం తెచ్చుకుంటాం. ప్రజలనే దేవుడి నుంచి నాకు లభించిన ప్రసాదం మన్ కీ బాత్. ప్రజాసేవ చేస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం సాగిస్తున్న ఎంతోమంది గొప్ప వ్యక్తులు నాకు మార్గదర్శకులుగా మారారు. మన్ కీ బాత్లో గతంలో ప్రస్తావించిన వ్యక్తులంతా హీరోలే. వారే ఈ కార్యక్రమానికి జీవం పోశారు’’ ఐరాస, విదేశాల్లోనూ... న్యూయార్క్: అమెరికాలో న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మన్ కీ బాత్ 100వ ఎడిషన్ను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇదొక చరిత్రాత్మక సందర్భమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ట్వీట్ చేశారు. యునెస్కో డైరెక్టర్ జనరల్ అడ్రీ అజాలే మన్ కీ బాత్పై ప్రశంసల వర్షం కురిపించారు. కార్యక్రమంలో ఆమె కూడా భాగస్వామి అయ్యారు. పలు దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అమెరికా, బ్రిటన్, రష్యా, దక్షిణాఫ్రికా, చిలీ, మొరాకో, మెక్సికో, కాంగో, ఇరాక్, ఇండోనేషియా తదితర దేశాల్లో మన్ కీ బాత్కు విశేష స్పందన లభించింది. దేశమంతటా... ► మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ను బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం దేశవ్యాప్తంగా పండుగలా జరిపారు. ► ప్రత్యేక తెరలు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా వీక్షించారు. ► బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు ప్రత్యేక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.ళీ ‘‘ఇది కేవలం రేడియో కార్యక్రమం కాదు. సామాజిక మార్పుకు చోదక శక్తి. మోదీ సందేశం యువతకు స్ఫూర్తినిస్తోంది’’ అని అమిత్ షా కొనియాడారు. ► అమిత్ షా, రాజ్నాథ్సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు భారత్లో, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అమెరికాలో కార్యక్రమాన్ని వీక్షించారు. కేరళలోని కొచ్చిన్లో పెళ్లి వేడుకకు వచ్చిన అతిథులతో కలిసి మన్కీబాత్ 100వ ఎపిసోడ్ వింటున్న నూతన వధూవరులు -
మన్ కీ బాత్ @100.. మోదీ కామెంట్స్ ఇవే..
సాక్షి, ఢిల్లీ: ఎంతో ఆత్రుతతో దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ప్రసరమవుతోంది. మన్ కీ బాత్ కోసం దేశవ్యాప్తంగా 4 లక్షల వేదికలు ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్తో పాటు వెయ్యి రేడియో స్టేషన్లతో లైవ్లో మన్ కీ బాత్ ప్రసారమవుతోంది. ఇక, మన్ కీ బాత్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 2014 విజయదశమి రోజున మన్ కీ బాత్ మొదలుపెట్టాం. ప్రజలు మన్ కీ బాత్లో భాగస్వాములయ్యారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మన్ కీ బాత్లో చర్చించాం. సామాన్యులతో అనుసంధానికి మన్ కీ బాత్ వేదికైంది. మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజలను మరింత చేరువ చేసింది. సమాజంలో ఎన్నో మార్పులకు మన్ కీ బాత్ శ్రీకారం చుట్టిందన్నారు. I'm glad that #MannKiBaat has covered various stories of women empowerment, such as the women of Deora village in Chhattisgarh, tribal women in Tamil Nadu making terracotta cups, and women rejuvenating Vellore Lake. #MannKiBaat has showcased stories of talented individuals across… pic.twitter.com/XvIUfOjXew — ANI (@ANI) April 30, 2023 ఇక, మన్ కీ బాత్ సందర్భంగా ఛత్తీస్గఢ్లోని స్వయం సహాయక సంఘం గుర్తించి మోదీ ప్రస్తావించారు. మహిళా శక్తిని ప్రధాని ప్రశంసించారు. 100వ ఎపిసోడ్ సందర్భంగా గతంలో ఫోన్లో మాట్లాడిని వ్యక్తులతో మోదీ మళ్లీ ముచ్చటించారు. విశాఖకు చెందిన వెంకట ప్రసాద్ గురించి మోదీ ప్రస్తావించారు. ప్రసాద్ ఎక్కువగా భారతీయ వస్తువులే ఉపయోగిస్తారని అన్నారు. ఇలా పలువురు గురించి ప్రస్తావించారు. Mann Ki Baat has been a catalyst in igniting numerous mass movements, be it 'Har Ghar Tiranga' or 'Catch the Rain', Mann Ki Baat has enabled mass movements to gain momentum: PM Narendra Modi during the 100th edition of #MannKiBaat#MannKiBaat100 pic.twitter.com/Z2DBkxzNee — ANI (@ANI) April 30, 2023 #WATCH | Union Minister Jitendra Singh listens to the 100th episode of #MannKiBaat at India House in London, UK. pic.twitter.com/yOpYXHNSjQ — ANI (@ANI) April 30, 2023 #WATCH | BJP national president JP Nadda listens to the 100th episode of #MannKiBaat, in Davanagere, Karnataka. pic.twitter.com/h9kLJKGlDe — ANI (@ANI) April 30, 2023 #WATCH | Uttar Pradesh: Students and teachers at Irfania Madarsa in Lucknow listen to the 100th episode of #MannKiBaat pic.twitter.com/J6uXAgICmS — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 30, 2023 ఇది కూడా చదవండి: మన్ కీ బాత్ @100.. ఐరాసలో ప్రసారం.. -
మన్ కీ బాత్ @100.. ఐరాసలో ప్రసారం..
రేడియో ద్వారా ప్రజలతో సంభాషిస్తూ, దేశాభివృద్ధిలో వారందరినీ భాగస్వాముల్ని చేస్తూ, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం తీసుకువచ్చారు. ఇక 2014 అక్టోబర్ 3న తీసుకువచ్చిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమం విజయవంతమైంది. రాజకీయాలకు అతీతంగా దేశంలోని సామాన్యుల అసామాన్య గాథలను ఇందులో ప్రస్తావిస్తుండటం దేశ పౌరులపై లోతైన ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. ప్రధానమంత్రిగా కాకుండా.. స్నేహితుడిగా, సంరక్షకుడిగా, సన్నిహితుడిగా.. వివిధ సందర్భాల్లో, వివిధ పాత్రల్లో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ‘మన్ కీ బాత్’ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి నెలా చివరి ఆదివారం వచ్చే ఈ కార్యక్రమం ఈ రోజు వందో ఎపిసోడ్ పూర్తి చేసుకోనుండటం విశేషం. ఇక, ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో చేస్తున్న ‘మన్కీ బాత్’ వందో ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమాన్ని కోట్ల మంది ప్రజలు వినేలా బీజేపీ కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా 4 లక్షల ప్రాంతాల్లో ప్రజలు ఆలకించేందుకు చర్యలు చేపట్టింది. పార్టీ జాతీయ అధ్యక్షుడి నుంచి.. పోలింగ్ కేంద్రం స్థాయి నాయకుల వరకూ అంతా పాల్గొనేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులూ వినేలా ఏర్పాట్లు చేసినట్లు పార్టీ వివరించింది. ఇక, ఇండియాలో 22 ప్రముఖ భాషలు, 29 మాండలికాలలో ప్రసారం కానుంది. మరోవైపు.. 11 విదేశీ భాషల్లో కూడా మన్ కీ బాత్ ప్రసారం కానుంది. అన్ని రాష్ట్రాల రాజ్ భవన్లు, బీజేపీ, మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల నివాసాల్లో వందో ఎపిసోడ్ను వినిపించనున్నట్లు పార్టీ పేర్కొంది. రాజ్ భవన్లకు ఆయా రాష్ట్రాల్లో పద్మ అవార్డులు అందుకున్న వారిని ఆహ్వానించనునట్లు వెల్లడించింది. ఇక, మన్ కీ బాత్ వందో ఎపిసోడ్.. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. -
మోదీ మనోధర్మ వాణి ‘మన్ కీ బాత్’
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం ప్రజాస్వామ్య విధానం. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన భారతదేశంలో ఈ విధానం ఈనాటిది కాదు. అదే çపరంపరను అనుసరిస్తూ మొదలైన ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం విజయవంతం కావడంలోని రహస్యం అదే. రేడియో ద్వారా ప్రజలతో సంభాషిస్తూ, దేశాభివృద్ధిలో వారందరినీ భాగస్వాముల్ని చేస్తూ, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో 2014 అక్టోబర్ 3న ప్రధానమంత్రి ఈ కార్యక్రమం ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా దేశంలోని సామాన్యుల అసామాన్య గాథలను ఇందులో ప్రస్తావిస్తుండటం దేశ పౌరులపై లోతైన ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. ప్రధానమంత్రిగా కాకుండా... స్నేహితుడిగా, సంరక్షకుడిగా, సన్నిహితుడిగా... వివిధ సందర్భాల్లో, వివిధ పాత్రల్లో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ‘మన్ కీ బాత్’ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి నెలా చివరి ఆదివారం వచ్చే ఈ కార్యక్రమం ఈ రోజు వందో ఎపిసోడ్ పూర్తి చేసుకోనుండటం చరిత్రాత్మకం! ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. అందుకే... ప్రజల భాగస్వామ్యంతో జరిగే ఏ పనికైనా ప్రజాస్వామ్యంలో అదే స్థాయిలో గౌరవ మర్యాదలు, ఆదరణ లభిస్తాయి. తమ సంక్షేమం, మంచి చెడ్డల గురించి ఆలోచించి, సమయానుగుణంగా మార్గదర్శనం చేసే వ్యక్తిని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటారు. భారతదేశంలో ఈ సంప్రదాయం ఈనాటిది కాదు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలను భాగ స్వామ్యం చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. చోళుల కాలంలో తమిళనాడులోని ఉత్తర మెరూర్లో గ్రామసభ, మన పక్కనున్న కర్ణాటకలోని బీదర్ జిల్లాల్లో బసవేశ్వరుడి ‘అనుభవ మండపం’ వంటివి పురాతన కాలం నుంచే దేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థకు అద్దం పడతాయి. అందుకే ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన భారతదేశంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ జరిగే కార్య క్రమాలు విజయవంతం అయ్యాయి. సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న 21వ శతాబ్దంలోనూ ఇదే ప్రజాస్వామ్య పద్ధతిని అవలంబిస్తూ... రేడియో ద్వారా నిరంతరం ప్రజలతో సంభాషించడం, తద్వారా వారందరినీ భాగ స్వామ్యం చేస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో 2014 అక్టోబర్ 3న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ను ప్రారంభించారు. ప్రతినెలా చివరి ఆదివారం గ్రామాల్లో, విద్యాసంస్థల్లో, వీధుల్లో, ప్రభుత్వ ఆఫీసుల్లో, పార్టీ కార్యాలయాల్లో... ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకొస్తున్న ‘మన్ కీ బాత్’ వందో ఎపిసోడ్ పూర్తి చేసుకోనుండటం చరిత్రాత్మకమే. మీ మాట.. నా నోట! దేశ ప్రజల శక్తిసామర్థ్యాలు, సాహసం, శౌర్యం, ఆత్మవిశ్వాసం, స్ఫూర్తి దాయక గాథల గురించి చర్చిస్తూనే... ప్రజాసమస్యలు, సవాళ్లను ప్రస్తావిస్తూ వారిని చైతన్య పరచడం, ఆ సమస్యలపై వారిని పోరాటానికి సిద్ధం చేయడం... దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ పనిని ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి స్వయంగా నిరంతరాయంగా చేస్తుండటమే ప్రజల్లో ఈ కార్యక్రమం పట్ల ఆదరణకు కారణం. ‘మన్ కీ బాత్’ అనేది మీది, నాది, మనందరి మనసులోని మాట. ప్రధాని వాక్కు ద్వారా దేశం మొత్తానికి తెలియజెప్పబడుతున్న ‘మన మాట’. ‘గొంతు నాదే కానీ భావన మీ అందరిదీ’ అని ప్రధాని కూడా తరచుగా చెబుతుంటారు. అందుకే ప్రధాని మాటలు, దేశంలోని 90 శాతం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటాయి. మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న అద్భుతమైన కార్యక్రమా లను, అక్కడి సామాన్యుల అసామాన్యమైన ఆలోచనను గుర్తుచేస్తూ... దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపడం; కరోనా రూపంలో ‘తాత్కాలిక గ్రహణం’ పట్టిన సమయంలో ‘జాగ్రత్తగా ఉండండి, మేమున్నాం’ అనే భరోసా ఇవ్వడం...వంటి ఎన్నో సానుకూలమైన మార్పులకు వేదిక ఈ ‘మన్ కీ బాత్’. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మాట్లాడిన మాటల గురించి.. తర్వాతి రోజు పేపర్లలో, టీవీ ఛానళ్లలో చర్చ జరగడం ద్వారా ఎందరో సాధారణ వ్యక్తుల అసాధారణ ప్రతిభ ప్రపంచానికి పరిచయమైంది. ప్రధానమంత్రికి కోట్ల సంఖ్యలో ఉత్తరాలు వస్తాయి. వాటిలోని అంశాలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ, ప్రజలు తమ అభిప్రాయాలను దేశ ప్రజలతో పంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులు రాసిన లేఖలను కూడా వీలున్నప్పుడు చదువుతూ, నేరుగా వారితో మాట్లాడిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఓ ప్రధానమంత్రిగా కాకుండా... స్నేహితుడిగా, సంరక్షకుడిగా, సన్నిహితుడిగా... వివిధ సందర్భాల్లో వివిధ పాత్రల్లో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ‘మన్ కీ బాత్’ కార్యక్రమం కొనసాగుతోంది. అందుకే ప్రజలు ప్రధానిని గుండెల్లో పెట్టుకున్నారు. ప్రధానినైనా.. మీలో ఒకడినే! ఓ రకంగా చెప్పాలంటే ‘మన్ కీ బాత్’... భారతదేశపు నెలవారీ సమీక్షగా భావించవచ్చు. ఇందులో ప్రజలు, వారి సమస్యలు, పరిష్కారాలు, సమా జాభివృద్ధి కోసం అక్కడక్కడ వ్యక్తులు చేస్తున్న మహోతన్నమైన పనులు పేర్కొంటూనే... కేంద్రప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు, సంక్షేమ కార్య క్రమాలను వివరిస్తూ వీటి ద్వారా లబ్ధి పొందేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తున్నారు. స్వచ్ఛ భారత్, సెల్ఫీ విత్ డాక్టర్ (కరోనా సమయంలో), జల సంరక్షణ, అవినీతి రహిత, మత్తుపదార్థాల ప్రభావం లేని భారత్ నిర్మాణంతో పాటుగా కుంభమేళా, ఇంక్రెడిబుల్ ఇండియా, ఫిట్ ఇండియా, బేటీ బచావో – బేటీ పఢావో, యోగా, ఖాదీకి ప్రోత్సాహం వంటి ఎన్నో విషయాలను చర్చిస్తున్నారు. గత ఎనిమిదేళ్లలో ఖాదీ రంగం ఉత్పత్తి 191 శాతం, కొనుగోళ్లు 332 శాతం పెరగడం, స్వచ్ఛందంగా ఎల్పీజీ సబ్సిడీని వదులుకోవడం, కరోనా సమయంలో నిబంధనలను పాటించడం వంటివి... ప్రధాని మోదీ మాటలను ప్రజలు విశ్వసించి భాగస్వాములు అవుతున్నారని చెప్పేందుకు నిదర్శనం. అందుకే చాలా కేంద్ర ప్రభుత్వ విభాగాలు తమ మంత్రిత్వ శాఖలో జరుగుతున్న పురోగతిని, కొత్త పథకాలను మోదీ నోటి ద్వారా నేరుగా యావద్దేశానికి అందించాలని ప్రయత్నిస్తుంటాయి. యాడ్ ఏజెన్సీలను పెట్టుకుని ప్రచారం చేసినదానికంటే... ‘మన్ కీ బాత్’ ద్వారా ప్రజలకు నేరుగా పథకాల గురించి చేరుతుండటమే ఇందుకు కారణం. భారతదేశంలోని ప్రజల కోసం వివిధ భాషల్లో, మాండలికాల్లో ప్రసారం కావడంతో పాటు ఇంగ్లిష్ సహా 11 అంతర్జాతీయ భాషల్లోనూ ఇది ప్రసారం అవుతోంది. విదేశాల్లో ఉంటున్న భారతీయులకు కూడా... దేశంలో ఈ నెలరోజుల్లో ఏం జరిగింది? భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే అంశాలపై స్పష్టత లభిస్తోంది. భారతదేశంలో సామాజిక పరమైన విప్లవం తీసుకురావడంలో ఈ కార్యక్రమం విజయవంతం అయిందనే చెప్పాలి. ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్’ సంస్థ చేసిన ఓ స్టడీ ప్రకారం... సమాజంలోని ప్రతి వర్గంపై, ప్రతి రంగంపై ఇది స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో, యువత, స్వయం సహాయక బృందాలపై ఈ ప్రభావం కనబడుతోంది. తద్వారా గ్రామీణాభివృద్ధి పథకాల సద్వినియోగం, అమృత్ సరోవర్ మిషన్ వంటి వాటిలో ప్రజల భాగస్వామ్యం పెరిగింది. రాజకీయాలకు అతీతంగా, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత ఉన్నతస్థితికి తీసుకెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ద్వారా జరుగుతున్న ప్రయత్నంలో ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి పథంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. ఇదే ప్రజాస్వామ్యం గొప్పదనం. -జి.కిషన్ రెడ్డి, వ్యాసకర్త కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి ‘మన్ కీ బాత్’ రాజకీయాలకు తావులేనిది.. భారతదేశ సుసంపన్న వారసత్వం, యోగా, ధ్యానం వైపు నేను బాల్యంలోనే ఆకర్షితుడనయ్యాను. అలా నా 18 ఏళ్ల వయసులో సత్య– జ్ఞానాన్వేషణలో హిమాలయాలకు వెళ్లాను. సుదీర్ఘ కాలం సంచారిగా కొనసాగిన సమయంలో జీవితంలోని విభిన్న కోణాలను దర్శించే అవకాశం లభించింది. ఇందులో భాగంగా చాలా కాలం సాధుసంతుల సత్సంగంలో గడపగలగడం నా అదృష్టం. ఎందరో మహనీయులు, యోగులు సమాజ సంస్కరణకే తమ జీవితాలను అంకితం చేయడం చూశాను. వారి బోధనలతో సమాజం స్వీయశక్తిని ఎలా గుర్తించగలదో గ్రహించాను. సాధుసంతుల కరుణా తత్పరత నా ఆరాధ్య గురుదేవునితోపాటు గొప్ప యోగులందరి నుంచీ నేను కూడా ఇదంతా నేర్చుకున్నాను. ఈ నేపథ్యంలో మన ప్రధాని నరేంద్ర మోదీని చూసినప్పుడు, ఆయన నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమ ప్రసంగం వింటూ, ఆయా అంశాలపై స్పందించే వేళ మన సాధుసంతులు ప్రబోధించే ‘కరుణా తత్పరత’ను ఆయన కూడా అనుసరిస్తున్నట్లు తోస్తుంది. ఈ కార్యక్రమం మొదలైన రోజున నేను యాదృచ్ఛికంగా విన్నప్పటికీ, అదొక అలవాటుగా మారింది. ఎందుకంటే– ‘మన్ కీ బాత్’ ప్రధానంగా రాజకీయాలకు తావులేనిది.. అంతేగాక దేశం, సమాజం, సంస్కృతి, యోగా, సమాజంలోని శ్రమజీవుల విజయాలను మాత్రమే అది ప్రస్తావిస్తుంది. నేను ఈ ప్రసంగం వినడం ప్రారంభించినపుడు– అసలు ‘మన్ కీ బాత్’ వల్ల ప్రయో జనం ఏమిటనే ఆసక్తి నాలో ఉదయించింది. అయితే, ఈ రేడియో కార్యక్రమం ప్రధాని మోదీ శ్రీకారం చుట్టిన ఒక వినూత్న ప్రయోగమనే వాస్త వాన్ని నేను గుర్తించాను. అయినప్పటికీ– ఈ కొత్తదనం, ఆసక్తి, రాజ కీయరహిత స్వభావం ఈ వేదికపై కొనసాగడం సాధ్యమేనా అని కించిత్ సందేహం కూడా కలిగింది. కానీ, అశేష ప్రజా దరణతో ఈ కార్యక్రమం నేడు 100వ భాగం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆ భయాలన్నీ నిరాధారమని నిరూపిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నా సందేహాలను పటాపంచలు చేశారని చెప్పడానికి నేనెంత మాత్రం సంకోచించను. మనసుతో మనసు సంభాషణ ప్రధానమంత్రి చొరవతో ప్రపంచం అంత ర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం యోగాభ్యాసానికి విశ్వగురువైన భారతదేశానికి గర్వకారణం. ఈ సందర్భంగా 2022 సెప్టెంబరు నెలలో ‘మ¯Œ కీ బాత్’ కార్యక్రమం అంశం నాకు గుర్తుకొస్తోంది. ఆనాటి ప్రసంగంలో భాగంగా సూరత్ నగరానికి చెందిన బాలిక ‘అన్వి’ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడుతూ వచ్చిన ఆ చిన్నారికి ‘ఓపెన్ హార్ట్ సర్జరీ’ చేశారు. ఆ తర్వాత ఆత్మ స్థై్థర్యంతో, యోగాభ్యాసంతో ఆ బాలిక సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకుంది. యోగాభ్యాసంలో అనేక పతకాలు కూడా సాధించడాన్ని ప్రధాని ఉదాహరించారు. అటవీ విధ్వంసాన్ని నిలువ రిస్తూ, నక్సలైట్లను ఎదుర్కొన్న జార్ఖండ్ వీరవనిత ‘జమునా తుడు’ కథను ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ద్వారా పంచుకున్నారు. బిహార్లోని ముజ ఫర్పూర్లో ‘రైతు పిన్ని’గా ప్రసిద్ధురాలైన రాజ కుమారి దేవి కథను కూడా ఆయన ప్రస్తావించారు. గుజరాత్ వాస్తవ్యురాలైన దివ్యాంగురాలు ముక్తాబెన్ పంకజ్కుమార్ డాగ్లీ కథను కూడా ప్రజ లతో పంచుకున్నారు. పట్టుదారం వడకడంలో గిరిజన మహిళలకు శిక్షణ ఇస్తున్న ఒడిషా మహిళ కున్ని దేవూరి గురించి కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకున్నాం. అదేవిధంగా మారు మూల ప్రాంతాల్లో గర్భిణులకు ప్రసవ సమయంలో అండగా నిలిచే పద్మశ్రీ సూలగిత్తి నరసమ్మ గురించి కూడా పౌరులు తెలుసు కున్నారు. సిద్దగంగ మఠానికి చెందిన డాక్టర్ శ్రీ శ్రీ శివకుమార్ స్వామీజీ రచనల గురించి తెలుసుకునే అవకాశం కూడా లభించింది. ఈ తరహాలో ‘మన్ కీ బాత్’ ద్వారా ఎన్నో స్ఫూర్తిదాయక గాథలు మనకు చేరాయి. సామాన్యులతో విస్తృత స్థాయిలో మమేక మవుతూ ప్రధాని ఆత్మీయ అనుబంధం ఏర్పరచు కున్నారు. కాబట్టే ఆయన నిర్వహించే ప్రతి కార్య క్రమంలోనూ మీ కుటుంబ పెద్ద లేదా సంరక్షకుడు స్వయంగా మీతో మాట్లాడుతున్నట్లు మీరు భావిస్తారు. మనసుతో మనసు సంభాషణే ‘మ¯Œ కీ బాత్’ అన్నది నా నిశ్చితాభిప్రాయం. -శ్రీ ఎం. వ్యాసకర్త ఆధ్యాత్మిక గురువు, ‘పద్మభూషణ్’ పురస్కార గ్రహీత -
జీ-20 లోగోను వస్త్రంపై నేసిన హరిప్రసాద్
-
సాంకేతిక ప్రజాస్వామ్యం దిశగా
న్యూఢిల్లీ: ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్(ఎఫ్ఎం) రేడియో సేవలను గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించే దిశగా 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రేడియో పరిశ్రమలో ఇదొక విప్లవాత్మకమైన ముందుడుగు అని అభివర్ణించారు. సాంకేతిక(టెక్నాలజీ) ప్రజాస్వామీకరణ కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. తమ తరానికి రేడియోతో భావోద్వేగ అనుబంధం ఉందని తెలిపారు. తాను రేడియో హోస్ట్గా వ్యవహరిస్తున్నానంటూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రస్తావించారు. 100వ ఎపిసోడ్ వచ్చే ఆదివారం ప్రసారం కాబోతోందని వివరించారు. దేశ ప్రజలతో భావోద్వేగపూరిత బంధం పెంచుకోవడం రేడియో ద్వారానే సాధ్యమని ఉద్ఘాటించారు. అందరికీ ఆధునిక టెక్నాలజీ స్వచ్ఛ భారత్ అభియాన్, బేటీ బచావో, బేటీ పడావో, హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలు మన్ కీ బాత్ ద్వారా ప్రజా ఉద్యమాలుగా మారాయని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆలిండియా రేడియో బృందంలో తాను కూడా ఒక భాగమేనని వెల్లడించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, అందులో భాగంగానే 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రారంభించామని తెలియజేశారు. దేశం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి ఆధునిక టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావడం కీలకమన్నారు. డిజిటల్ ఇండియా వల్ల రేడియో శ్రోతల సంఖ్య పెరగడమే కాదు, కొత్త ఆలోచనా విధానం ఉద్భవిస్తోందని వివరించారు. ప్రతి ప్రసార మాధ్యమంలో విప్లవం కనిపిస్తోందని చెప్పారు. డీడీ ఉచిత డిష్ సేవలను 4.30 కోట్ల ఇళ్లకు అందించినట్లు తెలిపారు. ప్రపంచ సమాచారం ఎప్పటికప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు, దేశ సరిహద్దుల్లోని కుటుంబాలకు చేరుతోందని హర్షం వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు సైతం విద్యా, వినోద సమాచారం చేరుతోందన్నారు. డిజిటల్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు గ్రామీణ ప్రాంతాలకు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణతో మొబైల్ డేటా చార్జీలు భారీగా తగ్గిపోయాయని, సమాచారం పొందడం ప్రజలకు సులభతరంగా మారిందని అన్నారు. దేశం నలుమూలలా డిజిటల్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పుట్టుకొ స్తున్నారని వెల్లడించారు. చిరువ్యాపారులు కూడా యూపీఐ సేవలు బ్యాంకింగ్ సదుపాయాలు వాడుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి ప్రారంభించిన 91 ఎఫ్ఎం ట్రాన్స్మిట్టర్ల ద్వారా దేశవ్యాప్తంగా 85 జిల్లాల్లో రెండు కోట్ల మందికి పైగా ప్రజలు ఎఫ్ఎం రేడియో ప్రసారాలు వినవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయా, నాగాలాండ్, హరియాణా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, చత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు మారుమూల జిల్లాలతోపాటు లద్దాఖ్, అండమాన్, నికోబార్ దీవుల్లో ఎఫ్ఎం రేడియో సేవలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. రికమండేషన్లకు చరమగీతం ఆలిండియా రేడియో వంటి కమ్యూనికేషన్ చానళ్లు మొత్తం దేశాన్ని, దేశంలోని 140 కోట్ల మందిని అనుసంధానించాలన్నదే తమ విజన్, మిషన్ అని ప్రధాని మోదీ వివరించారు. గతంలో రికమండేషన్ల ఆధారంగా పద్మా పురస్కారాలు ప్రదానం చేసేవారని, ఆ పద్ధతికి తాము చరమగీతం పాడేశామని అన్నారు. దేశానికి, సమాజానికి అందించిన విలువైన సేవల ఆధారంగానే ఈ పురస్కారాలు అందజేస్తున్నామని చెప్పారు. ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ప్రారంభోత్సవంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పలువురు పద్మ పురస్కార గ్రహీతలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ వారికి స్వాగతం పలికారు. -
‘మన్ కీ బాత్’థీమ్.. గోల్కొండలో సౌండ్ అండ్ లైట్ షో
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటలో ఈ నెల 29న ‘మన్ కీ బాత్’థీమ్తో ప్రత్యేకమైన సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ నెల 30 న ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారం కానున్న మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనుంది. మన్ కీ బాత్కు సంబంధించిన ఎంపిక చేసిన కొన్ని థీమ్స్ను పురావస్తు శాఖ అధీనంలో దేశవ్యాప్తంగా ఉన్న 13 చారిత్రక కట్టడాల్లో సౌండ్ అండ్ లైట్ షో ద్వారా ప్రదర్శించనున్నారు. అందులో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోట, గ్వాలియర్ కోట, సూర్య దేవాలయం, వెల్లూరు కోట, గేట్ వే ఆఫ్ ఇండియా, నవ్నతన్ ఘడ్ కోట, రాంనగర్ ప్యాలెస్, ది రెసిడెన్సీ భవనం, గుజరాత్లోని సూర్య దేవాలయం, రాంఘడ్ కోట, చిత్తోర్ఘడ్ కోట, ప్రధాని సంగ్రహాలయతో పాటు హైదరాబాద్లోని గోల్కొండ కోటలోనూ ‘మన్ కీ బాత్’కు సంబంధించిన ప్రత్యేక ప్రదర్శనలను చేపట్టనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ గురువారం తెలిపారు. ‘మన్ కీ బాత్ ఆర్ట్ ఎగ్జిబిషన్’ మరోవైపు మన్ కీ బాత్ థీమ్ ఆధారంగా దేశంలో ప్రసిద్ధి పొందిన 12 మంది చిత్రకారులు వేసిన పెయింటింగ్స్, ఆర్ట్ ఎగ్జిబిషన్ను ఈ నెల 30 న ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో నీటి పొదుపు, నారీశక్తి, కోవిడ్పై అవగాహన, స్వచ్ఛ భారత్, వాతావరణ మార్పు, రైతాంగం–వ్యవసాయం, యోగా – ఆయుర్వేదం, సైన్స్–ఖగోళ శాస్త్రం, క్రీడలు–ఫిట్నెస్, భారత్ ఎట్ 75 అమృత్ కాల్, ఈశాన్య రాష్ట్రాలు అనే 12 రకాల థీమ్స్ ఉంటాయి. దీంతో పాటు 12 అమర్చిత్ర కథ కామిక్స్లో మొదటి కామిక్ను ఈ నెల 30 న విడుదల చేయనున్నట్లు గోవింద్ మోహన్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సాగర తీరాన ధగధగల సౌధం -
ప్రజల గొంతు నొక్కేయగలరా?
న్యూఢిల్లీ: భారతదేశంలో ఉన్నంత భావ ప్రకటన స్వేచ్ఛ ప్రపంచంలో ఇంకెక్కడా లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. దేశంలో బీజేపీ పాలనలో ప్రజల గొంతు నొక్కేస్తున్నారంటూ కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఇటీవల ఓ పత్రిక వ్యాసంలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అవి తనకు బాధ కలిగించాయన్నారు. ప్రజల గొంతును ఎవరూ నొక్కేయలేరని చెప్పారు. బుధవారం ‘మన్కీ బాత్ 100 జాతీయ సదస్సు’ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినెలా నిర్వహించే ఈ రేడియో కార్యక్రమం దేశానికి ఒక ఆశాదీపమన్నారు. దీనిద్వారా రాజకీయాలకు అతీతంగా మోదీ దేశానికి సందేశమిస్తున్నారని ప్రశంసించారు. కొందరు నాయకులు విదేశాలకు వెళ్లి, మన దేశాన్ని తూలనాడుతున్నారని మండిపడ్డారు. మోదీ హయాంలో ఎంతో అభివృద్ధి జరుగుతోందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. మన్ కీ బాత్ 100 కాఫీ టేబుల్ బుక్ తదితరాలను ధన్ఖడ్ విడుదల చేశారు. ముఖ్యమైన భావప్రసారం: ఆమిర్ ఖాన్ మన్ కీ బాత్ చాలా ముఖ్యమైన భావప్రసార కార్యక్రమమని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ప్రశంసించారు. మన్ కీ బాత్ ద్వారా మోదీ దేశ ప్రజలతో అనుసంధానం అవుతున్నారని తెలిపారు. అత్యంత కీలకమైన అంశాలపై చర్చిస్తున్నారని, తన ఆలోచనలు పంచుకుంటూ చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారని అమీర్ ఖాన్ ప్రశంసించారు. -
మన్ కీ బాత్ @100.. నేడు జాతీయ సదస్సు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మోదీ మాసాంతపు ‘ఆలిండియా రేడియో’ప్రాసంగిక కార్యక్రమం మన్ కీ బాత్ 100 ఎపిసోడ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ జాతీయ సదస్సు నిర్వహించనుంది. దీన్ని బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో నాలుగు ప్రత్యేకచర్చా కార్యక్రమాలుంటాయి. వీటిలో నటులు అమీర్ ఖాన్, రవీనాటాండన్, తెలంగాణ నుంచి నిఖత్ జరీన్, పూర్ణ మలావత్లతో పాటు మన్ కీ బాత్లో ప్రధాని ప్రస్తావించిన 100 మందికి పైగా ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. ‘మన్ కీ బాత్’100 ఎపిసోడ్లకు గుర్తుగా పోస్టల్ స్టాంప్, నాణేలను హోంమంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు. -
‘మన్ కీ బాత్’కు 23 కోట్ల శ్రోతలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినెలా చివరి ఆదివారం నిర్వహించే ‘మన్ కీ బాత్’కు ప్రజల్లో విశేష ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని ఇచ్చే సందేశాన్ని దాదాపు 23 కోట్ల మంది వింటున్నట్లు తాజా సర్వేలో తేలింది. మొత్తం శ్రోతల్లో 65 శాతం మంది హిందీ భాషలో వినేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడయ్యింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–రోహ్తక్ ఈ సర్వే నిర్వహించింది. సర్వేలో ఏం తేలిందంటే.. 100 కోట్ల మందికిగాపైగా ప్రజలు కనీసం ఒక్కసారైనా మన్ కీ బాత్ విన్నారు. 41 కోట్ల మంది తరచుగా వింటున్నారు. 23 కోట్ల మంది కచ్చితంగా వింటున్నారు. మొత్తం శ్రోతల్లో 44.7 శాతం మంది టీవీల్లో, 37.6 శాతం మంది మొబైల్ ఫోన్లలో కార్యక్రమం వింటున్నారని ఐఐఎం–రోహ్తక్ డైరెక్టర్ ధీరజ్ పి.శర్మ చెప్పారు. మన్ కీ బాత్ 100వ ఎడిషన్ వచ్చే ఆదివారం ప్రసారం కానుంది. ఎక్కువ మంది టీవీ చానళ్లలో, మొబైల్ ఫోన్లలో వీక్షించనున్నారు. కేవలం 17.6 శాతం మంది రేడియోల్లో వినబోతున్నట్లు సర్వేలో తేలింది. 22 భారతీయ భాషలు, 29 యాసలతోపాటు 11 విదేశీ భాషల్లో మన్ కీ బాత్ ప్రసారమవుతోందని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది పేర్కొన్నారు. -
రూ.100 కాయిన్ విడుదల చేయనున్న కేంద్రం.. మనం వినియోగించవచ్చా?
ఇప్పటి వరకు మనం రూ. 1,2,5,10, 20 కాయిన్స్ చూశాం. వాటిని వినియోగించాం. అయితే త్వరలో భారత మార్కెట్లో రూ.100 నాణేలు విడుదల కానున్నాయి. ఈ కొత్త కాయిన్ వినియోగంపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రధాని మోదీ 2014 అక్టోబర్ 3న ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రతి నెల చివరి ఆదివారంలో ఆల్ ఇండియా రేడియలో మోదీ ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు 99 కార్యక్రమాలు పూర్తికాగా.. 100వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని మోదీ రూ.100 నాణేలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రూ.100 కాయిన్ విడుదలపై కేంద్ర ఆర్ధిక శాఖ అధికారిక ప్రకటన చేసింది. ఈ వంద రూపాయిల నాణెం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తయారైంది. ఈ విలువైన నాణెం కేంద్రం ప్రభుత్వం నిర్వహిస్తున్న 100 ఎపిసోడ్ మన్కీ బాత్ కార్యక్రమంలో విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. రూ.100 కాయిన్ను వినియోగించుకోవచ్చా? ఏప్రిల్ 30న జరిగే మన్కీ బాత్ 100 ఏపీసోడ్ సందర్భంగా రూ.100 కాయిన్ను కేంద్రం విడుదల చేయనుంది. విడుదల అనంతరం దీనిని సాధారణ కాయిన్లాగా వినియోగించేందుకు వీలు లేదు. కేవలం ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే ఉపయోగించుకునే వెసలు బాటు కల్పించింది కేంద్రం. రూ.100 కాయిన్ ప్రత్యేకతలు కేంద్రం ఆర్ధిక శాఖ అధికారిక ప్రకటన మేరకు.. రూ.1, 2,10,20 నాణెల కంటే విభిన్నంగా ఉండనుంది. కాయిన్ 44 మిల్లీమీటర్ డయారీ మీటర్లో గుండ్రంగా ఉంటుంది. ఇందులో 35 గ్రాముల ఇనుము, వెండి 50శాతం,రాగి 40 శాతం, నికెల్ 5శాతం, జింక్ శాతం కలిగి ఉంటుంది. వీటితో పాటు అశోక స్తంభము ముద్ర, మధ్యలో సత్యమేవ జయతే, దేవనగరి భాషలో భారత్ అనే పదాలు కనిపిస్తాయి. ఎడమవైపు ఇంగ్లీష్లో ఇండియా అనే అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అదనంగా కాయిన్ మీద రూపాయి చిహ్నం "₹" 100 సంఖ్య ఉండగా.. నాణెం వెనుక భాగంలో మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ లోగో, దానిపై '2023' అని రాయబడి ఉంటుంది. చదవండి👉 ట్విటర్ యూజర్లకు శుభవార్త! -
నారీ శక్తికి సలాం: మోదీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిలో మహిళలు అమూల్య పాత్ర పోషిస్తున్నారంటూ కొనియాడారు. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందంటూ ట్వీట్ చేశారు. మన్ కీ బాత్లో క్రోడీకరించిన మహిళల స్ఫూర్తి గాథలను షేర్ చేశారు. నారీశక్తి ఫర్ న్యూ ఇండియా అంటూ హాష్ట్యాగ్ జత చేశారు. భారత మహిళల స్ఫూర్తిదాయకత్వంపై ‘హర్ స్టోరీ, మై స్టోరీ...’ శీర్షికతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాసిన వ్యాసాన్ని కూడా ప్రధాని షేర్ చేశారు. ‘‘త్రిపుర నుంచి తిరిగొస్తూ వ్యాసం చదివా. ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది. అతి సాధారణ స్థాయి నుంచి దేశ అత్యున్నత అధికార పీఠం దాకా ఎదిగిన ఒక స్ఫూర్తిదాయక మహిళ ప్రయాణాన్ని కళ్లకు కట్టిన ఆ వ్యాసాన్ని అందరూ చదవాలి’’ అని సూచించారు. అన్ని రంగాల్లోనూ దేశాభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర అంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ కూడా కొనియాడారు. -
మన్కీబాత్లో ప్రధాని మోదీ నోట తెలుగువారి ప్రస్తావన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మన్కీ బాత్లో తెలుగువారి గురించి ప్రస్తావించారు. ఆదివారం 98వ మన్కీబాత్లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, క్రీడలు తదితర అంశాల గొప్పదనం, పరిరక్షణకు చేస్తున్న సేవలు ప్రశంసించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని దేశభక్తి గీతాలు, ముగ్గులు, లాలిపాటలపై దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీల విజేతలను ప్రకటించారు. దేశభక్తి గీతాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన టి.విజయ దుర్గ విజేతగా ప్రకటించారు. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తితో విజయదుర్గ దేశభక్తి గీతాన్ని రచించారని పేర్కొన్నారు. ‘‘రేనాడ ప్రాంత వీరా! ఓ వీర నరసింహా! భారత స్వాతంత్య్ర పోరాటానికి అంకురానివి! అంకుశానివి! ఆంగ్లేయుల అన్యాయమైన నిరంకుశ దమనకాండను చూసి మీ రక్తం మండింది మంటలు లేచాయి! రేనాడు ప్రాంత సూర్యుడా! ఓ వీర నరసింహా!’’ అనే దేశభక్తి గీతాన్ని ఈ సందర్భంగా వినిపించారు. మరో అవార్డు గ్రహీత తెలంగాణకు చెందిన పేరిణి రాజ్కుమార్ను అభినందించారు. కాకతీయుల కాలంలో మహాదేవుడు శివుడుకి అంకితం చేసిన పేరిణి నాట్యం ఎంతో పేరొందిందని, ఆ రాజవంశ మూలాలు ఇప్పటికీ తెలంగాణతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. రాజకుమార్ నాయక్ ఒడిస్సీ నాట్యంలోనూ గుర్తింపు పొందారని పేర్కొన్నారు. వి.దుర్గాదేవి అనే మహిళ కరకట్టం అనే పురాతన నృత్య విభాగంలో అవార్డు పొందారన్నారు. -
ఇ–సంజీవనితో డిజిటల్ విప్లవం
న్యూఢిల్లీ: భారత్లో డిజిటల్ విప్లవం తన సత్తా చాటుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇ–సంజీవని యాప్ దీనికి నిదర్శనమని చెప్పారు. ఆన్లైన్లో మెడికల్ కన్సల్టేషన్ చేసే ఈ యాప్ ద్వారా 10 కోట్ల మందికి పైగా లబ్ధి పొందారని తెలిపారు. ప్రతీ నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ సాధారణ ప్రజలు, మధ్యతరగతి వారు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ యాప్ ప్రాణ రక్షణగా మారిందని చెప్పారు. ఈ యాప్ ఒక్కటి చూసి భారత్ డిజిటల్ పవర్ ఏంటో చెప్పవచ్చునని అన్నారు. ఒక డాక్టర్, ఒక రోగితో మాట్లాడిన ఆయన, ఇ–సంజీవని యాప్ ఎంత ఉపయోగకరమో వివరించారు. ‘‘ఇది మనం సాధించిన అతి పెద్ద ఘనత. భారత దేశ ప్రజలు టెక్నాలజీని మన జీవితంలో ఎలా భాగం చేసుకున్నారో చెప్పడానికి ఇది సజీవ సాక్ష్యం. కరోనా సమయంలో ఈ యాప్ ప్రజలందరికీ ఒక వరంలా మారడం మనం కళ్లారా చూశాము’’ అని ప్రధాని చెప్పారు. ఇక నగదు చెల్లింపుల్లోనూ యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సరికొత్త పుంతలు తొక్కుతోందని అన్నారు. సింగపూర్కు చెందిన పేనౌకి కూడా యాక్సెస్ లభించడంతో రెండు దేశాల ప్రజల మధ్య కూడా డిజిటల్ చెల్లింపులు మరింత సులభతరంగా మారాయన్నారు. యూపీలో కొత్తగా నియమితులైన పోలీసులనుద్దేశించి మోదీ మాట్లాడారు. లక్నోలో ఉద్యోగ మేళాలో 9 వేల మందికి ఆయన నియామక పత్రాలిచ్చారు. నేడు కర్ణాటకకు ప్రధాని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం పర్యటించనున్నారు. రూ.450 కోట్లతో నిర్మించిన శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఏడాది కర్ణాటకలో ప్రధాని పర్యటించడం ఇది ఐదోసారి! -
Mann ki Baat 2023: వారి జీవితాలు స్ఫూర్తిదాయకం
న్యూఢిల్లీ: ఈ ఏడాది పద్మ అవార్డులకు ఎంపికైన వారి జీవితాలు, వారు సాధించిన ఘనత గురించి ప్రజలందరూ తెలుసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 2023 పద్మ అవార్డుల్ని పీపుల్స్ పద్మగా అభివర్ణించారు. సామాన్యుల్లో అసామాన్యులుగా ఎదిగిన వారిని గుర్తించి గౌరవిస్తున్నట్టు చెప్పారు. కొత్త ఏడాదిలో తొలిసారిగా ప్రధాని ఆదివారం ఆకాశవాణి మన్కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. గిరిజనులు, వారి అభ్యున్నతికి కృషి చేసిన వారినే అత్యధికంగా పద్మ అవార్డులతో సత్కరిస్తున్నట్టు వెల్లడించారు. ‘‘ పద్మ పురస్కారాలు పొందినవారి జీవితాలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి. గిరిజన భాషలైన టోటో, హో, కూయి వంటి వాటిపై అవిరళ కృషి చేసిన వారు, ఆదివాసీల సంగీత పరికరాలు వాయించడంలో నిష్ణాతులకి ఈ సారి పద్మ పురస్కారాలు వరించాయి.. నగర జీవితాలకి , ఆదివాసీ జీవితాలకు ఎంతో భేదం ఉంటుంది. నిత్య జీవితంలో ఎన్నో సవాళ్లుంటాయన్నారు. అయినప్పటికీ తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి గిరిజనులు ఎంతో పోరాటం చేస్తుంటారు’’ అని ప్రధాని కొనియాడారు. పెరుగుతున్న దేశీయ పేటెంట్ ఫైలింగ్స్ ఈ దశాబ్దం సాంకేతిక రంగంలో దేశీయ టెక్నాలజీస్ వాడకం పెరిగి ‘‘టెకేడ్’’గా మారాలన్న భారత్ కలను ఆవిష్కర్తలు, వాటికి వచ్చే పేటెంట్ హక్కులు నెరవేరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. విదేశాలతో పోల్చి చూస్తే దేశీయంగా పేటెంట్ ఫైలింగ్స్ బాగా పెరిగాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పేటెంట్ ఫైలింగ్లో భారత్ ఏడో స్థానంలో ఉంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్లలో అయిదో స్థానంలో ఉందని ప్రధాని వెల్లడిచారు. గత అయిదేళ్లలో భారత్ పేటెంట్ రిజిస్ట్రేషన్లు 50శాతం పెరిగాయని, ప్రపంచ ఆవిష్కరణల సూచిలో మన స్థానం 40కి ఎగబాకిందన్నారు. 2015 నాటికి 80 కంటే తక్కువ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. ఇండియన్ ఇనిస్టి్యూట్ ఆఫ్ సైన్సెస్ 2022లో 145 పేటెంట్లను దాఖలు చేసి రికార్డు సృష్టిస్తుందన్నారు. భారత్ ‘‘టెకేడ్‘‘కలని ఆవిష్కర్తలే నెరవేరుస్తారని ప్రధాని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. మన్కీ బాత్లో తెలుగువారి ప్రస్తావన మన్కీబాత్లో ఇద్దరు తెలుగు వారి గురించి మోదీ ప్రస్తావించారు. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ నడిపే ఆంధ్రప్రదేశ్కు చెందిన కె.వి.రామసుబ్బారెడ్డి, తెలంగాణకు చెందిన ఇంజనీర్ విజయ్ గురించి మాట్లాడారు. ‘‘నంద్యాల జిల్లాకు చెందిన కె.వి.రామసుబ్బారెడ్డి చిరు ధాన్యాలు పండించడం కోసం మంచి జీతం వచ్చే ఉద్యోగం మానేశారు. తల్లి చేసే చిరు ధాన్యాల వంటకం రుచి చూసి గ్రామంలో ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించారు వాటి ప్రయోజనాలను అందరికీ వివరిస్తున్నారు’’ అని కొనియాడారు. నమో యాప్లో ఇ–వేస్ట్ గురించి రాసిన తెలంగాణకు చెందిన ఇంజనీర్ విజయ్ గురించి ప్రస్తావించిన ప్రధాని మొబైల్, ల్యాప్టాప్, టాబ్లెట్లు నిరుపయోగమైనప్పుడు ఎలా పారేయాలో వివరించారు. -
Mann ki Baat: 'మన కృషి వల్లే యోగాకు అంతర్జాతీయ గుర్తింపు'
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి మన్కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. వివిధ అంశాల గురించి మాట్లాడారు. సంగీతం ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైందని పేర్కొన్నారు. అనేక మంది కళాకారులకు పద్మ అవార్డులు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. కళల అభ్యున్నతికి పాల్పడుతున్న వారిని గుర్తించినట్లు వివరించారు. మన కృషి వల్లే యోగాకు అంతర్జాతీయ గుర్తింపు దక్కినట్లు మోదీ తెలిపారు. యోగా, చిరుధాన్యాల దినోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. చిరుధాన్యాల గొప్పతనాన్ని ప్రభుత్వం గుర్తిస్తోందని చెప్పారు. చదవండి: భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం -
ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్'.. భారత్ మైలురాళ్లు చెప్పిన మోదీ..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రసంగించారు. దేశ ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. 2022 చివరి ఎపిసోడ్ కావడంతో ఈ ఏడాది భారత్ సాధించిన మైలురాళ్ల గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత కొన్నేళ్లుగా దేశం ఎదుర్కొంటున్న ఆరోగ్య సవాళ్లను ఈ ఏడాది అధిగమించినట్లు చెప్పారు. ఏ ఏడాదే జీ-20కి భారత్ నాయకత్వం వహించిన విషయాన్ని గుర్తు చేశారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం వేడుకల్లో భాగంగా నిర్వహించిన హర్ గర్ తిరంగా కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. ఆధునిక యుగంలో యోగా, ఆయుర్వేదానికి ప్రాధాన్యం పెరగడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ రోగులపై యోగా ప్రభావవంతంగా ఉందని టాటా రీసెర్చ్ సెంటర్ చేసిన పరిశోధనను కొనియాడారు. ప్రతి ఒక్కరు ఆయుర్వేదాన్ని తమ జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. స్వచ్ఛ భారత్ మిషన్ను సహకరించాలన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతినెల చివరి ఆదివారం మోదీ మన్ కీ బాత్ రేడియా కార్యక్రమంలో మాట్లాడుతారు. మొత్తంగా ఇది 96వ ఎపిసోడ్ కాగా.. ఈ ఏడాది చివరిది. చదవండి: రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. కేంద్రమంత్రి జోస్యం.. -
Mann Ki Baat: ‘అంతరిక్షం’లో నూతన సూర్యోదయం
సాక్షి, న్యూఢిల్లీ: ‘విక్రమ్–ఎస్’ రాకెట్ ప్రయోగం మన దేశంలో ప్రైవేట్ అంతరిక్ష రంగంలో నూతన సూర్యోదయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ ప్రయోగంతో దేశ అంతరిక్ష రంగంలో నూతన శకం మొదలైందన్నారు. ఆదివారం 95వ ‘మన్కీ బాత్’లో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. జీ20కి సారథ్యం వహిస్తున్న దేశంగా ప్రపంచం ముందున్న సవాళ్లకు పరిష్కార మార్గాలు కనిపెట్టాల్సిన బాధ్యత భారత్పై ఉందని చెప్పారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... ‘స్పేస్’లో ప్రైవేట్ పాత్ర భేష్ స్పేస్ టెక్నాలజీలో ప్రైవేట్ రంగం పాత్ర ప్రశంసనీయం. స్పేస్ సెక్టార్లో నవంబర్ 18న ‘కొత్త చరిత్రకు’ ప్రజలంతా సాక్షిభూతంగా నిలిచారు. దేశీయంగా ప్రైవేట్ రంగంలో డిజైన్ చేసి, రూపొందించిన తొలి రాకెట్ ‘విక్రమ్–ఎస్’ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోయింది. ఈ రాకెట్ను తక్కువ ఖర్చుతో రూపొందించడం గొప్ప విషయం. స్పేస్ టెక్నాలజీలో భారత్ పరిమిత ఖర్చుతోనే ప్రపంచ స్థాయి ప్రమాణాలకు చేరుకుంది. విక్రమ్–ఎస్ రాకెట్లో కొన్ని కీలక భాగాలను 3డీ ప్రింటింగ్ ద్వారా తయారు చేశారు. ఈ రాకెట్ ప్రయోగం ప్రైవేట్ స్పేస్ సెక్టార్లో నూతన సూర్యోదయం. కాగితాలతో విమానాలు తయారు చేసి, గాల్లోకి ఎగురవేసిన మన పిల్లలు ఇప్పుడు అసలైన విమానాలు తయారు చేసే అవకాశం దక్కించుకుంటున్నారు. కాగితాలపై ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలను గీసిన మనవాళ్లు ఇప్పుడు రాకెట్లు తయారు చేస్తున్నారు. విక్రమ్–ఎస్ ప్రయోగం భారత్–భూటాన్ సంబంధాలకు బలమైన నిదర్శనం. దేశమంతటా జీ20 కార్యక్రమాలు శక్తివంతమైన జీ20 కూటమికి భారత్ నాయకత్వం వహించనుండడం ప్రతి భారతీయుడికి గొప్ప అవకాశం. వసుధైక కుటుంబ భావనను ప్రతిబింబించేలా జీ20కి ‘ఒకే భూగోళం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే థీమ్ ఇచ్చాం. జీ20కి సంబంధించిన కార్యక్రమాలు దేశమంతటా నిర్వహిస్తాం. ఇందులో భాగంగా విదేశీయులు మన రాష్ట్రాలను సందర్శిస్తారు. మన విభిన్నమైన సంస్కృతి సంప్రదాయలను విదేశాలకు పరిచయం చేయొచ్చు. జీ20 కార్యక్రమాల్లో ప్రజలు.. ముఖ్యంగా యువత పాలుపంచుకోవాలి. యువత పరుగును ఆపడం కష్టం మన యువత గొప్పగా ఆలోచిస్తున్నారు, గొప్ప ఘనతలు సాధిస్తున్నారు. అంతరిక్షం, సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణల విషయంలో సహచర యువతను కలుపుకొని ముందుకెళ్తున్నారు. స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నారు. డ్రోన్ల తయారీలోనూ భారత్ వేగంగా పరుగులు తీస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో ఇటీవలే యాపిల్ పండ్లను డ్రోన్ల ద్వారా రవాణా చేశారు. నూతన ఆవిష్కరణ ద్వారా అసాధ్యాలను సుసాధ్యం చేస్తుండడం సంతోషకరంమన యువత పరుగును ఆపడం ఇక కష్టం. ప్రపంచం నలు మూలలకూ మన సంగీతం సంగీత రంగంలోనూ భారత్ గణనీయ ప్రగతి సాధిస్తోంది. ఎనిమిదేళ్లలో సంగీత పరికరాల ఎగుమతి మూడున్నర రెట్లు పెరిగింది. భారతీయ సంగీత ఖ్యాతి ప్రపంచ నలుమూలలకూ చేరుతోంది. తమ కళలు, సంస్కృతి, సంగీతాన్ని చక్కగా పరిరక్షించుకుంటున్న నాగా ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలి’’ అని మోదీ సూచించారు. యూపీలోని బన్సా గ్రామంలో ‘కమ్యూనిటీ లైబ్రరీ, రిసోర్స్ సెంటర్’ను స్థాపించిన జతిన్ లలిత్ సింగ్, జార్ఖండ్లో ‘లైబ్రరీ మ్యాన్’గా గుర్తింపు పొందిన సంజయ్ కశ్యప్పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. -
సౌర, అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు
న్యూఢిల్లీ: ‘‘సౌర, అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు చేస్తోంది. ఆ రంగాల్లో మనం సాధిస్తున్న విజయాలను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 36 ఉపగ్రహాలను ఇస్రో ఒకేసారి విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించడాన్ని దేశానికి యువత ఇచ్చిన ప్రత్యేక దీపావళి కానుకగా అభివర్ణించారు. ఆదివారం నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘స్వయంసమృద్ధి దిశగా మా ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది తాజా తార్కాణం. ఒకప్పుడు మనకు క్రయోజనిక్ రాకెట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. కానీ మన శాస్త్రవేత్తలు దాన్ని సవాలుగా తీసుకుని దేశీయ పరిజ్ఞానం సాయంతోనే వాటిని నిర్మించి చూపించారు. ఇప్పుడు పుంఖానుపుంఖాలుగా ఉపగ్రహాలను పంపి చూపుతున్నారు. ఫలితంగా ప్రపంచ అంతరిక్ష వాణిజ్య మార్కెట్లో్ల భారత్ పెద్ద శక్తిగా నిలిచింది. అంతరిక్షంలోనూ ప్రైవేటు రంగానికి తలుపులు తెరవడంతో కొత్త స్టార్టప్లు పుట్టుకొచ్చి విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి’’ అన్నారు. మోదెరా స్ఫూర్తి: ప్రపంచమంతా పర్యావరణహిత సౌర విద్యుత్ కేసి మళ్లుతోందని మోదీ అన్నారు. ‘‘పీఎం కుసుమ్ యోజన ద్వారా ఎంతోమంది ఇళ్లపై సోలార్ ప్లాంట్లు పెట్టుకున్నారు. కరెంటు బిల్లులు తగ్గించుకోవడంతో పాటు మిగులు విద్యుత్ను విక్రయించి లాభపడుతున్నారు. గుజరాత్లోని మోదెరా దేశంలో తొలి సోలార్ గ్రామంగా నిలిచింది. ఈ స్ఫూర్తితో దేశమంతటా సూర్యగ్రామ్లు వెలుస్తాయి. ఇది త్వరలోనే భారీ ప్రజా ఉద్యమంగా మారడం ఖాయం’’ అని జోస్యం చెప్పారు. పాత సవాళ్లు వదిలేద్దాం న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ప్రతి భారతీయుడికి ఒక గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పాత సవాళ్లను ఇక వదిలేద్దామని, నూతన అవకాశాల నుంచి లబ్ధి పొందుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం జమ్మూకశ్మీర్లో నిర్వహించిన రోజ్గార్ మేళానుద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. వేగవంతమైన అభివృద్ధి కోసం కొత్తగా ఆలోచించాలని, కొత్త మార్గంలో పయనించాలని సూచించారు. అభివృద్ధి ఫలాలు సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అందాలన్నదే తమ ఆశయమని ఉద్ఘాటించారు. మనమంతా కలిసి జమ్మూకశ్మీర్ను ఉన్నత శిఖరాలను చేర్చుదామని పిలుపునిచ్చారు. 21వ శతాబ్దంలో ప్రస్తుత దశాబ్దం జమ్మూకశ్మీర్ చరిత్రలో చాలా ముఖ్యమైన దశాబ్దమని చెప్పారు. పాత సవాళ్లను పక్కనపెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. జమ్మూకశ్మీర్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికై, రోజ్గార్ మేళాలో నియామక పత్రాలు అందుకున్న 3,000 మంది యువతకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరో 700 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేయడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. జమ్మూకశ్మీర్లో పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. తయారీ హబ్గా భారత్ వడోదర: రవాణా విమానాల తయారీలో భారత్ అగ్రగామిగా మారబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని వడోదరలో రూ.22 వేల కోట్లతో యూరోపియన్ సి–295 మధ్యతరహా రవాణా విమానాల తయారీ కేంద్రానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం ఈ విమానాలను తయారు చేయబోతున్నారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద తయారీ హబ్గా అవతరించిందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో ఆర్థిక సంస్కరణ విషయంలో నూతన చరిత్రను రాస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు స్థిరంగా, దార్శనికతతో కూడి ఉన్నాయన్నారు. కొత్త మైండ్సెట్, కొత్త వర్క్కల్చర్తో ఇండియా ముందడుగు వేస్తోందని చెప్పారు. పెద్ద పెద్ద వాణిజ్య విమానాలు కూడా మన దేశంలో తయారయ్యే రోజులను మనం చూడబోతున్నామని తెలిపారు. ‘మేక్ ఇన్ ఇండియా’తోపాటు ‘మేక్ ఫర్ వరల్డ్’ అనేదే మన నినాదమని వివరించారు. సి–295 ఎయిర్క్రాఫ్ట్లతో భారత వైమానిక దళం బలోపేతం కావడంతోపాటు మనదేశంలో విమానయాన రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఆ దిశగా ఇదొక మైలురాయి అని అభివర్ణించారు. -
Deepmala Pandey: స్పెషల్ టీచర్
స్పెషల్లీ ఛాలెంజ్డ్ పిల్లలను మిగతా సాధారణ పిల్లల్లాగే తీర్చిదిద్దాలంటే ఎంతో సహనం కావాలి. తల్లిదండ్రులకే వారి పెంపకం పెద్ద పరీక్షలా అనిపిస్తుంది. వాళ్ల పనులు వారు చేసుకుంటే చాలు అనే స్థితికి వచ్చేస్తుంటారు. కొందరు అలాంటి స్పెషల్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడకు తీసుకెళ్లి జాయిన్ చేస్తుంటారు. కానీ, అందరు పిల్లలు చదువుకునే స్కూళ్లలోనే 600 మంది స్పెషల్ చిల్డ్రన్ని చేర్చించి ప్రత్యేక శిక్షణ ఇస్తూ, సాధారణ పౌరులుగా తీర్చడానికి కృషి చేస్తోంది దీప్మాలా పాండే. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆమె కృషిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. బరేలీలోని ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపల్గా ఉన్న దీప్మాలా కృషి గురించి తెలుసుకుంటే ఈమెను ‘స్పెషల్ టీచర్’ అనకుండా ఉండలేం. ఇలాంటి టీచర్లు మన దగ్గరా ఉండాలని కోరుకోకుండా ఉండలేం. బరేలీ మధ్యప్రదేశ్లోని ఒక సిటీ. ఇక్కడి ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపల్గా విధులు నిర్వర్తిస్తోంది దీప్మాలా. సాధారణ పిల్లలతోపాటు ప్రత్యేకమైన పిల్లలను కూడా కూర్చోబెట్టి, వారికి పాఠాలను బోధించడమే కాదు రాయడంలోనూ మిగతావారిలాగే సమర్థులుగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు. ‘దీనిని నేను ఒంటరిగానే ప్రారంభించాను. కానీ, ఇప్పుడదే ప్రత్యేకంగా మారింది’ అని వివరిస్తారామె. చదువులో ముందంజ దీప్మాలా సివిల్ సర్వీసెస్కు వెళ్లాలనేది ఆమె తండ్రి కోరిక. ఎందుకంటే, తన ముగ్గురు సంతానంలో దీప్మాలా చిన్ననాటి నుంచి చదువులో ఎప్పుడూ ముందుండేది. అలాగని తన ఆలోచనను ఆమె మీద ఎప్పుడూ రుద్దలేదు. కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ, ఆ తర్వాత బీఈడీ చేసిన దీప్మాలా కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్ టీచర్గా ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత బరేలీకి 76 కిలోమీటర్ల దూరంలో ఉన్న దమ్ఖుడా బ్లాక్ లోని స్కూల్లో టీచర్గా పోస్టింగ్ వచ్చింది. ‘అంత దూరంలో పోస్టింగ్, నా పిల్లల భవిష్యత్తు కళ్ల ముందు కదులుతున్నా నా పనిని నిజాయితీగా చేయాలనుకున్నాను. అలాగే చేశాను కూడా. 2015లో బరేలీలోని దభౌరా గంగాపూర్లో ఉన్న ప్రాథమిక పాఠశాలకు ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పటినుంచి ఇక్కడే ప్రిన్సిపాల్గా సేవలు అందిస్తున్నాను’ అని టీచర్గా తన ప్రయాణం గురించి తెలియజేస్తారు. సృజనాత్మక ఆలోచనలు ‘ఒకసారి గురుకుల పిఎల్సి కార్యక్రమం పేరుతో వివిధ పాఠశాలల ఉపాధ్యాయుల బృందాన్ని ఏర్పాటు చేశారు. టీచర్ల గ్రూప్లో వారు పనిచేసిన సృజనాత్మక ప్రాజెక్ట్ల ఫొటోలు, వీడియోలు, చేయబోయే పనులకు సంబంధించిన ఆలోచనలు పంచుకున్నారు. అందులో భాగంగానే అయిదేళ్ల క్రితం రాష్ట్రంలోని 400 మందికి పైగా టీచర్లతో కలిసి నేను కూడా ఎన్సిఇఆర్టి స్పెషల్ ఎడ్యుకేషన్లో భాగంగా ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ సమయంలో వికలాంగ పిల్లలను సాధారణ పాఠశాలకు తీసుకువచ్చి, వారికి ఎలా నేర్పించాలో ప్లానింగ్ సిద్ధం చేశాం. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లోని స్పెషల్ చిల్డ్రన్ తల్లిదండ్రులకు తమ పిల్లలను ఎక్కడ చేర్చాలో తెలియదు. ఈ పిల్లలకు సాధారణ స్కూల్స్ వారు అడ్మిషన్ ఇవ్వరు. కొంతమంది తల్లిదండ్రులు స్పెషల్ చిల్డ్రన్ కోసం కేటాయించిన స్కూళ్లలో జాయిన్ చేస్తారు. ఆ తర్వాత ఆ పిల్లలు తమలాంటి మరికొంత మంది పిల్లలతో కలిసి బాగానే ఉంటారు. కానీ, వారు ఏదైనా నలుగురిలో కలిసే కార్యక్రమాలకు వెళ్లినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అందుకే ఈ సమస్య తలెత్తకుండా సాధారణ పిల్లలతో కలిపి ఈ ప్రత్యేకమైన పిల్లలకు చదువు చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తించాను’ అని స్పెషల్ పిల్లల ఎడ్యుకేషన్కు సంబంధించిన ప్రారంభ రోజులను గుర్తు చేసుకుంటారామె. ఓ అబ్బాయితో మొదలు... మొదటి అడుగు పడిన నాటి సంఘటనను ఒకటి వివరిస్తూ ‘ఓ రోజున పిల్లలకు క్లాస్రూమ్లో పాఠాలు చెబుతున్నాను. అప్పుడు క్లాస్రూమ్ బయటినుంచి లోపలికి ఆత్రంగా చూస్తున్న ఓ అబ్బాయి మీదకు నా దృష్టి వెళ్లింది. ఆ పిల్లవాడిని లోపలికి పిలిచి, ఒక సీటులో కూర్చోబెట్టాను. అతనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తే మాట్లాడలేడు. వినలేడు, దృష్టి నిలకడగా లేదు. సైగలు చేస్తున్నాడు. ఆ అబ్బాయికి క్లాసులో కూర్చోవడం ఇష్టం అనేది అర్థమైంది. అలా మా స్కూల్కి వచ్చిన ఆ మొదటి స్పెషల్ చైల్డ్ పేరు అన్మోల్. అక్కణ్ణుంచి ఇలాంటి పిల్లలను సాధారణ పిల్లలతో చేర్చాలి అనుకున్నాను. ఎక్కడైనా స్పెషల్ చిల్డ్రన్ ఉంటే మా స్కూల్లో చేర్చాలని మా పిఎల్సి గ్రూపులో మిగతా టీచర్లకు విజ్ఞప్తి చేశాను. మా గ్రూప్లో ఉన్న టీచర్లు దివ్యాంగ పిల్లల బాధ్యత తీసుకుంటే జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావచ్చు. ఇదే లక్ష్యంగా నా ప్రయత్నం కొనసాగింది. ఈ ఆలోచన తర్వాత మిగతా టీచర్లకు కూడా మా ఫ్యాకల్టీ సహకారంతో ప్రొఫెషనల్ లెర్నింగ్ కోర్సులతో ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించాను. దీనివల్ల స్పెషల్ చిల్డ్రన్ని వారు బాగా అర్థం చేసుకోవచ్చు, బోధించవచ్చు’ అనే ఆలోచనను తెలియజేస్తారు. సోషల్ మీడియా ద్వారా విస్తరణ ఒక మంచి ఆలోచనను ఇంకొంతమందికి పంచితే సమాజంలో మార్పు రావడం సహజం. అందుకు వేదికైనా సోషల్మీడియాను ఎంచుకున్నారు దీప్మాలా. కరోనా కాలంలో సాధారణ పిల్లలతోపాటు దివ్యాంగ పిల్లల భవిష్యత్తుకు ఏం చేయాలనే విషయంలో చాలా మందికి తెలియలేదు. అయితే, దీప్మాలా మాత్రం ‘వన్ టీచర్ వన్ కాల్’ పేరుతో ఫేస్బుక్ పేజీని సృష్టించారు. దీని ద్వారా టీచర్లు స్పెషల్ చిల్డ్రన్కి బోధిస్తారనే ప్రచారం బాగా జరిగింది. రాష్ట్రంలోనే కాదు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా టీచర్లు ఆ ఫేస్బుక్ పేజీలో చేరారు. వారంతా తమ ప్రాంతాలలోని దివ్యాంగ పిల్లలను స్కూల్ ద్వారా అడ్మిషన్లు తీసుకొని, బోధించడం ప్రారంభించారు. ఇప్పటివరకు వివిధ జిల్లాల్లోని సాధారణ పాఠశాలలో 600 మందికి పైగా స్పెషల్ చిల్డ్రన్ని చేర్పించడంతో పాటు టీచర్లు కూడా ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇంకా మరికొంతమంది తీసుకుంటున్నారు. స్త్రీల అక్షరాస్యత స్పెషల్ చిల్డ్రన్ కోసమే కాదు కరోనా కాలంలో తను పని చేస్తున్న చుట్టుపక్కల గ్రామాల్లో ఒక సర్వే నిర్వహించారు దీప్మాలా. అందులో 90 శాతం మంది మహిళలు నిరక్షరాస్యులు అని తేలడంతో ఆ తర్వాత వారికి దశలవారీగా చదువు చెప్పే పనిని చేపట్టారు. వారిలో చాలా మంది వేలి ముద్ర నుంచి సంతకం చేసేంతగా చదువు నేర్చుకున్నారు. మొదట ఏ మంచి పని తలపెట్టినా అది ఆచరణ యోగ్యమేనా, సాధించగలమా.. అనే సందేహం తలెత్తకమానదు. కానీ, నలుగురికి ఉపయోగపడే ఏ చిన్న ప్రయత్నమైనా గమ్యానికి చేరువ అవుతుందని దీప్మాలా టీచర్ ప్రయాణం రుజువు చేస్తోంది. ప్రధాని ప్రశంసలు ఇటీవల ‘మన్ కి బాత్’ కార్యక్రమంలో దీప్మాలా చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘ఆ రోజు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇలాంటి పిల్లల కోసం ఇంకా ఎక్కువ పని చేయాలనే ప్రేరణ కలుగుతుంది. ఆ రోజు నేను మా అమ్మవాళ్లింటికి వెళ్లాను. నాపేరు ప్రకటించినప్పుడు నా భర్త ఆ కార్యక్రమాన్ని వింటున్నాడు. అతను నాకు ఫోన్ చేసి చెప్పడంతో, నమ్మలేకపోయాను. కానీ, మీడియా వారి నుంచి కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి. దీంతో నా ప్రయత్నాలు ఫలిస్తున్నాయని నాకు అనిపించింది’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారామె. స్కూల్లో విద్యార్థులతో దీప్మాలా పాండే -
ఆ ఎయిర్పోర్ట్కు భగత్ సింగ్ పేరు.. మోదీ కీలక ప్రకటన!
న్యూఢిల్లీ: చండీగఢ్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో వెల్లడించారు. ‘గొప్ప స్వతంత్ర సమరయోధుడికి నివాళులర్పించటంలో భాగంగా.. చండీగఢ్ ఎయిర్పోర్ట్కు షాహీద్ భగత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించాం.’ అని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో సెప్టెంబర్ 28 ఒక ముఖ్యమైన రోజు. ఆ రోజున భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. మన్ కీ బాత్లో భాగంగా వాతావరణ మార్పులు సహా పలు అంశాలపై మాట్లాడారు మోదీ. వాతావరణ మార్పు అనేది జీవావరణ వ్యవస్థకు అతిపెద్ద ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కోవటంలో నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దయాల్ ఉపాధ్యాయ్కు నివాళులర్పించారు మోదీ. ఆయన దేశ మహోన్నతమైన కుమారుడిగా పేర్కొన్నారు. ఇటీవలే భారత్కు చేరుకున్న చీతాలు.. 130 కోట్ల ప్రజలకు గర్వకారణమన్నారు. టాస్క్ఫోర్స్ వాటి పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతోందని, ప్రజల సందర్శన అనుమతులపై వారే నిర్ణయం తీసుకంటారని చెప్పారు. మరోవైపు.. అమరవీరుల పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ చిన్న చూపు చూస్తోందని చెప్పేందుకే బీజేపీ పేరు మార్పునకు పూనకుందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే.. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం భగత్ సింగ్ గ్రామం ఖట్కార్ కలాన్లోనే నిర్వహించారు. భగత్సింగ్ ఉపయోగించిన పసుపు టర్బన్స్ను సూచిస్తూ ప్రాంగణం మొత్తం పసువు రంగులతో నింపేశారు. అలాగే.. మార్చి 23న భగత్ సింగ్ వీరమరణం పొందిన రోజును సెలవుదినంగా ప్రకటించారు. ఇదీ చదవండి: పంజాబ్ సీఎంకు ఊరట.. ప్రత్యేక అసెంబ్లీకి గవర్నర్ ఓకే -
గుజరాత్పై కుట్రలు
భుజ్: గుజరాత్ వరుస ప్రాకృతిక విపత్తులతో అల్లాడుతున్న సమయంలో రాష్ట్రాన్ని దేశంలోనే గాక అంతర్జాతీయంగా కూడా అప్రతిష్టపాలు చేసి పెట్టుబడులు రాకుండా చేసేందుకు చాలా కుట్రలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ వాటన్నింటినీ అధిగమించి పారిశ్రామికంగా, ఇతరత్రా కూడా రాష్ట్రం అద్భుతంగా పురోగమించిందని కొనియాడారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ఆదివారం కచ్ జిల్లాలో రూ.4,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘2001 కచ్ భూకంపం మాటకందని విషాదం. ఆ విలయాన్ని అవకాశంగా మార్చుకుని కచ్ను పునర్నిర్మించుకుంటామని అప్పుడే చెప్పాను. దాన్నిప్పుడు సాధించి చూపించాం. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెక్స్టైల్ ప్లాంట్, ఆసియాలో తొలి సెజ్ తదితరాలకు కచ్ వేదికైంది. దేశ రవాణాలో 30 శాతం ఇక్కడి కాండ్లాం, ముంద్రా పోర్టుల గుండానే జరుగుతోంది. దేశానికి కావాల్సిన ఉప్పు 30 శాతం కచ్లోనే తయారవుతోంది’’ అని మోదీ చెప్పారు. ‘‘భూకంపం వచ్చినప్పుడు నేను గుజరాత్ సీఎంను కాను. సాధారణ బీజేపీ కార్యకర్తను. రెండో రోజే కచ్ చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నా’’ అని గుర్తు చేసుకున్నారు. భూకంపానికి బలైన 13 వేల మందికి స్మృత్యర్థం నిర్మించిన రెండు స్మారకాలను ప్రారంభించారు. ఆ సమయంలో అనేక భావాలు తనను ముప్పిరిగొన్నాయని చెప్పారు. స్మృతి వన్ స్మారకాన్ని అమెరికా ట్విన్ టవర్స్ స్మారకం, జపాన్లోని హిరోషిమా స్మారకంతో పోల్చారు. ఇలాంటి అనుభవాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచిందని చెప్పారు. దాని స్ఫూర్తితోనే కేంద్ర స్థాయిలో అలాంటి చట్టం వచ్చిందన్నారు. అవగాహన పెరగాలి పౌష్టికాహార లోపాన్ని రూపుమాపాలని, నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన మరింత పెరగాలని మోదీ అన్నారు. ఈ దిశగా పోషన్ అభియాన్, జల్ జీవన్ మిషన్ బాగా పని చేస్తున్నాయని చెప్పారు. సెప్టెంబర్ను పౌష్టికాహార నెలగా జరుపుకుంటున్నట్టు గుర్తు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా జరుపుకోవాలన్న భారత ప్రతిపాదనకు ఐరాస అంగీకరించడాన్ని గుర్తు చేశారు. ‘‘ఏళ్లుగా విదేశీ అతిథులకు మన తృణధాన్యపు వంటకాలను రుచి చూపిస్తూ వస్తున్నా. వారంతా వాటి రుచిని ఎంతో ఆస్వాదించారు. ముడి ధాన్యం అనాది కాలం నుంచి మన సాగులో, సంస్కృతితో, నాగరికతలో భాగం’’ అన్నారు. ఈసారి పంద్రాగస్టు ఉత్సవాలను దేశ ప్రజలంతా గొప్ప జోష్తో జరుపుకున్నారంటూ హర్షం వెలిబుచ్చారు. లెక్కలేనన్ని వైరుధ్యాలు, వైవిధ్యాలున్న ఇంత పెద్ద దేశం తాలూకు సమష్టి శక్తి ఎంత బలవత్తరమైనదో ప్రపంచానికి చూపారన్నారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ దేశంలో మూలమూలలా అమృత ధార పారుతోందన్నారు. ఈశాన్య భారతం వంటి మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ వ్యాప్తి కొత్త వెలుగులు తెచ్చిందని చెప్పారు. ‘‘డిజిటల్ ఇండియా ద్వారా వాటికి అభివృద్ధి ద్వారాలు తెరుచుకున్నాయి. ఒకప్పుడు పెద్ద నగరాలకే పరిమితమైన సదుపాయాలు ప్రతి గ్రామానికీ చేరాయి. ఫలితంగా డిజిటల్ పారిశ్రామికవేత్తలు పుట్టుకొస్తున్నారు. అరుణాచల్ప్రదేశ్లోని అత్యంత మారుమూల జోర్సింగ్ గ్రామానికి పంద్రాగస్టు నుంచే 4జీ సేవలందుతున్నాయి’’ అంటూ పలు ఉదాహరణలను ప్రస్తావించారు. సమర యోధుల త్యాగాలను కళ్లముందుంచే స్వరాజ్ సీరియల్ను దూరదర్శన్లో ప్రజలంతా చూడాలన్నారు. 2047కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపొందుతుందని తనకు పూర్తి నమ్మకముందని పునరుద్ఘాటించారు. -
పోషకాహార లోపాన్ని నివారించేందుకు కృషి చేయాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశంలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రజలు కృషి చేయాలని, దానికి సామాజిక అవగాహన కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రతినెల చివరి ఆదివారం నిర్వహించే ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్ స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ‘అమృత్ మహోత్సవ్’ అమృత ధారలు దేశం నలుమూలలా ప్రవహించాయని పేర్కొన్నారు. ‘పండుగలతోపాటు ఈ సారి సెప్టెంబర్ నెలను పోషకాహారంపై ప్రచారానికి అంకితం చేద్దాం. మనం సెప్టెంబర్ 1 నుంచి 30 తేదీ వరకూ ‘షోషణ్ మాహ్’ ( పోషకాహార మాసం)గా పాటిద్దాం. పోషకాహార నివారణకు చాలా సృజనాత్మక, విభిన్నమైన ప్రయత్నాలు చేస్తున్నాం. పోషణ్ అభియాన్లో సాంకేతిక, ప్రజాభాగస్వామ్యాన్ని మెరుగైన పద్ధతుల్లో వాడటం చాలా కీలకం. భారత్లో పోషకాహార లోపాన్ని రూపుమాపడంలో ‘జల్జీవన్ మిషన్’ భారీగా ప్రభావం చూపనుంది. పోషకాహార లోపాన్ని రూపుమాపటంలో సామాజిక అవగాహన కీలక పాత్ర పోషిస్తుంది.’ అని ప్రధాని మోదీ తెలిపారు. దూరదర్శన్లో స్వతంత్ర సమరయోధుల త్యాగాలపై వచ్చే ‘స్వరాజ్’ సీరియల్ను వీక్షించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు ప్రధాని మోదీ. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న యోధుల కృషిని యువతరానికి తెలియజేయడానికి ఇదో గొప్ప ప్రయత్నమన్నారు. ఇదీ చదవండి: బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతిపై సీబీఐ దర్యాప్తు? -
కర్ణాటక: తేనె రైతుకు ప్రధాని మోదీ ప్రశంసలు
సాక్షి, బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్లో కర్ణాటకలో నిర్వహించిన అమృత భారతికి కన్నడ హారతి కార్యక్రమాన్ని అభినందించారు. అలాగే తేనె ఉత్పత్తిలో కరావళి, మలెనాడు, ఉత్తర కన్నడ ప్రాంతాల్లో రైతులు చేస్తున్న కృషిని మోదీ కొనియాడారు. ఉత్తర కన్నడ జిల్లాలోని శిరసి తాలూకాలోని తేనె రైతు మధుకేశ్వర హెగ్డేను ఆయన ప్రస్తావించారు. హెగ్డే కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొంది 50 పెట్టెల తేనెటీగల పెంపకం ప్రారంభించారు. నేడు 800కు పైగా పెట్టెల్లో తేనెపట్లను పెంచుతున్నారు. మధు అంటే తేనె, ఆ పనిలో సాధన చేసి పేరును సార్థకం చేసుకొన్నారని మోదీ ప్రశంసించారు. -
Mann ki Baat:‘త్రివర్ణ పతాకాన్ని మీ ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకోండి’
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 తేదీ వరకు వివిధ సోషల్ మీడియాల్లో తమ ప్రొఫైల్ పిక్చర్గా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 91వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వివిధ అంశాలపై మాట్లాడారు. 75 ఏళ్ల స్వాతంత్య్రానికి గుర్తుగా దేశంలోని 75 రైల్వే స్టేషన్లకు స్వాతంత్య్ర సమరయోదుల పేర్లు పెట్టినట్లు గుర్తు చేశారు. అలాంటి స్టేషన్లను పిల్లలు సందర్శించాలని సూచించారు. ‘దేశం కోసం ప్రాణత్యాగం చేసిన షాహీద్ ఉద్ధమ్ సింగ్ జీకి సంతాపం తెలుపుతున్నాం. ఆజాదీకా అమృత్ మహోత్సవం ఒక ఉద్యమంగా సాగుతుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరు భాగస్వాములై.. ఆగస్టు 2-15 వరకు తమ ప్రొఫైల్ పిక్చర్గా మువ్వన్నెల జెండాను పెట్టుకోవాలి. అలాగే.. ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగమై.. మీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలి.’ అని ప్రజలను కోరారు ప్రధాని మోదీ. హిమాచల్ప్రదేశ్లో జరుగుతున్న మిజార్ మేళాను వీలైతే సందర్శించాలని ప్రజలను కోరారు మోదీ. మరోవైపు.. పీవీ సింధూ, నీరజ్ చోప్రాలకు శుభాకాంక్షలు తెలిపారు. యూకేలోని బర్మింగ్హామ్లో జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు గొప్ప ఆట తీరును ప్రదర్శించాలని ఆకాక్షించారు. ఇదీ చదవండి: Mann Ki Baat: ‘ఎమర్జెన్సీ’లో ప్రజాస్వామ్యాన్ని అణచే యత్నం -
Mann Ki Baat: ‘ఎమర్జెన్సీ’లో ప్రజాస్వామ్యాన్ని అణచే యత్నం
న్యూఢిల్లీ : దేశంలో 1975లో అత్యవసర పరిస్థితులు విధించి ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ప్రయత్నాలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్ నియంతృత్వ పోకడల్ని ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా తిప్పికొట్టారని ప్రపంచంలో మరెక్కడా ఇది కనిపించదని అన్నారు. భారత్కు స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఆదివారం మన్కీ బాత్ కార్యక్రమంలో మరోసారి ప్రధాని మోదీ కాంగ్రెస్ని లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. తిరిగి 1977 మార్చి 21న ఎత్తివేశారు. ఎమర్జెన్సీకి 47 ఏళ్లయిన సందర్భంగా ప్రధాని దాని గురించి ప్రస్తావిస్తూ ఆ చీకటి రోజుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ జీవించే హక్కుని హరించివేసిందని, అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని ప్రభుత్వ తొక్కి పెట్టి ఉంచిందని అప్పటి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చివరికి గాయకుడు కిశోర్ కుమార్ కూడా ఎమర్జెన్సీ చేదు అనుభవాలు ఎదుర్కొ న్నారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం భారత్ అంతరిక్ష రంగంలో చేస్తున్న ప్రయోగాలను ప్రధాని ప్రశంసించారు. ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ: ఏచూరి ప్రధాని మోదీ ఎమర్జెన్సీ వ్యాఖ్యల్ని సీపీఎం నేత సీతారాం ఏచూరి తిప్పికొట్టారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందని అప్పట్లో మాదిరిగానే ప్రజలు దీనిని కూడా ఓడిస్తారని జోస్యం పలికారు. -
'మన్ కీ బాత్'లో మిథాలీ రాజ్ గురించి ప్రస్తావించిన మోదీ
తాజాగా జరిగిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోదీ భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ సారధి మిథాలీ రాజ్ గురించి ప్రస్తావించారు. దేశంలోని యువ అథ్లెట్లకు మిథాలీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. భారత మహిళల క్రికెట్కు మిథాలీ అందించిన సేవలు చిరస్మరణీమని అన్నారు. మిథాలీ అసాధారణ క్రికెటర్ అని, క్రీడలకు సంబంధించి దేశంలోని మహిళలకు ఆమె ఆదర్శప్రాయురాలని ప్రశంసించారు. మహిళల క్రికెట్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవడంలో మిథాలీ కీలకపాత్ర పోషించిందని ఆకాశానికెత్తారు. ఇటీవలే క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, మిథాలీ రాజ్ జూన్ 8న క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 1999 జూన్లో ఐర్లాండ్తో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన మిథాలీ 23 ఏళ్ల కెరీర్లో ఎన్నో రికార్డులను సాధించింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు (7805), అత్యధిక మ్యాచ్లు (232), టెస్ట్ల్లో అతి చిన్న వయస్సులో డబుల్ సెంచరీ.. ఇలా మిథాలీ ఖాతాలో పలు ప్రపంచ రికార్డులు ఉన్నాయి. చదవండి: 30 సార్లు లైంగిక వేధింపులకు గురయ్యాను.. మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సంచలన ఆరోపణలు -
100 మందికి సుకన్య సమృద్ధి యోజన
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగ విరమణతో వచ్చిన సంపాదనతో 100 మందికి సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం వాసి రాంభూ పాల్రెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ అంశాన్ని ఆదివారం మన్కీ బాత్లో ప్రధాని ప్రస్తావించారు. ‘‘సమాజానికి సేవ చేయాలనే మంత్రం మన విలువలు, సంస్కారంలో ఒక భాగం. దేశంలో లెక్కలే నంత మంది ఈ మంత్రాన్ని తమ జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురంలో ఉంటున్న మిత్రుడు రాంభూ పాల్ రెడ్డి గురించి తెలుసుకున్నా. తన రిటైర్మెం ట్ తర్వాత వచ్చిన సంపాదనంతా చదువుకొనే కుమార్తెలకు విరాళంగా ఇచ్చారని తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సుకన్య సమృద్ధి యోజన కింద 100 ఖాతాలు తెరవడంతో పాటు వారికి రూ.25 లక్షలు డిపాజిట్ చేశారు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం యడవల్లికి చెందిన మార్కాపురం రాంభూపాల్రెడ్డి 35 ఏళ్లపాటు ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించి గతేడాది పదవీ విరమణ చేశారు. రిటైర్మెంట్ ద్వారా వచ్చిన రూ.25,71,676 యడవల్లి పోస్టాఫీసులో డిపాజిట్ చేశారు. (క్లిక్: ఇందుకూరు పేట.. కూరగాయల తోట) -
Mann Ki Baat: మన స్టార్టప్లు సూపర్
న్యూఢిల్లీ: భారత స్టార్టప్ కంపెనీలు కరోనా కష్టకాలంలోనూ ఎనలేని సంపదను, విలువను సృష్టించాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘వీటివల్ల చిన్న పట్టణాల నుంచి కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వెలుగులోకి వస్తున్నారు. వినూత్నమైన ఆలోచనలుంటే సంపదను సులువుగా సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు’’ అంటూ కొనియాడారు. ఆదివారం మన్ కీ బాత్లో ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘భారత క్రికెట్ జట్టు బ్యాట్స్మన్ సెంచరీ చేస్తే మనందరికీ ఎంతో ఆనందం కలుగుతుంది. అలాగే మన దేశం స్టార్టప్ల రంగంలో అరుదైన సెంచరీ కొట్టింది. దేశంలో యూనికార్న్ (రూ.7,500 కోట్ల కనీస టర్నోవర్ ఉన్న స్టార్టప్) కంపెనీల సంఖ్య ఈ నెల 5వ తేదీతో 100కు చేరింది. ఇదో గొప్ప మైలురాయి. వీటి సమష్టి విలువ 330 బిలియన్ డాలర్ల కంటే కూడా ఎక్కువ! అంటే, రూ.25 లక్షల కోట్ల పై చిలుకు!! ప్రతి భారతీయునికీ గర్వకారణమిది’’ అన్నారు. ‘‘వీటిల్లో 44 యూనికార్న్లు గతేడాదే వచ్చాయంటే ఆశ్చర్యం కలక్కమానదు. ఈ ఏడాది తొలి 4 నెలల్లోనే 14కు పైగా యూనికార్న్లు ఆవిర్భవించాయి. వచ్చే కొన్నేళ్లలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. భారత యూనికార్న్ల సగటు వార్సిక వృద్ధి రేటు అమెరికా, ఇంగ్లండ్తో సహా అత్యధిక దేశాల కంటే ఎక్కవ. పైగా మన యూనికార్న్లు ఈ కామర్స్, ఫిన్ టెక్, ఎడ్ టెక్, బయో టెక్ వంటి వైవిధ్య రంగాల్లో విస్తరిస్తుండటం మరింత శుభసూచకం. పైగా స్టార్టప్ల ప్రోత్సాహానికి అత్యంత కీలకమైన సమర్థులైన మెంటార్లు విరివిగా అందుబాటులోకి రావడం మరో సానుకూల పరిణామం’’ అన్నారు. వెంబు శ్రీధర్, మదన్ పడాకీ, మీరా షెనాయ్ తదితరులను ఈ సందర్భంగా ఉదాహరించారు. మనసుంటే మార్గముంటుంది మన దేశం విభిన్న భాషలు, యాసలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో సుసంపన్నంగా అలరారుతోందని మోదీ అన్నారు. మన బలానికి, ఐక్యతకు ఈ వైవిధ్యమే మూలమని కొనియాడారు. ‘‘సాధించి తీరాలన్న మనసుంటే మార్గం అదే దొరుకుతుంది. కర్నాటకలో పదో తరగతి పరీక్షల్లో కన్నడ సబ్జెక్టులో 92 మార్కులు సాధించిన కల్పన అనే ఉత్తరాఖండ్ అమ్మాయే ఇందుకు ఉదాహరణ. ఆమెకు మూడో తరగతిలోనే టీబీ సోకింది. ఒక కంటి చూపు కూడా పోయింది. పైగా ఇటీవలి దాకా కన్నడ భాష గురించి అసలేమీ తెలియదు. అయినా మైసూరుకు చెందిన ప్రొఫెసర్ తారామూర్తి ప్రోత్సాహంతో మూడే నెలల్లో కన్నడపై పట్టు సాధించింది. రాజ్యాంగాన్ని సంతాలీ భాషలోకి అనువదించిన పశ్చిమబెంగాల్లోని పురులియాకు చెందిన శ్రీపతి తుడు అనే ప్రొఫెసర్దీ ఇలాంటి స్ఫూర్తి గాథే. అలాగే తంజావూరు స్వయం సహాయక బృందం కళాకారులు నాకు పంపిన అమ్మవారి కళాకృతి ఓ వెలకట్టలేని బహుమానం. ‘ఏక్ భారత్–శ్రేష్ఠ్ భారత్’కు ఇవన్నీ ఉదాహరణలే’’ అన్నారు. స్వయం సహాయక బృందాల ఉత్పత్తులను వాడటం ద్వారా వాటిని ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చార్ధామ్ యాత్రకు భక్తులు ఈసారి భారీగా పోటెత్తుతుండటం పట్ల హర్షం వెలిబుచ్చారు. కేదార్నాథ్ క్షేత్రాన్ని చెత్తాచెదారంతో నింపుతుండటం బాధాకరమన్నారు. పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడటం అందరి బాధ్యతన్నారు. సూర్యోదయాన్ని స్వాగతిస్తూ... ప్రపంచవ్యాప్త రిలే యోగా ప్రపంచ యోగా డేను ఈ జూన్ 21న ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్టు మోదీ ప్రకటించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా ‘మానవాళి కోసం యోగా’ పేరిట దేశవ్యాప్తంగా 75 చోట్ల యోగా డే ఈవెంట్లు జరుగుతాయి. అలాగే గార్డియన్ రింగ్ పేరిట జూన్ 21న రోజు పొడవునా ప్రపంచమంతటా పలు దేశాల్లో సూర్యోదయాన్ని యోగా సాధనతో స్వాగతించనున్నాం. ఇది ఒకరకంగా రిలే యోగా ఈవెంట్గా సాగుతుంది. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు వీటిని చేపడతాయి’’ అని వివరించారు. ‘దేశం, జాతి తదితరాలతో సంబంధం లేకుండా యోగాతో ఎందరో శారీరక, మానసిక, మేధోపరమైన, ఆధ్యాత్మిక ఆరోగ్యాలను సొంతం చేసుకుంటున్నారన్నారు. జపనీయుల్లో భారత్ పట్ల ఉన్న ప్రేమను ఇటీవల ఆ దేశంలో పర్యటన సందర్భంగా సన్నిహితంగా గమనించానని మోదీ చెప్పారు. జపాన్కు చెందిన ప్రఖ్యాత కళా దర్శకుడు హిరోషీ కొయిటే తొమ్మిదేళ్లుగా మహాభారత్ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నట్టు, నాటక ప్రదర్శనలు ఇస్తున్నట్టు తెలిసి ఎంతో సంతోషించా. మరో ఇద్దరు జపనీయులు రామాయణంపై జపనీస్లో యానిమేషన్ ఫిల్మ్ రూపొందించారు’’ అని వివరించారు. -
Azadi Ka Amrit Mahotsav: సూపర్ సెవెన్.. తుఝే సలామ్!
భర్త చనిపోయాడు. అప్పుడు ఆమె వయసు 14 సంవత్సరాలు. ఏమీ దిక్కుతోచని స్థితి. ఎవరో తీసుకెళ్లి కౌసని(ఉత్తరాఖండ్)లోని లక్ష్మీ మహిళా ఆశ్రమంలో చేర్పించారు. అక్కడ ఆమె జీవితం కొత్త మలుపు తీసుకుంది. ఇన్నిరోజులు ఇల్లే లోకంగా ఉన్న తనకు, లోకమే ఆశ్రమంగా పరిచయం అయింది. సమాజసేవ నుంచి పర్యావరణం వరకు ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలిగింది. కోసీ నది పరివాహక ప్రాంతాలలోని గ్రామాల్లో మహిళలు చెట్లు కొట్టేసి వంటచెరుకుగా ఉపయోగించేవారు. ‘ఇలా చేయడం తప్పు’ అని చెప్పకుండా ‘ఇలా చేస్తే మన పర్యావరణానికి ఎంత నష్టమో తెలుసా...’ అంటూ చెప్పేది. అప్పుడు వారు తప్పును తెలుసుకొని తమ అలవాటును మార్చుకున్నారు. ఎవరైనా చెట్లు కొట్టడానికి వస్తే మూకుమ్మడిగా అడ్డుకునేవారు. కొన్నిసార్లు చట్టం చేయలేని పని చైతన్యం తెస్తుంది! ‘కోసీ నదిని రక్షించుకుందాం’ అనే నినాదంతో ఆమె చేసిన ఉద్యమం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆమెను పర్యావరణ పోరాట యోధురాలిగా నిలిపింది. ఆమె పేరు... బసంతిదేవి నాగ్పూర్కు చెందిన ఆ అమ్మాయి చదువులో చురుకేమీ కాదు. అయితే సహాయ కార్యక్రమాలలో పాల్గొనడం, సాహసాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. డిగ్రీ పూర్తయిన తరువాత ఎంబీఏ చేయాలనుకుందిగానీ ‘ఇది నా దారి కాదు’ అనుకోవడం తనను వేరే దారికి తీసుకు వెళ్లింది. యూనిఫామ్ ధరించాలనేది తన కల. ఫైర్ ఇంజనీరింగ్ కోర్స్కు అప్లై చేసింది. నాగ్పుర్లోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజిలో అడ్మిషన్ లభించింది. ఆ కాలేజీలో ప్రవేశం పొందిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పేరు... హర్షిణి కన్హేకర్ ఇండియాలో ఫస్ట్ ఉమన్ ఫైర్ఫైటర్. ‘సాహసం, త్యాగం స్త్రీల రక్తంలోనే ఉంది’ అంటున్న హర్షిణి ఇప్పుడు ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి ఇస్తోంది. ‘ఈ సమయంలో బయటికి వెళ్లడం అవసరమా!’ అన్నారు ఇంట్లోవాళ్లు. ‘మంచిపని చేయడానికి సమయంతో పనిఏమిటి’ అని అన్నది ఆమె. పూనమ్ నౌతియాల్ ఎప్పుడూ అంతే! ఉత్తరాఖండ్లోని బగేశ్వర్లో హెల్త్వర్కర్గా పనిచేసే పూనమ్ వ్యాక్సినేషన్ అనే మహాయజ్ఞంలో అత్యంత చురుకైన పాత్ర నిర్వహించింది. రోజూ పది నుంచి పన్నెండు కిలోమీటర్లకు పైగా మారుమూల గ్రామాలకు నడిచి వెళ్లేది. చెమటలు కక్కుకుంటూ అంతదూరం వెళితే... చాలామంది వ్యాక్సిన్ అంటే విముఖతగా ఉండేవారు. ఆ సమయంలో తాను ఒక టీచరై వారికి పాఠం చెప్పేది. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ప్రాణాలను ఎలా కాపాడుకోవచ్చో చెప్పే పాఠం అది. తల్లిగా మారి బుజ్జగించేది. సహ ఉద్యోగులు డీలా పడితే వారిలో ఉత్సాహం నింపేది. పూనమ్ పేరును మన ప్రధాని ‘మన్ కి బాత్’ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు. ఉద్యోగవిధిని ఉద్యమంలా మార్చిన ఆమె ఎంతోమందికి స్ఫూర్తి. అలెప్పి (కేరళ)కు చెందిన ఆ అమ్మాయి చదువులో ఎప్పుడూ ముందుండేది. తుంబ రాకెట్ లాంచింగ్ స్టేషన్ను చూస్తూ పెరిగిన ఆమెకు అప్పటినుంచి రాకెట్లు, క్షిపణులు అంటే ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తి తనను ఎక్కడి దాకా తీసుకువెళ్లిందంటే ‘మిస్సైల్ ఉమన్ ఆఫ్ ఇండియా’ స్థాయికి చేరుకునేంతగా! ఆమె పేరు... డా. టెన్సి థామస్ ‘ప్రకృతి అద్భుతశక్తులను, అద్భుతమైన ఆలోచనలను మనకు ఇస్తుంది. అభివృద్ధి పేరుతో ప్రకృతిని ధ్వంసం చేయడం అంటే మనల్ని మనం ధ్వంసం చేసుకోవడమే’ అంటారు థామస్. ... వీరు మాత్రమే కాదు 2017లో ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన అన్షు జంజనంప, ఫస్ట్ ప్రొఫెషనల్ ఫిమేల్ స్టాండ్–అప్ పాడ్లర్ (ఇండియా) తన్వీ జగదీష్, సోలోగా అట్లాంటిక్ మహాసముద్రాన్ని క్రాస్ చేసిన యంగెస్ట్ ఫస్ట్ ఉమన్ పైలట్ అరోషి పండిట్ ‘సూపర్ సెవెన్’ (ఉమెన్ ఛేంజ్ మేకర్స్) జాబితాలో ఉన్నారు. ‘ఆజాది కా అమృతోత్సవ్’లో భాగంగా వివిధ రంగాలకు చెంది ఏడుగురు మహిళల కృషి, విజయాలను కళ్లకు కట్టేలా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెబ్సిరీస్ను రూపొందించింది. ఈ వెబ్సిరీస్లు ప్రసిద్ధ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానున్నాయి. చదవండి👉🏾Russia-Ukraine: చెప్పినట్లు వింటావా.. లేదంటే మరో 20 మంది మగాళ్లను తీసుకురమ్మంటావా? -
డిజిటల్ లావాదేవీలు.. రోజుకు రూ. 20వేల కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో రోజుకు రూ. 20వేల కోట్ల విలువైన డిజిటల్ లవాదేవీలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. డిజిటల్ లావాదేవీలు సౌకర్యవంతమైనవే కాకుండా వీటివల్ల నిజాయితీతో కూడిన వ్యాపార వాతావరణం పెరుగుతోందన్నారు. ఆదివారం ఆయన మన్ కీ బాత్లో ప్రసంగించారు. చిన్న చిన్న ఆన్లైన్ పేమెంట్లు భారీ డిజిటల్ ఎకానమీ నిర్మాణానికి ఉపయోగపడుతున్నాయని, ఫిన్టెక్ స్టార్టప్స్ ముందుకు వస్తున్నాయని తెలిపారు. డిజిటల్ చెల్లింపుల అనుభవాలను ఇతరులతో పంచుకోవాలని ప్రజలను కోరారు. మార్చిలో యూపీఐ లావాదేవీలు రూ. 10 లక్షల కోట్లను చేరాయని చెప్పారు. పలు రంగాల్లో దివ్యాంగులు తమ సత్తా చాటుతున్నారని ప్రశంసించారు. రాబోయే పండుగల సందర్భంగా ప్రజలంతా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎండాకాలంలో నీటి సంరక్షణ అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. పరీక్షాపే చర్చలో కొందరు పిల్లలకు లెక్కల గురించి కొంచెం భయమున్నట్లు గమనించానని, గణితశాస్త్రంలో మన దేశానికి ఎంతో జ్ఞానం ఉందని చెప్పారు. భారత్ సున్నాను ప్రపంచానికి గుర్తు చేసిందని, మన విజ్ఞానంలో గణితం ఒక భాగమని, అందువల్ల లెక్కల గురించి భయపడవద్దని పిల్లలకు సూచించారు. -
ఇది నారాయణుడి సేవ
వేసవి మండుతోంది. ప్రధాని మొన్న తన ‘మన్ కీ బాత్’లో నారాయణన్ని దేశానికి గుర్తు చేశారు. పక్షులకు గుప్పెడు గింజలు వేయకపోయినా అవి ఎలాగో బతికేస్తాయి. కాని ఈ వేసవిలో నీళ్లు లేకపోతే విలవిలలాడతాయి. సొంత ఖర్చుతో ఇంటింటికి మట్టి పాత్రలు పంచి పిట్టలకు నీరు పెట్టమని కోరిన శ్రీరామ్ నారాయణన్ అంత కాకపోయినా కొంతైనా మనం చేయొచ్చు. నరుడి సేవ నారాయణుడి సేవ. అలాగే పక్షులకు నీటి సేవ కూడా. ఈ వేసవిలో ఆత్మసంతృప్తినిచ్చే ఈ పని చేద్దామా? మనుషులు వేసవి వస్తే తమ కోసం చలివేంద్రాలు పెట్టుకుంటారు. చల్లటి నీటి కుండల దగ్గర ఆగి కోరినంత నీళ్లు తాగుతారు. వీలైన వాళ్లు తమ వెంట ఎప్పుడూ నీళ్ల బాటిల్ పెట్టుకుంటారు. మరి జంతువులు, పక్షులు ఏం చేయాలి? వేసవి వస్తే అడవుల్లో కుంటలు ఎండిపోతాయి. వాగులు వంకలు మాడిపోతాయి. ఊళ్లల్లో, రోడ్ల మీద ఎక్కడా నీటి చుక్క కనిపించదు. అడవుల్లోని జంతువుల కోసం అటవీ శాఖ ట్యాంకర్లతో నీళ్లు నింపుతుంది. కాని మనిషితో కలిసి సహజీవనం చేసే పట్టణ విహంగాలు... కాకులు, పావురాలు, పిచ్చుకలు, గోరువంకలు, గువ్వలు... ఇంకా లెక్కలేనన్ని పిట్టలు దప్పిక తీర్చుకోవాలి కదా. వాటి దాహం సంగతి? పాతకాలానికి ఇప్పటి కాలానికి తేడా పాత కాలంలో బావులు ఆరుబయట ఉండేవి. వాటి పక్కనే నీటి తొట్టెలు నింపి ఉండేవి. లేదా ఇంటి పనులన్నీ పెరళ్లల్లో సాగేవి. అందుకోసమని వాడుకునేందుకు నీళ్లు కుండల్లోనో గంగాళాల్లోనో ఉండేవి లేదా పశువులున్న ఇళ్లలో కుడితి తొట్టెలు కాకుండా వేసవిలో ఒక తొట్టెనిండా నీళ్లు నింపి ఉండేవి. కాని ఇప్పుడు పల్లెల్లో తప్ప ఈ కార్యకలాపాలన్నీ టౌన్లలో నగరాల్లో నాలుగు గోడల లోపలికి మారాయి. మట్టి, నీళ్ల తడి కనిపించే పెరళ్లు లేవు. ఇక నగరాల్లో అయితే బాల్కనీల్లోని వాష్ ఏరియా దగ్గరకు కూడా రాకుండా తెరలు కట్టిన గ్రిల్స్ ఉంటాయి. మరి ఎండకు పక్షులు నీళ్లు ఎలా తాగాలి? అడుగున నీళ్లున్న కుండ అంచుపై వాలి రాళ్లు జార విడిచి నీళ్లు పైకి రాగా తెలివిగా తాగి వెళ్లిన కథలోని కాకి ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలి? నారాయణన్ ఏం చేశాడు? కేరళ ఎర్నాకుళం జిల్లాలో కలంశెర్రి ఊరికి దగ్గరగా ఉండే మూపతాడంలో ఉండే శ్రీరామ్ నారాయణన్కు పదేళ్ల క్రితం ఈ సందేహం వచ్చింది. వేసవిలో అల్లాడుతున్న పక్షులకు నీళ్లు ఎవరు ఇవ్వాలి? ఎవరో ఎందుకు నేనే ఇవ్వాలి అనుకున్నాడు. వెంటనే సొంత డబ్బుతో మట్టి పాత్రలు తయారు చేసి ఇంటింటికి పంచసాగాడు. ‘ఇవి మీ ఇంటి బయట పెట్టి నీళ్లు నింపండి. పక్షులు తాగుతాయి’ అని అభ్యర్థించాడు. సాధారణంగా మనుషులు మంచివాళ్లే. ఎవరైనా మంచి మాట చెప్తే చేయడానికి వెనుకాడరు. నారాయణన్ ఐడియా అందరికీ నచ్చింది. అతనిచ్చిన మట్టి పాత్రల్లో నీళ్లు నింపి బాల్కనీ గోడల మీద, బయటి గోడల మీద, టెర్రస్ల మీద పెట్టసాగారు. పిట్టలు వాలి వాటిలో తమ ముక్కుల్ని ముంచి తాగడం సంతోషంతో చూశారు. నీళ్లు ఉన్న చోట పిట్టలు నిస్సంకోచంగా వాలి మీటింగ్ పెట్టుకునేవి. కొన్ని జలకాలాడేవి. ఈ మనోహర దృశ్యాలన్నీ నారాయణన్ పెట్టిన భిక్షే. ఇప్పటికి దాదాపు లక్ష పాత్రలు తొమ్మిదేళ్లుగా ఈ మట్టి పాత్రలు పంచుతున్న నారాయణన్ గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ఈ పని చేస్తున్నాడు. తన ఊరిలో ఎప్పటి నుంచో ఆయన తన సొంత ఖర్చులతో గాంధీజీ ఆత్మకథ ‘సత్యశోధన’ పంచుతూ ఉన్నాడు. అతను రచయిత కూడా. పిల్లల కోసం కవితలు రాశాడు. అతడున్న ప్రాంతంలో పారిశ్రామిక కేంద్రాలున్నాయి. దాంతో అక్కడ ప్రవహించే పెరియార్ నది కాలుష్యం అవుతూ ఉంటుంది. ఆ కాలుష్యానికి వ్యతిరేకంగా పుస్తకం రాశాడు. అదే దారిలో పక్షులకు నీళ్లు పెట్టే పాత్రల పంపిణీ మొదలెట్టాడు. ఇప్పటికి పది లక్షల సొంత డబ్బు ఇందుకు ఖర్చు పెట్టాడు. నారాయణన్కు హోల్సేల్ లాటరీ ఏజెన్సీ ఉంది. ఊళ్లో చిన్న హోటల్ ఉంది. వాటి మీద వచ్చే ఆదాయం ఇందుకు ఖర్చు పెడతాడు. ‘నాకు ముగ్గురు కూతుళ్లు. నా భార్య చనిపోతే పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశాను. వాళ్లంతా జీవితాల్లో హ్యాపీగా ఉన్నారు. వర్తమానం ధ్వంసం అవుతుంటే భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవడం నాకు నచ్చలేదు. అందుకే ఇలాంటి పనులకు ఖర్చు పెడుతున్నాను’ అంటాడు. ఈ నారాయణనే సొంత డబ్బుతో మొక్కలు పంచి ప్రతి ఇంట్లో ఒక చెట్టుకు కాసే పండ్లను పక్షులకు వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంటాడు. నారాయణన్ చేస్తున్న పనులు అందరూ చేయదగ్గవే. అందరూ చేయకపోవడం వల్లే చేసిన అతని గురించి ఇలా రాయాల్సి వస్తోంది. పక్షులకు నీళ్లు పెట్టడం వార్త. ఒక మొక్క పెంచడం వార్త అవుతున్నాయి. మనం నివసించే ఈ నేలకు మనకు తోడైన జీవరాశిని కాపాడుకోవడం మన విధి. ఈ వేసవి పక్షులకు చల్లగా గడిచేలా చూద్దాం. శ్రీరామ్ నారాయణన్ పంచిన మట్టిపాత్రలతో కాలనీవాసులు -
మన ఎగుమతులు భేష్
న్యూఢిల్లీ/సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల (రూ.30 లక్షల కోట్లు) విలువైన ఎగుమతుల లక్ష్యాన్ని భారత్ సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన ఉత్పత్తులకు ప్రపంచమంతటా డిమాండ్ పెరుగుతోందనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ వస్తువుల కోసం దేశాలు ఎదురు చూస్తున్నాయని, మన సప్లై చైన్ రోజురోజుకూ మరింత శక్తివంతంగా మారుతోందని అన్నారు. ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదాన్ని ప్రతి భారతీయుడు అందిపుచ్చుకుంటే లోకల్ గ్లోబల్గా మారడానికి ఎక్కువ సమయం పట్టదని చెప్పారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఏడాదిగా ప్రభుత్వం ఈ–మార్కెట్ ద్వారా రూ.లక్ష కోట్లకుపైగా విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసిందన్నారు. 1.25 లక్షల మంది చిన్నతరహా వ్యాపారవేత్తలు, దుకాణదారులు తమ ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించారని తెలిపారు. గతంలో బడా వ్యాపారులే ప్రభుత్వానికి సరుకులను విక్రయించే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు చిన్న వ్యాపారులు, దుకాణదారులకు కూడా ఆ అవకాశం లభిస్తోందని వెల్లడించారు. భారతీయులంతా చేతులు కలిపితే ఆత్మనిర్భర్భారత్ లక్ష్యసాధన సులువేనన్నారు. ఆయుష్కు అద్భుత అవకాశాలు ఆయుష్ ఉత్పత్తులకు మార్కెట్ విస్తరిస్తుండడం సంతోషకరమని మోదీ చెప్పారు. ఈ రంగంలో స్టార్టప్లకు అద్భుత అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయుష్ పరిశ్రమ మార్కెట్ విలువ రూ.22,000 కోట్ల నుంచి రూ.1.4 లక్షల కోట్లకు చేరిందన్నారు. మన ఉత్పత్తుల ప్రతిష్టను, గిరాకీని మరింత పెంచుకొనేలా కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. 126 ఏళ్ల వయసులో పద్మశ్రీ అందుకున్న యోగా గురువు స్వామి శివానంద జీవితం నుంచి దేశం ఎంతో స్ఫూర్తిని పొందుతోందని మోదీ అన్నారు. ప్రతి చుక్కనూ ఆదా చేసుకోవాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవరాలు నిర్మించుకోవాలన్నారు. ఏప్రిల్ 1న పరీక్షా పే చర్చ ఏప్రిల్ 1న ఢిల్లీ తల్కటోరా స్టేడియంలో ‘పరీక్షా పే చర్చ’లో మోదీ విద్యార్థులతో స్వయంగా మాట్లాడనున్నారు. పరీక్షల పండుగ జరుపుకుందామంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ మెట్ల బావి ప్రస్తావన తెలంగాణలోని సికింద్రాబాద్లో ఇటీవల బయటపడిన మెట్ల బావి గురించి మన్కీ బాత్లో ప్రధాని ప్రస్తావించారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన మెట్లబావి పునరుద్ధరణకు ప్రజలు చూపిన చొరవను అభినందించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, చిత్తూరు జిల్లాల నుంచి బంగినపల్లి, సువర్ణరేఖ మామిడి పండ్లు దక్షిణ కొరియాకు కూడా ఎగుమతి అవుతున్నాయంటూ ఆయన ప్రశంసించారు. -
సగర్వంగా మాతృభాషలో మాట్లాడండి
న్యూఢిల్లీ: ప్రజలు సగర్వంగా తమ మాతృభాషల్లోనే మాట్లాడుకోవాలని ప్రధాని మోదీ కోరారు. భాషల సంపన్నతలో మనకు సాటి మరెవరూ లేరన్నారు. ప్రజాదరణ పొందిన పలు భారతీయ గీతాలను వివిధ భాషల్లో వీడియోలుగా రూపొందించి, వాటిని ప్రాచుర్యంలోకి తెచ్చి, దేశ భిన్నత్వాన్ని కొత్త తరానికి పరిచయం చేయాలని ప్రధాని యువతకు పిలుపునిచ్చారు. జాతీయ గీతం సహా పలు భారతీయ గీతాలకు అనుగుణంగా పెదాలు కదుపుతూ(లిప్ సింకింగ్) తయారు చేసిన వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న టాంజానియాకు చెందిన కవలలు కిలి పౌల్, నీమాలను ఆయన ఉదహరించారు. ఆదివారం ప్రధాని ‘మన్కీ బాత్’లో దేశ ప్రజలద్దేశించి మాట్లాడుతూ ఇటీవల జరుపుకున్న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ పైమాటలన్నారు. దేశంలో 121 మాతృభాషలుండగా, వీటిలో 14 భాషలను కోటి మందికి పైగా ప్రజలు నిత్యం మాట్లాడుతున్నారన్నారు. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో హిందీకి మూడో స్థానం దక్కిందని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయిన తర్వాత కూడా చాలా మంది దేశవాసుల్లో ఇప్పటికీ వేషభాషలు, ఆహార పానీయాలకు సంబంధించి అపోహలు, అభ్యంతరాలు ఉన్నాయన్నారు. నూతన విద్యా విధానంలో స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ప్రొఫెషనల్ కోర్సులను ప్రాంతీయ భాషల్లో బోధించేందుకు కృషి జరుగుతోందన్నారు. బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్, టాంజానియా మాజీ ప్రధాని ఒడింగా కూతురు రోజ్మేరీ వంటి వారు మన ఆయుర్వేద విధానం పట్ల మక్కువ పెంచుకున్నారన్నారు. దేశంలో ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించేందుకు ఆయుష్ శాఖను ఏర్పాటు చేశామన్నారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని జరుపుకోవాలన్న ప్రధాని మోదీ.. పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులు కల్పించేందుకు, వివిధ రంగాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు పురుషులతో సమానంగా మహిళల వివాహ వయస్సును పెంచినట్లు చెప్పారు. ట్రిపుల్ తలాక్ వంటి సామాజిక దురాచారాలనూ రూపుమాపాం. ట్రిపుల్ తలాక్పై చట్టం తీసుకువచ్చాక దేశంలో ట్రిపుల్ తలాక్ కేసుల్లో 80% తగ్గుదల కనిపించిందన్నారు. మార్పు కోరుతూ మహిళలు ముందుకు రావడమే ఈ పరిణామానికి కారణమైందన్నారు. అస్సాంలోని కోక్రాఝర్, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం, రాజస్తాన్లోని సవాయ్ మాధోపూర్, జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లలో పర్యావరణ పరిరక్షణకు, పరిసరాల పరిశుభ్రతకు జరుగుతున్న కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు. -
PM Modi Mann Ki Baat: స్వీయ అప్రమత్తతే దేశానికి బలం
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాధికారక కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను భారత్ ఓడించాలంటే పౌరులంతా స్వీయ క్రమశిక్షణతో, అప్రమత్తతో వ్యవహరించాలని ప్రధాని మోదీ హితవు పలికారు. వైరస్పై యుద్ధంలో పై చేయి సాధించాలంటే పౌరుల వ్యక్తిగత అప్రమత్తతే అసలైన బలమని ఆయన వ్యాఖ్యానించారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రేడియోలో ప్రధాని మోదీ దేశంలోని తాజా స్థితిగతులపై తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాల్లో కొన్ని.. ► ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న టీకా ప్రక్రియలతో పోలిస్తే భారత్ కోవిడ్ వ్యాక్సినేషన్ రేటులో అద్భుతమైన పురోగతిని సాధించింది. అయినాసరే, ప్రజలు ఒమిక్రాన్ విషయంలో జాగ్రత్తవహించాల్సిందే. ►ఒమిక్రాన్ గుట్టుమట్లను తెల్సుకునేందుకు మన శాస్త్రవేత్తలు అనుక్షణం పరిశోధనలు కొనసాగిస్తున్నారు. దీంతో అందివస్తున్న కొత్త విషయాలు, సమాచారానికి తగ్గట్లు కేంద్రప్రభుత్వం సైతం తగు చర్యలకు పూనుకుంటోంది ►మహమ్మారిగా పరిణమించిన కోవిడ్ను ఎదుర్కోవడంలో 2019 నుంచీ మన రెండేళ్ల అనుభవం ఎంతగానో దోహదపడుతోంది. అందుకే ‘దేశ ఆరోగ్య పరిస్థితి’చేయిదాటిపోకుండా అడ్డుకోగలిగాం. ఇదంతా మన సమష్టి కృషి ఫలితమే. ఇంతే బాధ్యతాయుతంగా ఉంటూ 2022 కొత్త ఏడాదిలోకి అడుగుపెడదాం. ►వ్యాక్సినేషన్లో 141 కోట్ల మైలురాయిని దాటేశాం. ఇదంతా ప్రతీ ఒక్క భారతీయుడి విజయం. వ్యవస్థపై, శాస్త్రంపై, శాస్త్రవేత్తలపై భారతీయులు పెట్టుకున్న విశ్వాసానికి నిదర్శనం. ►ప్రతీ ఏడాదిలాగే ఈసారీ ‘పరీక్షా పే చర్చ’కార్యక్రమం ద్వారా ప్రతీ విద్యార్థితో మాట్లాడతాను. Myజౌఠి. జీn ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోండి. ► భిన్నజీవ జాతులకు నెలవైన అరుణాచల్ ప్రదేశ్లో పక్షుల వేటను ఆపేస్తూ ఎయిర్గన్లను ప్రజలు స్వచ్ఛందంగా త్యజించడం గొప్ప మార్పు. ►కూనూర్లో వాయుసేన హెలికాప్టర్ కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడి తుదివరకు పోరాడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్.. శౌర్య చక్ర వంటి పురస్కారాలు సాధించినా తన మూలాలను మర్చిపోలేదు. తన పాఠశాల విద్యకు సంబంధించిన వివరాలతో వరుణ్ సింగ్ రాసిన ఉత్తరాన్ని మోదీ గుర్తుచేశారు. -
అధికారం కాదు... ప్రజాసేవే లక్ష్యం
న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ ప్రపంచ దేశాల్లో విస్తరిస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతీ ఒక్కరూ కోవిడ్ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని అన్నారు. కరోనా సంక్షోభం ఇంకా ముగిసిపోలేదన్న ఆయన వ్యక్తిగత స్థాయిలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ఆదివారం ఆకాశవాణి మన్ కీ బాత్ 83వ సంచికలో ప్రధాని మోదీ మాట్లాడుతూ తనకు అధికారం అక్కర్లేదని, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుడు ఒకరు మోదీ ఎప్పటికీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పగా ప్రధాన సేవకుడిగా దేశ ప్రజలందరికీ సేవ చేయడమే తన కర్తవ్యమని అన్నారు. ‘‘వాస్తవానికి నేను ఇప్పుడు కూడా అధికారంలో లేను. భవిష్యత్తులో కూడా ఉండను. ప్రజా సేవలో ఉండాలన్నదే నా లక్ష్యం. ఒక ప్రధానమంత్రిగా నేను చెలాయిస్తున్నది అధికారం కాదు. ఇదంతా ప్రజాసేవే’’ అని బదులిచ్చారు. ప్రస్తుతం నడుస్తున్నది స్టార్టప్ల యుగమని ప్రధాని మోదీ అన్నారు. భారత్లో స్టార్టప్ పరిశ్రమ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తోందని కొనియాడారు. దేశంలో 100 కోట్ల డాలర్ల విలువను కలిగిఉన్న స్టార్టప్లు ప్రస్తుతం 70కి పైగా ఉన్నాయని వెల్లడించారు. దేశంలోని పల్లెల్లో యువత కూడా స్టార్టప్లు ఏర్పాటు చేసి అంతర్జాతీయ సమస్యలకి పరి ష్కార మార్గాలు చూపిస్తున్నారని మోదీ అన్నా రు. కరోనాతో ప్రపంచ దేశాలు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా తల్లడిల్లుతూ ఉంటే మన స్టార్టప్ రంగం ఎంతో ఎత్తుకి ఎదిగిందని చెప్పారు. 1971 యుద్ధానికి గోల్డెన్ జూబ్లీ డిసెంబర్ మాసం వచ్చిందంటే తనకి వీర సైనికులు గుర్తుకు వస్తారని ప్రధాని అన్నారు. నేవీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ డేని ఇప్పటికే జరుపుకున్నామని 1971లో పాకిస్తాన్పై యుద్ధంలో విజేతలుగా నిలిచి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. వీర సైనికుల్ని కన్న తల్లులకు మోదీ జోహార్లు అర్పించారు. -
స్టార్టప్ రంగంలో భారత్ అగ్రస్థానం: మోదీ
ప్రస్తుతం ప్రపంచంలో స్టార్టప్ల యుగం నడుస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో అన్నారు. ఈ స్టార్టప్ రంగంలో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహిస్తోంది అని అన్నారు. దేశంలో గల 70కి పైగా స్టార్టప్ల విలువ 1 బిలియన్ డాలర్లను దాటాయి అని తెలిపారు. యువత జనాభా అధికంగా ఉన్న ఏ దేశంలోనైనా, మూడు అంశాలు- ఆలోచనలు-ఆవిష్కరణలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, ఏదైనా చేయగలమనే స్ఫూర్తి చాలా ముఖ్యమైనవని అని "మన్ కీ బాత్" రేడియో కార్యక్రమంలో మోదీ అన్నారు. ఈ మూడు విషయాలు కలిసి వచ్చినప్పుడు, అపూర్వమైన ఫలితాలు వస్తాయని, అద్భుతాలు జరుగుతాయని పేర్కొన్నారు. "ఈ రోజుల్లో మన చుట్టూ స్టార్టప్, స్టార్టప్, స్టార్టప్ వింటాము. ఇది స్టార్టప్ల శకం, ఈ స్టార్టప్ల రంగంలో ఒక విధంగా భారతదేశం ప్రపంచాన్ని నడిపిస్తోంది అనేది కూడా నిజం" అని మోదీ అన్నారు. ప్రతి ఏడాది స్టార్టప్లు రికార్డు స్థాయిలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయని, ఈ రంగం వేగంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. "దేశంలోని చిన్న నగరాల్లో కూడా స్టార్టప్ల వ్యాప్తి పెరిగింది. ఈ రోజుల్లో యునికార్న్ అనే పదం చాలా చర్చలో ఉంది. యునికార్న్ స్టార్టప్ల విలువ ఒక బిలియన్ డాలర్లు(సుమారు రూ.7,000 కోట్లు)" అని మోడీ అన్నారు. (చదవండి: పెన్షనర్లకు హై అలర్ట్.. ! రెండు రోజులే గడువు..లేదంటే..) "2015 సంవత్సరం వరకు దేశంలో 9 నుంచి పది యునికార్న్స్ ఉండేవి, ఇప్పుడు భారతదేశం యునికార్న్స్ పరంగా ప్రపంచంలో అగ్రగామిగా ఉంది అనే విషయం తెలుసుకుంటే మీరు చాలా సంతోషిస్తారు. ఒక నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం 10 నెలల్లో ప్రతి 10 రోజులకు భారతదేశంలో ఒక స్టార్టప్ యునికార్న్ గా మారింది" అని ఆయన చెప్పారు. కోవిడ్ మహమ్మారి వంటి కష్ట కాలంలో దేశంలోని యువత ఈ గొప్ప విజయాన్ని సాధించారని ఆయన అన్నారు. "నేడు, భారతదేశంలో 70కి పైగా యునికార్న్స్ ఉన్నాయి అని, వీటి విలువ 1 బిలియన్ డాలర్లను దాటాయి" అని మోడీ అన్నారు. -
ఆ ఉద్యోగాలు కేవలం పురుషులకే అన్న అభిప్రాయానికి కాలం చెల్లింది: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: పోలీసు శాఖలో మహిళల సంఖ్య పెరుగుతుండడం శుభ పరిణామమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో 2014 నుంచి 2020 మధ్య మహిళా పోలీసుల సంఖ్య రెట్టింపయ్యిందని అన్నారు. భవిష్యత్తులో కొత్త తరం పోలీస్ వ్యవస్థను వారే ముందుండి నడిపిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సైన్యం, పోలీసు శాఖ కేవలం పురుషులకే అన్న పాతకాలపు అభిప్రాయానికి కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు. 2014లో దేశవ్యాప్తంగా 1.05 లక్షల మంది మహిళా పోలీసులు ఉండగా, 2020 నాటికి 2.15 లక్షలకు చేరినట్లు ‘బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్’ గణాంకాలు వెల్లడిస్తున్నాయని గుర్తుచేశారు. గత ఏడేళ్లలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు దళాల్లోనూ మహిళల సంఖ్య రెండింతలు పెరిగిందన్నారు. కఠినమైన శిక్షణ పొంది కోబ్రా బెటాలియన్, సీఆర్పీఎఫ్ యూనిట్లలో సైతం పనిచేసేందుకు యువతులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారని ప్రశంసించారు. ఇది మన సమాజంపై సానుకూల ప్రభావం చూపుతోందన్నారు. మెట్రో స్టేషన్లు, ఎయిర్పోర్టులు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా భద్రతా సిబ్బంది పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారని వివరించారు. మహిళా పోలీసులు బాలికలకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దు 100 కోట్ల డోసుల కరోనా టీకా పంపిణీ పూర్తి కావడంతో దేశం కొత్త ఉత్సాహం, వేగంతో ముందుకు దూసుకెళుతోందని మోదీ అన్నారు. మనదేశం ఎప్పుడూ విశ్వశాంతి కోసం పాటుపాడుతూనే ఉందని తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని ప్రధాని ప్రజలను కోరారు. -
నేడు ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్య క్రమం
-
PM Modi: వ్యాక్సిన్ ఒక సురక్ష చక్రం
న్యూఢిల్లీ: దసరా, దీపావళి దగ్గరకొస్తున్న నేపథ్యంలో ఈ పండుగ సీజన్లో కోవిడ్–19 నిబంధనలు అందరూ పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం రేడియో కార్యక్రమం మన్కీ బాత్ 81వ ఎడిషన్లో ఆయన మాట్లాడారు. పండుగలొస్తున్న సమయంలోనే కోవిడ్–19పై పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగించాలన్నారు. ‘‘భారత్ వ్యాక్సినేషన్లో ప్రతీ రోజూ ఒక సరికొత్త రికార్డు సాధిస్తోంది. అంతర్జాతీయ రికార్డులు కూడా బద్దలు కొట్టింది. కరోనా నుంచి రక్షణనిచ్చేది వ్యాక్సిన్ మాత్రమే’’అని మోదీ అన్నారు.‘వ్యాక్సిన్ అన్నది ఒక సురక్ష చక్రం వంటిది. మీ చుట్టు పక్కల వారికి టీకా వేయించాల్సిన బాధ్యత మీదే. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కోవిడ్ నిబంధనలు పాటించాలి’’అని ప్రధాని చెప్పారు. ఈసారి మోదీ ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నదుల పరిశుభ్రత, డిజిటల్ లావాదేవీలు, స్వచ్ఛభారత్ వంటి అంశాలపై మాట్లాడారు. మోదీ అమెరికా పర్యటనకు ముందే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రికార్డు చేశారు. టెక్నాలజీతో అవినీతికి అడ్డుకట్ట నిరుపేదల కోసం టాయిలెట్లు నిర్మించి స్వచ్ఛభారత్ కోసం ఎలా పోరాడామో ఆర్థిక రంగం స్వచ్ఛంగా ఉండేలా, నిరుపేదల కోసం కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా ఉండడానికి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. జన్ధన్ ఖాతాల్లో లబి్ధదారులకు నేరుగా డబ్బు జమ అవుతూ ఉండడంతో దిగువ స్థాయిలో అవినీతిని కట్టడి చేశామన్నారు. ప్రస్తుతం మారుమూల పల్లెల్లో కూడా ప్రతీ ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే వంటి టెక్నాలజీతో యూపీఐ లావాదేవీలు జరుపుతున్నారని చెప్పారు. ఆగస్టు నెలలో 355 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగాయని వెల్లడించారు. రోజుకి సగటున 6 లక్షల కోట్ల నగదు లావాదేవీలు యూపీఐ ద్వారా జరుగుతున్నాయని, డిజిటల్ ఎకానమీ పారదర్శకత, స్వచ్ఛతకు ప్రతీక అని అన్నారు. సెంట్రల్ విస్టా సందర్శన కొత్త పార్లమెంటు నిర్మాణ స్థలాన్ని ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. పనుల్లో నిమగ్నమై ఉన్న కారి్మకులతో మాట్లాడి, నిర్మాణం సాగుతున్న తీరును తెలుసుకున్నారు. 2022 శీతాకాల సమావేశాలను కొత్త పార్లమెంటులో నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సెంట్రల్ విస్టాలో భాగంగా కొత్త పార్లమెంటు భవనంతో పాటు ప్రధాని, ఉపరాష్ట్రపతుల నివాసాలు, పలు ప్రభుత్వ కార్యాలయాల భవనాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. -
రొటీన్గా చెయ్యాలని అనుకోవడం లేదు..
న్యూఢిల్లీ: కోవిడ్–19 విజృంభిస్తున్న ఈ సమయంలో దేశ ప్రజలందరూ కచ్చితంగా స్వచ్ఛ భారత్ పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇప్పటివరకు 62 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగిందని అయినప్పటికీ అందరూ ఈ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ప్రతీ నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో మన్కీ బాత్ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రధాని ఆదివారం 80వ ఎపిసోడ్లో మాట్లాడారు. స్వచ్ఛభారత్ అనగానే అందరికీ ఇండోర్ నగరమే మదిలోకి వస్తుందని, పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడంతో ఈ నగర ప్రజలు సంతృప్తి చెందలేదన్నారు. నీటి సంరక్షణలో కూడా అద్భుతాలు సాధించి దేశంలోనే తొలి వాటర్ ప్లస్ నగరంగా ఆవిర్భవించిందని అన్నారు. యువతరం మారుతోంది దేశంలో యువత ఏదో ఒకటి రొటీన్గా చెయ్యాలని అనుకోవడం లేదని, ఎంత రిస్క్ అయినా తీసుకుంటున్నారని ప్రధాని అన్నారు. వారి ఆలోచన దృక్పథంలో ఎంతో మార్పు వచ్చిందని, ఏదైనా సృజనాత్మకంగా చేయాలని భావిస్తున్నారని చెప్పారు. భారతదేశంలో స్టార్టప్ సంస్కృతి చాలా శక్తివంతమైనదిగా మారిందని, చిన్న నగరాల్లోని యువకులూ స్టార్టప్లను ప్రారంభిస్తున్నారని మోదీ అన్నారు. ఇది దేశ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతమని తెలిపారు. టోక్యో ఒలింపిక్స్లో హాకీ టీమ్ సాధించిన విజయాన్ని ఆయన కొనియాడారు. ‘‘ఇవాళ మేజర్ ధ్యానచంద్ జయంతి. ఆయన స్మృత్యర్థం జాతీయ క్రీడాదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఒలింపిక్స్లో గెలుచుకున్న ప్రతీ పతకం ఎంతో విలువైనది. హాకీలో పతకం కొట్టగానే దేశమంతా ఉప్పొంగిపోయింది. మేజర్ ధ్యాన్చంద్జీ కూడా సంతోష పడే ఉంటారు’’అని వ్యాఖ్యానించారు. క్రీడారంగంలో యువత ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారని, స్టార్టప్ల ఏర్పాటులో తలమునుకలై ఉన్నారని కొనియాడారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుదాం భారత సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవని, యావత్ ప్రపంచం వాటికే దాసోహం అంటోందని ప్రధాని అన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. ‘‘సంస్కృతం చాలా సులభంగా.. ఎంతో తియ్యగా ఉంటుంది. విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. జాతీయ ఐక్యతను కాపాడుతుంది’’అని పేర్కొన్నారు. థాయ్లాండ్, ఐర్లాండ్ దేశాల్లో సంస్కృతానికి ప్రాచుర్యం కల్పించడానికి ఎందరో కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. -
‘క్రీడల పట్ల మనం చూపించే అభిమానమే ధ్యాన్చంద్కు గొప్పనివాళి’
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో.. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా.. భారత్ దిగ్గజ హకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్కు ఘన నివాళులు అర్పించారు. క్రీడల పట్ల మనం చూపించే అభిమానమే ధ్యాన్చంద్కు గొప్ప నివాళి అని పేర్కొన్నారు. అందరి భాగస్వామ్యంతోనే భారత్ క్రీడల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుందని అన్నారు. కాగా, టోక్యో ఒలింపిక్స్లో భారత్ క్రీడాకారులు విశేషమైన ప్రతిభ కనబర్చారని అన్నారు. సాధించిన 7 పతకాలలో.. హకీ విభాగంలో ఒక పతకం గెలుచుకున్నామని తెలిపారు. ఇదే స్పూర్తిని భవిష్యత్లో కూడా కొనసాగించాలని అన్నారు. చదవండి: త్వరలో సిద్ధూ, అమరీందర్లతో రావత్ చర్చలు -
చేతులు కలుపుదాం.. కలిసి సాగుదాం
న్యూఢిల్లీ: అమృత్ మహోత్సవ్ సందర్భంగా ‘నేషన్ ఫస్ట్.. ఆల్వేస్ ఫస్ట్’అనే నినాదంతో దేశ ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం ‘మన్ కీ బాత్’కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. టోక్యో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మన క్రీడాకారులు విజయులై తిరిగిరావాలని ఆకాంక్షించారు. భారత ఆటగాళ్లకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మన్ కీ బాత్లో ప్రధానమంత్రి మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. ► భారతదేశానికి పరాయి పాలన నుంచి స్వాతంత్య్ర లభించి ఈ ఆగస్టు 15వ తేదీ నాటికి 74 ఏళ్లు పూర్తయ్యి 75వ సంవత్సరం రాబోతోంది. ఏడాది తర్వాత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా దేశమంతటా అమృత్ మహోత్సవ్ నిర్వహించుకుంటున్నాం. ► జాతి అభివృద్ధి దిశగా కలిసి పనిచేయడం ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం. ► జాతిపిత మహాత్మాగాంధీ భారత్ చోడో ఆందోళన్ (క్విట్ ఇండియా ఉద్యమం) చేపట్టారు. అదే స్ఫూర్తితో ప్రతి భారతీయుడు భారత్ జోడో ఆందోళన్ (ఐక్య భారత ఉద్యమం)లో పాలు పంచుకోవాలి. వైవిధ్యం, భిన్న సంస్కృతులు కలిగిన భారతదేశంలో ఐక్యంగా ఉండడం అందరి బాధ్యత. ► అమృత్ మహోత్సవ్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భారత జాతీయ గీతం జనగణమనను సాధ్యమైనంత ఎక్కువ మంది కలిసి ఆలపించేలా కేంద్ర సాంస్కృతిక శాఖ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం http://rarhtrafan.in అనే వెబ్సైట్ను సృష్టించింది. ఈ వెబ్సైట్ ద్వారా జాతీయ గీతాన్ని ఆలపించి, రికార్డు చేసుకోవచ్చు. జాతీయ గీతం ఆలాపనతో మీరంతా అనుసంధానమై ఉంటారని ఆశిస్తున్నా. రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో మన ముందుకు రాబోతున్నాయి. ► ఒలింపిక్ క్రీడల్లో మన ఆటగాళ్లను ప్రోత్సహించండి. ఇందుకోసం ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రారంభమైన ‘విక్టరీ పంచ్’ ప్రచార కార్యక్రమంలో పాల్గొనండి. భారత ఆటగాళ్లకు మద్దతు కొనసాగించండి. మీ విక్టరీ పంచ్ను సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు. ► ఈ నెల 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. 1999లో మన దేశం గర్వించేలా అపూర్వ పోరాటం సాగించిన అమర జవాన్లకు నివాళులర్పించాల్సిన సందర్భమిది. ► ఇక మన్ కీ బాత్ అనేది ప్రతినెలా సానుకూలత, సామూహికతకు సంబంధించిన వేడుకలాంటిది. దీనిపై ప్రజల నుంచి వస్తున్న అన్ని సలహాలు సూచనలను నేను పాటించలేకపోవచ్చు కానీ వాటిలో చాలావరకు సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపిస్తున్నా. ► మన్ కీ బాత్కి సందేశాలు, సలహాలు అందజేస్తున్న వారిలో దాదాపు 75 శాతం మంది 35 ఏళ్లలోపు వారేనని ఒక అధ్యయనంలో తేలింది. ఇదొక మంచి పరిణామం. ఈ కార్యక్రమంలో సానుకూలత, సున్నితత్వం ఇమిడి ఉన్నాయి. ఇందులో సానుకూల అంశాలే మాట్లాడుకుంటాం. ► దేశంలో వలస పాలన కొనసాగుతున్నప్పుడు దేశ ప్రజలు స్వాతంత్య్రం కోసం ఒక్కతాటిపైకి వచ్చారు. ఉమ్మడి లక్ష్య సాధన కోసం చేతులు కలిపారు. ఇప్పుడు దేశ అభివృద్ధి కోసం ప్రజలంతా చేతులు కలపాలి. ► స్థానిక వ్యాపారులకు, కళాకారులకు, వృత్తి నిపుణులకు, చేనేత కార్మికులకు అండగా నిలవడం ద్వారా జాతి నిర్మాణంలో భాగస్వాములు కావొచ్చు, ► ఆగస్టు 7వ తేదీ మనకు జాతీయ చేనేత దినోత్సవం. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో చాలామందికి అతిపెద్ద ఆదాయ వనరు చేనేత ఉత్పత్తులే. అందుకే వాటిని కొనుగోలు చేయండి. ► 2014 నుంచి మన దేశంలో ఖాదీ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండడం హర్షించదగ్గ పరిణామం. సాయిప్రణీత్కు ప్రత్యేక అభినందనలు దేశంలో వివిధ కీలక రంగాల్లో పలువురు కొనసాగిస్తున్న కృషిని ప్రధాని మోదీ మన్ కీ బాత్లో ప్రశంసించారు. వాతావరణ నిపుణుడిగా (వెదర్ మ్యాన్) గుర్తింపు పొందిన సాయిప్రణీత్ను ప్రత్యేకంగా అభినందించారు. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన సాయిప్రణీత్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. వాతావరణ సంబంధిత అంశాలను క్షుణ్నంగా విశ్లేషించడంలో దిట్టగా ప్రఖ్యాతి పొందారు. సాయి ప్రణీత్ తన ఆసక్తి, ప్రతిభను రైతుల సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నారని మోదీ కితాబిచ్చారు. వాతావరణ వివరాలను వివిధ మార్గాల ద్వారా సేకరించి విశ్లేషిస్తూ, స్థానిక భాషలో రైతులకు సలహాలు, సూచనలు పంపడం అభినందనీయమన్నారు. -
మన క్రీడాకారులు చాలా కష్టపడ్డారు.. ఒలింపిక్స్ను ప్రోత్సహించండి: మోదీ
సాక్షి, ఢిల్లీ: ఒలంపిక్స్ క్రీడాకారులకు మద్దతుగా ఇప్పటికే ప్రారంభమైన ‘విక్టరీ పంచ్ క్యాంపెయిన్’ ను మరింత ముందుకు తీసుకెళ్లాలంటూ ప్రధాని మోదీ మన్ కీ బాత్ ద్వారా పిలుపునిచ్చారరు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా మోదీ ఆదివారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్తో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ..'' ఆటగాళ్లకు మద్దతుగా సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ క్యాంపెయిన్ ప్రారంభమైంది. అందరూ తమ తమ టీమ్తో మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నా. ఆటగాళ్లందరూ చాలా కష్టపడి టోక్యోకు చేరుకున్నారని, ప్రజలు తెలిసో, తెలియకో వారిపై ఎలాంటి ఒత్తిళ్లూ చేయకూడదు.'' అని తెలిపారు. ఇక సోమవారం ‘కార్గిల్ విజయ దివస్’ ను జరుపుకుంటున్నామని, 1999 లో మన దేశం కోసం సర్వస్వాన్ని అర్పించిన జవాన్లకు నివాళులు అర్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్గిల్ యుద్ధం దేశ సాయుధ దళాల శౌర్యానికి, క్రమశిక్షణకు చిహ్నమని పేర్కొన్నారు. రాబోయే ఆగస్టు 15 చాలా స్పెషల్ అని మోదీ పేర్కొన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగిడబోతున్నామని, అందుకే ఇది చాలా ప్రత్యేకమని, అలాగే ‘అమృత్ మహోత్సవ్’ కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. అమృత్ మహోత్సవ కార్యక్రమం ప్రభుత్వానిది కాదని, 130 కోట్ల మంది భారతీయు మనోభావాలకు సంబంధించినదని అన్నారు. ఇక దేశ ప్రజలందరూ భయాన్ని వీడి, వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావాలని మోదీ మన్ కీ బాత్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ‘‘దయచేసి భయాన్ని వీడండి. వ్యాక్సిన్ తీసుకోండి. కొందరికి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జ్వరం వచ్చింది. కానీ ఇది చాలా చిన్నది. కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. వ్యాక్సిన్ను నిరాకరించడం చాలా అపాయం. వ్యక్తిగతంగానూ క్షేమం కాదు. దయచేసి అందరూ వ్యాక్సిన్ తీసుకోండి’’ అని మోదీ విజ్ఞప్తి చేశారు. -
మోదీ ‘మనసులో మాట’కు కోట్లకు కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదే నరేంద్ర మోదీ ఆదరణ కోల్పోతున్న ఆలిండియా రేడియో, దూరదర్శన్పై దృష్టి సారించారు. మారుతున్న ప్రజల అభిరుచులకు తగ్గట్టు అభివృద్ధి చెందని ఆలిండియా రేడియో, దూరదర్శన్పై మోదీ తీసుకున్న నిర్ణయంతో పూర్వ వైభవం వచ్చింది. ఇప్పుడు మన దేశ రేడియో, దూరదర్శన్కు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రధానమంత్రి ‘మనసులో మాట (మన్ కీ బాత్)’ కార్యక్రమంతో కోట్లు వస్తున్నాయి. మూసివేతకు గురవుతుందని భావించిన ఆయా సంస్థలు ఇప్పుడు లాభాల బాట పట్టింది కూడా. 2014లో ‘మనసులో మాట (మన్ కీ బాత్)’ అనే కార్యక్రమాన్ని ఆలిండియా రేడియో, దూరదర్శన్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసుకు నచ్చిన అంశంపై మాట్లాడుతారు. అలా ఇప్పటివరకు 78 ఎపిసోడ్లు ప్రధాని మన్ కీ బాత్ చేశారు. ఈ కార్యక్రమంతో ఇప్పటివరకు రూ.30.80 కోట్ల ఆదాయం వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని సోమవారం ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. ఏ సంవత్సరం ఎంత ఆదాయం వచ్చిందో వివరంగా సభకు తెలిపింది. సంవత్సరం ఆదాయం 2014-15 రూ.1.6 కోట్లు 2015-16 రూ.2.81 కోట్లు 2016-17 రూ.5.14 కోట్లు 2017-18 రూ.10.64 కోట్లు 2018-19 రూ.7.47 కోట్లు 2019-20 రూ.2.56 కోట్లు 2020-21 రూ.1.02 కోట్లు ఈ మన్ కీ బాత్ ఆలిండియా రేడియోలోనే అంత్యత ప్రజాదరణ పొందిన కార్యక్రమంగా ప్రభుత్వం రాజ్యసభలో తెలిపింది. ప్రధానమంత్రి ప్రసంగంతో దూరదర్శన్ వీక్షకుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని గణాంకాలతో సహా వివరించింది. బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసర్చ్ కౌన్సిల్ (బార్క్) వివరాల ప్రకారం.. 6 కోట్ల నుంచి ఏకంగా 14.35 కోట్ల మంది వీక్షకులు పెరిగారని వెల్లడించింది. మారుమూల గ్రామాలకు సైతం ప్రధాని ప్రసంగం చేరిందని పేర్కొంది. అయితే ఈ ‘మనసులో మాట’ కార్యక్రమానికి ప్రధాని మోదీ ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించారు. తాను ఏ అంశంపై మాట్లాడాలో చెప్పాలని అప్పుడప్పుడు ప్రజలను అడుగుతుంటారు. ఈ కార్యక్రమంతో ప్రసార భారతి (ఆలిండియో రేడియో), దూరదర్శన్కు పూర్వ వైభవం వచ్చింది. ఆలిండియో రేడియోను దేశ రేడియోగా, దూరదర్శన్ను మన దేశ టీవీగా పేర్కొంటారు. మన దేశ అధికారిక ప్రసార మాధ్యమాలు ఆ రెండూ అనే విషయం అందరికీ తెలిసిందే. -
‘మన్కీ బాత్’ బదులు ‘పెట్రోల్కీ బాత్’
కోల్కతా: ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం నాశనం చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ‘ఇంధన ధరలు రోజు రోజుకీ పైకెగబాకుతున్నా కేంద్రం ప్రభుత్వం లో చలనం లేదు. మన ప్రధానమంత్రి మాత్రం ‘మన్కీ బాత్’తో బిజీ అయిపోయారు. అందుకు బదులుగా ఆయన ‘పెట్రోల్, వ్యాక్సిన్కీ బాత్’నిర్వహిస్తే బాగుంటుంది’ అని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీ జాన్ బార్లాను కేబినెట్లోకి తీసుకో వచ్చన్న వార్తలపై ఆమె స్పందిస్తూ..ఉత్తర బెంగాల్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలంటూ బార్లా డిమాండ్ చేసిన కొన్ని రోజులకే మంత్రి పదవి లభించింది. దీనిని బట్టి కాషాయపార్టీ విభజన రాజకీయాలు అవగతమవు తున్నాయి’ అని ఆరోపించారు. -
మోదీ ‘మన్ కీ బాత్’కి వరంగల్ చాయ్వాలా
వరంగల్ అర్బన్: దేశ ప్రధాని నరేంద్రమోదీ వివిధ అంశాలపై నిర్వహించే ‘మన్ కీ బాత్’లో పాల్గొనే అవకాశం వరంగల్ నగరానికి చెందిన చాయ్వాలాకు దక్కింది. ఇందుకోసం వచ్చే నెల మొదటి వారంలో సిద్ధంగా ఉండాలని నగరంలోని పాటక్ మహేలా ప్రాంతానికి చెందిన ఛాయ్ వాలా మహ్మద్ పాషాకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి లేఖ అందింది. ఈ విషయాన్ని వరంగల్ జిల్లా మెప్మా పీడీ భద్రు సోమవారం ధ్రువీకరించారు. మహ్మద్ పాషా ఎంజీఎం ఆస్పత్రి వద్ద 40 ఏళ్లుగా ఫుట్పాత్పై చాయ్షాపు పెట్టి జీవిస్తున్నారు. ఆయన గతేడాది ఆగస్టులో పీఎం ఆత్మనిర్భర్ పథకం ద్వారా రూ.10వేల రుణాన్ని తీసుకుని సద్వినియోగం చేసుకోవడంతో పాటు టీ అమ్మకాల రూపేణా గూగుల్పే, ఫోన్పే ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ మొదటి స్థానంలో నిలిచారు. ఆత్మనిర్భర్ ద్వారా రుణం పొందిన వీధి వ్యాపారుల్లో అతి తక్కువ మందిని మన్ కీ బాత్కు ఎంపిక చేయగా, అం దులో పాషా ఒకరని భద్రు తెలిపారు. పీఎంఓ నుంచి ఫోన్ వచ్చిన విషయాన్ని ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని పాషా చెప్పారు. చదవండి: బస్ కండక్టర్పై ప్రధాని మోదీ ప్రశంసలు -
మన క్రీడాకారులకు మీ అండదండలు కావాలి
న్యూఢిల్లీ: కష్టనష్టాలను ఓర్చి టోక్యో ఒలింపిక్స్కు అర్హత సంపాదించిన భారత క్రీడాకారులకు యావత్ జాతి మద్దతు తెలపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో ఆయన క్రీడాకారుల గురించి వారి నేపథ్యం, పడ్డ కష్టాలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ప్రతీ క్రీడాకారుడిది ప్రత్యేక గాథ. దేశానికి ప్రాతినిధ్యం కోసం... పతకం కోసం వారంతా శ్రమైక జీవనంలో ఏళ్ల పాటు గడిపారు. వారి పయనం కేవలం పతకం కోసమే కాదు... దేశం కోసం. జాతి గర్వపడే విజయాల కోసం, ఈ ప్రయత్నంలో ప్రజల మనసులు గెలిచేందుకు టోక్యో వెళుతున్నారు. వాళ్లంతా విజయవంతమయ్యేందుకు మనమంతా వెన్నుదన్నుగా నిలవాల్సిన తరుణమిది. ప్రతి ఒక్క భారతీయుడు వారికి మనస్ఫూర్తిగా మద్దతు తెలపాలని నేను కోరుతున్నాను’ అని మోదీ అన్నారు. ఆర్చర్లు దీపిక కుమారి, ప్రవీణ్ జాదవ్, హాకీ క్రీడాకారిణి నేహా గోయెల్, బాక్సర్ మనీశ్ కౌశిక్, రేస్ వాకర్ ప్రియాంక గోస్వామి, జావెలిన్ త్రోయర్ శివపాల్ సింగ్, తెలుగు షట్లర్ సాత్విక్ సాయిరాజ్ అతని భాగస్వామి చిరాగ్ షెట్టి టోక్యో ఒలింపిక్స్ అర్హత కోసం కఠోరంగా శ్రమించారని ప్రధాని కితాబిచ్చారు. టోక్యో ఒలింపిక్స్ జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి. -
టీకాపై సంకోచం వీడండి
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలు జాగ్రత్తలు కొనసాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరోనా టీకా విషయంలో సంకోచం వీడాలని సూచించారు. అర్హులందరూ సాధ్యమైనంత త్వరగా టీకా వేయించుకోవాలని కోరారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో కొన్నివర్గాల్లో ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఎలాంటి అనుమానాలు అవసరం లేదని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం బేతుల్ జిల్లాలోని గిరిజన గ్రామం దులారియా వాసులతో ప్రధాని మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో సందేహాలు, భయాందోళనలను గ్రామస్తులు మోదీ దృష్టికి తీసుకొచ్చారు. తాను, దాదాపు వందేళ్ల వయసున్న తన తల్లి కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని మోదీ గుర్తుచేశారు. విజ్ఞాన శాస్త్రాన్ని, పరిశోధకులను విశ్వసించాలని, పుకార్లను నమ్మొద్దని అన్నారు. మారు వేషాలు వేస్తూ ప్రజలను ఏమార్చడంలో కరోనా వైరస్ దిట్ట అని ప్రధాని వ్యాఖ్యానించారు. అదే అసలైన నివాళి ప్రజారోగ్య సంరక్షణలో వైద్యుల పాత్ర మరువలేనిదని ప్రధానమంత్రి కొనియాడారు. జూలై 1న ‘నేషనల్ డాక్టర్స్ డే’జరుపుకోనున్న నేపథ్యంలో వారి సేవలను మోదీ ప్రశంసించారు. ఈసారి జాతీయ వైద్యుల దినం మనకెంతో ప్రత్యేకమని చెప్పారు. కరోనా బారినపడి కన్నుమూసిన ప్రభుత్వ కార్యదర్శి గురుప్రసాద్ మొహాపాత్రకు మోదీ నివాళులర్పించారు. ఒకవైపు కరోనాతో బాధపడుతూనే మరోవైపు ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాను పెంచడానికి ఆయన కృషి చేశారని చెప్పారు. గురుప్రసాద్ లాంటివాళ్లు ఎంతోమంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించడం, టీకా వేయించుకోవడమే వారికి మనం అర్పించే అసలైన నివాళి అని పేర్కొన్నారు. దేశంలో వర్షాకాలం ప్రారంభమయ్యిందని, ప్రజలు జల సంరక్షణకు నడుం బిగించాలని మోదీ ఉద్ఘాటించారు. -
ఒక్క రోజులో 86 లక్షలకు పైగా టీకాలు వేసి చరిత్ర సృష్టించాం: మోదీ
ఢిల్లీ: కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడంపై సందిగ్ధతను అధిగమించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం 'మన్ కీ బాత్' ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా జరుగుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఒక్క రోజులో 86 లక్షలు కన్నా ఎక్కువ మందికి టీకాలు వేసి భారత దేశం చరిత్ర సృష్టించిందని తెలిపారు. కరోనా వైరస్పై దేశ ప్రజల పోరాటం కొనసాగుతోందని మోదీ చెప్పారు. ఈ పోరాటంలో మనమంతా ఓ అసాధారణ విజయాన్ని సాధించామన్నారు. కొద్ది రోజుల క్రితం మునుపెన్నడూ లేని అద్భుతాన్ని మన దేశం సాధించిందన్నారు. జూన్ 21న 86 లక్షల మందికి పైగా ఉచిత వ్యాక్సిన్ తీసుకున్నారని.. ఒక రోజులో ఇంత ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోవడం గొప్ప రికార్డు అని పేర్కొన్నారు. మధ్య ప్రదేశ్లోని బేటుల్ జిల్లా, దులేరియా గ్రామస్థులతో మోదీ మాట్లాడారు. వ్యాక్సిన్పై సందిగ్ధతను తమ గ్రామంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారని గ్రామస్థులు ఆయనకు తెలిపారు. దీనిపై స్పందించిన మోదీ మాట్లాడుతూ, వదంతులను నమ్మవద్దని వారికి నచ్చజెప్పారు. తాను రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నానని తెలిపారు. తన తల్లి వయసు సుమారు వందేళ్ళు ఉంటుందని, ఆమె కూడా రెండు డోసులను తీసుకున్నారని తెలిపారు. వ్యాక్సిన్కు వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్పై మోదీ మన్ కీ బాత్లో ప్రస్తావించారు. రోడ్ టు టోక్యో క్విజ్లో పాల్గొనడం ద్వారా విలువైన బహుమతులు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఫ్లయింగ్ సిఖ్గా పేరుపొందిన మిల్కా సింగ్ను మోదీ గుర్తు చేసుకున్నారు. 1964లో దేశం తరపున ఒలింపిక్స్లో పాల్గొన్న మిల్కా తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడని.. ఆ స్థాయి ప్రదర్శనతోనే దేశ మన్ననలు పొందాడని తెలిపారు. కరోనా కారణంగా ఒక లెజెండరీ అథ్లెట్ను కోల్పోవడం బాధాకరమని మోదీ అభిప్రాయపడ్డారు. చదవండి: డీఏను తక్షణమే పునరుద్ధరించాలి: కాంగ్రెస్ -
Oxygen Train: లోకో పైలట్ శిరీషకు ప్రధాని ప్రశంస
వేగం, భద్రం.. అనే రెండు సమాంతర రైలు పట్టాలపైన నైరుతి రైల్వే అధికారులు ఆ రోజు ‘ఆక్సిజన్ ఎక్స్ప్రెస్’ను నడపవలసి వచ్చింది! జార్ఘండ్లోని టాటానగర్ నుంచి బెంగళూరు సమీపంలోని వైట్ఫీల్డ్కు ఆరు ట్యాంకర్లలో లిక్విడ్ ఆక్సిజన్ని నింపి ఆ రైలును లోకో పైలట్ శిరీషకు అప్పగించారు. గంటన్నరలో ఆ ప్రాణవాయువు గమ్యం చేరింది. కరోనా రోగులున్న హాస్పిటళ్లకు సమయానికి శ్వాసలా అందింది. అత్యంత కీలక సమయంలో ఆక్సిజన్ రైలును నడిపిన తొలి మహిళా పైలట్గా శిరీషను తన తాజా ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భారత ప్రధాని ప్రశంసించారు. శనివారం రాత్రి బెంగళూరులోని ఆలిండియా రేడియో స్టేషన్ రికార్డింగ్ రూమ్లో కూర్చొని ఉన్నారు శిరీష (31). ఏ క్షణమైనా భారత ప్రధాని నరేంద్ర మోదీ తనతో మాట్లాడేందుకు లైన్లోకి రావచ్చన్న ఆలోచన ఆమె గొంతును తడారేలా చేస్తోంది. నిముషాలు గడుస్తున్నాయి. ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు.. ఆరు.. ఏడు.. ‘‘నమస్తే శిరీషాజీ..’’ ఒక్కసారిగా ప్రధాని స్వరం! వెంటనే శిరీష ప్రతి నమస్కారం. తర్వాత వెంటనే ప్రధాని ప్రశ్నలు, శిరీష సమాధానాలు. ‘‘శిరీషాజీ.. ఈ కష్టకాలంలో నారీశక్తి దేశాన్ని నడిపిస్తోంది. ఇక మీరు... కరోనా పేషెంట్లకు అత్యవసరమైన ప్రాణవాయువును తీసుకుని రైలును వేగంగా నడుపుకుంటూ విజయవంతం గా గమ్యస్థానం చేరుకున్నారు. ఇందుకు మీకు అభినందనలు. అంతటి ఆత్మ స్థయిర్యం, స్ఫూర్తి మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? మిమ్మల్ని అందుకు సంసిద్ధం చేయడానికి అవసరమైన బలాన్ని మీకు ఇచ్చింది ఎవరు? ఈ దేశం తెలుసుకోవాలని అనుకుంటోంది. నాకు కూడా..! చెప్పండి శిరీషాజీ’’ అడిగారు ప్రధాని. ‘‘మా నాన్న, మా అమ్మ ..’’ శిరీష జవాబు. ‘‘ఆక్సిజన్ కోసం వేచి చూస్తున్న రోగుల కోసం ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ను నడిపించుకుని వెళ్లడం అన్నది ఎంతలేదన్నా బాధ్యతతో కూడిన పని కదా. మీకెలా అనిపించింది?’’.. ప్రధాని. ‘‘రైల్వే అధికారులు అన్నీ సవ్యంగా ఉండేలా చూశారు. నాపై నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉంది’’ అని శిరీష సమాధానం.మొత్తం 2 నిముషాల 8 సెకన్లపాటు దేశ ప్రధానికి, దేశ పౌరురాలికి మధ్య స్ఫూర్తివంతమైన సంభాషణ నడిచింది. గంటన్నర పాటు 123 కి.మీ. దూరం ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ను జాగ్రత్త గా, వేగంగా నడపడం వంటిదే దేశ ప్రధానితో ఒక నిముషం పాటైనా మాటను నడిపించడం. మర్నాడు ప్రధాని ‘మన్ కీ బాత్’లో ఈ సంభాషణ ప్రసారం అయింది. ఆ సమయానికి శిరీష తల్లి వైజాగ్లోని తమ ఇంట్లో.. చుట్టుపక్కల వాళ్లతో కలిసి కూర్చొని తన కూతురు, ప్రధాని ముచ్చటించుకోవడాన్ని హృదయం ఉప్పొంగుతుండగా విన్నారు. శిరీష తండ్రి రామారావు మాత్రం వినలేకపోయారు. పోర్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ సెక్రెటరీగా ఆయన రిటైర్ అయ్యారు. కొంతకాలం క్రితమే కన్నుమూశారు. శిరీష నైరుతి రైల్వే ఉద్యోగి. బెంగళూరు డివిజన్లో లోకో పైలట్. ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలును నడిపిన ‘ఆల్ ఫిమేల్ క్రూ’ లో ప్రధాన పైలట్గా శిరీష గత వారం వార్తల్లోకి వచ్చారు. ఈ నెల 21 న జార్ఘండ్ నుండి బెంగళూరుకు ఆరు ట్యాంకర్లలో 120 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నింపి ఉన్న ఎక్స్ప్రెస్ రైలును గంటకు 80 కి.మీ వేగంతో శిరీష నడిపించుకుని వచ్చారు. ఆమెతోపాటు అసిస్టెంట్ లోకో పైలట్ అపర్ణ ఉన్నారు. రైలు బెంగళూరు చేరిన వెంటనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయెల్ శిరీష, ఆమె సహ పైలట్ దీక్షాదక్షతలను కొనియాడుతూ ‘‘ప్రాణవాయువును నడిపించుకుని వచ్చిన మహిళలు’’ అని ట్విట్టర్లో అభినందించారు. చదవండి: విదేశీ టీకాలకు నో ట్రయల్స్! -
Narendra Modi: దేశం గర్వించదగిన క్షణాలెన్నో!
న్యూఢిల్లీ: ఏడేళ్ల పాలనలో దేశం గర్వించదగిన ఎన్నో విజయాలు సాధించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 2014 నుంచి దేశం గర్వించే ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. ఈ ఏడేళ్లలో విజయాలతో పాటు పలు సవాళ్లను కూడా ఎదుర్కొన్నామని వివరించారు. వాటిలో ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభం అత్యంత తీవ్రమైనదన్నారు. మాసాంతపు రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో ఆదివారం ఈ విషయాలను ప్రధాని దేశ ప్రజలతో పంచుకున్నారు. దేశ భద్రతతో పాటు పలు ఇతర రంగాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రధాని తన ప్రసంగంలో వివరించారు. కరోనా కారణంగా వేలాది ప్రజల ప్రాణాలను కోల్పోయామని, ఆర్థిక వ్యవస్థను ఈ సంక్షోభం భారీగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రాణాంతక వైరస్పై కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడు సంవత్సరాలు సమిష్టిగా, జనులందరి అభివృద్ధి లక్ష్యంగా, అందరి విశ్వాసాన్ని చూరగొంటూ పాలన సాగించామన్నారు. ‘సబ్ కాసాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ తాము పాటించే మంత్రమన్నారు. ఇతర దేశాల ఒత్తిడి మేరకు కాకుండా.. స్వీయ ప్రయోజనాలు లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. మనకు వ్యతిరేకంగా కుట్రలు చేసినవారికి తగిన బుద్ధి చెప్పామని గుర్తు చేశారు. ‘దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో రాజీ పడనప్పుడు, మన భద్రతా బలగాల శక్తి సామర్థ్యాలు పెరిగినప్పుడు.. సరైన మార్గంలోనే వెళ్తున్నాం అనిపిస్తూ ఉంటుంది’ అన్నారు. దశాబ్దాల సమస్యలకు పరిష్కారం దశాబ్దాల తరబడి సాగుతున్న సమస్యలను కూడా శాంతియుతంగా పరిష్కరించగలిగామన్నారు. ఈ ఏడేళ్ల పాలనలో ఈశాన్యం నుంచి కశ్మీరం దాకా ప్రజల్లో శాంతి, పురోగతితో కూడిన విశ్వాసాన్ని పెంపొందించగలిగామన్నారు. స్వాతంత్య్రం తరువాత ఏడు దశాబ్దాల్లో కేవలం 3.5 కోట్ల గ్రామీణ నివాసాలకు మాత్రమే తాగునీటి కనెక్షన్లు అందించగలిగారని, తాము గత 21 నెలల్లోనే 4.5 కోట్ల ఇళ్లకు సురక్షిత తాగునీటి సదుపాయం కల్పించగలిగామని తెలిపారు. ఆ 21 నెలల్లో 15 నెలలు ఒకవైపు కరోనాతో పోరాడుతూ మరోవైపు ఈ కార్యక్రమం చేపట్టామని గుర్తు చేశారు. రికార్డుస్థాయిలో గ్రామాలకు విద్య, వైద్యం, రహదారి, విద్యుత్, బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పించామని వివరించారు. ఈ సదుపాయాలు పొందిన ఎంతోమంది ప్రజలు ఆ వివరాలు తెలుపుతూ సందేశం పంపించారని తెలిపారు. ప్రభుత్వ పథకం కింది గృహ నిర్మాణం చేసుకున్న లబ్ధిదారులు గృహ ప్రవేశాలకు తనను ఆహ్వానించారన్నారు. డిజిటల్ లావాదేవీల విషయంలో ప్రపంచదేశాలకు దిక్సూచిగా నిలిచామన్నారు. మరోవైపు, 2014 నుంచి ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నామని, అయినా, ప్రతీసారి మరింత బలోపేతమవుతూ వచ్చామని తెలిపారు. కరోనా మహమ్మారి పెద్ద పెద్ద దేశాల్లోనూ మారణహోమం సృష్టించిందన్న ప్రధాని.. మొదటి వేవ్ను భారత్ సమర్థ్ధవంతంగా ఎదుర్కొన్నదని, ఈ రెండో వేవ్పై కూడా విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. వికాస యాత్ర ఏడేళ్ల పాలనలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ‘వికాస యాత్ర’ పేరుతో ఒక ప్రకటనను ప్రభుత్వం రూపొందించింది. ఆ ప్రకటనను ప్రధాని మోదీ దేశ ప్రజలతో పంచుకున్నారు. తమ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేది సేవాస్ఫూర్తి మాత్రమేనని అందులో పేర్కొన్నారు. కరోనా గడ్డుకాలంలో పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించినా, రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి గిట్టుబాటు ధర చెల్లించి సేకరించినా, కార్మికులకు మెరుగైన పని పరిస్థితులు కల్పించినా.. అన్నిటికీ ఆ సేవాస్ఫూర్తే కారణమన్నారు. సంక్షోభంలోనూ వ్యవసాయం సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభంలోనూ పేదలకు వ్యవసాయం ఎంతో చేయూతనిచ్చిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రికార్డు స్థాయిలో రైతులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసిన కారణంగా 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ ఇవ్వగలిగామని ప్రధాని పేర్కొన్నారు. కరోనా దేశంలోని ప్రతి వ్యవస్థను ప్రభావితం చేసిందని, అయితే ఈ దాడి నుంచి వ్యవసాయ రంగం తనను తాను రక్షించుకోవడమే కాకుండా పురోగతి సాధించిందన్నారు. కోవిడ్పై దేశం పూర్తి శక్తితో ఎలా పోరాడుతుందో అందరూ చూస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. వందేళ్ల కాలంలో కరోనాయే అతి పెద్ద మహమ్మారి అన్నారు. సెకండ్ వేవ్లో కరోనాతో పోరాటంలో ప్రముఖపాత్ర పోషించిన వారు చాలా మంది ఉన్నారన్నారు. క్రయోజెనిక్ ట్యాంకర్ల డ్రైవర్లు, ఆక్సిజన్ ఎక్స్ప్రెస్, వైమానిక దళ పైలట్లు, ల్యాబ్ టెక్నిషియన్లు తదితరులు చాలామంది సంక్షోభ సమయంలో పనిచేసి లక్షలాది మంది ప్రాణాలు రక్షించారని మోదీ పేర్కొన్నారు. ‘‘ఈ యోధుల సేవలకు దేశం వారికి నమస్కరిస్తోంది. లక్షలాది మంది రాత్రింబవళ్లు కరోనా సంబంధిత పనుల్లో నిమగ్నమయ్యారు. ఆక్సిజన్ను కొరత ఏర్పడటంతో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంవో) ఉత్పత్తిని రోజుకు 900 మెట్రిక్ టన్నులు నుంచి 10 రెట్లు పెంచి రోజుకు 9,500 టన్నులకు తీసుకెళ్లాం. దేశం ఇప్పుడు రోజుకి 20 లక్షలుపైగా కరోనా పరీక్షలు చేసే స్థాయికి చేరింది’’ అని మోదీ పేర్కొన్నారు. విజయనగరం మామిడి ప్రస్తావన ప్రధాని మోదీ మన్కీ బాత్లో విజయనగరం మామిడిని ప్రస్తావించారు. కిసాన్ రైలు ద్వారా విజయనగరం నుంచి ఢిల్లీకి మామిడి వస్తోందన్నారు. దీని వల్ల ఉత్తరాది వారికి విజయనగరం మామిడి తినడానికి లభిస్తోం దని, విజయనగరం రైతులకు మంచి ఆదా యం వస్తోందన్నారు. కిసాన్ రైళ్లు ఇప్పటి వరకు సుమారు 2 లక్షల టన్నుల ఉత్పత్తులను రవాణా చేశాయని ప్రధాని తెలిపారు. కిసాన్ రైలు ద్వారా తక్కువ రవాణా ఖర్చులతో రైతులు తాము పండించిన పండ్లు, కూరగాయలు, ఆహారధాన్యాలను దేశం నలు మూలకు పంపగలుగుతున్నారని అన్నారు. -
ఈ ప్రభుత్వం దేశానికి ప్రమాదకరం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: అన్ని రంగాల్లోనూ మోదీ సర్కారు విఫలమైందని కాంగ్రెస్ మండిపడింది. ప్రజల విశ్వాసం కోల్పోయిన ఈ ప్రభుత్వం దేశానికి ప్రమాదకరమని హెచ్చరించింది. మోదీ ప్రభుత్వ ఏడేళ్ల పాలనలో చోటు చేసుకున్న భారీ వైఫల్యాలపై కాంగ్రెస్ ఆదివారం 7 పాయింట్లతో చార్జిషీట్ను విడుదల చేసింది. ‘ఈ ఏడేళ్ల పాలన అంటే.. 140 కోట్ల భారతీయుల భరించలేని వేదన, లెక్కించలేనంత విధ్వంసం’ అని వ్యాఖ్యానించింది. ప్రజలు చూపిన ప్రేమ, నమ్మకాలకు బదులుగా వేదనను, విధ్వంసాన్ని ఇచ్చిందని పేర్కొంది. పెట్రోలు లీటరుకు రూ. 100 కి చేరడం ఈ ప్రభుత్వ ఘనతేనని విమర్శించింది. ఆర్థిక వృద్ధి అథోముఖం పట్టిందని, నిరుద్యోగం ప్రబలిందని, కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని ఆ చార్జిషీట్లో పేర్కొంది. అలాగే, మోదీ సర్కారు వైఫల్యాలపై ‘భారత్ మాతా కీ కహానీ’ పేరుతో 4.5 నిమిషాల నిడివి గల వీడియోను కూడా కాంగ్రెస్ విడుదల చేసింది. ‘కరోనాను కట్టడి చేయడానికి నెలకోసారి మాట్లాడితే సరిపోదు. కరోనాపై విజయం సాధించాలంటే సరైన ఆలోచన, విధానం, పట్టుదల ఉండాలి’ అని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. -
సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మొదటి దశను విజయంవంతంగా ఎదుర్కొన్న తర్వాత దేశం ఆత్మవిశ్వాసాన్ని పొందినప్పటికీ ప్రస్తుత కరోనా తుపాను (సెకండ్ వేవ్) దేశాన్ని కుదిపేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల సహనానికి, బాధలను తట్టుకొనే శక్తికి సెకండ్ వేవ్ పరీక్ష పెడుతోందని అభిప్రాయపడ్డారు. ఆదివారం మన్కీబాత్ 76వ ప్రసంగంలో ప్రధాని మోదీ పూర్తిగా కరోనా మహమ్మారిపైనే దృష్టి కేంద్రీకరించారు. కరోనాకు సంబంధించిన పలు అంశాలు ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. కరోనాను జయించడమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశమన్నారు. ఈ సంక్షోభం నుంచి త్వరలోనే ప్రజలు బయటపడతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘మన సన్నిహితులు, ఆత్మీయులు, బంధువులు ఎందరో మనల్ని అర్ధాంతరంగా వదిలివెళ్లారు. మొదటిదశను విజయవంతంగా ఎదుర్కొన్న తర్వాత మనమంతా ఎంతో ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. కానీ ఈ తుపాన్ దేశాన్ని కుదిపేసింది’ అని మోదీ అన్నారు. అందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, టీకాల విషయంలో వదంతులను నమ్మవద్దని కోరారు. రాష్ట్రాలు తమవంతు ప్రయత్నం చేస్తున్నాయి కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి వివిధ రంగాలకు చెందిన నిపుణులతో సుదీర్ఘంగా చర్చించానన్నారు. ఔషధ పరిశ్రమ, టీకా తయారీదారులు, ఆక్సిజన్ ఉత్పత్తిలో నిమగ్నమైన వారు, వైద్య రంగ పరిజ్ఞానం ఉన్నవారు తమ విలువైన సలహాలను ప్రభుత్వానికి అందజేశారన్నారు. ఈ విపత్కర సమయంలో... ఈ యుద్ధంలో విజయం సాధించడానికి నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధీకృత సమాచారం పైనే ఆధారపడాలని ప్రధాని మోదీ ప్రజలకు సూచించారు. సమీపంలోని వైద్యుడు లేదా కుటుంబ వైద్యుడిని సంప్రదించాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా కొంతమంది వైద్యులు ప్రజలకు సమాచారం ఇస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు. టీకా గురించి ఎలాంటి వదంతులు నమ్మొద్దు. ఉచిత వ్యాక్సిన్ అన్ని రాష్ట్రాలకు పంపాం. 45 ఏళ్లు పైబడిన వారు అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు. మే 1 నుంచి దేశంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. కేంద్రం నుంచి 45 ఏళ్ల పైబడిన వారికి ఉచిత వ్యాక్సిన్ అందజేసే కార్యక్రమం ఇకపై కూడా కొనసాగుతుంది. ఉచిత వ్యాక్సిన్ ప్రయోజనాలను వీలైనంత ఎక్కువ మందికి విస్తరించాలని నేను రాష్ట్రాలను కోరుతున్నా. రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో భారత ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ బాధ్యతలను నెరవేర్చడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. దేశంలోని వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కరోనాపై భారీ పోరాటం చేస్తున్నారు. వీరితోపాటు ల్యాబ్–టెక్నీషి యన్లు, అంబులెన్స్ డ్రైవర్లు వంటి ఫ్రంట్లైన్ కార్మికులు కూడా ఆపత్కాలంలో దేవుళ్లలా పనిచేస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘‘పౌరులుగా జీవితంలో సాధ్యమైనంత సమర్థవంతంగా మన విధులను నిర్వర్తిస్తాం. సంక్షోభం నుండి బయటపడిన తరువాత మనం భవిష్యత్ మార్గంలో మరింత వేగంగా వెళ్తాం. ఈ కోరికతో మీ అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని మరోసారి కోరుతున్నా. మనం పూర్తి జాగ్రత్తగా ఉండాలి. మందులు కూడా – కఠిన నియమాలు కూడా (దవాయీ భీ... కడాయీ భీ)... ఈ మంత్రాన్ని మర్చిపోకండి. ఈ విపత్తు నుంచి త్వరలో బయటికి వస్తాం’’ అని ప్రధాని ప్రసంగం ముగించారు. -
బస్ కండక్టర్పై ప్రధాని మోదీ ప్రశంసలు
సాక్షి, టీ.నగర్: మన్కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ కోవై బస్ కండక్టర్కు ప్రశంసలందించారు. ఆయన మాట్లాడుతూ కోవైలో బస్ కండక్టర్ యోగనాథన్ ప్రయాణికులకు టికెట్తోపాటు మొక్కలను అందజేస్తున్నారని, తన ఆదాయంలో అధిక భాగాన్ని ఇందుకోసం వినియోగిస్తుండడం ప్రశంసనీయమన్నారు. ఈ విధంగా మోదీ తెలిపారు. ఇది విన్న యోగనాథన్ సంతోషం వ్యక్తం చేశారు. విలేకరులతో యోగనాథన్ మాట్లాడుతూ ప్రధాని మోదీ తనను ప్రశంసించడం సంతోషంగా ఉందని, ప్రోత్సాహకరంగా ఉందన్నారు. తనలా ఎందరో మొక్కలను నాటే పనుల్లో నిమగ్నమవుతారన్నారు. తనకు వచ్చే ఆదాయంలో 40 శాతాన్ని మొక్కలు నాటేందుకు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. 34 ఏళ్లుగా కండక్టర్గా పనిచేస్తున్న తాను ఇంతవరకు మూడు లక్షలకు పైగా మొక్కలను నాటినట్లు తెలిపారు. గత ఏడాది 85 వేల మొక్కలను ఉచితంగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. యోగనాథన్ ఇప్పటి వరకు అనేక అవార్డులను అందుకున్నారు. సీబీఎస్ఈ ఐదో తరగతి పాఠ్యాంశంలోను ఈయన చోటుచేసుకున్నారు. ఇప్పటి వరకు అద్దె ఇంట్లో నివసిస్తున్న ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చదవండి: విజయవాడ వాసికి నా అభినందనలు: పీఎం మోదీ -
అందరూ వ్యాక్సిన్ తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్–19పై భారత్ స్ఫూర్తిదాయక పోరాటం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. అర్హులైన పౌరులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనాపై పోరులో భారత ప్రజలు మొదట్నుంచి కఠినమైన జాగ్రత్తలు పాటిస్తూ, క్రమశిక్షణతో ఉంటూ అంతర్జాతీయ సమాజానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. ప్రతీ నెల చివరి ఆదివారం జరిగే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో మోదీ ప్రసంగించారు. మన్ కీ బాత్ 75 భాగాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు శ్రోతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయి అమృత్ ఉత్సవాలు జరుపుకుంటున్న వేశ మన్కీ బాత్ కూడా 75 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమర యోధులు చేసిన త్యాగాలు పౌరులుగా మన బాధ్యతల్ని గుర్తు చేసి కర్తవ్యోముఖుల్ని చేస్తాయని మోదీ అన్నారు. ఆ పోరాట స్ఫూర్తి అభినందనీయం కరోనా వైరస్ బట్టబయలైన తొలి రోజుల్లో గత ఏడాది మార్చి 22న విధించిన జనతా కర్ఫ్యూ గురించి మోదీ మన్ కీ బాత్లో గుర్తు చేసుకున్నారు. అప్పట్లో లాక్డౌన్ వంటివి కొత్త అయినప్పటికీ ప్రజలంతా సహకరించి దీపాలు వెలిగించి, పళ్లేలు మోగించి ఫ్రంట్లైన్ సిబ్బంది మనసుల్ని గెలుచుకున్నారని ప్రశంసించారు. ప్రజా మద్దతుతో ఏడాదిగా వైద్య సిబ్బంది అలుపెరుగకుండా కరోనాపై యుద్ధం చేస్తున్నారని , ప్రతీ పౌరుడి ప్రాణాలు కాపాడడానికి శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. గత ఏడాది అసలు వ్యాక్సిన్ వస్తుందో, రాదోనన్న సందేహాలు ఉండేవని, అలాంటిది ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టిన దేశంగా భారత్ నిలవడం గర్వ కారణమని అన్నారు. ప్రతీ ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలన్న మోదీ 100 ఏళ్లు పైబడిన వాళ్లు వ్యాక్సిన్ తీసుకోవడం చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతోందన్నారు. ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్కి చెందిన 109 ఏళ్ల అమ్మ రామ్ దులాయి, ఢిల్లీలో 107 ఏళ్ల కేవల్ కృష్ణ, హైదరాబాద్కి చెందిన వందేళ్ల వయసున్న జై చౌదరి వంటివారు వ్యాక్సిన్లు తీసుకున్నారని, కరోనాపై పోరాటంలో విజయం సాధించాలంటే అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రధాని పిలుపు,నిచ్చారు. విజయవాడ వాసి ఆదర్శం ‘‘ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ పదకండ్ల వాహనాల తుక్కు నుంచి శిల్పాలు సృష్టిస్తున్నారు. అలా సృష్టించిన భారీ శిల్పాలు పబ్లిక్ పార్కులో ఏర్పాటు చేయగా ప్రజలు వాటిని ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడంలో ఇదో వినూత్న ప్రయోగం. ఇందుకు నా అభినందనలు. ఇలాంటి కృషిలో పాల్గొనేందుకు మరింత మంది ముందుకురావాలి. అందరూ సంతోషంగా ఉండండి. ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండండి. కరోనా నినాదాన్ని మరచిపోవద్దు’’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలి సాగు రంగం అత్యవసరంగా ఆధునీకరణ జరగాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఎంతో సమయం వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వ్యవసాయ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు రావాలన్నా, రైతుల ఆదాయం పెరగాలన్నా ఆ రంగంలో వినూత్న పద్ధతుల్ని ప్రవేశపెట్టాలి. సంప్రదాయ పద్ధతుల్ని అనుసరిస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. కొత్త ఆవిష్కరణలు జరగాలి’అని ప్రధాని అన్నారు. కేంద్రం గత ఏడాది తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, ఢిల్లీ సరిహద్దుల్లో వందలాది మంది రైతులు నవంబర్ నుంచి చేస్తున్న ఉద్యమం నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త సాగు చట్టాల ద్వారా వ్యవసాయ రంగంలోకి కొత్తగా పెట్టుబడులు, ఆధునిక విధానాలు వస్తాయని, ఒకే దేశం ఒకే మార్కెట్ కారణంగా రైతుకు వ్యవసాయం లాభసాటిగా మారుతుందని ప్రభుత్వం ఎప్పట్నుంచో చెబుతూ వస్తోంది. -
మిథాలీ, పీవీ సింధులపై ప్రధాని మోదీ ప్రశంసలు
ఢిల్లీ: భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. మార్చి 8న ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకున్నామని, ఇదే నెలలో చాలామంది భారత మహిళా క్రిడాకారిణిలు తమ పేరిట సరికొత్త రికార్డులు నమోదు చేయడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. మన్ కీ బాత్ 75వ ఎపిసోడ్లో భాగంగా ఆదివారం ఆలిండియా రేడియోలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో విజేతలుగా నిలిచిన పలువురు మహిళల గురించి ప్రస్తావించారు. మహిళా క్రికెట్ చరిత్రలో 10 వేల పరుగుల మైలురాయిని దాటిన తొలి భారత క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ నిలిచారని, ఆమె సాధించిన విజయానికి తాను అభినందనలు తెలియజేస్తున్నానని ప్రధాని చెప్పారు. అదేవిధంగా పీవీ సింధు గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. సింధు అద్భుతమైన క్రీడా ప్రదర్శనలతో అనేక అవార్డులు అందుకున్నారని ప్రధాని గుర్తుచేశారు. మిథాలీ, సింధు ఇద్దరూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచారని ఆయన కొనియాడారు. ఢిల్లీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ షూటింగ్లోనూ మహిళలు పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచారని, బంగారు పతకాల జాబితాలోనూ భారత్ ముందంజలో ఉన్నదని ప్రధాని తెలిపారు. జనతా కర్య్ఫూ ప్రపంచానికి సూర్తి: ప్రధాని మోదీ 75వ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మోదీ ఏడాది పూర్తి చేసుకున్న జనతా కర్ఫ్యూపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనతా కర్య్ఫూ సందర్భంగా ప్రజలు చూపించిన క్రమశిక్షణ.. యావత్ ప్రపంచానికే ప్రేరణగా నిలిచిందన్నారు. దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కురువృద్ధులు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని ప్రధాని గుర్తుచేశారు. హైదరాబాద్లో జయ్ చౌదరీ అనే వందేండ్ల వృద్ధుడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడని, యూపీలో 109 ఏండ్ల రామ్ దులయ్యా, ఢిల్లీలో 107 ఏండ్ల కేవల్ కృష్ణ కరోనా కరోనా టీకా వేయించుకున్నారని ప్రధాని చెప్పారు. చదవండి: 25 పతకాలతో టాప్లో.. చీఫ్ సెలెక్టర్ అయి ఉంటే.. అతన్ని తీసుకొచ్చేవాడిని -
నీటి సంరక్షణ అందరి బాధ్యత
న్యూఢిల్లీ: దేశంలో నీటి సంరక్షణ అందరి బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రుతుపవనాలు ప్రవేశించడానికి ముందే చెరువులు, కాల్వలు, సరస్సుల్లో పూడికలు తీసి ప్రతీ వాన చినుకుని సంరక్షించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఆదివారం మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని వాన చినుకులు ఎప్పుడు పడినా, ఎక్కడ పడినా బొట్టు బొట్టు ఒడిసిపట్టి సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. వాన నీటిని పూర్తిగా సద్వినియోగం చేయడం కోసం చెరువులు, కాల్వలు నిర్వహణపై కేంద్ర జల మంత్రిత్వ శాఖ క్యాచ్ ది రెయిన్ అనే 100 రోజుల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్కు చెందిన బబితా రాజ్పుట్ నీటి సంరక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని అభినందించారు. తమ గ్రామంలో ఎండిపోయిన చెరువులకి జలకళ తీసుకువస్తున్న ఆమె కృషి అందరికీ ఆదర్శమన్నారు. తమిళం నేర్చుకోనందుకు బాధగా ఉంది ప్రపంచంలోనే అత్యంత పురాతమైన భాషల్లో ఒకటైన తమిళం నేర్చుకోలేకపోయినందుకు చాలా బాధగా ఉందని ప్రధాని∙మోదీ అన్నారు. తమిళం చాలా అందమైన భాషని, సుసంపన్నమైన సాహి త్యం ఉన్న ఆ భాషని నేర్చుకోలేకపోవడం లోటుగా ఉంటుందని చెప్పారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్కు వెళ్లినప్పుడు అపర్ణ రెడ్డిజీ అడిగిన ఓ చ్రిన్న ప్రశ్న అయినప్పటికీ తనని వెంటాడిందని అన్నారు. ‘‘మీరు చాలా ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధానిగా కూడా ఉన్నారు. జీవితంలో ఏదైనా మిస్ అయ్యారా’’అని ఆమె ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టమైందన్నారు. ఆ తర్వా త ఆలోచిస్తే తమిళ భాషని నేర్చుకోవడం మిస్ అయినట్టుగా అనిపించిందని ప్రధాని వివరించారు. పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి ప్రస్తావన ఈ సందర్భంగా ప్రధాని హైదరాబాద్ రైతు పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. వెంకటరెడ్డి లాంటి వ్యక్తుల నుంచి స్ఫూర్తిని పొందాలని సూచించారు. డి–విటమిన్ అధికంగా ఉండే వరి, గోధుమ రకాలను వెంకటరెడ్డి అభివృద్ధి చేశారని చెప్పారు. ప్రపంచ మేధో సంపత్తి హక్కుల సంస్థ నుంచి పేటెంట్ కూడా పొందారని తెలిపారు. ఆయనను గత ఏడాది పద్మశ్రీతో గౌరవించుకోవడం గర్వకారణమన్నారు. -
స్ట్రాబెర్రీ గర్ల్గా మారుమోగుతున్న గుర్లీన్ చావ్లా
2021 సంవత్సరపు మొదటి ‘మన్ కీ బాత్’లో నరేంద్ర మోడీ గుర్లీన్ చావ్లాను ప్రస్తావించారు. ‘ఆమె బుందేల్ఖండ్ ఆశాజ్యోతి’ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్లో వ్యవసాయం దుర్భరంగా ఉంది. ఉష్ణోగ్రత ఎక్కువ. వానలు, నీటివసతి తక్కువ. అలాంటి చోట సంప్రదాయ పంటలే కష్టం. కాని లా చదువుతున్న 23 ఏళ్ల గుర్లిన్ లాక్డౌన్లో తన ఊరు ఝాన్సీ వచ్చి ఊరికే ఉండకుండా తండ్రి పొలంలో స్ట్రాబెర్రీ వేసింది. విజయవంతంగా పండించింది. ‘స్ట్రాబెర్రీ గర్ల్’గా ఇవాళ ఆమె పేరు ఉత్తరప్రదేశ్లో మారుమోగుతోంది. లాక్డౌన్ ఎవరికి ఏం హాని చేసినా బుందేల్ఖండ్కి ఒక మేలు చేసింది. ఒక లా చదివే అమ్మాయి– గుర్లిన్ చావ్లా అక్కడ స్ట్రాబెర్రీ పంటను పండించి ఆదాయం గడించవచ్చని రైతులకు అర్థమయ్యేలా చేసింది. నిజంగా ఇది అనూహ్యమైన విషయమే. ఎందుకంటే స్ట్రాబెర్రీ 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఎండలు కాసే చోట పండదు. నీటి వసతి కూడా ఉండాలి. బుందేల్ఖండ్లో ఉష్ణోగ్రత ఎక్కువే అయినా నీరు తక్కువే అయినా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని గుర్లిన్ ఈ ఘనత సాధించింది. అందుకే ఇప్పుడు ఆమె అక్కడ ‘స్ట్రాబెర్రీ గర్ల్’గా ఖ్యాతి పొందింది. ఇంటి పంటతో మొదలు గుర్లిన్ చావ్లాది బుందేల్ఖండ్ (ఉత్తరప్రదేశ్ దక్షిణాది ప్రాంతం)లో ఝాన్సీ. పూనెలో లా చదువుతోంది. లాక్డౌన్లో కాలేజీ మూతపడటంతో ఇంటికి చేరుకుంది. ఇంట్లో తండ్రి టెర్రస్ మీద ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండించడం గమనించి ఎలాగూ ఖాళీగా ఉంది కనుక తోటపనిలో పడింది. రసాయనాలు లేని తాజా కూరగాయలు ఇంట్లోనే దొరుకుతున్నాయి అని అర్థం చేసుకుంది. ‘ఇలాంటి ఆరోగ్యకరమైన కూరగాయలు ఝాన్సీలో ప్రతి ఒక్కరూ తినే వీలు కల్పించాలి కదా’ అని తండ్రితో అంది. తండ్రి ‘అదంత సులభం కాదు తల్లీ’ అని గుర్లిన్తో అనేవాడు. స్ట్రాబెర్రీలను కోస్తున్న గుర్లీన్ చావ్లా మార్చిన స్ట్రాబెర్రీ ఒకరోజు గుర్లిన్ 20 స్ట్రాబెర్రీ మొలకలను తెచ్చి తన ఇంటి డాబా మీద ఉన్న తోటలో నాటింది. కోకోపీట్ ఉన్న మట్టికుండీలలో వాటిని వేసింది. ‘ఇవి బతకవు’ అని అందరూ అన్నారు. ‘కాని ఆ మొక్కలు బతికాయి. ఇంకా ఆశ్చర్యంగా కాయలు కూడా కాశాయి. అవి సైజులు చిన్నగా, జ్యూస్ తక్కువగా ఉన్నా రుచిగా ఉన్నాయి. అరె... వీటిని పొలంలో ఎందుకు పండించకూడదు అనుకుంది గుర్లిన్. తండ్రితో పోరు పెట్టడం మొదలెట్టింది. తండ్రికి ఝాన్సీ దాపునే నాలుగున్నర ఎకరాల పొలం ఉంది. అందులో సేద్యం ఏమీ చేయడం లేదు. ఝాన్సీ ఉత్సాహం చూసి ‘కావాలంటే అందులో ట్రై చెయ్’ అన్నాడు తండ్రి. లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంది గుర్లిన్. 2020 అక్టోబర్లో సేంద్రియ పద్ధతి ద్వారా ఒకటిన్నర ఎకరాలో స్ట్రాబెర్రీ పంట వేసింది. ఈ విషయం రైతులకు వింత వార్త అయ్యింది. కాని గుర్లిన్కు తెలుసు.. తాను ఎలాగైనా విజయం సాధిస్తానని. పది వేల కిలోల దిగుబడి... జనవరి నెల వచ్చేనాటికి స్ట్రాబెర్రీని పండించడంలో మెళకువలన్నీ తెలుసుకుంది గుర్లిన్. ‘ఈ సీజన్లో పది వేల కిలోల దిగుబడిని ఆశిస్తున్నాను. ఇప్పుడు రోజూ కాయను కోసి మార్కెట్లో కిలో 250 రూపాయలకు అమ్ముతున్నాను’ అని చెప్పిందామె. ఆమె పొలంలో స్ట్రాబెర్రీ కాయ పెద్దదిగా కాయడమే కాదు రంగులో, జ్యూస్లో మరింత ఫలవంతంగా ఉంది. ‘రైతులు ఒక పంట ఒకే పద్ధతిలో పోకుండా భిన్నంగా ఆలోచిస్తే ఇలాంటి విజయాలు సాధించవచ్చు’ అని కూడా గుర్లిన్ అంది. అంతే కాదు ఒకవైపు స్ట్రాబెర్రీ వేసి మరోవైపు మిగిలిన మూడు ఎకరాల్లో ఆమె సేంద్రియ పద్ధతిలో బెంగళూరు మిర్చి, టొమాటో, కాలిఫ్లవర్ పండిస్తోంది. ‘చదువుకున్న యువత కూడా సేద్యం చేయడానికి ఆసక్తిగా ఉంది. కాకపోతే ప్రభుత్వం నుంచి వారికి సపోర్ట్ కావాలి’ అని గుర్లిన్ అంది. స్ట్రాబెర్రీ అంబాసిడర్ జనవరి 16 నుంచి ఝాన్సీలో ‘స్ట్రాబెర్రీ ఫెస్టివల్’ జరుగుతోంది. ప్రభుత్వమే దానిని నిర్వహిస్తోంది. బుందేల్ఖండ్ ప్రాంతంలో స్ట్రాబెర్రీని ప్రోత్సహించడానికి చేస్తున్న ఈ ఉత్సవానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గుర్లిన్ను ‘స్ట్రాబెర్రీ అంబాసిడర్’గా ప్రకటించారు. అంతే కాదు ప్రధాని మోడి తన మన్ కీ బాత్లో గుర్లిన్ను ప్రస్తావించారు. దాంతో గుర్లిన్పై ప్రశంసలు కురుస్తున్నాయి. భవిష్యత్తులో ఈమె కథా ఒక బయోపిక్ అయినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. – సాక్షి ఫ్యామిలీ -
తిరంగాకు అవమానం.. తీవ్ర విచారకరం
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు దేశ రాజధాని ఢిల్లీలో మువ్వన్నెల జాతీయ జెండాకు జరిగిన అవమానాన్ని చూసి దేశం యావత్తూ తీవ్ర విచారంలో మునిగిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనవరి 26న రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా ఎర్రకోట వద్ద మత జెండాను ఎగురవేయడాన్ని ఉదహరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. వ్యవసాయ రంగం ఆధునీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఈ దిశగా ఎన్నో చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని కూరగాయల మార్కెట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. మన వ్యాక్సినేషన్.. ప్రపంచానికి ఆదర్శం ‘‘మనం గత ఏడాది అంతులేని సహనం, ధైర్యం ప్రదర్శించాం. అదే కొనసాగించాలి. లక్ష్యాలు, తీర్మానాలను సాధించడానికి కష్టపడి పనిచేయాలి. మన దేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలి. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్లో అమలవుతోంది. ఇతర దేశాల కంటే మిన్నగా మన ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందజేస్తున్నాం. 15 రోజుల్లో 30 లక్షల మంది కరోనా యోధులకు వ్యాక్సిన్ ఇచ్చాం. 30 లక్షల మందికి ఈ టీకా ఇవ్వడానికి అమెరికాకు 18 రోజులు, యూకేకు 36 రోజులు పట్టింది. కరోనా మహమ్మారిపై మన పోరాటం ప్రపంచానికే ఒక ఉదాహరణగా నిలిచింది. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న కరోనా టీకాలను చాలా దేశాలకు సరఫరా చేస్తున్నాం. ప్రాణాధార ఔషధాలు, టీకాల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించింది. ఈ ఏడాది 75వ స్వాతంత్య్ర వేడుకలను అమృత్ మహోత్సవ్గా దేశం జరుపుకోనుంది. మీ ప్రాంతంలో జరిగిన పోరాట ఘట్టాలను వెలుగులోకి తీసుకురండి. పుస్తకాలు రాయండి. మీ రచనలే మన స్వాతంత్య్ర పోరాట యోధులకు గొప్ప నివాళి. అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో పుస్తకాలు రావాలి. ఈ దిశగా యువతను ప్రోత్సహిస్తాం’’అని ప్రధాని తెలిపారు. ‘‘రోడ్డు ప్రమాదాలు దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. రహదారి భద్రత కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘లేట్ మిస్టర్’గా కాకుండా ‘మిస్టర్ లేట్’గా ఉండడమే ఉత్తమం అంటూ రహదారులపై కనిపిస్తున్న నినాదాలు చాలా ప్రభావవంతంగా ఉంటున్నాయి. రహదారి భద్రతపై ఇలాంటి నినాదాలను ప్రభుత్వానికి పంపించండి. మన యోగాకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోంది. చిలీ దేశ రాజధాని శాంటియాగోలో 30కి పైగా యోగా స్కూళ్లు ఉన్నాయని తెలిస్తే మీరు చాలా సంతోషిస్తారు. చిలీ సెనేట్లోని ఉపాధ్యక్షుడి పేరు రవీంద్రనాథ్ క్వింటేరోస్. మన రవీంద్రనాథ్ ఠాగూర్ స్ఫూర్తితోనే ఆయనకు ఆ పేరు పెట్టారు’’ అని తెలిపారు. బోయిన్పల్లి మార్కెట్ భేష్ హైదరాబాద్లోని బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ బాధ్యతలు నెరవేర్చే విధానం చాలా సంతృప్తినిచ్చింది. మార్కెట్లలో చాలా కారణాల వల్ల కూరగాయలు చెడిపోవడం మనం చూశాం. వీటితో మార్కెట్లలో అపరిశుభ్రత నెలకొంటోంది. కానీ, బోయిన్పల్లి మార్కెట్లో ఇలా రోజువారీ పాడైన కూరగాయలతో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేయడం వినే ఉంటారు. ఇది నవకల్పన శక్తి. బోయిన్పల్లి మార్కెట్లో వ్యర్థాల నుంచి సంపద సృష్టి జరుగుతోంది. ఇది వ్యర్థాల నుంచి బంగారం తయారు చేసే దిశగా సాగుతున్న ప్రయాణం. అక్కడ రోజుకు 10 టన్నుల వ్యర్థాలు తయారవుతున్నాయి. వాటిని సేకరించి, ప్లాంట్లో రోజూ 500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇది మార్కెట్కు వెలుగులు పంచుతోంది. దాదాపు 30 కిలోల జీవ ఇంధనం కూడా ఉత్పత్తి అవుతోంది. దీంతో మార్కెట్ క్యాంటీన్లో ఆహారాన్ని తయారు చేస్తున్నారు. -
థ్యాంక్స్ మోదీ జీ.. టీమిండియా ఎమోషనల్ ట్వీట్
ఢిల్లీ: మన్ కీ బాత్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ టీమిండియాపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. గబ్బాలో చారిత్రక విజయాన్ని నమోదు చేయడంపై భారత జట్టు ప్రతిభను కొనియాడారు. ' ఈ నెలలో మనకు క్రికెట్ ఒక శుభవార్త అందించింది. ఆసీస్ గడ్డపై ఆదిలో భారత జట్టు ఒడిదొడుకలకు లోనైనా.. చివరలో మాత్రం టెస్టు సిరీస్లో అదరగొట్టి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. మన జట్టు కృషి, సమిష్టి పోరాటం అందరికి స్పూర్తిదాయకం' అని పేర్కొన్నారు. తాజాగా మోదీ చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ,టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి, వైస్ కెప్టెన్ అజింక్య రహానే, సహా పలువురు ఆటగాళ్లు స్పందించారు. 'థ్యాంక్యూ మోదీ జీ.. మీ మాటలు మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. స్పూర్తిని నింపే మీ వాఖ్యలతో భారతీయ జెండాను మరింత ఎత్తులో ఎగరడానికి మా వంతు కృషి చేస్తాం. రాబోయే మ్యాచ్ల్లో మరింత ప్రతిభను చూపి సిరీస్లు గెలిచేందుకు సాధ్యమైనంత వరకు పోరాడుతాం. జై హింద్' అంటూ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మోదీ చేసిన వ్యాఖ్యలను రీట్వీట్ చేస్తూ జాతీయ జెండాను ట్వీట్ చేశాడు. చదవండి: కళ్లు చెదిరే సిక్స్.. కొడితే అవతల పడింది 'థ్యాంక్యూ సార్.. మీ మాటలు మాకు ఎంకరేజింగ్ అనిపించాయి. మీలాంటి వ్యక్తులిచ్చే సందేశం మాలాంటి వారికి ఎంతో గౌరవాన్ని కల్పిస్తాయి.' అంటూ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ట్వీట్ చేశాడు. ఇక బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. 'ఆసీస్ గడ్డపై టీమిండియా వీరోచిత ప్రదర్శనను గుర్తించినందుకు మోదీ జీ.. మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు' అంటూ పేర్కొన్నాడు. చదవండి: ఆండ్రూ టై కావాలనే అలా చేశాడా! -
మోదీ మన్ కీ బాత్: ఆ ఘటన బాధాకరం
సాక్షి, ఢిల్లీ: గణతంత్ర దినోతవ్సం రోజున ఎర్రకోటలో త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జనవరి 26న రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో కొంత మంది ఎర్రకోటపై ఇతర జెండాలను ఎగురవేసిన ఘటనను ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాదిలో తొలిసారిగా ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన ఆదివారం ప్రసంగించారు. కరోనా వ్యాక్సిన్తో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని.. భారత్ను చాలా దేశాలు ప్రశంసిస్తున్నాయని పేర్కొన్నారు. బ్రెజిల్ రాష్ట్రపతి కూడా భారత్ వ్యాక్సిన్ను ప్రశంసించారని, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ భారత్లో జరుగుతోందని ప్రధాని తెలిపారు. 15 రోజుల్లోనే 30లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేశామని పేర్కొన్నారు. (చదవండి: ఈ దశాబ్దం చాలా కీలకం : ప్రధాని మోదీ ) ‘‘అమెరికా వంటి అగ్రదేశానికి 18 రోజులు, బ్రిటన్కు 36 రోజులు పట్టింది. మేడిన్ ఇండియాలో భాగంగా చేపట్టిన వ్యాక్సిన్ భారత్ ఆత్మ నిర్భరతకు ప్రతీక. భారత్లో తయారైన వ్యాక్సిన్ దేశ ఆత్మగౌరవానికి ప్రతీక’’ అని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో భారత్ విజయం స్ఫూర్తిదాయకమని.. భారత క్రికెట్ జట్టుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. (చదవండి: ఫోన్ చేస్తే చాలు..చర్చలకు సిద్ధం..) మన్కీ బాత్లో బోయిన్పల్లి సబ్జీ మండి ప్రస్తావన.. ప్రధాని మోదీ.. మన్కీ బాత్లో హైదరాబాద్ బోయిన్పల్లి సబ్జీ మండి గురించి ప్రస్తావించారు. సబ్జీ మండిలో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని, వ్యర్థాలు ఇప్పుడు సంపదగా మారుతున్నాయని పేర్కొన్నారు. సబ్జీ మండిలో ప్రతిరోజు 10వేల టన్నుల వ్యర్థాలను సేకరిస్తారని, 30 కేజీల జీవ ఇంధనంతో పాటు 500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని ప్రధాని తెలిపారు. -
దేశం కోసం తీర్మానం చేద్దాం
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం పేరుతో ఏటా తీర్మానాలు చేసే వారు ఈసారి దేశం కోసం తీర్మానం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రెండో విడత మన్ కీ బాత్ 19వ సంచికలో ఆదివారం ప్రధాని దేశవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం కోసం తీర్మానం చేయాలన్న విశాఖపట్నానికి చెందిన వెంకట మురళీ ప్రసాద్, కొల్హాపూర్కు చెందిన అంజలి చేసిన ఈ సూచనను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశం 2021లో కొత్త విజయ శిఖరాలు తాకాలని, ప్రపంచంలో భారతదేశం మరింత గుర్తింపు పొందాలని, మరింత శక్తిమంతం కావాలని కోరుకోవడం కంటే గొప్ప కోరిక ఏముంటుందని ప్రధాని పేర్కొన్నారు. కరోనా కారణంగా సప్లయ్ చైన్తో పాటు అనేక విషయాల్లో ప్రపంచంలో చాలా అడ్డంకులు ఏర్పడ్డాయని, కానీ, ప్రతి సంక్షోభం నుంచి కొత్త పాఠాలు నేర్చుకున్నామన్నారు. దేశంలో కొత్త సామర్థ్యం కూడా ఏర్పడిందని, దీనికి స్వావలంబన అని పేరు పెట్టొచ్చని మోదీ తెలిపారు. గుర్గావ్కు చెందిన ప్రదీప్ హీలింగ్ హిమాలయాస్ అనే ఉద్యమం ప్రారంభించి, పర్యాటక ప్రాంతాల్లో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ను శుభ్రపరిచారని తెలిపారు. ఇదే స్ఫూర్తిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి దేశానికి విముక్తి కల్పించాలని కోరారు. 2021 తీర్మానాల్లో ఇది కూడా ఒకటిగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆసక్తికరమైన లేఖ అది ‘విశాఖపట్నం నుంచి వెంకట మురళీ ప్రసాద్ రాసిన ఆలోచన విభిన్నంగా ఉంది. 2021 కోసం ఏబీసీని అటాచ్ చేస్తున్నానంటూ లేఖ రాశారు. స్వయం సమృద్ధిగల భారత చార్ట్ ఏబీసీ. చాలా ఆసక్తికరంగా ఉంది. నిత్యం వినియోగించే అన్ని వస్తువుల పూర్తి జాబితాను వెంకట్ తయారుచేశారు. దీంట్లో ఎలక్ట్రానిక్, స్టేషనరీ, స్వీయ సంరక్షణ సామగ్రితోపాటు మరికొన్ని వస్తువులు ఉన్నాయి. మనకు తెలియకుండానే దేశంలో సులభంగా లభించే విదేశీ ఉత్పత్తులు ఉపయోగిస్తున్నామని తెలిపారు. దేశవాసుల శ్రమ, చెమట ఉన్న ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తానని వెంకట్ ప్రతిజ్ఞ చేశారు. స్వావలంబన దేశానికి తాము మద్దతు ఇస్తున్నామని కూడా రాశారు. దేశీయ తయారీదారులు నాణ్యతలో రాజీ పడరాదు’’ -
‘మోదీగారు ఇక చాలు, ముచ్చట్లు ఆపండి’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 72 వ మన్ కీ బాత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా రైతులు, నెటిజన్ల పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లూ రేడియోలో మీరు చెప్తున్నదంతా వినీ వినీ అలసిపోయాం. ఇక చాలు ఆపండి. మా గోడు కూడా వినండి అని రైతులు విమర్శిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు బోర్డర్, ఫరీద్కోట్, రోహ్తక్ ప్రాంతాల్లో ప్లేట్లు, డబ్బాలు మోగించి నిరసన తెలిపారు. ఈ మూడు ప్రాంతాలు బీజేపీ అధికారంలో ఉన్న హరియాణాలోనివి కావడం విశేషం. ఇక ట్విటర్లోనూ ‘మోదీ బక్వాస్ బంద్ కరో’ (మోదీ వ్యర్థ ప్రేలాపణ ఆపండి) అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఆదివారం మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభం కాగానే ఈ హ్యాష్ట్యాగ్ భారత్లో ట్రెండింగ్లోకి వచ్చింది. ‘ప్రధాని మోదీ గారు. మన్ కీ బాత్ కాదు, నెల రోజులకు పైగా రైతులు చేస్తున్న నిరవధిక నిరసనలపై మాట్లాడండి’ అని డిమాండ్ చేస్తున్నారు. ‘ప్రజలు చెప్పే విషయాన్ని మోదీ వినరు.. కానీ ఆయన మన్ కీ బాత్ అందరూ వినాలి’ అంటూ మరో నెటిజెన్ రాసుకొచ్చారు. మరోవైపు బీజేపీ అధికారిక యూట్యూబ్ ఛానల్లో మోదీ మన్ కీ బాత్ వీడియోపై డిస్లైక్ల పరంపర మళ్లీ మొదలైంది. ఆ వీడియోకు వచ్చిన లైక్ల కంటే ఎక్కువ సంఖ్యలో డిస్లైకులు వస్తున్నాయి. (చదవండి: సాగు చట్టాలతో రైతులకు లాభం) ఆ మాటలు వినిపించొద్దు అంటే.. వ్యవసాయ బిల్లులపై రైతుల నిరసన నేపథ్యంలో గత ఆదివారం స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ ప్లేట్లు, డబ్బాలు మోగించి నిరసన తెలపాలని రైతులకు పిలుపునిచ్చారు. మన గోడు వినని ప్రధాని మాటల్ని వినాల్సిన అవసరం లేదని అన్నారు. డిసెంబర్ 27 మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రైతులెవరూ పట్టించుకోవద్దు. దానికి నిరసనగా పల్లాలు మోగించండి. అలాచేస్తే ప్రధాని మన్ కీ బాత్ మనకు వినపడదు అని యోగేంద్ర సూచించారు. ఇక కరోనా లాక్డౌన్ మొదలైన సమయంలో ఆరోగ్య రంగంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవల గౌరవార్థం ప్రధాని మోదీ చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు రైతుల సంఘాల నేతలతో కేంద్రం ఐదు సార్లు జరిపిన చర్చలు విఫలం కాగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. వారి సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేయాలని ఆదేశించింది. (చదవండి: అన్నదాతల ధర్మాగ్రహం) -
సాగు చట్టాలతో రైతులకు లాభం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రైతన్నలకు లాభాలే తప్ప ఎలాంటి నష్టం ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ చట్టాలతో అన్నదాతలకు నూతన అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటున్నాయని చెప్పారు. ఆయన ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడారు. అన్నదాతలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు కొత్త వ్యవసాయ చట్టాలతో అతి తక్కువ సమయంలోనే పరిష్కారం దొరుకుతోందని హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని అన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో రైతులకు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. రైతులు బంధ విముక్తులయ్యారు.. ‘‘ఎన్నో ఏళ్లుగా రైతులు ఎన్నో డిమాండ్లు వినిపిస్తున్నారు. రాజకీయ పార్టీలు రైతన్నలకు ఎన్నో హామీలిస్తున్నాయి. ఈ డిమాండ్లు, çహామీలను ప్రభుత్వం నెరవేర్చింది. మేము అమల్లోకి తీసుకొచ్చిన సంస్కరణలతో అన్నదాతలు బంధ విముక్తులయ్యారు. వారికి చాలా అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. హక్కులు దఖలు పడ్డాయి. అతి తక్కువ సమయంలోనే రైతుల సమస్యలు పరిష్కారమవుతున్నాయి’’ అని ప్రధాని పేర్కొన్నారు. కొత్త సాగు చట్టాలను తక్షణమే రద్దు చేయాలన్న డిమాండ్తో వేలాదిగా రైతులు ఢిల్లీలో 4 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మన కళాఖండాలను వెనక్కి తీసుకొస్తున్నాం.. ఏ రంగంలోనైనా సరైన సమాచారం అనేది ప్రజలకు ఒక బలమేనని ప్రధాని మోదీ తెలిపారు. పుకార్లకు, గందరగోళానికి తావు లేని సమాచారం కావాలన్నారు. 1913లో వారణాసిలో అపహరణకు గురైన మాత అన్నపూర్ణ విగ్రహాన్ని కెనడా నుంచి వెనక్కి తీసుకొచ్చామని గుర్తుచేశారు. అత్యంత విలువైన ప్రాచీన సంపద అంతర్జాతీయ ముఠాల చేతుల్లో చిక్కుకుందన్నారు. మన కళాఖండాలను ఆయా ముఠాలు అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాయని చెప్పారు. వాటిని వెనక్కి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని గుర్తుచేశారు. కర్తార్పూర్ కారిడార్ చరిత్రాత్మకం.. సిక్కు గురువు గురు నానక్ జయంతి సోమవారం జరగనుంది. ఈ సందర్భంగా ఆయన అందించిన సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. సిక్కు గురువులు, గురుద్వారాలకు సంబంధించిన ఎన్నో పనుల్లో భాగస్వామి కావడం తన అదృష్టమన్నారు. కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభం చరిత్రాత్మక ఘట్టమని చెప్పారు. భారతీయ సంస్కృతికి ఆదరణ.. విలక్షణమైన భారతీయ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఇనుమడిస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. బ్రెజిల్కు చెందిన జోనాస్ మాసెట్టి భారతీయ వేదాలు, భగవద్గీత, మన సంప్రదాయాలు, సంస్కృతిని బహుళ ప్రచారంలోకి తీసుకొస్తున్నారని తెలిపారు. న్యూజిలాండ్ పార్లమెంట్ సభ్యుడు గౌరవ్ శర్మ ఇటీవల సంస్కృత భాషలో ప్రమాణ స్వీకారం చేశారని గుర్తుచేశారు. ప్రముఖ తత్వవేత్త శ్రీఅరబిందోను కూడా ప్రధాని మోదీ స్మరించుకున్నారు. శ్రీఅరబిందో జయంతి డిసెంబర్ 5వ తేదీన జరగనుంది. వ్యాక్సిన్ బృందాలతో నేడు మోదీ మాటామంతీ వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలో ముందంజలో ఉన్న మూడు బృందాలతో ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. జెనోవా బయోఫార్మా, బయోలాజికల్ ఈ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ సంస్థల పరిశోధకులతో మోదీ సంభాషిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం ఆదివారం ట్విట్టర్లో వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి పురోగతిని తెలుసుకునేందుకు ప్రధాని మోదీ శనివారం అహ్మదాబాద్, హైదరాబాద్, పుణేల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. -
మీరు రైతులకు అవగాహన కల్పించండి!
న్యూఢిల్లీ : వ్యవసాయ సంస్కరణలు రైతులకు కొత్త అవకాశాలకు తలుపులు తెరిచాయని, వారికి మరిన్ని హక్కులు కల్పించాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం 71వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా కొత్తగా అమల్లోకి తెచ్చిన వ్యయసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతుల భయాల్ని తొలగించే ప్రయత్నం చేశారు. యువత.. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన చదువులు చదువుతున్నవారు దగ్గరలోని గ్రామాలకు వెళ్లి ఆధునిక వ్యయసాయం, కొత్త వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించాలని కోరారు. ( స్వచ్ఛత మనకు అందని మానిపండు..) కాగా, గతంలో జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 2014లో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంతో పండ్లు, కూరగాయల సాగుదారులు లాభపడగా, ఇప్పుడు ధాన్యం రైతులకు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు తగినంత స్వేచ్ఛ లభించిందని ప్రధాన మోదీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో కూడా రైతుల వల్లే వ్యవసాయ రంగం బలోపేతమైందని, స్వయం సమృద్ధ భారత్కు అన్నదాతలు కీలకంగా ఉన్నారని కొనియాడారు. -
మన్కీ బాత్లో మోదీ మెచ్చుకుంది ఈయననే!
ఎంత పంచితే అంత పెరిగేది జ్ఞానం. ఆ విజ్ఞానకాంతులను నలుదిశలా పరుచుకోవాలని తపిస్తున్న వ్యక్తి పేరు సందీప్ కుమార్ బద్స్రా. ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కి బాత్ ప్రసంగంలో సమాజంలో విద్య, జ్ఞానం వ్యాప్తిని ప్రోత్సహించే వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు చండీగడ్ వాసి సందీప్ కుమార్ చేస్తున్న మంచి పని గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో 28 ఏళ్ల సందీప్ పేదల పిల్లలకు పుస్తకాల పంపిణీ, సేకరణలో బిజీగా ఉన్నాడు. ఇప్పటివరకు 8 వేల మందికి పైగా నిరుపేద విద్యార్థులకు 18,000 పుస్తకాలను పంపిణీ చేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక తన పేరును ప్రధాని ప్రస్తావించడంపై ఉద్వేగభరితుడయ్యాడు. సందీప్ మాట్లాడుతూ ‘నేను ఈ రోజు బాపు ధామ్ వద్ద పుస్తకాల పంపిణీలో బిజీగా ఉన్నాను. అందుకే నేను ఉదయం మన్ కి బాత్ కార్యక్రమం వినలేదు. నా పనిని ప్రస్తావించడం గురించి, దేశ ప్రధానమంత్రి మెచ్చుకున్నప్పుడు నేను సరైన దిశలో వెళుతున్నానని మరింతగా స్పష్టమైంది. విద్య సమాజాన్ని మార్చగలిగే మాధ్యమం అని ఎప్పుడూ నమ్ముతాను. ప్రధాని ప్రస్తావించడం అంటే సమాజం కోసం మరింత మేలు చేయటానికి ప్రోత్సాహానిస్తుంది’ అన్నాడు. ఇంటింటికీ తిరిగి సేకరణ హర్యానాలోని భివానీ జిల్లాలోని ధని మహు గ్రామానికి చెందిన సందీప్ చండీగడ్లోని శ్రీ గురు గోవింద్ సింగ్ ఖల్సా కాలేజీ నుండి డిగ్రీ పూర్తిచేశాడు. 2016 లో భివానీ జిల్లాలోని దాదామ్ గ్రామంలో తన ఆరు నెలల జెబిటి శిక్షణ సమయంలోనే పేద పిల్లలకు పుస్తకాలు అందించి, వారిని ప్రోత్సహించాలనుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత పుస్తకాలు కొనడం, స్టేషనరీ వస్తువులను సేకరించడం వాటిని రీసైక్లింగ్ చేయడం మొదలుపెట్టాడు. 2017 లో సందీప్ ‘ఓపెన్ ఐ ఫౌండేష ’ను ప్రారంభించాడు. ఈ మూడేళ్లలో అతను ట్రిసిటీలోని మురికివాడల పిల్లలకు 18,000 పుస్తకాలను పంపిణీ చేశాడు. ‘నా జెబిటి శిక్షణ సమయంలో, దాదామ్ గ్రామంలోని పాఠశాల పిల్లలు పుస్తకాలు, నోటుబుక్స్ లేకపోవడంతో స్కూల్కి వచ్చేవారు కాదు. వారి కోసం ఏదైనా చేయాలనుకున్నాను. మా ఇంట్లోవాళ్లకు ఆలోచన గురించి చెప్పినప్పుడు మొదట్లో ఇష్టపడలేదు. ముందు ఏదైనా ఉద్యోగం చేయమన్నారు. దీంతో నేను ఇంటిని విడిచిపెట్టి, కొంత డబ్బు సంపాదించడానికి పెళ్లిళ్ళలో వెయిటర్గా పని చేశాను. సెక్టార్ 11 లోని పిజిజిసిలో మొదటి పుస్తక విరాళ శిబిరాన్ని నిర్వహించాను. నా నిబద్ధతను చూసి, మా అన్న అతని భార్యతో సహా నా కుటుంబం కూడా పుస్తకాల కోసం రూ.35,000 ఇచ్చి తమ చేయూతను అందించారు. అప్పటి నుండి, పేదలకు పుస్తకాలు, చదువును అందించడం గురించే ఆలోచించాను. ప్రజల నుండి పుస్తకాలను సేకరించడానికి నేను సెకండ్ హ్యాండ్ స్కూటర్ను నడుపుతున్నాను. నా గదిలో ఎక్కువ స్థలం లేనందున కొన్నిసార్లు నా స్నేహితుల ఇళ్ళ వద్ద పుస్తకాలను ఉంచాల్సి వచ్చేది’ అని తెలిపారు సందీప్. మిత్రుల సాయం రెండేళ్ళలో నాయగావ్ వద్ద ఒక చిన్న ఆఫీసు తెరిచాడు సందీప్. తరువాత 690 చదరపు అడుగుల çస్థలంలో ఉన్న ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అక్కడ కన్సల్టెన్సీతో పాటు టిఫిన్ వ్యాపారాన్ని నడపడం మొదలుపెట్టాడు. అతని ఆదాయంలో 60 శాతం ఎన్జీఓ కోసం ఖర్చు చేస్తాడు. లాక్డౌన్ సమయంలో ఈ ఎన్జీవో 40 మంది మురికివాడల పిల్లలకు పుస్తకాలు అందజేసింది. దృష్టి లోపం ఉన్న విద్యార్థుల కోసం 40 ఆడియో పుస్తకాలను రికార్డ్ చేసింది. ‘నేను చేసినదంతా సమాజ హితం కోసమే. తమ వంతు పాత్ర పోషించాలనుకునే మిత్రుల సాయంతో ఇదంతా జరిగింది. కిందటేడాది చిన్నలైబ్రరీని ఏర్పాటుకు వ్యాన్ తీసుకున్నాను. లాక్డౌన్ సమయంలో చాలా మంది నగరవాసులు, వాలంటీర్లు దృష్టి లోపం ఉన్న విద్యార్థుల కోసం 40 కి పైగా ఆడియో పుస్తకాలను రికార్డ్ చేయడంలో సహాయపడ్డారు’ అని ఆనందంగా తెలిపాడు సందీప్. గొప్ప అవకాశం విద్యార్థులు తమ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం, చదవుకోవడానికి పుస్తకాలు ఇవ్వడమనేది తనకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం అని చెబుతాడు సందీప్. ‘మా తాత సుబేదార్ కన్హయ్య కుమార్ నుండి నేను ప్రేరణ పొందాను. అతను 1950 లలో మా స్థానిక గ్రామంలో తన భూమిని అమ్మి అక్కడ ఒక పాఠశాలను ప్రారంభించాడు. ఈ పాఠశాల ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలగా మార్చారు. అక్కడి విద్యార్థులు స్వీట్స్తో మా ఇంటికి వచ్చి, వచ్చే ఏడాదికి కూడా పుస్తకాలు అవసరమని నాకు చెప్పినప్పుడు వారికి సాయం చేసే అవకాశం ఇస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంటుంది’ అని వివరించాడు. -
‘ఎన్నాప్పా.. సౌక్కియమా’..
సాక్షి, చెన్నై: పదో తరగతి కూడా చదవలేదు. బతుకు బండి లాగేందుకు అతను చేసేది క్షవరవృత్తి. అయితేనేం ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ అతడితో సంభాషించారు. ప్రశంసల వర్షం కురిపించారు. అతని జీవితంలోని భిన్నమైన కోణానికి మరింత స్పూర్తి నింపారు. వివరాల్లోకి వెళితే... తూత్తుకూడికి చెందిన పొన్ మారియప్పన్ జీవనోపాధి కోసం మిల్లర్పురంలో సెలూన్ ప్రారంభించాడు. కానీ లోలోపలే ఉన్నతవిద్య చదువుకోలేదనే అంతర్మధనంతో సతమతమయ్యేవాడు. చదువంటే పాఠ్యపుస్తకాలే కాదు లోకజ్ఞానం కూడా అని భావించాడు. పుస్తకాలు చదవడం ప్రారంభించాడు. తనలాంటి వారి కోసం తన సెలూన్ను ఒక గ్రంథాలయంగా మార్చేశాడు. ఈ ప్రయత్నం స్థానికులనే కాదు ప్రధాని నరేంద్రమోదీనే ఆకర్షించింది. “మన్కీ బాత్’ కార్యక్రమంలో మారియప్పన్తో ఇటీవల పధాని మోదీ సంభాషించి మెచ్చుకోవడంతో అతని ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఈ ఆనందానుభూతి అతడి మాటల్లోనే... ‘తూత్తుకూడి ఆలిండియా రేడియో స్టేషన్ వారు ఒక రోజు నన్ను అకస్మాత్తుగా తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. నా గురించి అప్పటికే అందరికీ తెలిసి ఉండడంతో అరుదైన పుస్తకాలు ఇస్తారేమోననే ఆలోచనతో వెళ్లాను. అయితే రేడియో స్టేషన్ ఉన్నతాధికారులు నా వద్దకు వచ్చి ప్రధాని మోదీ మీతో మాట్లాడుతారని చెప్పడంతో బిత్తరపోయాను. మన్కీ బాత్ ద్వారా ప్రధాని మోదీ ముందుగా నా క్షేమ సమాచారాలు తమిళంలోనే అడిగి తెలసుకుని సంభాషించడంతో ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. సెలూన్ను పుస్తకాలతో గ్రంథాలయంగా మార్చడం ద్వారా ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్నాను. అయితే ప్రధానితో మాట్లాడిన తరువాత ఇంకా ఎంతో సాధించాలనే తపన పెరిగింది. నీకు బాగా నచ్చిన గ్రంథం ఏదని మోదీ అడిగినప్పుడు తిరుక్కురల్ అని చెప్పాను. (విషమంగా వ్యవసాయశాఖ మంత్రి ఆరోగ్యం) 8వ తరగతితో చదువు మానేసి 2014లో సెలూన్ను ప్రారంభించాను. పుస్తక పఠనాన్ని పెంచాలనే ఉద్దేశంతో 2015లో సెలూన్లో గ్రంథాలయం పెట్టాను. గ్రంథాల్లోని ముఖ్యమైన అంశాలను వివరిస్తూ హెయిర్ కటింగ్, షేవింగ్ చేయడం ద్వారా పలు సామాజిక విషయాలపై ఎంతో మందిలో చైతన్యం తీసుకొచ్చాను. ప్రస్తుతం నా గ్రంథాలయంలో 1,500లకు పైగా పుస్తకాలున్నాయి. సెలూన్కు వచ్చే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగంగా మారింది. విద్యార్థులకు రాయితీపై సెలూన్ సేవలు అందిస్తున్నాను. నాకు అమ్మ, నాన్న, భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఉమ్మడి కుటుంబంగా అందరం ఒకే చోట ఉంటాం. నేను చేసిన ఒక సాధారణ ప్రయత్నానికి ప్రధాని ప్రశంస లభించడం ఎంతో ఆనందంగా ఉందని’ తెలిపాడు. -
ప్రధాని కోరిన కథ
‘కథలు చెప్పండి... వినండి’ అన్నారు ప్రధాని మోడి. మొన్నటి ఆదివారం ఆయన తన ‘మన్ కి బాత్’లో కథలు చెప్పే సంస్కృతి గురించి మాట్లాడారు. పిల్లలకు కథలు చెప్పడం ఎంత అవసరమో తెలియచేశారు. అంతేకాదు చెన్నైలో గత నాలుగేళ్లుగా పిల్లలకు కథలు చెప్పడమే పనిగా పెట్టుకున్న శ్రీవిద్య వీరరాఘవన్ను మెచ్చుకున్నారు. ఆమె కూడా అందరిలాంటి తల్లే. కాకపోతే చాలామంది తల్లులు కథలు చెప్పట్లేదు. ఆమె చెబుతోంది. ఆమె పరిచయం. ‘చిన్నప్పుడు అమ్మ కథ చెప్పనిదే ముద్ద ముట్టేదాన్ని కాదు’ అంటారు శ్రీవిద్య వీరరాఘవన్. ‘మా అమ్మ నాకు అన్నం తినిపించడానికి ఎన్ని కథలు చెప్పేదో లెక్కలేదు. దాంతో నేను నాకు ఎనిమిది తొమ్మిదేళ్ల వయసు వచ్చేసరికి కథల భూతంలా మారిపోయాను. అంటే అల్లావుద్దీన్ దీపాన్ని రుద్దితే భూతం ప్రత్యక్షమైనట్టుగా నన్ను కాస్త అడిగితే కథ ప్రత్యేక్షమయ్యేది. నా చుట్టూ ఉండే వాళ్లకు ఆ వయసులోనే కథలు చెప్పేదాన్ని’ అంటారామె. శ్రీవిద్య వీరరాఘవన్ ఆదివారం హటాత్తుగా వార్తల్లోకి వచ్చారు. దానికి కారణం ప్రధాని నరేంద్ర మోడి తన రేడియో కార్యక్రమం ‘మన్ కి బాత్’లో ఆమె ప్రస్తావన తేవడమే. ‘పిల్లలకు కథలు చెప్పడం చాలా అవసరం. కాని మన దేశంలో కుటుంబాలు కొన్ని ఆ కథలు చెప్పే సంస్కృతికి దూరం అవుతున్నాయి. కథలు చెప్పే ఆనవాయితీని శ్రీవిద్య వీరరాఘవన్ లాంటి వాళ్లు కొనసాగిస్తున్నారు’ అన్నారాయన. ఎవరు ఈ శ్రీవిద్య? కార్పొరేట్ ఆఫీస్లో తన హెచ్ఆర్ ఉద్యోగాన్ని ఆమె కొనసాగించి ఉంటే ఈ ప్రశ్న ఇవాళ ఎవరూ అడిగి ఉండేవారు కాదు. అందరిలో ఆమె ఒకరుగా మిగిలి ఉండేవారు. కాని అబ్దుల్ కలామ్, స్వామి వివేకానందలతో ప్రభావితమైన శ్రీవిద్య ‘ఈ ఉద్యోగంలో పడి ఏం చేస్తున్నాను. నేనంటూ సమాజానికి ఏం చేయగలుగుతున్నాను?’ అని ప్రశ్నించుకున్నారు. అప్పటికే ఆమెకు ఒక కొడుకు. పిల్లల ప్రపంచం ఇప్పుడు ఎలా ఉందో ఆమె గమనించారు. ఉరుకులు పరుగుల జీవితంలో ఎవరూ వారికి కథలు చెప్పడం లేదని అనిపించింది. ‘కథలే గొప్ప వ్యక్తిత్వాలను తయారు చేయగలవు. మెదళ్లను శక్తిమంతం చేయగలవు’ అంటారామె. చిన్నప్పుడు తాను విన్న కథలు ఎందుకు ఇప్పుడు అందరికీ చెప్పకూడదు అనిపించిందామెకు. అలా వచ్చిన ఆలోచనే ‘స్టోరీ ట్రైన్’. ‘పిల్లలు రైలు ప్రయాణంలో ఎన్నో కబుర్లు, కథలు చెప్పుకుంటారు. పిల్లలకు రైలంటే ఇష్టం. అందుకే స్టోరీ ట్రైన్ అనే సంస్థను ఏర్పాటు చేశాను’ అంటారామె. సంస్థ అంటే అదేదో పెద్ద సంస్థ కాదు. ఆమె ఒక్కతే ఆ సంస్థ. ఆ పేరుతో ఆమె చెన్నైలో పిల్లలకు కథలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారు. నేర్చుకుని చెప్పొచ్చు ‘కథలు చెప్పడం ఒక విద్య. మనం ఎన్ని కథలు విన్నా చెప్పడం రావాలి. నేను కూడా ఈ పని మొదలెట్టేటప్పుడు ‘వరల్డ్ స్టోరీ టెల్లింగ్ ఇన్స్టిట్యూట్’ స్థాపకుడైన డాక్టర్ ఎరిక్ టెల్లర్ వర్క్షాప్కు హాజరయ్యాను. పిల్లలకు కథలు చెప్పేటప్పుడు గొంతు, ముఖం, శరీర కదలికలు ఎలా ఉండాలి వారిని కథల్లోకి ఎలా ఆకర్షించాలి తెలుసుకున్నాను. ఎంత శిక్షణ ఉన్నా మనకూ కొంత టాలెంట్ ఉండాలి. ఆ మొత్తం అనుభవంతో నేను కథలు చెప్పడం మొదలెట్టాను. స్కూళ్లకు, కాలేజీలకు, పబ్లిక్ ప్లేసుల్లో, టీవీ ద్వారా ఎక్కడ ఎలా వీలైతే అలా పిల్లలకు కథలు చెప్పడం మొదలుపెట్టాను. ప్రొఫెషనల్ స్టోరీటెల్లర్గా మారాను. తెనాలి రామ, అక్బర్ బీర్బల్, పురాణాలు.. ఒకటేమిటి అన్ని చెబుతాను. పిల్లలకు కథలు చెప్పడానికి మించిన ఆనందం లేదు. నా కొడుక్కు నేను కథలు చెబుతాను ఇంట్లో. కాని అందరి ఇళ్ళల్లో అమ్మలు ఈ పని చేయకపోవచ్చు. చేస్తే బాగుంటుంది. చేయలేకపోతే కనీసం కథలు చెప్పేవారి దగ్గరికైనా పంపాలి’ అంటారు శ్రీవిద్య. ఫోన్లలో మునిగి, గేముల్లో తేలే పిల్లల్ని తమ జోలికి రావడం లేదు కదా అని వదిలేస్తున్నారు తల్లిదండ్రులు. దాని వల్ల వారికి వికాసం, ఊహ, కల్పన, సాంస్కృతిక పరిచయం... ఇవన్నీ మిస్ అవుతున్నాయని తెలుసుకోవడం లేదు. ప్రధాని పిలుపు మేరకు తిరిగి ప్రతి ఇంటా కథలు చెప్పే వాతావరణం నెలకొనాలని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ పిల్లలకు ఎన్నో చెప్పొచ్చు నేను వివిధ సందర్భాలలో పిల్లలను కలిసినప్పుడు ఏదైనా కథ చెప్పమని వారిని అడుగుతాను. వారు కథకు బదులు జోకులు చెప్పడం ప్రారంభిస్తారు. ఈ కరోనా సమయంలో కుటుంబాలు తమలో తాము దగ్గరయ్యాయి. కాని కొన్ని కుటుంబాలు మన సాంస్కృతిక పరంపరను మిస్ అవుతున్నాయి. కథలు చెప్పడం మన సంస్కృతిలో ఒక భాగం. కథలు పిల్లలకు సంస్కారాన్ని నేర్పుతాయి. మన స్వాతంత్య్ర పోరాటం ఎంతో గొప్పది. ఒక వందేళ్ల పోరాటాన్ని పిల్లలకు శక్తిమంతమైన కథలుగా చెప్పాల్సిన అవసరం ఉంది. – ప్రధాని నరేంద్ర మోడీ, ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో -
అన్నదాతలే వెన్నెముక
న్యూఢిల్లీ: 2014లో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంతో పండ్లు, కూరగాయల సాగుదారులు లాభపడగా, ఇప్పుడు ధాన్యం రైతులకు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు తగినంత స్వేచ్ఛ లభించిందని ప్రధాన మోదీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో కూడా రైతుల వల్లే వ్యవసాయ రంగం బలోపేతమైందని, స్వయం సమృద్ధ భారత్కు అన్నదాతలు కీలకంగా ఉన్నారని కొనియాడారు. ఆదివారం మాసాంతపు ‘మన్కీ బాత్’లో ప్రధాని మోదీ దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణ బిల్లులపై ఒక వర్గం రైతులు ఆందోళనలు కొనసాగిస్తుండగా ప్రధాని వారిపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. అదే సమయంలో ఆయన గత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలపై మండిపడ్డారు. మహాత్మాగాంధీ ఆర్థిక సిద్ధాంతాలను కాంగ్రెస్ పాటించి ఉంటే ఇప్పుడు ‘ఆత్మనిర్భర్ భారత్’ యోజన అవసరం ఉండేదే కాదన్నారు. దేశం ఎప్పుడో స్వయం సమృద్ధం సాధించి ఉండేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రైతు సంఘా లతో ముచ్చటించారు. 2014లో చేసిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)చట్టంతో లాభం పొందిన హరియాణా, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రైతుల అనుభవాలను వివరించారు. ఉత్పత్తులను విక్రయించే సమయంలో వీరికి దళారుల బెడద తప్పిందని, మెరుగైన ధర లభించిం దని పేర్కొన్నారు. ఇప్పుడు వరి, గోధుమ, చెరకు రైతులకు కూడా ఇదే స్వేచ్ఛ లభించనుందని, వారు మంచి ధర పొందనున్నారని అన్నారు. కథలు చెప్పడం మన సంస్కృతిలో భాగమంటూ ఆయన.. సైన్స్కు సంబంధిం చిన కథలు ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని ‘బెంగళూరు స్టోరీ టెల్లింగ్ సొసైటీ’ సభ్యులతో ముచ్చటించారు. వారితో తెనాలి రామకృష్ణుడి కథ ఒకటి చెప్పించారు. ప్రజలంతా కూడా పిల్లలకు కథలు చెప్పేందుకు కొంత సమయం కేటాయించాలని కోరారు. మాలి దేశానికి చెందిన సేదు దెంబేలే గురించి ప్రధాని తెలిపారు. ఆయనకు భారత్పై ఉన్న అభిమానాన్ని వివరించారు. ప్రధాని ఇంకా ఏమన్నారంటే.. ► కథలు ప్రజల సృజనాత్మకతను ప్రకటిస్తాయి. నేను నా జీవితంలో చాలా కాలం దేశమంతటా సంచరించాను. ప్రతి రోజు ఒక కొత్త ఊరు, కొత్త ప్రజలు. నా పర్యటనల్లో నేను పిల్లలతో మాట్లాడేవాడిని. వారిని కథలు చెప్పమని అడిగేవాడిని. కానీ వారు జోక్స్ చెబుతామని, మాకు జోక్స్ చెప్పండని అడగేవారు. నేను ఆశర్యపోయేవాడిని. వారికి కథలతో పరిచయం ఉండటం లేదు. గతంలో ఇంట్లో పెద్దలు పిల్లలకు కథలు చెప్పేవారు. ఆ కథల్లో శాస్త్రం, సంప్రదాయం, సంస్కృతి, చరిత్ర ఉండేవి. కథల చరిత్ర మానవ నాగరికత అంత పురాతనమైంది. కథలు చెప్పే సంప్రదాయం అంతరించిపోకుండా ఇప్పటికీ కొందరు కృషి చేస్తున్నారు. ఐఐఎం(ఏ)లో ఎంబీఏ చేసిన అమర్వ్యాస్ వంటి కొందరు వెబ్సైట్స్ను ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతికత సాయంతో ఆసక్తి ఉన్నవారికి పలు కథారీతులను పరిచయం చేస్తున్నారు. బెంగుళూరులో శ్రీధర్ అనే వ్యక్తి గాంధీజీ కథలను ప్రచారం చేస్తున్నారు. ► ఇంట్లో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వం టి పెద్దలుంటే వారి వద్ద కథలను విని, రికార్డ్ చేసుకోండి. భవిష్యత్తులో ఉపయోగ పడ్తాయి. ► ఆధునిక వ్యవసాయ పద్దతులను ఉపయోగించడం వల్ల వ్యయం తగ్గుతుంది. దిగుబడి, నాణ్యత పెరుగుతుంది. రైతులు మార్కెట్ అవసరాలకనుగుణంగా పంటలు వేయాలి. ► సెప్టెంబర్ 28 షహీద్ భగత్ సింగ్ జయంతి. బ్రిటిష్ వారిని గడగడలాడించిన సాహస దేశభక్తుడు భగత్ సింగ్. లాలా లాజ్పత్ రాయ్ పట్ల ఆయనకున్న అంకితభావం, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్, రాజ్గురు వంటి విప్లవకారులతో అనుబంధం చాలా గొప్పది. ఆయనకు నా వినమ్ర నివాళులు. భగత్సింగ్లా కావడం ఎలా? హైదరాబాద్ వ్యక్తికి మోదీ సమాధానం నమో యాప్లో ఒక ప్రశ్న చూశాను. ఈ తరం యువత భగత్సింగ్లా కావడం ఎలా? అని హైదరాబాద్కు చెందిన అజయ్ ఎస్జీ అడిగారు. మనం భగత్సింగ్ కాగలమో, లేదో తెలియదు కానీ, ఆయనకు దేశంపైన ఉన్న ప్రేమను, దేశ సేవ కోసం ఆయన పడే తపనను మనం పెంపొందించుకోవచ్చు. అదే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి. దాదాపు నాలుగేళ్ల క్రితం ఇదే సమయంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో మన సైనికుల శక్తి సామర్థ్యాలను చూశాం. అప్పుడు ఆ వీర సైనికుల మనస్సులో ఒకటే ఉంది.. దేశ రక్షణ ఒకటే వారి లక్ష్యం. తమ ప్రాణాలకు వారు ఎలాంటి విలువనివ్వలేదు. పని ముగించుకుని, వారు విజయవంతంగా తిరిగిరావడం మనం చూశాం. దేశ మాత గౌరవాన్ని వారు మరింత పెంచారు. -
మోదీ మన్ కీ బాత్
-
భగత్సింగ్ జీవితం స్ఫూర్తిదాయకం: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్సింగ్ జీవితం నుంచి ఎంతో నేర్చుకోవచ్చని, ఆయన స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన గురువారం దేశంలోని పలు అంశాలపై ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. పంచతంత్ర కథల్లో ఎంతో నీతి దాగి ఉందని తెలిపారు. ప్రస్తుతం సైన్స్, సైన్స్ ఫిక్షన్ కథలు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఎందరో స్ఫూర్తిదాయకమైన కథలు చెప్పేవారు ఉన్నారని తెలిపారు. మంచి కథల ద్వారా సంస్కృతి, సంస్కారం తెలుస్తుందని చెప్పారు. ప్రతి వారం ఒక టాపిక్ ఎంచుకోవాలని, కరోనా సమయంలో రైతులు మన కోసం ఎంతో కష్టపడుతున్నారని గుర్తు చేశారు. (అప్పటి, ఇప్పటి పరిస్థితులేంటి? : మోదీ) ఆత్మనిర్భర్ భారత్ ద్వారా రైతులకు సాయం అందించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయని, వ్యవసాయంతో గ్రామాల్లో ఉండే వారికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. రేపు (సోమవారం) భగత్సింగ్ జయంతిని ఘనంగా జరుపుకోవాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. భగత్సింగ్ జీవితం నుంచి ఎంతో నేర్చుకోవచ్చుని, ఇళ్లలోని పెద్దలు తమ అనుభవాలు పిల్లలకు చెప్పాలని కోరారు. ఈ కార్యకమంలో భాగంగా బెంగళూరు స్టోరీ టెల్లింగ్ సొసైటీ అపర్ణాతో మాట్లాడిన మోదీ ముచ్చటించారు. ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో పలు సామాజిక అంశాలు, దేశ పరిస్థితులపై ప్రసంగిస్తారన్న విషయం తెలిసిందే. -
అన్ని రంగాల్లోనూ ఆత్మనిర్భర్
న్యూఢిల్లీ: అన్ని రంగాల్లోనూ స్వావలంబ భారత్ దిశగా కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆటబొమ్మల మార్కెట్ సుమారు రూ. 7 లక్షల కోట్లు కాగా.. అందులో భారత్ వాటా చాలా తక్కువగా ఉందని గుర్తు చేశారు. భారత్లోని స్టార్టప్స్, యువ పారిశ్రామికవేత్తలు ఈ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచ ఆట బొమ్మల కేంద్రంగా భారత్ రూపుదిద్దుకోగలదని, స్థానిక ఆట బొమ్మలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని ‘మన్ కీ బాత్’లో మోదీ వ్యాఖ్యానించారు. ‘దేశంలో నిపుణులైన బొమ్మల తయారీదారులున్నారు. బొమ్మల తయారీ ద్వారా దేశ ఘన చరిత్రను ప్రచారం చేయవచ్చు. గొప్ప భవిష్యత్తుకు బాటలు వేయవచ్చు’అన్నారు. ప్రత్యేకంగా భారత్పైనే, భారత్లోనే కంప్యూటర్ గేమ్స్ రూపకల్పన జరగాలని, ఆ దిశగా సమిష్టిగా కృషి చేయాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కోరారు. భారత దేశ సాంస్కృతిక ఔన్నత్యం, సంప్రదాయాలు కొత్త కొత్త కంప్యూటర్ గేమ్స్ తయారీకి స్ఫూర్తినివ్వగలవన్నారు. ‘మన దేశంలో చాలా విషయాలున్నాయి. మన చరిత్ర ఘనమైనది. దేశ చరిత్రపై ఆధారపడ్డ గేమ్స్ను భారత్లోనే రూపొందించాలని దేశంలోని నిపుణులైన యువతను కోరుతున్నా’అన్నారు. ప్రతీనెల చివరి ఆదివారం ‘మన్ కీ బాత్’పేరుతో ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారనే విషయం తెలిసిందే. ప్రపంచ ఆట బొమ్మల మార్కెట్లో భారత్ వాటాను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల ప్రధాని మోదీ ఒక అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆటబొమ్మల ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా ప్రథమ స్థానంలో ఉంది. ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ► కరోనా మహమ్మారి సమయంలో ఉత్సవాల నిర్వహణలో భారతీయులు గొప్ప సంయమనం, నిరాడంబరతను పాటిస్తున్నారు. ఇది అభినందనీయం. ► ఈ ఖరీఫ్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇందుకు అన్నదాతలకు అభినందనలు. గత సంవత్సరం కన్నా మొత్తంగా దాదాపు 7% సాగు విస్తీర్ణం పెరిగింది. వరి సాగు 10%, పప్పు ధాన్యాల సాగు 5%, నూనెగింజల సాగు 13%, పత్తి సాగు 3% పెరిగింది. ► 2022 నాటికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలవుతున్న నేపథ్యంలో.. స్థానిక స్వాతంత్య్ర సమరయోధుల గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించాలి. నాడు స్థానికంగా జరిగిన ఘటనలను, కార్యక్రమాలను వారికి విశదీకరించాలి. దానివల్ల మరుగునపడిన చాలామంది స్వాతంత్య్ర యోధుల చరిత్ర ప్రపంచానికి తెలుస్తుంది. ► ఇటీవల జరిగిన ఆత్మనిర్భర్ యాప్ ఇన్నోవేషన్ పోటీకి వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికం దేశంలోని చిన్న, మధ్యతరహా పట్టణాల నుంచే వచ్చాయి. ఆత్మ నిర్భర్ భారత్ దిశగా చోటు చేసుకున్న కీలక ముందడుగుగా దీన్ని భావించవచ్చు. ► భారతీయ పండుగలకు, ప్రకృతికి మధ్య గొప్ప సంబంధముంది. ప్రస్తుత గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో చాలా ప్రాంతాల్లో పర్యావరణ హిత వినాయకుడి ప్రతిమలనే ప్రతిష్టించడం ముదావహం. ► సెప్టెంబర్ నెలను పోషకాహార మాసంగా పరిగణిస్తున్నాం. ముఖ్యంగా గ్రామాల్లో అందరికీ పోషకాహారం అందించడం ఉద్యమంలా మారాలి. ► భారత వ్యవసాయ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ జిల్లాలో పండించే పంటల వివరాలు, వాటిలోని పోషకాల వివరాలు అందులో అందుబాటులో ఉంచుతాం. ► కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉద్దేశించిన మార్గదర్శకాలను పాటించండి. మాస్క్ ధరించండి. భౌతిక దూరం పాటించండి. వ్యక్తిగత పరిశుభ్రత కొనసాగించండి. సోఫీ.. విదా.. బలరామ్! కుక్క పిల్లలను పెంచుకోవాలనుకునే వారు ఇండియన్ బ్రీడ్ కుక్క పిల్లలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని కోరారు. భారతీయ కుక్కపిల్లలు సామర్థ్యంలో వేటికీ తీసిపోవన్నారు. చవకగా లభిస్తాయని, భారతీయ పరిస్థితులకు తట్టుకోగలవని వివరించారు. ‘ఇండియన్ బ్రీడ్స్లో ముధోల్ హౌండ్, హిమాచలి హౌండ్ శ్రేష్టమైనవి. రాజపాలాయం, కన్నీ, చిప్పిపరాయి, కొంబయి కూడా గొప్పవే. ఇంటర్నెట్లో వెతకండి. వీటి గురించి మరిన్ని ఆశ్చర్యపరిచే వివరాలు తెలుస్తాయి’అని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా.. ఆగస్టు 15న ‘చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమండేషన్ కార్డ్’పురస్కారం పొందిన ఆర్మీ డాగ్స్ సోఫీ, విదాలను గుర్తు చేశారు. దేశ భద్రతలో అవి గొప్ప పాత్ర పోషించాయన్నారు. ‘అమర్నాథ్ యాత్రా మార్గంలో దుండగులు పెట్టిన పేలుడు పదార్థాలను బలరామ్ అనే శునకం గుర్తించి, అనేక ప్రాణాలను కాపాడింది’అని వివరించారు. ‘బీడ్ పోలీసులు తమతో పాటు పనిచేసిన రాకీ అనే శునకానికి గొప్పగా ఫేర్వెల్ ఇచ్చిన దృశ్యాలు మీరు టీవీలో చూసే ఉంటారు. 300 కేసులను ఛేదించడంలో పోలీసులకు రాకీ సహకరించింది’అన్నారు. కావాల్సింది పరీక్షలపై చర్చ: రాహుల్ ప్రధాని మోదీ మన్కీబాత్లో పరీక్షల గురించి మాట్లాడతారని విద్యార్థులు ఎదురు చూస్తుండగా.. ఆయన మాత్రం బొమ్మల గురించి మాట్లాడారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నీట్, జేఈఈ పరీక్షలను కోవిడ్ దృష్ట్యా వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా కోరుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నోట ఏటికొప్పాక మన్కీ బాత్ కార్యక్రమంలో బొమ్మల గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఏటికొప్పాక బొమ్మల ప్రస్తావన తెచ్చారు. విశాఖకు చెందిన సి.వి.రాజు అద్భుతమైన నాణ్యతతో ఏటికొప్పాక బొమ్మలను తయారు చేస్తున్నారని కొనియాడారు. ఆయన స్థానిక బొమ్మలకు పూర్వవైభవం తెచ్చారన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిపుణులైన బొమ్మల తయారీదారులు ఉన్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కొండపల్లి, కర్ణాటకలోని చెన్నపట్నం, తమిళనాడులోని తంజావూరు, అస్సాంలోని ధుబారీ, ఉత్తరప్రదేశ్లోని వారణాసి బొమ్మల తయారీ కేంద్రాలుగా ఎదిగాయన్నారు. -
‘పరీక్షలపై మాట్లాడకుండా బొమ్మలపై చర్చించారు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం విమర్శల దాడి చేశారు. మన్ కీ బాత్లో మోదీ పరీక్షలపై చర్చ చేపడతారని జేఈఈ-నీట్ అభ్యర్ధులు ఆశించగా ఆయన బొమ్మలపై మాట్లాడారని రాహుల్ వ్యాఖ్యానించారు. భారత్ను టాయ్ హబ్గా మలచాలని ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్ ఆరోపణలు గుప్పించారు. జేఈఈ-నీట్ పరీక్షల నిర్వహణపై మోదీ చర్చిస్తారని విధ్యార్ధులు భావిస్తే ప్రధానమంత్రి మాత్రం బొమ్మలపై చర్చ చేశారని రాహుల్ ట్వీట్ చేశారు. కాగా, ప్రధానమంత్రి మోదీ అంతకుముందు రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ స్ధానికంగా బొమ్మల తయారీకి స్టార్టప్ వాణిజ్యవేత్తలు బృందంగా పనిచేయాలని కోరారు. అంతర్జాతీయంగా బొమ్మల పరిశ్రమ 7 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ను కలిగిఉంటే ఇందులో భారత్ వాటా అత్యల్పమని చెప్పారు. బొమ్మల తయారీలో భారత్ గ్లోబల్ హబ్గా ఎదిగేందుకు అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యం భారత్కు ఉందని అన్నారు. ఇక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సెప్టెంబర్లో జేఈఈ, నీట్ పరీక్షలను కేంద్రం నిర్వహించడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. జేఈఈ (మెయిన్) పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి 6 మధ్య జరగనుండగా, నీట్ పరీక్ష సెప్టెంబర్ 13న జరగనుంది. మరోవైపు కరోనా నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. చదవండి : ‘రాహుల్కు కాంగ్రెస్ కట్టప్పల ద్రోహం’ -
ఆ ఆర్మీ శునకాలను పొగిడిన మోదీ
న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం 68వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పురష్కరించుకుని జాతినుద్ధేశించి మాట్లాడారు. దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, అందరూ స్వదేశీ యాప్లనే వాడాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా దేశ భద్రతా వ్యవస్థలో శునకాల సేవల గురించి ప్రస్తావించారు. 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కామాండేషన్ కార్డు పొందిన ఆర్మీ శునకాలు విదా, సోఫియాల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ( అందరూ స్వదేశీ యాప్లను వాడాలి: మోదీ ) కర్తవ్య నిర్వహణలో వాటి సేవలను మోదీ కొనియాడారు. ప్రజలందరూ శునకాలను పెంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, విదా నార్తర్న్ కమాండ్లోని యూనిట్లో విధులు నిర్వర్తిస్తోంది. ఐదు మైన్లు, ఒక గ్రెనేడ్ ప్రమాదం నుంచి ప్రజల్ని కాపాడింది. ఇక సోఫియా స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్లో విధులు నిర్వర్తిస్తోంది. వాసన పట్టి బాంబులను గుర్తించటంలో సోఫియా నిపుణురాలు. -
అందరూ స్వదేశీ యాప్లను వాడాలి: మోదీ
న్యూఢిల్లీ : దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, అందరూ స్వదేశీ యాప్లనే వాడాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం మనకీ బాత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతినుద్ధేశించి మోదీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా రైతులు కష్టపడి పంటలు పండిస్తున్నారని కొనియాడారు. ప్రతి వేడుకను పర్యావరణహితంగా జరుపుకోవాలని చెప్పారు. చిన్నారులు ఆడుకునే వస్తువులను ప్రపంచస్థాయిలో తయారు చేయాలని, స్థానిక కళలు, కళాకారులను ప్రోత్సహించాలన్నారు. ( తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ) గత నెల మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన కార్గిల్ యుద్ధవీరుల ధైర్య సాహసాలను స్మరించుకున్నారు. సాయుధ దళాల నైతిక స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడకూడదని, వారి ధైర్య సాహసాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని తెలిపారు. కార్గిల్ యుద్ధంలో సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ జరుపుకునే విజయ్ దివస్ (జూలై 26) కూడా ఇదే రోజు రావడంతో ప్రధాని ఆ జ్ఞాపకాలను పంచుకున్నారు. 1999లో ఇదే రోజు కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. స్నేహ హస్తం చాచిన భారత్కు ఆనాడు పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచిందని ప్రధాని గుర్తు చేశారు. ‘అంతర్గత సమస్యల నుంచి తప్పించుకునేందుకు.. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే దుస్సాహసానికి పాక్ ఒడిగట్టింది’అన్నారు. -
‘కనిగా జీ.. వనక్కం’: అస్సలు ఊహించలేదు!
చెన్నై: ‘‘అదంతా అకస్మాత్తుగా జరిగిపోయింది. అసలు మేం ఊహించలేదు. ప్రధాని మోదీ చాలా బాగా మాట్లాడారు. నన్ను మాట్లాడేలా ప్రోత్సహించారు. ఆయన మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి. కష్టపడి చదివి ప్రతిష్టాత్మక కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సంపాదిస్తాను. న్యూరో సర్జన్ కావాలన్నదే నా ఆశయం’’ అని తమిళనాడుకు చెందిన కనిగ తన భవిష్యత్ ప్రణాళికల గురించి వెల్లడించారు. స్వయంగా దేశ ప్రధాని తనకు కాల్ చేసి మాట్లాడతారని, ఊహించలేదని.. ఆశ్చర్యానికి లోనయ్యానంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కాగా తమిళనాడులోని నమక్కల్ జిల్లాకు చెందిన కనిగ ఇటీవల వెల్లడైన క్లాస్ 12 పరీక్షా ఫలితాల్లో 500 మార్కులకు గానూ 490 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ కనబరిచారు. (ఆ సాహసం.. సదా స్మరణీయం) ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మాసాంతపు రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు కాల్ చేసి మాట్లాడారు. సాధారణ కుటుంబానికి చెందిన కనిక కథ ఎంతో స్పూర్తిదాయకమన్న ఆయన.. ‘‘వనక్కం కనికా జీ, ఎలా ఉన్నారు’’అంటూ ఆమెను పలకరించారు. ‘‘మీరు సాధించిన విజయానికి అభినందనలు. నమక్కల్ గురించి విన్నపుడు ఆంజనేయ స్వామి గుడి గుర్తుకు వచ్చేది. ఇప్పటి నుంచి మీతో ఈ సంభాషణ గుర్తుకు వస్తుంది. మీ ఫేవరెట్ సబ్జెక్టు ఏంటి? మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?’’ అని అడిగి తెలుసుకున్నారు. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియోను ట్విటర్లో షేర్ చేసిన ప్రధాని మోదీ.. కనిగ, ఆమె సోదరి లాంటి యువతులు నవ భారతాన్ని ఆవిష్కరిస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు.(అందుకే 100 శాతం మార్కులు: దివ్యాన్షి) ఈ విషయం గురించి కనిగ కుటుంబ సభ్యులు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మోదీ కాల్ తమకు జీవితకాలపు సంతోషాన్నిచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఇక తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమన్న కనిగ.. ప్రస్తుతం తాను నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. తన సోదరి ట్రిచీలో ఎంబీబీఎస్ చదువుతున్నట్లు వెల్లడించారు. కాగా కనిగ తండ్రి ట్రక్ డ్రైవర్గా పనిచేస్తుండగా.. తల్లి గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లాక్డౌన్ కాలంలో కాస్త ఇబ్బంది పడుతున్నప్పటికీ తమ కూతుళ్లు సాధిస్తున్న విజయాలు చూసి ఆ బాధలన్నీ మరచిపోగలుగుతున్నామని, వారిని చూస్తే గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక ప్రధాని మోదీ కాల్ తర్వాత కనిగ ఇంటికి చేరుకున్న బీజేపీ యువజన విభాగం సభ్యులు ఆమెకు శాలువా కప్పి సన్మానం చేశారు. Youngsters like Kaniga and her sister personify the spirit of New India, where success is not merely determined by the family one is born in, the school/ college one studied, the big city one lives in. Hardwork and perseverance gives results. India is changing. #MannKiBaat pic.twitter.com/orEEFzPdfA — Narendra Modi (@narendramodi) July 26, 2020 -
ఆ సాహసం.. సదా స్మరణీయం
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధవీరుల ధైర్య సాహసాలను ప్రధాని మోదీ స్మరించుకున్నారు. సాయుధ దళాల నైతిక స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడకూడదని, వారి ధైర్య సాహసాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని ఆదివారం మాసాంతపు రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో ప్రజలకు సూచించారు. ‘దేశం తరువాతే ఏదైనా’అనే భావంతో ప్రజలంతా ఉంటే సైనికుల ఆత్మస్థైర్యం మరింత పెరుగుతుందన్నారు. కార్గిల్ యుద్ధంలో సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ జరుపుకునే విజయ్ దివస్ (జూలై 26) కూడా ఇదే రోజు రావడంతో ప్రధాని ఆ జ్ఞాపకాలను పంచుకున్నారు. 1999లో ఇదే రోజు కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. స్నేహ హస్తం చాచిన భారత్కు ఆనాడు పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచిందని ప్రధాని గుర్తు చేశారు. ‘అంతర్గత సమస్యల నుంచి తప్పించుకునేందుకు.. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే దుస్సాహసానికి పాక్ ఒడిగట్టింది’అన్నారు. ‘శత్రు సైన్యం శిఖరాల పైభాగంలో ఉంది. భారతీయ సైనికులు ఆ పర్వత పాదాల ప్రాంతాల్లో ఉన్నారు. భౌగోళికంగా వారికి అనుకూల స్థితి. కానీ భారత సైనికులు అత్యంత ధైర్య సాహసాలు, నైతిక స్థైర్యంతో వారిని మట్టికరిపించారు’అని కార్గిల్ యుద్ధాన్ని ప్రధాని గుర్తు చేశారు. తూర్పు లద్దాఖ్లో ఇటీవలి చైనా దుష్ట పన్నాగాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘కొందరు శత్రువులుగానే ఉండాలని కోరుకుంటారు’అని వ్యాఖ్యానించారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ దేశ ప్రజలను హెచ్చరించారు. కరోనా ముప్పు నేపథ్యంలో ఈ సారి స్వాతంత్య్ర దినోత్సవం కూడా ప్రత్యేకంగా ఉండబోతోందన్నారు. ఆరోజు స్వావలంబ, కరోనా రహిత భారత్ దిశగా ముందుకు వెళ్తామని యువత ప్రతినబూనాలన్నారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రధాని కోరారు. కార్గిల్ యుద్ధం అనంతరం నాటి ప్రధాని వాజ్పేయి చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని మోదీ గుర్తు చేశారు. సురినామ్ కొత్త అధ్యక్షుడు చంద్రిక ప్రసాద్ సంతోఖి ప్రమాణ స్వీకారం చేసిన తీరు భారతీయులందరికీ గర్వకారణమని మోదీ తెలిపారు. వేద మంత్రాలు పఠిస్తూ, అగ్ని దేవుడిని స్తుతిస్తూ ఆయన ప్రమాణం చేశారన్నారు. -
ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్
-
కరోనా నుంచి విముక్తికి ప్రతిన బూనండి: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15న కరోనా వైరస్ నుంచి స్వేచ్ఛ కోసం ప్రజలు ప్రతినబూనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుఇచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం కొత్త విషయాలు నేర్చుకుంటూ మన కర్తవ్యాలకు కట్టుబడాలని అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉందని, వ్యాధి తీవ్రత ప్రారంభమవడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మహమ్మారి పలు ప్రాంతాలకు విస్తరిస్తూ ప్రమాదఘంటికలు మోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆదివారం మన్ కీ బాత్లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కోవిడ్-19 రికవరీ రేటు ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో మెరుగ్గా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ‘పలు దేశాలతో పోలిస్తే భారత్లో మరణాల రేటు తక్కువగా ఉంది.. మనం లక్షలాది ప్రజల ప్రాణాలు కాపాడాం..అయినా కరోనా వైరస్ ముప్పు ఇంకా ముగియలేద’ని వ్యాఖ్యానించారు. పలు ప్రాంతాలకు మహమ్మారి విస్తరిస్తోందని, మనం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని దేశ ప్రజలను ప్రధానమంత్రి అప్రమత్తం చేశారు. రాఖీ పండుగ రానుందని, పలు సంఘాలు..ప్రజలు రక్షాబంధన్ను ఈసారి విభిన్నంగా జరుపుకునేందుకు ప్రయత్నించడం హర్షణీయమని అన్నారు. గతంలో క్రీడలు ఇతర రంగాల్లోకి పెద్ద నగరాలు, ప్రముఖ కుటుంబాలు, పేరొందిన పాఠశాలల నుంచే పలువురు దూసుకొచ్చేవారని, ఇప్పుడు గ్రామాలు, చిన్న పట్టణాలు, సాధారణ కుటుంబాల నుంచి ఆయా రంగాల్లోకి పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారని అన్నారు. కార్గిల్ హీరోలకు నివాళి కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో గెలిచి నేటికి 21 సంవత్సరాలైన సందర్భంగా సైనికుల త్యాగాలను కొనియాడారు. ‘ఈ రోజు చాలా ప్రత్యేకమైంది..కార్గిల్ యుద్ధం ఎలాంటి సమయంలో ఏ పరిస్థితిలో జరిగిందో ఏ ఒక్కరూ మరువలేరు..పాకిస్తాన్తో మెరుగైన సంబంధాలను భారత్ కోరుకుంటే అలా జరగలేద’ని కార్గిల్ యుద్ధం నాటి పరిస్థితులను ప్రస్తావించారు. మన సైనికుల ధైర్యానికి ధన్యవాదాలని, కార్గిల్లో భారత్ అసమాన పాటవం ప్రదర్శించిందని మోదీ అన్నారు. చదవండి : ఆర్థిక స్వస్థతకు ప్రయత్నం -
‘ప్రధాని ప్రశంసించారు.. అది చాలు’
బెంగళూరు: కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడి పేరు నిన్న దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. తన ప్రాంతంలో నీటి ఎద్దడి తీర్చడం కోసం ఏకంగా 16 చెరువులు తవ్వించిన ఆ వృద్ధుడిని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో అభినందించారు. ఆ వివరాలు.. మాండ్య, దసనదొడ్డి ప్రాంతానికి చెందిన కామె గౌడ గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తమ ప్రాంతంలో నీటి ఎద్దడిని తీర్చడం కోసం ఏకంగా 16 చెరువులు తవ్వించి పెద్ద మనసు చాటుకున్నాడు. ఓ సామన్య గొర్రెల కాపరికి ఇది చాలా పెద్ద విషయమే. దాంతో ఇది కాస్తా ప్రధాని దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో నిన్నటి ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో నరేంద్ర మోదీ కామె గౌడను ప్రశంసించారు. దీనిపై సదరు వృద్ధుడు స్పందిస్తూ.. ‘నిన్నటి కార్యక్రమంలో ప్రధాని కరోనా వైరస్ గురించి జనాలను హెచ్చరించారు.. సరిహద్దు వివాదం గురించి మాట్లాడారు. ఇన్ని ముఖ్యమైన అంశాల మధ్య ఆయన నా పేరును ప్రస్తావించి.. అభినందించారు. నా జీవితానికి ఇంతకంటే పెద్ద సంతోషం ఏం ఉంటుంది’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. తన ప్రాంతంలో చెరువులు తవ్వించి.. నీటి సమస్యను తీర్చడంతో ఆ ప్రాంత ప్రజలు కామె గౌడను ‘కేరె’(చెరువుల)గౌడ అని గౌరవంగా పిల్చుకుంటున్నారు. (స్నేహానికి గౌరవం.. శత్రువుకు శాస్తి) నిన్నటి ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్ ప్రాంతంపై కన్నేసిన వారికి భారత్ తగిన సమాధానం చెప్పిందని తెలిపారు. స్నేహస్ఫూర్తికి గౌరవమిస్తూనే, ఎంతటి శత్రువుకైనా తగు సమాధానం చెప్పే సామర్థ్యం భారత్కు ఉందని చైనాను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
స్నేహానికి గౌరవం.. శత్రువుకు శాస్తి
న్యూఢిల్లీ: లద్దాఖ్ ప్రాంతంపై కన్నేసిన వారికి భారత్ తగిన సమాధానం చెప్పిందని ప్రధాని మోదీ తెలిపారు. స్నేహస్ఫూర్తికి గౌరవమిస్తూనే, ఎంతటి శత్రువుకైనా తగు సమాధానం చెప్పే సామర్థ్యం భారత్కు ఉందని చైనాను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన ఆకాశవాణిలో మాసాంతపు ‘మన్కీ బాత్’లో మాట్లాడారు. దేశ గౌరవానికి భంగం వాటిల్లబోనివ్వమని మన జవాన్లు నిరూపించారంటూ ప్రధాని.. గల్వాన్ ఘటనలో వీరమరణం చెందిన 20 మంది జవాన్లకు నివాళులర్పించారు. స్వయం సమృద్ధి సాధించడమే మన లక్ష్యమని, అదే అమరజవాన్లకు ఘన నివాళి అని పేర్కొన్నారు. విశ్వాసం, స్నేహం, సోదరభావం అనే విలువలకు కట్టుబడి ముందుకు సాగుదామన్నారు. స్థానికంగా తయారైన వస్తువులనే కొని, దేశానికి సేవ చేయాలని, దేశాభివృద్ధికి తోడ్పడాలని ప్రజలను కోరారు. దేశీయ వస్తువులను మీరు కొంటున్నారంటే దేశాన్ని బలోపేతం చేయడంలో మీ పాత్ర కూడా ఉన్నట్లే’అని పేర్కొన్నారు. కరోనాను ఓడించడంపైనే దృష్టి..: దేశం దృష్టి మొత్తం కరోనా వైరస్ను నిలువరించడంపైనే ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ అన్లాక్ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయాలని అన్నారు. లాక్డౌన్ సమయంలో ఎంత అప్రమత్తత చూపారో అన్లాక్ సమయంలోనూ అంతే జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు. ‘మాస్కు ధరించకున్నా, రెండడుగుల భౌతిక దూరం వంటి ఇతర నిబంధనలను పాటించకున్నా, మీతోపాటు మీ చుట్టుపక్కల వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేసినట్లేనని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి’అని ఆయన ప్రజలను హెచ్చరించారు. అన్లాక్ సమయంలో ఇతర విషయాల్లోనూ నిబంధనలను ఎత్తివేసినట్లు పేర్కొన్న ప్రధాని.. కొన్ని రంగాల్లో దశాబ్దాలుగా ఉన్న ఆంక్షలను తొలగించినట్లు తెలిపారు. ఈ ఏడాది తుపానులు, భూకంపాలతో పాటు కొన్ని పొరుగు దేశాల దుష్ట పన్నాగాలను సైతం ఎదుర్కొవాల్సి వచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. పీవీకి ఉపరాష్ట్రపతి, ప్రధాని నివాళులు మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు శత జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆయన ప్రధానిగా నాయకత్వ బాధ్యతలు చేపట్టారని వారు కొనియాడారు. ‘మన్కీ బాత్’లో ప్రధాని మోదీ పీవీ సేవలను శ్లాఘించారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు పీవీ నరసింహారావే ఆద్యుడని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశం ఆర్థికంగా కోలుకోవడానికి మార్గం చూపారన్నారు. భారత్లో కోవిడ్పై ప్రజాపోరాటం భారత్లో కరోనా మహమ్మారిపై ప్రజలే పోరాటం సాగించారని, దేశ వ్యాప్త లాక్డౌన్ ఇందుకు తోడ్పడిందని ప్రధాని మోదీ తెలిపారు. స్వయం సమృద్ధి సాధించేందుకు భారత్ కరోనాను కూడా ఒక అవకాశంగా మార్చుకుందన్నారు. ఆదివారం ఆయన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్(ఏఏపీఐ) వర్చువల్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 80 వేల మంది వైద్యులకు సభ్యత్వం ఉన్న ఏఏపీఐ సమావేశంలో భారత ప్రధాని ఒకరు ప్రసంగించడం ఇదే ప్రథమం. ఆదివారం లేహ్ నుంచి చైనా సరిహద్దు వైపు కదులుతున్నభారత్ సైనిక వాహనాలు -
మోదీ మన్ కీ బాత్
-
నిర్లక్ష్యం వద్దు.. యుద్ధం ముగియలేదు!
న్యూఢిల్లీ: కరోనా విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దని దేశ ప్రజలను ప్రధాని మోదీ హెచ్చరించారు. అన్ని జాగ్రత్తలతో మరింత అప్రమత్తతతో ఉండాలని సూచించారు. ఈ కరోనా సంక్షోభం పేదలు, కూలీలు, శ్రామికులపై పెను ప్రభావం చూపిందన్నారు. వారి బాధను వర్ణించేందుకు తనవద్ద మాటలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వలస శ్రామికుల నైపుణ్యాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని, కొత్తగా మైగ్రేషన్ కమిషన్ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని వెల్లడించారు. గతంలో జరిగిన వాటిని సమీక్షించుకుని, తప్పులను సవరించుకుని, భవిష్యత్లో పునరావృతం కాకుండా చూసుకునేందుకు లభించిన అవకాశం ఈ సంక్షోభం అన్నారు. ఆర్థిక వ్యవస్థ దాదాపు పూర్తిగా పునః ప్రారంభమైందన్న ప్రధాని.. కరోనాపై పోరులో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యం ఎంతమాత్రం వద్దని ప్రతి నెల చివరి ఆదివారం ప్రజలకు ఇచ్చే సందేశం ‘మన్ కీ బాత్’లో హితవు పలికారు. దేశీయంగా రైల్వే, విమాన సర్వీసులు పరిమితంగా ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మరిన్ని సడలింపులు త్వరలో ఉంటాయని తెలిపారు. కష్టపడి కరోనాను కొంతవరకు కట్టడి చేశామని, పరిస్థితి చేయి దాటకుండా చూసుకోవాల్సి ఉందని సూచించారు. ‘స్వావలంబ భారత్’ ఇప్పుడొక నినాదం కరోనా సంక్షోభంతో అన్ని వర్గాలు ఇబ్బందులు పడినప్పటికీ.. నిరుపేదలపై దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉందన్నారు. ‘మనం గ్రామ స్థాయి నుంచి ఇప్పటికే స్వయం సమృద్ధి సాధించి ఉంటే.. ఇంత కఠిన పరిస్థితులను ఎదుర్కొనాల్సి వచ్చేది కాదు’ అని వ్యాఖ్యానించారు. తన పిలుపుతో ‘స్వావలంబ భారత్’ నినాదం ఉద్యమంగా మారిందని, ఇప్పుడంతా స్థానిక ఉత్పత్తులనే కొంటున్నారన్నారు. పేదలకు అంతా చేతనైనంత సాయం అందిస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. వలస కూలీలను శ్రామిక్ రైళ్ల ద్వారా సొంతూళ్లకు తరలిస్తూ రైల్వే శాఖ గొప్ప సేవ చేస్తోందన్నారు. వలసలు ఎక్కువగా ఉండే దేశ తూర్పు ప్రాంతం ఈ సంక్షోభం కారణంగా ఎక్కువగా కష్టనష్టాలను ఎదుర్కొందని, దేశాభివృద్ధికి చోదక శక్తిగా మారగల ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ‘గత ఐదేళ్లుగా ఈ దిశగా కొంత సాధించాం. ఇప్పుడు వలస కూలీల వెతలను దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రణాళికలను రచించాల్సిన అవసరం ఉంది’ అన్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీతో గ్రామీణ ఉపాధి, స్వయం ఉపాధి, చిన్నతరహ పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుందన్నారు. -
దేశంలో జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేనిది: మోదీ
-
మరింత అప్రమత్తంగా ఉండాలి : మోదీ
న్యూఢిల్లీ : కరోనా వైరస్పై పోరులో భారత ప్రజల సేవా శక్తి కనిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆదివారం మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. దేశంలో చాలా వరకు ఆర్థిక కార్యకలాపాలు పున: ప్రారంభమయ్యాయని చెప్పారు. కరోనాపై పోరులో వైద్య సిబ్బంది, మీడియా ప్రాణాలు లెక్కచేయకుండా పనిచేశారని కొనియాడారు. కరోనాకు సంబంధించి భవిష్యత్తులో మరింత అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని తెలిపారు. (చదవండి : గ్లోబల్ లీడర్గా భారత్!) కరోనాపై విజయం సాధించడానికి మరింతగా శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించడంతోపాటుగా.. మాస్క్లు ధరించాలని కోరారు. కరోనా సమయంలో ఎందరో కొత్త కొత్త ఆవిష్కరణలకు నాంది పలికారని చెప్పారు. విద్యా రంగంలో ఎన్నో ఆవిష్కరణలు వచ్చాయని.. విద్యార్థులకు ఆన్లైన్ పాఠాల కోసం సరికొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కరోనా సమయంలో పేదలు, కూలీల పడ్డ కష్టాలు మాటల్లో చెప్పలేనివని అని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వలస కూలీల కోసం శ్రామిక్ రైళ్లు నడుపుతున్నామని గుర్తుచేశారు. ఆత్మ నిర్భర్ కార్యక్రమంతో దేశం ఉన్నతస్థితికి చేరుతుందన్నారు. దేశంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తన సామర్థ్యం మేరకు కృషి చేస్తున్నట్టు మోదీ తెలిపారు. కరోనాపై పోరు సుదీర్ఘమైనదని చెప్పారు. కరోనా శ్వాస వ్యవస్థను దెబ్బతిస్తోందని.. యోగా ద్వారా దీనిని అధిగమించవచ్చని అన్నారు. పేదలకు ఆయుష్మాన్ భారత్ వరంగా మారిందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద కోటి మంది పేదలు చికిత్స పొందారని గుర్తుచేశారు. ఇతర దేశాలతో పోలిస్తే.. కరోనాపై పోరులో భారత్ మెరుగ్గా ఉందన్నారు. కరోనా వేగంగా విస్తరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ప్రపంచం ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని.. ఒక చిన్న క్రిమి ఎంతో మంది ప్రాణాలకు ముప్పుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జూన్ 5న జరుపుకోవాల్సిన పర్యావరణ దినోత్సవాన్ని మోదీ గుర్తుచేశారు. లాక్డౌన్ వల్ల జన జీవనం నెమ్మదించినప్పటికీ.. కాలుష్యం వల్ల కనిపించకుండా పోయిన పక్షులు, జంతువులు తిరిగి బయటకు వస్తున్నాయని చెప్పారు. ఇంత స్వచ్ఛమైన గాలిని, నదులను చూడగలిగే వాళ్లమా అనే దానిపై చాలా మంది ఆలోచన చేయాలని కోరారు. -
లాక్డౌన్ 5.0 : ఆ నగరాలపై ఫోకస్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ 4.0 మే 31తో ముగుస్తున్న క్రమంలో అదేరోజు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మరికొన్ని సడలింపులు ప్రకటిస్తూనే లాక్డౌన్ 5.0ను ప్రధాని ప్రకటించవచ్చని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 70 శాతం కేసులు వెలుగుచూస్తున్న 11 నగరాలపైనే లాక్డౌన్ 5.0 ప్రధానగంగా దృష్టిసారిస్తుందని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. జూన్ 1 నుంచి మొదలయ్యే లాక్డౌన్ 5.0 ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూర్, పుణే, థానే, ఇండోర్, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, సూరత్, కోల్కతా నగరాల్లో కరోనా కట్టడిపై ఫోకస్ చేయనుంది. ఇక దేశవ్యాప్తంగా నమోదైన 1.51 లక్షల కరోనా కేసుల్లో అహ్మదాబాద్, ఢిల్లీ, పుణే, కోల్కతా, ముంబై నగరాల్లోనే 60 శాతం కేసులు నమోదవడంతో ఈ నగరాల్లో మహమ్మారి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. మొత్తం కరోనా కేసుల్లో 80 శాతం కేసులు నమోదవుతున్న 30 మున్సిపల్ కార్పొరేషన్లతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. చదవండి: హృదయ విదారకం: చనిపోయిన తల్లిని లేపుతూ.. భారీ సడలింపులు లాక్డౌన్ 5.0లో దేవాలయాలు, మసీదులు, చర్చిలు తెరుచుకునేందకు అనుమతించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే ప్రార్ధనా స్ధలాల్లో భారీగా ప్రజలు గుమికూడటం నిషేధిస్తూ కోవిడ్-19 నిబంధనలను పాటించేలా వీటిని అనుమతించేందుకు కేంద్రం మొగ్గుచూపే అవకాశం ఉంది. ప్రార్థనా స్ధలాల్లో ప్రతిఒక్కరూ విధిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేయనున్నారు. కాగా జూన్ 1 నుంచి అన్ని ప్రార్ధనా స్ధలాలను తెరిచేందుకు అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయనికి లేఖ రాసింది. జిమ్లకు అనుమతి! లాక్డౌన్ 4.0లో సెలూన్లకు అనుమతించిన ప్రభుత్వం తాజాగా జిమ్లను తెరిచేందుకు అనుమతించనుంది. కంటెయిన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో జిమ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలతో జిమ్లను అనుమతిస్తారు. -
ఈ యుద్ధంలో మీరే సారథులు
న్యూఢిల్లీ: కరోనాపై యుద్ధానికి ప్రజలే సారథులని ప్రధాని మోదీ అభివర్ణించారు. ప్రజల సారథ్యంలోయుద్ధం సాగించడం ద్వారానే భారత్లో ఈ ప్రాణాంతక మహమ్మారిపై విజయం సాధ్యమవుతుందన్నారు. ప్రతీ నెల చివరి ఆదివారం రోజు చేసే రేడియో ప్రసంగ కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఆదివారం ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు. కరోనా సంక్షోభం ముగిసిన తరువాత.. భవిష్యత్తులో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు.. ఈ మహమ్మారిపై ప్రజల నేతృత్వంలో భారత్ జరిపిన పోరును చరిత్ర చెప్పుకుంటుందని వ్యాఖ్యానించారు. నెల రోజులకు పైగా కొనసాగిన లాక్డౌన్కు కొన్ని మినహాయింపులు ఇచ్చిన నేపథ్యంలో.. ‘అతి విశ్వాసం వద్దు. మీ నగరానికో, మీ పట్టణానికో, మీ గ్రామానికో లేక మీ వీధిలోకో కరోనా ఇంకా రాలేదన్న ధీమాతో నిర్లక్ష్యంగా ఉండకండి’అని హెచ్చరించారు. వారికి నా నమస్సులు: కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు తదితర వర్గాలను ఆయన కొనియాడారు. ఆపద సమయంలో అన్నార్తులకు సాయమందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులను ప్రశంసించారు. ఆపత్కాలంలో అభివృద్ధి చెందిన దేశాలు సహా పలు ప్రపంచ దేశాలకు ఔషధ సాయం అందించిన భారత్.. ప్రపంచదేశాధినేతల ప్రశంసలు పొందిందని వివరించారు. యోగా తరువాత ఇప్పుడు ఆయుర్వేదం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునే అత్యుత్తమ మార్గాలుగా వాటిని ప్రపంచం ఇప్పుడు చూస్తోందన్నారు. వారియర్స్గా మారండి కరోనాపై పోరులో ప్రతీ ఒక్కరు తమ శక్తిమేరకు పోరాడుతున్నారని, ‘సర్వేజన సుఖినోభవంతు’భావన ఇప్పుడు ప్రపంచవ్యాప్తమయిందని పేర్కొన్నారు. కరోనాను కట్టడి చేసే కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ‘కోవిడ్ వారియర్స్. గవ్.ఇన్’లో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. ఇప్పటికే ఈ పోర్టల్లో 1.25 కోట్ల మంది రిజిస్టరయ్యారన్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం, అక్షయ త్రిథియ సందర్భంగా దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ కన్నా ముందే ఈ కరోనా మహమ్మారి పీడ ప్రపంచానికి తొలగాలని, గతంలో మాదిరిగానే ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుందామని ఆకాంక్షించారు. వారిపై గౌరవం పెరిగింది పారిశుద్ధ్య కార్మికులు, ఇంటి దగ్గరి కిరాణా వర్తకులపై ప్రజల అభిప్రాయాల్లో ఇప్పుడు చాలా మార్పు వచ్చిందని ప్రధాని గుర్తు చేశారు. ప్రజల్లో పోలీసులపై ఉన్న తప్పుడు అభిప్రాయాలు కూడా తొలగిపోయాయని, వారిలోని మానవీయ కోణాన్ని ఇప్పుడు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే నెల మన్ కీ బాత్ నాటికి కరోనాపై పోరు విషయంలో ఒక శుభవార్త వినాలని తాను కూడా కోరుకుంటున్నానన్నారు. అయితే, అంతవరకు భౌతిక దూరం, మాస్క్ ధరించడం.. తదితర జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలన్నారు. -
ఆ దురలవాటుపై ప్రధాని మోదీ అసంతృప్తి
న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయొద్దని ‘స్వచ్ఛభారత్’లో పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మాటల్ని దేశ ప్రజానీకం పట్టించుకోలేదు. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా నమిలి ఎక్కడపడితే అక్కడ ఉమ్మడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. ఆదివారం మన్ కీ బాత్లో మాట్లాడిన ప్రధాని మోదీ ఈ దురలవాటుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం కరోనా వ్యాప్తిని ఎక్కువ చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి కరోనా కట్టడికి ఈ ‘అలవాటు’ను మానుకోవాలని ప్రధాని మోదీ మరోసారి పిలుపునిచ్చారు. ‘బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం సరైన పద్ధతి కాదని మనందరికీ తెలుసు. చాలా చోట్ల ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. దానిని నిర్మూలించేందుకు ఈ వైరస్ క్లిష్ట సమయమే సరైన సమయం’ అని ప్రధాని పేర్కొన్నారు. ఆ దురలవాటును దూరం చేసుకుంటే పరిశుభ్రతను పెంచడంతోపాటు, కోవిడ్తో పోరుకు బలం సమకూరుతుందని అన్నారు. లేకపోతే ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసినట్టేనని ఆయన హెచ్చరించారు. కోవిడ్ పోరులో ప్రజలు సహకారం బాగుందని ప్రధాని ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: 'కరోనాపై సైనికుల్లా యుద్దం చేస్తున్నారు') కాగా, కోవిడ్ బాధితులు దగ్గినపుడు, తుమ్మినపుడు వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తి జరగుతుందనే విషయం తెలిసిందే. ఇక బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఉమ్మివేయకుండా.. నిషేదం విధించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దాంతోపాటు పాన్ గుట్కా అమ్మకాలను నిషేధించింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కూడా బహిరంగంగా ఉమ్మే అలవాటును మానుకోవాలని సూచించింది. ఇక ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు, ముంబై నగర పాలక సంస్థ బహిరంగంగా ఉమ్మితే నేరంగా పరిగణిస్తామని ఆదేశాలు జారీ చేశాయి. కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1990 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 26,496కు చేరింది. ఒక రోజు ఇంత స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. ఇప్పటివరకు వైరస్ బారినపడి 824 మంది ప్రాణాలు కోల్పోయారు. (చదవండి: వధూవరులకు కరోనా, గ్రామానికి సీల్) -
'కరోనాపై సైనికుల్లా యుద్దం చేస్తున్నారు'
ఢిల్లీ : కరోనా వైరస్పై భారత్లో ప్రజా పోరాటం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాపై పోరాటం సరైన దిశలోనే సాగుతుందన్నారు. దేశ ప్రజలంతా ఒకరికొకరు అండగా నిలబడ్డారని, ఈ పోరాటానికి ప్రజలే నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. ప్రతీ పౌరుడు ఒక సైనికుడిలా కరోనా వైరస్ ఫై యుద్ధం చేస్తున్నారన్నారు. కరోనా సంక్షోభ వేళ రైతులునిర్విరామంగా పనిచేస్తున్నారన్నారు. ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా ఉండేందుకు వారు తమ శాయాశక్తుల శ్రమిస్తున్నట్లు తెలిపారు. (వావ్! వాట్ యాన్ ఐడియా 'ప్రేమ్జీ') ముఖానికి మాస్క్లు ధరించడం మన జీవితాల్లో ఒక భాగంగా మారిపోయిందని తెలిపారు. మాస్క్లు ధరించిన వారిని రోగులుగా చూడకూడదని, నాగరిక సమాజానికి మాస్క్లు చిహ్నంగా మారాయన్నారు. మనల్ని మనం రక్షించుకోవాలన్నా లేక ఇతరుల్ని వ్యాధి నుంచి కాపాడాలన్నా.. మాస్క్లు ధరించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలోనూ రైల్వే ఉద్యోగులు పని చేస్తున్నారని వారికి తన కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే కలిగే అనర్ధాల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిందని మోదీ అన్నారు. ఇలాంటి అలవాటును ఆపాల్సిన సందర్భం వచ్చిందన్నారు. కరోనా నివారణను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్న చొరవ అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. -
కరోనాపై యుద్ధంలో ప్రతి పౌరుడూ సైనికుడే
-
ప్రధాని మోదీ ఏం మాట్లాడబోతున్నారు?
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా(కోవిడ్-19)పై పోరులో భారత్ సాధిస్తున్న పురోగతి గురించి ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు వివరించనున్నట్లు సమాచారం. అదే విధంగా కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనుసరించబోయే వ్యూహాలను జాతితో పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం నాటి మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ప్రసంగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆలిండియా రేడియో ఏప్రిల్ 26 ఉదయం 11 గంటలకు ప్రధాని కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మార్చి 24 అర్ధరాత్రి లాక్డౌన్ విధించిన నాటి నుంచి ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. అంటువ్యాధి ప్రబలకుండా ఉండేందుకు కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నామని.. ఇందుకు ప్రజలు తమను క్షమించాలని కోరారు. అదే విధంగా లాక్డౌన్ పొడిగింపు నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. అంతేగాకుండా కరోనాపై పోరులో ప్రాణాలు పణంగా పెట్టి ముందుండి నడుస్తున్న వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సహా ఇతర సిబ్బంది పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని విజ్ఞప్తి చేశారు. (ప్రజలను క్షమాపణలు కోరిన ప్రధాని మోదీ) ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మన్ కీ బాత్లో మోదీ ఏం మాట్లాడనున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇక ఢిల్లీ నుంచి ప్రసారం కానున్న ఈ కార్యక్రమాన్ని ఎఫ్ఎం గోల్డ్, ఎఫ్ఎం రెయిన్బో తదితర స్థానిక రేడియో స్టేషన్ల నుంచి ఏకకాలంలో వినవచ్చు. ఛత్తీస్గఢీ, సర్గూజిహా, గోండి, హల్బీ తదితర మాండలికాల్లోనూ మన్ కీ బాత్ ప్రసారం అవుతుందని.. రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ప్రోగ్రామ్ పునఃప్రసారం అవుతుందని ఏఐఆర్ తెలిపింది. దూరదర్శన్ సహా ఇతర ప్రైవేటు టీవీ న్యూస్ చానెళ్లలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రసారం కానున్నాయి. ఇక నెలకొకసారి( చివరి ఆదివారం) మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలతో తన మనసులో మాట పంచుకుంటారన్న విషయం తెలిసిందే. -
మన్కి బాత్
-
నన్ను క్షమించండి
న్యూఢిల్లీ: కరోనా కోరల్లో చిక్కుకొని జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కోవిడ్–19 మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో భారత్ తప్పక విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ చేయడం కఠిన నిర్ణయమైనా ప్రస్తుత పరిస్థితుల్లో తప్పదన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు దేశప్రజలందరూ తనను క్షమించాలని వేడుకున్నారు. ఆకాశవాణి మన్కీ బాత్ కార్యక్రమంలో ఆదివారం జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడారు. ‘ఈ ప్రాణాంతక వ్యాధికి సంబంధించి కొన్ని విషయాలు చెబుతాను. ముందుగా దేశ ప్రజలందరినీ క్షమించమని కోరుకుంటున్నాను. మీరందరూ నన్ను క్షమిస్తారనే నాకు తెలుసు. నిరుపేద సోదర సోదరీమణులు ఈయనేం ప్రధానమంత్రి .. మమ్మల్ని సమస్యల ఊబిలోకి తోసేశాడు అని అను కుంటూ ఉండే ఉంటారు. అందుకే ప్రత్యేకంగా మీ అందరూ నన్ను మన్నించాలి. బహుశా, చాలా మం ది నా మీద కోపం పెంచుకుని ఉంటారు. మమ్మల్నందరినీ ఇలా ఇళ్లలో బంధిస్తావా అని ఆ గ్రహి స్తూ ఉంటారు. నేను మీ అందరి ఇబ్బందులను అర్థం చేసుకోగలను కానీ 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశాన్ని రక్షించడానికి ఇంతకంటే మరో మార్గం లేదు. కరోనాతో యుద్ధమంటే చావుబతుకుల మధ్య పోరాటం. ఈ యుద్ధంలో మనం గెలవాలి. గెలిచి తీరుతాం’’అని ప్రధాని అన్నారు. వైద్యసిబ్బంది సేవలు భేష్ కరోనాపై పోరాటంలో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ఫ్రంట్లైన్ వర్కర్స్ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. లాక్డౌన్ ప్రకటించినప్పట్నుంచి ప్రజలకి ఇబ్బందులు తలెత్తకుండా నిత్యావసరాలు, కూరలు, పాలు సరఫరా చేసేవారు వేలాది మంది నిరంతరాయంగా పని చేస్తున్నారంటూ కొనియాడారు. దయచేసి చట్టాన్ని ఉల్లంఘించకండి ‘నాకు తెలుసు ఎవ్వరూ కూడా కావాలని చట్టాన్ని ఉల్లంఘించాలనుకోరు. కానీ కొందరు చేస్తున్నారు. వాళ్లు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోలేకపోతున్నారు. వారందరినీ కోరేది ఒక్కటే లాక్ డౌన్ నియమాలను పాటించకపోతే ఈ వైరస్ నుంచి కాపాడుకోవడం కష్టమవుతుంది. ప్రపంచంలో చాలా మంది ఈ అపోహలతోనే కాలం గడిపారు. ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు’అని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా మోదీ కరోనా నుంచి కోలుకున్న వారితో మాట్లాడారు. ప్రధానికి రాహుల్ లేఖ కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా లాక్డౌన్ ప్రకటించడం తీవ్రమైన గందరగోళానికి దారి తీసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఆదివారం లేఖ రాశారు. వలస కార్మికుల దుస్థితిని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లిన రాహుల్ అభివృద్ధి చెందిన దేశాలు పాటించిన సంపూర్ణ లాక్డౌన్ వ్యూహం భారత్లో సరైంది కాదని అభిప్రాయపడ్డారు. దినసరి వేతన జీవులకి , నిరక్షరాస్యులకి ఈ పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి ఉండదని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు. దేశాన్ని పూర్తిగా లాక్డౌన్ చేయడంతో కార్మికులు ఊళ్లకి వెళుతూ ఉండడంతో గ్రామాల్లో కూడా కరోనా ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
‘గాంధీ’ వైద్యులు ధైర్యం చెప్పడం వల్లే.. కోలుకున్నా
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ : తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్ బాధితుడు.. వైరస్ బారి నుంచి విజయవంతంగా కోలుకొని డిశ్చార్జి అయిన హైదరాబాద్వాసి గంప రామ్తేజ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో ‘మన్కీ బాత్’లో తన అనుభవాలు, గాంధీ వైద్యులు అందించిన సేవలు, వైరస్పై ప్రజల్లో నెలకొన్న అపోహలు, భయాలపై సవివరంగా పంచుకున్నారు. కరోనా వైరస్ సోకిందని తెలియగానే ఆయనకు ఏమనిపించింది? అసలు ఆ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? గాంధీ ఆస్పత్రిలో చికిత్స ఎలా జరిగింది? కరోనా వైరస్ అనుమానితులు, విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్లో ఎందుకు ఉండాలి? క్వారంటైన్లో ఉన్నప్పుడు తాను ఎలా ఉన్నాడు? తెలంగాణ సమాజంపై ఉన్న బాధ్యత ఏంటి? ఈ మహమ్మారి దేశం నుంచి వెళ్లిపోతుందని ఆయన నమ్ముతున్నారా? లాంటి అనేక విషయాలపై మనసువిప్పి మోదీతో మాట్లాడారు. కరోనా సోకిన తనకు చికిత్స చేసిన గాంధీ ఆస్పత్రి వైద్యులు, నర్సులు చాలా మంచివాళ్లని, ఈ వైరస్ బారి నుంచి తాను బతికి బయటపడటానికి వారు నూరిపోసిన ధైర్యమే కారణమని చెప్పారు. మోదీ, రామ్తేజల మధ్య జరిగిన సంభాషణ వారి మాటల్లోనే... మోదీ : ఎస్.. రామ్ రామ్తేజ : నమస్కారమండి. మోదీ : ఎవరు? రామ్గారేనా మాట్లాడేది. రామ్తేజ : అవును సార్, రామ్నే.. మోదీ : రామ్ నమస్తే.. రామ్తేజ : నమస్తే.. నమస్తే.. మోదీ : మీరు కరోనా వైరస్ పెనుప్రమాదం నుంచి బయటపడ్డారని విన్నా. రామ్తేజ : అవును సార్ మోదీ : మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా. మీరు పెను ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారు? మీ అనుభవాలు వినాలనుకుంటున్నాను. రామ్తేజ : నేను ఐటీ రంగంలో పని చేసే ఉద్యోగిని. పనిలో భాగంగా మీటింగ్స్ కోసం దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ అనుకోకుండానే అలా జరిగిపోయింది. తిరిగి రాగానే జ్వరం లాంటివి మొదలయ్యాయి సార్. ఆ తర్వాత ఐదారు రోజులకు డాక్టర్లు కరోనా వైరస్ పరీక్షలు జరిపారు. అప్పుడు పాజిటివ్ వచ్చింది. వెంటనే హైదరాబాద్లోని గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో నన్ను చేర్చారు. ఆ తర్వాత 14 రోజులకు నాకు నయమైంది. నన్ను డిశ్చార్జి చేశారు. నిజంగా అదంతా తలుచుకుంటే భయంకరంగా ఉంటుంది. మోదీ : మీకు కరోనా వైరస్ సోకిందన్న విషయం తెలిసిందన్నమాట. రామ్తేజ : అవును సార్. మోదీ : మీకు ఈ వైరస్ ఎంతో భయంకరమైనదన్న విషయం ముందే తెలుసు కదా. రామ్తేజ : తెలుసు సార్. మోదీ : అయితే వైరస్ సోకిన విషయం తెలియగానే ఏమనిపించింది? రామ్తేజ : ఒక్కసారిగా భయం వేసింది. ముందయితే నేను నమ్మలేకపోయా. అలా ఎలా జరిగిందో అర్థం కాలేదు. ఎందుకంటే అప్పుడు మన దేశంలో కేవలం ఇద్దరు, ముగ్గురికే ఈ వ్యాధి సోకింది. నాకేమీ అర్థం కాలేదు. ఆస్పత్రిలో చేరిన తర్వాత నన్ను క్వారంటైన్లో ఉంచారు. రెండు, మూడు రోజులు అలాగే గడిచిపోయాయి. అక్కడ ఉన్న డాక్టర్లు.. నర్సులు... మోదీ : ఆ ఇంకా... రామ్తేజ : వాళ్లు ఎంతో మంచివాళ్లు. ప్రతిరోజూ నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్లు. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవాళ్లు. నాకు ఏమీ కాదన్న నమ్మకాన్ని కలిగించే వాళ్లు. నేను తొందరగా కోలుకుంటానంటూ ధైర్యం చెప్పేవారు. పగలు ఇద్దరు, ముగ్గురు డాక్టర్లు మాట్లాడేవాళ్లు. నర్సులు కూడా మాట్లాడేవాళ్లు. మొదట్లో భయం వేసింది. కానీ క్రమంగా ఇంత మంది మంచివాళ్ల మధ్య ఉన్న నాకేమీ కాదన్న నమ్మకం కుదిరింది. ఏం చేయాలో వాళ్లకు తెలుసు. తప్పనిసరిగా నాకు మెరుగవుతుందన్న విశ్వాసం పెరిగింది. మోదీ : మీ కుటుంబ సభ్యుల మానిసిక స్థితి ఎలా ఉండేది? రామ్తేజ : నేను ఆస్పత్రిలో చేరిన మొదట్లో వాళ్లు ఎంతో ఆందోళనకు గురయ్యారు. ఇక్కడ మీడియా కూడా కొంత సమస్యాత్మకంగా మారింది. ఆ తర్వాత మా కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేశారు. నెగిటివ్ వచ్చింది. నాకూ, నా కుటుంబ సభ్యులకూ, చుట్టుపక్కల వారికి కూడా అది ఎంతో ఊరటనిచ్చింది. ఆ తర్వాత రోజురోజుకూ నా పరిస్థితిలో మెరుగుదల కన్పించింది. డాక్టర్లు మాతో మాట్లాడేవారు. కుటుంబ సభ్యులకు కూడా అన్ని విషయాలు చెప్పేవారు. వారు ఏయే జాగ్రత్తలు తీసుకుంటున్నారో, ఏవిధంగా చికిత్స చేస్తున్నారో అన్ని విషయాలు కుటుంబ సభ్యులకు చెప్పేవారు. మోదీ : మీరు స్వయంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవారు? మీ కుటుంబ సభ్యులు ఏయే జాగ్రత్తలు తీసుకునేవారు? రామ్తేజ : నేను క్వారంటైన్లోకి వెళ్లిన తర్వాతే ఈ విషయం తెలిసింది. అయితే క్వారంటైన్ తర్వాత కూడా మరో 14 రోజులు పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఆ 14 రోజులు ఇంటి దగ్గరే ఒక గదిలో ఉండాలని చెప్పారు. ఇంట్లో తమకు తాముగా క్వారంటైన్లో ఉండాలని మా కుటుంబ సభ్యులకు చెప్పారు. నేను ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంట్లోనే ఒక గదిలో ఉండేవాడిని. దాదాపుగా రోజంతా మాస్క్ తగిలించుకొనే వాడిని. తినడానికి గదిలోంచి బయటకు వచ్చే ముందు చేతులను శుభ్రంగా కడుక్కునేవాడిని. ఇది ఎంతో ముఖ్యం. మోదీ : సరే రామ్.. మీరు పుంజుకొని బయటకు వచ్చారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. రామ్తేజ : ధన్యవాదాలు సార్. మోదీ : మీరు ఐటీ ప్రొఫెషన్లో ఉన్నారు కదా... మీ అనుభవంపై ఆడియో తయారు చేసి... రామ్తేజ: ఆ సార్... మోదీ : ఇతరులతో పంచుకోండి. ప్రజలతో పంచుకోండి. దీనిని సామాజిక మాధ్యమంలో వైరల్ చేయండి. ఈ విధంగా చేస్తే ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ఉంటారు. ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుస్తుంది. ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి దూరంగా ఉండటానికి తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. రామ్తేజ : అవును సార్. బయటకు వచ్చాక చూస్తున్నాను. క్వారంటైన్ అంటే తమను తాము జైలులో ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇది నిజంగా అలాంటిది కాదు. అందరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చెబుతున్న క్వారంటైన్ కేవలం వారికే కాదు, వారి కుటుంబ సభ్యులకు కూడా మంచిది. అందుకే ఎంతో మందికి ఈ విషయాలను చెప్పాలనుకుంటున్నాను. పరీక్షలు చేయించుకోండి. క్వారంటైన్ అంటే భయపడకండి. క్వారంటైన్ అంటే అదేదో మచ్చలాంటిది అనుకోకండి. మోదీ : మంచిది రామ్. మీకు ఎన్నెన్నో శుభాకాంక్షలు. రామ్తేజ : ధన్యవాదాలు.. ధన్యవాదాలు. సార్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. మోదీ : ఆ చెప్పండి... చెప్పండి. రామ్తేజ : నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు తీసుకున్న చర్యలు ప్రపంచంలో ఏ దేశం కూడా తమ పౌరుల కోసం తీసుకోలేదు. అంతేకాదు.. మీ కారణంగా మేమందరం కూడా క్షేమంగా బయటపడగలమని ఆశిస్తున్నా. మోదీ : ఈ వైపరీత్యం నుంచి దేశం బయటపడాలి. ఇది ఎంతో భయానకమైన పరిస్థితి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితి. రామ్తేజ : ఏమీ కాదు సార్. మొదట్లో నాకు భయం వేసింది. మీరు లాక్డౌన్ లాంటి చర్యలు తీసుకున్నప్పుడు నాలో నమ్మకం పెరుగుతోంది. మనందరం మీ సహాయంతో బయటపడతాం సార్. ధన్యవాదాలు. మోదీ : ధన్యవాదాలు సోదరా... కృతజ్ఞతలు. రామ్తేజ : ధన్యవాదాలు సర్. ఆ తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశవాసులారా... రామ్తేజ చెప్పినట్లు ఆయనకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిన తర్వాత డాక్టర్లు ఇచ్చిన ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించారు. ఆ కారణంగానే ఆయన ఆరోగ్యవంతుడై మళ్లీ సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారు’ అని పేర్కొన్నారు. అనంతరం తరువాత ఆగ్రాకు చెందిన ఆశోక్ కపూర్, వైద్య నిపుణుడు, ఢిల్లీకి చెందిన డాక్టర్ నీతేష్ గుప్తా, పుణేలోని డాక్టర్ బోర్సేలతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా వైద్య నిపుణులకు ధన్యవాదాలు తెలిపారు. నిత్యావసర సేవలు అందిస్తున్న రవాణా, బ్యాంకింగ్ వంటి రంగాల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. (లాక్డౌన్ 15న ఎత్తేసే చాన్స్ లేదు) గాంధీలో వైద్య సేవలు బాగున్నాయి : గాంధీ ఆస్పత్రిలోని కరోనా ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి తన అనుభవాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. తాను యుకే నుంచి వచ్చానని, కరోనా లక్షణాలు కనిపించడంతో 104కి కాల్ చేసి గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యానని చెప్పాడు. నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఐసోలేషన్ వార్డులో చేరి ఆదివారం నాటికి 13 రోజులు అయిందని పేర్కొన్నాడు. గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో వైద్యసేవలు, వసతి సౌకర్యాలు చాలా బాగున్నాయని, వైద్యులు చాలా కేర్ తీసుకుంటున్నారని వివరించాడు. -
కరోనా బాధితుడితో మోదీ మన్ కీ బాత్
న్యూఢిల్లీ/ హైదరాబాద్ : మన్ కీ బాత్లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ కరోనా పాజిటివ్ వచ్చిన తొలి తెలంగాణ యువకుడితో ఫోన్లో మాట్లాడారు. ఆదివారం సదరు యువకుడు తన అనుభవాలను మోదీతో పంచుకున్నాడు. ప్రధాని మోదీకి యువకుడికి మధ్య జరిగిన సంభాషణ మోదీ : ఎస్ రాం రామ్ గంప తేజా : నమస్కారమండీ. మోదీ : ఎవరు? రామ్ గారేనా మాట్లాడేది. రామ్ గంప తేజా : అవును సర్. రామ్ను మాట్లాడుతున్నాను. మోదీ : రామ్ నమస్తే. రామ్ గంప తేజా : నమస్తే.. నమస్తే.. మోదీ : మీరు కరోనా వైరస్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారని విన్నాను. రామ్ గంప తేజా : అవును సార్. మోదీ : మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి మీరు పెను ప్రమాదం నుంచి ఎట్లా బయటపడ్డారు. మీ అనుభవాలు వినాలనుకుంటున్నాను. రామ్ గంప తేజా : నేను ఐటీ రంగంలో పని చేసే ఉద్యోగిని. పనిలో భాగంగా మీటింగ్స్ కోసం దూబాయ్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ అనుకోకుండానే అలా జరిగిపోయింది. తిరిగి రాగానే జ్వరంలాంటివి మొదలయ్యాయి సార్. ఆ తర్వాత ఐదారు రోజులకు డాక్టర్లు కరోనా వైరస్ పరీక్షలు జరిపారు. అప్పుడు పాజిటివ్ వచ్చింది. వెంటనే హైదరాబాద్లోని ప్రభుత్వ గాంధీ హాస్పిటల్లో నన్ను చేర్చారు. ఆ తర్వాత 14 రోజులకి నాకు నయమైంది. డిశ్చార్జి చేశారు. నిజంగా అదంతా ఎంతో భయంకరంగా సాగింది. మోదీ : అంటే మీకు కరోనా వైరస్ సోకిందన్న విషయం తెలిసింది?. రామ్ గంప తేజా : అవును సార్. మోదీ : మీకు ఈ వైరస్ ఎంతో భయంకరమైనదన్న అన్న విషయం ముందే తెలుసుకదా. జ్వరంతో బాధ పడుతున్నారు కదా. రామ్ గంప తేజా : అవును సార్. మోదీ : అయితే వైరస్ సోకిన విషయం తెలియగానే మీకు ఏమనిపించింది. రామ్ గంప తేజా : ఒక్కసారిగా భయంవేసింది. ముందైతే నేను నమ్మలేకపోయాను. ఇట్లా ఎట్లా జరిగిందో అర్థం కాలేదు. ఎందుకంటే భారత దేశంలో కేవలం ఇద్దరి, ముగ్గురికే ఈ వ్యాధి సోకింది. అందుకే ఏమీ అర్థం కాలేదు. ఆస్పత్రిలో చేరిన తర్వాత నన్ను క్వారంటైన్లో ఉంచారు. రెండు, మూడు రోజులు అట్లాగే గడిచిపోయాయి. అక్కడ ఉన్న డాక్టర్లు... నర్సులు... మోదీ : ఆ ఇంకా... రామ్ గంప తేజా : వాళ్లు ఎంతో మంచివాళ్లు. ప్రతిరోజూ నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్లు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవాళ్లు నాకు ఏమీ కాదన్న నమ్మకాన్ని కలిగించే వాళ్లు. మీరు తొందరగా కోలుకుంటారు. అంటూ ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్లు. పగటి పూట ఇద్దరు, ముగ్గురు డాక్టర్లు మాట్లాడేవాళ్లు. నర్సులు కూడా మాట్లాడేవాళ్లు. మొదట్లో భయం వేసింది. కాని క్రమంగా ఇంతమంది మంచివాళ్ల మధ్య ఉన్న కారణంగా నాకేమీ కాదన్న నమ్మకం కుదిరింది. ఏంచేయాలో వాళ్లకి తెలుసు. తప్పనిసరిగా నాకు మెరుగవుతుంది అన్న విశ్వాసం పెరిగింది. మోదీ : మీకుటుంబ సభ్యుల మానసిక స్థితి ఎట్లా ఉండేది. రామ్ గంప తేజా : నేను ఆస్పత్రిలో చేరినప్పుడు మొదట్లో వాళ్లు ఎంతో ఆందోళనకు గురయ్యారు. ఇక్కడ మీడియా కూడా కొంత సమస్యాత్మకంగా మారింది. ఆతర్వాత మాకుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేశారు. నెగిటివ్ వచ్చింది. నాకూ, నాకుటుంబ సభ్యులకూ, చుట్టు పక్కల వారికి కూడా ఎంతో ఊరటనిచ్చింది. ఆ తర్వాత రోజురోజుకీ నా పరిస్థితిలో మెరుగుదల కన్పించింది. డాక్టర్లు మాతో మాట్లాడేవారు. కుటుంబ సభ్యులకు కూడా విషయాలు చెప్పేవారు. వారు ఏఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఏవిధంగా చికిత్స చేస్తున్నారో అన్ని విషయాలు కుటుంబ సభ్యులకు తెలిపేవారు. మోదీ : మీరు స్వయంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవారు. మీ కుటుంబ సభ్యులు ఏ ఏ జాగ్రత్తలు తీసుకునేవారు? రామ్ గంప తేజా : నేను క్వారంటైన్ లోకి వెళ్లిన తర్వాతే ఈ విషయం తెలిసింది. అయితే క్వారంటైన్ తర్వాత కూడా మరో 14 రోజులు పడుతోందని డాక్టర్లు చెప్పారు. ఆ 14 రోజులు ఇంటి దగ్గరే ఒక గదిలో ఉండాలని చెప్పారు. వారిని ఇంట్లో తమకుతాముగా క్వారంటైన్లో ఉండాలని కోరారు. నేను ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంట్లోనే ఒక గదిలో ఉండేవాన్ని.. దాదాపుగా రోజంతా ఎక్కువసేపు మాస్క్ తగిలించుకొని ఉండేవాన్ని. తినడానికి గదిలోంచి బయటికి వచ్చే ముందు చేతులను శుభ్రంగా కడుక్కునేవాడిని. ఇది ఎంతో ముఖ్యం. మోదీ : సరే రామ్.. మీరు ఆరోగ్యం పుంజుకొని బయటికి వచ్చారు. మీకు, మీకుటుంబ సభ్యులకు ఎన్నోన్నో శుభాకాంక్షలు. రామ్ గంప తేజా : ధన్యవాదాలు సార్. మోదీ : కానీ మీ ఈ అనుభవం... రామ్ గంప తేజా : ఆ సార్.. మోదీ : మీరు ఐటీ ప్రొఫెషన్లో ఉన్నారు.. కదా... రామ్ గంప తేజా : చెప్పండి సార్.. మోదీ : అయితే ఆడియో తయారు చేసి... రామ్ గంప తేజా : ఆ సర్... మోదీ : ఇతరులతో పంచుకోండి... ప్రజలతో పంచుకోండి. దీనిని సామాజిక మాధ్యమంలో వైరల్ చేయండి. ఈ విధంగా చేస్తే ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ఉంటారు. ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలో కాడా తెలుస్తుంది. ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి దూరంగా ఉండడానికి తమనుతాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. రామ్ గంప తేజా : అవును సార్. బయటికివచ్చి చూస్తున్నాను క్వారంటైన్ అంటే తమకు తాము జైలులో ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇది నిజంగా ఇలాంటిది కాదు. అందరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చెబుతున్న క్వారంటైన్ కేవలం వారికే కాదు, వారి కుటుంబ సభ్యులకు కూడా మంచిది. అందుకే.. ఎంతో మందికి ఈ విషయాలను చెప్పాలనుకుంటున్నాను. పరీక్షలు చేయించుకోండి. క్వారంటైన్ అంటే భయపడకండి. క్వారంటైన్ అంటే అదేదో మచ్చలాంటిది అనుకోకండి. మోదీ : మంచిది రామ్. మీకు ఎన్నెన్నో శుభాకాంక్షలు. రామ్ గంప తేజా : ధన్యవాదాలు.. ధన్యవాదాలు... మోదీ : ధన్యవాదాలు.. రామ్ గంప తేజా : సార్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మోదీ : ఆ చెప్పండి... చెప్పండి. రామ్ గంప తేజా : నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు తీసుకున్న చర్యలు ప్రపంచంలో ఏ దేశం కూడా తమ పౌరుల కోసం తీసుకోలేదు. అంతేకాదు మీ కారణంగా మేమందరం కూడా క్షేమంగా బయట పడగలమని ఆశిస్తున్నాను. మోదీ : ఈ వైపరిత్యం నుంచి దేశ బయటపడాలి. ఇది ఎంతో భయానకమైన పరిస్థితి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితి. రామ్ గంప తేజా : ఏమీ కాదు సార్. మొదట్లో నాకు భయం వేసింది. మీరు లాక్ డౌన్ ప్రకటించినప్పుడు. మీరు తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే నాలో నమ్మకం పెరుగుతోంది. మనందరం మీ సహాయంతో బయటపడతాం సార్. ధన్యవాదాలు సార్. మోదీ : ధన్యవాదాలు సోదరా... ఎన్నెన్నో కృతజ్ఞతలు. రామ్ గంప తేజా : ధన్యవాదాలు సర్. మోదీ : దేశవాసులారా... రామ్ గంప తేజా గారు చెప్పినట్లు ఆయనకు కరోనా సోకిన విషయం తెలిసిన తర్వాత డాక్టర్లు ఇచ్చిన ఆదేశాలను తూచాతప్పకుండా పాటించారు. ఆ కారణంగానే ఆయన ఆరోగ్యవంతుడై మళ్లీ సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారు. -
దేశ ప్రజలను రక్షించడం కోసమే
-
ప్రజలను క్షమాపణలు కోరిన ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నందుకు యావత్దేశ ప్రజలు తనను క్షమించాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహమ్మారి కరోనా వైరస్ నుంచి దేశ ప్రజలను రక్షించడం కోసమే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు మోదీ వివరించారు. దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తున్న తరుణంలో ప్రధాని ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి ‘మాన్ కీ బాత్’ కార్యక్రమంలో భావోద్వేగ ప్రసంగం చేశారు. (కరోనాపై పోరాటానికి ‘పీఎం-కేర్స్’) మాక్ కీ బాత్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ‘నా ప్రియతమ దేశవాసులారా.. సాధారణంగా మన్ కీ బాత్ లో నేను అనేక విషయాలను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అయితే ఈరోజు మన దేశమే కాదు.. ప్రపంచం మనసులో కూడా ఒకే ఒక్క విషయం కదలాడుతోంది. అదే ప్రాణాంతకమైన కరోనా వ్యాధి సృష్టించిన భయంకర కష్టం. ఇటువంటి సమయంలో వేరే విషయాల గురించి మాట్లాడటం సమంజసంగా ఉండదు. ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలనుకున్నాను కానీ.. ఈ ప్రాణాంతక వ్యాధికి సంబంధించి కొన్ని విషయాలను తెలియజేయాలని నా మనసు కోరుకుంటోంది. అయితే ముందస్తుగా దేశప్రజలందరినీ క్షమించమని కోరుకుంటున్నాను. మీరందరూ నన్ను క్షమిస్తారని నా ఆత్మ చెబుతోంది. ఎందుకంటే కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీని వల్ల మీరందరూ ఎన్నో కష్టనష్టాలకు గురికావల్సి వస్తోంది. ముఖ్యంగా నా నిరుపేద సోదరసోదరీమణులను చూస్తుంటే ఏమనిపిస్తోందంటే వారందరూ కూడా ఈనేం ప్రధానమంత్రి? మమ్మల్ని కష్టనష్టాల ఊబిలోకి తోసేసాడు అని వాళ్లు అనుకుంటున్నారనిపిస్తోంది. నన్ను క్షమించమని ప్రత్యేకంగా వారిని కోరుకుంటున్నాను. బహుశా, చాలామంది నా మీద కోపం పెంచుకుని ఉంటారు. మమ్మల్నందరినీ ఇట్ల ఇళ్లలో బందిస్తావా అని ఆగ్రహిస్తున్నారు. నేను మీ అందరి కష్టనష్టాలను అర్థం చేసుకోగలను. మీఅందరి ఇబ్బందులను అర్థం చేసుకోగలను అయితే.. 130 కోట్ల జనాభా గల మనలాంటి దేశంలో కరోనాపై యుద్ధానికి ఇంతకుమించిన మరోమార్గం లేనేలేదు. కరోనాతో యుద్ధమంటే జీవితానికి చావుకు మధ్య జరిగే యుద్ధం. ఈ యుద్ధంలో మనం గెలవాలి. అందుకే కఠినమైన నిర్ణయాలు తప్పనిసరి అయ్యాయి. ఎవ్వరి మనసూ ఇంత కఠినమైన నిర్ణయాలను అంగీకరించరు. అయితే ప్రపంచ దేశాల్లోని పరిస్థితులను చూస్తుంటే మిమ్మల్ని మీ కుటుంబాల్ని క్షేమంగా ఉంచడానికి ఇదొక్కటే మార్గమని తేలుతుంది. నేను మరోసారి మీకు కలిగిన ఇబ్బందులకు, కష్టాలకు క్షమించమని కోరుకుంటున్నారు. సహచరులారా... మనదగ్గర ఒక సూక్తి ఉంది. “ఏవం ఏవం వికార: అపి తరుణా సాధ్యతే సుఖం్ఙ అంటే వ్యాధులు, రోగాలను అవి ప్రబలకముందే, వాటిని ప్రారంభంలోనే ఎదుర్కొవాలి. లేకపోతే అవి ముదిరిన తర్వాత నివారించడం అసాధ్యమవుతుంది. రోగాలను నయం చేయడం కూడా మరింత కష్టమవుతుంది. ఈరోజు యావత్ భారతం ఒకటే చెబుతోంది. సోదరసోదరీమణులారా.. తల్లులారా... కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్నీ బందీచేసింది. జ్ఞానులను, వైజ్ఞానికులను, నిరుపేదలను, ధనవంతులను, బలహీన వర్గాలను, శక్తి మంతులను అందరినీ ఇది సవాల్ చేస్తోంది. ఇది దేశాల సరిహద్దులకు కానీ, ఒక ప్రాంత సరిహద్దులకు కానీ, ఒక వాతావరణ పరిమితులకు కాని, దేనికీ కట్టుబడటం లేదు. ఇది మానవజాతిని నాశనం చేయడానికీ, అంతం చేయడానికీ పట్టుబట్టి కూర్చుంది. అందుకే అందరూ.. కలిసికట్టుగా, యావత్ మానవజాతీ ఈ వైరస్ అంతంచూడడానికి సంకల్పం చేసుకోవాలి. లాక్ డౌన్ ను పాటిస్తూ ఇతరులను కాపాడుతున్నామన్న భావన కొంతమందిలో కలుగుతోంది. ఇది కేవలం అపోహ. ఈ భ్రమలోంచి బయటపడండి. ఈ లాక్ డౌన్ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికీ, మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవడానికీ. ఇంకా ముందు ముందు కూడా కొన్ని రోజుల వరకు మీరు ఓర్పు వహించక తప్పదు సహనం ప్రదర్శించాలి. లక్ష్మణరేఖను దాటకూడదు. సహచరులారా.. నాకు తెలుసు ఎవ్వరూ కూడా కావాలని చట్టాన్ని ఉల్లంఘించాలని కోరుకోరు. నియమనిబంధనలను పాటించకూడదని ఎవ్వరూ అనుకోరు. కానీ కొంతమంది ఇట్లా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోలేకపోతున్నారు. వారందరినీ కోరేది ఒక్కటే లాక్ డౌన్ నియమాలను పాటించకపోతే. కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడం కష్టతరమవుతుంది. ప్రపంచంలో చాలా మంది ఈ అపోహలతోనే కాలం గడిపారు. ఇప్పుడు పశ్చాతాప పడుతున్నారు. ఆరోగ్యం పరం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనం అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే, దేనినైనా సాధించడానికి సాధనం. ప్రపంచంలో అన్ని సుఖాలను పొందడానికి సాధనం కేవలం ఆరోగ్యమే అందుకే లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించేవారు తమ జీవితంతో ఆటలాడుకుంటున్నారని చెప్పక తప్పదు. ఈ యుద్ధంలో అనేక మంది యోధులు కేవలం ఇంట్లో కూర్చొని కాకుండా బయటకు వెళ్లి కరోనా వైరస్ తో పోరాడుతున్నారు. వీరంతా యుద్ధంలో అగ్రభాగాన నిల్చిన సైనికులు. ముఖ్యంగా నర్సులు. ఈ నర్సుల్లో మన సోదరులు, సోదరీమణులు కూడా ఉన్నారు. డాక్టర్లు, సహచర వైద్య సిబ్బంది వీరంతా కరోనాను ఓడిస్తున్నారు. మనం వీరి నుంచి స్ఫూర్తి పొందాలి. ఈ మధ్య నేను కొంత మందితో ఫోన్ లో మాట్లాడాను. వారిలో ఉత్సాహాన్ని నింపాను. వారితో మాట్లాడటం వల్ల నాలో మరింత ఉత్సాహం పెరిగింది. వారితో మాట్లాడి ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. ఈసారి మన్ కీ బాత్ ద్వారా ఆ సహచరుల అనుభవాలు, వారితో మాట్లాడిన విషయాలు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. -
భాగీరథి అమ్మకు ఆధార్!
తిరువనంతపురం: 105 సంవత్సరాల వయసులో నాల్గవ తరగతి పరీక్ష పూర్తిచేసి ‘మన్కీ బాత్’రేడియో కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న కేరళ బామ్మ, భాగీరథి అమ్మ త్వరలో ఆధార్ కార్డు పొందనున్నారు. కేరళలోని కొల్లామ్లో నివసించే భాగీరథి అమ్మ కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ (కేఎస్ఎల్ఎమ్) నిర్వహించిన నాల్గో తరగతి పరీక్ష పాసైన ‘పెద్దవయసు విద్యార్థి’గా పేరొందారు. తనను మోదీ ప్రస్తావిండంతో సంతోషపడినా, ఆధార్ కార్డు ఇంతవరకు లేదని ఆవేదనచెందారు. కార్డు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్దిపొందలేకపోయారు. విషయం తెల్సుకున్న ఓ జాతీయ బ్యాంకు అధికారులు ఇటీవల ఆమె ఇంటికెళ్లి ఆధార్ ప్రక్రియను పూర్తిచేశారు. ‘కార్డు పొందేందుకు గతంలో యత్నించినా.. వృద్ధాప్యం కారణంగా ఆమె వేలిముద్రలు, కంటి రెటీనా స్కాన్ చేయలేకపోయాం’అని ఓ అధికారి వివరించారు. -
మన జీవ వైవిధ్యం.. మానవాళికి విశిష్ట నిధి
న్యూఢిల్లీ: భారతదేశంలోని జీవ వైవిధ్యం ప్రపంచ మానవాళికి ఒక విశిష్టమైన నిధిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆయన ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సృష్టిలోని అన్ని జీవరాశుల పట్ల అనురాగం, ప్రకృతి పట్ల ప్రేమ కలిగి ఉండాలని చెప్పారు. ప్రతిఏటా ప్రపంచం నలుమూలల నుంచి ఎన్నో రకాల పక్షులు భారత్కు వస్తున్నాయన్నారు. వలస పక్షులకు భారత్ ఇల్లులా మారిందన్నారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ నిర్వహించిన హునర్ హాట్ కార్యక్రమం గురించి ప్రస్తావించారు. భాగీరథీ అమ్మ స్ఫూర్తిదాయకం.. ఆయన మాట్లాడుతూ.. ‘లక్ష్యాలు సాధించడానికి వయసు, వైకల్యం ఎంతమాత్రం అడ్డంకులు కావు. ఏదైనా సాధించాలని సంకల్పిస్తే మనలోని విద్యార్థిని చంపకూడదు. కేరళలో భాగీరథీ అమ్మ అనే మహిళ 105 ఏళ్ల వయసులో లెవల్ 4 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం, కామ్యా కార్తికేయన్ అనే 12 ఏళ్ల బాలిక దక్షిణ అమెరికాలోని 7,000 మీటర్ల ఎత్తయిన మౌంట్ అకోకాంగువాను అధిరోహించడం సంతోషకరం’ అన్నారు. చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలన్నారు. దేశీయంగా తయారు చేసిన బయో–జెట్ ఇంధనాన్ని ఇటీవల ఇండియర్ ఎయిర్ఫోర్సుకు చెందిన ఏఎన్–32 రవాణా విమానంలో ఉపయోగించామని. మొత్తం ఇంధనంలో 10 శాతం మనం సొంతంగా తయారు చేసిన ఇంధనమే వాడామన్నారు. రెండు ఇంజన్లలో ఇలాంటి బయో–జెట్ ఇంధనం వాడడం ఇదే మొదటిసారి అన్నారు. -
హింస.. పరిష్కారం కాదు
న్యూఢిల్లీ: హింసామార్గం ఏ సమస్యనూ పరిష్కరించలేదని, ప్రజల జీవితాలు మెరుగుపడిన దాఖలాలు లేవని ప్రధాని మోదీ అన్నారు. 21వ శతాబ్దం సైన్స్, టెక్నాలజీ, ప్రజాస్వామ్యాలదంటూ ఆయన.. ఏ సమస్య పరిష్కారం అయినా శాంతియుత పద్ధతుల్లోనే జరగాలని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో మొట్టమొదటి మాసాంతపు ‘మన్కీ బాత్’లో ఆయన మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం నాడే మన్కీ బాత్ కూడా రావడంతో ఉదయం 11 గంటలకు బదులు సాయంత్రం 6 గంటలకు ప్రధాని రేడియో ద్వారా మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటు వాదం తగ్గుముఖం పట్టిందన్నారు. ‘అస్సాంలో 8 సంస్థలకు చెందిన 644 మంది ఉగ్రవాదులు ప్రభుత్వానికి లొంగిపోయారు. ఈ ప్రాంత సమస్యలను చర్చల ద్వారా ప్రభుత్వం పరిష్కరిస్తున్నందునే వీరంతా హింసామార్గం వీడుతున్నారు’అని అన్నారు. నీటి పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన జల్శక్తి కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో విజయవంతమైందని ప్రధాని మోదీ చెప్పారు. ‘ఉత్తరాఖండ్లోని అల్మోరా–హల్ద్వానీ హైవే పక్కన ఉన్న సునియాకోట్ గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన కార్యక్రమం విజయవంతమైంది. అలాగే, తమిళనాడులో వర్షం నీటిని బోరుబావి ద్వారా ఒడిసిపట్టడం అద్భుతమైన ఆలోచన’అని ఆయన అన్నారు. ఈ నెల 22వ తేదీతో ముగిసిన మూడో ఖేలో ఇండియా గురించి మాట్లాడుతూ..‘మూడేళ్లుగా చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 32 వేల మంది బాలల ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది నుంచి వర్సిటీల స్థాయిలో కూడా ఖేలో ఇండియా నిర్వహించనున్నాం. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఒరిస్సాలో జరగనున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ స్థాయి ఆటల పోటీల్లో 3 వేల మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు’అని తెలిపారు. గగన్యాన్ మిషన్ గురించి ఆయన ప్రస్తావిస్తూ... ‘ఈ మిషన్ మరో అడుగు ముందుకు పడింది. ఈ మిషన్కు వైమానిక దళానికి చెందిన నలుగురు పైలెట్లు ఎంపికయ్యారు. వీరు దేశం ప్రతిభ, శక్తి సామర్థ్యాలు, ధైర్యం, కలలకు ప్రతిబింబాలు. ఈ మిషన్లో భాగస్వాములందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’అని తెలిపారు. -
అరాచకం, అస్థిరతలపై అసహనం
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్దాలన్నీ యువతరానివేనని, వ్యవస్థపై వారికి అపారమైన నమ్మకం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యవస్థలు సరిగా స్పందించకపోతే యువతలో ప్రశ్నించే ధోరణి కనిపిస్తోందని కొనియాడారు. ఆకాశవాణిలో ఆదివారం నాడు ఈ ఏడాది చివరి మన్కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. అరాచకత్వం, అనిశ్చితి పరిస్థితుల్ని నేటి తరం ద్వేషిస్తున్నారని ప్రధాని అన్నారు. కులతత్వం, బంధుప్రీతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారు. పౌరసత్వ చట్ట సవరణలకు, ప్రతిపాదిత ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఇటీవల యూనివర్సిటీల్లో నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘నాకు తెలిసినంతవరకు నేటి తరం వ్యవస్థలపైనే నమ్మకం ఉంచింది. వాటిని అనుసరించాలనీ భావిస్తోంది. వ్యవస్థలు సరిగా స్పందించనప్పుడు వారిలో అసహనం పెరిగిపోతోంది. ధైర్యంగా ప్రశ్నించే తత్వం కూడా కనబడుతోంది’’అని మోదీ అన్నారు. దేశంలో యువత అరాచకం ఏ రూపంలో ఉన్నా సహించలేరని, పాలనా వైఫల్యాలను, అస్థిరతను తట్టుకోలేకపోతున్నారని అన్నారు. జాతి నిర్మాణంలో పాల్గొనాలి ధైర్యసాహసాలు, ఉత్తేజపూరిత స్వభావం కలిగిన యువతే మార్పుకి బాటలు వేస్తుందని స్వామి వివేకానంద మాటల్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుకు తెచ్చుకున్నారు. జనవరి 12 వివేకానందుడి జయంతిని పురస్కరించుకొని యువత జాతి నిర్మాణంలో తమ వంతు బాధ్యతని తలకెత్తుకోవాలని, దేశ పురోగతికి కావల్సిన ఆలోచనలు చేయా లని పిలుపునిచ్చారు. దేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్లే సత్తా యువతకే ఉందన్నారు. దేశీయ ఉత్పత్తులకి ప్రాచుర్యం కల్పించాలి వచ్చే రెండు మూడేళ్లు దేశీయ ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 2022లో భారత్ 75ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను పూర్తి చేసుక్నుంతవరకు స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని అన్నారు. భారత్లో భారతీయుల చేతులతో, వారి స్వేదాన్ని చిందించి తయారు చేసిన ఉత్పత్తుల్ని ఒక రెండేళ్లు వాడేలా యువతే ముందుకు రావాలని అన్నారు. -
రానున్న దశాబ్ధంలో యువతే కీలకం..
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న దశాబ్ధంలో యువ భారతం కీలక పాత్ర పోషిస్తుదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేటి యువత వ్యవస్ధ పట్ల అవగాహనతో ఉన్నారని, పలు అంశాలపై స్ధిరమైన అభిప్రాయం కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బంధుప్రీతి, నియంతృత్వం, అస్ధిరతలను యువత ఇష్టపడటం లేదని మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్ధులు, యువత ఆందోళనలు చేపట్టిన క్రమంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వ్యవస్ధలో లోపాలను ప్రశ్నిస్తూ విద్యార్ధులు చైతన్యం ప్రదర్శించడం స్వాగతించదగిన పరిణామమని వ్యాఖ్యానించారు. దేశ పురోగతిలో యువత పలు మార్గాల్లో పాలుపంచుకోవచ్చని ప్రధాని సూచించారు. బిహార్లోని పశ్చిమ చంపరాన్ జిల్లాలో భైరవ్గంజ్ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్ధులు పరిసర గ్రామాల ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు అందిస్తున్నారని ప్రధాని కొనియాడారు. జమ్ము కశ్మీర్లో యువత ఆధ్వర్యంలో సాగుతున్న నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనా కార్యక్రమం గురించి సైతం ఆయన ప్రస్తావించారు. కాగా ఈ ఏడాదిలో ప్రధాని మోదీ చివరి మన్ కీ బాత్ కార్యక్రమం ఇదే కావడం గమనార్హం. -
రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాల్లోకి రావాలని ఎన్నడూ అనుకోలేదని ప్రధాని మోదీ వెల్లడించారు. కానీ, ప్రస్తుతం రాజకీయాల్లో ఒక భాగమై, దేశ ప్రజలకు సాధ్యమైనంత మేరకు సేవ చేసేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం సహనం, సంయమనం, పరిణతి చూపిన దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ప్రధాని ఆకాశవాణిలో మాసాంతపు ‘మన్ కీ బాత్’లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ (నేషనల్ కేడెట్ కార్ప్స్) కేడెట్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ‘రాజకీయాల్లోకి ప్రవేశించాలని కానీ, రాజకీయాల గురించి కానీ ఎన్నడూ ఆలోచించలేదు. కానీ, ఇప్పుడు రాజకీయ నేతగా మారా. దేశ సంక్షేమం కోసం శాయశక్తులా కృషి చేస్తున్నా. దేశ సేవకే పూర్తిగా అంకితమైపోయా’అని ప్రధాని తెలిపారు. ‘చదవడం నాకు చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదువుతా. అప్పుడప్పుడు సినిమాలు, చాలా తక్కువగా టీవీ చూస్తుంటా. కానీ, గూగుల్ ప్రభావం పుస్తక పఠనంపై పడింది. ఏ విషయం గురించి అయినా గూగుల్లో వెంటనే తెలుసుకోవచ్చు. అందుకే పుస్తకాలు చదవడం తగ్గిపోయింది’ అని అన్నారు. ‘పాఠశాల రోజుల్లో ఎన్సీసీ కేడెట్గా చాలా క్రమశిక్షణతో ఉండేవాడిని. అందుకే ఎన్నడూ శిక్షకు గురికాలేదు. ఓసారి చెట్టు కొమ్మపై గాలిపటం దారంలో ఇరుక్కున్న పావురాన్ని రక్షించేందుకు చెట్టెక్కా. పై అధికారి నన్ను శిక్షిస్తారని అక్కడున్న వారంతా అనుకున్నారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు’అని చిన్ననాటి ఘటనను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. అయోధ్య తీర్పు అనంతర పరిస్థితులపై ప్రధాని మాట్లాడుతూ.. ‘జాతి ప్రయోజనాలకే పెద్దపీట అని 130 కోట్ల మంది దేశ ప్రజలు మరోసారి నిరూపించారు. ఆ తీర్పును విశాల హృదయంతో ఆహ్వానించారు. సహనం, సంయమనం, పరిణతి చూపిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో ఐకమత్యం, శాంతి, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతుందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. విశాఖ స్కూబా డైవర్లకు ప్రధాని ప్రత్యేక ప్రశంసలు పర్యావరణం, సుముద్ర జీవుల పరిరక్షణకు విశాఖకు చెందిన ‘ప్లాటిపస్ ఎస్కేప్’అనే సంస్థకు చెందిన స్కూబా డైవర్లు చేస్తున్న కృషిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ వీరిని మన్ కీ బాత్లో ప్రశంసిం చారు. వీరు తీరానికి 100 మీటర్ల దూరంలో సుముద్ర గర్భం లోపలికి వెళ్లి అక్కడ పేరుకుపోయిన ప్లాస్టిక్ను తొలగిస్తున్నారని, రెండు వారాల్లో 4 వేల కేజీల ప్లాస్టిక్ను తొలగించినట్లు తనకు తెలిసిందని ప్రధాని వివరించారు. ఈ ప్రక్రియలో స్కూబా డైవర్లకు స్థానికులు సహకరిస్తున్నారని, వీరి చిరు ప్రయత్నం ఇప్పుడు ఉద్యమంగా మారుతోందన్నారు. -
'చారిత్రక తీర్పుతో న్యాయవ్యవస్థపై గౌరవం పెరిగింది'
న్యూఢిల్లీ : అయోధ్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించిన తర్వాత ప్రజలు చూపిన సహనం, నిగ్రహం, పరిపక్వతను పరిశీలిస్తే జాతి ప్రయోజనాల కంటే మాకు ఏది ముఖ్యం కాదని రుజువు చేసి చూపారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించిన మన కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. చారిత్రక తీర్పు తర్వాత దేశం కొత్తం మార్గం, కొత్త సంకల్పంతో ముందుకు సాగుతుందని తెలిపారు. కొత్త సంకల్పంతో అడుగులు వేస్తున్న దేశానికి శాంతి, ఐక్యత, సద్భావన వంటి అనుభూతులను పంచుతూ ముందుకు సాగాలనేది తన కోరిక అని మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా మన్కీబాత్లో అయోధ్య సమస్యపై 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. అప్పటి ప్రభుత్వం, సమాజం, ప్రజలు సహృద్భావం, శాంతి సామరస్యాన్ని ఎలా కొనసాగించారో ఆయన గుర్తు చేశారు. ఈసారి కూడా నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు 130 కోట్ల మంది భారతీయులు శాంతి, ఐక్యతను పెంపొందించుకొని మెలిగిన తీరు తనకు సంతోషం కలిగించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు అయోధ్య వివాదం పై సుదీర్ఘ న్యాయ పోరాటం ముగిసిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో దేశ ప్రజలకు మరోసారి న్యాయవ్యవస్థ పై అపారమైన గౌరవం పెరిగిందని ప్రధాని అభిప్రాయపడ్డారు. నిజమైన అర్థంతో తీర్పును వెల్లడించి సుప్రీకోర్టు న్యాయవ్యవస్థ చరిత్రలో మరో మైలురాయిని అధిగమించిందని మోదీ పేర్కొన్నారు. -
ప్రజలు పొగాకుకు దూరంగా ఉండాలి : మోదీ
న్యూఢిల్లీ : దేశ ప్రజలు పొగాకుకు దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం మన్ కీ బాత్లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఇ సిగరెట్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి ప్రస్తావించారు. అలాగే దేశ ప్రజలకు నవరాత్రి, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నవరాత్రి దేశ ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అలాగే తను అమెరికా పర్యటనకు వెళ్లే ముందు ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్తో మాట్లాడే అవకాశం లభించిందని మోదీ పేర్కొన్నారు. లతాజీ 90వ వసంతంలోకి అడుగుపెడుతున్నారని.. ఆమెను మనం దీదీ అని సంబోధించాల్సి ఉందన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సిగరెట్లు చాలా ప్రమాదకరమైనవి. ఆరోగ్యం మీద ఇవి చెడు ప్రభావాన్ని చూపుతాయి. పొగాకు వ్యసనం నుంచి బయటపడటం చాలా కష్టం. పొగాకు బారిన పడిన చాలా మంది క్యాన్సర్, బీపీ, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువత మానసిక ఎదుగుదల మీద ఇది చెడు ప్రభావన్ని చూపెడుతుంద’ని అన్నారు. అలాగే వాతావరణ కాలుష్యం గురించి మాట్లాడిన మోదీ.. మహాత్ముని 150 జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను ప్రజలంతా నిషేధించాలి. 130 కోట్ల మంది భారతీయులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకాన్ని నిషేధిస్తూ ప్రతిజ్ఞ తీసుకోవడం దేశానికే కాకుండా, ప్రపంచానికే గర్వకారణం. దేశ ప్రజలంతా ఇందుకు సహకరిస్తారనే నమ్మకం తనకుంద’ని ధీమా వ్యక్తం చేశారు. దీపావళి రోజున కూతుళ్లను గౌరవిద్దాం.. పండుగ సందర్భంగా కుటుంబాల్లో ఎంతో సందండి నెలకొంటుంది.. ఇలాంటి సందర్భంలో పండుగ జరుపుకోలేని వారికి సాయం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దీపావళి రోజున లక్ష్మి దేవి ప్రతి ఒక్కరి ఇళ్లలోకి ఆనందాన్ని, సంపదను తీసుకురావాలని ఆకాంక్షించారు. మన ఇళ్లలోని కూతుళ్ల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మన కూతుళ్లు సాధించిన ఘనత ప్రపంచానికి తెలిసేలా.. వారి విజయాలను సోషల్ మీడియాలో #BHARATKILAXMI హ్యాష్ ట్యాగ్తో పోస్ట్ చేయాలని కోరారు. గతంలో ‘సెల్ఫీ విత్ డాటర్’ ఏ విధంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందనే విషయాన్ని ప్రస్తావించారు. ఈ దీపావళి రోజున కూతుళ్లను గౌరవిద్దామని మోదీ పేర్కొన్నారు. -
మోదీకి లతా మంగేష్కర్ ధన్యవాదాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం దిగ్గజ గాయని లతా మంగేష్కర్కు 90వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం లతా మంగేష్కర్ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెను అభినందనల్లో ముంచెత్తగా ఒకరోజు ఆలస్యంగా ప్రధాని మోదీ నుంచి ఆమె శుభాకాంక్షలు అందుకున్నారు. తాను ఏడు రోజుల అమెరికా పర్యటనకు బయలుదేరేముందు ఆమెకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశానని ప్రధాని గుర్తు చేసుకున్నారు. లతా మంగేష్కర్కు ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఆరోగ్యకర జీవితం గడుపుతూ ఆహ్లాదంగా ఉండాలని, తమను దీవించాలని ఆకాంక్షించారు. గాయని లతాజీ మనందరి కంటే వయసులో పెద్దవారని, దేశంలో భిన్న దశలను వారు చూశారని, వారిని అందరూ దీదీగా గౌరవిస్తారని పేర్కొన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీకి లతా మంగేష్కర్ ధన్యవాదాలు తెలిపారు. మీ రాకతో దేశ ముఖచిత్రం మారిన విషయం తనకు తెలుసని, ఇది తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందని ఆమె బదులిచ్చారు. కాగా లతాజీ జన్మదినం సందర్భంగా బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచన్ నుంచి ధర్మేంద్ర, హేమమాలిని, శ్రేయా ఘోషల్ వంటి ఎందరో నటులు, సెలబ్రిటీలు ఆమెకు ట్విటర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. -
ప్లాస్టిక్పై పోరాడదాం
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ 150వ జయంతి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్లాస్టిక్పై పోరాటానికి సిద్ధం కావాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. వచ్చే అక్టోబర్ 2వ తేదీని ప్లాస్టిక్ రహిత దినంగా పాటించాలని ఆకాశవాణిలో ప్రసారమయిన మాసాంతపు మన్కీబాత్లో ఆయన కోరారు. వచ్చే దీపావళి పండుగ నాటికి ప్లాస్టిక్ వ్యర్థాలను లేకుండా చేయాలన్నారు. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి మొదలయ్యే వార్షిక ‘స్వచ్ఛతే సేవ’లో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా జరగనున్న ‘పోషణ్ అభియాన్’లో భాగస్వాములై చిన్నారులు, మహిళలకు పోషకాహారం అందించాలని కోరారు. డిస్కవరీ చానెల్లో ప్రసారమయిన ‘మ్యాన్ వెర్సస్ వైల్డ్’ ఎపిసోడ్లలో సాహసికుడు బేర్ గ్రిల్స్ హిందీని ఎలా అర్థం చేసుకోగలిగారని పలువురు అనుమానం వ్యక్తం చేయడంపై ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతే తమకు సాయపడిందన్నారు. నేను హిందీలో మాట్లాడిన మాటలను గ్రిల్స్ చెవిలో ఉండే పరికరం వెంటవెంటనే గ్రహించి అతడికి ఇంగ్లిష్లోకి అనువాదం చేసి వినిపిస్తుంది. ఇదంతా సాంకేతికత వల్ల సాధ్యమైన అద్భుతం..’ అని పేర్కొన్నారు.