AIDMK
-
తమిళనాడులో బీజేపీ వ్యూహం
సాక్షి, చెన్నై : తమిళనాడులో బీజేపీ పార్టీ బలోపేతం దిశగా వడివడిగా అడుగులు వేస్తోందా? 400కుపైగా లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కషాయ దళానికి దక్షిణాది రాష్ట్రాల్లో గెలుపు కచ్చితంగా అవసరమని భావిస్తోందా? ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా తమిళనాట అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ అధినాయకత్వం సరికొత్త వ్యూహం రచిస్తుందా? అంటే అవుననే అంటున్నాయి తమిళ రాజకీయాలు ఎన్డీయే కూటమిలోకి పీఎంకే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో.. 400 ఫ్లస్ సీట్లను ఎన్డీయే టార్గెట్గా పెట్టుకుంది. ఇందుకోసం దక్షిణ రాష్ట్రాల్లో గెలుపు కచ్చితంగా అవసరమని భావిస్తోంది. ఈ క్రమంలోనే లక్ష్యం దిశగా..సీట్ల కేటాయింపుల విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తమిళనాడులో ఇప్పటికే దినకరన్, మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అయితే తాజాగా ఎన్డీయే కూటమిలో చేరిన పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) కు 10 సీట్లను కేటాయించి ఆసక్తికర చర్చకు దారి తీసింది. అన్నా డీఎంకే వద్దకు పీఎంకే దూత పీఎంకే నిర్ణయంతో తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే) లోక్సభ ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో ఒకరైన పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ పొత్తు, సీట్లపై చర్చలు బీజేపీతో కాకుండా ఏఐఏడీఎంకేతో జరిపాలని అనుకున్నారు. చర్చలు జరిపేందుకు ఏఐఏడీఎంకే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి వద్దకు ఓ దూతను పంపారు. బీజేపీతో పొత్తు అదే సమయంలో చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలోని తైలాపురంలో సమావేశమైన పీఎంకే అత్యున్నత స్థాయి కమిటీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అన్నాడీఎంకేని కాదని బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయాన్ని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ ప్రతిపాదించారు. ఆ పార్టీ ఏఐఏడీఎంకేతో తెగతెంపులు చేసుకుని బీజేపీతో పొత్తుతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల ఒప్పందంపై సంతకమే పొత్తుపై పీఎంకే ప్రధాన కార్యదర్శి వడివేల్ రావణన్ మాట్లాడుతూ.. ‘బీజేపీతో పొత్తు పెట్టుకుని లోక్సభ ఎన్నికలను ఎదుర్కొంటామని పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ అత్యున్నత స్థాయి కమిటీ సమావేశంలో ప్రకటించినట్లు తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కూటమిలో చేరాలనే నిర్ణయాన్ని రామదాస్, ఆయన కుమారుడు అన్బుమణి సంయుక్తంగా తీసుకున్నారని’ చెప్పారు. పీఎంకేలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని పార్టీ నేతలు వెల్లడించారు. అధికారిక ఎన్నికల ఒప్పందంపై సంతకం చేసేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై తైలాపురం వెళ్లనున్నారు. అన్నామలై ప్రయత్నాలు సఫలం బీజేపీ కూటమిలో చేరాలని పీఎంకే తీసుకున్న నిర్ణయం, అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకేలకు ధీటుగా బీజేపీ ఎదిగేందుకు.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం చేస్తున్నాయి. బీజేపీలోకి 15 మంది మాజీ ఎమ్మెల్యేలు గతంలో బీజేపీ ఎన్డీయే కూటమిలో అన్నాడీఎంకే భాగస్వామిగా ఉండేది. అన్నామలై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నాడీఎంకే నేతల అవినీతిపై ఆరోపణలు చేశారు. దాంతోపాటు దివంగత ముఖ్యమంత్రి జయలలితను విమర్శించడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 15మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని బీజేపీలో చేర్చుకుంది. ఒకే దెబ్బకు తాజాగా, లోక్సభ ఎన్నికల్లో వన్నియార్ సామాజిక వర్గంలో దాదాపు 6 శాతం ఓటు బ్యాంకు ఉన్న పీఎంకేతో జతకట్టింది. ఉత్తర తమిళనాడులో ఓటు షేర్ పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీకి పీఎంకేతో పొత్తు మరింత లబ్ధి చేకూర్చుతుంది. దక్షిణ తమిళనాడు అంతటా ఆధిపత్య Mukkulathorలను ఆకర్షించడంలో అన్నాడీఎంకే నాయకులు ఓ పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ల మద్దతు కూడగట్టుకుంది. లోక్సభ ఎన్నికలే కాదు తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా మోదీ వరుస పర్యటనలు చేయడంతో పాటు, భారీగా నిధులు కేటాయించేందుకు కేంద్రం సిద్ధమైంది. -
త్రిషకు మద్దతుగా కస్తూరి.. హీరోయిన్లు వేశ్యలా అంటూ వార్నింగ్
తమిళ నటి కస్తూరి 90వ దశకంలో చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించి ప్రస్తుతం సీరియల్స్తో బిజీగా ఉన్నారు. కస్తూరి సినిమాలే కాదు, పలు సామాజిక, రాజకీయ అంశాల మీద కూడా తన అభిప్రాయాన్ని డైరెక్ట్గా చెబుతుంది. అవతల ఉండే వ్యక్తి ఎవరు ఉన్నా సరే.. తరువాత ఏమైనా కానియ్..ఐ డోంట్ కేర్ అనుకునే రకం ఆమె.. ఆమెలో ఉన్న డేరింగ్ తత్వం అది. అన్నాడీఎంకే బహిష్కృత నేత మాజీ ఎమ్మెల్యే ఏవీ రాజు హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. హీరోయిన్ త్రిషకు. రూ.25 లక్షలు ఇచ్చి రిసార్ట్కి రప్పించామని, డ్యాన్సులు చేయించామని నోటికొచ్చిందల్లా వాగాడు.. దీంతో త్రిష కూడా అతనిపై కేసు కూడా పెట్టింది. ఈ అంశంపై హీరో విశాల్ మాజీ ఎమ్మెల్యే ఏవీ రాజుపై తీవ్రంగా విరుచుక పడిన విషయం తెలిసిందే. తాజాగా నటి కస్తూరి కూడా అతనిపై ఫైర్ అయింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగమ్మాయి హాలీవుడ్ సినిమా.. ఆ సాంగ్ స్పెషల్) ఈ మధ్య సినిమా హీరోయిన్లపై విపరీతమైన దూషణలు పెరిగాయి.ఏమాత్రం నిజానిజాలు చూసుకోకుండా నోటికొచ్చింది వాగేస్తున్నారు. నోరు, నాలుకలు ఉంటే సరిపోదు.. మనం ఏం మాట్లాడుతున్నామో అనే బుద్ది కూడా ఉండాలి. కొద్దిరోజుల క్రితం త్రిషపై మన్సూర్ అలీఖాన్ కూడా ఇలాంటి చెత్త వ్యాఖ్యలే చేశాడు.. మళ్లీ ఇప్పుడు అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే ఏవీ రాజు త్రిషపై నీచమైన కామెంట్లు చేశాడు. ఇలాంటివి సమాజానికి మంచిది కాదు. మీ రాజకీయ పార్టీలోని వ్యక్తులతో సమస్యలు ఉంటే అక్కడ చూసుకోకుండా ఇలా త్రిష పేరును తెరపైకి తీసుకొచ్చి చిల్లర వ్యాఖ్యలు చేయం ఏంటి..? మీలాంటి వారికి మేము ఎలా కనిపిస్తున్నాం..? సినిమా పరిశ్రమకు చెందిన వారందరూ మీ కంటికి వేశ్యల్లా కనిపిస్తున్నారా..? సినిమాలో పనిచేస్తున్న అమ్మాయిలకు అమ్మానాన్నలు ఉంటారనే ఆలోచన కూడా లేకుండా పోయిందా..? కనీసం వారి గురించి అయినా ఆలోచించరా..? ఇక నుంచి నోరు అదుపులో పెట్టుకుని ఆడపిల్లల గురించి కామెంట్లు చేయండి. ఒక అమ్మాయి గురించి ఇలాంటి కామెంట్లు చేసే అధికారం మీకు ఎవడు ఇచ్చాడు..? ఎవరో చెప్పారు చెప్పారంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా..? మీ వద్ద ఆదారాలు ఉంటే బయట పెట్టండి. రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. మీకు ఉన్న గౌరవం పోతుంది. ఇలాంటి వారి వల్ల సమాజం కోసం పనిచేసే రాజకీయ నాయకులకు కూడా చెడ్డపేరు వస్తుంది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను కూడా అధిగమించి తమ కుటుంబాల కోసం ఆడపిల్లలు పనిచేస్తున్నారు. ముఖ్యంగా సినిమాల్లోకి మహిళలు వచ్చేదే తక్కువ.. పరిశ్రమలో అడుగుపెట్టాలంటే చాలా ధైర్యం ఉండాలి. కానీ సినిమాల్లోకి వచ్చాక మీలాంటివారు ఇలాంటి ముద్రలు వేస్తుంటే ఎలా..? తమిళనాడులో అందరూ అమ్మగా పిలిచి అభిమానించే నాయకురాలు జయలలిత గారు. ఆమె కూడా నటిగా,మహిళగా, ముఖ్యమంత్రిగా వెలుగొందారనే విషయం మరిచిపోయారా..? ఆమె సారథ్యం వహించిన పార్టీలో ఇలాంటి వ్యక్తికి స్థానం ఇవ్వడం ఏంటి..? ఇప్పుడు జయలలిత ఉండుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారా..? ఇలాంటి ఘటనలు తలుచుకుంటే బాధ కలుగుతుంది.' అని కస్తూరి అన్నారు. -
సరైన పార్టీలోకే వచ్చా: అన్నాడీఎంకేలోకి గౌతమి
సాక్షి, చైన్నె: సినీ నటి గౌతమి బుధవారం అన్నాడీఎంకేలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళని స్వామి సమక్షంలో సాయంత్రం అన్నాడీఎంకే కండువా కప్పుకున్నారు. గతంలో గౌతమి బీజేపీలో పని చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ నుంచి తనకు తనకు మద్ధతు కరువైందని చెబుతూ ఆమె రాజీనామా చేశారు. ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం చైన్నెగ్రీన్ వేస్ రోడ్డులోని పళని స్వామి నివాసానికి వెళ్లారు. ఆయన సమక్షంలో అన్నాడీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా గౌతమి మీడియాతో మాట్లాడుతూ.. సరైన పార్టీలోకి తాను వచ్చానని పేర్కొన్నారు. దివంగత సీఎం అమ్మ జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేను సరైన మార్గంలో పళని స్వామి నడిపిస్తున్నారని ఆమె కితాబిచ్చారు. పాతికేళ్లుగా బీజేపీలో కొనసాగిన గౌతమి తాడిమళ్ల.. కిందటి ఏడాది అక్టోబర్లో బీజేపీకి గుడ్బై చెప్పారు. ఆ సమయంలో ఆమె సంచలన ఆరోపణలే చేశారు. పార్టీ నుంచి మద్దతు కరువైనందునే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారామె. ఈ మేరకు ఎక్స్ అకౌంట్లో ఆమె ఆ సమయంలో పెద్ద పోస్ట్ ఉంచారు. తన ఆస్తులను స్వాహా చేసిన వ్యక్తికి పార్టీలో సీనియర్లే మద్దతు ఇచ్చారంటూ ఆమె ఆరోపించారు కూడా. ఇదిలా ఉంటే.. గత వారం బీజేపీ నుంచి బయటకు వచ్చిన నటి గాయత్రి రఘురాం కూడా అన్నాడీఎంకేలో చేరిన విషయం తెలిసిందే. -
ఒక్క సీటుతో కింగ్మేకర్.. కూటమిలతో తగ్గిన విజయకాంత్ క్రేజ్
కోలీవుడ్ ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) అనారోగ్యంతో చికిత్స పొందుతూ... నేడు (డిసెంబర్ 28) తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. విజయకాంత్ మృతి పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. విజయకాంత్ జననం: విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగరస్వామి. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత తన పేరును విజయకాంత్గా మార్చుకున్నారు. విజయకాంత్కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. సినిమా ఎంట్రీ: విజయకాంత్ 27 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేశారు. 1979లో 'ఇనిక్కుం ఇలామై' చిత్రంతో విలన్గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు 150కి పైగా చిత్రాల్లో నటించారు. రోజుకు మూడు షిఫ్టులు పనిచేశారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ. ఆ తర్వాత ఆయన నుంచి ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 1984లో విజయకాంత్ నుంచి 18 సినిమాలు విడుదలయ్యాయి. 20కి పైగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్గా కనిపించాడు. విజయకాంత్ తమిళ చిత్రాల్లో మాత్రమే నటించారు. ఇతర భాషల్లో నటించలేదు. కానీ ఆయన సినిమాలు చాలా భాషల్లో డబ్బ్ అయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ లకు విజయకాంత్ ఒకప్పుడు గట్టి పోటీ ఇచ్చారు. విజయకాంత్ మెసేజ్ బేస్డ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. దేశభక్తి చిత్రాలైనా, గ్రామీణ నేపథ్య సినిమాలైనా, ద్విపాత్రాభినయాలైనా నటించేందుకు విజయకాంత్ ఎప్పుడూ ముందుండేవారు. వాటితో పాటు కమర్షియల్ సినిమాల్లోనూ సందడి చేసేవారు. అయితే ఆయన ఏ నిర్మాత వద్ద కూడా ముందుగా డబ్బు తీసుకోడని కోలీవుడ్ పరిశ్రమలో గుర్తింపు ఉంది. కోలీవుడ్ నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వారి నుంచి రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సినిమా అవకాశం ఇస్తారని సమాచారం. ఒక్క సీటుతో రాజకీయ ప్రయాణం 2005లో దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) అనే పార్టీని సినీ నటుడు విజయకాంత్ ఏర్పాటు చేశారు. తొలిసారిగా 2006 ఎన్నికల సమయంలో తన పార్టీ నుంచి తానొక్కడే గెలిచాడు.. కానీ ఆయన పార్టీ 10 శాతం ఓట్లు సాధించి తమిళ రాజకీయాలలో విజయకాంత్ను ప్రత్యామ్నాయ శక్తిగా మార్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికలలో జయలలిత (అన్నాడీఎంకే)తో చేతులు కలిపి 41 సీట్లలో 29 స్థానాలను గెలుచుకున్నారు. ఆ సమయంలో ఎం.కరుణానిధి (డీఎంకే) పార్టీని చిత్తు చేసిన విజయకాంత్ ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. ఆ తదుపరి అన్నాడీఎంకేతో వైరం వంటి పరిణామాలు విజయకాంత్ పార్టీకి గడ్డు పరిస్థితులను సృష్టించాయి. దీంతో జయలలిత, విజయకాంత్ పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. కూటమిల పేరుతో నష్టం 2014 లోక్సభ ఎన్నికలలో ఆయన ఎన్డీఏతో వెళ్లి ఓటమిని చవి చూశారు. కానీ ఓటు బ్యాంక్ శాతం పెంచుకోవడం ఆయనకు కలిసి వచ్చిన అంశంగా మారింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి అవతరించినా, ఫలితం శూన్యం. ఆ ఎన్నికల్లో అన్నిచోట్ల విజయకాంత్ కూటమి పార్టీ డిపాజిట్లను కోల్పోయింది. ఆ ఎన్నికల్లో విజయకాంత్ కూడా సుమారు 50 వేలకు పైగా ఓట్లతో ఓటమి చెందారు. ఆ తర్వాత వరుస ఓటములు ఎదురైనా ఏ మాత్రం డీలా పడకుండా కేడర్ మద్దతు, సినీ అభిమానుల అండతో ఒంటరిగానే పార్టీని నడిపిస్తూ వచ్చారు. కానీ కూటమిల పేరుతో ఆయన ఇతర పార్టీలకు అనుకూలంగా పనిచేయడం, ఇతర పార్టీలకు చెందిన అధినేతల సలహాలతో డీఎండీకేను ముందుకు నడపడం వంటి కారణాలతో ఆయన ఇమేజ్ క్రమేపి తగ్గుతూ వచ్చింది. ఇంతలో ఆయన తరుచుగా అనారోగ్యంతో ఇబ్బందులు పడటం కూడా పార్టీకి నష్టం వాటిల్లింది. చివరకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా, పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించ లేని పరిస్థితి నెలకొంది పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఆయన సతీమణి ప్రేమలతకు ఆయన అప్పచెప్పారు. తాజాగా ఆయన మరణం డీఎండీకే పార్టీకి తీరని లోటు అని చెప్పవచ్చు. 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికలలో ఆయన సతీమణి ప్రేమలత ఒంటరిగానే బరిలోకి దిగుతారా..? మరేదైనా పార్టీకి మద్ధతు ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. -
బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు.. కొత్త కూటమికి సిద్ధమవుతున్న అన్నా డీఎంకే!
సాక్షి, చైన్నె: బీజేపీతో ఇక పొత్తు ప్రసక్తే లేదని అన్నాడీఎంకే సీనియర్ నేత కేపీ మునుస్వామి స్పష్టం చేశారు. రాయబారాలకు ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. బీజేపీ కూటమికి అన్నాడీఎంకే బై..బై చెప్పేసిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా రాజకీయ నాటకంగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో బీజేపీ పెద్దలు అన్నాడీఎంకే వ్యవహారంలో మౌనంగా ఉండడమే కాకుండా పరిస్థితులను నిశితంగా వీక్షిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు అయితే ఢిల్లీ పయనానికి రెడీ అవుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఢిల్లీ పెద్దలతో చర్చించాల్సిన అంశాల గురించి స్థానిక నేతలతో నీలగిరులలో తిష్ట వేసి సమావేశాల్లో మునిగి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కృష్ణగిరిలో గురువారం కేపీ మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తప్పుడు ప్రచారాలు, ఆధార రహిత ఆరోపణలు, విమర్శల కారణంగానే ఆ పార్టీ కూటమినుంచి బయటకు వచ్చామని స్పష్టం చేశారు. తమ నేతలు జయలలిత, అన్నాదురై, పళణి స్వామిని విమర్శించే అర్హత అన్నామలైకు లేదన్నారు. దివంగత నేతలు అన్నా, జయలలిత జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన వాళ్లు అని, అయితే, వారినే టార్గెట్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రెండు కోట్ల మంది అన్నాడీఎంకే కేడర్ ముక్త కంఠంతో ఇచ్చిన ఆదేశాలను తమ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆలకించి, కూటమి విషయంలో అమలు చేశారన్నారు. అన్నామలైను బీజేపీ నుంచి తొలగించాలని తాము ఎవరి వద్ద ఫిర్యాదులు చేయలేదు, విజ్ఞప్తులు పెట్టలేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మళ్లీ కూటమిలోకి వెళ్తామన్నట్లు ప్రచారం జరుగుతోందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ నేతృత్వంలోనే కొత్త కూటమి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పార్టీలు ఏవిధంగా ప్రధాని అభ్యర్థిత్వం వ్యవహారం, కూటమి వ్యవహారంలో వ్యవహరిస్తున్నాయో అదే తరహాలో ఇక అన్నాడీఎంకే పయనం ఉంటుందన్నారు. లోక్సభ ఎన్నికలే కాదు, 2026 అసెంబ్లీ ఎన్నికలలోనూ బీజేపీతో పొత్తుకు ఆస్కారం లేదని , రాయబారాలకు, బెదిరింపులకు ఛాన్సే లేదని తేల్చి చెప్పారు. ఇక ఏ ఎన్నికలైనా సరే తమ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి నేతృత్వంలోనే కొత్త కూటమి ఏర్పాటు చేసి పోటీ చేస్తామన్నారు. గతంలో తమ అమ్మ, దివంగత నేత జయలలిత అనుసరించిన బాటలోనే బీజేపీ వ్యవహారంలో తమ నిర్ణయాలు ఉంటాయన్నారు. -
ఆ వైభవం తిరిగొస్తుందా?
గత అక్టోబర్లో యాభై ఏళ్ళు నిండినప్పుడు అందరూ ఆగిచూసిన దక్షిణాది ప్రాంతీయ పార్టీ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకె)కు మంచి రోజులు రానున్నాయా? అప్పట్లో ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకె)తో సరిపడక హీరో ఎమ్జీఆర్ బయటకొచ్చి స్థాపించిన ఈ పార్టీపై పట్టు కోసం కోర్టులో పోరు కొలిక్కి వచ్చినట్టేనా? పార్టీ నుంచి తనను బహిష్కరించడాన్నీ, తన ప్రత్యర్థి – మాజీ సీఎం ఈడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడాన్నీ సవాలు చేస్తూ మాజీ సమన్వయకర్త ఓ. పన్నీర్సెల్వం (ఓపీఎస్) వేసిన పిటిషన్లను మద్రాస్ హైకోర్ట్ మంగళవారం తోసిపుచ్చింది. కోర్టులో ఓపీఎస్కు ఎదురుదెబ్బ ఇది వరుసగా మూడోసారి. తీర్పుపై అప్పీలుకు అవకాశం ఉన్నా, ఆయన రాజకీయ పునరాగమనానికి దారులు మూసుకుపోతున్నట్టే అనిపిస్తోంది. కేడర్పై విస్తరించిన పట్టు, కీలక స్థానాల్లో నమ్మినబంట్ల నియామకం, సమర్థ పరిపాల కుడిగా సాధించిన పేరు, తాజా కోర్టు తీర్పుతో... పార్టీ పగ్గాలు ఈపీఎస్ చేతికి దాదాపు వచ్చినట్టే. ఇది పార్టీ పునర్వైభవానికి దోహదమవుతుందా అన్నదే ఇక మిగిలిన ప్రశ్న. అధినేత్రి జయలలిత మరణానంతరం క్రమంగా కష్టాల్లో పడ్డ అన్నాడీఎంకె గత రెండేళ్ళలో తేవర్లు, గౌండర్లు, వగైరా కులాల కుంపట్లతో ఒకటికి నాలుగు (ఈపీఎస్, ఓపీఎస్, పదవీచ్యుత ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె మేనల్లుడు – ఏఎంఎంకె అధినేత టీటీవీ దినకరన్) వర్గాలైంది. సాంప్రదాయికంగా అన్నాడీఎంకెకు పట్టున్న రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో నిరుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకె పాగా వేసింది. మహిళలు, వెనుకబడిన వర్గాలు, అగ్రవర్ణాల ఓటు బ్యాంక్ క్రమంగా చెదిరిపోతోంది. ఈపీఎస్, ఓపీఎస్ శిబిరాల మధ్య పోరుతో పార్టీ దశ, దిశ కోల్పోయి బలహీనపడ్డ సమయంలో కోర్ట్ తీర్పు అయాచిత వరమే. పేరుకు ప్రధాన ప్రతిపక్షమైనా వర్గ విభేదాలు, పార్టీకి సారథి ఎవరో తెలియని అయోమయం, ఎన్నికల చిహ్నం రెండాకులపై పోరాటం సాగుతున్న వేళ ఈ తీర్పు పార్టీ ప్రస్థానానికి దిశానిర్దేశమే. కోర్టు ఆదేశాలు ఈపీఎస్ వర్గానికి నైతికంగా పెద్ద అండ. నిజానికి, దివంగత జయలలితనే పార్టీ శాశ్వత అధినేత్రిగా ప్రకటించాలన్నది ఓపీఎస్ వర్గం దీర్ఘకాలిక డిమాండ్. ఇప్పుడీ తీర్పుతో వారి డిమాండ్కు గండిపడింది. ఈపీఎస్ మద్దతుదారులు తమ నేతను శాశ్వత ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొని, పార్టీని మళ్ళీ పట్టాలెక్కించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ ఫిబ్రవరిలో సుప్రీం కోర్ట్ సానుకూలంగా ఇచ్చిన తీర్పూ వారికి కలిసొచ్చే అంశం. ఇప్పటికే పార్టీ జనరల్ కౌన్సిల్లో, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెజారిటీ సభ్యుల మద్దతు ఈపీఎస్కే ఉంది గనక ఈపీఎస్ యథేచ్ఛగా ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవచ్చు. సదరు సమావేశాల్లో పార్టీలో ఓపీఎస్ లాంటి ప్రత్యర్థుల్ని ఇంటికి సాగనంపుతూ తీర్మానాలు చేసే వీలు చిక్కుతుంది. అవసరాన్ని బట్టి పార్టీ రాజ్యాంగాన్నీ సవరించుకోవచ్చు. ఇవన్నీ ఈపీఎస్కు కలిసొచ్చే అంశాలు. ఇల్లలకగానే పండగ కాదనట్టు ఈపీఎస్కు అనేక సవాళ్ళు ముందున్నాయి. దాదాపు 1.5 కోట్ల మంది కార్యకర్తలున్న పార్టీని ఒంటరి దళపతిగా ఆయన ముందుకు నడపాలి. పార్టీకి మునుపు సారథ్యం వహించిన ఎమ్జీఆర్, జయలలిత లాంటి దిగ్గజాలకున్న ఇమేజ్, ప్రాచుర్యం ఈపీఎస్కు లేవు. వారిలా జనాకర్షణ, మాటే శాసనంగా పార్టీని నడిపే పట్టు ఆయన నుంచి ఆశించలేం. సొంత గూటి సంగతి పక్కన పెడితే, ప్రత్యర్థి పార్టీ అయిన డీఎంకెతో ఢీ అంటే ఢీ అనాలంటే ముందుగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జనంలో పార్టీపై నమ్మకం పెంపొందించాలి. మరోపక్క 2019 లోక్సభ ఎన్నికల్లో, 2021 తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో విజయాలతో డీఎంకెను ముందుకు నడిపిన ఘనత స్టాలిన్ది. బలమైన ఈ ప్రత్యర్థితో తలపడడం ఈపీఎస్కు ఈజీ కాదు. తమిళ రాజకీయాలెప్పుడూ డీఎంకె, అన్నాడీఎంకెల మధ్య... కరుణానిధి, జయలలితల మధ్య ఊగడం రివాజు. ఆ రాజకీయ దృశ్యం ఇప్పుడు గణనీయంగా మారింది. చిరకాలంగా తమిళ రాజకీయాలకు దిక్సూచైన ద్రావిడ సిద్ధాంతం క్రమంగా కుంచించుకుపోతోంది. ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులను (గవర్నర్ రవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై) 2021లో బరిలోకి దింపి, డీఎంకె వ్యతిరేక, హిందూత్వ జాతీయవాద వైఖరితో బీజేపీ కాలు దువ్వుతోంది. అలాగే, జయ మరణానంతరం అన్నాడీఎంకెకు పెద్దన్నగా వ్యవహరించిన బీజేపీ... ఆ పార్టీ బలహీనతల్ని వాటంగా చేసుకొని, జయ వదిలివెళ్ళిన స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా తాను కూర్చోవాలని శతధా ప్రయత్నిస్తోంది. పక్కనే పొంచివున్న ఈ ముప్పు పట్ల ఈపీఎస్ జాగరూకత వహించి, సమర్థంగా ఎదుర్కోవాలి. ఒక్కమాటలో– 39 పార్లమెంటరీ స్థానాలున్న తమిళనాట రానున్న 2024 లోక్సభ ఎన్నికలు ఈపీఎస్కు తొలి పెద్ద పరీక్ష. దానిలో పార్టీని బలంగా నిలబెట్టి, తర్వాత మరో రెండేళ్ళకు వచ్చే 234 స్థానాల శాసనసభా సమరంలో అధికారం చేజిక్కించుకునేలా పోరాడాలి. నిరుటి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకె కూటమి 159 స్థానాలు సాధిస్తే, 75 సీట్లకే పరిమితమైన అన్నాడీఎంకె కూటమి ఆ లెక్కను తిరగరాయాలి. అదే జరిగితే అధినేతగా ఈపీఎస్కు తిరుగుండదు. లేదంటే, అన్నాడీఎంకెలో మరోసారి అసమ్మతి స్వరాలు పైకొస్తాయి. రిటైరయ్యానని ప్రకటించిన జయలలిత నెచ్చెలి శశికళను మళ్ళీ తెర పైకి తేవాలనే మాటలు వినిపిస్తాయి. అందుకే, రాగల మూడేళ్ళ కాలం ఈపీఎస్కు పరీక్షా సమయం. మంచి మార్కులు తెచ్చుకుంటేనే ఆయనకైనా, అన్నాడీఎంకెకైనా భవిష్యత్తు! -
అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా: అన్నాలై
అన్నాడీఎంకేతో ఇక కటీఫ్, ఆ పార్టీతో కూటమి పెట్టుకుంటే పార్టీ పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ప్రధానంగా ఆయన అన్నాడీఎంకేను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. అయితే, కూటమి ఎవరెవరితో అని నిర్ణయించేది బీజేపీ కాదని, తాము మాత్రమే అని అన్నాడీఎంకే సీనియర్ నేతలు అన్నామలైపై ఎదురు దాడికి దిగారు. సాక్షి, చైన్నె: గత కొద్ది రోజులుగా పళణిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే శిబిరం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. బీజేపీతో పొత్తు అవసరమా..? అనే అంశాన్ని అన్నాడీఎంకే ఇప్పటికే తీవ్రంగా చర్చిస్తోంది. అయితే, జాతీయ స్థాయి పార్టీ కావడంతో ఆచీ తూచీగా స్పందిస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో చైన్నెలో జరిగిన పార్టీ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకే వర్గాలకు అనుకూలంగా మారాయనే ప్రచారం సాగుతోంది. వైరల్ అవుతున్న కటీఫ్ వ్యాఖ్యలు చైన్నెలో శనివారం జరిగిన పార్టీ కార్యాక్రమంలో అన్నామలై అన్నాడీఎంకేపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సామాజిక మాధ్యమాలు, కొన్ని చానళ్లలో జోరుగా ప్రచారం సాగింది. అందులోని అంశాల మేరకు వివరాలు... రానున్న లోక్ పసభ ఎన్నికలకు బూత్ కమిటీల ఏర్పాటు, పార్టీకి విరాళాల సేకరణ గురించి నేతలకు ఈ సమావేశంలో అన్నామలై నాయకులకు హితబోధ చేశారు. పార్టీ బలోపేతం దిశగా సాగుదామని పిలుపు నిచ్చారు. ఎన్నికల సమయంలో ఎవ్వరెవ్వరికో శాలువలు కప్పి కూటమిలోకి ఆహ్వానించాల్సిన అవసరం లేదన్నారు. ద్రవిడ పార్టీలతో కలిసి ఎన్నికలను ఎదుర్కొనడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. పొత్తు ఎవరితో అనే నిర్ణయం మనమే తీసుకుందామని, ఒంటరిగా వెళ్లినప్పుడే బీజేపీ బలం ఏమిటో ద్రవిడ పార్టీలకు తెలియజేయగలమని అభిప్రాయపడ్డారు. అన్నాడీఎంకేలో పొత్తు పెట్టుకుంటే, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, సాధారణ కార్యకర్తగా బీజేపీలో కొనసాగుతానని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీనికి కలిసి అన్ని వివరాలను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజులు బిజీ బీజీగా ఉంటానని, ఈ సమయంలో పార్టీ కేడర్ ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు. అయితే, కూటమి విషయంపై అన్నామలై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆ పార్టీ శాసన సభా పక్ష నేత నయనార్ నాగేంద్రన్ స్పందిస్తూ, కూటమి విషయాన్ని నిర్ణయించాల్సింది పార్టీ రాష్ట్ర విభాగం కాదని, బీజేపీ అధిష్టానం అనే విషయాన్ని అన్నామలై గుర్తంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీలోని కొందరు నేతలు అన్నామలై వ్యాఖ్యలను వక్రీకరించినట్లు పేర్కొన్నారు. తమ పార్టీ సమావేశంలో జరిగిన చర్చ, అభిప్రాయాలు, వ్యాఖ్యలను బయటకు వెళ్లగక్కి ఎవరో రాజకీయం చేస్తున్నట్లుందని విమర్శించారు. దీటుగా స్పందించిన పళణివర్గం.. న్నామలై వ్యాఖ్యలకు అన్నాడీఎంకే వర్గాలు దీటుగా స్పందించాయి. అన్నాడీఎంకే సీనియర్లు జయకుమార్, ఓఎస్ మణియన్ పేర్కొంటూ. రాష్ట్రంలో పొత్తు గురించి నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీ కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో ఇతర పార్టీలు ఉంటాయనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని చురకలు అంటించారు. ఎవరికి వంగి..వంగి దండాలు పెట్టాల్సిన అవసరం అన్నాడీఎంకేకు లేదని, అలా పెట్టే ప్రసక్తి కూడా లేదని తేల్చిచెప్పారు. -
సీఎం జగన్ బాటలో స్టాలిన్.. తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టున్నారు. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలనకు దోహదపడే గ్రామ సచివాలయాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 600 గ్రామ సచివాలయాలను నిర్మిస్తామని తెలిపారు. అలాగే ఉత్తమ పట్టణ పంచాయతీలకు ‘ఉత్తమర్ గాంధీ’అవార్డులను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పంచాయతీల ప్రగతి, పట్టణ పంచాయతీలకు సంబంధించిన పలు విషయాలపై సీఎం స్టాలిన్ మాట్లాడారు. ‘‘ఈనెల 24వ తేదీ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరగనుంది. ప్రజాస్వామ్య దేశంలో పట్టణ పంచాయతీ పాలనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి బలంగా ఉంటేనే ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేయగలం. డీఎంకే అధికారంలోకి వచ్చినపుడల్లా పంచాయతీలు, పట్టణ పంచాయతీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏడాదికి ఒకరోజు స్థానిక సంస్థల దినంగా జరుపుకోవాలని నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సూచించాను. ఆ మేరకు 2007 నుంచి 2010 వరకు నవంబరు 1వ తేదీ జరుపుకున్నాం. అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది. గ్రామీణుల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా, ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాలనలో పారదర్శకత తీసుకొచ్చేలా ఇకపై ఏటా నవంబర్ 1వ తేదీ స్థానిక సంస్థల దినోత్సవం నిర్వహిస్తాం. గ్రామ పరిపాలనను బలోపేతం చేసేలా గ్రామ సచివాలయాలకు ఇప్పటికే అనేక అధికారాలు, బాధ్యతలు ఇచ్చాం. 1998లో కరుణానిధి సీఎంగా ఉన్న సమయంలో ఏడాదికి నాలుగుసార్లు గ్రామసభలు నిర్వహించాలని చట్టం తీసుకొచ్చాం. ఇక ఈ ఏడాది నుంచి ఏటా ఆరు గ్రామసభలు నిర్వహిస్తాం. సుపరిపాలన అందించే పట్టణ పంచాయతీలకు ‘‘ ఉత్తమర్ గాంధీ అవార్డు’’ను ప్రదానం చేస్తాం. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ ఏడాది 600 గ్రామ సచివాలయ భవనాలను నిర్మిస్తామ’’ని వివరించారు. చదవండి👉🏾 సోనియా చేతికి నివేదిక అన్నాడీఎంకే వాకౌట్ రాష్ట్రంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అంతకు ముందు ప్రధాన ప్రతిపక్ష నేత ఎడపాడి పళనిస్వామి అసెంబ్లీలో మాట్లాడుతూ.. రోజుకు 17,100 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా 13,100 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోందని అన్నారు. వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు అందుబాటులో లేనందున సరఫరాలో అంతరాయం పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. రైతులు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు నష్టపోతున్నట్లు తెలిపారు. ఈ విమర్శలకు విద్యుత్శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ బదులిస్తూ, రాష్ట్రపరిధిలో విద్యుత్ ఉత్పత్తి పెరిగినా సెంట్రల్ గ్రిడ్ నుంచి రావాల్సిన 796 మెగావాట్లు రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. తక్కువ ధరతో 3వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయితే, మంత్రి సమాధానం సంతృప్తికరంగా లేదని ఆరోపిస్తూ ఎడపాడి నేతృత్వంలో అన్నాడీఎంకే సభ్యులంతా వాకౌట్ చేశారు. అసెంబ్లీలో అవీ ఇవీ.. ►పాలిటెక్నిక్ కాలేజీల్లో ఎవరూ చేరడం లేదని.. ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు పెంచేందుకే నాన్ ముదల్వన్ పథకాన్ని తీసుకొచ్చామని ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి చెప్పారు. ►సీఎం స్టాలిన్ను మరో కామరాజర్గా భావిస్తున్నానని ప్రతిపక్ష పీఎంకే ఎమ్మెల్యే సదాశివం కీర్తించడం విశేషం. -
అన్నాడీఎంకేకు ఘోర అవమానం.. జోష్లో బీజేపీ!
తమిళనాడు అర్బన్ ఎన్నికల్లో అధికార డీఎంకే అఖండ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మేజర్ స్థానాల్ని కైవసం చేసుకుని.. ఎన్నికల ట్రెండ్స్లో స్పష్టమైన ఆధిప్యతంతో ముందంజలో కొనసాగుతోంది. అదే సమయంలో మునుపెన్నడూ లేని చెన్నై వేదికగా సరికొత్త రాజకీయం అగుపించింది. చాలా చోట్ల అన్నాడీఎంకేను వెనక్కి రాజేసి.. బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా చెన్నైలోని కొన్ని వార్డుల్లో.. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కగజమ్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. అదీ బీజేపీ కంటే చాలా ఓట్ల తేడాతో వెనుకబడడం విశేషం. తాజా ట్రెండ్ ప్రకారం.. చెన్నైలో కనీసం ఐదు వార్డులనైనా బీజేపీ సొంతం చేసుకోవచ్చని తెలుస్తోంది(ఇప్పటికే ఒక స్థానం గెల్చుకుంది). #LocalBodyElections2022 - #Chennai Result updates! pic.twitter.com/dUqWp4h0G9 — Greater Chennai Corporation (@chennaicorp) February 22, 2022 ఇక ఈ ఫలితాలు బీజేపీలో జోష్ నింపుతున్నాయి. స్థానిక సంస్థ ఎన్నికల ఫలితాలే అయినా.. తమిళనాట పాగా వేయాలన్న ప్రయత్నాలకు కాస్తైనా మార్గం సుగమం అయ్యిందని బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై స్పందిస్తూ.. 2026 అసెంబ్లీ ఎన్నికలకు శుభసంకేతంగా ఫలితాల్ని వర్ణించాడు. ప్రతిపక్ష హోదాలో అన్నాడీఎంకే కంటే తామే బాధ్యతగా వ్యవహరించడమే బహుశా ఈ ఫలితాలకు కారణమై ఉండొచ్చని విశ్లేషిస్తున్నాడు అన్నామలై. తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పార్టీల మధ్య పొత్తు ఉంది. అయితే ఎక్కువ సీట్ల కోసం అర్బన్ ఎన్నికలకు మాత్రం విడివిడిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల సంగతి ఎలా ఉన్నా.. బీజేపీ అన్నాడీఎంకేల మధ్య పొత్తు రాబోయే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు, వీలైతే ఆపై అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని స్పష్టం చేశాడు అన్నామలై. -
అన్నాడీఎంకేలో మళ్లీ కోల్డ్ వార్.. ‘పళని’ ఎత్తు.. ‘పన్నీరు’ పైఎత్తు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో– కన్వీనర్ పళని స్వామి మధ్య మళ్లీ అంతర్గత పోరు తెర మీదకు వచ్చింది. అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిన్నమ్మ శశికళ దూకుడు, పార్టీని కాపాడుకునేందుకు పన్నీరు, పళని సారథ్యంలోని సమన్వయ కమిటీ సాగిస్తున్న కుస్తీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, హఠాత్తుగా సోమవారం సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం చిన్నమ్మ శశికళ నామస్మరణను అందుకోవడం చర్చకు దారి తీసింది. చిన్నమ్మను ఆది నుంచి పళని స్వామితో పాటుగా సీనియర్లు వ్యతిరేకిస్తున్న తరుణంలో, అందరితో చర్చించి చిన్నమ్మ విషయంలో నిర్ణయం తీసుకుంటామని పన్నీరు సెల్వం వ్యాఖ్యానించడంలో ఆంతర్యాన్ని పసిగట్టే పనిలో రాజకీయ విశేష్లకులు నిమగ్నమయ్యారు. ( చదవండి: అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ పయనం.. దినకరన్ మద్దతు ) టార్గెట్.. ప్రధాన కార్యదర్శి పదవి తానే ప్రధాన కార్యదర్శి అని శశికళ స్పష్టం చేస్తూ వస్తున్న తరుణంలో ఆ పదవి విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు పళని రచించిన వ్యూహం మంగళవారం రాజకీయ వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్లో అన్నాడీఎంకే కార్యవర్గం, సర్వసభ్య సమావేశం నిర్వహించి, రద్దు చేసిన ఆ పదవిని మళ్లీ పునరుద్ధరించి, చేజిక్కించుకునేందుకు పళని వ్యూహాలకు పదును పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. జంట నాయకత్వాన్ని పక్కన పెట్టి, ఏకాధిప్యతం లక్ష్యంగా సీనియర్లతో పళని రహస్య మంతనాలు చేస్తున్న విషయం పన్నీరు దృష్టికి రావడంతోనే హఠాత్తుగా చిన్నమ్మను జపాన్ని ఆయన తెర మీదకు తెచ్చినట్టు సమాచారం. ప్రధాన కార్యదర్శి పదవి తన గుప్పెట్లోకి వచ్చిన తరువాత.. చిన్నమ్మ దూకుడుకు కళ్లెం వేయవచ్చన్న ధీమాతో పళని ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఎత్తుకు పైఎత్తు అన్నట్టుగా చిన్నమ్మ నినాదాన్ని పన్నీరు అందుకున్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. చిన్నమ్మ పర్యటన ఓవైపు అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాట మళ్లీ తెర రాగా, మరోవైపు కేడర్లోకి చొచ్చుకు వెళ్లేందుకు చిన్నమ్మ దృష్టి పెట్టారు. మంగళవారం చెన్నై నుంచి ఆమె తంజావూరుకు బయలుదేరి వెళ్లారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలే కాకుండా, మద్దతుదారులు ఆమెకు బ్రహ్మరథం పట్టడం గమనార్హం. మూడు రోజుల పాటుగా ఆమె తంజావూరు, మదురై, రామనాథపురంలో పర్యటించనున్నారు. చదవండి: Vijayakanth: నా ఆరోగ్యం క్షీణించిన విషయం నిజమే.. అంత మాత్రాన.. -
తమిళనాడు: అమ్మపార్టీలో.. అంతర్గత పోరు
అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు సోమవారం మరోసారి తెరపైకివచ్చింది. ఖాళీ అయిన ప్రిసీడియం చైర్మన్ పదవిని తమఖాతాలో వేసుకునేందుకు పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్సెల్వం, ఉపకన్వీనర్ ఎడపాడి పళనిస్వామి పోటీపడడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాక్షి, చెన్నై: గడిచిన అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారాన్ని చేజార్చుకున్న తరువాత ప్రధాన నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ప్రధాన ప్రతిపక్ష నేత పదవికై ఎడపాడి, పన్నీర్సెల్వం తీవ్రస్థాయిలో పోటీపడ్డారు. అయితే కొంగుమండలం నుంచి అత్యధికంగా ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారనే కారణంతో ఎడపాడినే ఆ పదవి వరించింది. అప్పటి నుంచి అధికారికంగా స్పందించకపోయినా ఎవరికి వారు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. దీంతో పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పార్టీలో సమన్వయం కొరవడిందనే విమర్శలకు ఊతమిచ్చేలా, అన్నాడీఎంకే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ పీఎంకే ఒంటరిగానే పోటీచేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు శశికళ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే 50 వసంతాల వేడుకలు ఈనెల 17వ తేదీన జరగనున్నాయి. కాగా 16వ తేదీన శశికళ చెన్నై మెరీనాబీచ్లోని జయలలిత సమాధి వద్దకు వెళ్లి రాష్ట్రవ్యాప్త పర్యటనకు సమాయుత్తం అవుతారనే అంశం సమాచారం ప్రచారంలో ఉంది. చదవండి: బలవంతంగా విషం తాగించి హత్య.. కోర్టులో డీఎంకే ఎంపీ లొంగుబాటు ‘ప్రిసీడియం’ కోసం పట్టు పార్టీలో ప్రిసీడియం చైర్మన్ అత్యంత కీలకపదవి. ఈ పదవిలో ఉండిన మధుసూదనన్ ఇటీవల మరణించారు. దీంతో ఈ పదవి తమ వర్గానికి దక్కించుకోవడం కోసం ఎడపాడి, పన్నీర్సెల్వం పోటాపోటీగా మళ్లీ పావులు కదుపుతున్నారు. ఆరంభంలో పన్నీర్సెల్వం అనుచరుడిగా వ్యవహరించిన మధుసూదనన్ ఆ తరువాత ఎడపాడి పంచన చేరారు. అంతేగాక పార్టీలో మెజార్టీ నేతలు ఎడపాడి వెనుకే ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని ప్రిసీడియం చైర్మన్ పదవిని తన అనుచరులకు కట్టబెట్టాలని ఎడపాడి పట్టుదలతో ఉన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు ఈ ఏడాది డిసెంబరు ఆఖరులోగా ముగించాల్సి ఉన్నందున ప్రిసీడియం చైర్మన్ పదవి భర్తీని ఆ తరువాత చూసుకోవచ్చని పన్నీర్సెల్వం దాటవేస్తున్నారు. పార్టీలో ఇలాంటి గరంగరం వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో నిర్వాహక కార్యవర్గం సోమవారం ఉదయం 10 గంటలకు చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమైంది. పన్నీర్సెల్వం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎడపాడి, పార్టీ ప్రధాన కార్యాలయ నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులు హాజరయ్యారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకు సాగితేనే రాబోయే ఎన్నికల్లో సవాళ్లను ఎదుర్కొనగలమని అగ్రనేతలు తమ ప్రసంగాల్లో సూచించారు. సావనీర్ విడుదలపై.. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఏటా ప్రిసీడియం చైర్మన్ చేతుల మీదుగా సావనీర్ను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మధుసూదనన్ మరణం వల్ల ఈ ఏడాది సావనీర్ను ఎవరు విడుదల చేస్తారనే అంశం చర్చకు వచ్చింది. ప్రిసీడియం పదవికై ఎడపాడి, పన్నీర్సెల్వం వర్గాలు పోటీపడడంతో సంస్థాగత ఎన్నికల తరువాత నిర్ణయం తీసుకోవచ్చని సమావేశంలో వాయిదా వేశారు. ఇక పార్టీని శశికళ తన చెప్పుచేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలను సంఘటితంగా ఎదుర్కొనాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. -
పులమైపిత్తన్ కన్నుమూత.. ఎంజీఆర్తో 22 ఏళ్ల పరిచయం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రిసీడీయం మాజీ చైర్మన్, సినీ పాటల రచయిత, కవి పులమైపిత్తన్(86) అనారోగ్యంతో బుధవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సీఎం ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే నేతలు పన్నీరు సెల్వం, పళనిస్వామి నివాళులరి్పంచారు. తమిళ సినీ రంగంలో దివంగత సీఎం ఎంజీఆర్ నటించిన అనేక హిట్ చిత్రాలకు గేయ రచయితగా పనిచేసి పులమైపిత్తన్ తెర మీదకు వచ్చారు. అన్నాడీఎంకే ఆవిర్భావంతో ఎంజీఆర్ వెన్నంటి నడిచారు. వీరిద్దరి మధ్య 22 ఏళ్ల పరిచయం ఉంది. చదవండి: మరణంలోనూ వీడని స్నేహబంధం.. అందరూ యువకులే ఆ పార్టీ ప్రిసీడీయం చైర్మన్గా, గేయ రచయితగా గుర్తింపు పొందారు. దివంగత డీఎంకే అధినేత కరుణానిధి మెప్పును సైతం పొందారు. ఎమ్మెల్సీగా ప్రజా సేవలో ఉంటూనే, శివాజీ గణేషన్, కమల్, రజనీకాంత్ వంటి నటుల చిత్రాలకు అనేక సూపర్ హిట్ పాటల్ని అందించారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి నాలుగుసార్లు ఉత్తమ గేయ రచయిత అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈనెల 1న ఆయన్ని అడయార్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి బుధవారం ఉదయం 9.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారంతో అన్నాడీఎంకేలో విషాదం అలముకుంది. దర్శకుడు భారతీరాజా సహా ఇతర సినీప్రముఖులు పిత్తన్ భౌతికకాయానికి నివాళులరి్పంచారు. కాగా నీలాంకరైలోని ఆయ న నివాసంలో ఆప్తులు, పార్టీ వర్గాల సందర్శనార్థం భౌతిక కాయన్ని ఉంచారు. గురువారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు జరిపించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. పీఎంకే అధినేత రాందాసు, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, ఎండీఎంకే నేత వైగో, సంగీత దర్శకుడు ఇళయారాజా, నటుడు, మక్కల్ నీదిమయ్యం నేత కమల్హాసన్ తదితరులు సంతాపం తెలిపారు. చదవండి: శశికళకు మరో భారీ షాక్: రూ.వంద కోట్ల ఆస్తులు సీజ్ -
Tamil Nadu: అన్నాడీఎంకేలో విషాదం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్(81) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారం అన్నాడీఎంకే వర్గాల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మూడు రోజులపాటు సంతాపదినాలు పాటించేందుకు సమన్వయ కమిటీ నిర్ణయించింది. జీవించి ఉన్నంత కాలం, ఆయనే పారీ్టకి శాశ్వత ప్రిసీడియం చైర్మన్ అని జయలలిత వద్ద ముద్రపడ్డ నాయకుడు మధుసూదనన్. దివంగత ఎంజీఆర్కు వీరాభిమానిగా, ఉత్తర చెన్నై అన్నాడీఎంకేలో కీలక నేతగా, మాజీ మంత్రిగా, పార్టీ ప్రిసీడియం చైర్మన్గా అన్నాడీఎంకేలో కీలక పదవుల్లో ఉన్న మధుసూదనన్ మూడు నెలలుగా అనారోగ్య సమస్యలు, వయోభారంతో నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారంతో అన్నాడీఎంకే వర్గాల్లో విషాదం నెలకొంది. ఆయన మరణం పారీ్టకి తీరని లోటుగా అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో కనీ్వనర్ పళనిస్వామి ప్రకటించారు. మూడు రోజులు సంతాప దినం పాటించేందుకు నిర్ణయించారు. తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణా టక, కేరళ రాష్ట్రాల్లో పార్టీ, అనుబంధ విభాగాల తరఫున అన్ని కార్యక్రమాలు రద్దు చేశారు. విశ్వాసపాత్రుడు.... ఎంజీఆర్ అంటే మధుసూదనన్కు వీరాభిమానం. తన 14వ ఏట ఉత్తర చెన్నై వేదికగా ఎంజీఆర్కు అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసి తెరపైకి వచ్చారు. 1972లో అన్నాడీఎంకే ఆవిర్భావంతో ఉత్తర చెన్నై అన్నాడీఎంకేలో కీలక నేతగా అవతరించారు. ఎంజీఆర్ మరణం తర్వాత జయలలిత వెన్నంటి నడిచిన ఆయన 1991లో ఆర్కేనగర్ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ కాలంలో చేనేత శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2007లో ఆయన్ను అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్గా జయలలిత నియమించారు. జీవించి ఉన్నంత కాలం ఆయనే పారీ్టకి ప్రిసీడియం చైర్మన్ అని స్వయంగా జయలలిత అప్పట్లో ప్రకటించారు. పార్టీ వ్యవహరాలను చివర్లో ఆయనతో చర్చించినానంతరం ప్రకటన రూపంలో జయలలిత విడుదల చేసేవారు. జయలలిత మృతి తర్వాత పరిణామాలతో మాజీ సీఎం పన్నీరుసెల్వం వెన్నంటి నడిచారు. తర్వాత పన్నీరు, పళనిల ఏకంతో అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్గానే వ్యవహరిస్తూ వచ్చారు. ఈ వివాదాల నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ, చిహ్నాన్ని ఎన్నికల కమిషన్ మధుసూదనన్ చేతిలో అప్పగించడం గమనార్హం. ఆయన ప్రిసీడియం చైర్మన్ అన్న పదవితోనే చివరి శ్వాసను విడిచారు. ఆయన పారి్థవదేహాన్ని తండయారుపేటలోని ఆయన నివాసంలో ఆప్తులు, పార్టీ వర్గాల సందర్శన నిమిత్తం ఉంచారు. శుక్రవా రం సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. -
మాజీ మంత్రిపై రూ.1,500 కోట్ల కమీషన్ పొందినట్లు ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, చెన్నై: వివిధ పథకాల కింద అమలు చేయాల్సిన పనుల్లో మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి రూ.1,500 కోట్ల అవినీతికి పాల్పడినట్లు కోయంబత్తూరు ఆర్థికనేర విభాగం పోలీసులకు మంగళవారం ఫిర్యాదు అందింది. కోయంబత్తూరు రేస్కోర్స్ ప్రాంతానికి చెందిన డీఎంకే సభ్యుడు, సినీ నిర్మాత ‘రేస్కోర్స్’ రఘునాథ్ కోవై ఆర్థికనేరాల విభాగం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాలు ఇలా ఉన్నాయి. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో కోవై కార్పొరేషన్, కోవైలోని మున్సిపాలిటీల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి, కొందరు శాసనసభ్యులు ప్రజాధనాన్ని స్వాహా చేశారు. కోయంబత్తూరు కార్పొరేషన్లో రూ.1,500 కోట్ల అవినాశీ–అత్తికడవు పథకానికి తొలివిడతగా రూ.225 కోట్లు మంజూరై పనులు ప్రారంభమయ్యాయి. బిల్లూరు 3వ అభివృద్ధి పథకం కింద సొరంగ మార్గం నిర్మాణానికి రూ.116 కోట్ల కేటాయింపు జరిగి పనులు జరుగుతున్నాయి. నొయ్యాల్ చెరువు స్వాధీనం కోసం రూ.230 కోట్లు, కోవై నగరానికి 24 గంటల తాగునీటి సరఫరాకు రూ.550 కోట్లు, కునియముత్తూరు భూగర్భ డ్రైనేజీ పనులకు రూ.19.5 కోట్లు, ఆత్తుపాలం–ఉక్కడం ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు రూ.215.51 కోటి, కోవై రేస్కోర్సు స్మార్ట్ సిటీ పథకానికి తొలివిడతగా రూ.40 కోట్లు కేటాయింపు జరిగింది. ఇలా జరిగే అన్నిపనుల్లోనూ మంత్రి తనవాటాగా 12 శాతం కమీషన్ పొందడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇలా వివిధ పథకాల ముసుగులో రూ.1,500 కోట్ల వరకు అవినీతికి పాల్పడిన మాజీ మంత్రి వేలుమణిపై అవినీతి నిరోధకశాఖ ద్వారా చట్టపరమైన చర్య తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
Tamil Nadu: ‘ఆ ముగ్గురి గెలుపులో గోల్మాల్’
సాక్షి ప్రతినిధి, చెన్నై: గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి దురైమురుగన్, మాజీ మంత్రి సి.విజయభాస్కర్, జయకుమార్ గోల్మాల్కు పాల్పడి గెలుపొందారని.. వారిని అనర్హులుగా ప్రకటించేలా ఈసీని ఆదేశించాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై నాలుగు వారాల్లోగా బదులివ్వాలని ఎన్నికల కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. వేలూరు జిల్లా కాట్పాడి నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రస్తుత నీటిపారుదలశాఖ మంత్రి దురైమురుగన్ గెలుపును అన్నాడీఎంకే అభ్యర్థి వి. రాము సవాల్ చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన అర్హమైన ఓట్లను చెల్లని ఓట్లుగా ప్రకటించారని, ఎన్నికల నిబంధనలను సక్రమంగా పాటించలేదని ఆరోపించారు. తపాలా, ఈవీఎం ఓట్లను మళ్లీ లెక్కించాలని కోర్టును కోరారు. పుదుక్కోటై జిల్లా వీరాలిమలై నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి సి. విజయభాస్కర్ గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీచేసిన ఎం. పళనియప్పన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. బహుమతులు, నగదు పంపిణీ చేయడం ద్వారా ఓటర్లను మభ్యపెట్టారని, ఎన్నికల నియయావళి కంటే ఎక్కువ ఖర్చుపెట్టడంతోపాటు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. విజయభాస్కర్ గెలుపు చెల్లదని ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. అలాగే ఈరోడ్ జిల్లా పెరుందురై నియోజకవర్గ అన్నాడీఎంకే ఎమ్మెల్యే జయకుమార్ గెలుపు చెల్లదని పేర్కొంటూ డీఎంకే చిహ్నం ఉదయసూర్యుని గుర్తుపై పోటీచేసిన కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి అభ్యర్థి కేకేసీ బాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈవీఎంల పనితీరు సక్రమంగా లేదని పోలింగ్ సమయంలోనే ఫిర్యాదు చేశామని, అయితే వాటిని సరిచేయకుండా పోలింగ్ను కొనసాగించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలోనూ 81 ఈవీఎంలలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ పిటిషన్లు న్యాయమూర్తి వి. భారతిదాసన్ ముందు సోమవారం విచారణకు వచ్చింది. మంత్రి దురైమురుగన్, మాజీ మంత్రి సి విజయభాస్కర్, జయకుమార్ గెలుపును సవాలు చేస్తూ పిటిషనర్లు వెలిబుచ్చిన ఆరోపణలపై చీఫ్ ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఆయా నియోజకవర్గాల అధికారులు 4 వారాల్లోగా బదులివ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. విచారణను సెప్టెంబరు 6వ తేదీకి వాయిదా వేశారు. -
హ్యాకింగ్కు గురైన తమిళనాడు సీఎం ట్విటర్ అకౌంట్..!
సాక్షి, చెనై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్కు గురైంది. దీంతో ఆయన ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సమస్య మాజీ సీఎం ఈపీఎస్ పళనిస్వామి ట్విటర్ అకౌంట్ను స్టాలిన్కు బదిలీ చేయడంలో ఈ సమస్య తలెత్తినట్లు ఐటీ నిపుణులు గుర్తించారు. ప్రస్తుతం తన వ్యక్తిగత ట్విటర్ ఖాతా ద్యారా అధికారిక సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. అంతకుముందు ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి అధికార ట్విటర్ ఖాతాను ట్విటర్లో మాజీ సీఎం ఇపీఎస్ పళనిస్వామి కార్యాలయంగా మార్చారు. ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని, తిరిగి తమిళనాడు సీఎం అధికార ఖాతాగా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నాడీఎంకే ఐటీ వింగ్ తెలిపింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలలో కూడా ఇదే లోపం నెలకొంది. తమిళనాడు సీఎం అధికార ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇంకా పళనిస్వామి ఛాయాచిత్రం, పేరు, ఇతర వివరాలతోనే ఉంది.డీఎంకే ఐటీ విభాగం కార్యాలయ అధికారి మాట్లాడుతూ ..‘రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది. ట్విట్టర్ వచ్చిన తరువాత తమిళనాడులో ప్రభుత్వం మారడం ఇదే మొదటిసార’ ని అన్నారు. "ముఖ్యమంత్రి అధికార ట్విట్టర్ ఖాతాను బదిలీ చేయడంలో మాజీ సీఎం ఈపీఎస్కు తప్పు సలహా ఇచ్చారని బీజేపీ నాయకుడు ఎస్జీ సూర్య ట్విటర్లో ఆరోపించారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి ట్విటర్ ఖాతాను అప్పగించడం, గత సీఎం చేసిన ట్వీట్లను ఆర్కైవ్ చేయడం సరైన పద్ధతని తెలిపారు. చదవండి: M K Stalin: తమిళనాడు సీఎం బహిరంగ లేఖ -
ఎగ్జిట్ పోల్స్: బీజేపీకి షాకిచ్చిన దీదీ
న్యూఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల మినీ సంగ్రామానికి నేటితో తెరపడింది. గురువారంతో.. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగా.. పశ్చిమ బెంగాల్లో చివరి విడత ఎన్నికల పోలింగ్ ఈ రోజుతో ముగిసింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అత్యధికంగా ప్రజలు అధికార పార్టీలకే పట్టం కట్టారు. ఒక్క తమిళనాడులో మాత్రం డీఎంకే అధికారంలోకి రానున్నట్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. ఇక బెంగాల్లో బీజేపీ, టీఎంసీల మధ్య రసవత్తర పోరు సాగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో బీజేపీ తక్కువ స్థానాలకే పరిమితం అయినప్పటికి ఈ సారి మాత్రం టీఎంసీకి గట్టి పోటీనే ఇచ్చినట్లు పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ఇక ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాష్ట్రాల వారిగా ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ (294 సీట్లు)... సీఓటర్ సర్వే: టీఎంసీదే విజయం సీఓటర్: టీఎంసీ 158, బీజేపీ 115, కాంగ్రెస్ ప్లస్ - 19 బెంగాల్ పీమార్క్ : బీజేపీ 120, టీఎంసీ 158, లెఫ్ట్+ 14 బెంగాల్ ఈటీజీ : బీజేపీ 110, టీఎంసీ 169, లెఫ్ట్+ 12 రిపబ్లిక్-సీఎన్ఎక్స్ : బెంగాల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ రిపబ్లిక్-సీఎన్ఎక్స్: టీఎంసీ 128-138, బీజేపీ138-148, కాంగ్రెస్: 11-21 సీఎన్ఎన్: టీఎంసీ 128-132, బీజేపీ: 138-148, ఇతరులు - 20 అస్సోం(126 అసెంబ్లీ స్థానాలు)... ఇండియా టుడే ఎగ్జిట్ పోల్: అసోంలో బీజేపీదే విజయం. బీజేపీ: 75-85, కాంగ్రెస్: 40-50 రిపబ్లిక్ ఎగ్జిట్పోల్: బీజేపీ 74-84, కాంగ్రెస్: 40-50 కేరళ (140 అసెంబ్లీ స్థానాలు)... రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్: లెఫ్ట్ఫ్రంట్ 70-80, కాంగ్రెస్ 40-50 తమిళనాడు (234 అసెంబ్లీ స్థానాలు).. రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్: డీఎంకే 160 -170, అన్నాడీఎంకే 58-68 పుదుచ్చేరి (30 అసెంబ్లీ స్థానాలు) ఇక్కడ బీజేపీకి విజయవకాశాలున్నట్టు తెలుస్తోంది. -
స్టాలినే సీఎం: డీఎంకేకు 180 స్థానాలు ఖాయం!
ఉదయ సూర్యుడికే ప్రజలు పట్టం కట్టారా..? డీఎంకే అభ్యర్థులకే గంపగుత్తగా ఓట్లేశారా..? ఆ పార్టీ అధినేత స్టాలిన్ వైపే మొగ్గుచూపారా..? అత్యధిక స్థానాలతో అధికార పీఠం చేపట్టనున్నారా..? అన్నాడీఎంకే హవాకు ఓటర్లు మంగళం పాడేశారా..? అతి తక్కువ సీట్లకే పరిమితం చేయనున్నారా..? తమిళనాట కమల వికాసం కలేనా..? బోణీ కొట్టే పరిస్థితి కూడా ఉండదా..? అవుననే అంటున్నాయి సర్వేలు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తిరుగులేని విజయం సాధిస్తుందని ఘంటాపథంగా వెల్లడిస్తున్నాయి. సాక్షి , చెన్నై : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత డీఎంకేలో ఆనందం వెల్లివిరుస్తోంది, అన్నాడీఎంకేలో నైరాశ్యం అలుముకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా అన్నాడీఎంకే– డీఎంకే తలపడ్డాయి. 70 శాతం వరకు పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రజలు అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ సరళి డీఎంకేకు అనుకూలమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఐ బ్యాక్ సంస్థ ఎన్నికలకు ముందు మొత్తం 234 స్థానాల్లో సర్వేలో నిర్వహించి డీఎంకేకు 180 స్థానాలు ఖాయమని తేల్చింది. ఈ క్రమంలో పోలింగ్ న ఆడు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ చెన్నైలోని ఐ బ్యాక్ సంస్థ కార్యాలయానికి సైతం వెళ్లడం విశేషం. పోలింగ్ ముగిసిన తర్వాత డీఎంకేకు 180 కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని ఐ బ్యాక్ సంస్థ వెల్లడించింది. దీంతో డీఎంకే శ్రేణుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. స్టాలిన్ కూడా డీఎంకే అభ్యర్థులను చెన్నైకి పిలిపించుకుని విజయావకాశాలపై ఆరా తీస్తున్నారు. అందులో భాగంగా గురు, శుక్రవారాల్లో పార్టీ జిల్లా కార్యదర్శులు సైతం స్టాలిన్ను కలిశారు. ఈ సందర్భంగా స్టాలిన్ డీఎంకే అగ్రనేతలతో సమావేశమై మంత్రి పదవులు, శాఖల కేటాయింపుపై చర్చించినట్లు సమాచారం. అలాగే పలువురు ఐఏఎస్ అధికారులు స్టాలిన్ను కలిసి శుభాకాంక్షలు చెప్పినట్లు తెలుస్తోంది. రెండాకుల్లో గుబులు! అన్నాడీఎంకే విషయానికి వస్తే ఎన్నికలకు ముందు సీఎం ఎడపాడి పళనిస్వామి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత డీలా పడిపోయినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పలువురు మంత్రులు సైతం ఓటమిపాలవుతున్నట్లు ఆయనకు సమాచారం అందింది. పోలింగ్ పూర్తయిన తర్వాత పళనిస్వామి సేలం జిల్లా సూరమంగళంలోని తన సొంతింటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈక్రమంలో మంత్రులు ఎంసీ సంపత్, ఆర్బీ ఉదయకుమార్, విజయభాస్కర్, కేసీ వీరమణి, జయకుమార్ సహా పలువురు అభ్యర్థులు సేలం వెళ్లి ఎడపాడిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రులే ఓడిపోయే పరిస్థితి ఉందని వారు చెప్పడంతో పళనిస్వామి మరింత నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే 20–30 సీట్లకు పరిమితమవుతుందని, బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని ఐ బ్యాక్ సంస్థ వెల్లడించినట్లు సమాచారం. చదవండి: సీనియర్ నటుడికి అత్యవసర చికిత్స -
స్టాలిన్ మొత్తం ఆస్తుల విలువ ఇంతేనా
చెన్నై:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలలో నాయకులు తమ ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తన వద్ద రూ.4.94 కోట్ల స్థిరాస్తులు, 2.24 కోట్లు చరాస్తులు ఉన్నట్లు సోమవారం ప్రకటించారు. తన పేరిట ఎలాంటి వాహనం లేదని, నగదు రూపంలో రూ. 50,000 ఉన్నట్లు తెలిపారు. మరో వైపు తన భార్య పేరిట 30,52,854 విలువైన చరాస్తుల ఉన్నాయని , 24.77 లక్షల విలువైన పాత బంగారు ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు. బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు ఏవీ లేవని, ఇతర అప్పులు కూడా లేవని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే జీతం, బ్యాంకు డిపాజిట్లు, అద్దెల ద్వారా తన ఆదాయం సమకూరుతున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. 2016 లో ప్రకటించిన అఫిడవిట్ లో, స్టాలిన్ 80.33 లక్షల విలువైన చరాస్తులు, 3.33 కోట్ల రూపాయల విలువ గల స్థిరాస్తులను చూపించారు. ఒక దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న అన్నాడిఎంకేను గద్దె దించడమే లక్ష్యంత ఏర్పడిన ప్రతిపక్ష కూటమికి స్టాలిన్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ సారి తనయుడి రాజకీయ ఆరంగ్రేటం ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఎంకె స్టాలిన్ కుమారుడు ఉదయనిధి మొదటి సారిగా పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన వద్ద 21.13 కోట్ల చరాస్తులు ,రూ.6.54 కోట్ల విలువవైన స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. నగరంలోని చెపాక్-ట్రిప్లికేన్ సెగ్మెంట్ కు నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్ లో డిఎంకె యూత్ వింగ్ చీఫ్ ఈ విధంగా పేర్కొన్నారు. -
మెట్టుదిగని డీఎండీకే.. అన్నాడీఎంకేకు తలనొప్పి!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సీట్ల పందేరం కొలిక్కి రావడం లేదు. ప్రధానంగా డీఎండీకే రూపంలో సమస్య తప్పడం లేదు. తమిళ మానిల కాంగ్రెస్కు సోమవారం సీట్ల కేటాయింపు సాగనుంది. చిన్న చిన్న పార్టీలు ఆదివారం అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో కన్వీనర్ పళనిస్వామిని కలిసి మద్దతు తెలపడమే కాకుండా, తమకు తలా ఓ సీటు కేటాయించాలన్న విజ్ఞప్తిని ఉంచాయి. అన్నాడీఎంకే కూటమిలో పీఎంకేకు 23 సీట్లు కేటాయించారు. బీజేపీకి 20 సీట్లను కేటాయించినట్టు సమాచారాలు వెలువడ్డా, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ కూటమిలోని జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్, విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు సీట్ల కేటాయింపుల్లో సమస్యలు తప్పడం లేదు. పదిహేను మేరకు సీట్లను వాసన్ ఆశిస్తుండగా, పీఎంకేతో సమానంగా సీట్లకు డీఎండీకే పట్టుబడుతున్నట్టు సమాచారం. ఈ రెండు పార్టీలతో ఆదివారం కూడా చర్చలు సాగాయి. డీఎండీకేకు గతంలో ఉన్నంత బలం ప్రస్తుతం లేదని, పది నుంచి పదిహేనులోపు సీట్లతో సరి పెట్టేందుకు అన్నాడీఎంకే నిర్ణయించినట్టు తెలిసింది. అయితే, ఆ సీట్లను స్వీకరించేందుకు డీఎండీకే ముందుకు రావడం లేదు. మెట్టుదిగే ప్రసక్తే లేదని, తాము ఆశిస్తున్న సీట్లతో పాటు ఓ రాజ్యసభ ఇవ్వాల్సిందేనని డీఎండీకే పట్టుబడుతుండడంతో అన్నాడీఎంకేకు శిరోభారం తప్పడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం విజయకాంత్ నేతృత్వంలో ఆ పార్టీ ఆశావహుల ఇంటర్వ్యూలు సాగడం గమనార్హం. 13 జిల్లాల నుంచి ఆశావహుల్ని విజయకాంత్ ఇంటర్వ్యూ చేశారు. అన్నాడీఎంకే పట్టువీడని పక్షంలో ఒంటరి సమరానికి సిద్ధమన్నట్టుగా డీఎండీకే అడుగులు ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జీకే వాసన్ ఓ మెట్టుదిగినట్టు, సోమవారం సీట్ల కేటాయింపునకు సంతకాలు జరిగే అవకాశం ఉందని అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. మేనిఫెస్టో కసరత్తులు.. రాయపేటలోని కార్యాలయంలో పన్నీరు, పళని మేనిఫెస్టోకు తుది మెరుగుల కసరత్తుల్లో నిమగ్నమయ్యారు. పొన్నయ్యన్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మేనిఫెస్టోపై చర్చించి మార్పులు చేర్పులపై దృష్టి పెట్టారు. అభ్యర్థుల జాబితా తుది కసరత్తులు పూర్తి చేసినట్టు సమాచారం. చదవండి: తమిళనాట ఎన్డీయేదే గెలుపు -
శశికళ కొత్త ఎత్తుగడ.. ఫలించేనా?!
సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలు నుంచి విడుదలైన ఎంకే శశికళ ఎన్నికల్లో పోటీకి ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించే పనిలోపడ్డారు. సిక్కిం రాజకీయాలను ఉదాహరణగా చూపుతూ ఆరేళ్ల నిషేధం తొలగింపుపై చట్టపరంగా పోరాడనున్నారు. శశికళ అనుచరులు న్యాయకోవిదులతో చర్చలు ప్రారంభించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న శశికళ గత నెల 27వ తేదీన జైలు నుంచి విడుదలైనా తమిళనాడు అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలులేదు. ఆర్థికనేరంపై జైలు శిక్ష అనుభవించిన శశికళ 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఆరేళ్లపాటూ అంటే 2027 జనవరి వరకు ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలులేని పరిస్థితి నెలకొంది. పార్టీ సారధ్య బాధ్యతలకు చట్టపరంగా ఎలాంటి అడ్డంకి లేదు. అయితే ఈ ఆరేళ్ల కాలం నిషేధంపై న్యాయస్థానంలో సవాలు చేయాలని ఆమె అనుచరులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయంలో సిక్కిం రాష్ట్ర రాజకీయాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. సిక్కిం రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి ప్రేమ్సింగ్ దమాంగ్ అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవించి 2018లో విడుదలయ్యారు. ఆరేళ్లు పోటీచేసేందుకు వీలులేదని చట్ట నిపుణులు ఆయనకు చెప్పినా 2019లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆరేళ్ల నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన చేసుకున్న విన్నపాన్ని ఎన్నికల కమిషన్ అమోదించింది. ప్రజా ప్రతినిధుల చట్టం 1951 సెక్షన్ 11 ప్రకారం సడలింపుకు అవకాశం ఉందని అంటున్నారు. సిక్కిం సీఎంలా శశికళ కూడా సడలింపు పొందే ప్రయత్నాల్లో భాగంగా ఎన్నికల కమిషన్ను కలుసుకోవాలని భావిస్తున్నారు. శశికళ న్యాయవాదులు చట్ట నిపుణులతో చర్చిస్తున్నారు. శశికళ చెన్నైకి చేరుకోగానే ఆమెతో నేరుగా మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి శశికళకు మార్గం సుగమం అవుతుందని, ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తారని అనుచరులు ఢంకా భజాయించి చెబుతున్నారు. చదవండి: ఏఐఏడీఎంకేతో పొత్తు కొనసాగుతుంది ఒంటరి పోరుకైనా సిద్ధమే! : ప్రేమలత -
జైలు నుంచి విడుదలైన శశికళ
బెంగళూరు: తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆప్తురాలు వీకే శశికళ బుధవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. అవినీతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన శశికళ ఈనెల 20న కరోనా బారిన పడ్డారు. దీంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శశికళ జైలు నుంచి విడుదల కానున్న నేపథ్యంలో దానికి సంబంధించిన తంతు అంతా ఆస్పత్రిలోనే పూర్తి చేశామని జైలు అధికారులు ప్రకటించారు. ఇవాళ జైలు నుంచి విడుదల అయినప్పటికీ.. ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జి అవుతారన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆమెకు కరోనా లక్షణాలేవీ లేవని వైద్యులు తెలిపారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, అయితే కోవిడ్ నిబంధనల ప్రకారం ఆమె మరో 10 రోజుల పాటు ఆస్పత్రిలో కొనసాగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. శశికళ జైలు నుంచి విడుదల అయిన సందర్భంగా భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఆమె అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరప్పణ అగ్రహారం జైలు నుంచి చెన్నై వరకు కనీసం వెయ్యి వాహనాలతో స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్ మున్నేట్రకళగం అధినేత, ఎమ్మెల్యే దినకరన్ టీమ్ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. (శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదు) -
శశికళకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
సాక్షి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ బుధవారం అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వెంటనే ఆమెను బెంగళూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆప్తురాలు వీకే శశికళ ఈ నెల 27న జైలు నుంచి విడుదల కానున్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన శశికళ శిక్షాకాలం పూర్తి చేసుకుని బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదల కానున్నారు. ఆమె బంధువు, సహచర నిందితురాలు ఇళవరసి ఇంకొంత కాలం జైలుశిక్ష అనుభవించాల్సి ఉంది. (చదవండి: ముందస్తు విడుదల విఫలమవడంతో శశికళలో ఆధ్యాత్మికత) శశికళ, ఇళవరసి, మరో బంధువు వీఎన్ సుధాకర్లు 2017, ఫిబ్రవరి నుంచి పరప్పన జైలు జీవితం గడుపుతున్నారు. ఈ కేసులో ఇళవరసి కంటే కొంత ముందే శశికళ అరెస్టయి జైల్లో గడపడంతో ముందే విడుదల కానున్నారు. ఇతరత్రా కస్టడీ రోజులను సైతం పరిగణనలోకి తీసుకుంటే ఈ నెల 27తో శశికళ శిక్షా కాలం ముగుస్తుందని జైలు వర్గాలు తెలిపాయి. శశికళ, ఇళవరసి జరిమానాల కింద చెరో రూ. 10 కోట్లను చెల్లించారు. సుధాకర్ ఇంకా కట్టలేదని తెలిసింది. (చదవండి: శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదు) -
విద్యార్థులకు బంపరాఫర్.. 2జీబీ డేటా ఫ్రీ
సాక్షి, చెన్నై : విద్యార్థులకు ప్రతిరోజూ 2 జీబీ డేటాను తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఉచితంగా అందజేయనున్నారు. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ ప్రకటన చేయడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గత మార్చి 21వ తేదీ నుంచి లాక్డౌన్ ప్రకటించారు. దీంతో పాఠశాలలు, కళాశాలలు మూతబడ్డాయి. కరోనా నానాటికీ అధికమవుతున్నందున విద్యాసంస్థలను ప్రారంభించడంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వార్షిక పరీక్షలు రద్దు చేసి ఆల్ పాస్ అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనను యూజీసీ, ఏఐసీటీఈ తీవ్రంగా ఖండించాయి. దీనికి సంబంధించిన కేసు న్యాయస్థానంలో పెండింగ్లో ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16 వర్సిటీల కళాశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు టైంటేబుల్ విడుదలైంది. దీంతో చెన్నై వర్సిటీ పదిరోజులుగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ ఉత్తర్వులు జారీ చేసి పదినెలలకు పైగా కావస్తున్న స్థితిలో ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థుల చదువు కుంటుపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యాసంస్థలను ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పీజీ కళాశాల విద్యార్థులకు డిసెంబర్ రెండవ తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. యూజీ విద్యార్థులకు తరగతులను ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఇలావుండగా కొత్త కరోనా వైరస్ వ్యాప్తితో కళాశాలలు ప్రారంభించేందుకు చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో విద్యార్థులకు ఆన్లైన్, టీవీల ద్వారా విద్యాబోధన చేపట్టేందుకు నిర్ణయించారు. కొందరు విద్యార్థులు సాంకేతిక సౌకర్యాలు లేక కష్టపడుతున్నందున ప్రత్యేక మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. దీంతో ఆన్లైన్ తరగతులలో పాల్గొనేందుకు వీలుగా 9.69 లక్షల మంది కళాశాల విద్యార్థులకు ప్రతిరోజు 2 జీబీ డేటా ఉచితంగా అందజేసేందుకు ముఖ్యమంత్రి ఎడపాడి ఉత్తర్వులిచ్చారు. విద్యావేత్తల అసంతృప్తి : అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ తరహా ప్రకటన చేయడం సరికాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పలు మొబైల్ సంస్థలు 1.5 జీబీ డేటా ఉచితంగా అందిస్తున్నాయని, వీటిని ఉపయోగించలేని స్థితిలో పలు నెట్వర్క్లు లభించడం లేదని ఫిర్యాదులందుతున్నట్లు తెలిపారు. -
సీఎం పీఠంపై వివాదం: చిన్నమ్మతో సవాల్
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికలు ఒక వైపు, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ విడుదల మరో వైపు సవాళ్లు విసురుతున్న వేళ సర్వసభ్య సమావేశంతో అన్నాడీఎంకే అగ్రజులంతా శనివారం ఒకే వేదికపై రానున్నారు. ఎన్నికల్లో తలపడనున్న కూటమి పార్టీల వైఖరిపై కసరత్తు చేయనున్నారు. అధికారపార్టీ హోదాలో ఈసారికి ఇదే తుది సమావేశం కావడం గమనార్హం. తమిళనాడులోని అన్ని రాజకీయపార్టీలు ఏడాదికి ఒకసారి సర్వసభ్య సమావేశం, రెండుసార్లు కార్యనిర్వాహకుల సమావేశాన్ని నిర్వహించాలి. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఎన్నికల కమిషన్కు తెలియజేయాలి. ఈ ప్రకారం అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం గత ఏడాది డిసెంబర్లో జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యనిర్వాహక సమావేశాన్ని మాత్రమే నిర్వహించారు. ఈ సమయంలో 11 మంది సభ్యులతో మార్గదర్శకాల కమిటీని ఏర్పాటు చేసుకుని పార్టీ పరమైన నిర్ణయాలపై వారికి కొన్ని అధికారాలు ఇచ్చారు. అయితే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సర్వసభ్యం ఆమోదించాల్సి ఉంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టి లాక్డౌన్లో అనేక సడలింపులు చోటుచేసుకోవడంతో సర్వసభ్య సమా వేశానికి అన్నాడీఎంకే సిద్ధమైంది. చెన్నై శివారు వానగరం శ్రీనివాస కల్యాణమండపంలో శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి పార్టీ కన్వీనర్, ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం, కో–కన్వీనర్, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, 302 మంది కార్యనిర్వాహకసభ్యులు సహా 3,500 మంది హాజరుకానున్నారు. శశికళ వస్తే ఎలా? అన్నాడీఎంకే బహిష్కృతనేత దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చిలి శశికళ ఈనెల 27వ తేదీన జైలు నుంచి విడుదల కానున్నారు. అన్నాడీఎంకే శ్రేణులకు అసెంబ్లీ ఎన్నికలతోపాటు శశికళను ఎదుర్కోవడం కూడా సవాలుగా మారే పరిస్థితులున్నాయి. జయలలిత మరణం సమయంలో ముఖ్యమంత్రిగా ఉండిన పన్నీర్సెల్వం చేత శశికళ బలవంతంగా రాజీనామా చేయించారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికై గవర్నర్ ఆమోదానికి పంపిన దశలో ఆమె జైలుపాలయ్యారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం శశికళకు తృటిలో తప్పిపోగా ప్రత్యామ్నాయంగా ఎడపాడిని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో శశికళను ఎడపాడే స్వయంగా పార్టీ నుంచి బహిష్కరించాల్సి వచ్చింది. నాలుగేళ్ల జైలుశిక్ష ముగించుకుని ఈనెల 27న శశికళ జైలు నుంచి విడుదలవుతున్నారు. జయ హయాంలోనే పార్టీలో చక్రం తిప్పిన శశికళకు పాద నమస్కారాలు చేసే స్థాయిలో అన్నాడీఎంకేలో అనుంగు శిష్యులున్నారు. రేపు జైలు నుంచి విడుదలైతే పార్టీలో ఎలాంటి ప్రకంపనలు ఎదురవుతాయోనని అగ్రనేతలు చెవులు కొరుక్కుంటున్నారు. శశికళ విడుదల, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న దశలో పార్టీ సర్వసభ్య సమావేశం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్నాడీఎంకే కూటమిలోని మిత్రపక్షపార్టీల గురించి చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా కూటమి నుంచి ఎడపాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై బీజేపీ అభ్యంతరం లేవనెత్తడం, 60 సీట్లకు పట్టుబడడంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈనెల 27న శశికళ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉండడంతో పార్టీలో ఆ ప్రభావంపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. -
అన్నాడీఎంకే పార్టీలో పోస్టర్ల కలకలం
చెన్నై : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రానున్న సార్వత్రిక ఎన్నికల అన్నాడీఎంకే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ వెలిసిన కొన్ని పోస్టర్లు అధికార పార్టీలో కలకలాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో కొంతమంది సీనియర్ మంత్రులు.. సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఇళ్ల వద్దకు క్యూలు కట్టారు. అనంతరం శనివారం సాయంత్రం పళనిస్వామి, పన్నీరు సెల్వాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటాయని స్పష్టం చేశారు. పోస్టర్ల విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాలు, పొత్తులు కార్యకర్తల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకునే జరుగుతాయన్నారు. ( తడబడి నిలబడిన.. ఈపీఎస్ – ఓపీఎస్! ) వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోకుండా కార్యకర్తలందరూ పని చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకునే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, తమిళనాడులో 2021 మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో డీఎమ్కే పార్టీ కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో వ్యూహాలు రచిస్తోంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ను సైతం రంగంలోకి దింపింది. -
రాజుకుంటున్న ఎన్నికల వేడి
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికలకు ఇక ఆరునెలల గడువు మాత్రమే ఉంది. అందుకే అన్ని పార్టీల్లోనూ అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. కొన్నిపార్టీలు ప్రత్యక్షంగా, మరికొన్ని పార్టీలు పరోక్షంగా ఎన్నికలకు సమాయుత్తం అవుతున్నాయి. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన అన్నాడీఎంకే ముచ్చటగా మూడోసారి విజయకేతనం ఎగురవేయడం ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే ఈసారి ఎలాగైనా జార్జికోటపై జెండా ఎగురవేయాలని పట్దుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఏ కూటమికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని ఇంటెలిజెన్స్ పోలీసులు సర్వే ప్రారంభించారు. ప్రధాన రెండు కూటములు (డీఎంకే, అన్నాడీఎంకే)లకు చెందిన ప్రముఖ నేతలను కలుసుకుంటూ సమాచారాన్ని సేకరిస్తున్నారు. అలాగే, ఎమ్మెల్యేగా గెలుపు అవకాశాలు కలిగిన నేతలు, నియోజకవర్గాల గురించి ఆరాతీస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో అన్నాడీఎంకే, డీఎంకేలో జిల్లా కార్యదర్శులకు లేదా వారు సూచించే వ్యక్తులకు ప్రాధాన్యతనిచ్చే సంప్రదాయం ఉంది. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీట్ల కోసం పట్టుదలతో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్షంగా 70 వేల మంది ఐటీ విభాగంతో అడుగు ముందుకేయాలని అన్నాడీఎంకే నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఎంపికను ప్రారంభించింది. మండలానికి 13 మంది, జిల్లాకు 14 మంది నిర్వాహకుల చొప్పున నియమించి, ఎన్నికల వేళ ప్రతిపక్షాల విమర్శలకు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతివిమర్శలను సంధిస్తూ విజయానికి బాటలు వేసేందుకు సన్నద్ధం అవుతోంది. డీఎండీకే కసరత్తు డీఎండీకే కోశాధికారి ప్రేమలత సైతం ఎన్నికల దిశగా కార్యోన్ముఖులయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలను ఉత్తేజితులను చేసేందుకు ఈ నెల 25వ తేదీన జరగబోయే పార్టీ అధ్యక్షుడు విజయకాంత్ జన్మదినాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యకర్తలతో మాట్లాడుతూ వారిని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. (సొంత గూటికి పైలట్!) డీఎంకే దిశగా కమల్ అడుగులు ఇదిలా ఉండగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో చేరేందుకు మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్హాసన్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీని స్థాపించినప్పుడే ఢిల్లీ వెళ్లి నేరుగా కాంగ్రెస్ అధినేతలు సోనియాగాందీ, రాహుల్గాందీని కమల్ కలిసి వచ్చారు. కూటమికి సారధ్యం వహిస్తున్న డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్తో మాటమాత్రం అనకుండా అధిష్టానం వద్దకు వెళ్లడంతో వ్యవహారం చెడింది. దీంతో కమల్ ఈ నెల 7వ తేదీన కరుణానిధి వర్దంతి రోజున ట్విట్టర్ ద్వారా నివాళులర్పించి గతంలో చేసిన పొరబాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. కమల్ చేరిక డీఎంకేకు మరింత బలం చేకూరుస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. డీఎంకే కూటమిలో మక్కల్ నీది మయ్యం చేరడం ఎంతవరకు సాధ్యమనే సందేహాలు నెలకొన్ని ఉన్నాయి. నటుడు రజనీకాంత్ పార్టీని స్థాపించి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతారా.. లేక కమల్తో కలుస్తారా, అదే జరిగితే రాజకీయ బలాబలాల మాటేమిటని కూడా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరిస్తోంది. డీఎంకేకు చావోరేవో పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న డీఎంకేకు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. అగ్రనేత కరుణానిధి కన్నుౖమూసిన తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన విజయం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అదే విజయాన్ని పునరావృతం చేయగలమనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు గెలవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ ధీమాతో ఉన్నారు. ఒక్క రజనీకాంత్ మినహా అందరూ అసెంబ్లీ ఎన్నికలవైపు ఆశగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం. -
ఈ- పాస్ అడిగిన పోలీసుపై మాజీ ఎంపీ ఓవరాక్షన్
చెన్నై : టోల్ప్లాజా వద్ద ఈ-పాస్ అడిగిన కారణంగా విదుల్లో ఉన్న పోలీసుపై డీఎంకే నేత, మాజీ ఎంపీ కే. అర్జునన్ భౌతికదాడికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. సేలం- బెంగుళూరు హైవేలోని టోల్ ప్లాజా దగ్గర మాజీ ఎంపీ కారును ఆపి పాస్ చూపించాలని కోరగా అర్జునన్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. నా స్థాయి ఏంటో తెలుసా..నన్నే పర్మిషన్ లెటర్ అడగటానికి ఎంత ధైర్యం అంటూ ఓవరాక్షన్ చేశారు. అయినప్పటికీ ఈ- పాస్ ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తామంటూ చెప్పగా..అర్జునన్ కోపంతో ఊగిపోయారు. కారు దిగి వచ్చి సదరు పోలీసుపై చేయి చేసుకోవడమే కాకుండా కాలితో తన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీలు టోల్ ప్లాజా దగ్గరున్న సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. (ఇప్పట్లో వాటికి దూరం.. ) అయితే ఇప్పటివరకు అర్జునన్పై అధికారులు కేసు నమోదు చేయలేదు. 1980 ప్రారంభంలో డీఎంకే ఎంపీగా విజయం సాధించిన అనంతరం అర్జునన్ అన్నాడీఎంకేలో చేరారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ప్రయాణించాలంటే ఈ-పాస్ను తప్పనిసరి చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఇటీవలె ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టోల్ప్లాజా వద్ద ఈ-పాస్ కోసం అడగ్గా అధికారులను దుర్భాషలాడుతూ భౌతికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అర్జునన్పై కేసు నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. (రోగ నిరోధక శక్తిని పెంచే స్వీట్ వచ్చేసింది.. ) -
విజయ్ని కావాలనే టార్గెట్ చేశారా !
పెరంబూరు : ఇళయదళపతి విజయ్ ఇప్పుడు చాలా మందికి టార్గెట్ అయ్యారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ నుంచి అవుననే సమాధానం వస్తోంది. సినీ రంగంలో విజయ్కు, అజిత్కు మధ్య పోటీ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నిజ జీవితంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండడంతో కేవలం వృత్తిపరమైన పోటీనే కాబట్టి సమస్య లేదు. ఈమధ్య అన్నాడీఎంకే పార్టీ విజయ్ను టార్గెట్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. నటుడు విజయ్ నటించిన తలైవా, కత్తి చిత్రాల విడుదల నుంచి ఆ మధ్య తెరపైకి వచ్చిన సర్కార్, ఇటీవల బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ రోజు వరకూ అన్నాడీఎంకే ఆయనను టార్గెట్ చేసిందనే టాక్ ఉంది .(హీరో విజయ్ ఇంట్లో మళ్లీ ఐటీ సోదాలు) మెర్సెల్ చిత్రం విడుదల సమయంలోనూ బీజేపీ నాయకులు ఆ సినిమాను టార్గెట్ చేస్తూ.. చిత్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా సంభాషణలు ఉన్నాయంటూ విరుచుకుపడ్డారు. తాజాగా ఆదాయపన్నుశాఖ దాడి.. బిగిల్ చిత్ర వ్యవహారంలో ఫిబ్రవరి 5,6 తేదీల్లో విజయ్కు చెందిన స్థానిక సాలిగ్రామం, పనైయూర్లోని ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అప్పుడు ఆయన ఇళ్లలో కొన్ని డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత విజయ్కు సమన్లు పంపడం, ఆయన నేరుగా చెన్నైలోని ఆదాయపన్నుశాఖాధికారుల ముందు హాజరై వివరణ ఇవ్వడం జరిగింది. అలాంటిది గురువారం మరోసారి విజయ్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతా సక్రమమే ఈ సందర్భంగా నటుడు విజయ్ తాజాగా నటిస్తున్న మాస్టర్ చిత్ర సహ నిర్మాత లలిత్కుమార్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. కాగా విజయ్ బిగిల్ చిత్రంలో నటించినందుకు గాను రూ.50 కోట్ల పారితోషికాన్ని, తాజాగా నటిస్తున్న మాస్టర్ చిత్రానికి రూ.80 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తేలింది. ఈ రెండు చిత్రాల పారితోషికానికి నటుడు విజయ్ సక్రమంగా పన్ను చెల్లించినట్లు ఆదాయశాఖ అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారు. ఆయన్ని మిస్టర్ క్లీన్గా చేశారు. ఈ ఐటీ దాడుల వ్యవహారంలో విజయ్ ప్రవర్తించిన తీరు ఆయన పరిణితిని తెలియజేసింది. ఈ దాడుల గురించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. (విషం ఇచ్చి చంపేయమంటున్నారు! ) కాగా ఐటీ అధికారులు విజయ్కు క్లీన్ చిట్ ఇవ్వడంతో సినీ నటి, కాంగ్రెస్స్ పార్టీ జాతీయ ప్రచార కర్త ఖష్భూ స్పందించారు. 'ఆదాయపు పన్ను శాఖ అధికారులు విజయ్కు క్లీన్చిట్ ఇచ్చారు కాబట్టి ఇక ఈ వ్యవహారానికి విశ్రాంతి ఇచ్చేద్దామా? ' అని ట్విటర్లో పేర్కొన్నారు. విజయ్ తన పనిని తాను కామ్గా చేసుకుపోతున్నారు. ప్రస్తుతం నటిస్తున్న మాస్టర్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 9వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్ర విడుదలకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయోనన్న చర్చ కోలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. త్వరలో తాను నటించనున్న కొత్త చిత్రం గురించి వెల్లడించనున్నారు. -
శుభశ్రీ కేసులో మరో మలుపు
సాక్షి, చెన్నై: బ్యానర్ కూలి శుభశ్రీ మృతిచెందిన కేసులో అన్నాడీఎంకే నేత జయగోపాల్ను శుక్రవారం పోలీసులు కృష్ణగిరిలో అరెస్టు చేశారు. క్రోంపేట నెమిలిచ్చేరికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీరు శుభశ్రీ ఇటీవల స్కూటర్లో వెళుతుండగా బ్యానర్ కూలిపడడంతో వెనుక వచ్చిన లారీ ఢీకొని మృతిచెందిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సెయింట్థామస్మౌంట్ ట్రాఫిక్ పోలీసులు విచారణ జరుపుతూ వచ్చారు. దీనికి సంబంధించి అన్నాడీఎంకే నేత జయగోపాల్, అతని బావమరిది మేఘనాథన్పైన సెయింట్థామస్మౌంట్ ట్రా ఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న జయగోపాల్ కోసం ఐదు పోలీసు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి గాలింపులు జరిపారు. జయగోపాల్, అతని బంధువులు ఇళ్లకు తాళాలు వేసి పరారీలో ఉన్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా జయగోపా ల్ ఇంటికి పోలీసులు నోటీసులు అతికించారు. అతని బంధువులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. జయగోపాల్ ధర్మపురి జిల్లా హొగెనేకల్ ప్రాంతంలో దాగివుండొచ్చని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ తీవ్రంగా గాలింపులు జరిపారు. జయగోపాల్ అరెస్టు శుభశ్రీ కేసులో నిందితుడు అన్నాడీఎంకే నేత జయగోపాల్ను ఎట్టకేలకు పోలీసులు కృష్ణగిరిలో శుక్రవారం అరెస్టు చేసి చెన్నైకు తీసుకువచ్చారు. గత 14 రోజుల అనంతరం అతను పట్టుబడ్డాడు. అతన్ని న్యాయస్తానంలో హాజరుపరిచి జైలులో నిర్బంధించనున్నారు. అనంతరం శనివారం మధ్యాహ్నాం అతను బెయిల్ మీద విడుదలయ్యారు. విచారణకు ప్రత్యేక అధికారులు బ్యానర్ కూలిపడి శుభశ్రీ మృతిచెందిన వ్యవహారం గురించి ఇంజినీర్ వద్ద విచారణ జరిపేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. తర్వాత విచారణ నివేదికను నగర కార్పొరేషన్ కమిషనర్కు అందజేయనున్నారు. నేరం నిరూపించబడితే సస్పెన్షన్, వేతన పెంపు రద్దు, గరిష్టంగా ఉద్యోగం నుంచి డిస్మిస్ కూడా చేయవచ్చని అధికారులు వెల్లడించారు. -
చిన్నమ్మ మరోసారి చక్రం తిప్పేనా?
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో తాజాగా కొత్త చర్చ మొదలైంది. సీనియర్లుగా ఉన్న కొందరు మాజీ ఎంపీలు చిన్నమ్మ శశికళ అండ్ ఫ్యామిలీ కోసం రాయబారంమొదలెట్టినట్టుగా సమాచారాలు వెలువడుతున్నాయి. త్వరలో జైలు నుంచి బయటకు రానున్న శశికళను మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకుందామన్నట్టుగా ఈ మాజీలు రాయబారం మొదలెట్టినట్టుగా చర్చ జోరందుకుంది. జయలలిత నెచ్చెలి శశికళ ఒకప్పడు అన్నాడీఎంకేలో చక్రం తిప్పిన విషయం తెలిసిందే. అమ్మ మరణంతో అన్నాడీఎంకే పగ్గాలు చేజిక్కించుకుని సీఎం కుర్చీలో కూర్చునే ప్రయత్నం బెడిసికొట్టింది. అక్రమాస్తుల కేసులో కటకటాలపాలు కాక తప్పలేదు. పరప్పన అగ్రహార చెరకు చిన్నమ్మ వెళ్లినానంతరం అన్నాడీఎంకేలో పరిస్థితులు మారాయి. తాను ఏరి కోరి ఎంపిక చేసిన సీఎం పళనిస్వామి సైతం చిన్నమ్మకు వ్యతిరేకంగా వ్యవహరించక తప్పలేదు. చిన్నమ్మ కుటుంబాన్ని అన్నాడీఎంకే నుంచి సాగనంపి, పార్టీని చీల్చే ప్రయత్నంలో ఉన్న పన్నీరును అక్కున చేర్చుకున్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే సమన్వయ కమిటీకి అధ్యక్షుడుగా పన్నీరుసెల్వం, ఉపాధ్యక్షుడుగా పళనిస్వామి ముందుకు సాగుతున్నారు. అలాగే, పాలనాపరంగా ప్రభుత్వంలో సీఎంగా పళని, డిప్యూటీగా పన్నీరు వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పరప్పన అగ్రహార జైల్లో ఉన్న చిన్న శశికళ సత్ప్రవర్తన కారణంగా ఈ ఏడాది చివరిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారాలు వెలువడుతున్నాయి. ఇందుకు తగ్గ ప్రయత్నాలు కూడా సాగుతున్నాయని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ బయటకు రాగానే ఆమెను మళ్లీ అన్నాడీఎంకేలోకి ఆహ్వానించే విధంగా మాజీ ఎంపీలు కొందరు రాయబారం మొదలెట్టి ఉండడం వెలుగులోకి వచ్చింది. రాయబారం: చిన్నమ్మ శశికళకు అత్యంత సన్నిహితులుగా ఉన్న అనేక మంది నేతలు అన్నాడీఎంకేలో ఉన్నారనే చెప్పవచ్చు. అయితే, పరిస్థితుల ప్రభావం కారణంగా వీరంతా మౌనంగా ఉన్నారు. చిన్నమ్మ జైలు నుంచి రాబోతుండడం దాదాపు ఖరారవుతుండడంతో ఈ నేతలు తమ గలాన్ని విప్పేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కొందరు మాజీ ఎంపీలు చిన్నమ్మ తరఫున రాయబారాన్ని అన్నాడీఎంకే సమన్వయ కమిటీతో సాగించే పనిలో ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. తంబిదురై వంటి నేతలు కూడా చిన్నమ్మకు అనుకూలంగానే ఉన్నట్టు సమాచారం. ఈ మాజీలు తొలుత పళనిస్వామి శిబిరంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపి ఉన్నట్టుగా అన్నాడీఎంకేలో చర్చ జోరందుకుంది. పళని శిబిరం చిన్నమ్మకు అనుకూలంగా ఉన్నా, పన్నీరు ఎలా వ్యవహరిస్తారో అన్నది అంతుచిక్కని దృష్ట్యా ఆయన్ని కూడా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు ఆ మాజీలు మొదలెట్టి ఉన్నారు. తంబిదురై రెండు రోజుల క్రితం పన్నీరు సెల్వంను కలిసినట్టు చర్చ ఊపందుకుని ఉంది. దినకరన్ను మినహాయించి తక్కిన చిన్నమ్మ కుటుంబీకులను అన్నాడీఎంకేలోకి తీసుకురావడం ద్వారా పార్టీకే లాభం చేకూరుతుందన్న విషయాన్ని ఆ మాజీలు పన్నీరు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం అన్నాడీఎంకే సమన్వయ కమిటీ, ప్రభుత్వం ఎలా పయణం సాగిస్తున్నదో దాన్ని అలాగే కొనసాగించేందుకు చిన్నమ్మ ఫ్యామిలీ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. పార్టీ, పాలన వ్యవహారాల్లో ఎలాంటి జోక్యం అన్నది ఇప్పట్లో చిన్నమ్మ చేసుకోబోరని అయితే, ఆమె సేవలు తప్పనిసరి అయిన పక్షంలో రంగంలోకి దింపే విధంగా ముందుకుసాగుదామని ఆ మాజీలు రాయబారాన్ని, సంప్రదింపులను వేగవంతం చేసి ఉండడం అన్నాడీఎంకేలో చర్చకే కాదు గందరగోళానికి సైతం దారి తీసింది. -
వేలూరులో డీఎంకే ఘనవిజయం
చెన్నై : వేలూరు పార్లమెంట్ స్ధానానికి జరిగిన ఎన్నికలో డీఎంకే విజయం సాధించింది. సిట్టింగ్ స్థానాన్ని అన్నాడీఎంకే కాపాడుకోలేక పోయింది. డీఎంకే పార్టీ అభ్యర్థి డీఎం కదీర్ ఆనంద్ అన్నాడీఎంకే అభ్యర్ధి ఏసీ షణ్ముగంపై 8,142 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆనంద్కు 4,85,340 ఓట్లు రాగా, షణ్ముగం 4,77,199 ఓట్లు సాధించారు. ఇద్దరి మధ్య మొదటి నుంచీ విజయం దోబూచులాండింది. తొలుత అన్నాడీఎంకే అభ్యర్ధి షణ్ముగం ఆధిక్యంలో కొనసాగగా డీఎంకే అభ్యర్థి డీఎం కదీర్ ఆనంద్ అనూహ్యంగా పుంజుకున్నారు. చివరి వరకు ఆయన ఆధిక్యంలో కొనసాగారు. భారీ భద్రత నడుమ ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ 24 రౌండ్లపాటు సాగింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వేలూరులో గత ఏప్రిల్ 18న ఎన్నికలు జరగాల్సి ఉండగా.. డీఎంకే అభ్యర్ధి గోడౌన్లో పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడటంతో ఎన్నిక వాయిదా పడింది. డీఎంకే అభ్యర్థి కదిర్ ఆనంద్పై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈసీ అక్కడి ఎన్నికను వాయిదా వేసింది. ఇక ఆగస్టు 5న ఈ స్థానానికి ఎన్నిక జరిగింది. ఏఐఏడీఎంకే, డీఎంకే అభ్యర్థులతో పాటు మొత్తం 28 మంది అభ్యర్ధులు పోటీ చేశారు. -
‘వేదనలో ఉన్నా.. ఇక కాలమే నిర్ణయిస్తుంది’
సాక్షి, చెన్నై: ‘నేను తీవ్ర మనో వేదనలో ఉన్నా.. ఇక, రాజకీయ పయనాన్ని కాలమే నిర్ణయిస్తుంది’అని అన్నాడీఎంకే మాజీ ఎంపీ మైత్రేయన్ వ్యాఖ్యానించారు. మంగళవారం రాజ్యసభ పదవీకాలం ముగియడంతో బుధవారం చెన్నైకు వచ్చిన ఆయన మెరీనా తీరంలోని దివంగత సీఎం జయలలిత సమాధి వద్ద నివాళులర్పించి ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అమ్మ జయలలిత ప్రతినిధిగా ఢిల్లీలో తాను ఇన్నాళ్లు ఉన్నట్టు గుర్తు చేశారు. అమ్మ ఆదేశాల మేరకు మూడు సార్లు రాజ్య సభకు ఎంపికయ్యానని పేర్కొన్నారు. అమ్మ నుంచి వచ్చే ఉత్తర్వులు, ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీలో వ్యవహరిస్తూ వచ్చానని, అయితే, అమ్మ మరణం తదుపరి పరిణామాలతో అక్కడి నుంచి తిరిగి రాక తప్పలేదన్నారు. తనకు మళ్లీ అవకాశం ఇస్తారని ఎదురు చూశానని, అయితే, న్యాయం జరగలేదన్నారు మైత్రేయన్. లోక్ సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై సీటును ఆశించగా, మొండి చేయి చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ ఉండి ఉంటే.. అంటూ ఉద్వేగానికి లోనవుతూ, ప్రాధాన్యత తగ్గి ఉండేది కాదని వ్యాఖ్యానించారు. తనకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో దానిని బట్టే తన రాజకీయ పయనం ఉంటుందన్నారు. దానిని కాలమే నిర్ణయిస్తుందన్నారు. అయితే, తాను మాత్రం తీవ్ర మనోవేదనలో ఉన్నానని, తాను ఎవరినీ తప్పు బట్టడం లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇన్ని రోజులు రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే గెలుపు వెనుక అమ్మ ప్రభంజనం ఉండేదని, ఇక మీదట ఎలా ఉంటుందో అది ప్రజలే నిర్ణయిస్తారని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అన్నాడీఎంకేలో జంట నాయకత్వం అన్నది ఆహ్వానించదగ్గ విషయంగా పేర్కొన్నా, రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నది అమ్మ ప్రభుత్వమేనని, అయితే, ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందో అన్నది మాత్రం చెప్పలేనన్నారు మైత్రేయన్. -
జైలు నుంచి బయటకు రాబోతున్న చిన్నమ్మ!
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ మరి కొన్ని నెలల్లో జైలు నుంచి బయటకు రాబోతున్నట్టుగా తమిళనాట చర్చ జోరందుకుంది. సత్ప్రవర్తన కారణంగా ఆమెను విడుదల చేయడానికి జైళ్ల శాఖ కర్ణాటక ప్రభుత్వానికి సిఫారసు చేసి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. డిసెంబరులో చిన్నమ్మ విడుదల కావచ్చనట్టుగా అమ్మ శిబిరంలో ఎదురుచూపులు పెరగడం గమనార్హం. అన్నాడీఎంకేలో ఒకప్పుడు అమ్మ జయలలితతో కలిసి ఆమె నెచ్చెలి, చిన్నమ్మ శశికళ చక్రం తిప్పిన విషయం తెలిసిందే. 1991–96 కాలంలో వీరి అక్రమార్జనకు హద్దే లేదన్న ఆరోపణలు జోరుగానే సాగాయి. ఇందుకు తగ్గట్టుగా డీఎంకే సర్కారు అధికారంలోకి రావడంతో జయలలితతోపాటుగా చిన్నమ్మ శశికళ, వారి బంధుగణం మీద కేసుల మోత మోగాయి. ఇందులో అక్రమాస్తుల కేసు కూడా ఒకటి. తొలుత తమిళనాట, ఆ తదుపరి కర్ణాటక ప్రత్యేక కోర్టులో ఏళ్ల తరబడి సాగిన ఈ కేసు విచారణ చివరకు సుప్రీంకోర్టుకు సైతం చేరింది. ఎట్టకేలకు ఈ కేసులో సుప్రీంకోర్టు అందర్నీ దోషులుగా తేల్చింది. అయితే, అమ్మ జయలలిత మరణించడంతో, ఆమె పేరును పక్కన పెట్టి చిన్నమ్మ శశికళ, ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్లకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ 2017 ఫిబ్రవరిలో కోర్టు తీర్పు ఇవ్వడంతో సీఎం పగ్గాలు చేపట్టాలన్న ఆకాంక్షతో ఉరకలు తీసిన చిన్నమ్మ శశికళకు కారాగార వాసం తప్పలేదు. సత్ప్రవర్తనతో బయటకు వచ్చేనా..! ఈ ఏడాది ఫిబ్రవరితో చిన్నమ్మ శశికళ జైలు శిక్ష కాలం రెండేళ్లు ముగిసింది. ఈ కాలంలో ఆమె జైలులో నడుచుకున్న విధానాన్ని సత్ప్రవర్తన పరిధిలోకి కర్ణాటక అధికార వర్గాలు తీసుకొచ్చినట్టు సమాచారం. సత్ప్రవర్తనతో వ్యవహరించిన శశికళను ముందస్తుగానే విడుదల చేయడానికి తగ్గట్టుగా కర్ణాటక ప్రభుత్వానికి ఆ రాష్ట్ర జైళ్ల శాఖ సిఫారసు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీని మీద తమిళ మీడియాల్లో వార్తలు రావడంతో ఇక్కడున్న అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాల్లో ఆనందం తాండవం చేస్తోంది. అలాగే, అన్నాడీఎంకేలో ముందస్తు విడుదల అన్నది చర్చకు దారి తీసింది. కర్ణాటక జైళ్ల శాఖ సిఫారసును ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన పక్షంలో తమ చిన్నమ్మ డిసెంబరులో జైలు నుంచి బయటకు రావచ్చనట్టుగా అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. వాస్తవానికి జైలు శిక్ష కాలం 2021లో ముగుస్తుంది. అయితే, ముందుస్తుగానే ఆమెను విడుదల చేయాడానికి సన్నాహాలు సాగుతుండడం వెనుక రాజకీయ వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా..? అన్న చర్చ తమిళనాట ఊపందుకోవడం ఆలోచించాల్సిందే. అయితే, ఆమెను ఎలా సత్ప్రవర్తన కింద విడుదల చేస్తారో అన్న ప్రశ్నను సంధించే వాళ్లూ ఉన్నారు. జైలు జీవితంలో భాగంగా ఆమె ఇష్టారాజ్యంగా షాపింగ్కు వెళ్లి వస్తుండడం వంటి వీడియో దృశ్యాలు బయటకు రావడం, గతంలో కర్ణాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు కొందరు ఆ శాఖ డీజీపీ మీదే ఆరోపణలు గుప్పించిన వ్యవహారం కోర్టులో విచారణలో ఉండటం వంటి అంశాలను తెర మీదకు తెస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చిన్నమ్మ ముందస్తుగా విడుదలైన పక్షంలో తెర వెనుక రాజకీయం తథ్యం అని వ్యాఖ్యానించే వాళ్లు మరీ ఎక్కువే. -
రాజ్యసభకు మాజీ డిప్యూటీ స్పీకర్..!
సాక్షి, చెన్నై: లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలైన అన్నాడీఎంకే సీనియర్ నేత తంబిదురై రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఆయన పలుమార్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని కలసి మంతనాలు చేసినట్లు తెలుస్తోంది. 2009 నుంచి 2019 వరకు కరూర్ ఎంపీగా ఉన్న తంబిదురై గత లోక్సభలో డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. దీంతో, రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే తమిళనాడు ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ప్రస్తుతం శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం అధికార అన్నాడీఎంకేకు మూడు, ప్రతిపక్ష డీఎంకేకు రెండు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తనను రాజ్యసభకు పంపాలని పార్టీ నేతలపై తంబిదురై ఒత్తిడి తెలుస్తున్నట్లు సమాచారం. కాగా ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే దారుణ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. మరో రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. -
దక్షిణంలో హిందీ ప్రకంపనలు
హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీ పాఠ్యాంశాలను విధిగా చేర్చాలని కస్తూరీ రంగన్ కమిటీ చేసిన సిఫార్సు రాష్ట్రంలో ప్రకంపనలకు దారితీసింది. హిందీ భాషను బలవంతంగా రుద్దితే సహించేది లేదని అధికార అన్నాడీఎంకే మినహా అన్నిపార్టీలూ తమ నిరసనను వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో నిర్బంధ హిందీ అమలు చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రస్తుతం అమలులో ఉన్న విద్యావిధానాన్ని 1986లో ప్రవేశపెట్టగా, 1992లో కొన్ని సవరణలు చేశారు. సరికొత్త విద్యావిధానాన్ని తీసుకొస్తామని 2014 నాటి ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరీ రంగన్ నేతృత్వంలో తొమ్మిది మందితో కూడిన నిపుణుల కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీ తన నివేదికను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి రమేష్ పోకిరియాల్ నిషాకు శుక్రవారం సమర్పించింది. కొత్త జాతీయ విద్యాపథకం లక్ష్యాలను అందులో పొందుపరిచింది. జాతీయ విద్యావిధానాన్ని రూపొందించడం, ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల పెంపును కట్టడి చేయడం వంటి అంశాలతోపాటూ హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని నేర్పించాలని సిఫార్సు చేసింది. కమిటీ సమర్పించిన 484 పేజీలతో కూడిన ఈ నివేదికలో మూడు భాషల విధానాన్ని విధిగా అమలు చేయాలని సూచించింది. హిందీ మాట్లాడే రాష్ట్రాలు, హిందీ మాట్లాడని రాష్ట్రాలుగా రెండుగా విభజించించింది. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో ఇంగ్లిషు, ఆయా రాష్ట్రాల మాతృభాషతోపాటూ హిందీని సైతం విధిగా అభ్యసించాలని తన సిఫార్సులో పేర్కొంది. ఆరోతరగతి నుంచి నిర్బంధ హిందీ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది. సరికొత్త జాతీయ విద్యావిధానంపై ప్రజలు తమ అభిప్రాయాలను ఈనెల 30లోగా వెబ్సైట్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపింది. అయితే ఏ భాషపైనా నిర్బంధం విధించాలని ఆ కమిటీ సిఫార్సు చేయలేదని కేంద్రం చెబుతోంది. రాష్ట్రంలో ద్విభాషా విధానమే మంత్రి సెంగొట్టయ్యన్ కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టబోతున్న త్రిభాషా విద్యావిధానాన్ని రాష్ట్రంలో అనుమతించే ప్రసక్తే లేదు, ద్విభాషా విధానమే కొనసాగుతుందని పాఠశాల విద్యాశాఖా మంత్రి సెంగొట్టయ్యన్ స్పష్టం చేశారు. చెన్నైలో శనివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అనాధిగా ద్విభాషా విధానమే అమల్లో ఉంది, ఎంజీ రామచంద్రన్, జయలలిత ఆశయాలకు అనుగుణంగా తమిళం, ఇంగ్లిషు భాషలు మాత్రమే పరిగణనలో ఉన్నాయి. ఇకపై కూడా అదే విధానం కొనసాగుతుందని ఆయన అన్నారు. దినకరన్ నిరసన హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని ఒక పాఠంగా చేర్చడంపై అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ నిరసన ప్రకటించారు. ఈ విధానం హిందీ మాట్లాడని వారిని ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం వెంటనే హిందీ నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని కోరారు. కనిమొళి ఖండన హిందీ భాషను బలవంతంగా రుద్దితే డీఎంకే అడ్డుకుంటుందని ఆ పార్టీ అగ్రనేత, లోక్సభ సభ్యురాలు కనిమొళి హెచ్చరించారు. శనివారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, కొత్త విద్యావిధానం కింద ఇంగ్లిషు తరువాత హిందీ పాఠ్యాంశాన్ని విధిగా అభ్యసించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో హిందీకి వ్యతిరేకంగా డీఎంకే గళం వినిపిస్తానని చెప్పారు. కమల్హాసన్ ఖండన తమిళభాషతో ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉండగా హిందీని బలవంతంగా రుద్దడం సరికాదని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్హాసన్ ఖండించారు. తిరుచ్చిరాపల్లి విమానాశ్రయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ తమిళం కాదని హిందీపై నిర్బంధించడం తనకు బాధ కలిగిస్తోందని అన్నారు. ప్రజలపై ఏ భాషను బలవంతంగా రుద్దడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. నిర్బంధ హిందీని అమలుచేస్తే ఆందోళన తప్పదని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో కేంద్రాన్ని హెచ్చరించారు. -
తమిళనాడు >>> డీఎంకే
డేట్ లైన్ – చెన్నై తమిళనాడు ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇంకో నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని 39 లోక్సభ స్థానాలకు, కచ్చితంగా నెల తరువాత రాష్ట్రంలోని 22 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరగడం మామూలే కానీ. తమిళ రాజకీయ దిగ్గజాలు పురచ్చితలైవి జయలలిత, కళైజ్ఞర్ కరుణానిధి లేకుండా పోలింగ్ జరుగుతుండటం విశేషం. అందుకేనేమో.. వీరు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు నేతలు, కార్యకర్తలు. ప్రస్తుతం తమిళనాట పార్టీల్లో ఎలాగైనా గెలవాలన్న ఆరాటం కనిపిస్తోందే కానీ.. ఓ స్ఫూర్తిమంతమైన పోరాటం చేసే వారిగా మాత్రం అధినేతలు కనిపించడం లేదు. జాతీయ అంశాలకే ప్రాధాన్యం.. జరుగుతున్నవి లోక్సభ ఎన్నికలు కాబట్టి.. సహజంగానే ఈ ఎన్నికల్లో జాతీయ అంశాలే ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. కాకపోతే బీజేపీతో పొత్తుపెట్టుకుని బరిలోకి దిగిన అన్నాడీఎంకే, దాని మిత్రపక్షాలు మోదీ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నాయి. సోషల్ మీడియాలో బీజేపీ అభిమానులు పెట్టిన పోస్టులు మినహా అధికారికంగా, విశ్వాసంతో మోదీ ప్రభుత్వం గురించి ప్రజలకు చెప్పడంలో స్థానిక బీజేపీ నాయకులే తడబడుతున్నారు. అన్నాడీఎంకే నేతల సంగతి ఇంతకంటే భిన్నంగా ఏమీ లేదు. ఈ రెండు పార్టీల ప్రత్యర్థిగా ఉన్న డీఎంకే మాత్రం మోదీ వ్యతిరేక ప్రచారంలో పై చేయి సాధించింది. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు ఎదుర్కొన్న ఇక్కట్లను ఏకరువు పెట్టడంలో డీఎంకే ఫ్రంట్ చాలా వరకు విజయం సాధించింది. అంతేకాకుండా అన్ని వర్గాల విద్యార్థులు ఎంబీబీఎస్లో చేరేందుకు వీలు కల్పించే నీట్ పరీక్షను కూడా మోదీకి వ్యతిరేకంగా వాడుకునేందుకు డీఎంకే ప్రయత్నిస్తోంది. ఈ పరీక్ష కారణంగా ప్రైవేట్ కళాశాలల వ్యాపారం దారుణంగా దెబ్బతినడం ఇందుకు కారణం. ప్రైవేట్ కళాశాలలను నిర్వహిస్తున్న జగద్రక్షకన్ వంటి రాజకీయ నేతలు డీఎంకేలోనే ఉన్నారు. కావేరీ నదీ పరీవాహక ప్రాంతంలో గుర్తించిన సహజవాయు, ముడిచమురు నిక్షేపాలను వెలికితీసే విషయంలోనూ డీఎంకే కేంద్రానికి వ్యతిరేకంగా నిలుస్తోంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టులను గతంలో డీఎంకే హయాంలోనే ప్రారంభించారు. అప్పటి వల్ల అన్ని రకాలుగా ప్రయోజనాలు పొందిన డీఎంకే ఇప్పుడు వాటిని వ్యతిరేకించడం విడ్డూరమే అయినా దీన్ని అనుకూలంగా మలుచుకోవడంలో డీఎంకే విజయవంతమైంది. మీడియా మద్దతు కూడా డీఎంకేకు ప్లస్ పాయింట్. ఎందుకంటే , పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం కేంద్రం మద్దతుతో పత్రికా స్వేచ్ఛను అణచివేస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. చెదరని అమ్మ ఓటుబ్యాంకు అన్నాడీఎంకే విషయానికొస్తే జయలలిత ఓటుబ్యాంకు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కానీ శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ 15 శాతం వరకు ఓట్లను తనకు అనుకూలంగా చీల్చడంలో విజయం సాధిస్తారని పరిశీలకులు చెబుతున్నారు. ఒకవైపు దినకరన్, మరోవైపు డీఎంకే ఫ్రంట్లతో తలపడుతున్న పళనిస్వామి, పన్నీరుసెల్వం వర్గాలు జయలలితకు తామే నిజమైన వారసులమని చెబుతూ ఆవిడ ఆశయాలను పథకాలను కొనసాగిస్తామని ప్రజలకు చెప్పడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. దినకరన్ ఆర్కేనగర్లో చేసిన ప్రయోగాన్ని తిరిగి ఇప్పుడు కూడా మరింత పకడ్బందీగా చేసి అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించి కేంద్రంలో కింగ్ మేకర్గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ స్థానాలలో ఎనిమిది స్థానాలు దక్కించుకోగలిగితే పళనిస్వామి ప్రభుత్వానికి ఈ పదవీకాలం ముగిసే వరకు ఢోకా లేదు. ఒకవేళ డీఎంకే లేదా దినకరన్కు ఎక్కువ స్థానాలు దక్కితే అధికార పీఠాన్ని కాపాడుకోవలసిన పరీక్ష మళ్లీ అన్నాడీఎంకేకు తప్పదు. కులాలవారీగా ఇక్కడ కూడా ప్రజలు చీలిపోయి ఉన్నారు. కుంభకోణాల పార్టీలుగా డీఎంకే, కాంగ్రెస్ను కలిపి అభివర్ణిస్తూ కేంద్రంలో గత ఎన్నికలలో కాంగ్రెస్ పతనానికి దారితీసిన అవినీతి కుంభకోణాలను ఏకరువుపెడుతూ పళనిస్వామి డీఎంకే ఫ్రంట్ను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అవినీతిని ఒక అంశంగా ఓటర్లు పరిగణించే కాలం పోయింది కాబట్టి ఈ ప్రచారం ఎంతవరకు అన్నాడీఎంకే కు ఉపయోగపడుతుందో చెప్పలేము. మోదీపై వ్యతిరేకత? తమిళనాడులో బీజేపికి ఉన్న ఓటు బ్యాంకు 3–4 శాతానికి మించి లేనప్పటికీ.. మోదీపై ఉన్న వ్యతిరేకత ప్రభావం మాత్రం అన్నాడీఎంకే ప్రభుత్వంపై పడుతోంది. దాని ప్రభావం డీఎంకేకు లభించవచ్చు. స్టాలిన్ గొప్ప నాయకుడు కాకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ అండతో ఒక ప్రత్యామ్నాయం కావాలనుకునే వారికీ ఆశాకిరణంగా నిలిచారనే చెప్పాలి. రెండు ద్రావిడ పార్టీలలో ఏదో ఒక దానికి పగ్గాలు అందివ్వడం తమిళనాట సంప్రదాయంగా వస్తోంది కాబట్టి.. అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతున్న పార్టీ కంటే డీఎంకేకు మద్దతివ్వడం మేలని ప్రజలు ఆలోచిస్తున్నారు. సముద్ర తీరం వెంబడి తిరువళ్లూరు నుంచి కన్యాకుమారి వరకు 15 లోక్సభ స్థానాలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారాయి. అందుకే ఇప్పుడు అన్ని పార్టీలు మత్స్యకారులను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఓఖీ తుపాను సమయంలో రాహుల్ గాంధీ పర్యటించి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేంద్రం అండతో అభివృద్ధి నిరాటంకంగా కొనసాగిస్తామని డీఎంకే ప్రచారం చేస్తోంది. ఎక్కువ స్థానాల్లో గెలిపిస్తే మనకు మద్దతు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేపడుతుందని డీఎంకే ఫ్రంట్, బీజేపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అన్నాడీఎంకే ప్రచారం చేస్తున్నాయి. ఇన్ని అనిశ్చితాలు, అసత్య ప్రచారాలు, వైరుధ్యాల మధ్య తమిళ ప్రజల తీర్పు ఎవరిని గెలిపిస్తుందో చూడాలి. -
అమ్మ చనిపోయాక మోదీనే ‘నాన్న’
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తరువాత రాష్ట్ర ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ తండ్రిలా ఆదరిస్తున్నారని ఆ రాష్ట్ర మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ వ్యాఖ్యానించారు. అమ్మలేని (జయలలిత) తమ పార్టీకి మోదీ తండ్రిలా వ్యవహరిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వమంతా మోదీ అదేశాల మేరకే పనిచేస్తోందని, ఆయన దేశానికి కూడా తండ్రిలాండి వాడని మంత్రి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తుపై ఓ విలేకరి ప్రశ్నకు ఆయన ఈ విధంగా జవాబిచ్చారు. కాగా జయలలిత మరణాంతరం సంభవించిన అనేక పరిణామాల వెనుక బీజేపీ హస్తముందని విపక్షాలు అనేకసార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీతో పొత్తు వద్దు రజనీకాంత్పై అన్నాడీఎంకే ఫైర్ శశికళను జైలుకు పంపడం, పళనిస్వామి, పన్నీరు శెల్వం మధ్య ఏకాభిప్రాయం కుదర్చడంలో కేంద్ర ప్రభుత్వం పెద్దల హస్తముందని ఆమధ్య వార్తలు గట్టిగానే వినిపించాయి. ఆ సందేహాలన్నింటికీ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ సమాధానం చెప్పకనే చెప్పారు. ఇదిలావుండగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఏంకే మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 39 సీట్లకుగాను బీజేపీ ఐదు స్థానాలకు, పీఎంకే ఆరు స్థానాలకు పోటీ చేసేందుకు అవగాహన కుదిరింది. మిగతా అన్ని స్థానాలకు ఏఐఏడిఎంకేనే పోటీ చేస్తుందని ఇటీవల ప్రకటించింది. -
మళ్లీ కోర్టుకు రెండాకులు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం వ్యవహారం మళ్లీ కోర్టుకు చేరింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ అప్పీలుకు వెళ్లారు. మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్నాడీఎంకే విజయ చిహ్నం రెండాకులు. డీఎంకే నుంచి బయటకు వచ్చినానంతరం ఎంజీఆర్ అన్నాడీఎంకే ఆవిర్భావం, విజయచిహ్నంగా రెండాకులను పరిచయం చేశారు. నాటి నుంచి రెండాకులు ప్రజల హృదయాల్లో పదిలమైంది. ఎంజీఆర్ మరణం తదుపరి పరిణామాలతో ఈ చిహ్నంకు సమస్య తప్పలేదు. తాజాగా అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో చిహ్నం కష్టాలు ఎక్కువే. ఈ చిహ్నం కోసం పెద్ద సమరమే సాగుతూ వస్తున్నది. తొలుత ఈ చిహ్నం కోసం పన్నీరుసెల్వం, పళనిస్వామిల మధ్య సమరం సాగింది. ఈ ఇద్దరు ఏకం కావడంతో దినకరన్ రూపంలో చిహ్నం కష్టాలు తప్పడం లేదు. ఈ చిహ్నాన్ని కైవసం చేసుకునేందుకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం దినకరన్ తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. ఏడాదిన్నర కాలంగా న్యాయపోరాటం చేస్తూ వస్తున్నారు. చివరకు ఈ చిహ్నం వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గత నెల వెలువడ్డ తీర్పులో రెండాకుల చిహ్నం పళని, పన్నీరుల నేతృత్వంలోని అన్నాడీఎంకే సమన్వయ కమిటీకే చెందుతుందని ప్రకటించారు. దీంతో అన్నాడీఎంకే వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. ఇక, చిహ్నం కష్టాలు, సమస్య తీరినట్టేనన్న ఆనందంలో మునిగారు. అయితే, దినకరన్ మాత్రం పట్టువదలడం లేదు. ఆ చిహ్నం కైవసం చేసుకునేందుకు మళ్లీ న్యాయ పోరాటం బాటపట్టారు. పిటిషన్: రెండాకుల చిహ్నాన్ని అన్నాడీఎంకేకు కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దినకరన్ అప్పీలుకు రెడీ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు స్టే విధించి, రెండాకుల చిహ్నం విషయంగా విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ దినకరన్ తరఫున మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో మళ్లీ చిహ్నం టెన్షన్ మొదలైంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చిహ్నం వ్యవహారంలో కోర్టు ఏదేని ఉత్తర్వులు ఇచ్చిన పక్షంలో సంక్లిష్ట పరిస్థితులు తప్పదన్న ఆందోళన అన్నాడీఎంకేలో బయలు దేరింది. గత నెల తీర్పు వెలువరించే సమయంలో అన్నాడీఎంకే వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ బయలు దేరిన విషయం తెలిసిందే. తాజాగా దినకరన్ అప్పీలు రూపంలో ఏదేని కొత్త చిక్కులు వచ్చేనా అన్న ఆందోళన తప్పడం లేదు. -
రోడ్డు ప్రమాదంలో ఎంపీ దుర్మరణం
సాక్షి, చెన్నై : ఏఐఏడీఎంకే ఎంపీ రాజేంద్రన్ (62) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. శనివారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న వాహనం విల్లుపురం జిల్లా దిండివనమ్ సమీపంలో ప్రమాదానికి గురైంది. వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొనటంతో ఎంపీ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి అతి వేగమే కారణంగా తెలుస్తోంది. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా రాజేంద్రన్ 2014 లోక్సభ ఎన్నికల్లో విల్లుపురం నుంచి ఎన్నికయ్యారు. ఎంపీ మృతి పట్ల ఏఐఏడీఎంకే పార్టీ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. రాజేంద్రన్ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపింది. -
అన్నా డీఎంకే, పీఎంకేలతో బీజేపీ దోస్తీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో కలసిపోటీచేయాలని అధికార అన్నా డీఎంకే, బీజేపీ, పట్టాలి మక్కల్ కచ్చి(పీఎంకే) పార్టీలు నిర్ణయించాయి. ఈ మేరకు మంగళవారం మూడు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. మరిన్ని తమిళ పార్టీలు ఈ కూటమిలో చేరే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 39 లోక్సభ స్థానాల్లో బీజేపీ 5 చోట్ల, పీఎంకే 7 స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి. ఇతర మిత్రపక్షాలు కూడా ఖరారైన తరువాత అన్నా డీఎంకే ఎన్ని సీట్లలో పోటీచేస్తుందో స్పష్టత వస్తుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తొలుత పీఎంకే వ్యవస్థాపకుడు రామదాస్, ఆయన కొడుకు అన్బుమణి రామదాస్తో సమావేశమై చర్చలు జరిపిన సీఎం పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్సెల్వం ఆ తరువాత కేంద్ర మంత్రి, తమిళనాడు బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందంతో భేటీ అయి వేర్వేరుగా ఒప్పందం చేసుకున్నారు. తమిళనాడుతో పాటు పుదుచ్చేరి(1 లోక్సభ స్థానం)లోనూ ఈ కూటమి కొనసాగుతుందని తెలిపారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీలోని 21 స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో అన్నా డీఎంకేకు మద్దతు ఇచ్చేందుకు బీజేపీ, పీఎంకే అంగీకరించాయి. విజయ్కాంత్కూ ఆహ్వానం? అంతకుముందు, గోయల్.. డీఎండీకే అధ్యక్షుడు విజయ్కాంత్తో సమావేశం కావడంతో ఆ పార్టీ కూడా ఈ కూటమిలో చేరే అవకాశాలున్నట్లు ఊహాగానాలొచ్చాయి. తమ మెగా కూటమి విజయం సాధిస్తుందని పన్నీర్ సెల్వం ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళుల హక్కుల సాధన కోసం పది డిమాండ్లను లేవనెత్తామని, అందులో కావేరి డెల్టాను రక్షిత వ్యవసాయ జోన్గా ప్రకటించడం, రాష్ట్రంలో కుల ఆధారిత జనగణన నిర్వహించడంలాంటివి ఉన్నాయని రామదాసు చెప్పారు. -
బీజేపీతో పొత్తు వద్దు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే–బీజేపీ పొత్తుకు వ్యతిరేకంగా అధికార పక్షం మిత్రుల్లో వ్యతిరేకత మొదలైంది. అన్నాడీఎంకే చిహ్నంతో అసెంబ్లీ మెట్లు ఎక్కిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ కూటమికి వ్యతిరేకంగా ఆదివారం గలం విప్పారు. ఇది కాస్త అన్నాడీఎంకే సమన్వయ కమిటీని ఇరకాటంలో పెట్టింది. ముగ్గురు ఎమ్మెల్యేలు వ్యతిరేక స్వరాన్ని అందుకోవడంతో వారిని బుజ్జగించేందుకు సిద్ధమయ్యారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్ర పక్షాలు సైతం రెండాకుల చిహ్నంపై పోటీ చేయాల్సిందేనన్న హుకుంను అమ్మ జయలలిత జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అన్నాడీఎంకే కూటమిలోకి వచ్చిన మనిదనేయ జననాయగ కట్టి నేత తమీమున్ అన్సారి, కొంగు ఇలంజర్ పేరవై తనియరసు, ముక్కళత్తోర్ పులిపడై కరుణాస్ రెండాకుల చిహ్నంతో అసెంబ్లీ మెట్లు ఎక్కారు. అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో ఈ ముగ్గురు సీఎం పళనిస్వామికి అనుకూలంగానే వ్యవహరించారు. మధ్యలతో ఈ ముగ్గురు డీఎంకేకు దగ్గరయ్యే దిశగా ప్రయత్నాలు చేసినా, అక్కడ తలుపులు తెరచుకోలేదు. అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగుర వేయడం, ఈ ముగ్గురికి కలిసి వచ్చిన అంశం. అయితే, కరుణాస్ మాత్రం సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా గళం విప్పి కటకటాల పాలు కాక తప్పలేదు. చివరకు సీఎంకు జైకొట్టి అమ్మ ప్రభుత్వానికే మద్దతు అంటూ కాలం నెట్టుకువస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏ నిర్ణయమైనా కలిసి చర్చించి తీసుకునే ఈ ముగ్గురు మిత్రపక్షాల ఎమ్మెల్యేలు తాజాగా బీజేపీకి వ్యతిరేక స్వరాన్ని అందుకున్నారు. వ్యతిరేక స్వరం : బీజేపీతో పొత్తు, సీట్ల పందేరాన్ని కొలిక్కి తెచ్చి దివంగత అమ్మ జయలలిత జయంతి సందర్భంగా కూటమిని ప్రకటించాలన్న యోచనలో ఉన్న సమన్వయ కమిటీకి షాక్ ఇచ్చే రీతిలో ఆదివారం ఆ ముగ్గురు తెరపైకి వచ్చారు. ఈ నెల 24న తమ జట్టును, ఆ తదుపరి ఆశావహుల ఇంటర్వూ్యలపై దృష్టి పెట్టేందుకు సిద్ధం అవుతున్న సమన్వయ కమిటీని తమీమున్ అన్సారీ, కరుణాస్, తనియరసు ఇరకాటంలో పెట్టే పనిలో పడ్డారు. తమీమ్ పేర్కొంటూ, మైనారిటీల మద్దతు తమిళనాడులో అన్నాడీఎంకేకు పుష్కలంగా ఉందన్న విషయాన్ని సమన్వయ కమిటీ పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. మైనారిటీలకు వ్యతిరేకంగా వ్యవహరించే బీజేపీతో చేతులు కలిపితే తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు. అందుకే ఈ పొత్తును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. కరుణాస్ పేర్కొంటూ, అమ్మ ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. మోదీకి వ్యతిరేకంగా నిలబడి, రాష్ట్రంలో 37 స్థానాల్ని అమ్మ గత ఎన్నికల్లో చేజిక్కించుకున్న విషయాన్ని గుర్తెరగాలని హితవు పలికారు. తనియరసు పేర్కొంటూ, నీట్ రూపంలో తమిళ విద్యార్థులకు ఉన్నత చదువులు దూరం అయ్యాయని, జలాశయాల విషయంలో కొత్త నాటకాలు తెరపైకి తెచ్చారని, తమిళనాట ప్రగతిని అడ్డుకునే రీతిలో వ్యవహరించిన బీజేపీ పాలకులతో దోస్తీ కట్టడాన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. అన్నాడీఎంకే తన నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తే మంచిదని లేనిపక్షంలో నష్టాలు, కష్టాలు తప్పదని హెచ్చరించారు. బుజ్జగింపులు: అన్నాడీఎంకే సర్కారు అసలే సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. కొందరు ఎమ్మెల్యేలు ఇటు వైపు ఉన్నా, ఎటువైపు అమ్మమక్కల్ మున్నేట్ర కళగం దినకరన్కు జై కొడతారో అన్న భయం పాలకుల్ని వెంటాడుతూ వస్తున్నది. అలాగే, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు చేజారి పక్షంలో ప్రభుత్వం కష్టాల్లో పడ్డట్టే అన్న ఆందోళన మొదలైంది. దీంతో ఈ ముగ్గుర్ని బుజ్జగించి దారికి తెచ్చుకునేందుకు సీనియర్ మంత్రులు రంగంలోకి దిగి ఉండడం గమనార్హం. -
చిన్నమ్మ ఆస్తులు జప్తు?
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ అండ్ బృందానికి శనివారంతో రెండేళ్ల జైలు శిక్ష ముగిసింది. మరో రెండేళ్ల శిక్షా కాలం అనుభవించాల్సి ఉంది. ఇంత వరకు ఈ ముగ్గురు తలా రూ. పది కోట్ల జరిమానా చెల్లించని దృష్ట్యా, వారి ఆస్తులు జప్తు అయ్యేనా అన్న ప్రశ్న మొదలైంది. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చిన్నమ్మ శశికళ సీఎం ఆశల్ని అడియాసలు చేసిన విషయం తెలిసిందే. అమ్మ జయలలిత మరణంతో ఆమెను దోషిగా పేర్కొన్నా, కేసు నుంచి తప్పించారు. ఇక, ఆమె నెచ్చెలి, చిన్నమ్మ శశికళ, బంధువులు ఇలవరసి, సుధాకరన్ జైలు శిక్ష ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ముగ్గురికి తలా నాలుగేళ్లు జైలు శిక్షను సుప్రీంకోర్టు విధించింది. దీంతో 2017 ఫిబ్రవరి 15న సాయంత్రం బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో చిన్నమ్మ అండ్ బృందం లొంగిపోయారు. అప్పటి నుంచి జైలుకే పరిమితం అయ్యారు. ఈ మధ్య కాలంలో చిన్నమ్మ శశికళ, ఇలవరసి లగ్జరీ జీవితాన్ని జైల్లో అనుభవిస్తుండడం వెలుగులోకి వచ్చింది. దీనిపై కర్ణాటక సర్కారు విచారణను సైతం ముగించింది. ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ అండ్ బృందం జైలుకు వెళ్లి రెండేళ్లు అవుతోంది. శనివారంతో వారి శిక్షలో సగం కాలం గడిచింది. మిగిలిన రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. అయితే, జైలులో సత్ప్రవర్తన కారణంగా శశికళ ముందస్తుగా కూడా విడుదల కావచ్చనట్టుగా కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. రూ.పది కోట్ల జరిమానా: జైలు శిక్ష తీర్పు సమయంలో ఆ ముగ్గురికి తలా రూ. పది కోట్లు చొప్పున జరిమానాను సుప్రీంకోర్టు విధించింది. అయితే, ఇంత వరకు ఆ ముగ్గురు జరిమానాను చెల్లించనట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఈ జరిమానా కేసును తొలుత తమ గుప్పెట్లోకి తీసుకున్న తమిళనాడు ఏసీబీ నేతృత్వంలో వసూలు చేయాలా..? లేదా, కేసును నడిపిన కర్ణాటక ప్రత్యేక కోర్టులో చెల్లించాలా అన్న ప్రశ్న తలెత్తడంతో ఇంతకాలం ఆ జరిమానా గురించి ఎవ్వరూ పట్టించుకోనట్టు సమాచారం. శిక్షా కాలంలో సగం రోజులు గడవడంతో తాజాగా ఆ జరిమానా వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు సంప్రదింపులు జరిపి, జరిమానా వసూలు వ్యవహారంలో ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని ఏసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక వేళ ఆ మొత్తాన్ని ఆ ముగ్గురు చెల్లించని పక్షంలో కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మేరకు ఆస్తుల జప్తునకు ఆస్కారం ఉందంటున్నారు. -
తంబీలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే మెగా కూటమి వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సిద్ధం అవుతున్నారు. అన్నాడీఎంకే కమిటీ సంప్రదింపులు జరిపి, కూటమిని ఖారారు చేయడానికి వ్యూహరచన చేసి ఉన్నారు. రాష్ట్ర ఇన్చార్జ్ పీయూష్ గోయల్ ద్వారా వ్యూహాల్ని అమలు చేయించబోతున్నారు. కాగా, అన్నాడీఎంకే మీద సీట్ల ఒత్తిడి పెంచేందుకు అమిత్ షా సిద్ధం అయితే, పార్లమెంట్ వేదికగా బీజేపీ ప్రభుత్వం మీద అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై విరుచుకుపడటం గమనార్హం. రాష్ట్రంలో మెగాకూటమి లక్ష్యంగా సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ తీవ్ర కసరత్తుల్లో మునిగి ఉన్న విషయం తెలిసిందే. జాతీయ పార్టీ బీజేపీ, పీఎంకే, డీఎండీకే, పుదియ తమిళగం, పుదియ నిధి, ఐజేకే, ఎస్ఎంకేలతో పాటుగా మరికొన్ని చిన్న పార్టీల్ని కలుపుకుని మెగా కూటమికి చర్యలు చేపట్టి ఉన్నారు. ఆయా పార్టీల తరఫున ప్రతినిధులు అన్నాడీఎంకే పొత్తు చర్చల కమిటీతో రహస్య మంతనాల్లో మునిగి ఉన్నారు. ఈ మంతనాల జోరు, సంక్లిష్ట పరిస్థితుల మధ్య సాగుతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ప్రధానంగా బీజేపీ కీలక స్థానాల్ని గురిపెట్టి ఉండటం అన్నాడీఎంకేను సందిగ్ధంలో పడేసింది. తమకు బలం ఉన్న నియోజకవర్గాల్నే బీజేపీ ఆశిస్తుండటంతో మల్లగుల్లాలు తప్పడం లేదు. ఆ స్థానాల్ని ఇచ్చే ప్రసక్తే లేదన్నట్టుగా అన్నాడీఎంకే కమిటీ తేల్చింది. బీజేపీ ఆశిస్తున్న వాటిని ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిన ఆ కమిటీ, కేవలం కన్యాకుమారి, తిరునల్వేలి, కోయంబత్తూరు, దక్షిణ చెన్నై, పెరంబలూరు, తెన్కాశి, వేలూరు సీట్లను మాత్రమే అప్పగించేందుకు సిద్ధమైనట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అమిత్ షా దృష్టి: తాము కోరిన స్థానాల్ని అన్నాడీఎంకే ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఇక, స్వయంగా తానే రంగంలోకి దిగాలన్న నిర్ణయానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చి ఉన్నారు. అన్నాడీఎంకే కమిటీలోని మంత్రులు ఇప్పటికే పీయూష్ గోయల్తో పలుమార్లు సంప్రదింపులు జరిపినట్టుగా సంకేతాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా తానే రంగంలోకి దిగి వ్యూహాలకు పదును పెట్టేందుకు అమిత్ షా రెడీ అవుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ తనదృష్టిని అంతా తమిళనాడు మీదే ప్రస్తుతం ఉంచిన దృష్ట్యా, తాము గురిపెట్టి ఉన్న స్థానాల్ని అన్నాడీఎంకే మీద ఒత్తిడి తెచ్చి మరీ లాక్కునేందుకు తగ్గట్టుగా అమిత్ షా సంప్రదింపులు సాగే అవకాశాలు ఉన్నట్టు కమలనాథులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వైద్యచికిత్సల అనంతరం విదేశాల నుంచి స్వదేశానికి చేరుకున్న దృష్ట్యా, ఆయన బాధ్యతల్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఉన్న పీయూష్ గోయల్కు విరామం లభించినట్టే అని పేరొంటున్నారు. రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్గా నియమితులైన పీయూష్ గోయల్ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగబోతున్నారు. పీయూష్ ద్వారా తన వ్యూహాలకు పదును పెట్టించడమే కాదు, తానే తమిళనాడుకు వచ్చి అన్నాడీఎంకే సమన్వయ కమిటీ మీద ఒత్తిడి పెంచేందుకు నిర్ణయించి ఉన్నట్టుగా కమలనాథులు పేర్కొంటున్నారు. తంబి స్వరం: ఆది నుంచి బీజేపీతో పొత్తును బహిరంగంగా అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై వ్యతిరేకిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా మీడియా ముందు తీవ్రంగానే స్పందిస్తూ వస్తున్న తంబిదురై తాజాగా పార్లమెంట్ వేదికగా విరుచుకు పడటం గమనార్హం. అన్నాడీఎంకే సీనియర్గా ఉన్న తంబిదురై వ్యాఖ్యలను పార్టీలో ఏ ఒక్కరూ ఖండించడం లేదు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయంగానే భావిస్తూ వస్తున్నారు. అయితే, ఇదంతా అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కనుసన్నల్లో సాగుతున్న వ్యవహారం అన్న ప్రచారం కూడా ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా తంబిదురై ద్వారా ఓ వైపు గళాన్ని వినిపింప చేస్తూ, మరో వైపు వారి ఒత్తిళ్లకు తలొగ్గకుండా అన్నాడీఎంకే జా›గ్రత్తగానే వ్యవహరిస్తోంది. తాజాగా సీట్ల పందేరాలు, చర్చలు సంక్లిష్టంగా మారిన దృష్ట్యా, ఏకంగా పార్లమెంట్ వేదికగా తంబి తన స్వరాన్ని పెంచడం గమనార్హం. ప్రధానంగా ప్రధాని నరేంద్రమోదీని గురిపెట్టి ఆయన వ్యాఖ్యల తూటాల్ని పరోక్షంగా పేల్చడం ఆలోచించ దగ్గ విషయం. బీజేపీ ప్రభుత్వం అన్ని రకాలుగా కేంద్రంలో విఫలం అయిందని ధ్వజమెత్తుతూ, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ దిశగా వ్యాఖ్యల్ని తంబి సంధించారు. చివరకు తామేమి భిక్ష’గాళ్లమా..? అన్నట్టుగా విరుచుకుపడటం, జీఎస్టీ వ్యవహారంలో తమిళనాడుకు కేటాయింపు వ్యవహరాన్ని అస్త్రంగా చేసుకుని తంబి స్వరాన్ని పెంచడం కమలనాథుల్ని విస్మయంలో పడేసినట్టు అయ్యింది. -
అన్నాకు ఘన నివాళి
సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై 50వ వర్ధంతిని ఆదివారం వాడవాడలా ద్రవిడ పార్టీలు ఘనంగా జరుపుకున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకే, ఎండీఎంకే, ద్రవిడ కళగంల నేతలు మెరీనా తీరంలోని అన్నా సమాధి వద్దకు తరలివచ్చి పుష్పాంజలి ఘటించారు. డీఎంకే నేతృత్వంలో శాంతి ర్యాలీలు నిర్వహించారు. అన్నా చిత్ర పటానికి సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం నివాళులర్పించారు. అన్నాడీఎంకే నేతృత్వంలో ఆలయాల్లో సహఫంక్తి భోజనాలు ఏర్పాటుచేశారు. అన్నాడీఎంకే నేతృత్వంలో.. అన్నాడీఎంకే నేతృత్వంలో రాష్ట్రంలో అన్నా వర్ధంతిని పురస్కరించుకుని వాడవాడల్లో కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే, సహఫంక్తి భోజనాలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం తమ నివాసాల వద్ద అన్నా చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో కలసి మెరీనా తీరంలోని అన్నా సమాధి వద్దకు చేరుకుని ఘన నివాళులర్పించారు. అన్నా ప్రసంగాలు, ఆయన సేవల్ని నెమరువేసుకున్నారు. కేపీ మునుస్వామి, వైద్యలింగం వంటి నేతలు, మంత్రి జయకుమార్లతో పాటుపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పలువురు తరలి వచ్చి అన్నాకు నివాళులర్పించారు. తదుపరి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అన్నాడీఎంకే వర్గాలు పలుచోట్ల ఉన్న ఆలయాలకు చేరుకుని, ప్రజలతో కలసి సహఫంక్తి భోజనాలు చేశారు. కేకే నగర్లోని శక్తి వినాయక ఆలయంలో సీఎం పళనిస్వామి పూజలుచేశారు. అక్కడ ప్రజలతో కలిసి సహçపంక్తి భోజనం చేశారు. తిరువాన్మియూరులోని మరుందీశ్వర ఆలయంలో డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం పూజలు చేశారు. సహపంక్తి భోజన కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రులు దాదాపుగా 30 మంది చెన్నైలోని వివిధ ఆలయాల్లో పూజల అనంతరం ప్రజలతో కలిసి సంహపంక్తి భోజనాలు చేశారు. -
బీజేపీతో పొత్తా.. డిపాజిట్లు గల్లంతే
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేకి అమ్మలేని లోటు తీర్చలేనిది. జయలలిత స్థాయిలో చరిష్మా కలిగిన నేత లేకపోవడం ప్రస్తుతం ఆ పార్టీకి పెద్ద సవాలుగా మారింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పరపతి కలిగి ఉండి కనీస స్థాయిలోనైనా ఓటర్లు ఆకట్టుకునే నాయకుడు ఆపార్టీ లేడనే చెప్పాలి. ముఖ్యమంత్రి ఎడపాడి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం మొదలుకుని అందరూ తమ నియోజవర్గాలకు పరిమితమైన వారే. ఇటువంటి బలహీనమైన స్థితిలో పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోవడం అంటే ఆషామాషీకాదు. పైగా సమీప ప్రత్యర్థి పార్టీ డీఎంకేకు స్టాలిన్ వంటి బలమైన నాయకుడు ఉన్నాడు. కరుణానిధి వారసుడిగా తగిన స్థాయిలో ప్రజాకర్షణ కూడా ఉంది. ఒకవైపు అమ్మలేని లోటు, మరోవైపు దీటైన స్టాలిన్తో పోటీపడడం అన్నాడీఎంకేకి బలహీనంగా మారింది. ఈ స్థితిని గట్టెక్కాలంటే ఎన్నికల్లో పొత్తు తప్పనిసరి అనే సత్యాన్ని అన్నాడీఎంకే అగ్రనేతలు ఏనాడో గ్రహించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటీవలి పొత్తుపై దృష్టిసారించారు. అమ్మ కన్నుమూసిన తరువాత బలహీనంగా మారిన అన్నాడీఎంకే ప్రభుత్వం కేంద్రం కనుసన్నల్లో నడవకతప్పలేదు. ప్రధాని మోదీ తెరవెనుక నుంచి ఆశీర్వాదంతోనూ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారు. ఈదశలో బీజేపీతో పొత్తు అనివార్యం అన్న స్థితిలోకి అన్నాడీఎంకే పడిపోయింది. ‘అమ్మ’లేని అనాథగా మిగిలిన అన్నాడీఎంకేని ఆసరాగా చేసుకుని అధికారంలోకి రావాలని బీజేపీ ఆశిస్తోంది. అన్నాడీఎంకే అగ్రజులైన పన్నీర్సెల్వం, ఎడపాడి సైతం బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే మంత్రులు, పార్టీలోని సీనియర్ నేతలు కమలనాథులవైపు కన్నెత్తిచూసినా కరుసై పోతామని హెచ్చరిస్తున్నారు. ‘జయ జీవించి ఉండగా బీజేపీతో ఎంతటి స్నేహం చేసినా ఎన్నికల్లో పొత్తుకు సిద్ధం కాలేదు.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరవాత పరిస్థితిని బట్టీ బీజేపీకి అండగా నిలిచేవారు.. మనం కూడా అదే తీరులో వ్యవహరిస్తాం’ అని మెజార్టీ నేతలు ఎడపాడి, పన్నీర్పై ఒత్తిడిచేస్తున్నారు. బీజేపీని కాదనే ధైర్యం లేక, పార్టీలోని ముఖ్యనేతల సూచనలను ధిక్కరించలేక పన్నీర్, ఎడపాడి మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక ఇతర ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే అన్నాడీఎంకేతో పొత్తుపై పీఎంకే దోబూచులాడుతోంది. ఇటీవలి వరకు సుముఖంగా ఉండిన పీఎంకే తాజాగా ఆలోచనలో పడింది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ రానున్నట్లు కొన్ని సర్వేలు స్పష్టం చేయడం వల్ల బీజేపీ, అన్నాడీఎంకేతో కలిసి నడిస్తే నష్టమని పీఎంకే అనుమానిస్తోంది. పైగా గత యూపీఏ ప్రభుత్వంలో పీఎంకే అగ్రనేత అన్బుమణి రాందాస్ కేంద్రమంత్రిగా వ్యవహరించారు. ఒకేవేళ కాంగ్రెస్సే అధికారంలోకి వస్తే మరోసారి కేంద్రమంత్రి అయ్యే అవకాశం కోల్పోతామని అన్నాడీఎంకేతో పొత్తుకు వెనకడగు వేస్తోంది. ఇక బీజేపీ వైపు నుంచి ఆలోచిస్తే రాష్ట్రంలోని అన్నాడీఎంకే, పీఎంకే సైతం ఎన్బీఏ కూటమిలో చేరేందుకు ఊగిసలాడడం గమనార్హం. అయితే అన్నాడీఎంకేతో పీఎంకే పొత్తు ఖరారైందని, 9 సీట్ల పంపకానికి ఓప్పందం కుదిరిందని మరో సమాచారం వినపడుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అన్నాడీఎంకే అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఉప ప్రధాన కార్యదర్శి, ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ మరో వైపు భయపెడుతున్నారు. అదే సమయంలో పెద్ద పార్టీల అండలేకుండా ఎన్నికల్లో గట్టెక్కడం ఎలా అని అన్నాడీఎంకే ఉత్కంఠ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే పార్లమెంటు సభ్యుడు, లోక్సభ ఉపసభాపతి తంబిదురై కొన్ని రోజులుగా బీజేపీతో పొత్తు ఉండదని కుండబద్ధలు కొట్టినట్లు చెబుతూ వస్తున్నారు. తన అభిప్రాయాన్ని ఎడపాడి, పన్నీర్ వద్ద కూడా స్పష్టం చేసి ఉన్నారు. బీజేపీతో పొత్తును తంబిదురైతోపాటు మెజార్టీ నేతలంతా వ్యతిరేకించడంతో పార్టీ కన్వీనర్ పన్నీర్సెల్వం, ఉప కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇదిలా ఉండగా తంబిదురై తన భార్య, కుమార్తెతో కలిసి శుక్రవారం రాత్రి తిరువారూరు, తంజావూరులోని ప్రధాన ఆలయాలకు వెళ్లి రహస్యంగా పరిహార పూజలు నిర్వహించారు. అధ్యక్ష లేదా ఆస్థాయి పదవులకు ఉన్న అడ్డంకులు తొలగిపోయేందుకే ఇలాంటి పరిహార పూజలు చేయిస్థారని తెలుసుకున్న పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పార్టీలో అగ్రనేత ఉన్న తంబిదురైని స్థానిక అన్నాడీఎంకే నేతలు ఎవరూ అనుసరించక పోవడం చర్చనీయాంశంగా మారింది. -
బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు..!
సాక్షి, చెన్నై: లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తమిళనాడుకు చెందిన బీజేపీ బూత్స్థాయి కార్యకర్తలతో వీడియో కన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. డీఎంకే, అన్నాడీఎంకేలతో పొత్తులకు తన పార్టీ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం, అన్నాడీఎంకే సీనియర్ నేత పన్నీరుసెల్వం సోమవారం మధురైలో పొత్తులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాదిలో బలమైన కూటమి కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తాము వ్యతిరేకించలేమని, రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చని అన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రజాభీష్టం మేరకు మెగా కూటమిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం డీఎంకే, కాంగ్రెస్ మినహా ఏ పార్టీతోనైనా పొత్తుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళసై సౌందరాజన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పన్నీరుసెల్వం వ్యాఖ్యలు చర్చనీయాంశమైయ్యాయి. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్లు మిత్రపక్షాలైన విషయం తెలిసిందే. ఆ రెండు పార్టీలు అధికార అన్నాడీఎంకేకు ఉమ్మడి శత్రువులు కావడంతో ఆపార్టీ తప్పక బీజేపీ పక్షాన నిలుస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయం. మాజీ సీఎం జయలలిత మరణాంతరం శశికళను జైలుకు పంపడం, పళనిస్వామిని సీఎం చెయ్యడం వెనుక బీజేపీ పాత్ర ఉందన్న వార్తలు కూడా ఆమధ్య తమిళనాట గట్టిగానే వినిపించాయి. ఈనేపథ్యంలో రాష్ట్రంలో పొత్తుల విషయం కీలకం కానుంది. -
జయలలిత వైద్యానికైన ఖర్చు ఎంత..
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత చికిత్స ఖర్చు వివరాలను మంగళవారం అపోలో ఆసుపత్రి వెల్లడించింది. ఆమె చికిత్సకు మొత్తం రూ.6.85 కోట్లు ఖర్చుచేసినట్లు అపోలో లండన్ డాక్టర్ రిచర్డ్ బీలే వెల్లడించారు. జయలలిత ఫిజియోథెరపీ కోసం సింగపూర్ ఆసుపత్రికి 1.29 కోట్ల, శశికళ కుటుంబ వసతి కోసం 1.24 కోట్ల, జయ ఆహారంకు 1.17 కోట్లు చెల్లించినట్లు డాక్టర్ రిచర్డ్ తెలిపారు. కాగా రెండేళ్ల క్రితం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యం కారణంగా జయలలిత మృతి చెందిన విషయం తెలిసిందే. -
స్పీకర్ల అధికారాలు తేల్చాలి
తమిళనాడులో టీటీవీ దినకరన్ శిబిరంలోకి వెళ్లిన18మంది అన్నా డీఎంకే శాసనసభ్యులపై అసెంబ్లీ స్పీకర్ ధన్పాల్ అనర్హత వేటు వేయడం సరైందేనని మద్రాస్ హైకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు ఆ రాష్ట్ర రాజకీయాలకు ఓ కుదుపు. తమపై అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ ఆ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై నాలుగు నెలలక్రితం ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం రెండు భిన్నమైన తీర్పులివ్వడంతో ఈ కేసు మూడో న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణన్ దగ్గరకెళ్లింది. స్పీకర్ చర్య సరైనదేనని ఆ ఇద్దరు సభ్యుల్లో ఒకరైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరాబెనర్జీ ఇచ్చిన తీర్పుతో తాజాగా జస్టిస్ సత్యనారాయణన్ ఏకీభవించడంతో ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పలేదు. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి ఈ తీర్పు తాత్కాలికంగా ఊరట కలిగించింది. దానికితోడు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలంతా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని శుక్రవారం నిర్ణయించడం కూడా ఒకరకంగా ఆయ నకు అనుకూల పరిణామమే. అందుకు భిన్నంగా వారు అనర్హతకు సిద్ధపడి ఉప ఎన్నికలవైపే మొగ్గు చూపితే పళనిస్వామి ఇబ్బందుల్లో పడేవారు. అనర్హులైన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిం చిన 18 స్థానాలతోపాటు డీఎంకే అగ్రనేత కరుణానిధి, అన్నాడీఎంకే శాసనసభ్యుడు ఏకే బోస్ల మరణాలతో ఖాళీ అయిన మరో రెండు సీట్లకు ఉప ఎన్నికలొస్తే అవి ఆయనకు అగ్నిపరీక్షగా మారేవి. ఆయనా, ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వంల సత్తా ఏమిటో తేలిపోయేది. అన్నాడీఎంకే విజయం సాధించలేకపోతే వారి శిబిరం ఖాళీ అయి, ప్రభుత్వం కుప్పకూలేది. నిరుడు అన్నాడీ ఎంకేలోని పళనిస్వామి, పన్నీరుసెల్వం వర్గాలు విలీనమయ్యాక జయలలిత సన్నిహితురాలు శశికళనూ, ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్లను పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే పార్టీలోని 19మంది ఎమ్మెల్యేలు దినకరన్తోనే ఉండిపోయారు. వారు నిరుడు సెప్టెంబర్లో అప్పటి గవర్నర్ విద్యాసాగరరావును కలిసి పళని ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదని వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారిలో ఒకరు వెనక్కి తగ్గారు. మిగిలినవారిపై స్పీకర్ ధన్పాల్ అనర్హత వేటు వేశారు. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో డీఎంకేకు 88, ఆ పార్టీ మిత్రపక్షాలు కాంగ్రెస్కి 8, ఐయూ ఎంఎల్కు ఒక స్థానం ఉన్నాయి. అయితే తమిళనాడు రాజకీయ దృశ్యం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకేల్లో ఎవరి ప్రభుత్వాలున్నా అవి దూకుడుగా వ్యవహరించేవి. కేంద్రంలో ఎవరున్నా కావలసినవి సాధించుకునేవి. పళని సర్కారు అందుకు భిన్నం. పేరుకు ప్రభుత్వం ఉన్నా ఏ విష యంలోనూ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నదన్న అభిప్రాయం కలగదు. ‘తల లేని మొండెం’ తరహాలోనే వ్యవహరిస్తోంది. అది బీజేపీ పెద్దల ఆదేశాలతో నడుస్తున్నదని విపక్షాలు తరచు విమర్శిస్తుంటాయి. జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్ భారీ మెజారిటీతోనే నెగ్గినా ఆయన పార్టీ అమ్మ మక్కళ్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే)కు జనంలో ఏమేరకు ఆదరణ ఉందో ఇంకా తెలియదు. ఆ విషయంలో ఆయనకే స్పష్టత లేదు. కను కనే అనర్హత తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు కనబడు తోంది. ఆయన పార్టీకి కార్యకర్తల బలం లేదు. ఈ స్థితిలో ఉప ఎన్నికలకు సిద్ధపడి, పరాజయం పాలైతే వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి ఆయన శిబిరంలో ఎవరూ మిగలరు. కానీ విపక్ష డీఎంకేకు ఇకపై తాము మాత్రమే ప్రధాన ప్రత్యర్థులమని దినకరన్ తరచు చెబుతుంటారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కార్యకర్తలతో పటిష్టంగా ఉన్నవి రెండే రెండు పార్టీలు–డీఎంకే, అన్నాడీఎంకే. అధి కారంలో ఉంది గనుక అన్నాడీఎంకేకు కార్యకర్తల బలం ఇంకా దండిగానే ఉంది. సినీ నటుడు కమల్హాసన్ పేరుకు పార్టీ ప్రారంభించినా అదింకా అడుగులేయడం ప్రారంభించలేదు. మరో నటుడు రజనీకాంత్ పార్టీ ఇంకా పురుడు పోసుకోలేదు. పళని ప్రభుత్వాన్ని నడిపించేది బీజేపీ యేనని అందరూ అనుకుంటున్నా ఆ పార్టీ అందుకు తగ్గట్టు చురుగ్గా పనిచేస్తున్న దాఖలాలు లేవు. బీజేపీ కర్ణాటకలో అట్టడుగు స్థాయి వరకూ పార్టీ శ్రేణుల్ని పటిష్టపరుచుకుని అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటగలిగింది. కేరళలో సైతం రాజకీయంగా పనికొచ్చే ఏ అంశాన్నీ వదలకుండా పనిచేస్తోంది. కానీ తమిళనాడులో ఇందుకు భిన్నం. ప్రధాన నాయకులు హెచ్. రాజా, తమిళసై సౌందర్రాజన్లిద్దరూ తాము చేసే కార్యక్రమాల కన్నా, తరచు చేసే అపసవ్య వ్యాఖ్యల ద్వారా వార్తల్లోకెక్కుతూ ఉంటారు. నోరుజారి ఏదో వివాదంలో చిక్కుకుని ఇబ్బందుల్లో పడతారు. డీఎంకే మాత్రం అన్నివిధాలా పటిష్టంగా ఉంది. అయినా రజనీకాంత్ను అది తక్కువ అంచనా వేయడం లేదు. ఆయన్ను పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు కొనసాగించడం... సొంత పార్టీ ఏర్పాటుకే రజనీ మొగ్గు చూపితే ఆయనపై బీజేపీ ముద్రేసి ప్రభావం తగ్గించే ప్రయత్నం చేయడం డీఎంకే వ్యూహం. అయితే ఒక్క తమిళనాడు ఉదంతంపైన మాత్రమేకాక మొత్తంగా స్పీకర్లకున్న అధికారాలను సుప్రీంకోర్టు సమీక్షించడం తక్షణావసరం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్పీకర్ స్థానం ఉన్నతమైనది. ఆ స్థానంలో ఉన్నవారు తటస్థంగా, నిష్పాక్షికంగా విధులు నిర్వర్తించాలని రాజ్యాంగం భావిస్తుండగా, ఆచరణలో అదంతా తలకిందులవుతోంది. పాలక పక్షాల కనుసన్నల్లో మెలగుతూ నిర్ణయాలు తీసుకోవడం లేదా నిర్ణయరాహిత్యంతో గడిపేయడం స్పీకర్లకు అల వాటైపోయింది. తాము అన్నిటికీ అతీతులమని, తమ జోలికెవరూ రాలేరని వారు భావిస్తున్నారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల అప్పీల్ విచారణ సందర్భంగానైనా చట్టసభల హక్కులు, స్పీకర్ల అధికారాలపై సుప్రీంకోర్టు స్పష్టమైన నిర్ణయం వెలువరిస్తే ప్రస్తుత అరాచక ధోరణికి అడ్డుకట్ట పడుతుంది. -
రజనీకాంత్పై అన్నాడీఎంకే ఫైర్
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అంత్యక్రియల్లో సీఎం పళనిస్వామి పాల్గొనకపోవడంపై విమర్శలు చేసిన సూపర్స్టార్ రజనీకాంత్పై అన్నాడీఎంకే మండిపడింది. పార్ట్ టైం నేత స్థాయి నుంచి పుల్ టైం రాజకీయ నాయకుడిగా మారడానికి ఓ సంతాప సభను ఉపయోగించు కున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నాడీఎంకే సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి డి. జయకుమార్ కరుణానిధి అంత్యక్రియల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా రజనీ విమర్శలపై జయకుమార్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరుణానిధి సంతాప సభలో రజనీకాంత్ రాజకీయాలు మాట్లాడాల్సింది కాదని అన్నారు. ‘అది మృతిచెందిన ఓ నాయకుడి సంతాప సభ. అక్కడ రాజకీయాలు మాట్లాడడం మంచిది కాదు. రాజకీయాలు మాట్లాడడం వల్ల రజనీకాంత్కు రాజకీయ పరిణితి లేదని అర్థమవుతోంది’ అని విమర్శించారు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కరుణానిధి సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ.. మెరీనా బీచ్లో జరిగిన కరుణానిధి అంత్యక్రియలకు దేశంలోని అనేకమంది నాయకులు హాజరయ్యారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం హాజరు కాలేదన్నారు.. ‘‘ఈ అంత్యక్రియలకు మొత్తం భారత దేశమే తరలి వచ్చింది. త్రివిధ దళాలు ఆయనకు గౌరవ వందనం సమర్పించాయి. గవర్నర్తో పాటు అనేకమంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కానీ తమిళనాడు సీఎం మాత్రం రాలేదు. ఎందుకు? మంత్రి వర్గం అంతా రాకుడదా? మీరేమైనా ఎంజీఆర్ లేక జయలలిత అనుకుంటున్నారా?’’ అని రజనీ ప్రశ్నించారు. -
రాజకీయ శూన్యత పూరించేదెవరు?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు, రెండు ప్రధాన ద్రవిడ పార్టీలు డీఎంకే, ఏఐడీఎంకే నేతలు ఎం.కరుణానిధి, జయలలిత మరణంతో రాష్ట్రంలో రాజకీయాలు ఎటు తిరుగుతాయి? మూడున్నర దశాబ్దాలకు పైగా రాష్ట్రాన్ని పరిపాలించిన ఈ ఇద్దరు అగ్రనేతలు లేని లోటును ఎవరు తీరుస్తారు? ఇద్దరు తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్హాసన్ నాయకత్వంలోని కొత్త ప్రాంతీయపక్షాలు ఎంత వరకు ఈ ఖాళీని భర్తీ చేస్తాయి? అనే ప్రశ్నలు తమిళ రాజకీయ పండితులకు చర్చనీయాంశాలుగా మారాయి. కరుణానిధి తన రాజకీయ వారసునిగా మూడో కొడుకు ఎంకే స్టాలిన్ను కిందటేడాది జనవరిలో ప్రకటించారు. పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షునిగా నియమించారు. ఫలితంగా ఆయన కుటుంబ సభ్యుల్లో రాజకీయలతో సంబంధమున్న రెండో కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి, చిన్న కూతురు, రాజ్యసభ ఎంపీ కనిమొళి, ఇంకా ఆయన మేనల్లుడి కొడుకు, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్లు డీఎంకే నాయకత్వం కోసం పోటీ పడే అవకాశాలు లేవు. 65 ఏళ్ల స్టాలిన్ 1973 నుంచీ డీఎంకే కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, 1984 నుంచీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 45 ఏళ్లుగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఉన్న సంబంధాలు, పార్టీ విభాగాలు, ఆస్తులపై ఉన్న పట్టు కారణంగా స్టాలిన్కు పార్టీని ముందుకు తీసుకెళ్లే అన్ని అవకాశాలూ ఉన్నాయి. ఏఐడీఎంకే నిలదొక్కుకుంటుందా? ఏఐడీఎంకేలో సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం ప్రస్తుతానికి కలిసి పనిచేస్తున్నా వారిద్దరి నాయత్వాన పార్టీలో రెండు గ్రూపులు నడుస్తున్నాయనేది బహిరంగ రహస్యమే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పన్నీర్సెల్వంకు సన్నిహిత సంబంధాలున్నందున రాబోయే ఎన్నికల్లో ఆయన వర్గం ఎన్డీఏకు దగ్గరైతే పార్టీ బలహీనపడే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితిలో జయ సన్నిహితురాలు వీకే శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్ నాయకత్వంలోని అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం మాతసంస్థ ఏఐడీఎంకే నేతలు, కార్యకర్తలను పెద్ద సంఖ్యలో చీల్చి కొంత మేరకు బలపడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏఐడీఎంకే పాలనకుగాని, పళనిస్వామికిగాని జనాదరణ అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో ఏఐడీఎంకే ఎన్ని పార్టీలుగా చీలిపోతుందో కూడా చెప్పలేమని తమిళ రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. జయలలిత తర్వాత జనాకర్షణ శక్తి ఉన్న నేతలెవరూ లేకపోవడం, అర్థబలంతో అంగబలం సంపాదించిన శశికళ జైల్లో ఉండడంతో ఏఐడీఎంకే పూర్వ వైభవం సంపాదించడానికి చాన్సే లేదని తేల్చిచెబుతున్నారు. రజనీ, కమల్ పార్టీలకు ఇంకా పునాదులే లేవు ఇద్దరు తమిళ రాజకీయ దిగ్గజాలు జయ, కరుణ లేని పరిస్థితుల్లో తమ అదష్టం పరీక్షించుకోవడానికి మక్కల్ నీతి మెయ్యం అనే పార్టీ పెట్టిన కమల్హాసన్గాని, ఇంకా పార్టీ పేరు ప్రకటించకుండానే కొత్త పార్టీకి ఇంకా ఏర్పట్ల పనిలో మునిగి ఉన్న రజనీకాంత్గాని ఇప్పట్లో ఈ రాజకీయ శూన్యాన్ని భర్తీచేసే సామర్ధ్యం లేదు. బ్రాహ్మణేతర కులాలకు సామాజికన్యాయం, మూఢాచారాల నిర్మూలన, హిందీ వ్యతిరేకత, తమిళ భాషా వికాసం వంటి సైద్ధాంతిక భూమికతో ఎదిగిన డీఎంకే, అన్నాడీఎంకేలు నేడు ఎలాంటి సైద్ధాంతిక బలం లేకుండా ముందుకుసాగుతున్నాయి. ఇలాంటి సిద్ధాంతాలేవీ లేకుండా, సమకాలీన తమిళ ప్రజలను ఆకట్టుకోవడానికి సినీ గ్లామర్ ఒక్కటే ఈ ఇద్దరు నటులకు సరిపోదు. వామపక్షాలకు దగ్గరగా ఉన్నట్టు కనిపించే కమల్ పార్టీ నిర్మాణం కూడా అనుకున్నట్టు జరగడం లేదు. రజనీకాంత్కు ఎలాంటి సైద్ధాంతిక బలం లేకున్న తనకున్న ‘ఆధ్యాత్మిక’ నేపథ్యంతో ఎన్నికల్లో బీజేపీకి దగ్గరవ్వచ్చేమోగాని అధికారంలోకి వచ్చే స్థాయిలో సీట్లు గెలుచుకోవడం సాధ్యం కాదనే అభిప్రాయం ఉంది. మళ్లీ పుంజుకునే అవకాశాలే లేని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని కమల్హాసన్ ఆలోచిస్తున్నారు. హిందుత్వ సిద్ధాంతంతో తమిళులను ఆకట్టుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఆశించిన ఫలితాలు ఇచ్చే పరిస్థితులు లేవు. స్టాలిన్ సామర్ధ్యంపైనే డీఎంకే భవితవ్యం! అంకితభావంతో పనిచేసే కార్యకర్తలతో నిండిన పార్టీ యంత్రాంగం, అవసరమైన వనరులు, తగినంత అనుభవం ఉన్న స్టాలిన్ చాకచక్యంగా వ్యవహరిస్తూ పార్టీని నడపగలిగితే డీఎంకేను మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి వీలవుతుంది. ఎప్పటి నుంచో పొత్తుల అనుబంధం ఉన్న కాంగ్రెస్, ఇతర చిన్నచితకా పార్టీలతో కలిసి బలమైన కూటమి నిర్మిస్తే కరుణానిధి వారసునిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కష్టమేమీ కాదనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది రాజకీయ పండితులు వ్యక్తం చేస్తున్నారు. ద్రవిడ సిద్ధాంత వారసత్వం కూడా డీఎంకేకు కలిసొచ్చే ప్రధానాంశం. ప్రస్తుతమున్న సంక్లిష్ట రాజకీయ వాతావరణంలో డీఎంకే పార్టీ మాత్రమే ఎన్నికలను సునాయాసంగా ఎదుర్కొనగలదని రాజకీయ విశ్లేషకుల్లో అధిక శాతం అభిప్రాయపడుతున్నారు. - (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
అస్తమించిన ‘సూర్యుడు’
నిరంతరం ఆటుపోట్లతో, అడుగడుగునా సవాళ్లతో, అంతుచిక్కని సుడిగుండాలతో నిండి ఉండే రాజకీయ రంగంలో ఎనభైయ్యేళ్ల సుదీర్ఘకాలం తలమునకలై ఉండటం... అందులో యాభైయ్యే ళ్లపాటు తిరుగులేని నాయకుడిగా ప్రజానీకంపై తనదైన ముద్ర వేయటం అసాధారణం. మంగళ వారం తన 94వ ఏట కన్నుమూసిన ముత్తువేల్ కరుణానిధి అటువంటి అరుదైన చరిత్రను సొంతం చేసుకున్న అసాధారణ నాయకుడు. పెరియార్ రామస్వామి సారథ్యంలో ప్రారంభమైన అట్టడుగు కులాల ద్రవిడ ఆత్మ గౌరవ ఉద్యమం మద్రాస్ ప్రెసిడెన్సీని దావానలంలా చుట్టుముట్టిన తరుణంలో కళ్లు తెరిచిన కరుణానిధి పద్నాలుగేళ్ల వయసొచ్చేసరికి అందులో భాగస్వామిగా మారడమే కాదు... అనంతరకాలంలో అంచెలంచెలుగా ఎదుగుతూ 48 ఏళ్ల వయసుకే ముఖ్య మంత్రి కావడం, చివరి వరకూ ఆ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయడం గొప్ప విషయం. ద్రవిడ ఉద్యమ నాయకుడు పెరియార్, ఆయనతో విభేదించి డీంఎకేను స్థాపించి ముఖ్యమంత్రి పదవిని అధి ష్టించిన అన్నాదురైల కోవకు చెందిన కరుణానిధి... వారికంటే ఒకడుగు ముందుకు వేయగలిగారు. ఉద్యమ దిగ్గజంగానే కన్నుమూసిన పెరియార్కుగానీ, సీఎం పదవిలోకొచ్చిన రెండేళ్లకే తనువు చాలించిన అన్నాదురైకుగానీ దక్కని అరుదైన అవకాశం కరుణానిధికి లభించింది. అట్టడుగు వర్గాల సంక్షేమానికి తోడ్పడే అనేక పథకాలను ఆచరణలో పెట్టి వారి అభ్యున్నతికి కృషి చేయడం, పాల నాదక్షుడిగా రాణించడం కరుణానిధికి సాధ్యమైంది. దేశ ప్రజలందరికీ కళ్లజోడు లేని కరుణానిధిని ఊహించుకోవటం అసాధ్యం. దీంతోపాటు ఏ వేదికెక్కినా తీయని తమిళంలో తన అభిమానుల్ని ఉద్దేశించి ‘నా జీవితం కన్నా నేను మహోన్నతంగా భావించే నా సహో దరులారా...’ అంటూ ఆయన నోటి వెంబడి వెలువడే తొలి పలుకులు తమిళనాడు ప్రజానీకం అంతరాంతరాల్లో శాశ్వ తంగా నిలిచిపోతాయి. ఉద్యమాలనుంచి ప్రభవించే నాయకులకు అరుదైన ఉపన్యాస కళ సహజాభరణంగా ఒదుగుతుంది. బ్రాహ్మణాధిపత్యాన్ని సవాలు చేసిన ప్రచండ ద్రవిడ ఉద్యమంలో ఎదిగివచ్చిన నాయకుల సంగతి చెప్పేదేముంది? అంతేకాదు... వ్యాసరచన, కథ, కవిత్వం, నవల, నాటకం వగైరాల్లో ద్రవిడ ఉద్యమంలోనివారు పదునుదేరారు. అనం తరకాలంలో బలమైన మాధ్యమంగా రూపొందిన సినీ రంగానికి సైతం ఆ సంప్రదాయం విస్తరించింది. వీటన్నిటా కరుణానిధి చెరగని ముద్ర వేయగలిగారు. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్ వంటివారు తెరపై ఓ వెలుగు వెలిగి ఉండొచ్చు. కానీ వారికొచ్చిన ఆ కీర్తిప్రతిష్టల్లో సింహ భాగం కవిగా, కథా రచ యితగా, సంభాషణల రచయితగా పనిచేసిన కరుణకు దక్కుతుంది. ద్రవిడ ఉద్యమ పటిష్టతకు, బ్రాహ్మణేతర కులాల అభ్యున్నతికి రాజకీయ సమీకరణ కీలకమని గుర్తించి... అందుకు సినీ మాధ్యమాన్ని మించిన ఉపకరణం లేదని డీఎంకే గ్రహించటంలో ఆయన పాత్ర ఎన్నదగినది. కరుణానిధి తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు దక్షిణామూర్తి. లోకానికి ఆది గురువుగా హిందువులు భావించే శివుడి ప్రతిరూపమది. తాను పుట్టిన ఇసై వెల్లార్ (నాయీ బ్రాహ్మణ) కులా నికి దైవ సాన్నిధ్యంలో నిత్యం ఎదురవుతున్న వివక్షను చిన్ననాటినుంచీ గమనిస్తూ వచ్చిన దక్షిణా మూర్తి అనంతరకాలంలో ద్రవిడ ఉద్యమ భాగస్వామి కరుణానిధిగా, హేతువాదిగా రూపాంతరం చెందటం యాదృచ్ఛికం కాదు. ఆయన చిన్నతనంలోనే ‘మానవర్ నేసన్’ పేరిట రాత పత్రిక వెలు వరించారు. ఇరవైయ్యేళ్లకే సినీ రచయిత అయ్యారు. 33 ఏళ్లకే తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశిం చారు. ఎన్నికల్లో గెలుపోటములు సర్వసాధారణం. ప్రజాదరణ పొందటంలో పార్టీకి అవాంతరాలు ఎదురై ఉండొచ్చుగానీ వ్యక్తిగతంగా కరుణానిధి ఎప్పుడూ ఓటమి చవిచూడలేదు. సంక్షోభ సమయాల్లో సైతం నాయకుడన్నవాడు ఎంత నిబ్బరంగా ఉండాలో, ఎలా ఆచితూచి ప్రవర్తించాలో ప్రతి రాజకీయవేత్తా కరుణానిధిని చూసి తెలుసుకోవాలి. డీఎంకేలో తన సహ భాగస్వామిగా ప్రయాణిస్తూ పార్టీకి జనాదరణను సమీకరించడంలో కీలక భూమిక పోషించిన ఎంజీ రామచంద్రన్ను సరిగా అంచనా కట్టడంలో... ఆయన్ను తన శిబిరం దాటిపోకుండా చూడ టంలో కరుణానిధి విఫలమై ఉండొచ్చు. ఎంజీఆర్ కేంద్రాన్ని ప్రభావితం చేసి తన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయించిన తీరు ఆయనను కలవరపెట్టి ఉండొచ్చు. ఎంజీఆర్ జీవించి ఉన్నంతవరకూ తాను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించలేకపోయి ఉండొచ్చు. అవినీతి ఆరోపణలు చుట్టు ముట్టినప్పుడు, జయలలిత కక్షగట్టి అరెస్టు చేయించినప్పుడు తన భవితవ్యం ఏమవుతుందన్న సంశయం వచ్చి ఉండొచ్చు. కానీ ఈ సన్నివేశాలన్నిటా ఆయన నిలకడగా, నిబ్బరంగా ఉన్నారు. ఓపిక పట్టారు. పార్టీని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. శ్రేణులు చెదరకుండా చూసుకున్నారు. కింది స్థాయి నాయకులతో నిరంతరం సంబంధాలు కొనసాగించారు. ఇవే ఆయన్ను తిరిగి అందలం ఎక్కించాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రెండింటితో ఆయన భిన్న సందర్భాల్లో సన్నిహితంగా మెలిగారు. అలాగని తమిళుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. కేంద్ర పాలకుల ముందు మోకరిల్లలేదు. కీలక మంత్రిత్వ శాఖలు డిమాండు చేసి, వాటిని సాధించుకుని తన రాష్ట్రాన్ని పారిశ్రామికంగా తీర్చిదిద్దారు. ఐటీలో రాష్ట్రానికి రెండో స్థానం దక్కేలా చేశారు. 20 నెలలక్రితం మరణించిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత తర్వాత అన్నాడీఎంకే, ఆ పార్టీ ఏలు బడిలోని ప్రభుత్వం ప్రహ సనప్రాయమయ్యాయి. కానీ కరుణానిధి తన వారసుడు స్టాలిన్ను తీర్చి దిద్దారు. నిరుడు ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించారు. అయితే కరుణానిధి స్థాయిలో స్టాలిన్ నాయకత్వ పటిమను ప్రద ర్శించగలరా అన్నది వేచి చూడాలి. ద్రవిడ ఉద్యమం సృజియించిన దిగ్గజాల పరంపరలో కరుణ ఆఖరివారని చెప్పాలి. ఆయన కనుమరుగైనా తమిళ రాజకీయాలపై ఆయన ముద్ర ఎన్నటికీ శాశ్వతంగా ఉండిపోతుంది. -
సొంత గూటికి వచ్చేయండి: సీఎం
సాక్షి, చెన్నై : అనర్హత వేటు పడిన దినకరన్ వర్గానికి 18 మంది ఎమ్మెల్యేలను తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సమన్వయకర్త ఎడపాడి పళనిస్వామి పార్టీలోకి ఆహ్వానించారు. అనర్హత వేటు పడినవారంతా మళ్లీ చేరాలని వస్తే పార్టీలోకి స్వాగతిస్తామని పేర్కొన్నారు. కానీ ఇంతవరకు అలాంటి ప్రతిపాదన తన వద్దకు రాలేదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దినకరన్ గూటికి చేరిన 18 మంది ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి వస్తారని మీడియా ద్వారానే తెలుసుకున్నాను. ఒకవేళ వారు తిరిగి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తామ’ని పేర్కొన్నారు. ఆ 18 మందిలో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేశారటగా అని విలేకరులు ప్రశ్నించగా ‘అది నేను ఎలా ఇవ్వగలను’ అని సమాధానమిచ్చారు. అనర్హత పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉందా అని అడగ్గా.. ఆ విషయం కోర్టు పరిధిలో ఉందని, దాని గురించి మాట్లాడబోమని అన్నారు. కాగా, దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో అనిశ్చితి నెలకొంది. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించకపోవడంతో విచారణను విస్తృత ధర్మాసనానికి బదలాయించారు. 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా, స్పీకర్ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సెల్వం విచారణ సందర్భంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. -
తమిళనాడులో మరో కొత్త పార్టీ
చెన్నై : తమిళనాడులో కొత్త పార్టీలకు కొదవలేకుండా పోతుంది. తాజాగా శశికళ సోదరుడు దివాకరన్ కొత్త రాజకీయా పార్టీని స్థాపించారు. గతంలో అన్నాడీఎంకే నుంచి బయటికిచ్చిన శశికళ వర్గం నాయకుడు దినకరన్ పెట్టిన అమ్మ మక్కల్ మున్నెట్రా కదగజం పార్టీలో ఉన్న దివాకరన్ ఇప్పుడు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుని ‘అమ్మ అని’ అనగా ‘అమ్మ జట్టు’ అనే కొత్త పార్టీని నెలకొల్పారు. తెలుపు, నలుపు, ఎరుపు, మధ్యలో ఆకుపచ్చ వర్ణాలతో పార్టీ జెండాను ఆదివారం చెన్నైలో ఆవిష్కరించారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం అనంతరం తమిళనాడలో ఇప్పటికే దినకరన్, ప్రముఖ సినీ నటుడు కమల్హాసన్లు కొత్త పార్టీలను స్థాపించిన సంగతి తెలిసిందే. అలాగే గతంతో జయలలిత మేనకోడలు దీప కూడా ఎంజీఆర్ అమ్మ దీప పేరవాయి పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. సుపర్స్టార్ రజనీకాంత్ కూడా రాజకీయ పార్టీ పడతానని ప్రకటించారు. కేవలం జయ మరణం కారణంగానే తమిళనాడులో ఇన్ని రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. -
ఆ ఎంపీ కుమారుడితో పెళ్లి జరిపించాలి: యువతి
సాక్షి, చెన్నై: ఎంపీ అన్వర్ రాజా కుమారుడితో పెళ్లి జరిపించాలని ఓ యువతి ఆందోళన చేస్తోంది. దీని కోసం గవర్నర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్టు రొబినా చెన్నైలో శనివారం పేర్కొన్నారు. చెన్నై సైదాపేటకు చెందిన ప్రపల్వా సుభాష్ అనే రొబినా పారిశ్రామిక వేత్త. ఈమెకు అన్వర్ రాజా ఎంపీ కుమారుడు నాజర్ అలీకి పరిచయం ఉన్నట్టు తెలిసిందే. ఇద్దరూ వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకుని ఒకే ఇంట్లో సహజీవనం చేశారు. ఈ క్రమంలో నాజర్ అలీకి మరో యువతితో గత నెల వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు జరిగాయి. విషయం తెలుసుకున్న రొబినా ఆ వివాహాన్ని నిలుపుదల చేయమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రొబినా శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. నాజర్ అలీ తనను మోసం చేసి తనతో గడిపాడు. అతని తండ్రి అన్వర్ రాజా బెదిరింపులు వలన తనను వివాహం చేసుకోవడానికి తిరస్కరించాడని తెలిపారు. తనకు న్యాయం జరగాలని గవర్నర్, ముఖ్యమంత్రిని కలిసి పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తనకు, నాజర్ అలీకి ఇస్లాం మత సంప్రదాయంలో వివాహం జరిపించాలని, ఆధార పూర్వకంగా తనను భార్యను చేసుకున్న తరువాత ఒక రోజు అతనితో జీవించి మరుసటి దినమే విడిపోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. -
జయలలిత వేలిముద్రలపై సుప్రీం తీర్పు
సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేలిముద్రల కేసుపై సుప్రీంకోర్టు తాజా తీర్పును వెలువరించింది. జయలలిత వేలిముద్రలు సమర్పించాలని పరప్పణ అగ్రహారం జైలు అధికారులకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. కేసు విచారణలో భాగంగా జయ లలిత వేలిముద్రలు సేకరించడాన్ని నిలుపుదల చేయాలని, వేలిముద్రలు లేకుండానే కేసు విచారణ పూర్తి చేయాలని మద్రాసు హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. తిరుపరంకండ్రం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏఐడీఎంకే నేత ఎకే బోస్ ఎన్నికను సవాలు చేస్తూ డీఎంకే నేత శరవణన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జయలలిత స్పృహలో లేని సమయంలో అమె అనుమతి లేకుండా వేలిముద్రలు తీసుకున్నారని, అమె సమ్మతి లేకుండా తీసుకున్న వేలిముద్రలు చెల్లవని ఆ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ 2016లో శరవణన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన మద్రాసు హైకోర్టు కర్ణాటకలోని పరప్పణ అగ్రహారం జైలు అధికారుల వద్ద జయలలిత వేలిముద్రలు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను తప్పుబడుతూ జయలలిత వేలిముద్రల సేకరణను విరమించుకోవాలని సుప్రీకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. -
కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వండి
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి తమిళనాడు అధికార అన్నాడీఎంకే ఎంపీలు మద్దతివ్వాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. నీట్ ప్రవేశ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించేందుకు, కావేరీ జలాల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు విముఖత వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై సరైన రీతిలో నిరసన తెలిపేందుకు అవిశ్వాసానికి మద్దతివ్వాలని శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. -
కుటుంబీకులపై శశికళ అసహనం
సాక్షి, చెన్నై: బంధుగణానికి చిన్నమ్మ శశికళ క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తున్నది. న్యాయవాదుల ద్వారా తన సందేశాన్ని పంపించారు. అన్నాడీఎంకే అమ్మ జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ ప్రతినిధి, అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత దినకరన్కు వ్యతిరేకంగా ఆ కుటుంబంలోనే విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. చిన్నమ్మ సోదరుడు దివాకరన్ ఓ వైపు, వదిన ఇలవరసి కుమార్తె కృష్ణ ప్రియ మరో వైపు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. దినకరన్కు వ్యతిరేకంగా కృష్ణప్రియ రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. కుటుంబంలో ఆస్తుల వ్యవహారంలో చాపకింద నీరులా సాగుతూ వచ్చిన విభేదాలు, తాజాగా రాజకీయ వేదికగా తలబడ్డేందుకు సిద్ధం అవుతుండడం చర్చకు దారి తీసింది. ఈ సమాచారాలు ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ దృష్టికి చేరింది. తనను కలిసేందుకు వచ్చిన న్యాయవాదులతో కుటుంబంలో సాగుతున్న పరిణామలపై చిన్నమ్మ అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష రాజకీయాలంటూ వాదులాటలు వద్దని, సంయమనంతో వ్యవహరించాలని, దూకుడును పక్కన పెట్టి శాంతియుతంగా ముందుకు సాగాలని కుటుంబీకులకు న్యాయవాదులు ద్వారా ఆమె సందేశాన్ని పంపించినట్టు అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో చర్చసాగుతోంది. -
దినకరన్ కు పోటీగా కృష్ణప్రియ?
సాక్షి, చెన్నై : చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపు శశికళ కుటుంబాలకు రాజకీయ లాభం చేకూర్చకపోగా విభేదాల చిచ్చుపెట్టింది. దినకరన్కు వ్యతిరేకంగా పలువురు కుటుంబ సభ్యులు రాజకీయబాటలు వేస్తుండగా, శశికళ అన్న కుమార్తె డాక్టర్ కృష్ణప్రియ (ఇళవరసి కుమార్తె) ఈనెల 24వ తేదీన జయలలిత జయంతి రోజున రాజకీయ ప్రవేశానికి ముహూర్తం పెట్టుకున్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలుకెళ్లడంతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వంలు ఏకమైన ఆర్కేనగర్ ఎమ్మెల్యే, శశికళ అక్క కుమారుడైన టీటీవీ దినకరన్ను పార్టీతో సంబంధం లేకుండా ఏకాకిని చేశారు. ఈపీఎస్, ఓపీఎస్లను లెక్కచేయకుండా 20 మందికి పైగా ఎమ్మెల్యేలు దినకరన్ పక్షాన నిలిచారు. ఆ తరువాత పార్టీ, రెండాకుల చిహ్నం ఎడపాడి వశం కావడంతో దినకరన్ వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఎడపాడి వైపు వెళ్లిపోయారు. దీంతో దినకరన్ బలం 18 మంది ఎమ్మెల్యేలకు పడిపోయింది. ఈ 18 మందిపై కూడా స్పీకర్ చేత సీఎం అనర్హత వేటు వేయించారు. ఈ వేటు వివాదం కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ పరిణామాలను సవాలుగా తీసుకున్న దినకరన్ ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్య అభ్యర్దిగా పోటీచేసి వ్యూహాత్మకంగా గెలుపొందారు. దినకరన్ గెలుపు ఎడపాడిని బెంబేలుకు గురి చేసింది. అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం, అధికారం చేతిలో ఉన్నా దినకరన్ గెలుపొందడంతో ఎడపాడి, పన్నీరు కంగారుపడగా, జైల్లో ఉన్న శశికళకు అంతులేని ఆనందం కలిగింది. అంతేగాక కొత్తపార్టీ పెట్టాలనే ఆలోచన ఇద్దరిలోనూ మొలకెత్తింది. ఆర్కేనగర్లో గెలుపు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో శాశ్వతంగా నిలబడాలనే ఆశ దినకరన్లో ఏర్పడింది. కొత్త పార్టీపై దినకరన్ తరచూ శశికళను కలుస్తున్నారు. అంతేగాక జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు అప్పుడప్పుడూ దినకరన్ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. దినకరన్ రాజకీయ ఎదుగుదల, శశికళకు మరింత చేరువకావడం కుటుంబ సభ్యులకు కంటగింపుగా మారింది. పైగా శశికళ భద్రంగా దాచి ఉంచిన జయ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియో దృశ్యాలను ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో తన గెలుపుకోసం దినకరన్ వినియోగించుకోవడం మరింత మనస్పర్థలకు దారితీసింది. ఇదే అంశంపై కృష్ణప్రియ, దినకరన్ల మధ్య విభేధాలు తలెత్తాయి. కృష్ణప్రియ సైతం దినకరన్ను వ్యతిరేకంగా పావులు కదపడం ప్రారంభించారు. ఈనెల 24వ తేదీన దివంగత ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా రాజకీయ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ప్రధానంగా ఈ వివాదమే కృష్ణప్రియను రాజకీయ అరంగేట్రానికి పురిగొల్పినట్లు భావిస్తున్నారు. కాగా, శశికళ తమ్ముడు దివాకరన్, ఇళవరసి కుమారుడు వివేక్, కుమార్తె కృష్ణప్రియల అడుగు జాడలోనే దినకరన్ సోదరుడు భాస్కరన్ సైతం రాజకీయ ప్రవేశంపై తహతహలాడుతున్నారు. శశికళ మనస్తాపం.. 2015 డిసెంబరు 4వ తేదీనే జయ కన్నుమూసినట్లు దివాకరన్ ప్రకటించి వివాదం లేవనెత్తడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసి ఇకపై అలాంటి ప్రకటనలు చేయరాదని ఖండించారు. ఇలా ఒక్కొక్కరుగా దినకరన్కు దూరం జరిగిపోవడమేగాక కుటుంబ సభ్యుల మధ్య కీచులాటలతో శశికళ మనస్తాపానికి గురవుతున్నారని తెలుస్తోంది. విబేధాలు తీవ్రం.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 స్థానాల్లో పోటీచేస్తామని దినకరన్ సోదరుడు భాస్కరన్ ఇటీవల ప్రకటించారు. భాస్కరన్ చేసిన ప్రకటన దినకరన్ అనుచరుల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. దినకరన్ సోదరుడే రాజకీయాల్లోకి దిగితే ఎవరివైపు నిలవాలనే ఆలోచనలో పడ్డారు. కాగా తిరువళ్లూరు జిల్లా అన్నాడీఎంకే క్యాడర్లో కొంతవరకు శశికళ తమ్ముడు దివాకరన్ వైపు ఉండేది. అయితే జయ మరణం తరువాత కొందరు చేజారిపోగా మరి కొంతమంది దినకరన్ పక్షాన నిలిచి ఉన్నారు. వీరందరినీ తనవైపు తిప్పుకోవాలని దివాకరన్ ప్రయత్నాలు చేస్తున్నారు. -
నోరు అదుపులో పెట్టుకోండి!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం, దానికి సంబంధించిన విషయాలను మరింత వివాదాస్పదం చేయడం సరికాదనీ, ఇకపై నోరు అదుపులో పెట్టుకోవాలని ఆ పార్టీ బహిష్కృత నేత శశికళ తన కుటుంబ సభ్యులను హెచ్చరించారు. ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తుండటంపై ఆవేదన, ఆగ్రహంతో ఆమె ఉత్తరం రాశారు. ‘మన కుటుంబంపై కేంద్రానికి ఇప్పటికే ఓ నివేదిక అందింది. దాని పర్యావసనమే ఐటీ దాడులు. హోంశాఖ తన నివేదికలో పేర్కొన్న అంశాలు నిజమన్నట్లుగా మీరంతా ఇలానే వ్యవహరిస్తే నేను జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జయలలిత చనిపోయిన వెంటనే ఓ కేంద్ర మంత్రి తనకు ప్రీతిపాత్రమైన వారికి సీఎం పదవి కట్టబెట్టేందుకు యత్నించారని దినకరన్ ఇంతకుముందు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన హోంశాఖ.. వెంకయ్య నాయుడే సదరు వ్యక్తి అని కేంద్రానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. కాగా శశికళ ఉత్తరం అందుకోవడం వల్లే కొత్త పార్టీ ఏర్పాటుపై దినకరన్ వెనక్కుతగ్గారని తెలుస్తోంది. -
శశికళకు కోపమొచ్చింది...
అన్నాడీఎంకే సామ్రాజ్ఞిగా, తమిళనాడు ప్రభుత్వాధినేతగా వెలుగొందాల్సిన శశికళ జైలు గోడల మధ్య చీకటి జీవితం గడుపుతోంది. అయ్యోపాపం అని జాలిచూపాల్సిన అన్నాడీఎంకే నేతలంతా ముఖం చాటేయడం వల్ల కలిగిన బాధను లోలోన అణచుకుంటూ వస్తున్న ఆమె కోపాన్ని వెళ్లగక్కారు. తానే సీఎం చేసిన ఎడపాడిపై తొలిసారిగా నోరు తెరిచారు. పనిలోపనిగా పన్నీర్సెల్వంను కూడా కలుపుకుని ఇద్దరిపైనా ఈసీకి ఫిర్యాదు చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: చిన్నమ్మ శశికళకు కోపమొచ్చింది. జైలు కెళ్లిన తర్వాత అన్నాడీఎంకే నేతలపై ప్రత్యక్షంగా తొలిసారి స్పందించారు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. అమ్మ జయలలిత మరణం, సీఎంగా పన్నీర్సెల్వం బలవంతపు రాజీనామా, శశికళపై తిరుగుబాటుతో అన్నాడీఎంకే రెండు ముక్కలైంది. శశికళ, పన్నీర్సెల్వం వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలుపాలు కావడంతో ఆ స్థానంలో ఎడపాడి వర్గం ఆవిర్భవించింది. ఎడపాడి, పన్నీర్ వర్గాల మధ్య పోరు మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్లో ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా టీటీవీ దినకరన్ పోటీచేయగా సీఎం ఎడపాడి, మంత్రి వర్గం ప్రచార భారాన్ని భుజానవేసుకుంది. అదే ఎన్నికల్లో పన్నీర్వర్గ అభ్యర్థిగా పోటీకి దిగిన మధుసూదనన్, జయలలిత మేనకోడలు దీప రెండాకుల గుర్తుకోసం పోటీపడడంతో మధ్యే మార్గంగా ఎన్నికల కమిషన్ గుర్తుపై తాత్కాలిక నిషేధం విధించింది. అంతేగాక ఎన్నికలను రద్దు చేసింది. రెండాకుల గుర్తును అధికార పార్టీకి దక్కేలా చేయాలని దొడ్డిదారి ప్రయత్నాలు చేసిన దినకరన్ జైలు పాలయ్యాడు. పన్నీర్సెల్వం సైతం ఈసీ వద్ద పోటీపడ్డాడు. కాలక్రమంలో ఎడపాడి, పన్నీర్ వర్గాలు ఏకం కాగా, రెండాకుల గుర్తు కోసం ఎడపాడి, దినకరన్ వర్గాల మధ్య పోటీ పెరిగింది. అత్యధిక సభ్యుల బలం కలిగిన వారికే రెండాకుల చిహ్నంను కేటాయించాలనే వాదనతో ఇరువర్గాలు సంతకాల సేకరణ ప్రారంభించి ఈసీకి సమర్పించడం ప్రారంభించారు. ఎడపాడి, దినకరన్ వర్గాల పత్రాలను స్వీకరించిన ఈసీ రెండాకుల చిహ్నం ఎవరికనే అంశంపై నాన్చుతూ వచ్చింది. అయితే ఇంతలో ఒక పిటిషన్ వల్ల మదురై హైకోర్టు కలుగజేసుకుని ఈనెల 30వ తేదీలోగా రెండాకుల చిహ్నం ఎవరిదో తేల్చాలని ఆదేశించింది. దీంతో విచారణలో వేగం పెంచిన ఈసీ ఎట్టకేలకూ ఈనెల 30వ తేదీన తుది తీర్పునకు సిద్ధమైంది. ఈసీ వద్ద అడ్డుచక్రం ఎడపాడి, పన్నీర్ వర్గాలు ఏకమై దినకరన్ను ఒంటరివాడిని చేయడంపై గత కొంతకాలంగా మండిపడుతున్న శశికళ అదనుకోసం వేచి ఉన్నారు. రెండాకుల చిహ్నం ఎడపాడి వైపు జారిపోయిన పక్షంలో ఇక తమకు రాజకీయ మనుగడ ఉండదనే ఆలోచనకు వచ్చి ఈసీ వద్ద అడ్డుచక్రం వేసింది. రెండాకుల చిహ్నం కోసం మంత్రులు, సర్వసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పేరున ఎడపాడి, పన్నీర్ కలసి దాఖలు చేసిన 1877 ప్రమాణ పత్రాల్లో 329 నకిలీవని శశికళ ఆరోపిస్తూ మంగళవారం ఈసీకి లేఖ రాశారు. నకిలీ పత్రాలు సమర్పించిన వారిద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సదరు వ్యక్తుల పేర్ల వద్దనున్న సంతకాలు ఫోర్జరీవని తెలిపింది. ఈనెల 30 వ తేదీన నాల్గవ దశ విచారణలో రెండాకుల చిహ్నం ఎవరికో తేలనున్న సమయంలో శశికళ రాసిన లేఖ ఏమాత్రం పనిచేసేనో వేచి చూడాల్సిందే. హైకోర్టులో నలపెరుమాళ్ పిటిషన్ ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని, పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవినే రద్దు చేస్తూ ఇటీవల సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై పొల్లాచ్చికి చెందిన పార్టీ సభ్యుడు నలపెరుమాళ్ మద్రాసు హైకోర్టులో మంగళవారం పిటిషన్ వేశారు. పార్టీ ఎన్నికలను ఈసీనే నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. -
20 కోట్ల విలువైన మరకత లింగం స్వాధీనం
కేకే.నగర్(చెన్నై): తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రూ.20 కోట్ల విలువైన మరకత లింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ కారు మధురై నుంచి చెన్నైకు శుక్రవారం పుదుకోట జిల్లా విరాళిమలై సమీపంలో వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన బస్సు కారును ఢీకొట్టింది. ఘటనలో కారు ముందు భాగం దెబ్బతిని అందులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని తిరుచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం కారులో 8 కిలోల బరువైన మరకత లింగాన్ని పోలీసులు గుర్తించారు. దాని విలువ రూ. 20 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఘటనపై కేసు నమోదు చేసుకుని ఆస్పత్రిలో ఉన్న క్షతగాత్రులను విచారిస్తున్నారు. కారుకు అధికార అన్నాడీఎంకే జెండా ఉండడం గమనార్హం. -
విలీనంపై కాసేపట్లో ప్రకటన
చెన్నైః ఏఐడీఎంకేలో సీఎం పళనిస్వామి మాజీ సీఎం పన్నీర్సెల్వం గ్రూపుల విలీనంపై మరికాసేపట్లో ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. పన్నీర్సెల్వం గ్రూపు ప్రతిపాదించిన డిమాండ్లకు సీఎం పళనిస్వామి అంగీకరిచడంతో విలీనం లాంఛనం కానుంది. ఇరువురు నేతలు జయలలిత మెమోరియల్ను సందర్శించి అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకుంటారని సమాచారం. జయలలిత మరణంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి రెండు గ్రూపుల మధ్య, వేర్వేరుగా సుదీర్ఘ మంతనాలు సాగాయి. పళనిస్వామి తన మంత్రివర్గ సభ్యులతో విలీనంపై చర్చించగా, పన్నీర్సెల్వం తన నివాసంలో సన్నిహిత నేతలతో సంప్రదింపులు జరిపారు. జయలలిత మరణంపై విచారణ జరిపించడంతో పాటు పోయెస్ గార్డెన్స్ నివాసాన్ని జయ మెమోరియల్గా మార్చాలనే పన్నీర్ డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించడంతో ఇరు గ్రూపుల విలీనానికి మార్గం సుగమమైంది. -
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శశికళ విచారణ
చెన్నై: విదేశీ మారక ద్రవ్యం నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కోర్టు విచారణలో పాల్గొన్నారు. బెంగళూరులోని అగ్రహారం జైలులో ఉన్న ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెన్నైలోని ఎగ్మూర్ ఆర్థిక నేరాల విచారణ కోర్టు విచారించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జకీర్ హుస్సేన్ అడిన ప్రశ్నలకు శశికళ.. ‘గుర్తు లేదు’, ‘తెలియదు’ అంటూ సమాధానాలు దాటవేశారు. శశికళ జైలు దుస్తుల్లోనే విచారణలో పాల్గొన్నారు. తదుపరి విచారణ 13వ తేదీకి వాయిదా పడింది. ఆ రోజున ఈడీ తరపున ఆమెను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అవకాశం కల్పిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. జయ టీవీ(జేజే టీవీ)కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ వస్తువుల కొనుగోళ్లకు డాలర్ల రూపంలో సాగిన నగదు బట్వాడాను ఈడీ గుర్తించింది. ఈ మేరకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె సన్నిహితురాలు శశికళలపై నాలుగు కేసులు నమోదయ్యాయి. జైలులో ఉన్నందున విడియో కాన్ఫరెన్స్ విచారణకు అనుమతించాలన్న శశికళ అభ్యర్థనకు ఎగ్మూర్ కోర్టు అంగీకారం తెలిపింది. -
ఏఐఏడీఎంకేలో విలీనం లేదు: పన్నీర్ సెల్వం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే వర్గాల విలీనానికి ఇక ఎంతమాత్రం తావులేదని ‘అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ’ వర్గ నేత, మాజీ సీఎం పన్నీర్సెల్వం స్పష్టం చేశారు. మధురై జిల్లా ఉసిలంపట్టిలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నుండి అనుమతి రాగానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు ఉంటాయని అన్నారు. విలీనం కోసం ఏర్పాటు చేసుకున్న కమిటీని రద్దు చేసినందున ఇక ఆ ఆంశాన్ని పక్కనపెట్టేశామని తెలిపారు. శశికళ వర్గంలో చేరాలని తనకు రూ.30 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు పన్నీర్వర్గ ఎమ్మెల్యే మనోహరన్ విరుదునగర్ జిల్లా రాజపాళయంలో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో తెలిపారు. -
నిర్దోషిగానే బయటకు వస్తా: శశికళ
సాక్షి ప్రతినిధి, చెన్నై: నిర్దోషిగానే చెన్నైకి వస్తాను, ఈ స్థితిలో చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలు తరలించవద్దని అన్నాడీఎంకే (అమ్మ) ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరు జైలు అధికారులతోపాటూ తన న్యాయవాదులకు సైతం సూచించినట్లు సమాచారం. ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న శశికళను ఇటీవల న్యాయవాదులు కలుసుకున్నారు. అన్నాడీఎంకే (అమ్మ) వర్గానికి చెందిన ఎడపాడి పళనిస్వామి తమిళనాడు సీఎంగా ఉన్నందున ఆయనతో మాట్లాడి పుళల్జైలుకు తరలింపుపై తగిన ఏర్పాట్లు చేస్తామని శశికళ కేసులు వాదించే న్యాయవాదులు ఆమెకు విన్నవించారు. అయితే ఆమె అందుకు నిరాకరించారు. నిరపరాధినని పేర్కొంటూ సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ను వేగిరపరిచి నిర్దోషిగా విడుదలపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. పుళల్జైలులో ఉంటే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందనే కారణంతోనే ఆమె నిరాకరించినట్లు సమాచారం. -
శత్రువులు కుట్రలు చేయడం సహజం
- స్టాలిన్పై దినకరన్ మండిపాటు - కోవింద్కు మద్దతుపై చిన్నమ్మదే తుది నిర్ణయం చెన్నై: ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్తి రామ్నాథ్ కోవింద్కు మద్దతుపై అన్నాడీఎంకే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ చెప్పారు. ఈ విషయంలో పూర్తి నిర్ణయాధికారం పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళదేనని తెలిపారు. మంగళవారం చెన్నైలో విలేకరులతో మాట్లాడిన దినకరన్.. ఒకటిరెండు రోజుల్లో బెంగళూరు జైలుకు వెళ్లి చిన్నమ్మను కలుస్తానని, ఆమె ఏం సూచిస్తారో ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తామని పేర్కొన్నారు. కుట్రలు సహజం ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ దినకరన్.. ప్రతిపక్ష డీఎంకేపై నిప్పులుచెరిగారు. ‘ప్రభుత్వాన్ని, అన్నాడీఎంకేను అస్థిరపర్చేందుకు శత్రువులు భారీ ఎత్తున కుట్రలు చేస్తున్నారు. రాజకీయాల్లో అది సహజం’ అని వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రస్తుత సీఎం పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు భారీ ఎత్తున ముడుపులు అందినట్లు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే శరవణన్.. స్టింగ్ ఆపరేషన్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అవకాశం కోసం ఎదరుచూస్తోన్న ప్రతిపక్ష డీఎంకే.. ముడుపులతో గట్టెక్కిన ముఖ్యమంత్రి గద్దెదిగిపోవాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోంది. -
అన్నాడీఏంకేలోకి విజయశాంతి?
- జైలులో శశికళతో ములాఖత్ రహస్యమిదే! - దినకరన్ సూచనతో వడివడిగా అడుగులు - రజనీకాంత్ కంటే ముందే లేడీ సూపర్స్టార్ ఎంట్రీ సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఇదిగో వస్తా.. అదిగో వస్తా..’ అంటూ పొలికల్ ఎంట్రీపై సూపర్ స్టార్ రజనీకాంత్ నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తుండగా.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మాత్రం వేగంగా పావులు కదుపుతున్నారు. ఒకప్పుడు తెలంగాణలో తనకంటూ ప్రత్యేక ఉనికిని చాటుకున్న ఆమె.. తాజాగా తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. జైలులో ఉన్న శశికళతో ఇటీవలే ములాఖాత్ అయిన విజయశాంతి.. మరికొద్దిరోజుల్లో అన్నాడీఎంకేలో చేరబోతున్నట్లు తెలిసింది. జయలలిత మరణానంతరం చెన్నైలో ప్రత్యక్షమైన విజయశాంతి.. ఆర్కేనగర్ ఉపఎన్నికలో టీటీవీ దినకరన్ తరఫున ప్రచారం చేశారు. సినీనటిగా విజయశాంతికి ఉన్న ఫాలోయింగ్, ఆమె రాజకీయ అనుభవం అన్నాడీఎంకేకు కలిసివస్తాయని భావించిన దినకరన్.. ఆ మేరకు శశికళను ఒప్పించినట్లు తెలిసింది. రజనీకాంత్ పొలికట్ ఎంట్రీ కంటే ముందే విజయశాంతిని అన్నాడీఎంకేలోకి చేర్చుకోవడం ద్వారా లబ్దిపొందొచ్చన్నది దినకరన్ వ్యూహంగా కనిపిస్తోంది. శశికళతో ములాఖత్ ఈనెల 5న దినకరన్ బెంగళూరుకు వెళ్లి శశికళను కలుసుకున్నారు. ఆయన వెళ్లిన కొద్దిసేపట్లోనే విజయశాంతి సైతం చిన్నమ్మతో ములాఖత్ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఇద్దరూ పలు విషయాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం. దినకరన్ సూచన మేరకు శశికళ.. విజయశాంతిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. నటిగా జనాకర్షణ, మహిళా నేత ఉంటే పార్టీని కట్టడి చేయడం సులభం అవుతుందని చిన్నమ్మ, దినకరన్ అంచనా వేసినట్లు పార్టీ వర్గాల కథనం. బీజేపీతో మొదలై.. నటిగా అత్యున్నత శిఖరాలు అధిరోహించి ‘లేడీ అమితాబ్ బచ్చన్’ అనే బిరుదును పొందిన విజయశాంతి.. 1998లో బీజేపీలో చేరడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తరువాత ‘తల్లి తెలంగాణ’ పార్టీని స్థాపించారు. అటుపై ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశారు. నేటి సీఎం కేసీఆర్ అప్పట్లో విజయశాంతికి టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పోస్టు ఇచ్చి గౌరవించారు. అయితే తెలంగాణ ఏర్పాటు అనంతరం (2014 ఎన్నికల సమయంలో) విజయశాంతి అనూహ్యంగా టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలోచేరి ఓటమిపాలై రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ జయలలిత మరణానంతరం చెన్నైలో సందడిచేశారు. -
జైలు నుంచి శశికళ విడుదల!
- 30 రోజుల పెరోల్పై చెన్నైకి చిన్నమ్మ బెంగళూరు: తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువైన అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ జైలు నుంచి విడుదలకానున్నట్లు తెలిసింది. అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆమెకు 30 రోజుల పెరోల్ లభించినట్లు పలు మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. సోమవారం సాయంత్రమే ఆమె జైలు నుంచి విడుదలై, నేరుగా చెన్నైకి వెళతారని సమాచారం. ఏప్రిల్లో మేనల్లుడు మహదేవన్(47) మరణించిన సందర్భంలో శశికళ పెరోల్ కోసం ఎంతగానో అభ్యర్థించినా సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ‘చిన్నమ్మకు పెరోల్’ వచ్చిందన్న వార్తలు ఆమె అభిమానుల్లో ఉత్తేజం నింపగా, ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని పార్టీ నాయకత్వంలో మాత్రం అలజడి రేపాయి. ఇప్పటికే శశికళ సహా ఆమె సోదరి కుమారుడు టీటీవీ దినకరన్లను పార్టీ పదవుల నుంచి తొలగించిన నేపథ్యంలో చిన్నమ్మ స్పందన ఎలా ఉంటుందోనని పళని వర్గీయుల్లో చర్చ మొదలైంది. శశితో దినకరన్ భేటీ: బెంగళూరులోని పణప్పర అగ్రహారం జైలులో ఉన్న శశికళను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ కలిశారు. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపడం, అక్రమ ఆస్తుల కేసుల్లో గతవారం అరెస్టయిన దినకరన్.. శుక్రవారం బెయిల్పై విడుదలయ్యారు. సోమవారం ఉదయం అగ్రహారం జైలులో శశితో భేటీ అనంతరం దినకరన్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళేనని, ఉప ప్రధాన కార్యదర్శి తానేనని దినకరన్ చెప్పారు. అక్క కొడుకుగా కాకుండా పార్టీ ఉపనాయకుడిగానే చిన్నమ్మతో భేటీ అయ్యానని వివరించారు. -
కొడిగడుతున్న దీపం
► బలహీనమవుతున్న పేరవై ► భర్త మాధవన్ వేరుగా కొత్త పార్టీ ► రూ.20 కోట్ల మోసం కేసు సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత రాజకీయ వారసురాలిగా తెరపైకి వచ్చిన ఆమె మేనకోడలు దీప నానాటికి తెరమరుగవుతున్నారు. భర్తతో మనస్పర్థలు, దీప పేరవై నేతలు కార్యకర్తలతో విబేధాలతో సతమతం అవుతున్న దీప జీవితంపై శుక్రవారం మరో రెండు పిడుగులు పడ్డాయి. భర్త మాధవన్ కొత్త పార్టీ స్థాపన, పేరవై సభ్యత్వాల పేరుతో రూ.20 కోట్లు మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు దీపను మరింత బాధల్లోకి నెట్టేశాయి. జయలలిత మర ణం వరకు పెద్దగా ఎవ్వరికీ తెలియని దీప ఆ తరువాత రాజకీయ అరంగేట్రం చేసి ప్రజలందరికీ పరిచయమయ్యారు. శశికళ చేతుల్లోని అన్నాడీఎంకే వెళ్లడాన్ని సహించలేని వారిపై నమ్మకంతో ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’ని స్థాపించారు. పేరవైపై భర్త మాధవన్ పెత్తనం లేకుండా చేసి ఆమె కారుడ్రైవర్ను ప్రధాన కార్యదర్శిగా, ఆయన భార్యను అధ్యక్షురాలిగా చేయడంతో ముసలం పుట్టింది. దీపపై అలిగిన మాధవన్ వేరే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. పన్నీర్సెల్వం రాజీనామా, శశికళపై తిరుగుబాటుతో అన్నాడీఎంకే రాజకీయాలు అల్లకల్లోలంగా మారిపోగా సీఎంగా ఎడపాడి పళనిస్వామి విశ్వాస పరీక్ష సమయంలో పన్నీర్సెల్వం పక్షాన నిలిచారు. మెజారిటీ ఎమ్మెల్యేలపై పన్నీర్సెల్వం పట్టుజారిపోవడంతో దీప మనస్సు మార్చుకుని సొంతంగా రాజకీయాలు ప్రారంభించారు. ఆర్కేనగర్లో పోటీకి దిగడంతో భర్త మాధవన్ మనసు మార్చుకుని మళ్లీ చేరుమయ్యారు. ఎన్నికల నామినేషన్ పత్రాల్లో భర్త పేరు కాలమ్ను ఖాళీగా పెట్టి మరో వివాదానికి కా>రణమయ్యారు. ఆనాటి నుంచి ఇరువురి మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. ఇటీవల అంబేడ్కర్ జయంతి సందర్భంగా దీప ఇంటి ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మాధవన్ను లోనికి అనుమతించక పోవడం అగ్నిలో అజ్యం పోసింది. దీప, మాధవన్ల అనుచరులు తీవ్రంగా ఘర్షణపడి రాళ్లు, నీళ్ల బాటిళ్లతో కొట్టుకున్నారు. ఘర్షణ సమయంలో ఇంటి నుంచి బైటకు వచ్చిన దీప భర్త మాధవన్ను ఇంట్లోకి రావద్దని హెచ్చరించి తరిమివేసింది. ‘ఎమ్జేడీఎంకే’ ఆవిర్భావం: మాధవన్ దీపను వదిలివేరుగా ఉంటున్న మాధవన్ శుక్రవారం అకస్మాత్తుగా రాజకీయ పార్టీ స్థాపించి పేరవైని మరింతగా బలహీనపరిచే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ‘ఎంజీఆర్ జయలలిత ద్రవిడ మున్నేట్ర కళగం’ (ఎమ్జేడీఎంకే) పేరున తాను స్థాపించిన కొత్తపార్టీకి దీపకు ఎటువంటి సంబంధం లేదు, తను చేరదలుచుకుంటే చేరవచ్చని ప్రకటించారు. శుక్రవారం ఉదయం నేరుగా జయలలిత సమాధి వెళ్లి నివాళులర్పించిన అనంతరం పార్టీ పేరును ప్రకటించి పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే తీవ్రమైన నాయకత్వలేమిని ఎదుర్కొంటోందని, ఇరుపక్షాల నేతలు పన్నీర్సెల్వం మాయలో పడిపోయారని మాధవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన నిజాయితీగా నిలిచే సిసలైన నేతను తానేనని చెప్పుకున్నారు. రెండాకుల చిహ్నం తన పార్టీకి సాధిస్తానని చెప్పారు. భర్త మాధవన్ పార్టీ పెట్టడం దీపకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. దీపపై రూ.20 కోట్ల మోసం కేసు: ఇప్పటికే పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయి ఉన్న దీప రూ.20 కోట్ల మోసం కేసులో చిక్కుకున్నారు. ఎంజీఆర్ అమ్మ దీప పేరవై కింద సభ్యత్వ దరఖాస్తుల రుసుం కింద రూ.20 కోట్ల మోసానికి పాల్పడ్డారంటూ చెన్నై నగరం నెశపాక్కంకు చెందిన జానకిరామన్ అనే వ్యక్తి చెన్నై మాంబళం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రద్దు చేసిన దీప పేరవై పేరుతో రెండు లక్షల దరఖాస్తులను రూ.10లకు అమ్మి, సభ్యత్వ రుసుమును స్వాహా చేశారని అతను ఆరోపించాడు. తాను సైతం రూ.50వేలు చెల్లించి 5వేల దరఖాస్తులను పొందానని చెప్పాడు. రిజిస్ట్రేషన్ దరఖాస్తులో కోశాధికారిగా, సభ్యత్వ దరఖాస్తులో ప్రధాన కార్యదర్శిగా పేర్కొనడం మోసపూరితమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. తనలాగా మరింత మంది కార్యకర్తలు మోసపోకుండా దీపపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలా రోజుకో సమస్యతో ‘దీప’ం కొడిగట్టుతోందా అనే భావన కలుగుతోంది. -
ఆ పోస్టర్లతో నా భార్యకు గుండెపోటు
- నటుడు, శాసనసభ్యుడు కరుణాస్ - పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చెన్నై: ఉద్దేశపూర్వకంగా తనను, కుటుంబాన్ని దారుణంగా కించపరుస్తోన్నవారిని శిక్షించాలని కోరుతూ సినీ నటుడు, శాసనసభ్యుడు కరుణాస్ చెన్నై పోలీస్కమీషనర్కు ఫిర్యాదుచేశారు. అన్నా డీఎంకే తరఫున తిరువాడాళై నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కరుణాస్.. ఇటీవలి రాజకీయ పరిణామాల్లో శశికళకు మద్దతుగా నలిచిన విషయం తెలిసిందే. అయితే కరుణాస్.. శశికళకు మద్తతు పలకడంపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నెల 22న కరుణాస్ పుట్టినరోజు సందర్భంగా విమర్శలజడి శృతిమించింది. కరుణాస్ ఫొటోకు ఆయన భార్య గ్రేస్ కన్నీటి అంజలి ఘటిస్తున్నట్లు కొందరు పోస్టర్లు రూపొందించారు. అంతటితో ఆగకుండా, ఆ పోస్టర్లను ముద్రించి గోడలపై అంటించారు. ఈ పరిణామాలతో కలత చెందిన కరుణాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుట్టిన రోజు సందర్భంగా కన్నీటి అంజిలి ఘటిస్తూ ముద్రించిన పోస్టర్లు చూసి తన భార్య తీవ్ర మనస్తాపంతో గుండెపోటుకు గురైందని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. భావ స్వాతంత్ర్యం పేరుతో తనను కించపరచే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తాను పోటీ చేసి గెలిచిన తిరువాడాళై నియోజక వర్గంలో 2,86,644 ఓటర్లు ఉన్నారని..అందులో నాకు వచ్చిన ఓట్లు 76 వేల 786 అని తెలిపారు. తన గెలుపును వ్యతిరేకించిన వారి సంఖ్య లక్షా 15 వేలు అని, ఓటు హక్కును వినియోగించుకోని వారి సంఖ్య 80 వేలు ఉందన్నారు. మొత్తం మీద తనకు, అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా రెండు లక్షల మంది ఉన్నారని అన్నారు. తనను కించపరచే విధంగా విమర్శలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. శుక్రవారం తన నియోజక వర్గం అయిన తిరువాడాళైకు కార్యకర్తలతో కలిసి వెళ్లిన కరుణాస్కు చేదు అనుభవం ఎదురైంది. దీపా పేరవైకి చెందిన కొందరు కరుణాస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతోపో లీసులు రంగప్రవేశం చేసి వారికి సర్దిచెప్పి పంపారు. -
నన్ను తొలగించడానికి మీరెవరు?: పన్నీర్
-
పన్నీర్కు జై : శిబిరంలోకి ఎమ్మెల్యేలు
-
నన్ను తొలగించడానికి మీరెవరు?: పన్నీర్
- పార్టీలోనే ఉంటా.. కొన్ని గంటల్లోనే నేనేంటో చూపిస్తా - తిరుగుబాటును విజయవంతం చేసేదిశగా సెల్వం అడుగులు - ఎమ్మెల్యేల మద్దతుతో నేడు ఢిల్లీకి పయనం చెన్నై: తనను అన్నాడీఎంకే కోశాధికారి పదవి నుంచి తప్పించడంపై పన్నీర్ సెల్వం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "ఈ పదవి నాకు అమ్మ(జయ) ప్రసాదించింది. నన్ను తీసేసే హక్కు ఎవ్వరీ లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీని వీడను. మరి కొద్దిగంటల్లోనే నేనేంటో చూపిస్తా. వేచి చూడండి..' అని గర్హించారు. జయ సమాధి వద్ద మీడియా సమావేశం అనంతరం నేరుగా తన నివాసానికి వెళ్లిపోయిన పన్నీర్ సెల్వంను కలుసుకునేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అన్నాడీఎంకేకు చెందిన కీలకనేతలు సైతం పన్నీర్ ఇంటికి క్యూకట్టారు. వారిలో అసెంబ్లీ స్పీకర్ ధన్పాల్, సీనియర్ ఎంపీ మైత్రేయన్ లాంటి ముఖ్యులు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో శశికళకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు పన్నీర్ సెల్వం ప్రయత్నాలు ప్రారంభించారు. తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు అవసరమైన ఎత్తుగడలను రచిస్తున్నారు. తనను 'ద్రోహి' అని నిందించిన శశికళ వర్గీయులపై మండిపడ్డ సెల్వం.. 'ప్రతిపక్ష నేత(స్టాలిన్) ఎదురుపడినప్పుడు నవ్వడం కూడా నేరమేనా? నాకు తెలిసి అలా నవ్వడం నేరమేమీకాదు'అని సెల్వం వ్యాఖ్యానించారు. చెన్నై 'సాక్షి' ప్రతినిధి సంజయ్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం పన్నీర్ క్యాంపులో 62 మంది ఎమ్మెల్యేలు చేరిపోయినట్లు తెలిసింది. ఇదే ఊపులో ఢిల్లీ వెళ్లేందుకు కూడా పన్నీర్ సెల్వం సమాయత్తం అయ్యారు. బుధవారం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రులను కలుసుకుని, మంత్రివర్గ ఏర్పాటుకై వినపత్రం ఇవ్వనున్నట్లు స్పష్టంగా తెలిసింది. మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారా? నాలుగు రోజుల కిందటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం తిరిగి పీఠం ఎక్కేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన దరిమిలా సభలో బలనిరూపణ కీలక అంశంగా మారింది. 235 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 135 మంది సభ్యుల బలం ఉంది. ప్రతిపక్ష డీఎంకే నుంచి 89మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్పార్టీకి 8, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. పన్నీర్ ముఖ్యమంత్రి కావాలంటే ఆయనకు కనీసం 117మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం ఆయనకు 62 మంది ఎమ్మెల్యేలు బేషరతుగా మద్దతు పలుకుతున్నారు. అంటే, మ్యాజిక్ ఫిగర్కు ఇంకా 55 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో అత్యధికులు శశికళ అనుచరులే కావడం వల్ల వారు పన్నీర్ను సపోర్ట్చేసే అవకాశాలు తక్కువ. ఈ పరిస్థితుల్లో ఆయనకున్న ఓకేఒక్క పెద్ద అండ.. ప్రతిపక్ష డీఏంకే! డీఎంకే మద్దతు ఇస్తుందా? నాలుగు రోజుల కిందట పన్నీర్ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేసినప్పుడు అందరికంటే ముందుగా స్పందించింది ప్రతిపక్షనేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలినే! శశికళను సీఎం కాకుండా అడ్డుకోవడానికి ఎంతదూరమైనా వెళతామని ప్రకటించిన స్టాలిన్.. తమిళనాడులో రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్తో మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. 'ఉంటే, గింటే పన్నీర్ సెల్వమే సీఎంగా ఉండాలికానీ, శశికళను ప్రజలు స్వీకరించరు'అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. తద్వారా అడగకనే పన్నీర్కు తన మద్దతు ప్రకటించారు. పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిని చేసేందుకు డీఎంకే మద్దతు పలికితే గనుక అది ఆ పార్టీకి ఆత్మహత్యాసదుశ్యమే! అయినాసరే, స్టాలిన్ ధైర్యం చేస్తారా? అంటే స్పష్టమైన సమాధానం చెప్పలేం. అన్నాడీఎంకే చీలిక వర్గానికి తాత్కాలిక మద్దతు పలకడంద్వారా వచ్చే ఎన్నికల నాటికి డీఎంకేను మరింత బలోపేతం చేయొచ్చని భావిస్తేగనుక పన్నీర్కు స్టాలిన్ మద్దతు పలకొచ్చు! (పన్నీర్ సెల్వం తిరుగుబాటు) -
తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్
చెన్నై : జయలలిత మరణం, పన్నీర్ సెల్వం సీఎం గద్దెనెక్కడం, శశికళ నటరాజన్ అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టడం తదితర పరిణామాల నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం బలనిరూపణకు సిద్ధపడాలని ప్రతిపక్ష పార్టీ డీఎంకే డిమాండ్ చేసింది. వెంటనే శాసనసభను సమావేశపరచాలని సూచనలు చేసింది. కాగా ముఖ్యమంత్రి పీఠం మీద జయలలిత నిచ్చెలి శశికళ నటరాజన్ను కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పీఠం నుంచి పన్నీర్ సెల్వాన్ని తొలగించి ఆయన స్థానంలో శశికళను సీఎం చేయాలన్న డిమాండ్ రోజురోజుకు ఊపందుకుంటోంది. తాజాగా ఐదుగురు మంత్రులు ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం గమనార్హం. ఇక జయలలిత మరణం తర్వాత ఆమె స్థానంలో అన్నాడీఎంకే పగ్గాలను శశికళ చేపట్టిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మ పదవిని చేపట్టడంతో.. ఇదే అదనుగా ఆమెకే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా కట్టబెట్టాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం కూడా ముఖ్యమంత్రి బలనిరూపణకు సిద్ధం కావాలని డిమాండ్ చేయటం తమిళ రాజకీయాలు ఏ క్షణంలో ఏవిధంగా మలుపు తిరుగుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కేంద్రం మద్దతు తనకే ఉందని బలంగా నమ్ముతున్న పన్నీరు సెల్వం రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా తన సీఎం సీటును కాపాడుకోవడానికి లోలోపల ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆయన ప్రధాని మోదీనికి కూడా కలిశారు. రాష్ట్రానికి వరద సాయం అందించాలంటూ, అలాగే జయలలితకు భారతరత్న ఇవ్వాలంటూ పన్నీరు సెల్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. -
ఇక శశికళ వర్సెస్ స్టాలిన్
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూత నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ డీఎంకేలో కూడా కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంతకాలం ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటున్న ఎం. కరుణానిధి కూడా తన రాజకీయ వారసుడైన ఎంకే స్టాలిన్కు పార్టీ పగ్గాలు అప్పగించనున్నారు. స్టాలిన్ ప్రస్తుతం పార్టీకి కోశాధికారిగా ఉన్నారు. ఆనాడు ఎంజీ రామచంద్రన్కు, ఆ తర్వాత జయలలితకు సమాన స్థాయి నాయకుడిగా డీఎంకే పార్టీకి సారథ్యం వహిస్తూ వచ్చిన ఎం. కరుణానిధికి ఇక ఇప్పుడు ఆ అసరం లేదని, క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం వచ్చిందని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఆయన స్థానంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా స్టాలిన్ పార్టీ పగ్గాలు స్వీకరిస్తారని, డిసెంబర్ 20వ తేదీన జరిగే పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అనారోగ్యంతోపాటు.... 94 ఏళ్ల కరుణానిధికి ఆరోగ్యం కూడా సరిగ్గా సహకరించడం లేదు. అనారోగ్యం కారణంగా వారం రోజులపాటు ఆస్పత్రిలో ఉండి మొన్ననే ఇంటికి వచ్చారు. ఈ కారణమే కాకుండా తనకు సమాన స్థాయిగల నాయకులు ఇప్పుడు లేరుకనుక ఆయన క్రియాశీలక బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు వివరించాయి. త్వరలో ఏఐఏడీఎంకే బాధ్యతలు స్వీకరించనున్న శశికళకు, కరుణానిధికి ఏ విషయంలో కూడా పోలికలేదని, నాయకత్వం మార్పునకు ఇదే తగిన సమయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎప్పటి నుంచో చెబుతున్న మాట... తన రాజకీయ వారసుడు ఎంకే స్టాలిన్ అంటూ ఎం. కరుణానిధి మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. గతంలోనే తాను తప్పుకొని పార్టీ బాధ్యతలు స్టాలిన్కు అప్పగించాలని కూడా అనుకున్నారు. అయితే ఆయన పెద్ద కుమారుడు ఎంకే అళగిరి అందుకు వ్యతిరేకిస్తూ రావడం వల్ల కుదరలేదు. 2014లో పార్టీ నుంచి అళగిరిని బయటకు పంపించడంతో ఇప్పుడు స్టాలిన్ను అడ్డగించే వారు ఎవరూ లేరు. శశికళతో పోలిస్తే స్టాలిన్కే రాజకీయానుభవం ఎంతో ఎక్కువ. డిప్యూటీ సీఎంగా కూడా.... 1953లో జన్మించిన స్టాలిన్ 1989లో తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1996 నుంచి 2001 వరకు నగర మేయర్గా పనిచేశారు. 2009 నుంచి 2011 వరకు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించి జైలుకు వెళ్లడం ద్వారా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్ష పదవిలో కరుణానిధే కొనసాగుతారని, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పార్టీ బాధ్యతలను స్టాలిన్ స్వీకరిస్తారని తెల్సింది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పార్టీలో లేనందున పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ రాజ్యాంగాన్ని కూడా మారుస్తారని తెల్సింది. -
శశికళ జయకు దగ్గరైన వేళ
-
'అమ్మ' పడిలేచిన కెరటం
-
జయలలిత 'శక్తి స్వరూపిణి'
-
జయలలిత ఇక లేరు!
-
తలైవీ.. సెలవ్
తమిళ ప్రజల ‘అమ్మ’ జయలలిత అస్తమయం - శోకసంద్రంలో తమిళనాడు..రాష్ట్రమంతటా ఉద్రిక్తత - పరిస్థితిని ప్రధానికి వివరించిన వెంకయ్య - ఆస్పత్రి వేదికగా ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల భేటీ -ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం, పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ! - అవాంఛనీయ ఘటనలక తావివ్వకుండా సెల్ నెట్వర్క్ నిలుపుదల - రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్కడికక్కడ ఆగిపోయిన బస్సు సర్వీసులు - భద్రత దళాల గుప్పిట్లో రాష్ట్రం తమిళనాట ‘అమ్మ’ శకం ముగిసింది... విప్లవ నాయకి (పురచ్చి తలైవీ) విశ్రమించింది... 74 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ధీర నాయకి దిగంతాలకు చేరింది... ‘పురచ్చి తలైవీ’గా కోట్లాది మంది గుండెల్లో కొలువైన తమిళనాడు సీఎం జయరాం జయలలిత(68) సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్తో సెప్టెంబర్ 22న ఆమె ఆసుపత్రిలో చేరారు. జయ కోలుకున్నారని, రేపోమాపో డిశ్చార్జి అవుతారని కొద్దిరోజుల క్రితమే వైద్యులు ప్రకటించారు. అయితే ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించింది. లండన్ నుంచి వచ్చిన రిచర్డ్తో సహా ఎయిమ్స్ వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరికి తీవ్ర ఉత్కంఠ మధ్య ‘అమ్మ ఇక లేరు’ అంటూ వైద్యులు ప్రకటించారు. దీంతో ‘అమ్మ’ అభిమానుల గుండెలు పగిలాయి. రోదనలు మిన్నంటారుు. ముందస్తు చర్యగా తమిళనాడు రాష్ట్రమంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జయలలిత మృతిపట్ల రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర సీఎంగా పన్నీర్ సెల్వం, మరో 31 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్నాడీఎంకే పార్టీ నాయకత్వ బాధ్యతలు జయ నెచ్చెలి శశికళకు అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత(68) సోమవారం అర్ధరాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ వార్త వినగానే ఏఐఏడీఎంకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్రం యావత్తూ శోకసంద్రంలో మునిగిపోరుుంది. కాగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా సోమవారం అర్ధరాత్రి పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. జయలలిత జ్వరం, డీహైడ్రేషన్తో బాధపడుతూ సెప్టెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి ఆమె చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో 74 రోజుల పాటు ఆమె చికిత్స పొందారు. మూడు వారాల క్రితం డిశ్చార్జ్ దశకు చేరుకున్న దశలో ఈనెల 4వ తేదీ సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడంతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చికిత్సకు స్పందిస్తున్నారని అపోలో యాజమాన్యం ప్రకటించిన కొద్ది గంటలకే ఆమె ఇక లేరన్న వార్త వినాల్సివచ్చింది. అంతకు ముందు అమ్మకు ఏమైంది.. ఆమె ఆరోగ్యం ఎలా ఉందని చర్చించుకుంటున్న తరుణంలో ‘అమ్మ లేదిక’ అంటూ సోమవారం సాయంత్రం టీవీ మాధ్యమాల్లో వదంతులు ప్రసారం కావడంతో అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆవేదన, ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పార్టీ శ్రేణులు అపోలో ఆసుపత్రి వద్ద బారికేడ్లను ఈడ్చి పారేసి లోపలకు చొరబడే ప్రయత్నం చేశారుు. మహిళా కార్యకర్తలు గుండెలవిసేలా రోదించారు. దుకాణలన్నీ మూతపడ్డారుు. పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ పతాకాన్ని అవనతం చేశారు. ఈ పరిస్థితిలో ‘వదంతులు నమ్మవద్దు.. అమ్మ చికిత్సకు స్పందిస్తున్నారు’ అంటూ అపోలో యాజమాన్యం ప్రకటించడంతో తిరిగి సాధారణ పరిస్థితి నెలకొంది. జయకు వైద్యం కొనసాగుతుండగానే మరో వైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆసుపత్రిలో ఉదయం, రాత్రి రెండు దఫాలుగా సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం, పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళకు పగ్గాలు అప్పగించే దిశగా పరిణామాలు మారిపోయారుు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని అనుకూలంగా మలుచుకునేందును బీజేపీ నేతలు సైతం రంగంలోకి దిగారు. రాత్రి పొద్దుపోయే దాకా చర్చలు, సమావేశాలు కొనసాగాయి. ఆసుపత్రి వద్ద అభిమానుల రోదనలు అమ్మ ఇకలేరని తెలియగానే రాష్ట్రమంతటా ఒకటే ఆందోళన. ఏఐఏడీఎంకే నేతలు, కార్యకర్తలు, అభిమానులంతా అపోలో ఆసుపత్రికి పరుగులు పెట్టారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. జయలలిత జ్వరం, డీహైడ్రేషన్తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారని సెప్టెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి అపోలో యాజమాన్యం ప్రకటించిన తరువాత.. ఈ 74 రోజుల కాలంలో ఆమె అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అమ్మ ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి అపోలో ముంగిటే గడుపుతున్న మహిళా కార్యకర్తల ముఖాల్లో విషాదఛాయలు అలుముకున్నారుు. కన్నీటి పర్యంతమవుతూ గుండెలవిసేలా రోదించారు. రోజంతా ఉత్కంఠ సోమవారం తెల్లవారుజామున ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై ఒక అధికారిక బులిటెన్ విడుదల అవుతుందని అంతా ఉత్కంఠతో గడిపారు. ఇదే సమయంలో అపోలో ఆసుపత్రిలోని నర్సులను హడావుడిగా ఇంటికి పంపించేశారు. గవర్నర్ విద్యాసాగర్రావు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆపోలోకు చేరుకున్నారు. మంత్రులతో కొద్దిసేపు సమావేశమై రాజ్భవన్కు చేరుకున్న తర్వాత కూడా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అపోలో ఆసుపత్రి వైపునకు దారితీసే అన్ని మార్గాల్లో పోలీసులు బారికేడ్లు అడ్డుగా పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితులు తలెత్తడంలో సిటీ బస్సులను నడిపేందుకు డ్రైవర్లు, కండక్టర్లు విముఖత చూపారు. తిరునెల్వేలీలో ప్రభుత్వ బస్సు అద్దాలను పగులగొట్టారు. ఎక్మో చికిత్స గుండెపోటుకు గురైన ముఖ్యమంత్రి జయలలితను ప్రత్యేక వార్డు నుంచి అత్యవసర వార్డుకు తరలించిన అపోలో వైద్యులు సోమవారం తెల్లవారుజామున శస్త్రచికిత్స చేసి ఎక్మో (ఎక్స్ ట్రాకోర్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్) అనే వైద్య పరికరాన్ని ఆమె గుండెకు అమర్చారు. ఈ పరికరం గుండె, శ్వాసకోస సమస్యలను అధిగమించేలా చేస్తుంది. ఆగిపోరుున గుండెను తిరిగి పనిచేరుుంచే సామర్థ్యం కలిగిన ఎక్మో పరికరాన్ని ఆమర్చినా పరిస్థితి అంతగా మెరుగుపడలేదు. సోమవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో యాంజియోగ్రామ్ కూడా చేశారు. ‘అమ్మ కోలుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం.. ప్రజలు సైతం ఆమె కోసం ప్రార్థనలు చేయండి’ అంటూ అపోలో మేనేజింగ్ డెరైక్టర్ సంగీత రెడ్డి సోమవారం ట్వీట్ చేశారు. సర్వశక్తులూ ఒడ్డాం: డాక్టర్ రిచర్డ్ ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కుదట పడేలా చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డినట్లు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ సోమవారం తెలిపారు. లండన్లో ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ వైద్య శాస్త్రంలోని అన్నింటిని ఆమె కోసం వినియోగించామని, అరుుతే ఎవ్వరూ ఊహించని రీతిలో అకస్మాత్తుగా ఆమె గుండెపోటుకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ఢిల్లీ నుంచి ఐదుగురితో కూడిన ఎరుుమ్స్ వైద్యుల బృందం చెన్నైకి చేరుకుని చికిత్స ప్రారంభించింది. రాత్రి 11.30 గంటల అనంతరం వారు తిరిగి వెళ్లారు. అంతకు ముందు.. ముఖ్యమంత్రి జయలలిత కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ వేర్వేరుగా ట్వీట్ చేశారు. జయ పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావుతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, పొన్ రాధాకృష్ణన్, పుదుచ్చేరీ గవర్నర్ కిరణ్బేడీ, తమిళ కాంగ్రెస్ అధ్యక్షులు తిరునావుక్కరసర్ అపోలోకు వచ్చి సీఎం క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. జయ కోలుకోవాలని ఆకాంక్షింస్తున్నట్లు డీఎంకే అధ్యక్షులు కరుణానిధి, కోశాధికారి స్టాలిన్ అన్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి అంతకంతకూ విషమించిన నేపథ్యంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హుటాహుటిన చెన్నైకి చేరుకోవాలని ఆదివారం రాత్రే అందరికీ సమాచారం ఇచ్చారు. అపోలో ఆసుపత్రిలో శశికళకు కేటారుుంచిన గదికి సోమవారం ఉదయం 6 గంటలకు మంత్రులు పన్నీర్ సెల్వం, ఎడపాడి పళనిస్వామి వచ్చి ఆమెతో మాట్లాడారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహన్రావు, జైళ్ల శాఖ మాజీ అధికారి రామానుజం తదితరులు శశికళతో గంటపాటు సమావేశమయ్యారు. ఉదయం 11 గంటలకు మంత్రి పన్నీర్సెల్వం అధ్యక్షతన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశమై పలు విషయాలపై గంటన్నరపాటు చర్చించారు. పార్టీ శాసన సభాపక్ష నేతగా పన్నీర్సెల్వంవైపు మొగ్గు చూపినట్లు సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శి గా శశికళను ఎన్నుకోవాలని కొందరు సూచించినట్లు తెలుస్తోంది. జయ ఆరోగ్యంపై మోదీకి వెంకయ్య సమాచారం తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి వెంకయ్య నాయుడు అపోలోకు చేరుకుని వైద్యులతో మాట్లాడారు. తదుపరి మీడియాతో మాట్లాడకుండా మౌనంగా వెళ్లి పోయారు. కాసేపటి తర్వాత జయలలిత ఆరోగ్యం, తమిళనాడులో నెలకొన్న పరిస్థితుల గురించి పూర్తి వివరాలను ఫోన్ ద్వారా మోదీ దృష్టికి తీసుకెళ్లారు. నేటి సాయంత్రం లేదా రేపు అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం లేదా బుధవారం చెన్నైలోని మెరీనా బీచ్లో జయలలిత అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు, ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. స్తంభించిన జన జీవనం రాష్ట్రంలో ఒక వైపు కరెన్సీ కష్టాలు.. మరో వైపు సీఎం ఆరోగ్యం విషమించడంతో జనజీవనం దాదాపుగా స్తంభించిపోరుుంది. ముఖ్యమంత్రికి సంబంధించిన బులిటిన్ విడుదల కాకముందే జాగ్రత్త పడేందుకు ప్రజలు పెట్రోలు బంకుల వద్ద పెద్ద ఎత్తున క్యూ కట్టారు. కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు సిద్ధం చేసుకుంటున్నారు. పాఠశాలలకు సెలవులను ప్రకటించిన విద్యాశాఖ ఆ తరువాత మళ్లీ ఉపసంహరించుకుంది. విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకునేందుకు ఆస్కారం ఇవ్వకుండా సెల్ నెట్ వర్క్ సేవలను నిలుపుదల చేసేలా కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దీంతో పలుప్రాంతాల్లో సెల్ఫోన్లు పనిచేయలేదు. చెన్నైలోని ఆమెరికా రాయబార కార్యాలయం వీసా జారీ ప్రక్రియను నిలిపివేసింది. దీంతో అనేక రాష్ట్రాల నుంచి వీసాల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాజకీయ నేతలంతా తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ప్రజలు సైతం రాత్రివేళ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. రాష్ట్రమంతటా భారీ బందోబస్తు.. రాష్ట్రమంతటా దాదాపు హై అలర్ట్ ప్రకటించినట్లుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు ఇద్దరు ఐజీలను నియమించారు. కేంద్రం పంపిన 900 పారా మిలటరీ దళాలు సోమవారం ఎనిమిది విమానాల్లో చెన్నై చేరుకున్నారుు. ఎరుుర్ఫోర్స్, నౌకాదళాలు కూడా అవసరమైతే రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారుు. రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు అందారుు. సెలవులో వున్న పోలీసులంతా విధులకు హాజరు కావాలని, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సెలవు పెట్టరాదని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒక పోలీసు ఉన్నతాధికారి ఆదివారం నాడు జరిగిన తన కుమారుని నిశ్చితార్థాన్ని సైతం వదలుకుని విధులకు హాజరయ్యారు. అమెరికా రాయబారి కార్యాలయానికి మరింత బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎంకే ప్రముఖ నేతల ఇళ్ల వద్ద సాయుధ పోలీసులను ఉంచారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు పదే పదే హెచ్చరికలు జారీ అవుతున్నారుు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి పన్నీర్ సెల్వం పోలీసు ఉన్నతాధికారులతో ఆదివారం రాత్రి అత్యవసరంగా సమావేశమై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేదని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి గవర్నర్ విద్యాసాగరరావు తెలియజేశారు. చెన్నై పోయెస్ గార్డెన్లోని సీఎం నివాసం వద్ద పోలీసులు మోహరించారు. పెద్ద సంఖ్యలో బారికేడ్లను సిద్ధం చేశారు. కర్ణాటక, కేరళ, ఏపీల మధ్య బస్సుల రాకపోకలను సరిహద్దుల్లోనే నిలిపి వేయడంతోపాటూ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ పోలీసులను నియమించారు. -
పడిలేచిన కెరటం
తమిళులందరూ ‘అమ్మ’గా ప్రేమించే జయలలిత ఆ స్థానానికి చేరుకోవడానికి.. వారి గుండెల్లో చోటు సంపాదించుకోవడానికి చేసిన ప్రస్థానం అసాధారణమైనది! పురుషాధిక్య రాజకీయాలు.. కరడుగట్టిన ద్రవిడ రాజకీయాల్లో వైష్ణవ బ్రాహ్మణ వర్గానికి చెందిన స్త్రీ.. అవినీతి ఆరోపణలు.. కేసులు.. అరెస్టులు.. జైళ్లు.. అనర్హత వేట్లు! అరుునా.. మొక్కవోని ధైర్యం.. సడలని సంకల్పం.. ముళ్లబాటను పూలబాటగా మలచుకుని.. జనం గుండెల్లో చెదరని స్థానం సంపాదించుకున్న పురచ్చి తలైవి!! రాజకీయ అరంగేట్రం: దక్షిణాది సినీ రంగంలో ముఖ్యంగా తమిళనాట అగ్రనాయికగా వెలుగొందుతున్న జయలలితను 1982లో రాజకీయాల్లోకి తీసుకువచ్చింది అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు ఎం.జి.రామచంద్రన్. తొలుత పార్టీ సభ్యురాలిగా చేరిన జయలలిత ఏడాదిలోనే 1983లో పార్టీ ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు. రాజ్యసభ సభ్యత్వం: ఆ మరుసటి ఏడాదే 1984లో ఎంజీఆర్ కిడ్నీ వ్యాధి చికిత్స కోసం అమెరికా పయనమయ్యే ముందుగా.. పార్టీ నుంచి జయలిలత రాజ్యసభకు ఎన్నికయ్యేలా చేశారు. ఇది పార్టీలో ఎంతో మంది సీనియర్లకు మింగుడుపడలేదు. మరోవైపు ఎంజీఆర్ అమెరికాలో చికిత్స పొందుతుండగా.. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున జయ ప్రచారం నిర్వహించి గెలిపించారు. ఎంజీఆర్కు, జయలలితకు మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించినా.. జయ చాకచక్యంగా వాటిని ఎదుర్కొన్నారు. పార్టీ కోసం పోరాటం: 1987లో ఎంజీఆర్ మరణంతో ఆయన వారసత్వం విషయమై అన్నాడీఎంకేలో వివాదం రాజుకుంది. ఎంజీఆర్ భార్య జానకీ రామంచంద్రన్, జయలలితల మధ్య పార్టీ చీలిపోరుుంది. జయలలితవైపు ఉన్న ఎమ్మెల్యేల్లో ఏడుగురిపై స్పీకర్ అనర్హత వేటు వేయగా.. జానకీ రామచంద్రన్ గ్రూపు విశ్వాస పరీక్షలో నెగ్గింది. అరుుతే.. కొద్ది కాలానికే కేంద్రంలోని రాజీవ్ గాంధీ సర్కారు తమిళనాడులో జానకీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. ప్రతిపక్ష నాయకురాలిగా: ఈ క్రమంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జానకీ గ్రూపుపై జయలలిత పైచేరుు సాధించారు. అరుుతే.. అన్నా డీఎంకేలో ఈ అంతర్గత విభేదాల కారణంగా ఆ ఎన్నికల్లో డీఎంకే గెలిచింది. ఆ పార్టీ అధినేత కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. జయలలిత తమిళనాడు శాసనసభలో తొలి మహిళా ప్రతిపక్షనేత అయ్యారు. చీలిపోరుున అన్నాడీఎంకే రెండు విభాగాలనూ పునరైక్యం చేసి పార్టీ పగ్గాలు చేపట్టారు. ఎన్నికల సంఘం స్తంభింపజేసిన పార్టీ రెండు ఆకుల గుర్తును తిరిగి పునరుద్ధరించారు. తొలిసారి ముఖ్యమంత్రి: జయలలిత ఆ శపథాన్ని నెరవేర్చుకున్నారు. ఆ అవమానకర ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత.. 1991 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఘన విజయం సాధించింది. నాటి ఎన్నికలకు ముందు రాజీవ్గాంధీ ఎల్టీటీఈ చేతిలో హత్యకు గురవగా.. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న అన్నా డీఎంకే విజయానికి ఆ సానుభూతి పవనాలూ దోహదపడ్డారుు. మొత్తం 234 సీట్లకుగానూ 225 సీట్లు అన్నాడీఎంకే-కాంగ్రెస్ కూటమి గెలుచుకుంది. 1991 జూన్ 24న జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్ల పూర్తి కాలం పదవిలో కొనసాగారు. వరుస విజయం.. ఆపై అనారోగ్యం కోర్టు కేసుల నుంచి విముక్తి పొందిన జయలలిత 2016 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగించారు. ఎంజీఆర్ అనంతరం వరుసగా రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది రికార్డు సృష్టించారు. అంతేకాదు.. తమిళ ప్రజల గుండెల్లో ‘అమ్మ’గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. కానీ.. ఐదు నెలలు గడవక ముందే అనారోగ్యానికి గురయ్యారు. మూడు నెలలుగా ఆస్పత్రికే పరిమితమైన జయలలిత డిసెంబర్ ఐదోతేదీ సోమవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. శాసనసభలో దుశ్సాసనపర్వం 1989 మార్చి 25న తమిళనాడు శాసనసభలో జయలలిత తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు. సభలో అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే సభ్యుల మధ్య ఘర్షణ తలెత్తింది. ప్రతిపక్ష నాయకురాలు జయలలితపై అధికారపక్ష సభ్యులు దాడికి దిగారు. డీఎంకే సభ్యుడు దురై మురుగన్ జయలలిత చీర లాగారన్న ఆరోపణలు వచ్చారుు. జయలలిత చిరిగిన చీరతో, రేగిన జుట్టుతో, ఎర్రబడిన ముఖంతో సభ నుంచి బయటకు వచ్చారు. మీడియాకు జరిగిన ఘటనను వివరించారు. మళ్లీ తాను ఆ శాసనసభలో అడుగుపెడితే ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానని శపథం చేశారు. ఆరోపణలు అధిగమిస్తూ.. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జయలలితపై, ఆమె మంత్రివర్గంపై తీవ్ర స్థారుులో అవినీతి ఆరోపణలు వచ్చాయి. 1995లో జయ తన దత్తపుత్రుడు సుధాకరన్ వివాహ వేడుకను గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కేంత ఆడంబరంగా నిర్వహించడం వంటివి తీవ్ర దుమారం రేపారుు. ఈ క్రమంలో 1996లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఘోరంగా ఓడిపోరుుంది. ఆ పార్టీకి కేవలం 4 సీట్లు మాత్రమే దక్కారుు. స్వయంగా జయలలిత సైతం డీఎంకే చేతిలో ఓడిపోరుుంది. కేసులు.. తొలిసారి ఆరెస్టు తమిళనాడులో 1996లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత జయలలితపై పలు అవినీతి ఆరోపణలతో కేసులు నమోదు చేసింది. కలర్ టీవీల కుంభకోణంలో ఆమెకు రూ.10 కోట్లకు పైగా ముడుపులు అందాయని, టాన్సీ భూములను సొంతం చేసుకోవడనికి జయలలిత సీఎంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేవి ముఖ్యమైన ఆరోపణలు. జయలలితకు ఆదాయానికి మించి రూ.66.65 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ అప్పటి జనతా పార్టీ నేత సుబ్రమణ్యంస్వామి కేసు వేశారు. అదే ఏడాది డిసెంబర్ 7వ తేదీన జయను అరెస్ట్ చేయగా.. 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. కలర్ టీవీ కేసును 2000 సంవత్సరంలో కోర్టు కొట్టివేసింది. సీఎంగా ప్రమాణం.. అనర్హత 2001 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అరుుతే.. కేసుల కారణంగా జయలలిత ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోయారు. కానీ ఎన్నికల్లో గెలిచిన పార్టీ.. జయలలితను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. ఆమె 2001 మే 14న రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. కానీ.. టాన్సీ భూములు, ప్లెజెంట్ స్టే హోటల్ కేసుల్లో కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు పెండింగ్లో ఉండగా ఆమె సీఎం పదవి చేపట్టడం చెల్లదని సుప్రీంకోర్టు సెప్టెంబర్లో తీర్పునిచ్చింది. దీంతో ఆమె తనకు విశ్వాసపాత్రుడైన ఒ.పన్నీరుసెల్వానికి సీఎంగా బాధ్యతలు అప్పగించారు. మళ్లీ ముఖ్యమంత్రిగా.. జయలలిత తనపై నమోదైన కేసుల్లో న్యాయపోరాటం చేశారు. టాన్సీ భూములు, ప్లెజెంట్ స్టే హోటల్ కేసులను 2001లో కింది కోర్టులు కొట్టివేయగా.. 2003లో సుప్రీంకోర్టు ఆ తీర్పులను సమర్థించింది. దీంతో అదే ఏడాది మార్చిలో జయలలిత మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఉప ఎన్నికలో పోటీ చేసి అసెంబ్లీకి కూడా ఎన్నికయ్యారు. మరో ఓటమి.. మరో గెలుపు జయలలిత, ఆమె సారథ్యంలోని అన్నా డీఎంకే 2006 అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది. కేవలం 61 సీట్లు మాత్రమే గెలుపొందింది. అత్యధికంగా 96 సీట్లు గెలుపొందిన డీఎంకే.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. అరుుతే.. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత మళ్లీ విజయం సాధించారు. అదే ఏడాది మే నెలలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.ఆమె సారథ్యంలోని అన్నా డీఎంకే 11 పార్టీల తో పొత్తు పెట్టుకుని ఈ గెలుపును సొంతం చేసుకుం ది. జయ రాజకీయ ప్రస్థానం వేగం పుంజుకుంది. మళ్లీ అరెస్టు, జైలు, విముక్తి అయితే.. జయలలితను ఆస్తుల కేసు వెంటాడుతూనే ఉంది. 2014 సెప్టెంబర్లో జయలలితను దోషిగా పేర్కొంటూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. దీంతో జయ మరోసారి సీఎం పదవికి అనర్హురాలయ్యారు. మళ్లీ జైలుకు వెళ్లారు. ఆమె ఒ.పన్నీరుసెల్వంను సీఎంగా నియమించారు. కొద్ది రోజులకే సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యేక కోర్టు తీర్పును సస్పెండ్ చేసింది. 2015లో కర్ణాటక హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం.. జయలలితకు శిక్ష విధిస్తూ కింది కోర్టు తీర్పును రద్దు చేసింది. దీంతో జయ మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆరోజు... అవమానం... ఆ రోజు... డిసెంబరు 24... 1987 ఎంజీఆర్ మరణ వార్త... వినగానే జయ స్థాణువైపోరుుంది. కొంచెం సేపటికి తేరుకుని రామవరం గార్డెన్స్ (ఎంజీఆర్ ఇల్లు) వెళ్లేందుకు డ్రైవర్ను పిలిచింది. కానీ ఇంట్లోకి అడుగుపెట్టవద్దన్న హెచ్చరికలు జారీ అయ్యారుు. కారులోంచి బయటకొచ్చిన జయ తలుపులను చేతులతో దబదబ మోదింది. చాలాసేపటి తరువాత తలుపులు తెరుచుకున్నా ఎంజీఆర్ మృతదేహం ఎక్కడ ఉంచారన్న విషయం మాత్రం ఎవరూ జయకు తెలియనివ్వలేదు. చాలాసార్లు మెట్లు ఎక్కి దిగి ఇల్లంతా వెతికింది జయ. ఆమె ముఖం మీదే గదుల తలుపులు వేసేశారు. ఎంజీఆర్ కడచూపు కూడా దక్కనివ్వలేదు. చిట్ట చివరకు.. ఎవరో... మృతదేహాన్ని పెరటి తలుపు నుంచి రాజాజీ హాల్కు తరలించారన్న సమాచారం ఇచ్చారు. అంతే... జయ ఆయాసంతో రొప్పుతూ రాజాజీ హాల్కు తీసుకెళ్లాల్సిందిగా డ్రైవర్ను ఆదేశించింది. హాల్కు వెళ్లగానే పరుగు పరుగున ఎంజీఆర్ మృతదేహం తల వైపు కూర్చుండి పోరుుంది. కనురెప్పలు సైతం వాల్చకుండా... దాదాపు 21 గంటలు అక్కడే అలాగే ఉండిపోయింది. ఎంజీఆర్కు నివాళులు అర్పించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆమె సంకల్పానికి నివ్వెరపోయారు. శారీరకంగా ఇంత దృఢంగా ఉన్న జయపై ఆ దశలో జరిగిన మానసిక హింస అంతా ఇంతా కాదు. ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ మద్దతుదారులు జయ చుట్టుపక్కలే నిలబడి కాళ్లు తొక్కుతూ హింసించారు. వెనుకనుంచి గోళ్లతో గిచ్చారు. అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేసేందుకు శతధా ప్రయత్నించారు. అరుునా జయ చెక్కు చెదరలేదు. ఆత్మగౌరవానికి తీవ్రమైన భంగపాటు జరిగినా... ఎవరు ఎంత అవహేళన చేసినా ఉన్న చోటి నుంచి అస్సలు కదల్లేదు. పరిసరాల్లో ఏం జరుగుతోందో కూడా పట్టించుకోని స్థితికి చేరిపోయారు ఆమె. అరుుతే అంతటి విషమ పరిస్థితిలోనూ ఆమె మెదడును ఒక ప్రశ్న మాత్రం తొలిచేస్తూనే ఉండి ఉంటుంది. ‘‘ఇప్పుడేం చేయాలి?’’ అని. దాదాపు 38 ఏళ్ల వయసు... మంచి భవిష్యత్తు ఉంటుందని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎదురుగా జీవం లేకుండా పడి ఉన్నాడు. అప్పటివరకూ తమ నాయకుడికి రాజకీయ వారసురాలు తనేనన్న పార్టీ కార్యకర్తలూ పట్టించుకోని పరిస్థితి. అరుుతే... ఓటమిని తేలికగా తీసుకునే వ్యక్తి... .జయ కానే కాదు! అంతిమ యాత్రలోనూ అదే అవమానం... ఎంజీఆర్ అంతిమ యాత్ర మొదలయ్యే క్షణాలు... మృతదేహాన్ని ఉంచిన వాహనంలోకి ఎక్కేందుకు జయ ప్రయత్నించారు. డ్యూటీలో ఉన్న పోలీసులు ఓ చేయి అందించారు కూడా. అయితే ఆమె పైకి ఎక్కిందో లేదు... దిగిపోవాల్సిందిగా అరుపులు. చూస్తే ఎదురుగా ఎమ్మెల్యే కేపీ రామలింగం తనవైపు దూసుకొస్తూ కనిపించాడు. ఏమైందో తెలిసేలోపుగానే జయపై దాడి మొదలైంది. జానకీ రామచంద్రన్ దగ్గరి బంధువు దీపన్ జయ నుదుటిపై కొట్టాడు. వాహనం నుంచి కిందకు తోసేశాడు. తగిలిన గాయాలు ఆమెను బాధించాయో లేదోగానీ... ఆ అవమానం మాత్రం ఆమెను నిశ్చేష్టురాలిని చేసేసింది. అంత్యక్రియల్లో పాల్గొనకుండానే వెనక్కు వచ్చేయాల్సి వచ్చింది. మలుపు తిప్పిన ఆ రోజు... జయకు జరిగిన అవమానాలు ఏఐఏడీఎంకే కార్యకర్తలందరిలోనూ దావానలంలా వ్యాపించాయి. ఒక్కరొక్కరుగా కార్యకర్తలు, నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఆమె ఇంటికి చేరుకోవడం మొదలైంది. జరిగిన అవమానాన్ని ఖండించారు. ఎంజీఆర్ వారసురాలిగా తాము మీ వెంటే ఉంటామని జయకు భరోసా ఇచ్చారు. ఆ తరువాత రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 97 మంది ఎమ్మెల్యేలతో జానకీ రామచంద్రన్ ఇచ్చిన లేఖను ఆమోదిస్తూ గవర్నర్ ఎస్.ఎల్.ఖురానా ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. 1988 జనవరి ఏడున జానకి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా సూచించారు. ఆ రోజు అసెంబ్లీ అంత గందరగోళంతో నిండిపోయింది. కొంతమంది గూండాలు జయ మద్దతుదారులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై దాడులు చేశారు. తమిళనాడు చరిత్రలో మొదటిసారి పోలీసులు అసెంబ్లీలోకి ప్రవేశించి లాఠీఛార్జి చేశారు. ఈ సందర్భంలోనే సభాపతి జానకి రామచంద్రన్ విశ్వాస పరీక్ష నెగ్గినట్లు ప్రకటించారు. ఆ వెంటనే... జయ అసెంబ్లీ బయటకు వచ్చి ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆక్రోశం వ్యక్తం చేశారు. జానకి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని గవర్నర్ను కోరారు. అసెంబ్లీ సంఘటనలన్నింటితో గవర్నర్కు నివేదిక సమర్పించారు. ఆ తరువాత అసెంబ్లీని రద్దు చేసి తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా గవర్నర్ కేంద్రానికి సిఫారసు చేశారు. తమిళనాడులో జయ శకానికి నాందీ పడింది! (‘అమ్మ... జయలలితాస్ జర్నీ ఫ్రమ్ మూవీస్టార్ టు పొలిటికల్ క్వీన్’ గ్రంథం నుంచి. రచయిత: వాసంతి) -
శక్తి స్వరూపిణి
సాక్షి ప్రతినిధి, చెన్నై: పురచ్చితలైవి(విప్లవ నాయకి)లోని తెగువ.. అమ్మలోని అనురాగం.. ఎన్ని కష్టాలెదురైనా వెనక్కి తగ్గని నైజం ఆమె సొంతం. రెండేళ్లకే తండ్రి చనిపోయినా.. తల్లి సినిమాల్లోకి వెళ్లడంతో చిన్నతనంలో మాతృప్రేమకు దూరమైనా.. ఆమె కుంగిపోలేదు. చదువుల్లో టాపర్ అయినా.. కుటుంబపోషణ కోసం నాటకాల బాటపట్టినా.. ఎక్కడా నిరుత్సాహపడలేదు. నిండుసభలో దుశ్శాసన పర్వాన్ని ఎదుర్కొన్నా.. ఆ తర్వాత రెండేళ్లకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ధీరోదాత్త. ఇలా ఒక్కసారి కాదు ఏకంగా ఆరుసార్లు ముఖ్యమంత్రిగా ప్రజామన్ననలు పొందిన రికార్డు జయలలితకే సాధ్యం. తరతరాలుగా వేళ్లూనుకుపోయి ఉన్న పురుషాధిక్య సమాజంలో.. అందులోనూ రాజకీయాల్లో నెగ్గుకు రావడమంటే మాటలు కాదు. ఇది దాదాపు అసాధ్యమే. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అందరి చేత ‘జయ’హో అనిపించుకున్నారు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబంలో పుట్టినా జాతీయస్థాయి రాజకీయ పుంగవుల చేత జేజేలు కొట్టించుకున్నారు. ఒకనాడు ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్లను ఉక్కు మహిళ అనే వారు. ఈ కోవలోనే జయలలితనూ దక్షిణాది ఉక్కు మహిళ అని పిలుచుకోవచ్చు. ఆటుపోట్లతో అమ్మ ఎదురీత ఎంజీఆర్ మరణంతో జయకు కష్టాలు ప్రారంభమయ్యాయి. విపక్షం డీఎంకేతో పాటు స్వపక్షం అన్నాడీఎంకే నుంచి కూడా ఆమె అవమానాలను ఎదుర్కొన్నారు. ఎంజీఆర్ మృతి చెందగానే పార్టీ రెండుగా చీలింది. ఒక వర్గానికి నాయకత్వం వహించిన ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పటి ప్రధాని రాజీవ్గాంధీ ఆర్టికల్ 356 ప్రయోగించి జానకీ రామచంద్రన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. అక్కడితో ఆమె శకం ముగిసింది. 1989లో ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా తన వర్గానికి నాయకత్వం వహించి ఎన్నికల బరిలోకి దిగిన జయ.. తేనీ జిల్లా బోడినాయకనూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆమె పార్టీ కేవలం 27 సీట్లు మాత్రమే గెలవడంతో ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. తద్వారా తమిళనాడు తొలి మహిళా ప్రతిపక్ష నేతగా జయ చరిత్ర కెక్కారు. అదే ఏడాది జయ జీవితంలో మర్చిపోలేని చేదు సంఘటన చోటుచేసుకుంది. నిండు సభలో స్పీకర్ సాక్షిగా అధికారపక్షం డీఎంకే చేతిలో దాడికి, తీవ్ర పరాభవానికి గురయ్యారు. చినిగిన చీరతో అసెంబ్లీ నుంచి వెళ్లిపోతూ.. ‘ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టను’ అని జయ శపథం చేశారు. కాగా, చట్టసభలో ఎదురైన పరాభవం ఆమెకు ప్రజల నుంచి అంతులేని సానుభూతి తెచ్చిపెట్టింది. అదే సమయంలో అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఏకమవ్వడంతో జయలలిత పార్టీ సామ్రాజ్ఞిగా ఎదిగారు. 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆమె స్నేహహస్తం అందించారు. ఆ ఎన్నికల సమయంలోనే మాజీ ప్రధాని రాజీవ్గాంధీని ఎల్టీటీఈ తీవ్రవాదులు హతమార్చారు. కాగా, ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, కాంగ్రెస్ కూటమి 234 అసెంబ్లీ స్థానాలకు గానూ 225 చోట్ల, 39 పార్లమెంటు స్థానాల్లో గెలుపొంది జయకేతనం ఎగరవేసింది. దీంతో 1991లో జయలలిత తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. శపధాన్ని రెండేళ్లు కూడా తిరగక ముందే నెరవేర్చి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో జయ అడుగుపెట్టారు. అనంతరం 1996 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోరుుంది. మళ్లీ 2001లో రెండోసారి జయ ముఖ్యమంత్రి అయ్యారు. ఆతర్వాత 2002లో మూడోసారి, 2011లో నాలుగోసారి, 2015లో ఐదోసారి, 2016లో ఆరోసారి ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు చేపట్టారు. రికార్డుల్లో గురువును మించిన శిష్యురాలు రాజకీయాల్లో ఓనమాలు దిద్దించిన ఎంజీఆర్ సాధించిన రికార్డులను బద్దలుకొట్టడం ద్వారా గురువును మించిన శిష్యురాలు అనిపించుకున్నారు జయ. ఎంజీఆర్ మూడుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తే.. ఆయన శిష్యురాలు జయలలిత ఆరుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే గత పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి 39 స్థానాల్లో 37 స్థానాలను గెలుచుకున్న రికార్డు కూడా జయకు మాత్రమే సొంతం. మిత్రపక్ష పార్టీలను కూడా రెండు ఆకుల గుర్తుపైనే పోటీ చేరుుంచి గెలిపించడం జయ నాయకత్వ పటిమకు నిదర్శనం. అధికార పార్టీని ఐదేళ్ల తర్వాత ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం తమిళనాడు ప్రజల సంప్రదాయం. దీనిని కూడా ఆనాడు ఎంజీఆర్ తుడిచిపెట్టగా, ఇటీవలి ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం ద్వారా జయలలిత ఆ రికార్డును కూడా చెరిపివేశారు. ఎంజీఆర్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, జయలలిత 8 సార్లు పోటీ చేసి 7సార్లు గెలిచారు. ముహూర్తమంటే మక్కువ జ్యోతిష, సంఖ్యాశాస్త్రాలపై నమ్మకం కలిగిన జయలలిత తాను నివసిస్తున్న పోయెస్గార్డెన్లోని భవనానికి తన తల్లి పేరు కలిసొచ్చేలా ‘వేద నిలయం’ అని పేరు పెట్టుకున్నారు. అలాగే తన పేరును jayalalithaa (చివరన ‘ఎ’ అక్షరం అదనంగా)గా మార్చుకున్నారు. ఇక మంచి ముహూర్తం లేనిదే జయ కాలు బయటపెట్టరు. దైవభక్తి మెండుగా ఉన్న జయలలిత చెన్నై నగరంలోని కొట్టూరుపురం వినాయకుని ఆలయానికి తరచూ వెళుతుంటారు. అలాగే తన నెలసరి వేతనంతో ఆలయాల్లో నిత్యాన్నదానాలతో పాటు చిన్న గున్న ఏనుగును కూడా బహూకరించేవారు. కోమలవల్లి... జయలలిత కర్నాటకలోని(నాటి మైసూరు రాష్ట్రం) మాండ్య జిల్లా మేల్కోటేలో తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జయరామన్, వేదవల్లి(సంధ్య) దంపతులకు 1948 ఫిబ్రవరి 24న జయలలిత జన్మించారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం బిడ్డలకు రెండు పేర్లు పెట్టాల్సి ఉంది. ఒకటి పూర్వీకుల పేరు, మరొకటి వ్యక్తిగత పేరు. దీంతో అమ్మమ్మ కోమలవల్లి పేరుతో పాటు జయలలిత అని నామకరణం చేశారు. జయలలిత అనే పేరు వెనుక ఒక చిన్న చరిత్ర ఉంది. జయ చిన్నతనంలో ఆమె కుటుంబం మైసూరులో రెండు ఇళ్లలో అద్దెకు ఉంది. అందులో ఒకటి జయ విలాస్, మరొకటి లలిత విలాస్. ఈ రెండు పేర్లను కలిపి జయలలిత అని పెట్టారని చెబుతుంటారు. తండ్రి న్యాయవాద వత్తిని నిర్వహించినా ధనంపై ఆశతో పనిచేయకపోవడంతో స్థితిమంతులు కాలేకపోయారు. జయకు రెండేళ్ల ప్రాయంలోనే తండ్రి చనిపోయాడు. దీంతో తల్లి వేదవల్లి చంటిబిడ్డ జయను చంకన వేసుకుని బెంగళూరులోని తన పుట్టింటికి వచ్చేసింది. వేదవల్లి సోదరి అంబుజవల్లి ఎరుుర్హోస్టెస్గా పనిచేస్తూ డ్రామాలు, సినిమాల్లో నటించేందుకు మద్రాస్కు మకాం మార్చింది. దీంతో చిన్నారి జయను వదిలి తల్లి వేదవల్లి కూడా కుటుంబపోషణ నిమిత్తం 1952లో మద్రాస్కు వచ్చేశారు. ఆ తర్వాత వేదవల్లి సినిమా నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మారి తన వెండితెర పేరును సంధ్యగా మార్చుకున్నారు. తల్లిని విడిచి ఉండలేని జయలలిత కూడా 1958లో మద్రాసుకు చేరారు. జయ విద్యాభ్యాసం బెంగళూరులోని బిషప్ కాటల్ గర్ల్స్ హైస్కూల్తో పాటు మద్రాస్లోని చర్చిపార్క్ స్కూల్, స్టెల్లా మేరీస్ కాలేజీలో కొనసాగింది. చదువులో జయ ఎప్పుడూ టాపర్గా ఉండేవారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లిషు భాషల్లో అనర్గళంగా మాట్లాడగల దిట్టగా ఎదిగారు. అరుుతే, న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకోవాలనుకున్న జయ.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా సినీపరిశ్రమలో అడుగుపెట్టాల్సి వచ్చింది. అనంతర కాలంలో తమిళ ప్రజలు దేవుడిగా కొలిచే వెండితెర వేల్పు ఎంజీ రామచంద్రన్తో ఆమెకు పరిచయ భాగ్యం కలిగింది. ఇష్టాఇష్టాలు జయలలిత పూర్తి శాకాహారి. తన జీవితాన్ని ప్రభావితం చేసిన వారిలో మొదటి వ్యక్తిగా తల్లి సంధ్య పేరును ప్రస్తావించే జయలలిత.. అనంతరం రాజకీయ గురువు ఎంజీఆర్, మదర్ సెలినా(తన స్కూల్ టీచర్)ను కూడా తప్పకుండా గుర్తు చేసుకుంటారు. న్యాయశాస్త్రాన్ని అమితంగా ఇష్టపడే జయలలిత మంచి పుస్తకాలను సేకరించి పోయెస్ గార్డెన్లోని తన ఇంట్లో పెద్ద గ్రంథాలయమే ఏర్పాటు చేసుకున్నారు. ఇక జయలలితకు ఇష్టమైన పుస్తకం ‘వైల్డ్ స్వాన్స్’. ఇదిలాఉండగా, జయ ఇంట్లోనే తమిళ, ఇంగ్లిష్ పాత చిత్రాలను కూడా చూసేవారు. రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాలు ఆమెను డాక్టరేట్తో సత్కరించడం విశేషం. ఇక, జయకు ప్రాణ స్నేహితురాలు(నెచ్చెలి) శశికళ అరుుతే బద్ద విరోధి డీఎంకే అధినేత ఎం.కరుణానిధి. ఎంజీఆర్ అడుగుజాడల్లో.. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్)ను రాజకీయ గురువుగా భావించిన జయలలిత ఆయన అడుగుజాడల్లో నడవడం ప్రారంభించారు. 1982లో ఆమెకు ఎంజీఆర్ పార్టీ సభ్యత్వం కల్పించారు. బహిరంగ సభల్లో జయను ‘పెన్నిన్ పెరుమై’(మహిళలకే గర్వకారణం) అంటూ ఎంజీఆర్ పరిచయం చేసేవారు. 1983లో పార్టీ ప్రచార కార్యదర్శిగా ఆమెను నియమించారు. ఈ బాధ్యతలను జయ సమర్థవంతంగా నిర్వర్తించి ఆయన మెప్పు పొందారు. దీంతో 1984లో ఆమెను రాజ్యసభకు ఎంపిక చేశారు. అదే ఏడాది ఎంజీఆర్కు గుండెపోటు రావడం, అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకు రావడంతో పార్టీ ప్రచార కార్యదర్శిగా జయ విస్తృతంగా పర్యటించి పార్టీకి మంచి ఫలితాలు రాబట్టారు. కాగా, మూడేళ్ల తర్వాత 1987లో ఎంజీఆర్ మృతి చెందారు. పురట్చితలైవర్ (విప్లవనాయకుడు) అంటూ ఎంజీఆర్ను ప్రేమగా పిలుచుకునే ప్రజలు.. ఆయన రాజకీయ భావజాలాన్ని అందిపుచ్చుకున్న జయలలితను పురట్చితలైవి (విప్లవనాయకి)గా పిలవనారంభించారు. అమ్మ.. చిన్నమ్మ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ జీవితాన్ని ఎంతగా చెప్పుకున్నా.. ఆమె నెచ్చెలి శశికళను ప్రస్తావించకుంటే అది అసంపూర్తే. అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ‘ఈమె శశికళ మాత్రమే కాదు, జయలలిత నీడ’ అనేంతటి ప్రాధాన్యతను కల్పించుకుని టాక్ ఆఫ్ ది కంట్రీగా మారారు. శశికళ జయకు దగ్గరైన వేళ 1983లో జయలలిత అన్నాడీఎంకే ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు వీడియో కవరేజీ ఫొటో స్టూడియోను నడుపుతున్న శశికళను కలెక్టర్ చంద్రలేఖ జయకు పరిచయం చేశారు. వారిద్దరి పరిచయం స్నేహంగా మారింది. ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, ఆయన మరణం తర్వాత జయలలితకు పార్టీలో వ్యతిరేకుల నుంచి ఒత్తిడి ప్రారంభమైంది. ఈ కష్టకాలంలో శశికళ జయకు అండగా నిలిచారు. ఆ తరువాత జయలలిత నివాసమైన పోయెస్గార్డెన్లోనే శశికళ నివసించడం ప్రారంభించారు. 1991లో తొలిసారిగా జయ ముఖ్యమంత్రి అయ్యారు. పోయెస్గార్డెన్లో శశికళ బంధువుల పెత్తనం పెరిగింది. శశికళ అన్న కుమారుడు సుధాకరన్ను జయ దత్తు తీసుకున్నారు. 1996లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయ అరెస్టుకాగా, ఆమెతో పాటూ శశికళ కూడా అరెస్టయ్యారు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినా టాన్సీ కుంభకోణం వివాదాల్లో చిక్కుకుని ఉన్నందున జయ సీఎం కాలేక పోయారు. అపుడు పన్నీర్సెల్వంను తాత్కాలిక ముఖ్యమంత్రిగా పీఠంపై కూర్చోబెట్టింది శశికళనే. 2011లో జయ మళ్లీ అధికారంలోకి రాగా శశికళ కుటుంబ సభ్యుల అట్టహాసం మళ్లీ వేగం పుంజుకుంది. దీంతో జయలలిత ఆగ్రహం చెంది శశికళను పోయెస్గార్డెన్ నుంచి బైటకు పంపివేశారు. అరుుతే రెండోసారి కూడా శశికళ, జయలలితల మధ్య విభేదాలు ఎంతోకాలం నిలబడలేదు. శశికళ మళ్లీ పోయెస్గార్డెన్కు చేరుకున్నారు. ‘నన్ను చూసుకోవడం శశికళ వల్లనే సాధ్యం, ఆమె లేకుండా నేను ఒంటరిగా ఉండలేను’ అనే ఆప్యాయతను జయ ప్రదర్శించారు. -
'వాళ్లు తమ ఆత్మను దెయ్యానికి అమ్మేశారు'
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే విజయం సాధించడంపై మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు డబ్బులు తీసుకుని తమ 'ఆత్మని దెయ్యానికి అమ్మేశారు' అంటూ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన ట్విట్టర్ లో కామెంట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్లో డీఎంకేకు విజయావకాశాలు స్పష్టం కావటంతో ...అన్నాడీఎంకే డబ్బులు కుమ్మరించి గెలిచిందంటూ మారన్ ఆరోపించారు. 'నేను పరీక్షలో పాసైనా నన్నెందుకు ఫెయిల్ చేశావమ్మా' అని మారన్ మరో ట్వీట్ చేశారు. కాగా పోలింగ్ పూర్తి అయిన తర్వాతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడతాయి. అయితే ఓటమి భారంతో ఉన్న ఆయన మరిచిపోయినట్లు ఉన్నారు. దాంతో మారన్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు మారన్ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే స్పందిస్తూ... మారన్ ఇన్నిరోజులు నిద్రపోయి ఇప్పుడే మేల్కొని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలను అవమానిస్తున్నారని ట్విట్ చేసింది. -
పాపం సీనియర్ నటిని బుక్ చేశారు
చెన్నై: తమిళనాడు లోని రెండు అగ్రపార్టీల మధ్య రాజకీయ పోరులో ఒక సీనియర్ నటి అనూహ్యంగా ఇరుక్కున్నారు. చెన్నైలో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచార హోరులో ఒక ప్రకటన విమర్శల పాలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారంకోసం మీడియాను విరివిగా వాడుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక టీవీ ప్రకటనల్లో ఊదరగొడుతున్న ప్రకటన వివాదస్పదమైంది. 'కన్నబిడ్డలే కూడు పెట్టలేదు, నాకు అన్నం పెట్టింది విప్లవనాయిక అమ్మనే' ఇది అన్నాడీఎంకే ఆధ్వర్యంలో అధినేత్రి పురిచ్చిత్తలైవిని ఆకాశానికెత్తుతూ సాగే ప్రకటన. ఎన్నికల ప్రచారంలో భాగంగా జయలలిత చేపట్టిన 'అమ్మ క్యాంటీన్' పథకం వల్ల తమ కుటుంబం భోజనం చేస్తోందని, అన్నం పెట్టిన అమ్మకు ధన్యవాదాలు చెబుతున్నానంటూ రూపొందించిన యాడ్ ఫిల్మ్. 'ఆకాశంలో ఎగిరేవారికి మన సమస్యలు ఎలా తెలుస్తాయి? ప్రజల గురించి పట్టించుకోని ప్రభుత్వం ఇంకెందుకండి, చాలమ్మా..'. ఇది అధికార పగ్గాల కోసం ఉబలాటపడుతూ ఎలాగైనా, అమ్మను గద్దెదించాలని ఆరాటపడుతున్న డీఎంకే ఎన్నికల ప్రచార ప్రకటన. ఈ రెండు ప్రచార ప్రకటనల దృశ్యాలు టీవీ ఛానెళ్లలో విసృత్తంగా రోజూ ప్రసారమవుతున్నాయి. అయితే ఇక్కడే వుంది అసలు కథ. ఆ రెండు ప్రచార ప్రకటన దృశ్యాల్లోనూ నటించిన నటి ఒక్కరే కావడం విశేషం. ఒకే వ్యక్తి ఒకసారి జయలలితను ప్రశంసిస్తూ, మరోసారి విమర్శిస్తూ నటించిన ఈ రెండు వేర్వేరు ప్రకటనలను టీవీలు పదేపదే ప్రసారం చేస్తున్నాయి. అంతేకాదు ఈ రెండు వీడియో సన్నివేశాలనూ వాట్సాప్ గ్రూపుల్లో అప్లోడ్ చేసారు. దీంతో వివాదం చెలరేగింది. రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా ప్రజలతో ఇలాంటి తప్పుడు సందేశాలను ఇప్పిస్తున్నారంటూ పలువురు ఆరోపించడంతో వ్యవహారం కాస్తా ముదిరి పాకానపడింది. పాపం ఈ రెండు ప్రకనటల్లో నటించిన నటి పేరు కస్తూరి(64) . ముద్దుపేరు కస్తూరి పాటి (అమ్మమ్మ). చెన్నై తేనాంపేటలోని గుడిసెలో నివసించే కస్తూరిని దీనిపై వివరణ కోరగా.. ఆమె ఇలా చెప్పుకొచ్చారు... తాను ఎంత చెప్పినా వినకుండా ఇలా రెండు ప్రకటనల్లోను తనచేత నటింపచేశారని వాపోయింది. 20 రోజుల కిందట అమ్మ ప్రకటన కోసమంటూ నటించడానికి తనను తీసుకెళ్లారనీ, అందుకుగాను తనకు రూ.1,500 ఇచ్చారని తెలిపింది. ఆ తర్వాత కొద్దిరోజులకే మరో యాడ్ ఫిలిమ్లో నటించాలంటూ తీసుకెళ్లారని, అక్కడకు వెళ్లాక విషయం తెలిసిన వెంటనే , తన అభ్యంతరాన్ని తెలియజేశానని తెలిపింది. ఆ ప్రకటన అమ్మజయలలితకు వ్యతిరేకంగా ఉందని, అప్పటికే తాను అమ్మకు సానుకూలంగా ఓ ప్రచార వీడియో నటించానని వాళ్లకు చెప్పినా.... అయినా ఫర్వాలేదులే అని నటింపచేశారని, ఇందుకు గానూ తనకు రూ.1000 ఇచ్చి పంపించి వేశారని చెప్పింది. అయితే తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని వివరణ ఇచ్చుకుంది. ఎన్నికల్లో ఎవరు గెలిచినా తమలాంటి వాళ్లకు మంచి చేయాలని మాత్రం కోరుకుంటానని పేర్కొంది. కాగా ధనుష్ నటించిన మయక్కం ఎన్న, విజయ్ సేతుపతి నటించిన ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమార సంతానం నటించిన ఇనిమే ఇప్పడిదాన్ తదితర చిత్రాల్లో సహాయ నటిగా ఆమె నటించారు. -
దశలవారీగా మద్యనిషేధం
చెన్నై: అన్నాడీఎంకే తిరిగి అధికారంలోకి వస్తే తమిళనాడులో మద్య నిషేధాన్ని దశలవారీగా అమలుచేస్తామని సీఎం జయలలిత ప్రకటించారు. చెన్నైలో శనివారం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆమె ఐలాండ్ గ్రౌండ్స్ సభలో ప్రసంగించారు. 1971లో మద్యనిషేధాన్ని ఎత్తివేసిన చరిత్ర కరుణానిధికి ఉందని జయ గుర్తు చేశారు. మొత్తం మద్య నిషేధాన్ని అమలు చేయాలన్నదే తన విధానమని, ఒక్క సంతకంతో అది సాధ్యం కాదన్నారు. మొదట మద్యం విక్రయ షాపుల పనివేళలు తగ్గించి, తర్వాత దుకాణాల సంఖ్య తగ్గిస్తామన్నారు. అనంతరం మద్యం దుకాణాల అనుబంధ బార్లు మూతపడతాయన్నారు. విజయ్కాంత్ కూటమిలోకి తమిళ మానిల తమిళనాడులో డీఎండీకే-పీడబ్ల్యూఎఫ్ కూటమితో తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ) జట్టుకట్టింది. డీఎండీకే తనకు కేటాయించిన వాటిలో 20 సీట్లను టీఎంసీ కోసం త్యాగం చేసింది. విజయ్కాంత్ నేతృత్వంలోని డీఎండీకే 104 సీట్లలో, ఎండీఎంకే పార్టీ 29 సీట్లలో పోటీచేస్తుంది. టీఎంసీ 29 ీసీట్లలో, సీపీఎం, సీపీఐ, వీసీకే పార్టీలు చెరో 25 చోట్ల పోటీ చేస్తాయి. -
నటి కుష్బూపై వలర్మతి ధ్వజం
టీనగర్: నటి కుష్బూపై మంత్రి వలర్మతి ధ్వజమెత్తారు. నాగర్కోవిల్ అన్నా స్టేడియం ఎదుట ఈనెల 24వ తేదీన జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో నటి కుష్బూ పాల్గొని ప్రసంగించారు. ఆమె తన ప్రసంగంలో ఆకులు రాలిపోతాయని (రెండాకులు) హస్తం సాయంతో సూర్యుడు (ఉదయ సూర్యుడు) ఉదయిస్తాడని ఆవేశంగా మాట్లాడారు. కుష్బూ ప్రసంగానికి మంత్రి వలర్మతి ప్రతిగా స్పందించారు. కాంగ్రెస్ బహిరంగ సభ జరిగిన అదే అన్నా స్టేడియం ఎదుట శనివారం రాత్రి అన్నాడీఎంకే బహిరంగ సభ జరిగింది. ఆ సభలో వలర్మతి మాట్లాడుతూ కొన్న రోజుల క్రితం జరిగిన కాంగ్రెస్ సభలో ఆకులు రాలిపోతాయని కుష్బూ తెలిపారని, కాని అవి రాలిపోవని ఎందుకంటే ఎంజీఆర్చే పెంచబడిన రెండాకులు నేడు మర్రివృక్షం లా అభివృద్ధి చెందాయని, ఇవి సాధారణ ఆకులు కావని వైద్యానికి ఉపయోగపడే అమూల్యమైనవని పేర్కొన్నారు. ఈ రెండాకులను నశింపచేసే శక్తి ఎవరికీ లేదన్నారు. జయలలిత గురించి వారికి మాట్లాడే అర్హత లేదని అన్నారు. కొందరు కేరళను చూడండి, కర్ణాటకను చూడండని అంటున్నారని, అయితే ఆయా రాష్ట్రాల వారు తమిళనాడులో చక్కని పరిపాలన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని అన్నారు. -
ఎన్ని ట్విస్టులో..
► కూటమిలో పేరు రచ్చ ► నేతల భిన్న స్వరాలు ► కెప్టెన్ టీంకు వామపక్షాల నిరాకరణ ► గౌరవం తగ్గదన్న తిరుమా ► సింగపూర్కు విజయకాంత్ ► కేడర్లో గందరగోళం సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రజా సంక్షేమ కూటమి అలియాస్ కెప్టెన్ టీంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయోనన్న ప్రశ్న బయలు దేరింది. ఇంతకీ వీరంతా కలసికట్టుగా ముందుకు సాగుతారా..? అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో నెలకొంది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆ పార్టీ నాయకుల ఆదివారం భిన్న స్వరాలు పలకడం గమనార్హం. ఒక్కో నేత ఒక్కో వ్యాఖ్యలు, నియోజకవర్గాల ఎంపిక వ్యవహారాల్లోనూ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారి తీస్తోంది. ఎండీఎంకే నేత వైగో, సీపీఎం నేత జి రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్ల నేతృత్వంలో ఆవిర్భవించిన ప్రజా సంక్షేమ కూటమి డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం అని జబ్బలు చరస్తూ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కూటమిలోకి డీఎండీకే చేరడంతో ఇక, ఎన్నికల్లో కీలక సమరం అన్నాడీఎంకే, తమ మధ్య మాత్రమే అన్న కొత్త నినాదాన్ని అందుకుని ఉన్నారు. డీఎండీకే నేత విజయకాంత్ రాకతో ఆనంద తాండవం చేసిన ఈ కూటమి నాయకులు, మరింత బలాన్ని పెంచుకునే వ్యూహంతో మరికొన్ని పార్టీల్ని ఆహ్వానించడంలో నిమగ్నమయ్యారు. అయితే, ఈ కొత్త ప్రయత్నాలు ఎలాంటి మలుపులకు దారి తీయనున్నయో అన్న ప్రశ్న బయలు దేరింది. ఇందుకు కారణం ‘సీట్లే’. డీఎండీకేకు వచ్చి రాగానే 124 సీట్లను కట్టబెట్టారు. మిగిలిన 110 సీట్లను ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలు పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఎండీఎంకే, వీసీకేలు ఎక్కువ స్థానాల్ని తీసుకోవడాన్ని సీపీఎం, సీపీఐ వర్గాలు తప్పుబడుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ిసీపీఎం, సీపీఐలకు 19 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా, ఒక్క సీటూ లేని ఎండీఎంకే, వీసీకేలకు మాత్రం అత్యధికంగా స్థానాలు ఏమిటన్న ప్రశ్నను తెర మీదకు తెచ్చారు. దీంతో ఆ రెండు పార్టీల నాయకులు జి రామకృష్ణన్, ముత్తరసన్ ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి. అదే సమయంలో తమ సిట్టింగ్ స్థానాల్ని మళ్లీ అప్పగించాల్సిందే అన్న నినాదంతో ఎమ్మెల్యేలు గళం విప్పడంతో పాటుగా ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదుల్ని పంపినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ తతంగం ఓ వైపు సాగుతుంటే, మరో వైపు కొత్తగా కూటమిలోకి ఎవరైనా వచ్చిన పక్షంలో వారికి సీట్లను విజయకాంత్ సర్దాల్సిందే అన్న నినాదాన్ని కూటమి నేతలు అందుకున్నారు. కూటమిలోకి జికే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ), కృష్ణ స్వామి నేతృత్వంలోని పుదియ తమిళగంలు వచ్చి చేరిన పక్షంలో తనకు కేటాయించిన 124లో సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి విజయకాంత్కు ఎదురై ఉన్నది. అన్నాడీఎంకే వద్దే 35 సీట్లకు పైగా డిమాండ్ ఉంచిన జీకే వాసన్ బృందం, తాజాగా, ప్రజా సంక్షేమ కూటమిలోకి వచ్చిన పక్షంలో కనీసం యాభైకు పైగా అడిగే అవకాశాలు ఎక్కువే. ఇక, పుదియ తమిళగం పది వరకు ఆశించ వచ్చు. కొత్త పార్టీల చేరికతో సుమారు 50కు పైగా సీట్లను విజయకాంత్ వదులుకోక తప్పదు. చివరకు 70 - 75 లోపు సీట్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇందుకు డీఎండీకే వర్గాలు అంగీకరించేనా అన్న ప్రశ్న బయలు దేరింది. సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగిన విజయకాంత్, ఇంత తక్కువ సీట్లతో బరిలోకి దిగేది అనుమానమే. ఇక, నియోజకవర్గాల ఎంపికలో ఎలాంటి వివాదాలు బయలు దేరుతాయో అన్నది కూడా గమనించాల్సిన విషయమే.తాజా పరిణామాలపై కూటమిలోని నాయకులు ఆదివారం భిన్న స్వరాలు పలకడం చర్చకు దారి తీయడంతో పాటు, సఖ్యతతో ఎన్నికల నాటికి ఈ కూటమి ముందుకు సాగేనా అన్న ప్రశ్న బయలు దేరింది. పేరు రచ్చ : విజయకాంత్ రాకతో, ఇక ప్రజా సంక్షేమ కూటమి కెప్టెన్ టీంగా పేరు మారుస్తూ ఎండీఎంకే నేత వైగో ప్రకటన చేశారు. ఈ ప్రకటన వెలువడ్డ మరుసటి రోజే సీపీఐ సీనియర్ నేత నల్లకన్ను పెదవి విప్పారు. ఆ పేరు మార్చ వద్దని, ప్రజా సంక్షేమ కూటమి నినాదంతో ముందుకెళ్దామంటూ వ్యాఖ్యలు చేసి చర్చకు తెర లేపారు. ఇక, తమ వంతు వచ్చినట్టుగా ఆదివారం సీపీఎం నేత జి రామకృష్ణన్ స్పందించారు. కెప్టెన్ టీంను తాము అంగీకరించబోమని, ప్రజా సంక్షేమ కూటమిగానే పిలవాలన్న డిమాండ్ను లేవదీశారు. ఈ నెల 23న కుదుర్చుకున్న ఒప్పందం మేరకు డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి అని స్పష్టం చేయబడిందని, అయితే, కెప్టెన్ టీం అని నామకరణం చేయడానికి ఖండిస్తున్నామన్నారు. ఇక, జి రామకృష్ణన్కు సమాధానం ఇచ్చే క్రమంలో వీసీకే నేత తిరుమావళవన్ చేసిన వ్యాఖ్య మరో చర్చకు దారి తీసింది. ప్రజా సంక్షేమ కూటమి - డీఎండీకే కూటమి అని పిలిచినా, డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి అని పిలిచినా, కెప్టెన్ టీం అని పిలిచినా అంతా ఒక్కటే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, కెప్టన్ టీం అని పిలిచినంత మాత్రాన ఎవరి గౌరవమూ తగ్గదంటూ హితవు పలకడం గమనార్హం. అదే సమయంలో ఎండీఎంకే నేత వైగో ఓ మీడియాతో మాట్లాడుతూ, ఇక, తమ కూటమిలోకి ఏ పార్టీ వచ్చినా సరే, సీట్లను మాత్రం విజయకాంత్ సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటించారు. నియోజకవర్గాల ఎంపికపై నేతలందరూ నెల 31న సమావేశం కానున్నామని, సామరస్య పూర్వకంగా ముందుకు వెళ్తామని వ్యాఖ్యానించారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెన్నైలో అడుగు పెట్టిన సమయంలో జి రామకృష్ణన్ వ్యాఖ్యలు సంధించడం, తదుపరి ఆగమేఘాలపై సీతారాం ఏచూరితో ఎండీఎంకే నేత వైగో సంప్రదింపులు జరపడం గమనించాల్సిన విషయం. సింగపూర్కు విజయకాంత్: తాజా పరిణామాలతో వాడి వేడి చర్చ సాగుతున్న సమయంలో డీఎండీకే అధినేత విజయకాంత్ సింగపూర్ పయనానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసిన విజయకాంత్ కొంత కాలంగా అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ వస్తున్నారు. తాజాగా, ఆయన తప్పనిసరిగా చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చికిత్స నిమిత్తం ఆదివారం అర్ధరాత్రి కానీ సోమవారం ఉదయం కానీ సింగపూర్ బయలు దేరడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజులు అక్కడే ఉండబోతున్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. ఇక, సీఎం అభ్యర్థి సింగపూర్ పయనం అవుతుండడంతో కూటమిలో కొత్త గందరగోళం బయలు దేరింది. -
ఆహార పొట్లాలపై 'అమ్మ' చిత్రాలు!
-
ఆహార పొట్లాలపై 'అమ్మ' చిత్రాలు!
చెన్నై: ప్రజలను తీవ్ర విషాదంలో ముంచిన విపత్తులోనూ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారా? అంటే తమిళనాడులోని పరిస్థితి చూస్తే ఔననే అనిపిస్తున్నది. వర్షాలకు అల్లాడిన చెన్నైలో బాధిత ప్రజలకు అందజేస్తున్న సహాయక సామాగ్రిపై అధికార అన్నాడీఎంకే చెందిన శ్రేణులు బలవంతంగా ముఖ్యమంత్రి జయలలిత చిత్రాలు అతికిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 'అన్నాడీఎంకే శ్రేణులు మా వాహనాలను నిలిపివేశారు. మమ్మల్ని బెదిరించి బలవంతంగా బాధితులకు అందజేసేందుకు ఉద్దేశించిన బియ్యం బ్యాగులు, ఆహార పొట్లాలపై స్టిక్కర్లు అతికించారు. ఇది దారుణమైన చర్య. ఇలా చేయడం ఎంతమాత్రం సరికాదు' అని సంతోష్ అనే వాలంటీర్ తెలిపారు. ప్రస్తుత విషాద సమయంలోనూ రాజకీయ ప్రయోజనాలకోసం ఇలాంటి చెత్త చర్యలకు పాల్పడటం సరికాదని మరో వాలంటీర్ తెలిపారు. బాధిత ప్రజల కోసం తీసుకెళ్తున్న సహాయక సామగ్రిపై 'అమ్మ'గా పేరొందిన జయలలిత స్టిక్కర్లు ఉండటం తీవ్ర వివాదాన్ని సృష్టించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే అన్నాడీఎంకే నేతలు మాత్రం ఇది తమ చర్య కాదని అంటున్నారు. పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి ఎవరో దుండగులు ఈ చర్యలకు పాల్పడుతున్నారని, దీనిపై అన్నాడీఎంకే అధికారిక ప్రకటన విడుదల చేయనుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ నేత తెలిపారు. అయితే ఇప్పటివరకు అలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు ప్రతిపక్ష నేత స్టాలిన్ అనుచరులు మాత్రం అన్నాడీఎంకే శ్రేణుల చర్యలను తప్పుబడుతూ మరిన్ని ఫొటోలు విడుదలచేశారు. -
అమ్మ.. ఐదోసారి!
-
అమ్మ 'ఆకుపచ్చ' సాక్షిగా ప్రమాణం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత్రి జయలలితకు జ్యోతిష్యం అంటే అపార నమ్మకం. ముఖ్యమైన పనులు చేసేటపుడు తప్పకుండా జ్యోతిష్యుడి సలహా తీసుకుంటారు. సమయం, వారం, ధరించే దుస్తులు, రంగు వంటి విషయాల్లో జయలలితకు సెంటిమెంట్లు ఎక్కువ. జయకు సన్నిహిత వర్గాలు ఈ విషయాలు వెల్లడించారు. 67 ఏళ్ల జయలలిత శనివారం ఐదోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె ఆకుపచ్చని చీర ధరించి వచ్చారు. ప్రమాణం చేశాక ఆకుపచ్చ రంగు పెన్నుతో సంతకం చేశారు. జయ చేతి వేలిపై ఆకుపచ్చ రంగు ఉంగరం ధగధగలాడి పోయింది. మొత్తానికి జయ ఆకుపచ్చని రంగుతో మెరిసిపోయారు. ప్రమాణ స్వీకార వేదికను కూడా ఆకుపచ్చ రంగుతో అలంకరించారు. మరో విశేషమేంటంటే జయ ప్రమాణ స్వీకారం ముహూర్తం రోజును శనివారం ఎంచుకున్నారు. శనివారం శుభదినమని, సుస్థిరత చేకూరస్తుందని జయ విశ్వాసం. ఇక టైమ్ కూడా జయ కచ్చితంగా పాటించారు. ఈ రోజు ఉదయం 10:37 గంటలకు ఆమె తన నివాసం పోయెస్ గార్డెన్ నుంచి బయల్దేరారు. ప్రమాణ స్వీకార వేదిక మద్రాస్ యూనివర్సిటీ సెంటనరీ ఆడిటోరియంకు సరిగ్గా 11 గంటలకు వచ్చారు. అరగంటలోపే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ముగించారు. జయలలితతో ప్రమాణం చేయించిన గవర్నర్ రోశయ్య.. అనంతరం మంత్రులందరి చేత సామూహిక ప్రమాణం చేయించారు. -
మాజీ సీఎంకు రెండో స్థానం
చెన్నై: అన్నా డీఎంకే నేత పన్నీరు సెల్వంకు ఊహించని విధంగా రెండుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. అన్నా డీఎంకే అధినేతి జయలలిత అవినీతి కేసులో పదవి నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడటంతో తనకు నమ్మినబంటయిన సెల్వంను సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. కర్ణాటక హైకోర్టు జయలలితను నిర్దోషిగా ప్రకటించడంతో 'అమ్మ' ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా సెల్వం రాజీనామా చేశారు. శనివారం ఉదయం జయలలిత ఐదోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. జయ తన కేబినెట్లోకి సెల్వంను తీసుకున్నారు. జయ కేబినెట్లో సెల్వంది రెండోస్థానం. ఆయనకు కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య.. జయతో పాటు 28 మందితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. -
జయ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు వచ్చారంటే..
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రమాణ స్వీకారానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మద్రాస్ యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, నటుడు శరత్ కుమార్, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, జయ ఇష్టసఖి శశికళ, కుమారుడు సుధాకర్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రజనీకాంత్, శరత్ కుమార్ పక్కపక్కనే ఆశీనులయ్యారు. అలాగే అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అమ్మ పట్టాభిషేకానికి తరలి వచ్చారు. గవర్నర్ రోశయ్య ..జయలలితతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఆమెను అభినందించారు. ఆ తర్వాత మంత్రులంతా సామూహికంగా ప్రమాణ స్వీకారం చేశారు. -
తమిళనాడు సీఎంగా జయ ప్రమాణ స్వీకారం
-
తమిళనాడు సీఎంగా జయ ప్రమాణ స్వీకారం
చెన్నై : అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. శనివారం ఉదయం 11.08 గంటలకు ఆమె ముఖ్యమంత్రిగా తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రోశయ్య మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జయలలితతో ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయ గద్దెనెక్కడం ఇది అయిదోసారి. అనంతరం ఆర్థికమంత్రిగా పన్నీర్ సెల్వం, విద్యుత్ మంత్రిగా నాథమ్ ఆర్ విశ్వనాథన్, గృహ నిర్మాణశాఖ మంత్రిగా ఆర్.వైదిలింగం ప్రమాణం చేశారు. కీలకమైన హోం, పోలీసు, పబ్లిక్, ఆల్ ఇండియా సర్వీసెస్, సాధారణ పాలన వంటి శాఖలను జయ తన వద్దే ఉంచుకున్నారు. జయలలితతో పాటు 28మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత దోషిగా తేలడం, ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకోవడంతో కిందటేడాది సెప్టెంబర్ 29న పన్నీర్ సెల్వన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కాగా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఈనెల 11న జయను నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. జయ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, పార్టీ నేతలు హాజరయ్యారు. అంతకు ముందు జయలలిత ప్రమాణ స్వీకారానికి పోయెస్ గార్డెన్ నుంచి మద్రాస్ యూనివర్శిటీకి వెళుతుండగా అభిమానులు, కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపుల నిలబడి అమ్మకు ఘన స్వాగతం పలికారు. -
జయకు కేసీఆర్ అభినందనలు
హైదరాబాద్ : అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఆమె శుక్రవారం మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ ఈ రోజు ఉదయం ఫోన్లో జయను అభినందించారు. అక్రమాస్తుల కేసులో జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. జయలలిత శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆమె తమిళనాడు గవర్నర్ రోశయ్యను కలుస్తారు. మరోవైపు సీఎం పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. -
శాసనసభాపక్షనేతగా జయలలిత ఎన్నిక
చెన్నై: అన్నాడీఎంకే శాసనసభా పక్షనేతగా జయలలిత మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం అన్నాడీఎంకే శసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు మళ్లీ తమ నేతగా జయలలితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జయలలితఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు తమిళనాడు గవర్నర్ రోశయ్యను కలవనున్నారు. శనివారం ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరోవైపు ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈరోజు సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. -
22న అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం
సాక్షి, చెన్నై: నాలుగురోజులుగా స్తబ్దతగా ఉన్న అన్నాడీఎంకేలో ఎట్టకేలకు అధికారిక కద లిక వచ్చింది. ఈనెల 22న ఎమ్మెల్యేల సమావేశం నిర్వహిస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఆరోజు ఉదయం 7 గంటలకు చెన్నై రాయపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశానికి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరుకావాలని జయలలిత కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో జయను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారని, అదేరోజు జయ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. జయ సీఎం అయితే ఆరునెలల్లోగా ఎమ్మెల్యేగా గెలుపొందాల్సి ఉంటుంది. ఏడాదిలో ఎమ్మెల్యే ఎన్నికలు ఉన్నందున ఉపఎన్నికల నిర్వహణ కోసం ఏదో ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఈనెల 23 వ తేదీలోగా రాజీనామా చేయాలని ఎన్నికల సంఘం చెబుతోంది. ఉప ఎన్నికకు పోకుండా ఆరు నెలల తరువాత ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు జయ సిద్ధం అవుతారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ప్రజలను మరింతగా ఆకట్టుకునే సరికొత్త పథకాలను ఈ ఆరు నెలల పాలనలో జయ ప్రవేశపెట్టడం ద్వారా రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు మార్గం సుగమం చేసుకుంటారని తెలుస్తోంది. -
పురచ్చితలైవి నిలిచి గెలిచింది....
అధికారంలోకి వచ్చినప్పుడల్లా జయలలితను కేసులతో కల్లోలపరచాలని చూసిన డీఎంకే అన్నిసార్లూ భంగపడింది. ఇపుడు తీర్పు జయలలితకు అనుకూలంగా వచ్చినా ఈ 19 ఏళ్లపాటు కేసుల కారణంగా చవిచూడాల్సి వచ్చిన రాజకీయ ఎత్తుపల్లాలు.. అన్నిటినీ మించి ఆమె అనుభవించిన మానసిక క్షోభ తీరేది కాదు. బొద్దుగా బిడియంగా కనిపి స్తున్నదంటూ తిరస్కరించిన దర్శకనిర్మాతలు ఆ తర్వాత ఆమె కాల్షీట్ల కోసం ఇంటి ముందు పడిగాపులు పడ్డారు.... ఎంజీఆర్ను బుట్టలో వేసుకున్న మాయలాడి అం టూ ఆయన అంత్యక్రియల ఊరేగింపు నుంచి తోసి వేసిన నేతలే ఆ తర్వాత ఆమె పాదాలు తాకే అదృష్టం కోసం చేతులు కట్టుకుని నిలబడ్డారు... ప్రతిపక్షనేత.. అందునా ఓ మహిళ... అయినా ఆమెకు కనీస మర్యాద ఇవ్వాలన్న ఇంగితమైనా లేకుం డా ఆమెపై మైకులు విసిరిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఆమె కనిపిస్తే వంగివంగి సలాములు కొట్టారు... ప్రత్యర్థుల రాజకీయ కక్షసాధింపు కారణంగా వెం టాడి వేధించిన 13 కేసులు దూదిపింజెల్లా తేలిపోయి ఆమె నిర్దోషిత్వాన్ని నిరూపించాయి.... అన్నిటినీ మించి పందొమ్మిదేళ్లపాటు ఆమెను ఎంతగానో వేధించిన ‘ఆదాయానికి మించిన ఆస్తుల కేసు’ రాజకీయ ప్రేరేపితమైనదిగా తేలిపోయింది. ఆమె ఎవరో కాదు కోమలవల్లి.. అలియాస్ జయ లలిత.. ఈ పేరు మూడున్నర దశాబ్దాలుగా వర్తమాన భారత రాజకీయాల్లో ఓ సంచలనం. తమిళనాట ఆమె పురచ్చితలైవి.. అంటే... విప్లవయోధురాలు అని అర్థం. ప్రత్యర్థులంతా ఒక్కటై వేధించినా ఏ మాత్రం చలించ కుండా స్థిరంగా నిలిచి పోరాడిన జయలలితకు అది చక్కగా నప్పుతుంది. అందుకే ఆమె నేడు గెలిచింది. ఎం తటి విపత్కర పరిస్థితులెదురైనా స్థయిర్యాన్ని కోల్పోని స్వభావమే జయలలితను తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని నేతగా నిలబెట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు జయలలితకు ఎక్కడలేని ఊరట నిచ్చి ఉంటుంది. అన్నా డీఎంకే మద్దతుదార్ల, ‘అమ్మ’ అభిమానుల ఆనందానికి అవధులే లేవు. అయితే కర్ణా టక హైకోర్టు తీర్పుపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపి స్తున్నాయి. న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా వ్యాఖ్యానించినా, వ్యవహరించినా న్యాయస్థానాన్ని ధిక్కరించిన అభియోగానికి అర్హులవుతారు. అయినా ఎవరి భాష్యం వారిది. తమిళనాట రాజకీయ పార్టీలన్నీ ఈ తీర్పుపై గగ్గోలు పెడుతున్నాయి. సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిందిగా కర్ణాటక రాష్ర్ట ప్రభుత్వానికి కూడా అవి సలహా ఇస్తున్నాయి. జయ నిర్దోషిగా నిర్ధారణైతే సగం మీసం తీసేసుకుంటానని సవాళ్లు విసిరిన విజయకాంత్ వంటి వారు ఇపుడు ఆ విషయాన్ని వదిలేసి తీర్పును తప్పుబట్టే పనిలో బిజీగా ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పుడల్లా జయలలితను కేసులతో కల్లోల పరచాలని చూసిన డీఎంకే అన్నిసార్లూ భంగపడింది. ఇపుడు తీర్పు జయలలితకు అనుకూలంగా వచ్చినా ఈ 19 ఏళ్లపాటు కేసుల కారణంగా చవిచూడాల్సి వచ్చిన రాజకీయ ఎత్తుపల్లాలు.. అన్నిటినీ మించి ఆమె అనుభవించిన మానసిక క్షోభ తీరేది కాదు. 1991-96 మధ్య ముఖ్యమంత్రిగా ఉండగా జయ లలిత అధికారాన్ని అడ్డుపెట్టుకుని అపరిమితమైన ఆస్తులు కూడబెట్టారని ప్రస్తుత బీజేపీ నాయకుడు సుబ్ర హ్మణ్యస్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆమెపై కేసు నమోదయ్యింది. ఆ అభియోగాలపై ప్రత్యేక న్యాయ స్థానం ఇచ్చిన తీర్పులో అనేక లోపాలను గుర్తించిన కర్ణాటక హైకోర్టు జయలలితను నిర్దోషిగా నిర్ధారిం చింది. తమిళనాడు అవినీతి నిరోధక డెరైక్టొరేట్ చేసిన దర్యాప్తు సరిగా లేదని, రాజకీయ కక్షసాధింపుతో ఆమె ఆస్తుల విలువను తప్పుగా మదింపు చేశారని హైకోర్టు తేల్చింది. జయలలిత ఆస్తుల విలువ రూ.37.59 కోట్లు గా హైకోర్టు తేల్చింది. అభియోగాలలో పేర్కొన్న కాలం లో జయలలిత సంపాదన రూ.34.76 కోట్లుగా మదింపు వేసి వ్యత్యాసం రూ.2.82 కోట్లు మాత్రమేనని న్యాయ స్థానం నిర్ధారించింది. 1994లో రూ.150 లోపు ఉన్న పాలరాయి ధరను రూ.5,000గా లెక్కిస్తే ఎవరైనా నమ్ముతారా? అని తమిళనాడు అధికారులపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె ఆస్తుల విలు వను అధికంగా చూపారంటూ దాఖలైన పిటిషన్ల విచా రణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని నిర్ధారణకు రావడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, పార్టీలకు అతీతంగా కుమ్మక్కు కావడం తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగానే పరిపాటిగా మారింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దర్యాప్తు సంస్థలను ఎగదోయడం, లేదా దర్యాప్తు నీరుగారేలా చేయడం వంటి వాటికి కూడా చాలా ఉదాహరణలే చెప్పుకోవచ్చు. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ డెరైక్టర్లుగా పనిచేసి పదవీ విరమణ చేసిన వారెందరో పడక కుర్చీలో కూర్చుని తాము తప్పు చేశామంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు కూడా. పదవిలో ఉండగా చేసిన ‘సేవ’కు గాను ఆ తర్వా త ఆ రాజకీయ పార్టీలలో చేరి తరిస్తున్న అధికారులూ ఉన్నారు. అధికారంలో ఉన్నవారి ప్రాపకంతో దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించడం క్షమార్హం కాని నేరం. దర్యాప్తు ఉద్దేశపూర్వకంగా సంక్లిష్టం చేస్తే విచారణ ప్రక్రియ ఏళ్లకేళ్లపాటు నడవడం సహజమే. దీనివల్ల తప్పు చేసినవారు శిక్షపడకుండా తప్పించుకోవడానికి వీలయినట్లే ఏ తప్పూ చేయనివారు అవినీతి ముద్రతో క్షోభపడుతూ కాలం వెళ్లబుచ్చాల్సి వస్తుంది. జయలలిత కేసు రేపు అత్యున్నత న్యాయ స్థానం తలుపు తట్టవచ్చు గాక.... కానీ రాజకీయ ప్రేరే పిత కేసులలో దర్యాప్తు సంస్థలు, దిగువ న్యాయ స్థానాలు ఎంత జాగరూకతతో వ్యవహరించాలో తెలుసు కునేందుకు మాత్రం ఇది ఓ స్పష్టమైన ఉదాహరణ. - పోతుకూరు శ్రీనివాసరావు -
సుప్రీం తీర్పు మా పార్టీకి పెద్ద విజయం
చెన్నై: జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల డీఎంకే అధినేత కరుణానిధి హర్షం వ్యక్తం చేశారు. న్యాయం, నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తాయని మరోసారి రుజువైందని ఆయన అన్నారు. జయలలిత కేసును వాదించేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్ ప్రాసీక్యూటర్ను నియమించడాన్ని తప్పుబట్టడంతో పాటు.. ఇప్పటివరకు ఈ కేసులో జరిగిన వాదోపవాదాలు చాలని, ఇక తీర్పును వెల్లడించవచ్చని కర్ణాటక హైకోర్టుకు సుప్రీంకోర్టు తెలియజేయడమే కాకుండా గతంలో ఈ విషయంపై ఉన్న స్టేను ఎత్తివేసింది. డీఎంకే పార్టీకి చెందిన నేతే సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ విజయం సాధించిన నేపథ్యంలో డీఎంకే అధినేత కరుణానిధిని మీడియా ప్రశ్నించింది. ఈ కేసు ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటుందా అని ప్రశ్నించింది. దీనికి స్పందించిన ఆయన ఇప్పుడే తాము ఎన్నికల గణాంకాలు వేసుకోవడంలేదని, అయితే, ఇది మాత్రం తమ పార్టీకి పెద్ద విజయమే అన్నారు. -
వాదనలు అనవసరం.. తీర్పు ఇవ్వండి
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసు విషయంలో తీర్పు ఇవ్వకుండా కర్ణాటక హైకోర్టుపై విధించిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఈ కేసు విషయంలో ఇక తాజాగా వాదనలు వినాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే జరిగిన వాదనలతో తుది తీర్పును ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. దీంతోపాటు ఈ కేసు విషయంలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసీక్యూటర్ను నియమించే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదని, నియమించినా ఆయన ద్వారా కర్ణాటక హైకోర్టులో ఈ కేసుపై తాజాగా వాదనలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భవానీ సింగ్ అనే వ్యక్తిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే నేత ఒకరు కోర్టుకు వెళ్లడంతో దానిపై గతంలో నిర్ణయాన్ని ప్రకటించిన కోర్టు తాజాగా సోమవారం తుది నిర్ణయాన్ని వెలువరించింది. ఈ కేసులో ప్రత్యేక వాదనలు అవసరం లేదని, ఇప్పటి వరకు జరిగిన వాదనలతో తీర్పు వెలువరించ వచ్చని చెప్పింది. వీరి వ్యవహారం చూస్తుంటే కేసును మరింత జాప్యం చేయాలని చూస్తున్నట్లుగా ఉందన్న అనుమానం కూడా కోర్టు వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు అందిన వెంటనే ఈ కేసులో ముందుకు వెళ్లాలని కూడా సుప్రీంకోర్టు కర్ణాటక హైకోర్టుకు చెప్పింది. చట్టంలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసీక్యూటర్ అనే వ్యవస్థ సరైనది కాదని కోర్టు ఈ సందర్భంగా తప్పుబట్టింది. -
‘కావేరి వల్లే జయకు జైలు!’
సాక్షి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు బెంగళూరు ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించడం వెనుక కావేరీ జలాల వివాదం దాగి ఉందంటూ ఆ పార్టీ శ్రేణులు నేరుగా పోస్టర్లనే వేసేశారు. ‘కావేరీ తల్లీ.. ప్రతీకారం తీర్చుకుంది కర్ణాటక కోర్టు. తల్లిలేక తమిళనాడు తల్లడిల్లిపోతోంది, విడుదల చేయ్...అమ్మను విడుదల చేయ్’ అంటూ అన్నాడీఎంకే టీనగర్ శాఖ నేతలు నగరంలో వాల్ పోస్టర్లు వేశారు. ఇప్పటికే మంత్రి వలర్మతి, టీనగర్ ఎమ్మెల్యే కలైరాజన్లతో తదితర ముఖ్యనేతలు పలు వివాదాస్పద పోస్టర్లు వేసి అగ్నికి ఆజ్యం పోయగా... తాజాగా వెలిసిన పోస్టరు నేరుగా కర్ణాటక న్యాయస్థానంపై నిందలు మోపింది. -
జయ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ
సాక్షి, బెంగళూరు: జైల్లో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ పిటిషన్పై కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. న్యాయమూర్తి ఏవీ చంద్రశేఖర్ నేతృత్వంలోని రెగ్యులర్ బెంచ్ విచారణ జరపనుంది. జయ తరఫున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ వాదనలు వినిపించనుండగా, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఎస్పీపీ)గా భవానీ సింగ్ హాజ రు కానున్నారు. విచారణ నేపథ్యంలో హైకోర్టు చుట్టుపక్కల భద్రతను పటిష్టం చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు సీబీఐ కోర్టు గత నెల 27న నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.వంద కోట్ల జరిమానా, విధించడం తెలిసిందే. హైకోర్టు ఎలాంటి ఆదేశాలిచ్చినా అన్నాడీఎంకే కార్యకర్తలు సంయమనం పాటిం చాలని జయ విజ్ఞప్తి చేశారు. అయితే, అన్నా డీఎంకే కార్యకర్తలు ఎలాంటి విధ్వంసాని కి పాల్పడినా, తమిళనాడు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మరోవైపు జయ జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ ముగ్గురు తమిళ మంత్రులు సోమవారం యాగాలు చేశారు. -
అన్నాడీఎంకే ఎమ్మెల్యేల నిరసన
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మద్దతుగా తమిళనాడువ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం అన్నాడీఎంకే సహా పలు పార్టీలకు చెందిన 131 మంది ఎమ్మెల్యేలు చెన్నైలో ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు. చెన్నై బీచ్ రోడ్డులోని ఎంజీ రామచంద్రన్ సమాధి వద్ద ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నల్ల దుస్తులు ధరించి దీక్ష నిర్వహించారు. దీక్షలో 119 మంది అన్నాడీఎంకే, 8 మంది డీఎండీకే రెబెల్ ఎమ్మెల్యేలు, నలుగురు కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరోవైపు కేబుల్ టీవీ ఆపరేటర్లు కూడా జయకు మద్దతుగా జిల్లాల వారీగా ఒక రోజు నిరాహారదీక్షలు చేపట్టారు. చెన్నై మినహా దాదాపు రాష్ట్రవ్యాప్తంగా కేబుల్ ప్రసారాలను నిలిపేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అన్నాడీఎంకే కార్యకర్తలు శనివారం 12 గంటల బంద్ నిర్వహించారు. బంద్ కారణంగా బస్సు సర్వీసులు నిలిచిపోగా దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు మూతబడ్డాయి. పుదుచ్చేరి పరిధిలోని కరైకల్, మాహే, యానాంలలోనూ బంద్ కొనసాగింది. కాగా, నిరసనల్లో భాగంగా చెన్నై, నీలగిరి, కన్యాకుమారి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఆదివారం సుమారు 6 వేల బస్సు సర్వీసులను నిలిపేస్తున్నట్లు ప్రైవేటు బస్సు ఆపరేటర్ల ఫెడరేషన్ ప్రకటించింది. జయ బెయిల్ పిటిషన్ ఈనెల 7న విచారణకు వచ్చే వరకు ఆందోళనలు కొనసాగించాలని ఆమె మద్దతుదారులు నిర్ణయించారు. జయ జైలుపాలవడాన్ని తట్టుకోలేక శనివారం వరకు 62 మంది మృతి చెందారు. వైద్య సలహా మేరకే బయటి ఆహారం.. బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఖైదీగా ఉన్న జయలలితకు వైద్యుడి సలహా, సూచనల మేరకు తగు ఆహారాన్ని అందిస్తున్నామని జైళ్ల శాఖ డీఐజీ జయసింహా శనివారం మీడియాకు తెలిపారు. ఖైదీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్యుడి సలహా మేరకు ఆహారం ఇవ్వాల్సి ఉంటుందని అందువల్లే జయకు ఒక్కోసారి బయటి ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి వదంతులను నమ్మరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దసరా పండుగను పురస్కరించుకుని జయలలిత జైలులో ఎటువంటి పూజలు చేయలేదన్నారు. జయలలితకు టీవీ ఏర్పాటు చేశామన్న దానిలో నిజం లేదన్నారు. ఇప్పటి వరకు బయటి వ్యక్తులతో కూడా జయ సమావేశం కాలేదని వివరించారు. -
తమిళనాడు సీఎం ఎవరు ?
-
ఆ 'రెండు పార్టీ'లతో విసిగారా.. నేనున్నా..