అన్నాడీఎం‌కే పార్టీలో పోస్టర్ల‌ కలకలం | Poster Ripple In Ruling AIADMK Party | Sakshi
Sakshi News home page

అన్నాడీఎం‌కే పార్టీలో పోస్టర్ల‌ కలకలం

Published Sat, Aug 15 2020 6:40 PM | Last Updated on Sat, Aug 15 2020 8:45 PM

Poster Ripple In Ruling AIADMK Party - Sakshi

పన్నీరు సెల్వం 2021 ఎన్నికల అన్నాడీఎంకే పార్టీ సీఎం అభ్యర్థి అంటూ వెలిసిన పోస్టర్‌

చెన్నై : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రానున్న సార్వత్రిక ఎన్నికల అన్నాడీఎంకే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ వెలిసిన కొన్ని పోస్టర్లు అధికార పార్టీలో కలకలాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో కొంతమంది సీనియర్‌ మంత్రులు.. సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఇళ్ల వద్దకు క్యూలు కట్టారు. అనంతరం శనివారం సాయంత్రం పళనిస్వామి, పన్నీరు సెల్వాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటాయని స్పష్టం చేశారు. పోస్టర్ల విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాలు, పొత్తులు కార్యకర్తల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకునే జరుగుతాయన్నారు. ( తడబడి నిలబడిన.. ఈపీఎస్‌ – ఓపీఎస్‌! )

వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోకుండా కార్యకర్తలందరూ పని చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకునే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, తమిళనాడులో 2021 మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో డీఎమ్‌కే పార్టీ కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో వ్యూహాలు రచిస్తోంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను సైతం రంగంలోకి దింపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement