భార్య మృతి: శశిథరూర్‌కు బిగుస్తున్న ఉచ్చు | Sunanda Pushkar Death Case: Shashi Tharoor Gets Tough Fight | Sakshi
Sakshi News home page

భార్య మృతి: శశిథరూర్‌కు బిగుస్తున్న ఉచ్చు

Published Fri, Mar 26 2021 10:14 PM | Last Updated on Fri, Mar 26 2021 10:15 PM

Sunanda Pushkar Death Case: Shashi Tharoor Gets Tough Fight - Sakshi

న్యూఢిల్లీ: భార్య మృతి కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శశిథరూర్‌కు చుక్కెదురైంది. తమ కూతురు సునంద పుష్కర్‌ చాలా ధ్రుడమైన మనిషి అని, ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు ముందు ఇదే విషయం చెప్పారు. దీంతో శశిథరూర్‌ ఇరకాటంలో పడ్డట్టు అయ్యింది. తమ కుమార్తె సునంద హత్యకు గురయ్యిందని కుటుంబీకులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శశిథరూర్‌కు ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది.

ఢిల్లీ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ శుక్రవారం జరిగింది. హత్య చేశారని ఎలాంటి ఆధారాలు లేవని శశి తరఫు న్యాయవాది వికాస్‌ పావా కోర్టుకు విన్నవించారు. స్పెషల్‌ జడ్జి గీతాంజలి గోయెల్‌ ఇరు వైపు వాదనలు విన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ ఏప్రిల్‌ 9వ తేదీకి వాయిదా పడింది. అంతకుముందు దీనిపై వాదోపవాదనలు జరిగాయి. సునంద పుష్కర్‌ ఆత్మహత్య చేసుకుందని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కుటుంబసభ్యుల తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలు ఏ ఆధారంగా చెబుతున్నారని శశి తరఫు న్యాయవాది పావా ప్రశ్నించారు. కనీసం అదనపు కట్నం, వేధింపులపై ఒక్క ఆధారం కూడా లేదని పావా స్పష్టం చేశారు. ఓ విలాసవంతమైన హోటల్‌ 2014, జనవరి 17వ తేదీన సునంద పుష్కర్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి కేసులో శశి థరూర్‌పై కొన్ని కేసులు నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement