Delhi court
-
ఒళ్లు కనిపించేలా దుస్తులు.. ఢిల్లీ కోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ:ఒళ్లు కనిపించేలా పబ్లిక్ ప్లేసుల్లో చిన్న దుస్తులు వేసుకోవడంపై ఢిల్లీ తీస్హజారీ కోర్టు తాజాగా కీలక తీర్పు చెప్పింది. అదేమీ నేరం కాదని స్పష్టం చేసింది. బార్లో చిన్న దుస్తులు వేసుకుని డ్యాన్సులు చేసిన ఏడుగురు బార్ డ్యాన్సర్లపై ఉన్న కేసును కొట్టేసింది. ఇక ముందు కేవలం డ్యాన్సులు చేసినందుకు కాకుండా డ్యాన్సుల వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులెదురైతేనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది.ఢిల్లీలోని ఓ బార్లో యువతులు చిన్న దుస్తులు వేసుకుని అశ్లీల నృత్యాలు చేశారని అదే సమయంలో బార్ వైపు వెళ్లిన ఓ కానిస్టేబుల్ గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ డ్యాన్సుల వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులెదురయ్యాయ అన్నదానిని పోలీసులు నిరూపించలేకపోయాడని కోర్టు పేర్కొంది.పోలీసుల ఫిర్యాదు,వాంగ్మూలాలకు ఎలాంటి విలువ లేదని తెలిపింది. పోలీసులు ప్రవేశపెట్టిన సాక్షులు కూడా బార్కు ఎంజాయ్ చేయడానికి వెళ్లామే తప్ప తమకు ఏమీ తెలియదని చెప్పారని కోర్టు పేర్కొంది. -
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్రకు కోర్టు సమన్లు
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర వల్ల మోసపోయానంటూ ఒక వ్యాపారి చేసిన ఫిర్యాదుతో ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. గరం ధరమ్ ధాబా ఫ్రాంచైజీ కేసుకు సంబంధించి ధర్మేంద్రతో పాటు మరో ఇద్దరికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు సమన్లు జారీ చేసింది. ‘గరం ధరమ్ ధాబా’ ఫ్రాంచైజీలో పెట్టుబడులు పెట్టించి తనను తప్పుదోవ పట్టించారని ఢిల్లీ వ్యాపారవేత్త సుశీల్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) యశ్దీప్ చాహల్ సమన్లు జారీ చేశారు.2018 ఏప్రిల్ నెలలో, ఉత్తరప్రదేశ్లోని NH-24/NH-9లో గరం ధరమ్ ధాబా ఫ్రాంచైజీ ఇస్తామని ధర్మేంద్ర తనను సంప్రదించినట్లు సుశీల్ కుమార్ తెలిపారు. ఆయన మాటలు నమ్మి తాను రూ.63లక్షల వరకు పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. ఢిల్లీ, హర్యానా వటి నగరాల్లో ఈ రెస్టారెంట్ బ్రాంచ్లు సుమారుగా రూ. 70 నుంచి 80 లక్షల వరకు నెలవారీ టర్నోవర్ను ఆర్జిస్తున్నాయని ఆశ చూపించడంతో తాను కూడా ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టడానికి ఆకర్షితుడయ్యానని తెలిపారు. ఆ సమయంలో ఒప్పంద పత్రంపై సంతకాలు కూడా చేశారన్నారు. ఈ ప్రక్రియ ముగుసిన తర్వాత ధర్మేంద్ర నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం తాను మోసపోయానని గ్రహించి కోర్టును ఆశ్రయించినట్లు సుశీల్ పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదని ఆయన వాపోయారు.‘గరం ధరమ్ ధాబా’ ఫ్రాంచైజీ కేసులో భాగంగా ధర్మేంద్రతో పాటు మరో ఇద్దరికి సమన్లు జారీ అయ్యాయి. 420, 120B సెక్షన్ల కింద వారికి సమన్లు పంపినట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసు 2025 ఫిబ్రవరి 20 విచారణ జరగనుందని కోర్టు వాయిదా వేసింది. -
ఢిల్లీ వక్ఫ్ బోర్డు కేసు: ఆప్ నేత అమానతుల్లా ఖాన్కు బెయిల్
ఢిల్లీ: ఢిల్లీ వక్ఫ్ బోర్డు మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అమానతుల్లా ఖాన్కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమానతుల్లా ఖాన్, ఇతరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకోవడానికి కోర్టు నిరాకరించింది. వెంటనే అమానతుల్లాను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఇక..ఆయనపై విచారణ జరపడానికి అవసరమైన అనుమతి లభించలేదని పేర్కొంది. సప్లిమెంటరీ చార్జిషీట్లో పేరున్న మరియం సిద్ధిఖీపై కేసును కొనసాగించడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. అమానతుల్లా ఖాన్కు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు అంగీకరించగా, అవసరమైన అనుమతులు లేకుండా విచారణ కొనసాగదని కోర్టు తెలిపింది. అవసరమైన అనుమతి పొందిన తర్వాత, ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకోవచ్చని పేర్కొంది. -
జాబ్స్ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్, ఇద్దరు కుమారులకు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన ఇద్దరు కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, ఇతరులకు ఢిల్లీ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్(ఉద్యోగ కుంభకోణం) కేసులో అక్టోబర్ 7న తమ ఎదుట హాజరుకావాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ విశాల్ గోగ్నే ఉత్తర్వులు జారీ చేశారు.అయితే ఈ కేసులో నిందితుడిగా లేనటువంటి లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది.నిందితులపై దాఖలైన సప్లిమెంటరీ చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు.చదవండి: Kolkata: వెనక్కి తగ్గని వైద్యులు.. ఆగని నిరసనలకాగా 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులకు భూమి బదాయింపునకు బదులుగా ఎలాంటి ప్రకటన విడుదల చేయకుండా కొందరు వ్యక్తులకు పలు రైల్వే జోన్లలో ఉద్యోగాలు ఇచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది.ఈ కేసులో లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతికి ఢిల్లీ కోర్టు మార్చి 2023లో బెయిల్ మంజూరు చేసింది. ఇక లాలూ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు, 38 మంది అభ్యర్థులతో సహా 77 మందిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ను జూన్లో సీబీఐ దాఖలు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ కూడా ఆగస్ట్ 6న తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. -
జగదీశ్ టైట్లర్పై హత్యాభియోగం
న్యూఢిల్లీ: 1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్పై ఢిల్లీ కోర్టు హత్య తదితర అభియోగాలు మోపింది. ఢిల్లీలోని పాల్ బంగాశ్ ప్రాంతంలో ముగ్గురువ్యక్తుల హత్యకు సంబంధించిన కేసుపై స్పెషల్ కోర్టు ఆగస్ట్ 30న విచారణ జరిపింది. ఆయనపై అభియోగాలు మోపేందుకు తగు ఆధారాలున్నట్లు స్పష్టం చేసింది. శుక్రవారం టైట్లర్పై హత్యతోపాటు దొంగతనం, చట్ట విరుద్ధంగా గుమికూడటం, కొట్టాట, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం వంటి అభియోగాలు మోపుతూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో సీబీఐ గతేడాది మే 20వ తేదీన టైట్లర్పై చార్జిషీటు నమోదు చేసింది. 1984 నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని పాల్ బంగాశ్ గురుద్వారా వద్దకు తెల్ల అంబాసిడర్లో వచ్చిన టైట్లర్..సిక్కులను చంపండి..వాళ్లు మా అమ్మ(అప్పటి ప్రధాని ఇందిర)ను చంపారు’అంటూ అనుచరులను రెచ్చగొట్టారని చార్జిషీటులో పేర్కొంది. దీంతో, టైట్లర్ అనుచరుల దాడిలో ముగ్గురు సిక్కులు ప్రాణాలు కోల్పోయారంది. 1984లో అప్పటి ప్రధాని ఇందిర హత్యానంతరం ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సిక్కులపై దాడులు జరగడం తెలిసిందే. -
లిక్కర్ కేసు: కోర్టుకు హాజరైన కవిత
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై విచారణ సెప్టెంబర్ 25కు వాయిదా పడింది. బుధవారం(సెప్టెంబర్11) ఈ విషయమై ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణ జరిపారు. ఈ విచారణ కోసం లిక్కర్ కేసు నిందితులు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా ఇతర నిందితులు వర్చువల్గా హాజరయ్యారు.లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవితకు ఇటీవలే సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఈయన బెయిల్ పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. సీబీఐ కేసులో బెయిల్ కోసం కేజ్రీవాల్ ఎదురుచూస్తున్నారు. ఇదీ చదవండి.. వాల్మీకి స్కామ్లో మేం చెప్పిందే జరిగింది: కేటీఆర్ -
లాండ్ ఫర్ జాబ్ స్కాంలో లాలూకు షాక్
ఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు మరో షాక్ తగిలింది. లాలూతో పాటు ఆయన తనయుడు తేజస్వి, మరో ఎనిమిది మందిపై ఈ కేసులో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలైంది. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రౌస్ అవెన్యూ కోర్టులో 96 పేజీల డాక్యుమెంట్లను సమర్పించింది. ఢిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈడీ దాఖలు చేసిన చార్జ్షీట్పై ఆగస్టు 13న వాదనలు వినిపించేందుకు లిస్ట్ చేశారు.Enforcement Directorate filed Ist supplementary charge sheet against RJD leader Tejaswhi Yadav and other accused in land for job scam case in the Rouse Avenue Court. Supplementary Charge sheet has named 11 accused. It also has 96 relied-upon documents.The court listed the…— ANI (@ANI) August 6, 2024కాగా, జనవరిలో సైతం ఈడీ బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, ఆమె కుమార్తెలు ఎంపీ మిసా భారతి, హేమా యాదవ్తో పాటు వ్యాపారవేత్త అమిత్ కత్యాల్, మాజీ రైల్వే ఉద్యోగి హృదయానంద్ చౌదరిలను నిందితులుగా పేర్కొంటూ ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో పలువురు అభ్యర్థుల వద్ద భూమిని లంచంగా తీసుకొని రైల్వే ఉద్యోగాల ఇప్పించారనే ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసులో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. -
దేశం విడిచి పారిపోయిన పూజా ఖేద్కర్?
న్యూఢిల్లీ: వరుస వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన ఏఐఎస్ మాజీ ప్రొబెషనరీ అధికారిణి పరారీలో ఉన్నారా?. ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారా?. ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడం వెంటనే.. ఆమె దేశం విడిచి పారిపోయారా?. ముందస్తు బెయిల్ విషయంలో పూజా ఖేద్కర్కు గురువారం చుక్కెదురైంది. ఓబీసీ కోటా, అలాగే దివ్యాంగుల కోటా విషయంలో ఆమె మోసం చేశారని, ఈ అంశాల్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న యూపీఎస్సీ ఆమెను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై అభియోగాల దృష్ట్యా అరెస్ట్ తప్పదని ఆమె భావించారు. వెంటనే తన లాయర్ ద్వారా ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. కానీ, కోర్టు అందుకు నిరాకరించింది. పూజాను కస్టోడియల్ విచారణ జరిపితేనే వాస్తవాలు బయటకు వస్తాయని బెయిల్ తిరస్కరణ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అయితే.. జులై 31న అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది. అంతకు ముందు ముస్సోరీలోని అకాడమీ ఎదుటా హాజరై ఆమె తన వివరణ ఇచ్చుకోలేదు. దీంతో యూపీఎస్సీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే.. నోటీసులకు స్పందించేందుకు ఆగష్టు 4వ తేదీ వరకు ఆమె గడువు కోరారు. కానీ, యూపీఎస్సీ మాత్రం జులై 30 దాకా అవకాశం ఇచ్చింది. అయినా ఆమె గైర్హాజరయ్యారు. దీంతో ఆమె దుబాయ్కి వెళ్లిపోయి ఉండొచ్చని జాతీయ మీడియా కథనాలు ఇస్తోంది. దీనిపై పూజా తరఫు స్పందన రావాల్సి ఉంది. మరోవైపు.. పుణే పోలీసులు సైతం ఆమె పరారైన విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది. -
మేధా పాట్కర్కు 5 నెలల జైలు
న్యూఢిల్లీ: సామాజిక వేత్త, నర్మదా బచావో ఉద్యమకారిణి మేధా పాట్కర్కు ఢిల్లీ కోర్టు సోమవారం ఐదు నెలల సాధారణ కారాగార శిక్ష విధించింది. గుజరాత్లోని ఒక ఎన్జీవోకు సారథి, ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా 23 ఏళ్ల క్రితం పాట్కర్పై వేసిన కేసులో ఆమెను దోషిగా తేలుస్తూ గత నెల ఏడో తేదీన ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ తీర్పు చెప్పారు. అయితే శిక్ష ఖరారును రిజర్వ్చేసి సోమవారం తీర్పును వెలువరించారు. పరువునష్టం కింద సక్సేనాకు రూ.10 లక్షల జరిమానా చెల్లించాలని పాట్కర్ను కోర్టు ఆదేశించింది. తీర్పును పాట్కర్ పై కోర్టులో సవాల్ చేసుకునేందుకు అవకాశం కలి్పస్తూ నెలరోజులపాటు శిక్ష అమలును నిలిపివేస్తూ న్యాయమూర్తి రాఘవ్ శర్మ ఉత్తర్వులిచ్చారు. అయితే శిక్ష ప్రస్తుతానికి నిలుపుదల చేసిన నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని పాట్కర్ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఆనాడు సక్సేనాను పిరికిపంద అంటూ పాట్కర్ దూషించిన అంశం కోర్టులో రుజువుకావడంతో ఆమెను దోషిగా తేల్చారు. హవాలా లావాదేవీల్లో సక్సేనా హస్తముందంటూ పాట్కర్ చేసిన ఆరోపణల్లో నిజంలేదని, పాట్కర్ కారణంగా ఆయన పరువుకు నష్టం కలిగిందని కోర్టు అభిప్రాయపడిన విషయం విదితమే. 2000 సంవత్సరంలో అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ‘కౌన్సిల్ ఫర్ సివిల్ లిబరీ్టస్’ అనే స్వచ్ఛంద సంస్థకు వీకే సక్సేనా అధ్యక్షునిగా ఉండేవారు. తనకు, నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమానికి వ్యతిరేకంగా సక్సేనా ప్రకటనలు ఇచ్చారని ఆయనపై పాట్కర్ తొలిసారిగా ఫిర్యాదుచేశారు. -
సిసోడియా అమాయకుడు, ఆయన్ను నిందించలేదు: కోర్టులో కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కేంద్ర దర్యాప్తు సంస్థ బుధవారం సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం తిహార్ జైల్లో ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నాయి. బుధవారం ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టాయి. తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ను ఉదయం కోర్టు ముందు హాజరుపర్చారు అధికారులు. ఆయనను కస్టడీకి కోరుతూ కోర్టుకు సీబీఐ దరఖాస్తు చేసుకుంది.విచారణ సందర్భంగా ప్రస్తుతం రద్దు చేసిన మద్యం పాలసీ కింద నగరంలో మద్యం దుకాణాల ప్రైవేటీకరణకు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియానే సిఫార్సు చేశారని సీఎం కేజ్రీవాల్ తమ విచారణలో చెప్పినట్లు సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టుకు తెలియజేశారు.అయితే సీబీఐ ఆరోపణలు కేజ్రీవాల్ ఖండించారు. మనీష్ సిసోడియా దోషి అని తాను ఎలాంటి ప్రకటన చేయలేదని పేర్కొన్నారు. సిసోడియా పూర్తిగా అమాయకుడని, తమ పరువు తీయడమే దర్యాప్తు సంస్థల లక్ష్యమని విమర్శించారు. వాస్తవాలను వక్రీకరించి, అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.కేజ్రీవాల్ తిరస్కరణను తిప్పికొట్టిన సీబీఐ.. తాము వాస్తవాలను మాట్లాడుతున్నట్లు కోర్టుకు తెలిపింది. అయితే సీబీఐ వాదనలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ ప్రకటనను తాము చదివామని ఆయన ఆ విధంగా చెప్పలేదని కోర్టు పేర్కొంది.ప్రైవేటీకరణ తన ఆలోచన కాదని కేజ్రీవాల్ పేర్కొన్నారని, దానిని సీబీఐ తప్పుగా గ్రహించిందని కోర్టు తెలిపింది. ఇదిలా ఉండగా మద్యం కుంభకోణం కేసులో సిసోడియాను గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం మార్చి 9, 2023న మనీలాండరింకేసులో ఈడీ అదుపులోకి తీసుకుంది. -
Delhi Court: కేజ్రీవాల్కు బెయిల్
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ అభియోగాలపై అరెస్టయిన ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు గురువారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ వెకేషన్ స్పెషల్ జడ్జి నియయ్ బిందు ఆదేశాలు జారీ చేశారు. బెయిల్ ఆదేశాలను 48 గంటల పాటు నిలిపి ఉంచాలన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. బెయిల్ ఉత్తర్వులను పైకోర్టులో సవాల్ చేస్తామని, అందుకోసం 48 గంటలు ఆదేశాలను నిలిపి ఉంచాలని ఈడీ అభ్యరి్థంచింది. కానీ జడ్జి నియయ్ బిందు ఇందుకు సమ్మతించలేదు. దర్యాప్తునకు ఆటంకం కలి్పంచకూడదని, సాక్షులను ప్రభావితం చేయరాదని కేజ్రీవాల్కు కోర్టు షరతులు విధించింది. అలాగే అవసరమైనపుడల్లా కోర్టు ఎదుట హాజరుకావాలని, దర్యాప్తునకు సహకరించాలని షరతులు పెట్టింది. కేజ్రీవాల్కు రెగ్యులర్ బెయిల్ రావడం ఆప్కు, ఇండియా కూటమి మిత్రపక్షాలకు ప్రధానికి వ్యతిరేకంగా ఒక అస్త్రం దొరికినట్లే. కేజ్రీవాల్ న్యాయవాదులు శుక్రవారం కోర్టులో పూచీకత్తును సమరి్పస్తే అదేరోజు తీహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం బయటకు వస్తారు. ఢిల్లీ మద్యం పాలసీలో కొందరు మద్యం వ్యాపారులకు మేలు చేకూర్చేలా ఉద్దేశపూర్వకంగా నిబంధనలకు చేర్చారని, ఈ కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామి అని ఆరోపిస్తూ ఈడీ మార్చి 21న ఢిల్లీ సీఎంను అరెస్టు చేసింది. మద్యం వ్యాపారుల నుంచి అందుకున్న ముడుపులను గోవా ఎన్నికల్లో ఆప్ ప్రచారానికి వినియోగించారని, ఆప్ జాతీయ కనీ్వనర్గా కేజ్రీవాల్ వ్యక్తిగతంగా, పరోక్షంగా మనీలాండరింగ్కు పాల్పడినట్లేనని ఈడీ వాదించింది. ఈ ఆరోపణలను ఖండించిన కేజ్రీవాల్ ఒక్క పైసాను కూడా ఈడీ పట్టుకోలేదని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మే 10 తేదీన కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. ఎన్నికలు ముగిశాక కేజ్రీవాల్ జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోయారు. ఈడీది అంతులేని దర్యాప్తు మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎలాంటి నగదును స్వా«దీనం చేసుకోలేదని, కేజ్రీవాల్పై అభియోగాలను నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన న్యాయవాది వాదించారు. ఈడీ పక్షాన హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్.వి.రాజు కేజ్రీవాల్కు బెయిల్ను వ్యతిరేకించారు. ఈడీ ఊహాజనిత దర్యాప్తును చేయడం లేదని, లంచాలుగా ఇచి్చన కరెన్సీ నోట్ల ఫోటోలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. గోవాలో కేజ్రీవాల్ బసచేసిన సెవన్ స్టార్ హోటల్ గదికి చెల్లింపులు జరపడానికి ముడుపుల డబ్బునే వాడారని ఆరోపించారు. తన మొబైల్ ఫోన్ పాస్ట్వర్డ్ను కేజ్రీవాల్ ఇవ్వడం లేదని, దీనిబట్టి మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర ఉందని భావించవచ్చని రాజు వాదించారు. కేజ్రీవాల్ మొబైల్ ఫోన్ను ఓపెన్ చేస్తే మరింతమంది ప్రమేయం బయపడుతుందన్నారు. ‘కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఎలాంటి నేరానికి పాల్పడకపోయినా.. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) సెక్షన్ 70 ప్రకారం ఆమ్ఆద్మీ పార్టీ వ్యహారాలకు ఆయనే బాధ్యుడు కాబట్టి ఆప్ నేరాలకు కూడా జాతీయ కనీ్వరర్గా ఢిల్లీ సీఎం దోషిగా బాధ్యుడవుతాడు’ అని రాజు పేర్కొన్నారు. కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి.. ఈడీ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ‘ఈడీ స్వంతత్ర సంస్థా? లేక రాజకీయ బాసులు చెప్పినట్లు ఆడుతోందా? అని విక్రమ్ చౌదరి ప్రశ్నించారు. ఊహాజనిత అంశాల ఆధారంగానే ఈడీ తుది నిర్ణయాలకు వస్తోందన్నారు. ఆప్కు రూ. 45 కోట్లు ముడుపులు ముట్టాయనడానికి ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. ఇంకా అరెస్టులు కొనసాగిస్తున్నారు. మరోవైపు రూ. 100 కోట్లు ముడుపులుగా అందాయంటారు. ఈడీ ఇంకా ఆధారాలు సేకరిస్తూనే ఉంటే.. ఇది అంతులేని దర్యాప్తే అవుతుంది. కాబట్టి ఇతరులకు ఇచి్చనట్లే కేజ్రీవాల్కు స్వేచ్ఛనివ్వాలని విక్రమ్ చౌదరి కోర్టుకు విన్నవించారు. మనీలాండరింగ్ కేసులో పరిణామక్రమం.. జూలై 2022: ఢిల్లీ ఎక్సైజ్ విధానంలో రూపకల్పన, అమలులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశం. ఆగస్ట్ 2022: సీబీఐ, ఈడీ కేసులు నమోదు. అక్టోబర్ 30, 2023: మనీ లాండరింగ్ కేసులో నవంబరు 2న విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్కు ఈడీ తొలి సమన్లు. ఏప్రిల్ 27: చట్టవిరుద్ధ అరెస్టు.. స్వేచ్ఛాయుత ఎన్నికలు, సమాఖ్య వ్యవస్థ అనే ప్రజాస్వామ్య మూలస్తంభాలపై దాడి అని సుప్రీంకోర్టుకు తెలిపిన కేజ్రీవాల్. ఏప్రిల్ 29: ఈడీ పలుమార్లు సమన్లు జారీచేసినా స్టేట్మెంట్ రికార్డు చేయడానికి కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. మే 10: లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు. జూన్ 2న లొంగిపోవాలని ఆదేశం. మే 30: అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ను కోరుతూ ఢిల్లీ కోర్టుకు కేజ్రీవాల్. జూన్ 5: మధ్యంతర బెయిల్ తిరస్కరణ. జూన్ 20: రెగ్యులర్ బెయిల్ మంజూరు. -
Delhi Liquor Case: సీఎం కేజ్రీవాల్కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్కే కేసులో సీఎం కేజ్రీవాల్కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. కాగా లిక్కర్ కేసులో సాధారణ బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు గురువారం విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. అనంతరం కోర్టు వెకేషన్ బెంచ్ జడ్జి న్యాయ బిందు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.బెయిల్ మంజూరు సందర్భంగా.. లక్ష రూపాయల పూచీకత్తు బాండ్ సమర్పించాలని కోర్టు షరతు విధించింది. అయితే అప్పీల్కు వెళ్లేంత వరకు తీర్పును 48 గంటలపాటు సస్పెండ్ చేయాలని ఈడీ కోరిన్పటికీ కోర్టు తిరస్కరించింది. ఇక బెయిల్ లభించడంతో కేజ్రీవాల్ శుక్రవారం తిహార్ జైలు నుంచి బయటకు రానున్నారు. మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో సుప్రీంకోర్టు లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల తర్వాత జూన్ రెండున కేజ్రీవాల్ మళ్లీ తిహార్ జైల్లో లోంగిపోయారు. కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా నేడు ఆయనకు బెయిల్ మంజూరైంది. -
కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆధారాలున్నాయి: ఈడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3 వరకు పొడిగించింది. లిక్కర్ స్కామ్కు సంబంధించిన ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్.. సాధారణ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు బుధవారం విచారించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంను కోర్టు ముందు హాజరుపరిచారు.ఈ సందర్బంగా కేజ్రీవాల్పై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక ఆరోపణలు చేసింది. లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు తమ ఆధారాలు ఉన్నాయని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. అరెస్టుకు ముందే ఆధారాలు సేకరించినట్లుగా పేర్కొన్నారు.‘ఈ కేసులో మనీలాండరింగ్ నేరంపై కోర్టు విచారణ చేపట్టింది. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా సహా సహ నిందితుల బెయిల్ పిటిషన్ను తిరస్కరించడం ద్వారా అక్రమంగా మనీలాండరింగ్ జరిగినట్లు కోర్టు విశ్వసిస్తోంది’ ఆయన పేర్కొన్నారు.పీఎంఎల్ఏ కింద దాఖలు చేసిన ఛార్జిషీట్లలో కేజ్రీవాల్ పేరు లేదని ఆయన తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. అంతేగాక సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో సైతం కేజ్రీవాల్ను నిందితుడిగా పేర్కొనలేదన్న విషయాన్ని ప్రస్తావించారు.ఇక కేజ్రీవాల్ కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేయవచ్చని మే 10న సుప్రీం కోర్టు తమ ఆదేశాల్లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. మొత్తం కేసు ఆగస్టు 2022లో ప్రారంభమవ్వగా.. ఎన్నికలకు ముందు 2024 మార్చిలో కేజ్రీవాల్ అరెస్టు చేశారని అన్నారు. ఆయన అరెస్టు సమయం వెనుక దురుద్దేశం ఉందన్నారు.మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
ల్యాండ్ ఫర్ జాబ్ : లాలూ ప్రసాద్ యాదవ్కు మరో ఎదురు దెబ్బ
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు ఎదురు దెబ్బ తగిలింది. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలూపై సీబీఐ మరో ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఆ ఛార్జ్ షీట్లో లాలూతో పాటు మరో 71 మందిని చేర్చింది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగానే ఆ ఛార్జ్ షీట్లపై విచారణ చేపట్టాలా? వద్దా? అనే అంశంపై న్యాయమూర్తి జులై 6న తేల్చనున్నారు.గత మే 29న ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో కంక్లూజీవ్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో జాప్యం చేసినందుకు ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి సీబీఐని నిలదీశారు. ఛార్జిషీటు దాఖలు చేసేందుకు ప్రతి తేదీకి మరింత సమయం కావాలని సీబీఐ కోరడంపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 7లోగా తుది నివేదికను దాఖలు చేయాలని దర్యాప్తు సంస్థను ఆదేశించారు. ఢిల్లీ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తాజాగా కోర్టు ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది.ఉద్యోగాలే లేవు.. అయినప్పటికీ లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 వరకు రైల్వేమంత్రిగా పని చేశారు. ఆ సమయంలో జోనల్ రైల్వేలలో ఉద్యోగాలపై అధికారిక నోటిఫికేషన్ ఇవ్వలేదు. అయినప్పటికీ పాట్నా, ముంబై, జబల్పూర్, కోల్కతా, జైపూర్, హాజీపూర్లలో ఉన్న వివిధ జోనల్ రైల్వేలలో లాలూ ప్రసాద్ యాదవ్ నియమించారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం, సహచరుల పేరుతో భూములను తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి.కంక్లూజీవ్ ఛార్జ్ షీట్ అంటే?ఒక వ్యక్తికు సంబంధించిన ఏదైనా కేసును దర్యాప్తు సంస్థలు పూర్తి విచారణ చేపట్టిన అనంతరం.. సదరు వ్యక్తి నేరం చేశారని నిర్ధారిస్తూ అభియోగాలు మోపుతూ కోర్టు దాఖలు చేసే దానిని కంక్లూజీవ్ ఛార్జ్ షీట్ అంటారు. -
కేజ్రీవాల్కు మరో షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్.. మధ్యంతర బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. కాగా వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు ఏడు రోజుల పాటు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కేజ్రీవాల్ ఈ పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేజ్రీవాల్కు వైద్య పరీక్షలు నిర్వహించాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 7కు వాయిదా వేసింది. -
జులై 3దాకా తీహార్ జైల్లోనే కవిత!
న్యూఢిల్లీ, సాక్షి: మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది స్పెషల్ కోర్టు. ఈడీ కేసులో జులై 3వ తేదీదాకా కస్టడీ పొడిగిస్తున్నట్లు సోమవారం ఉదయం ఆదేశాలిచ్చింది. దీంతో బెయిల్ వచ్చేదాకా ఆమె తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.లిక్కర్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో ఈ ఉదయం స్పెషల్ కోర్టుకు తీసుకొచ్చారు తీహార్ జైలు అధికారులు. ఈ సందర్భంగా కవితపై దాఖలైన ఈడీ చార్జిషీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఆ అభియోగ పత్రాలను కవిత తరఫు న్యాయవాదికి అందజేసింది. ఆ వెంటనే ఈడీ కేసులో కస్టడీని మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు జడ్జి కావేరీ బవేజా వెల్లడించారు. ఇక.. కోర్టుకు వచ్చిన కవితను భర్త అనిల్, ఇద్దరు కొడుకులను కలిసేందుకు అనుమతిచ్చారు స్పెషల్ కోర్టు జడ్జి. అనంతరం కవితను తీహార్ జైలుకు తరలించారు. కవితపై ఈడీ చార్జ్షీట్లో కీలక అంశాలులిక్కర్ కేసులో కవిత పై ఈడీ అభియోగాలను పరిగణనలోకి తీసుకున్న స్పెషల్ కోర్టుఈడి మనీలాండరింగ్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చిన స్పెషల్ కోర్టురూ. 1100 కోట్ల నేరం జరిగిందని చార్జ్షీట్లో పేర్కొన్న ఈడీరూ. 192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందింది100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారుకవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసినట్లు పేర్కొన్న ఈడీసీబీఐ కేసులోనూ కస్టడీ పొడిగింపుమరొకవైపు సీబీఐ కేసులో సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది కోర్టు. సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని జూన్ 7 వరకు పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ క్రమంలో కవిత పై చార్జ్ షీట్ను జూన్ 7న సీబీఐ దాఖలు చేయనుంది. సీబీఐ కేసులో భాగంగా నేటి మధ్యాహ్నం కవితను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు జైలు అధికారులు. -
లిక్కర్ కేసు: కవితకు మరో షాక్
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితపై దాఖలైన ఛార్జ్షీట్ను ఢిల్లీ రౌస్ఎవెన్యూ కోర్టు బుధవారం(మే29) పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే ఈ విషయమై వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. జూన్3న ఛార్జ్షీట్లో పేర్కొన్న నిందితులందరూ కోర్టుకు రావాలని వారెంట్లు జారీ చేసింది. దీంతో కవితను ఈడీ అధికారులు అదే రోజు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. కాగా, ఈ కేసులో బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. -
‘ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర’.. ఆప్ మంత్రి అతిషికి ఢిల్లీ హైకోర్టు సమన్లు
దేశ రాజధాని ఢిల్లీలో మంత్రుల కొనుగోలుకు కుట్ర జరుగుతుందంటూ ఆప్ మంత్రి అతిషి చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జూన్ 29న తమ ఎదుట హాజరు కావాలని అతిషిని ఆదేశించింది. బీజేపీ వేసిన పరువు నష్టం దావా పిటిషన్పై స్పందనలో భాగంగా కోార్టు ఈ విధంగా స్పందించింది.కాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత మంత్రి అతిషి ఆప్ర్టీని, ప్రభుత్వాన్ని ఢిల్లీలో సమర్ధవంతంగా ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఇటీవల బీజేపీ ఆరోపణలు గుప్పించారు. ఆప్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 25 కోట్లు వలగా వేస్తూ వారిని కొనేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీనికి తోడు తన రాజకీయ భవిష్యత్తు అంధకారంగా మారకుండా ఉండేందుకు పార్టీ మారాలని బీజేపీ తనకు ఆఫర్ చేసిందని అతిషి ఆరోపించారు. ‘బీజేపీ సన్నిహితుల ద్వారా నన్ను సంపద్రించింది. వారు నన్ను బీజేపీలో చేరమని అడిగారు. ఇది నా రాజకీయ జీవితాన్ని కాపాడుతుందని చెప్పారు. ఒకవేళ నేను సానకటీ మారకపోతే, నెల రజుల లోపల ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) నన్ను అరెస్టు చేస్తుందని బెదిరించారు వారు బెదిరించారు’ అని పేర్కొంది.అతిషితో పాటు, ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నించిందని కేజ్రీవాల్ సైతం ఆరోపించారు. ఈ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. వీటిని తప్పుడు, నిరాధారమైనవిగాపేర్కొంది. ఒకవేళ కేజ్రీవాల్, అతిషి ఆరోపణలు నిజమైతే వాటికి సాక్షాలు చూపించాలని డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే బీజేపీ పోలీసులను ఆశ్రయించగా.. ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై ఢిల్లీ పోలాసులు నోటీసులు జారీ చేశారు.ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఢిల్లీ కోర్టులో పరువు నష్టం దావా కేసు వేసింది. అతిషి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. దీనికి న్యాయస్థానం స్పందిస్తూ.. అతిషికి నోటీసులు జారీ చేసింది. జూన్ 29న మ ఎదుట హాజరు కావాలని తెలిపింది. -
పరువు నష్టం కేసు.. మేధాపాట్కర్ను దోషిగా తేల్చిన కోర్టు
న్యూఢిల్లీ: ‘నర్మదా బచావో’ ఆందోళన్ ఉద్యమానికి నాయకత్వం వహించిన మేధాపాట్కర్ను పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. ఈకేసులో ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదంటే రెండూ విధించే అవకాశం ఉంది. పాట్కర్ దోషిగా తేలిన పరువు నష్టం కేసును ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గతంలో ఫైల్ చేశారు. అప్పట్లో సక్సేనా అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ఎన్జీవో నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్కు నేతృత్వం వహించేవారు. పాట్కర్ గుజరాత్లో ‘నర్మదా బచావో’ ఆందోళన్కు నాయకత్వం వహించేవారు.ఈ క్రమంలోనే పాట్కర్, సక్సేనా ఒకరిపై ఒకరు తరచూ కోర్టులకెక్కేవారు. తనపై పాట్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని సక్సేనా క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలు చేశారు. ఈ కేసులోనే ప్రస్తుతం ఢిల్లీ సాకేత్ కోర్టు పాట్కర్ను దోషిగా తేల్చింది. -
ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడిగించింది. ఆమె కస్టడీని ఆరు రోజులపాటు(మే 20) వరకు పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. తదుపరి విచారణను మే 20కు వాయిదా వేసింది.లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆమె కస్టడీ మంగళవారంతో ముగియడంతో నేడు రౌస్ అవెన్యూ కోర్టులో వర్చువల్గా హాజరుపరిచారు. 14 రోజుల పాటు కవిత జ్యుడీషియల్ కస్టడి పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, చార్జ్ షీట్ ఫైల్ చేసినట్లుగా కోర్టుకు తెలిపింది.8 వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేశామని ఈడీ చెప్పింది. దీనిపై స్పందించిన కోర్టు మే 20న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారిస్తామని తెలిపింది. ఈ క్రమంలో కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు స్పెషల్ కోర్టు జడ్జి వెల్లడించారు. కాగా సీబీఐ కేసులోనూ గతంలో కవితకు మే 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. -
Delhi court: బ్రిజ్ భూషణ్పై అభియోగాలు నమోదు చేయండి
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలను నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది. తమను వేధించారంటూ ఐదుగురు మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణల్లో బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా తగు ఆధారాలున్నట్లు కోర్టు తెలిపింది. కేసులు నమోదు చేయాల్సిందిగా అడిషనల్ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్(ఏసీఎంఎం) ప్రియాంకా రాజ్పుత్ ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో సహ నిందితుడు, డబ్ల్యూఎఫ్ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్పైనా అభియోగాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. బ్రిజ్ భూషణ్పై ఆరో మహిళా మైనర్ రెజ్లర్ చేసిన ఆరోపణలకు తగు ఆధారాలు లేనందున ఆమె పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తెలిపారు. కోర్టు ఈనెల 21న అధికారికంగా అభియోగాలను నమోదు చేయనుంది. -
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు కేసు విచారిస్తున్న రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. సిసోడియాకు బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ,ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టులో వాదనలు వినిపించాయి. దీంతో కోర్టు సిసోడియాకు బెయిల్ నిరాకరించింది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాను సీబీఐ గతేడాది ఫిబ్రవరి26న అరెస్టు చేసింది. అప్పటి నుంచి సిసోడియా జైలులోనే ఉంటున్నారు. సీబీఐతో పాటు ఈడీ పెట్టిన కేసుల్లో సిసోడియా రెగ్యులర్ బెయిల్ కోర్టు డిస్మిస్ చేయడం ఇది రెండవసారి. గతేడాది సిసోడియా వేసిన బెయిల్ పిటిషన్లను ట్రయల్కోర్టుతో పాటు హైకోర్టు,సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. -
కవిత బెయిల్పై మే మొదటి వారంలో తీర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై బుధవారం రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్పై కోర్టులో వాదనలు ముగిశాయి. లిక్కర్ స్కామ్కు సంబంధించి సీబీఐ కేసులో మే 2న తీర్పు వెల్లడించనుంది. అదే విధంగా ఈడీ కేసులో బెయిల్పై మే6న తీర్పు వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది. కాగా మే7తో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది.ఈడీ వాదనలుపీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 19 కింద కవితను చట్టబద్దంగా అరెస్ట్ చేశాంఅక్రమంగా అరెస్ట్ చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదుఈ కేసులో క్విడ్ ప్రో కో జరిగింది.రూ. 581 కోట్ల రూపాయలు హోల్ సేల్ వ్యాపారులు సంపాదించారు.అయిదు నుంచి 12 శాతానికి కమీషన్ పెంచారు.దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకి నష్టం జరిగింది.ఈ పాలసీలో ఇండో స్పిరిట్కు మేజర్ షేర్ దక్కింది. దీని ద్వారా ఈ అక్రమాలకు పాల్పడ్డారు.పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారు.విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై కథ నడిపారు.విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు.అసాధారణ లాభాలు గడించారు.బలవంతంగా మహదేవ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి పక్కకు తప్పించారు.ఈ కేసులో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్కు బెయిల్ దక్కలేదు.ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల లంచం అందింది.మాగుంట శ్రీనివాసులురెడ్డి కీలక స్టేట్మెంట్ ఇచ్చారు.అరవింద్ కేజ్రీవాల్ను మాగుంట శ్రీనివాసులురెడ్డి మద్యం వ్యాపారం కోసం ఢిల్లీ సెక్రటేరియట్ కలిశారు. కవిత ను కలవాలని కేజ్రీవాల్ చెప్పారని మాగుంట చెప్పారు.కవితను కలిసినప్పుడు 100 కోట్లు ఆప్ కి ఇస్తే ఢిల్లీ మద్యం వ్యాపారం ఇస్తారని ఆమె చెప్పింది.అందులో 25 కోట్లు కవిత మనిషి బుచ్చిబాబుకు మాగుంట చెల్లించారు.ఎల్ 1 లైసెన్స్లో మేజర్ షేర్ దక్కించుకేందుకు కవిత ప్రయత్నించారు.అయితే, సమీర్ మహేంద్రకు 33, మాగుంట 33, కవిత 33 శాతం వాటాలను పొందారు.బుచ్చిబాబు, మాగుంట రాఘవ వాట్సాప్ మెసేజ్లో ఈ సాక్షాలు దొరికాయి.మాగుంట రాఘవ అప్రూవర్ గా మారి అన్ని విషయాలను ధృవీకరించారు.ఒకసారి 15 కోట్లు, మరోసారి 10 కోట్లు బుచ్చిబాబుకు, అభిషేక్ బోయినపల్లి కి మాగుంట సిబ్బంది ఇచ్చారుఅనుకూలంగా లిక్కర్ పాలసీ తయారీ కోసం ఈ లంచాలు ఇచ్చారుకోర్టు అనుమతి తోనే నిందితులు అప్రూవర్ గా మారారుఅప్రూవర్ను ప్రలోభ పెట్టారని అనుమానిస్తే అంటే కోర్టు నిర్ణయాన్ని తప్పు పట్టడమే. అప్రూవర్లపై చేస్తున్న ఆరోపణలు ప్రచారం కోసం చేస్తున్న రాజకీయ వాదనలే తప్పు వాటిలో పస లేదు.ఎవరు ఎవరికి ఎలక్టొరల్ బాండ్స్ ఇచ్చారనేది ఈ కేసులో అనవసరం.చట్టం ప్రకారమే ఈ కేసు ముందుకి వెళ్ళాలి.అనేక సార్లు అరుణ్ పిళ్లై స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇచ్చారు.ఈడీ బెదరించిందని ఎప్పుడూ చెప్పలేదు.కవితకు నోటీసు ఇచ్చిన తర్వాతే అరుణ్ పిళ్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారుకవిత ఒత్తిడితోనే ఆరు నెలల తర్వాత అరుణ్ పిళ్లై వాంగ్మూలం వెనక్కి తీసుకున్నారు ఈడీ బెదిరిస్తే , అప్పుడే వెనక్కి తీసుకోకుండా ఆరు నెలలు తర్వాత వాంగ్మూలం వెనక్కి తీసుకుంటారా ?కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మధ్య రాజకీయ అవగాహన ఉందని బుచ్చి బాబు స్టేట్మెంట్ ఇచ్చారుదీని ద్వారా విజయ్ నాయర్ తో కలిసి లిక్కర్ పాలసీ తయారు చేశారుపబ్లిక్ లోకి రాకముందే లిక్కర్ పాలసీ వీరికి వచ్చిందికవిత చెప్పిన అంశాలే మద్యం పాలసీలో పెట్టారుకవిత బంధువు మేకా శరణ్ ను ఇండో స్పిరిట్ లో ఉద్యోగిగా పెట్టారుఉద్యోగానికి హాజరు కాకుండా జీతం తీసుకున్నారువిచారణ కోసం పిలిస్తే ఏడెనిమిది రోజుల పాటు మిస్ అయ్యాడుఈ కేసుకు సంబంధించి అనేక మంది వాంగ్మూలాలు ఇచ్చారుహవాలా ఆపరేటర్స్ వాంగ్మూంలాలు ఇచ్చారుకవిత ఇచ్చిన 9 ఫోన్లలో డేటా డిలీట్ చేశారుఎందుకు డిలీట్ చేశారంటే కవిత సమాధానం చెప్పలేదుతన ఫోన్లను పని మనుషులకు ఇచ్చారని కవిత పొంతన లేని సమాధానాలు చెపుతున్నారుపని మనుషులు డేటా ఎందుకు డిలీట్ చేస్తారు?ఫోన్లు ఇవ్వాలని కోరిన వెంటనే డేటా ఫార్మాట్ చేశారుసాక్ష్యాలు ధ్వంసం చేశారు, సాక్షులను బెదిరించారుకాగా మంగళవారం మధ్యాహ్నం సైతం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ నేటికివాయిదా వేశారు. మరోవైపు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు.బెయిల్ పిటిషన్పై మంగళవారం నాటి వాదనలు..ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు.డీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు.ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు. ఇండో స్పిరిట్స్లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. హోల్సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్గ్రూప్నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు.ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ చాట్లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. వాదనల తర్వాత కోర్టు బెయిల్ పిటిషన్పై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. సిబిఐ కేసులో మే 2న, ఈడీ కేసులో మే 6న తీర్పు వెల్లడిస్తామని చెప్పింది. మే 7న కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. -
CBI: కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారణ కోసం అయిదు రోజుల కస్టడీ కోరుతూ సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో రిమాండ్ పత్రాలను సమర్పించింది. కవిత రిమాండ్ రిపోర్టులో సీబీఐ అధికారులు పలు సంచలన విషయాలు పొందుపర్చారు. కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. కవితకు చెందిన జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షల ముడుపులు చెల్లించినట్లు అభియోగం మోపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని తెలిపింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని పేర్కొంది. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించినట్లు పేర్కొంది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు కవిత తీసుకున్నారని రిపోర్టు రిపోర్టులో వెల్లడించింది. మహబూబ్నగర్లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు రూ. 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తను రూ.14కోట్లు ఇవ్వలేనని అన్నారు శరత్. మొత్తం డబ్బులు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించినట్లు పేర్కొంది. చదవండి: కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురు ఒక్కో రిటైల్ జోన్కు రూ.5 కోట్ల చొప్పున 5 రిటైల్ జోన్లకు రూ.25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని సీబీఐ చెబుతోంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత రూ. 50 కోట్లు డిమాండ్ చేశారని, తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన రూ.25కోట్లు చెల్లించారని తెలిపింది. కేజ్రీవాల్ అనుచరుడు విజయనాయర్కు కవితే రూ.100కోట్లు చెల్లించారని చెప్పింది. ఇండోస్పిరిట్లో కవిత 65 శాతం వాటా పొందారని, గోవాకు రూ.44.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేశారని సీబీఐ పేర్కొంది. ఈ డబ్బును కవిత పీఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చాడని, ఈ విషయాలన్నింటిపైనా కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదని తెలిపింది. ఆమెను 5 రోజులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలను రాబట్టాలని ప్రత్యేక కోర్టును కోరింది సీబీఐ. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే ఆమెను అరెస్టు చేయగా జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో గతంలోనూ సీబీఐ ఆమెను హైదరాబాద్లో ఆమెనుప్రశ్నించింది. ఆ తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో ఈ నెల 6న తీహార్ జైలులో మరోసారి ప్రశ్నించింది. ఈ క్రమంలోనే అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచింది. విచారణ నిమిత్తం కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కాసేపట్లో న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. మరోవైపు సీబీఐ ప్రశ్నించడం, అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. -
సీబీఐ ఇంటరాగేషన్.. కవిత పిటిషన్పై నేడు విచారణ
ఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన తనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ ఇంటరాగేషన్ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కోర్టు కవితను తీహార్ జైల్లోనే విచారించేందుకు సీబీఐకు ఏప్రిల్ 5వ తేదీన ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అయితే.. ఆమెను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా కోర్టులో మెన్షన్ చేశారు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో.. గడువు ఇస్తూ పిటిషన్పై విచారణ ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ కేసులో మార్చి 15వ తేదీన అరెస్టైన కవిత.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిని ప్రశ్నించాలంటే కోర్టు అనుమతి అవసరం. అలా తీహార్ జైల్లో ఉన్న కవితను కోర్టు అనుమతితో సీబీఐ బృందం ప్రశ్నించాలనుకుంది. ఇప్పటికే.. శనివారం తీహార్ జైలుకు వెళ్లిన దర్యాప్తు సంస్థ అధికారులు కవితను ప్రశ్నించినట్లు సమాచారం. -
మళ్లీ తీహార్ జైలుకే కవిత
సాక్షి, న్యూఢిల్లీ: జ్యుడీషియల్ కస్టడీ పూర్తి కానుండటంతో మంగళవారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తీహార్ జైలు అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. కవితకు ఈనెల 23 వరకు జ్యూడిషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మళ్లీ కవితను తీహార్ జైలుకు ఈడీ అధికారులు తరలించనున్నారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కోర్టు ముందుకు కవితను ఈడీ అధికారులు హాజరుపర్చిచారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని జ్యుడీషియల్ కస్టడి పొడిగించాలని ఈడీ కోరింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, కవిత జ్యుడీషియల్ కస్టడీ 14 పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించడానికి ఈడీ వద్ద కొత్తగా ఏమి లేవని కవిత తరపు న్యాయవాది రానా పేర్కొన్నారు. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతుందని, కవిత ప్రభావితం చేసే వ్యక్తి అని మొదటి నుంచి కానీ అలాంటిది ఏమి లేదన్నారు రానా.. కవితను మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోరగా, కవితను కోర్టులో నేరుగా మాట్లాడేందుకు జడ్జి కావేరి బవేజా నిరాకరించారు. నేరుగా నిందితురాలు మాట్లాడేందుకు హక్కు కలిగి ఉంటారని కవిత తరపు న్యాయవాది తెలుపగా, అప్లికేషన్ వేసుకోవాలంటూ జడ్జి కావేరి బవేజా సూచించారు. కవితను కోర్టులో భర్త, మామ కలిసేందుకు కవిత న్యాయవాదులు అప్లికేషన్ ఇచ్చారు. అంతకుముందు మధ్యంతర బెయిల్ను కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ కోసం కవిత వేసిన పిటిషన్ను త్వరగా విచారించాలని ఆమె తరఫు న్యాయవాదులు జడ్జిని కోరారు. దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్ బెయిల్పై ఈ నెల 20న విచారిస్తానన్న న్యాయమూర్తి.. తాజాగా ఈ నెల 16న విచారణ చేపడతానని పేర్కొన్నారు. కాగా, కవితను విచారించాలని కోర్టులో ఇప్పటికే సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై ఎల్లుండి విచారణ జరగనుంది. మార్చి 15వ తేదీన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయగా, మార్చి 16న ఆమెను కోర్టు ముందు హాజరు పర్చారు. మార్చి 23 వరకు కవితకు ఈడీ కస్టడీ, అనంతరం మరో మూడు రోజులు కవితకు ఈడి కస్టడీని కోర్టు పొడిగించింది. 26వ తేదీన కవితకు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ను సీబీఐ ప్రత్యేక కోర్టు విధించింది. కాగా, ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ జరిగిందన్న కేసులో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో సాక్ష్యాలు నాశనం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడంలో కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోందని... ఆమెను బలిపశువుగా మార్చే యత్నం జరుగుతోందనేందుకు వీల్లేదని వ్యాఖ్యానించింది. కవిత నిస్సందేహంగా పలుకుబడిగల మహిళ అయినందున బెయిల్ ఇస్తే మరోసారి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందిన పేర్కొంది. అందువల్ల ఆమెకు మధ్యంతర బెయిల్ నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. మైనర్ కుమారుడి వార్షిక పరీక్షల నేపథ్యంలో తల్లిగా తన పర్యవేక్షణ అవసరమైనందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. బెయిల్ నిరాకరణకు కారణాలను 21 పేజీల తీర్పులో పేర్కొన్నారు. చిన్న కుమారుడికి బంధువుల అండ ఉందిగా ‘‘పిటిషనర్ (కవిత) 16 ఏళ్ల మైనర్ కుమారుడికి ఇప్పటికే 50 శాతం పరీక్షలు పూర్తయ్యాయని న్యాయవాదులు తెలిపారు. కానీ కుమారుడి చదువు, మధ్యంతర బెయిల్ కోరిన రోజుల సంఖ్య, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు పొంతన లేకుండా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మైనర్ కుమారుడు అన్నయ్య, తండ్రి, అత్తలను కలిగి ఉన్నాడు. వారంతా అతనికి తగిన మద్దతు ఇవ్వలేరనడానికి ఎలాంటి కారణం కనిపించట్లేదు. చిన్న కుమారుడి పరీక్షల వేళ తల్లి నైతిక మద్దతు ఎంతో అవసరమని న్యాయవాదులు చెబుతున్నారు. కానీ 19 ఏళ్ల వయసున్న కవిత పెద్ద కుమారుడు స్పెయిన్లో చదువుతున్నాడు. భౌతికంగా తల్లిదండ్రులు దగ్గర లేకున్నా విదేశాల్లో అతను చదువుకోగలుతున్నప్పుడు బంధువుల సమక్షంలో ఉంటున్న చిన్న కుమారుడు పరీక్షలు రాయలేడనడం సమంజసంగా కనిపించట్లేదు. పిల్లల పరీక్షల ఆందోళన పరిష్కరించడానికి తల్లి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదనడం మధ్యంతర బెయిల్ మంజూరుకు తగిన కారణంగా కనిపించట్లేదు. కవిత కేసు పరిష్కారం విషయంలో మైనర్ తండ్రి బిజీగా ఉన్నారన్న కారణం సైతం ఆమోదయోగ్యం లేదు. అందుకే మైనర్ కుమారుడికి అతని అత్తలు తగిన మద్దతు ఇవ్వాల్సిందిగా కోర్టు సూచిస్తోంది. కేసులో ప్రాథమికంగా ప్రమేయం కనిపిస్తోంది. ‘‘మాజీ ఎంపీగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా, ఉన్నత విద్యావంతురాలిగా కవిత సమాజంలో పలుకుబడి గలవారని నిస్సందేహంగా చెప్పొచ్చు. అంతేకానీ ఈ కేసులో ఓ నిస్సహాయ మహిళను బలిపశువును చేస్తున్నారని ఏ ప్రమాణాల ప్రకారమూ చెప్పేందుకు వీలు కనిపించట్లేదు. నేరాల విషయంలో కవిత చురుకైన ప్రమేయం, సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నంతోపాటు ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలు ధ్వంసం చేస్తారనే విషయంలో కోర్టు ముందుంచిన అంశాలను పరిశీలిస్తే కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోంది. అందువల్ల మహిళ కాబట్టి పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 45 (1) ప్రకారం విచక్షణకు ఆమె అర్హురాలు కాదు. ఈ పరిశీలనలతో బెయిల్ దరఖాస్తు తిరస్కరిస్తున్నా’’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. -
Liquor Case : కవిత బెయిల్పై ఏప్రిల్ 8న తీర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఢిల్లీలో రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరపున జోయబ్ హుసేన్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది. ఈనెల 8వ తేదీ ఉదయం 10.30 గంటలకు న్యాయమూర్తి కావేరి భవేజ బెయిల్పై తీర్పు వెల్లడించనున్నారు. కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై వాదనలను ఏప్రిల్ 20కు వాయిదా వేసింది ఢిల్లీ కోర్టు. లిక్కర్ కేసులో బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం విచారణ చేపట్టింది. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన రెండో పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. కవిత తరపున లాయర్ అభిషేక్ సింఘ్వీ మను వాదనలు కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయి కవిత కొడుకు పరీక్షల భయం ఉంది అమ్మగా కొడుకు చదువును పర్యవేక్షించడం, ధైర్యం చెప్పడం కవిత హక్కు పరీక్షల సమయంలో పిల్లలకు తల్లి మోరల్ సపోర్ట్ ఉండాలి ప్రధాని మోదీ చాలా సందర్భాల్లో పిల్లల పరీక్షల సన్నద్ధతను ప్రస్తావించారు. తల్లి అరెస్ట్ తనయుడిపై ప్రభావం ఉంటుంది ఒక మహిళగా కవితకు ఉన్న బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని బెయిల్ ఇవ్వాలి కవితకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని ఆధారాలను ఈడీ తరపు లాయర్ జోయబ్ హుస్సేన్ న్యాయమూర్తికి చూపించారు. అనంతరం వాదనలు వినిపించారు కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి, సాక్షాలను ధ్వంసం చేస్తారు కవిత లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నారు ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ఇప్పటికే కవిత తనయుడికి 11 పరీక్షలకు గాను 7 పరీక్షలు పూర్తి అయ్యాయి కొడుకు పరీక్షల ఒత్తిడికి గురవుతున్నాడన్న దానికి ఎలాంటి ఆధారాలు లేవు, వైద్య నివేదికలు లేవు ఇండో స్పిరిట్లో అరుణ్పిళ్లై, కవితకు 33 శాతం వాటా ఉంది కవిత తన ఫోన్లలో డేటాను డిలీట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఫార్మాట్ చేశారు ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాతే ఫోన్లలో డేటా ఫార్మాట్ జరిగింది డిజిటల్ ఆధారాలు లేకుండా ఉండేందుకే కవిత ఈ పని చేశారు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్లను వెనక్కి తీసుకునేలా కవిత తరపు వారు ఒత్తిడి తెస్తున్నారు కవితకు నోటీసు ఇవ్వగానే అరుణ్ పిళ్లై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారు దినేష్ అరోరా అప్రూవర్గా మారాక అన్ని విషయాలు చెప్పాడు బుచ్చిబాబు ఫోన్లోని చాట్స్తో ఎక్సైజ్ పాలసీ నోట్స్ రికవరీ అయ్యాయి ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది ఈ కేసులో మరికొంతమందిని ప్రశ్నిస్తున్నాం ఈ సమయంలో బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు తెలిపింది. కాగా లిక్కర్ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా, ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడురోజులకే అనుమతించింది. కస్టడీ ముగియడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు ఆమె. చదవండి: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు ఊరట.. -
లిక్కర్ స్కాంలో ఇవాళ.. : కవితకు బెయిల్ వచ్చేనా?
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. జ్యుడీషియల్ రిమాండ్ కింద ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తన పిల్లలకు పరీక్షలున్నాయంటూ ఆమె వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ విచారించనుంది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని, అందుకే ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. మద్యం పాలసీ కేసు విచారణలో ఉన్నదని, కవిత పలుకుబడి ఉన్న రాజకీయనేత అని, బెయిల్ ఇస్తే సాక్షులను ఆమె ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) విజ్ఞప్తి చేసింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న మరిన్ని వాదనలు వింటామని చెబుతూ.. విచారణ వాయిదా వేసింది. అదే సమయంలో సుప్రీం కోర్టు సూచన మేరకు వేసిన సాధారణ బెయిల్ పిటిషన్నూ విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు కోరే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న హైదరాబాద్లోని నివాసంలో కవితను ఈడీ అరెస్టు చేసింది. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా, ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడురోజులకే అనుమతించింది. కస్టడీ ముగియడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. -
కవితకు బెయిల్ వచ్చేనా?
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. జ్యుడీషియల్ రిమాండ్ కింద ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తన పిల్లలకు పరీక్షలున్నాయంటూ ఆమె వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ విచారించనుంది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని, అందుకే ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. మద్యం పాలసీ కేసు విచారణలో ఉన్నదని, కవిత పలుకుబడి ఉన్న రాజకీయనేత అని, బెయిల్ ఇస్తే సాక్షులను ఆమె ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) విజ్ఞప్తి చేసింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న మరిన్ని వాదనలు వింటామని చెబుతూ.. విచారణ వాయిదా వేసింది. అదే సమయంలో సుప్రీం కోర్టు సూచన మేరకు వేసిన సాధారణ బెయిల్ పిటిషన్నూ విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు కోరే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న హైదరాబాద్లోని నివాసంలో కవితను ఈడీ అరెస్టు చేసింది. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా, ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడురోజులకే అనుమతించింది. కస్టడీ ముగియడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. తీహార్ అధికారుల తీరుపై.. ఇదిలా ఉంటే.. కోర్టు ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించే సందర్భంలో కవిత కొన్ని విజ్ఞప్తులు చేశారు. జైల్లో తనకు కొన్ని ప్రత్యేక వసతులు కల్పించాలని న్యాయమూర్తి కావేరీ బవేజాను కోరారు. దీంతో ఇంటి నుంచి భోజనం, దుస్తులు, మంగళసూత్రం ధరించడం, సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం, దుప్పట్లు తెచ్చుకోవడం, చెప్పులు ధరించడం వంటి వెసులుబాట్లకు న్యాయమూర్తి అనుమతిచ్చారు. అయినప్పటికీ తీహార్ జైలు అధికారులు వాటికి అనుమతివ్వడం లేదంటూ కవిత తరఫు న్యాయవాది ఈనెల 28న మళ్లీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం విచారణ సందర్భంగా కవిత తరఫున న్యాయవాదులు ఈ అంశాన్ని మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిసింది. ఒకవేళ మధ్యంతర బెయిల్ ఊరట దక్కని పక్షంలో.. జైల్లో రిమాండ్ ముగిసేవరకు ఆ వసతులైనా కల్పించేలా జైలు అధికారులకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరే అవకాశం కనిపిస్తోంది. -
కేజ్రీవాల్కు దక్కని ఊరట.. విచారణ వాయిదా
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు నిరాశే ఎదురైంది. లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అలాగే కేజ్రీవాల్ పిటిషన్పై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఏప్రిల్ 2 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ఇరువర్గాలకు చెందిన న్యాయవాదుల మధ్య వాడీవేడిగా వాదనలు కొనసాగాయి. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు, కేజ్రీవాల్ తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. లిక్కర్స్కాం కేసు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. తన అరెస్ట్ను వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. పిటిషన్పై విచారణ సందర్భంగా వాడీవేడి వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరుపున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. కేజ్రీవాల్ను వెంటనే ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలి. నేరాన్ని నిర్ధారించడంలో ఈడీ విఫలమైంది. లిక్కర్ కేసులో అప్రూవర్లుగా మారిన వారిని నమ్మడానికి లేదు. కేజ్రీవాల్ అరెస్ట్లో ఈడీకి ముందస్తు ఆలోచన.. రాజకీయపరమైందన్నారు. అనంతరం.. కేజ్రీవాల్ అరెస్ట్, మధ్యంతర ఉపశమన పిటిషన్లపై ప్రత్యుత్తరం దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని ఈడీ కోరింది. ఈ నేపథ్యంలో పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈరోజు సాయంత్రం తీర్పును వెల్లడించనుంది. Senior advocate Abhishek Manu Singhvi, representing Delhi CM Arvind Kejriwal says before Delhi High Court, "A sitting CM was arrested one week ago during the Model Code of Conduct. If you do something to disrupt the level playing field, you hit the heart of democracy. The… — ANI (@ANI) March 27, 2024 లాయర్లపై హైకోర్టు సీరియస్.. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆప్ లీగల్ సెల్ కోర్టు ప్రాంగణాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ అంశంపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కోర్టుల్లో నిరసనలు చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. న్యాయస్థానాల కార్యకలాపాలను ఆపకూడదు. అలా ఎవరైనా చేస్తే అది ప్రమాదకర చర్యే. ఈ అంశంపై గురువారం విచారణ చేపడుతాం’’ అని కోర్టు వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన కస్టడీ రేపటితో (మార్చి 28) ముగియనుంది. గురువారం దర్యాప్తు అధికారులు ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నారు. -
కడిగిన ముత్యంలా బయటకొస్తా.. కవిత సంచలన ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలకు దిగారు. ఈడీ తనపై పెట్టింది మనీలాండరింగ్ కేసు కాదని.. ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అని అన్నారామె. ఈ క్రమంలో తప్పు చేయని తాను కడిగిన ముత్యంలా తాను బయటకు వస్తానంటూ వ్యాఖ్యానించారు. ఈడీ కస్టడీ ముగియడంతో మంగళవారం ఉదయం కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో కోర్టు ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘నేను తప్పుచేయలేదు. కడిగిన ముత్యంలా బయటకు వస్తా. ఇది మనీల్యాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ ల్యాండరింగ్ కేసు. తాత్కాలికంగా నన్ను జైల్లో పెడతారేమో.. నా ఆత్మస్థైర్యాన్ని మాత్రం దెబ్బ తీయలేరు. .. ఈ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరారు. మరో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది. మూడో నిందితుడు బీజేపీకి రూ.50 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో విరాళంగా ఇచ్చాడు. ఇది తప్పుడు కేసు. క్లీన్గా బయటకు వస్తా.. అప్రూవర్గా మారేది లేదు. జై తెలంగాణ అంటూ కవిత నినాదాలు చేస్తూ కోర్టు హాల్లోనికి వెళ్లారు. మరోవైపు ఆమె మద్దతుదారులు, బీఆర్ఎస్ నేతలు కోర్టు ప్రాంగణంలో జై తెలంగాణ నినాదాలు చేస్తూ కనిపించారు. -
తీహార్ జైలుకు కల్వకుంట్ల కవిత
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 15 జ్యూడీషియల్ రిమాండ్ విధించింది ట్రయల్ కోర్టు. ఏప్రిల్ 9 వరకు జ్యూడీషియర్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు అధికారులు తరలించనున్నారు. లిక్కర్ స్కాం కేసులో కస్టడీ ముగియడంతో ఈడీ ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ జ్యూడీషియల్ కస్టడీ కోరగా.. అదే సమయంలో కవిత వేసిన బెయిల్ పిటిషన్పైనా వాదనలు జరిగాయి. అయితే.. ఈడీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆమెకు జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ‘‘సమాజంలో కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెను విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. సాక్షాధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల దర్యాప్తుకు తీవ్ర విఘాతం కలుగుతుంది. లిక్కర్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. కవిత పాత్రకు సంబంధించి ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నాం. అక్రమ సొమ్ము గుర్తించే పనిలో ఉన్నాం. ఆర్థిక నేరాల దర్యాప్తు చాలా కఠినమైనది. ఆర్థిక నేరస్తులు చాలా వనరులు, పలుకుబడి ఉన్నవారు. పథకం ప్రకారం ప్రణాళికతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. అందుకే దర్యాప్తు అనేది చాలా జఠిలమైనది. ఇందుకోసమైనా కవితను జ్యూడిషియల్ కస్టడీ కి పంపాలి’’ :::కవిత ఈడీ జ్యుడీషియల్ రిమాండ్ రిపోర్ట్ ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఏప్రిల్ 9వ తేదీ దాకా కవితకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అలాగే.. కవిత బెయిల్ పిటిషన్పై మరోసారి వాదనలు వినాల్సి ఉందని చెబుతూ.. ఏప్రిల్ 1వ తేదీకి ఆ మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసింది. బెయిల్పై వాదనల సందర్భంగా.. తన పిల్లలకు పరీక్షలు ఉన్నాయని.. మధ్యంతర బెయిల్ అయినా మంజూరు చేయాలని కవిత బెయిల్ పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. అయితే.. కేసు దర్యాప్తు పురోగతి లో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లుగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్. ఇక విచారణ సందర్భంగా.. కోర్టు ప్రాంగణంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగానే తనపై కేసు పెట్టారని అన్నారామె. అదే సమయంలో ఆమె తన భర్త అనిల్, బంధువులను కలిసి మాట్లాడేందుకు ఈడీ అనుమతించింది. ఇదీ చదవండి- అప్రూవర్గా మారను.. క్లీన్గా బయటకొస్తా: కవిత కవిత మేనల్లుడి అరెస్ట్కు రంగం సిద్ధం? మరోవైపు ఇవాళ లిక్కర్ స్కాం కేసులో ఇంకో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవిత మేనల్లుడు మేకా శరణ్ను ఈడీ విచారణ చేపట్టింది. లిక్కర్ స్కాం కేసులో అక్రమ సొమ్ము బదిలీలో శరణ్ కీలక పాత్ర పోషించారని ఈడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. శరణ్ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. -
అక్రమ అరెస్ట్లపై కోర్టులో పోరాడుతా: కల్వకుంట్ల కవిత
న్యూఢిల్లీ: తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత.. ఈడీ విచారణలో అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని మండిపడ్డారు. తన అక్రమ అరెస్టులపై న్యాయస్థానంలో పోరాడుతానని పేర్కొన్నారు. కస్టడీ పొడిగింపు తర్వాత కవిత మాట్లాడుతూ.. తన అరెస్ట్ రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల అరెస్ట్ కక్షసాధింపేనని విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు. తనను ఈడీ కార్యాలయానికి తరలించే క్రమంలో కోర్టు ప్రాంగణంలో జై తెలంగాణ నినాదాలు చేశారు కవిత కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గతవారం ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమెకు ఏడు రోజుల కస్టడీ విధించి రౌస్ అవెన్యూ కోర్టు. వారం రోజులపాటు కవితను విచారించిన ఈడీ అధికారులు.. నేడు తిరిగి కోర్టులో హాజరు పరిచారు. అయితే కవిత విచారణకు సహకరించడం లేదని.. మరో ఐదు రోజుల కస్టడీ కావాలని ఈడీ కోర్టుకు తెలిపింది. ఇరువాదనలు విన్న న్యాయస్థానం.. ఈడీ కస్టడీ పొడిగింపుకు అనుమతించింది. కవిత ఈడీ కస్టడీ మరో మూడు రోజులు పొడిగించింది. ఈనెల 26 వరకు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. -
కవిత పిటిషన్కు ఢిల్లీ కోర్టు అనుమతి
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టై ఏడూ రోజుల ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన కొడుకు, తల్లిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. అయితే.. ఈ మేరకు కవితకు అనుమతినిచ్చింది సెషన్స్ కోర్టు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినిచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను 8 మంది కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. వారిలో తల్లి శోభా, పిల్లలు, కుటుంబ సభ్యులకు కోర్టు అనుమతి లభించింది. ఇక.. శనివారం మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావులు కవితను ఈడీ కార్యాలయంలో కలిసిన విషయం తెలిసిందే. వారు సుమారు గంటసేపు భేటీ అయి పలు అంశాలుపై చర్చించుకున్నట్లు తెలిసింది.అదేవిధంగా ఇవాళ.. ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలంటూ, అంతవరకు ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దు అంటూ గతేడాది దాఖలైన పిటిషన్ను కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. -
కవిత అరెస్ట్ చట్టబద్దమే.. కోర్టు ఉత్తర్వుల్లో సంచలన విషయాలు
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సెషన్స్ కోర్టు ఏడు రోజులు కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో కస్టడీకి సంబంధించి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో సంచలన విషయాలను వెల్లడించింది. కవిత అరెస్ట్ చట్టబద్దమే అని కోర్టు పేర్కొంది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, ఢిల్లీలోరి రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం, ఈడీ కోరిక మేరకు కవితను ఏడు రోజుల పాటు కస్టడీ విధించింది కోర్టు. ఈ సందర్బంగా కస్టడీకి ఇచ్చిన ఉత్తర్వుల్లో కోర్టు సంచలన విషయాలను వెల్లడించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం..‘కవిత అరెస్టు చట్టబద్ధమే. కవితను అరెస్టు చేయవద్దని ఎక్కడా సుప్రీంకోర్టు లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వలేదు. తదుపరి విచారణ వరకు మాత్రమే సమన్లు ఇవ్వమని ఈడీ సుప్రీంకోర్టుకు చెప్పింది. ఆ తర్వాత రెండుసార్లు ఈడీ సమన్లు ఇచ్చినప్పటికీ కవిత సుప్రీంకోర్టులో వాటిని ఛాలెంజ్ చేయలేదు. సుప్రీంకోర్టుకి ఇచ్చిన మాట తప్పారా? లేదా అన్నది మా పరిధిలో నిర్ణయించే అంశం కాదు. సెక్షన్-19 ప్రకారం అన్ని నిబంధనలు పాటిస్తూ అరెస్టు చేశారా? లేదా అన్నది మాత్రమే చూస్తాం. కవితను చట్టబద్ధంగానే అరెస్టు చేశారు. మనీలాండరింగ్ చట్టం సెక్షన్-19 కింద అన్ని నిబంధనలను పాటించారు. ఈ నేరాల్లో కవిత కీలక పాత్ర పోషించారనేదానికి ఆధారాలు ఉన్నాయి. అందుకే ఆమెను రిమాండ్ చేస్తూ దర్యాప్తు కోసం ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తున్నాం. సీసీటీవీ కవరేజ్లో ఆమెను ఇంటరాగేషన్ చేయాలి. సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచాలి. మహిళను విచారించే సమయంలో తీసుకోవలసిన అన్ని నిబంధనలు పాటించాలి. ఆమె తరపు న్యాయవాదులు ప్రతీరోజు అరగంట పాటు కలవవచ్చు. ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ , బావ హరీష్ రావు, కజిన్ శ్రీధర్, ప్రణీత్ కుమార్, శరత్ కలుసుకునే అవకాశం ఉంది. అరెస్టు తరువాత హైబీపీకి గురైనట్లు ఈసీజీ రిపోర్టు ఉన్న నేపథ్యంలో తగిన మందులు ఇవ్వాలి. 24 గంటలకు ఒకసారి కవితకు వైద్య పరీక్షలు చేయాలి’ అని కోర్టు పేర్కొంది. -
కవితకు రిమాండ్, 7 రోజుల కస్టడీ
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. అలాగే ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. అరెస్టు అక్రమమని కవిత తరఫు లాయర్ల వాదనను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో రిమాండ్ విధిస్తూ.. ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది. అలాగే రిమాండ్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు కవితకు అవకాశం కల్పిస్తూనే.. ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది. ఫామ్ హౌజ్కు కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడం, ఆపై కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించిన పరిణామాల అనంతరం ఆమె తండ్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫామ్ హౌజ్కు వెళ్లిపోయారు. అయితే కవిత అరెస్టుపై ఇప్పటివరకూ కేసీఆర్ స్పందించలేదు. కవిత భర్తకు కూడా నోటీసులు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అనూహ్యంగా మరో అడుగు ముందుకేసింది. కవిత భర్త అనిల్కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. సోమవారం ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే అనిల్ ఫోన్లను సీజ్ చేసింది ఈడీ. కవిత కస్టడీ రిపోర్టులో ఏముందంటే? ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత కీలకంగా ఉన్నారు సౌత్ లాబీ పేరుతో లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక కుట్ర దారు, ప్రధాన లబ్ధిదారు కవితే ఆమ్ అద్మీ పార్టీకి కవిత లిక్కర్ స్కాం ముడుపుల కింద వంద కోట్లు ఇచ్చారు మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రకు పాల్పడ్డారు కవితకు బినామీగా రామచంద్ర పిళ్లై ఉన్నారు పిళ్లై ద్వారా కవిత మొత్తం వ్యవహారం నడిపించారు అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో.. కవిత వాటా పొందారు ఇతరులతో కలిసి 100 కోట్ల రూపాయల లంచాలను ఆప్ నేతలకు కవిత ఇచ్చారు కేసు నుంచి తప్పించుకునేందుకు కవిత తన మొబైల్ లోని ఆధారాలు తొలగించారు సౌత్ గ్రూప్ లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ మాగుంటతో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రలు పన్నారు మాగుంట ద్వారా రూ. 30 కోట్లను కవిత ఢిల్లీకి చేర్చారు రూ. 30 కోట్లను అభిషేక్ బోయినపల్లి ఢిల్లీకి తీసుకెళ్లాడు అని ఈడీ పేర్కొంది. మరోవైపు కవిత అరెస్టును ఎన్నికల స్టంట్గా అభివర్ణించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ను దొంగదెబ్బ తీయడానికే రాజకీయ డ్రామా చేశారని, కవిత అరెస్టుపై ఆమె తండ్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాని, ఈడీ ఒకేరోజు హైదరాబాద్ వచ్చారని, ఈ కేసులో మోదీ మౌనం ఎందుకు వహిస్తున్నారని అడిగారు. కవిత అరెస్టుతో బీఆర్ఎస్ సానుభూతి, అవినీతిని సహించేది లేదంటూ బీజేపీ ఓట్లు దండుకునే యత్నం చేస్తున్నారన్నారు. -
కేజ్రీవాల్కు షాక్.. ఈడీ విచారణ కోసం కోర్టు సీరియస్
సాక్షి, ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన కేసు విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా కోర్టును ఆశ్రయించింది. దీంతో, ఈ కేసు విచారణ కోసం మార్చి 16వ తేదీన ఈడీ ఎదుట హాజరు కావాలని రౌజ్ ఎవెన్యూ కోర్టు ఆదేశించింది. కాగా, కేజ్రీవాల్పై విచారణ విషయంలో ఈడీ.. ఢిల్లీ కోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణకు రావాలంటూ తాము పదేపదే సమన్లు పంపినా వాటిని తిరస్కరిస్తున్న కేజ్రీవాల్ఫై చర్య తీసుకోవాలని ఈడీ.. ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పలుమార్లు సమన్లు జారీచేసినా ఆయన హాజరుకావడం లేదని పిటిషన్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ను విచారించేందుకు ఆదేశాలు ఇవ్వాలని ఈడీ కోరింది. ఇప్పటికే ఎనిమిది సార్లు సమన్లు పంపినా వాటిని లెక్కచేయలేదని ఆరోపిస్తూ ఐపీసీ 174 సెక్షన్ కింద తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. -
లిక్కర్ కేసు: కోర్టుకు హాజరైన కేజ్రీవాల్
ఢిల్లీ, సాక్షి: లిక్కర్ పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి,ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన ఫిర్యాదుపై ఇటీవల కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు ఆయన వర్చువల్గా రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరయ్యారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరగా.. కోర్టు అందుకు అంగీకరించింది. మరోవైపు కేజ్రీవాల్ దరఖాస్తుకు ఈడీ తరఫున న్యాయవాది ఏఎస్జీ రాజు సైతం అభ్యంతరం వ్యక్తంచేయలేదు. దీంతో.. మార్చి 16వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది కోర్టు. మరో లిక్కర్ కేసులో.. మనీలాండరింగ్ కేసు కింద విచారణకు హాజరు కావాల్సిందింగా కేజ్రీవాల్ కు తాజాగా ఆరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19వ తేదీన తమ ముందు హాజరుకావాలని ఆ సమన్లలో కోరింది. అంతకు ముందు ఆయనకు ఐదుసార్లు జారీ చేసినా విచారణకు గైర్హాజరు కావడంతోనే ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈ తరుణంలో.. ఎల్లుండి విచారణకు హాజరు అవుతారా? అనే సస్పెన్స్ నెలకొంది. -
కేజ్రీవాల్కు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 17న హాజరు కావాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఐదుసార్లు సమన్లు జారీ చేయగా.. ఆయన డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ నిమిత్తం ఈడీ ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు హాజరవడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.. ఈ నెల 17న కేజ్రీవాల్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్లు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇక.. తనకు పంపిన సమన్లు చట్టవిరుద్ధమైనవంటూ తొలి నుంచి అరవిండ్ కేజ్రీవాల్ విచారణకు హజరు కావడం లేదు. ఇది రాజకీయ ప్రతీకార చర్యగా.. ఢిల్లీ ప్రభుత్వానికి కూలదోసేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యత్నంగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ విచారణకు ప్రతిగా.. పార్టీ కార్యక్రమాలకు, వ్యక్తిగత కార్యక్రమాలకు కేజ్రీవాల్ హజరవుతూ వచ్చారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. కేజ్రీవాల్కు కిందటి ఏడాది నవంబర్ 2వ తేదీన తొలిసారి సమన్లు పంపింది ఈడీ. అప్పటి నుంచి సమన్లు పంపిన ప్రతీసారి(నవంబర్ 2, డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 19, ఫిబ్రవరి 2) ఆయన అరెస్ట్ అవుతారంటూ చర్చ తీవ్రంగా నడిచింది. చదవండి: యూసీసీపై ఎంఐఎం చీఫ్ కీలక వ్యాఖ్యలు -
Liquor Scam: కోర్టులో ఈడీ ఫిర్యాదు
ఢిల్లీ: లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఐదోసారి సమన్లు పంపినా.. విచారణకు గైర్హాజరయ్యారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) కోర్టులో ఫిర్యాదు చేసింది. లిక్కర్ స్కామ్లో విచారణకు డుమ్మా కొడుతున్న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్పై శనివారం రౌస్ ఎవెన్యూ కోర్టును ఈడీ ఆశ్రయించింది. పీఎంఎల్( Prevention of Money Laundering Act)లోని సెక్షన్ 63(4) ప్రకారం ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఐపీసీలోని సెక్షన్ 174ను సైతం(పబ్లిక్ సర్వెంట్ ఎదుట గైర్హాజరు కావడం) ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం ఈ కేసును కోర్టు విచారణ జరపనుంది. తనకు పంపిన సమన్లు చట్టవిరుద్ధమైనవంటూ తొలి నుంచి ఆయన విచారణకు హజరు కావడం లేదు. ఇది రాజకీయ ప్రతీకార చర్యగా.. ఢిల్లీ ప్రభుత్వానికి కూలదోసేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యత్నంగా ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఈడీ విచారణకు ప్రతిగా.. పార్టీ కార్యక్రమాలకు, వ్యక్తిగత కార్యక్రమాలకు కేజ్రీవాల్ హజరవుతూ వచ్చారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. కేజ్రీవాల్కు కిందటి ఏడాది నవంబర్ 2వ తేదీన తొలిసారి సమన్లు పంపింది ఈడీ. అప్పటి నుంచి సమన్లు పంపిన ప్రతీసారి(డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 19, ఫిబ్రవరి 2..) ఆయన అరెస్ట్ అవుతారంటూ చర్చ తీవ్రంగా నడిచింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్లు అరెస్టయిన సంగతి తెలిసిందే. -
రబ్రీ దేవికి ఢిల్లీ కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: రైల్వేశాఖలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ కోర్టు బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, ఆమె కూతుళ్లు మిసా భారతి, హేమా యాదవ్లకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 9వ తేదీన కోర్టులో విచారణకు రావాలంటూ స్పెషల్ కోర్టు జడ్జి విశాల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేసిన చార్జిషీటులో ఆరోపణలకు తగు ఆధారాలున్నాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది నవంబర్ నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యాపారవేత్త అమిత్ కట్యాల్ను సైతం తమ ముందు హాజరుపరచాలని ఆదేశించారు. -
డీకే శివకుమార్ కేసులో కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు అనుమతిచ్చింది. కాప్ 28 లోకల్ క్లైమేట్ యాక్షన్ సదస్సులో పాల్గొనేందుకుగాను డిప్యూటీ సీఎం హోదాలో శివకుమార్ దుబాయ్ వెళ్లనున్నారు. ఈనెల 29 నుంచి డిసెంబర్ 3 వరకు దుబాయ్లో ఉండేందుకు డీకేకు కోర్టు అనుమతిచ్చింది. డీకే విదేశాలకు వెళ్లేందుకు అనుమతిచ్చే సందర్భంలో కోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సాధారణంగా ఒక పౌరుడు విదేశాలకు వెళ్లడం అనేది అతని ప్రాథమిక హక్కులో భాగం. అయితే ఇది పరిమితులు లేని హక్కు కాదు. కేసుల్లో నిందితులు విదేశాలకు పారిపోకుండా చూసేందుకు ఈ హక్కుపై పరిమితులు విధించవచ్చు. అయితే ఇక్కడ అనుమతి అడుగున్నది 8 సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుత డిప్యూటీ సీఎం శివకుమార్ అయినందున అనుమతిస్తున్నాం. ఎందుకంటే ఇంత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన పారిపోయే అవకాశాలు తక్కువ’అని కోర్టు పేర్కొంది. అయితే డీకే దుబాయ్ వెళ్లేందుకు అనుమతిచ్చిన కోర్టు కొన్ని షరతులు పెట్టింది. 5 లక్షల రూపాయల డిపాజిట్తో పాటు ప్రయాణానికి సంబంధిచిన పూర్తివివరాలు, అక్కడ వాడే మొబైల్ నెంబర్ అందించాలని ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన డీకే శివకుమార్కు 2019 అక్టోబర్ 23న కోర్టు ఈడీ కేసులో బెయిల్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన బెయిల్పైనే ఉన్నారు. ఇదీచదవండి..వర్షంలో శరద్పవార్ స్పీచ్..సెంటిమెంట్ ఏంటంటే.. -
లిక్కర్ స్కాంలో కీలక పరిణామం
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ కుంభకోణం కేసులో తాజాగా కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్ రామంద్ర పిళ్లై మరోసారి అప్రూవర్గా మారినట్లు తెలుస్తోంది. ఈ మేరకు న్యాయమూర్తి ముందు ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. లిక్కర్ కుంభకోణంలో అప్రూవర్గా మారిన రామచంద్ర పిళ్లై.. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు వాంగ్మూలం వచ్చారు. అయితే.. అరుణ్ పిళ్లై అప్రూవర్గా మారడం ఇదేం కొత్త కాదు. గతంలో ఒకసారి అప్రూవర్గా మారి స్టేట్మెంట్ ఇచ్చిన పిళ్లై.. మాట మార్చారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన వద్ద బలవంతంగా వాంగ్మూలం తీసుకొన్నదని, అదంతా తప్పని పిళ్లై కోర్టును ఆశ్రయించారు. ఆ వాంగ్మూలాలను ఉపసంహరించుకోవాలనుకొంటున్నట్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ తన వద్ద రెండు పత్రాలపై బలవంతంగా సంతకం చేయించుకొన్నదని, ఆ పత్రాల్లో తన వాంగ్మూలాలను సమర్పించిందని వివరించారు. ఆ వాంగ్మూలాన్ని ముందు పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి తాను సన్నిహితుడినంటూ ఒక కట్టుకథ అల్లుతున్నారని పేర్కొన్నారు. అయితే.. తాజాగా ఆయన మరోసారి అప్రూవర్గా మారి స్టేట్మెంట్ ఇవ్వడంతో.. ఈ కేసు దర్యాప్తుపైనా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. పిళ్లై అప్రూవర్గా మారడం, జడ్జి ముందు స్టేట్మెంట్ ఇచ్చారన్న ప్రచారాన్ని ఆయన లీగల్ టీం తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కామ్లో మనీలాండరింగ్ ఆరోపణలపై అరుణ్రామచంద్ర పిళ్లైను ఈ ఏడాది మార్చిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ స్కామ్ కేసులో మరో నిందితుడు సమీర్ మహేందు(ఇండో స్పిరిట్ ఎండీ) నుంచి లంచాలు తీసుకుని.. మరో నిందితుడికి ఇచ్చినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. అప్పటికే పిళ్లై కోకాపేట నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ.. వట్టినాగులపల్లి(రంగారెడ్డి) వద్ద ఆయనకు చెందిన రూ.2 కోట్ల విలువ చేసే భూమిని జప్తు చేసింది కూడా. అరెస్ట్ చేశాక.. పిళ్లై ఈడీ రిమాండ్ రిపోర్టులో ఎమెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. ఆయన కవిత బినామీ అని, ఆమె ప్రతినిధినని ఎన్నోసార్లు స్టేట్మెంట్లు ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టు పేర్కొంది. కవిత ఆదేశాల మేరకే ఆయన పనిచేసినట్లు చెప్పింది. ఇండో స్పిరిట్ స్థాపనలో రామచంద్ర పిళ్లైదే కీలక పాత్ర అని పేర్కొంది. మరోవైపు ఆగష్టులో ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా.. రౌస్ ఎవెన్యూ న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టేసింది. -
చాట్జీపీటీ చెప్పిందని కోర్టు మెట్లక్కిన దిగ్గజ కంపెనీ.. చివరికి ఏమైందంటే
ఓ కేసు విచారణ నిమిత్తం ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చాట్జీపీటీ ఇచ్చిన ఆధారాల్ని పరిగణలోకి తీసుకొని తీర్పు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇంతకీ ఆ కేసు ఏంటి? చాట్జీపీటీ ఇచ్చిన ఆధారాలేంటి? పలు నివేదికల ప్రకారం.. ఇటీవల ఫ్రాన్స్ లగ్జరీ షూ తయారీ సంస్థ క్రిస్టియన్ లౌబౌటిన్.. భారత్లోని ఢిల్లీ కేంద్రంగా షుటిక్ అనే కంపెనీ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా షూ’లను తయారు చేసి అమ్మకాలు నిర్వహిస్తుంది. ఇప్పుడు షుటిక్పై క్రిస్టియన్ లౌబౌటిన్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. తమ సంస్థ కొన్ని షూ డిజైన్లు తమకే చెందుతాయంటూ ట్రేడ్మార్క్ తీసుకుందని, ఇందుకోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కోర్టుకు వివరించింది. అయితే, షుటిక్ తమ ట్రేడ్ మార్క్ షూ డిజైన్లను కాపీ కొట్టిందని, ఇదే విషయాన్ని చాట్జీపీటీ చెప్పినట్లు ఆధారాలు సమర్పించింది. తమకు న్యాయం చేయాలని విన్నవించుకుంది. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు.. న్యాయస్థానంలో చట్టపరమైన లేదా వాస్తవిక సమస్యల పరిష్కారానికి చాట్జీపీటీ ఇచ్చిన ఆధారాలు సరిపోవని కోర్టు పేర్కొంది. ఏఐ చాట్బాట్ల ప్రతిస్పందనలు, కల్పితాలు, ఊహాజనిత డేటా మొదలైన వాటికి అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు.. ప్రతివాది ఉద్దేశపూర్వకంగా మనీ సంపాదనకు ట్రేడ్ మార్క్ నిబంధనలను ఉల్లంఘించారని అర్థమవుతుందని తెలిపింది. ఇకపై బూట్ల డిజైన్లు, రంగులు కాపీ చేయరాదని, ఆ ఒప్పందం ఉల్లంఘిస్తే రూ.25 లక్షలు జరిమాన చెల్లించాల్సి వస్తుందని ప్రతివాదిని హెచ్చరించింది. ప్రస్తుతం, పిటిషనర్ ఖర్చుల కింద వాదికి రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. చదవండి👉 ‘ఆ AI టూల్ను షట్డౌన్ చేస్తున్నాం’.. చాట్జీపీటీ సృష్టికర్త సంచలన ప్రకటన! -
గీతికా శర్మ కేసులో సంచలన తీర్పు
ఢిల్లీ: హర్యానాలో సంచలనం సృష్టించిన ఎయిర్హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో ఆ రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోపాల్ గోయల్ కందాకు భారీ ఊరట లభించింది. 11 ఏళ్ల కిందటి నాటి ఈ కేసులో.. కందాని నిర్దోషిగా ప్రకటిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. ప్రముఖ వ్యాపారవేత్త అయినా కందాకు చెందిన ఎండీఎల్ఆర్ ఎయిర్లైన్స్లో గీతికా శర్మ ఎయిర్హోస్టెస్గా పని చేసేది. అదే సమయంలో కందాకు చెందిన ఓ కంపెనీకి ఆమె డైరెక్టర్గా కూడా బాధ్యతలు చేపట్టింది. అయితే.. 2012, ఆగష్టు 5వ తేదీన ఢిల్లీ అశోక్ విహార్లోని తన ఇంట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో సిస్రా ఎమ్మెల్యే అయిన కందా.. కాంగ్రెస్ భూపిందర్ సింగ్ హూడా నేతృత్వంలోని ప్రభుత్వంలో హోంశాఖ మంత్రి హోదాలో ఉన్నారు. ► అయితే తన సూసైడ్ నోట్లో కందాతో పాటు ఆయన దగ్గర పని చేసే ఉద్యోగి అరుణ్ చందా తనను వేధించారంటూ గీతిక పేర్కొంది. అంతేకాదు ఆయనకు అంకిత అనే మరో మహిళతో సంబంధం ఉందని, వాళ్లకు ఓ బిడ్డ పుట్టిందని ఆరోపించింది. తన ఆత్మహత్యకు కందా వేధింపులే కారణమని పేర్కొందామె. ► దీంతో భారత్ నగర్ పోలీస్ స్టేషన్లో గోపాల్తో పాటు అరుణ్పైనా ‘ఆత్మహత్యకు ఉసిగొల్పారనే’ నేరం కింద అభియోగాలు నమోదు అయ్యాయి. అంతేకాదు అత్యాచారం, అసహజ శృంగారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ► ఆ సమయంలో.. కేసు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కందా తన పదవికి రాజీనామా చేసి.. పోలీసులకు లొంగిపోవాల్సి వచ్చింది. అంతకు ముందు అరుణ్ చందాను పోలీసులు గాలించి మరీ అరెస్ట్ చేశారు. అదే ఏడాది పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ► అయితే కందా మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తూ వచ్చారు. గీతిక ఎంబీఏ చదవడానికే తానే సాయం చేశానని, సిస్రాలోని తన ఇంటర్నేషనల్ స్కూల్కు చైర్మన్ను సైతం చేశానని చెప్పుకొచ్చాడు. ► ఇదిలా ఉంటే.. న్యాయం దక్కదనే ఆవేదనతో 2013 ఫిబ్రవరి 15వ తేదీన గీతిక తల్లి అనురాధా శర్మ సైతం ఆత్మహత్యకు పాల్పడింది. కూతురిలాగే ఆమె సైతం సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడింది. ► 2014 మార్చి 4వ తేదీన కందాకు బెయిల్ లభించింది. అలాగే.. ఆయనపై దాఖలైన అత్యాచారం, అసహజ శృంగారం ఆరోపణలను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ► ఈలోపే హర్యానా లోక్హిత్ పార్టీని స్థాపించిన కందా.. తిరిగి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాడు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. తిరిగి 2019 ఎన్నికల్లో పోటీ చేసి సిస్రా ఎమ్మెల్యేగా నెగ్గాడు. ► అయితే.. ఇన్నేళ్లు గడిచినా అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్వాళ్లు విఫలమయ్యారంటూ స్పెషల్ జడ్జి వికాస్ ధూల్ గోపాల్ను, అరుణ్ను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇవాళ సంచలన తీర్పు వెల్లడించారు. ► గోపాల్ కుమార్ గోయల్ అలియాస్ గోపాల్ గోయల్ కందా అస్సలు చదువుకోలేదు. వ్యాపారాలతో ఎదిగి.. భారీగా ఆస్తులు సంపాదించాడు. ఆపై రాజకీయాల్లోకి ప్రవేశించాడు. గోపాల్పై గీతికా శర్మ కేసు ఒక్కటే కాదు.. ఇంకా చాలానే కేసులు నమోదు అయ్యాయి. ► గీతిక శర్మ సూసైడ్ కేసులో ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు తాజా తీర్పుపై న్యాయపోరాటానికి సిద్ధమని ఆమె సోదరుడు చెబుతున్నారు. #WATCH | After Delhi's Rouse Avenue Court acquitted former Haryana Minister Gopal Goyal Kanda in air hostess Geetika Sharma suicide case, he says, "There was no evidence against me, this case was made against me and today the court has given its verdict." pic.twitter.com/rG9gE6EZ86 — ANI (@ANI) July 25, 2023 -
బ్రిజ్భూషణ్కు బెయిల్; ఏ ప్రాతిపదికన వారికి మినహాయింపు?
న్యూఢిల్లీ: నేరుగా ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్లకు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అడ్హక్ కమిటీ ఇచ్చిన మినహాయింపు అంశం కోర్టుకెక్కింది. అండర్–20 ప్రపంచ చాంపియన్ అంతిమ్ పంఘాల్, అండర్–23 ఆసియా చాంపియన్ సుజీత్ కల్కల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్ వీరిద్దరికి మినహాయింపు ఇవ్వడానికి గల కారణాలు, ప్రాతిపదిక ఏమిటని రెజ్లింగ్ సమాఖ్య వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అడ్హక్ కమిటీని ప్రశ్నించారు. డబ్ల్యూఎఫ్ఐ మార్గదర్శకాల ప్రకారం అన్ని వెయిట్ కేటగిరీలకు సెలక్షన్ ట్రయల్స్ తప్పనిసరి అని పిటిషనర్ల తరఫు న్యాయ వాది వినిపించగా, జడ్జి తదుపరి విచారణన నేటికి వాయిదా వేశారు. బ్రిజ్భూషణ్కు బెయిల్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ సీనియర్ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు గురువారం ఢిల్లీ కోర్టు పూర్తిస్థాయి బెయిల్ను మంజూరు చేసింది. మైనర్ రెజ్లర్ సహా పలువురు రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్భూషణ్పై ఎట్టకేలకు గత నెల 15న పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్ని విచారించిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ షరతులతో కూడిన బెయిల్ ఇచి్చంది. మంగళవారం కేవలం మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా తాజాగా పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చింది. అయినప్పటికీ కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లేందుకు అవకాశం లేదు. -
కీలక పరిణామం.. బ్రిజ్భూషణ్కు ఢిల్లీ కోర్టు సమన్లు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్కు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సింగ్ తమను లైంగిక వేదించడంతో పాటు బెదిరింపు చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు బ్రిజ్భూషణ్పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బ్రిజ్ భూషణ్ సింగ్కు సమన్లు జారీ చేసింది. జూలై 18న కోర్టుకు హాజరుకావాలని కోరింది. బ్రిజ్ భూషణ్ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. జూన్ 2న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణల ఆధారంగా ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లతో పాటు 10 ఫిర్యాదులు నమోదు చేశారు. డబ్ల్యుఎఫ్ఐ చీఫ్పై వచ్చిన ఫిర్యాదుల్లో మహిళా రెజ్లర్లను అనుచితంగా తాకడం, వారి చాతీపై చేయి వేయడం, నడుము బాగాన్ని చేతితో తడమడం లాంటివి చేసేవాడంటూ పేర్కొన్నారు. చదవండి: #ManchesterUnited: ఇంగ్లండ్ స్టార్కు కళ్లు చెదిరే మొత్తం.. అవి డబ్బులా ఇంకేమైనా! #HappyBirthdayMSD: '30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా' -
పరువునష్టం దావా.. రాజస్థాన్ సీఎంకు సమన్లు
సాక్షి, ఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆ సమన్లలో పేర్కొంది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గెహ్లాట్పై వేసిన పరువు నష్టం దావా ఆధారంగా ఈ సమన్లు జారీ అయ్యాయి. సుమారు 900 కోట్ల రూపాయలకు సంబంధించి గెహ్లాట్ చేసిన ఆరోపణలకుగానూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ దావా వేశారు. సంజీవని స్కామ్పై చేసిన వ్యాఖ్యలతో గెహ్లాట్ తన పరువు తీశారంటూ కోర్టుకెక్కారు కేంద్ర మంత్రి. అయితే.. నేరపూరిత పరువు నష్టం కేసులో సీఎంకు సమన్లు పంపాలా? వద్దా? అని తర్జనభర్జనలు చేసి.. ఆ ఉత్తర్వులను ఇదివరకే రిజర్వ్ చేసింది కోర్టు. ఇక ఇవాళ ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ హజ్రీత్ సింగ్ జస్పాల్ ఇవాళ సీఎం గెహ్లాట్కు సమన్లు జారీ చేశారు. ఇంతకు ముందు మోదీ ఇంటి పేరు వ్యవహారంలో పరువు నష్టం దావా ద్వారా కోర్టు కేసు ఎదుర్కొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. దోషిగా తేలి రెండేళ్ల శిక్ష పడడంతో ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: కాళ్లు కడిగి మరీ క్షమాపణలు కోరిన సీఎం -
కాదన్నందుకే కడతేర్చాడు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని షాబాద్ డెయిరీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం నడిరోడ్డుపై పదహారేళ్ల బాలికను అత్యంత పాశవికంగా 20సార్లకుపైగా పొడిచి, సిమెంట్ శ్లాబ్తో పుర్రె పగిలేలా మోదిన ఉదంతంలో నిందితుడు ఆమెపై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడు సాహిల్ను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అయితే పోలీసుల దర్యాప్తులో హత్యోదంతం తాలూకు పలు అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. హత్య నేరాన్ని పోలీసుల విచారణలో సాహిల్ ఒప్పుకున్నాడు. పక్కా ప్రణాళికతోనే అదే చోట చంపాలని ముందే నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. సన్నిహితంగా ఉండే బాలిక సాక్షి తనను దూరంగా పెట్టడం సాహిల్కు నచ్చలేదు. బంధం కొనసాగించాలని కోరగా తన స్నేహితురాళ్ల సమక్షంలోనే సాక్షి ఇతడిని తిరస్కరించింది. సన్నిహితంగా ఉండాలని బలవంతం చేస్తే చితకబాదుతామని సాక్షి స్నేహితులు సాహిల్ను హెచ్చరించారు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని 15 రోజుల క్రితమే హరిద్వార్ నుంచి తీసుకొచ్చాడు. హత్య చేశాక పారిపోతూ కత్తిని రిఠాలా మెట్రో స్టేషన్ దగ్గరి పొదల్లో పడేశాడు. తర్వాత బులంద్షహర్లోని తన అత్తయ్య ఇంటికి వెళ్లాడు. ఉత్తరప్రదేశ్కు వెళ్లాక ఇంటికి ఫోన్చేశాడు. ఆ ఫోన్కాల్ సాయంతో జాడ కనిపెట్టి పోలీసులు ఇతడిని పట్టుకున్నారు. సాక్షి శరీరంపై 34 లోతైన గాయాలు ఉన్నాయని, పుర్రె పగిలిందని పోలీసులు వెల్లడించారు. 2021 జూన్ నుంచి వీరిద్దరూ రిలేషన్లో ఉండగా విడిపోదామని ఇటీవల చెప్పడంతో గత ఎనిమిదిరోజులుగా వారి మధ్య గొడవలు అవుతున్నాయి. ఆర్థికంగా స్థితిమంతుడైన తన మాజీ ప్రియుడితో మళ్లీ టచ్లోకి రావడంతోనే గొడవ పెరిగిందని సాహిల్ చెప్పాడు. కాగా, సాక్షి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. -
రాహుల్ పాస్పోర్టుకు కోర్టు ఓకే
న్యూఢిల్లీ: కొత్త పాస్పోర్టు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఢిల్లీ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. మూడేళ్ల పాటు సాధారణ పాస్పోర్టు పొందడానికి అనుమతి మంజూరు చేసింది. ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాతరాహుల్ గాంధీ తన డిప్లొమాటిక్ పాస్పోర్టును, ఇతర ప్రయాణ అనుమతి పత్రాలను అధికారులకు అందజేశారు. విదేశాల్లో ప్రయాణించడానికి వీలుగా సాధారణ పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితుడిగా ఉండడంతో పాస్పోర్టు కోసం నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) తీసుకోవాల్సి ఉంది. ఎన్ఓసీ ఇవ్వాలంటూ ఆయన ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. మూడేళ్లపాటు సాధారణ పాస్పోర్టు కోసం ఎన్ఓసీ ఇస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. -
Rahul Gandhi: పాస్పోర్టు కోసం.. లైన్ క్లియర్
సాక్షి, ఢిల్లీ: పాస్పోర్టు వ్యవహారంలో.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఢిల్లీ కోర్టు ఊరట ఇచ్చింది. మూడు సంవత్సరాలపాటు సాధారణ(రెగ్యులర్) పాస్పోర్ట్ పొందేందుకు అనుమతిస్తూ శుక్రవారం ఎన్వోసీ ఆదేశాలు జారీ చేసింది. ఎంపీగా పార్లమెంట్ అనర్హత వేటు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ.. తన డిప్టోమేటిక్ పాస్పోర్ట్ను తిరిగి అప్పగించారు. పాస్పోర్టుతో పాటు అన్ని రకాల ప్రయాణ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. అనంతరం కొత్త పాస్పోర్టు(సాధారణ) దరఖాస్తు చేసుకునేందుకు నో అబ్జక్షన్ సర్టిఫికేట్(NOC) కోసం రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారాయన. అందుకు కారణం.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన నిందితుడిగా ఉండడమే. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన మనీలాండరింగ్, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసు ఇది. దీంతో రెగ్యులర్ పాస్పోర్టు కోసం ఆయన ఎన్వోసీ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో ఇవాళ కోర్టు ఆదేశాలిస్తూ అయితే రాహుల్ కోరినట్లు పదేళ్లకు కాకుండా మూడేళ్లకు మాత్రమే సాధారణ పాస్పోర్ట్ కోసం ఎన్వోసీ ఇస్తున్నట్లు తెలిపింది. Delhi's Rouse Avenue Court partly allows Congress leader Rahul Gandhi's plea seeking NOC for issuance of a fresh ordinary passport. The court has granted NOC for 3 years. pic.twitter.com/laElsJqELR — ANI (@ANI) May 26, 2023 అంతకు ముందు బుధవారం విచారణ సందర్భంగా.. పాస్పోర్టు నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోరుతూ గాంధీ చేసిన అభ్యర్థనపై శుక్రవారంలోగా సమాధానం ఇవ్వాలని బీజేపీ మాజీ ఎంపి స్వామిని కోర్టు కోరింది. ఇక ఇవాళ్టి తీర్పు సందర్భంగా.. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వైభవ్ మెహతా ప్రయాణించే హక్కు ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయాణాలపై కోర్టు ఆంక్షలు విధించలేదని తెలిపింది. అలాగే.. 2015 డిసెంబరులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేస్తున్నప్పుడు, కోర్టు అతని ప్రయాణంపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని, ఆంక్షలు విధించాలంటూ స్వామి చేసిన విజ్ఞప్తిని ఆ సమయంలోనూ తిరస్కరించారని మేజిస్ట్రేట్ ఈ సందర్భంగా గుర్తు చేశారు కూడా. -
Satyendar Jain: మధ్యంతర బెయిల్ మంజూరు
సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్కి ఎట్టకేలకు ఊరట లభించింది. అనారోగ్యం రిత్యా ఆయనకు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయనకు ఈ కేసులో తాత్కాలిక ఉపశమనం లభించినట్లయ్యింది. సత్యేందర్ జైన్ను ఢిల్లీ వదలి వెళ్లొద్దని చెబుతూ..షరతులతో కూడిని బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. ఈ ఉత్తర్వు జూలై 11 వరకు అమలులో ఉంటుందని, అలాగే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను కోర్టుకి సమర్పించాలని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. ఇదిలా ఉండగా, మనీలాండరిగ్ కేసులో గతేడాది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సత్యేందర్ జైన్ను మే 30న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలుమార్లు కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించగా ఎదురుదెబ్బలు తగులుతూ వచ్చాయి. ఇదిలా ఉంటే ఆహారపు అలవాట్ల మార్పుతో జైన్ అనారోగ్యం పాలయ్యారు. జైన్ గురువారం శ్వాసకోసం ఇబ్బందులతో అకస్మాత్తుగా జైల్లో కళ్లుతిరిగి పడిపోయారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆయన్ని హుటాహుటినా జయప్రకాశ్ నారాయణ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు.. అనారోగ్యం రిత్యా జైన్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. (చదవండి: జైల్లో కుప్పకూలిన జైన్) -
సిసోడియాకు అవమానం.. మెడ పట్టుకుని లాక్కెళ్లిన పోలీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా పట్ల నగర పోలీసులు వ్యవహరించిన తీరుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో సహా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. దేశ రాజధానిలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చిన సమయంలో.. సిసోడియాను పోలీసులు మెడ పట్టుకొని బలవంతంగా లాక్కెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు సీఎం కేజ్రీవాల్ ఓ వీడియో విడుదల చేశారు. సిసోడియాను మెడ పట్టుకొని లాక్కెళ్లిన పోలీసులు? ఇందులో ఢిల్లీ కోర్టుకు భారీ భద్రత నడుమ పోలీసులు సిసోడియాను తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో మీడియా వారి వద్దకు చేరుకొని ప్రశ్నలు అడుగుతుంటే పోలీస్ అధికారి ఏకే సింగ్ రిపోర్టర్లను దూరంగా నెట్టడానికి ప్రయత్నించారు. కోర్టు ఆవరణలో సిసోడియా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధానికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, మోదీ చాలా అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఓ పోలీస్ అధికారి సిసోడియాను మాట్లాడనివ్వకుండా మెడ పట్టుకొని తీసుకెళ్లిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్ ఆగ్రహం ఈ వీడియోపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. మనీష్ సిసోడియాతో ఇలా అనుచితంగా ప్రవర్తించే హక్కు పోలీసులకు ఉందా? అని ప్రశ్నించారు. ఇలా చేయమని పైనుంచి (కేంద్రం లోని మోదీ సర్కార్) పోలీసులకు ఆదేశాలొచ్చాయా? అని మండిపడ్డారు. మనీష్తో పోలీసుల దురుసు ప్రవర్తన షాక్కు గురిచేసిందని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి పేర్కొన్నారు. సిసోడియా పట్ల అనుచితంగా ప్రవర్తించిన అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. क्या पुलिस को इस तरह मनीष जी के साथ दुर्व्यवहार करने का अधिकार है? क्या पुलिस को ऐसा करने के लिए ऊपर से कहा गया है? https://t.co/izPacU6SHI — Arvind Kejriwal (@ArvindKejriwal) May 23, 2023 ఖండించిన పోలీసులు అయితే ఆప్ ఆరోపణలను ఢిల్లీ పోలీస్లు కొట్టి పారేశారు. ఇదంతా దుష్ప్రచారంగా పేర్కొన్నారు. వీడియోలో కనిపిస్తున్న పోలీసుల చర్య భద్రత దృష్ట్యా సహజమేనని.. నిందితులు ఎవరైనా మీడియాకు స్టేట్మెంట్లు ఇవ్వడం చట్టవిరుద్ధమని పోలీసులు ట్వీట్ చేశారు. సిసోడియా కస్టడీ పొడిగింపు కాగా, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సిసోడియాను పోలీసులు మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు జూన్ 1వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. -
సీరియల్ రేపిస్ట్ను దోషిగా తేల్చిన కోర్టు.. 30 మంది పిల్లలను దారుణంగా..
న్యూఢిల్లీ: ఆల్కహాల్, డ్రగ్స్, అశ్లీల వీడియోలకు బానిసై మృగంలా మారి 30 మంది చిన్నారుల జీవితాలను చిదిమేసిన ఓ కిరాతకుడ్ని దోషిగా తేల్చింది ఢిల్లీ కోర్టు. మరో రెండు వారల్లో ఇతనికి శిక్షను ఖరారు చేయనుంది. అభశుభం తెలియని చిన్నారులను లక్ష్యంగా చేసుకుని వరుస అత్యాచారాలకు పాల్పడిన ఈ కామాంధుడి పేరు రవీందర్ కుమార్. వయసు 32 ఏళ్లు. 2008 నుంచి 2015 మధ్య మొత్తం 30 మంది పిల్లలను లక్ష్యంగా చేసుకుని వారిపై అత్యాచారాలు చేసి హతమార్చాడు. 2015లో ఇతడు అరెస్టయ్యాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఒంటరిగా ఉన్న చిన్నపిల్లలను ఇతను లక్ష్యంగా చేసుకునేవాడు. వారికి డబ్బులు, చాక్లెట్టు ఆశచూపి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లేవాడు. ఆ తర్వాత వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబుతారేమోనని వారిని దారుణంగా హత్య చేసేవాడు. గుడిసెల్లో నివసించే పేదలు, కార్మికుల పిల్లలను కూడా ఇతడు లక్ష్యంగా చేసుకునేవాడు. రాత్రివేళ తల్లిదండ్రులు నింద్రించే సమయంలో పిల్లలను ఎత్తుకెళ్లేవాడు. నూతనంగా నిర్మించే భవనాలు, పాడుబడ్డ భవనాలకు తీసుకెళ్లి కామ వాంఛ తీర్చుకునేవాడు. బాధితుల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. పోలీసుల విచారణలో తాను చేసిన నేరాలను రవీందర్ అంగీకరించాడు. తాను అత్యాచారం చేసిన ప్రదేశాలకు కూడా పోలీసులను తీసుకెళ్లాడు. 2015లో ఇతడ్ని విశ్రాంత ఏసీపీ జగ్మీందర్ సింగ్ దహియా అరెస్టు చేశారు. మద్యం తాగినా, డ్రగ్స్ తీసుకున్నా రవీందర్ మృగంలా మారి స్వీయ నియంత్రణ కోల్పోయేవాడని తెలిపారు. చంపిన తర్వాత మృతదేహాలను కూడా వదిలేవాడు కాదని పేర్కొన్నారు. ఢిల్లీలోలోనే కాదు బదాయూ, హథ్రాస్, అలీగఢ్లోనూ రవీందర్ అత్యాచారాలకు పాల్పడ్డాడు. పోలీసుల కంట పడొద్దని కాలినడకన, అడవుల ద్వారానే ఇతర ప్రాంతాలకు ప్రయాణించేవాడు. ఇన్ని కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతడ్ని ఒక్క కేసులో మాత్రమే కోర్టు దోషిగా తేల్చడం గమనార్హం. చదవండి: నదిలో పడిన బస్సు.. 24 మంది దుర్మరణం -
12 దాకా సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ న్యాయస్థానం మే 12వ తేదీ దాకా పొడిగించింది. ఈ మేరకు ప్రత్యేక జడ్జి ఎం.ఎం.నాగపాల్ గురు వారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఈ నెల 25న దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ ఈ–కాపీని సిసోడియాకు అందజేయాలని సీబీఐని ఆదేశించారు. విచారణ పూర్తి కాకుండానే సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిందని, సిసోడియాకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది రిషికేశ్ కోరారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసే హక్కు తమకు ఉందని పేర్కొన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. అనుబంధ చార్జిషీట్ ఈ–కాపీని సిసోడియాకు ఇవ్వాలని సీబీఐకి స్పష్టం చేశారు. -
కోర్టు మెట్లెక్కిన అమితాబ్ బచ్చన్ మనవరాలు
-
సిసోడియా కస్టడీ పొడగింపులో మార్పు
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యూడీషియల్ కస్టడీని పొడిగించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. అయితే.. తొలుత మే 1వ తేదీ వరకు సిసోడియా కస్టడీని పొడగిస్తున్నట్లు తెలిపిన కోర్టు.. కాసేపటికే ఆ ఆదేశాలను మార్చేసింది. లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ వేర్వేరు కేసులతో దర్యాప్తు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. దీంతో సీబీఐ కేసులో సిసోడియా కస్టడీని ఏప్రిల్ 27వ తేదీకి, ఈడీ కేసులో ఏప్రిల్ 29వ తేదీ దాకా కస్టడీని పొడిగిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయిన హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీని మాత్రం మే 1వ తేదీ వరకే పొడిగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. లిక్కర్ కేసులో సీబీఐ అవినీతి అభియోగాల మీద, ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతి అభియోగాల మీద ఫిబ్రవరి 26వ తేదీన సీబీఐ మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. మరోవైపు లిక్కర్ స్కాంలో ఈ నెలాఖరులోగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో ఛార్జిషీట్ (ప్రాసిక్యూషన్ ఫిర్యాదు) దాఖలు చేయనున్నట్లు సమాచారం. సిసోడియా, పిళ్లై, మరో వ్యాపారవేత్త అమన్దీప్ ధాల్ అదనపు ఛార్జీషీట్ వేయనున్నట్లు తెలుస్తోంది. Rouse Avenue Court modified the order related to Manish Sisodia's judicial custody in ED and CBI in connection with liquor scam case. Sisodia's judicial custody now extends by the Court till April 27 in CBI case and April 29 in the ED case. Court also noted the submissions of… — ANI (@ANI) April 17, 2023 -
భార్యకు అస్వస్థత, కొడుకు విదేశాల్లో ఉన్నాడు!ఐనా సిసోడియాకు నో బెయిల్
లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సీసోడియా బెయిల్ మంజూరు చేయాల్సిందిగా మరోసారి ఢిల్లీ కోర్టుని అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన తరుఫు లాయర్ సిసోడియా భార్యకు అస్వస్థతని, కొడుకు విదేశాల్లో ఉన్నాడని అందువల్ల ఆయనే తన భార్యను చూసుకోవాల్సి ఉందని కోర్టుకి తెలిపారు. ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్టు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అతని బెయిల్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. అతను ప్రభుత్వంలో అత్యున్నత పదవిలో ఉన్నాడని కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రభావితం చేయగలడంటూ బెయిల్ నిరాకరించింది సీబీఐ. ఐతే సిసోడియా సీబీఐ దర్యాప్తుకు తాను సహకరిస్తానని, సోదాల్లో తనకు వ్యతిరేకంగా ఎలాంటి నేరారోపణలు లేవని సిసోడియా తరుఫు లాయర్ వాదించారు. ఇకపై అతనికి కస్టడీ అవసరం లేదని ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన తరుఫు న్యాయవాది చెప్పారు. కానీ సీబీఐ మాత్రం సాక్షులను ప్రభావితం చేయగలడని, దర్యాప్తును అడ్డుకోగలడని వాదిస్తోంది. ఐతే సిసోడియ న్యాయవాది మాత్రం ఆయనపై ఆరోపించిన నేరాలకు ఏడేళ్ల కంటే తక్కువ జైలు శిక్షే పడుతుందని, ఇకపై ఎలాంటి జైలు శిక్ష విధించడం సమర్థనీయం కాదని కోర్టుకి విన్నవించారు. సిసోడియా 18 పోర్ట్ఫోలియాలను కలిగి ఉన్నాడని, అతను ఉపయోగించిన ఫోన్లు, కీలకమైన ఫైళ్లను అతను ధ్వంసం చేశాడని, ఇదేమి తెలిసీ తెలియకుండా చేసిన పని కాదని ఉద్దేశపూర్వకంగా చేసిందేనని నొక్కి చెబుతోంది సీబీఐ. అలాగే ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి సీబీఐకు 60 రోజులు సమయం పడుతుందని, ఆయన బయటకు వస్తే దర్యాప్తు పక్కదోవ పట్టే ప్రమాదం ఉందని పేర్కొంది. (చదవండి: మనీష్ సిసోడియాకు మరోసారి చుక్కెదురు..బెయిల్ విచారణ వాయిదా..) -
కవిత విచారణకు ముందర.. బిగ్ ట్విస్ట్!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకునేందుకు పిటిషన్ దాఖలు వేశారు ఈ కేసులో నిందితుడైన అరుణ్ రామచంద్ర పిళ్లై. దీంతో ఈడీకి ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన పిళ్లై.. ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్నివెనక్కి తీసుకునేందుకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో తాజాగా పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో స్పందించాలంటూ ఈడీకి కోర్టు నోటీసులు పంపింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కాంలో ప్రముఖ పాత్ర పోషించారంటూ పిళ్లైను ఈడీ అరెస్ట్ చేసి ప్రశ్నించింది. ఈ క్రమంలో.. పిళ్లై , బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తాను బినామీ అని, ఆమె ప్రయోజనాల కోసమే పని చేశానంటూ పిళ్లై వాంగ్మూలం ఇచ్చాడంటూ ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఈడీ పేర్కొంది. ఆపై లిక్కర్ స్కామ్లో కవితను ప్రశ్నించేందుకు నోటీసులు కూడా పంపింది. రేపు అంటే శనివారం ఈడీ ఎదుట కవిత విచారణకు హాజరు కావాల్సి ఉంది కూడా. ఈ తరుణంలో ఇప్పుడు పిళ్లై తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరడం గమనార్హం. -
Shraddha Walkar Case: ఆ అనుభవంతోనే..
క్రైమ్: అఫ్తాబ్ పూనావాలా.. యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేసిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఏకైక, ప్రధాన నిందితుడు. మనస్పర్థలతో సహ భాగస్వామి శ్రద్ధను చంపేసి, శరీరాన్ని 35 ముక్కలు చేసి, ఫ్రిడ్జ్లో భద్రపర్చి ఆపై ఆ భాగాలను వివిధ చోట్ల పడేశాడతను. అయితే.. ఈ కేసులో ఇప్పుడు పోలీసులు మరో ఆసక్తికరమైన విషయాన్ని ఢిల్లీ కోర్టుకు వెల్లడించారు. ఆఫ్తాబ్ పూనావాలా శిక్షణ పొందిన చెఫ్ అని, మాంసాన్ని సైతం ఎలా భద్రపర్చాలో అతనికి తెలుసని పోలీసులు కోర్టుకు తాజాగా నివేదించారు. తాజ్ హోటల్లో అఫ్తాబ్ చెఫ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అలాగే మాంసాన్ని ఎలా భద్రపర్చడమో కూడా అతనికి తెలుసు. నేరంలో అది తనకి సాయపడిందని అఫ్తాబ్ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే.. డ్రై ఐస్, అగరబత్తీలతో పాటు శ్రద్ధను హత్య చేసిన తర్వాత నేలను శుభ్రం చేసేందుకు.. కొన్ని రసాయనాలను ఆర్డర్ చేశాడు అని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. శ్రద్ధను హత్య చేసిన వారంలోపే మరో యువతితో డేటింగ్ ప్రారంభించాడని, ఆ కొత్త గర్ల్ఫ్రెండ్కు శ్రద్ధ రింగ్నే బహుకరించాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ ప్రసాద్ వాదనలు వినిపిస్తున్నారు. తాజా విచారణ సందర్భంగా.. ఆయన కేసు దర్యాప్తులో పోలీసులు తాజాగా సాధించిన పురోగతిని కోర్టుకు తెలిపారు. -
ఢిల్లీ మద్యం కేసులో నిందితులకు బెయిల్ నిరాకరణ
-
మాజీ భార్య పరువు తీస్తుంది.. టీమిండియా స్టార్ క్రికెటర్ ఆవేదన, కోర్టు అక్షింతలు
టీమిండియా స్టార్ క్రికెటర్, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ కోర్టు మెట్లెక్కాడు. అతని మాజీ భార్య అయేషా ముఖర్జీ తన పరువుకు భంగం కలిగించేలా విష ప్రచారం చేస్తుందని న్యూఢిల్లీలోని పటియాలా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన స్నేహితులు, క్రికెట్కు సంబంధించిన వ్యక్తులు అలాగే ఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహించే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి అయేషా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేస్తుందని ఆధారాలతో సహా కోర్టులో సమర్పించాడు. తన పరువుకు భంగం కలిగించే సమాచారాన్ని సోషల్మీడియాలో షేర్ చేస్తానని బెదిరిస్తుందని వాపోయాడు. ధవన్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు అయేషాను మందలించింది. ధవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి అలాగే అతని పరువుకు భంగం కలిగేలా ఎలాంటి సమాచారాన్ని మీడియాతో కానీ అతని స్నేహితులు, బంధువులతో కానీ మరే ఇతర సోషల్మీడియా ప్లాట్ఫాంలపై కానీ షేర్ చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ధవన్ సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నత వ్యక్తి అని, అంతేకాక అతను భారత క్రికెట్ జట్టులో కీలక సభ్యుడని, అతని రెప్యుటేషన్ దెబ్బతినే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని సూచించింది. Delhi court restrains estranged wife of Shikhar Dhawan from making defamatory allegations against the cricketer report by @NarsiBenwal #ShikharDhawan @SDhawan25 https://t.co/5MWVV4gEUe — Bar & Bench (@barandbench) February 4, 2023 భారత్, ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన అయేషా తన వాదనలను వినిపించేందుకు ఇది సరైన మార్గం కాదని, ఒకవేళ అలాంటివేవైనా ఉంటే రెండు దేశాల్లో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపింది. కాగా, ధవన్ 2012లో అస్ట్రేలియాకు చెందిన అయేషాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ కుమారుడు (జోరావర్) జన్మించాడు. అయేషాకు ధవన్తో పెళ్లికి ముందే వివాహం జరిగింది. వారికి రియా, ఆలియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మనస్పర్ధల కారణంగా ధవన్-అయేషా 2021లో విడిపోయారు. కోర్టు వీరికి విడాకులు కూడా మంజూరు చేసింది. కోర్టు తీర్పు మేరకు ధవన్ మెయింటెనెన్స్ సరిగ్గా చల్లించట్లేదని అయేషా ప్రస్తుతం ఆరోపిస్తుంది. కాగా, టీమిండియాలో కీలక సభ్యుడైన శిఖర్ ధవన్ ఇప్పటివరకు 34 టెస్ట్లు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు. ఇందులో 2315 టెస్ట్ పరుగులు (7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు), 6793 వన్డే పరుగులు (17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు), 1759 టీ20 పరుగులు (11 హాఫ్ సెంచరీలు) ఉన్నాయి. ధవన్ పలు మ్యాచ్ల్లో టీమిండియాకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. -
విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తికి బెయిల్..
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో తోటి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం తీర్పు రిజర్వు చేసిన న్యాయస్థానం మంగళవారం ఈమేరకు తీర్పునిచ్చింది. ఢిల్లీ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టిన సాక్షి చెప్పిన దానికి, ఫిర్యాదు చేసిన మహిళ చెప్పిన దానికి పొంతన లేదని పాటియాలా కోర్టు చెప్పింది. సాక్ష్యాధారాలు సరిగ్గా లేనందున నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. శంకర్ మిశ్రాకు బెయిల్ ఇవ్వొద్దని అతను చేసిన పని వల్ల అంతర్జాతీయంగా భారత్ అపఖ్యాతి పాలైందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే అది వేరే విషయమని చట్టపరమైన విషయాలు మాత్రమే పరిశీలించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. గతేడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో అశోక్ మిశ్రా వికృత చేష్టలు చేశాడు. ఫుల్లుగా తాగి మహిళపై మూత్ర విసర్జన చేశాడు. బాధితురాలు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 11న మెజిస్టేరియల్ కోర్టు శంకర్ మిశ్రాకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే పాటియాలా కోర్టు మాత్రం బెయిల్ మంజూరు చేసింది. ఈ వ్యవహారంలో ఎయిర్ ఇండియా యాజమాన్యానికి రూ.30లక్షల జరిమానా కూడా విధించింది కేంద్ర పౌరవిమానయాన శాఖ. విమానం పైలట్ ఇంఛార్జ్ను కూడా మూడు నెలలు సస్పెండ్ చేసింది. ఎయిర్ ఇండియా విమాన సేవల డైరెక్టర్కు రూ.3లక్షల పెనాల్టీ విధించింది. చదవండి: అత్యాచార కేసులో సెషన్స్ కోర్టు కీలక తీర్పు.. ఆశారాం బాపునకు జీవిత ఖైదు -
ఆమె మరణించిన 15 ఏళ్లకు కీలక తీర్పు ఇచ్చిన కోర్టు
పెళ్లైన ఏడాదిన్నరకే వరకట్న దాహానికి బలైంది. ఎన్నో ఏళ్లుగా కోర్టులో విచారణ సాగిని ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు 15 ఏళ్లకు ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులను దోషులుగా నిర్ధారించింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..భారతి అనే మహిళ అక్టోబర్3, 2007న పెళ్లై ఏడాదిన్నరలోపే అసాధారణ పరిస్థితుల్లో చనిపోయింది. దీంతో ఆమె భర్త, అత్త, బావ, మరిదిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఐతే ఆమెను హత్య చేశారనే సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిందితులను తొలుత నిర్దోషులుగా ప్రకటించారు. పోస్ట్మార్టం నివేదికలో మాత్రం ఆమె ఊపిరాడక చనిపోయినట్లు ఉంది. అదీగాక దర్యాప్తు అధికారులు సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న వ్యక్తులు గురించి, పైగా పక్కన అద్దెకుంటున్న వారిని విచారించడం వంటివి చేయలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఈ కేసును విచారిస్తున్న కోర్టు ప్రాసిక్యూషన్ వాదనలు విన్న కోర్టు ఎట్టకేలకు దోషలుగా నిర్ధారిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. బాధితురాలు వివాహం అయినప్పటి నుంచి వరకట్న సమస్యలు ఎదుర్కొన్నట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొంది. మరణానికి ముందు రోజు కూడా వేధింపులకు గురైనట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపింది. అలాగే ఆమె మరణానికి ముందు నిందితులందరిపై ఆరోపణలు చేస్తూ రాసిన లేఖ తదితర సాక్ష్యాధారాలు ఆధారంగా భర్త పవన్కుమార్, అత్తగారు సత్బిరో, బావ కప్తాన్ సింగ్, బావమరిది దల్జీత్ సింగ్లను దోషులగా నిర్ధారించినట్లు కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మృతురాలు వివాహం అయినప్పటి నుంచి చనిపోయేంత వరకు వేధింపులు కొనసాగినట్లు తగిన సాక్ష్యాధారాలు ఉన్నందున వారిని దోషులగా గర్తించినట్లు స్పష్టం చేసింది. ఈ కేసుకి సంబంధించి తదుపరి తీర్పును జనవరి 30కి వాయిదా వేసింది. (చదవండి: అనాథలమని ఆవేదన చెంది.. ముగ్గురు అక్కచెల్లెళ్ల ఆత్మహత్య..) -
ఎయిర్ ఇండియా ‘మూత్ర విసర్జన’ ఘటనలో కొత్త కోణం
ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. మద్యం మత్తులో 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రా.. తను ఆమె పట్ల ఆ విధంగా ప్రవర్తించలేదని తెలిపాడు. వాస్తవానికి వృద్ధురాలిపై తాను మూత్ర విసర్జన చేయలేదని.. ఆ మహిళే తన సీట్లో మూత్ర విసర్జన చేసుకుందని ఢిల్లీ పాటియాలా కోర్టుకు శుక్రవారం వెల్లడించారు. వృద్ధ మహిళ తనను తానే మూత్ర విసర్జన చేసుకుని తనపై ఆరోపణలు చేస్తోందని ఆరోపించాడు. ఈ మేరకు కోర్టులో మిశ్రా తరపు న్యాయవాది మాట్లాడుతూ.. వృద్ధురాలు తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మూత్ర విసర్జన చేసిందని పేర్కొన్నారు. ఆ మహిళ 30 ఏళ్లుగా భరతనాట్యం నృత్యకారిణి అని, వారికి మూత్ర విసర్జన సమస్య రావడం సహజమేనని కోర్టుకు తెలిపారు. కాగా విచారణ నిమిత్తం శంకర్ మిశ్రాను కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు పాటియాలా హౌస్ కోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు అతనికి బుధవారం నోటీసులు జారీ చేసింది. అంతేగాక మిశ్రా బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. కోర్టు నోటీసులపై విచారణ సందర్భంగా మిశ్రా పై వ్యాఖ్యలు చేశాడు. చదవండి: 12 రోజుల్లోనే 5.4 సె.మీ కుంగిపోయిన జోషిమఠ్.. వాళ్లకు ఆర్థిక సాయం అసలేం జరిగిందంటే.. గతేడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో మద్యం మత్తులో శంకర్ మిశ్రా అనే వ్యక్తి సహప్రయాణికురాలికి మూత్ర విసర్జన చేశాడు. ఎయిరిండియాకు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు జనవరి 4న మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మిశ్రా పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు అతనిపై లుకౌట్ పోలీసులు జారీ చేసిన తర్వాత నిందితుడిని బెంగళూరులో అరెస్టు చేశారు.ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ ఇంఇయాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది, ఈ చర్య అనంతరం మిశ్రాను ఉద్యోగంలో నుంచి తీసేశారు. మిశ్రాను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ శనివారం కోర్టు ఆదేశించింది. -
Urination incident: ‘ఎయిరిండియా’ నిందితుని అరెస్టు
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఘటనలో నిందితుడు శంకర్ మిశ్రాకు ఢిల్లీ న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో నవంబర్ 26వ తేదీన ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే పోలీసు విచారణకు సహకరించడం లేదని తెలుస్తోందని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అనామిక పేర్కొన్నారు. ఘటన సమయంలో విమాన సిబ్బంది, కొందరు ప్రయాణికులు నిందితుడిని గుర్తించాల్సి ఉన్నందున శంకర్ మిశ్రాను మూడు రోజుల కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల వినతిని మేజిస్ట్రేట్ తోసిపుచ్చారు. ప్రజల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయనే కారణంతో కస్టడీకి కోరడం తగదన్నారు. నిందితుడి పరోక్షంలో విమాన ప్రయాణికులు, సిబ్బంది వాంగ్మూలం నమోదు చేస్తే సరిపోతుందన్నారు. ఢిల్లీ నుంచి బెంగళూరుకు.. అంతకుముందు మిశ్రా కోసం ఢిల్లీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మొబైల్ ఫోన్ చివరి లొకేషన్ జనవరి 3న బెంగళూరుగా చూపించింది. స్నేహితులతో సోషల్ మీడియా ద్వారా అతను టచ్లో ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. శుక్రవారం రాత్రి బెంగళూరు మహదేవపురలోని చిన్నప్ప లేఔట్లో అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. బాధితురాలిని ఇబ్బందులకు గురిచేశారు ఈ ఘటనలో ఎయిరిండియా సిబ్బంది బాధ్యతా రాహిత్యాన్ని బాధితురాలి పక్క సీట్లో ప్రయాణించిన డాక్టర్ సుగతా భట్టాచార్య వెల్లడించారు. ‘‘మిశ్రా నిర్వాకానికి బాధితురాలి దుస్తులు, సీటు పూర్తిగా తడిచి దుర్వాసన వెదజల్లుతున్నా మరో సీటు కేటాయించకుండా పైలట్ ఆమెను రెండు గంటలపాటు ఇబ్బందిపెట్టారు. ఫస్ట్క్లాస్లో నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నా వెంటనే సిబ్బంది సీటివ్వలేదు. ఆ ఘటనతో మేమంతా షాకయ్యాం’’ అంటూ లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బా ధితురాలికి ఎయిరిండియా సీఈవో కాంప్బెల్ వి ల్సన్ క్షమాపణలు చెప్పారు. ‘‘సిబ్బంది సరిగా వ్య వహరించాల్సింది. పైలట్తో పాటు నలుగురికి షో కాజ్ నోటీసులిచ్చాం. విమానంలో ప్రయాణికులకు మందు సరఫరా చేయడాన్ని సమీక్షిస్తాం’’అన్నారు. -
5 కోట్లకు పెండింగ్ కేసులు!
న్యూఢిల్లీ: దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో మరో రెండు నెలల్లో పెండింగ్ కేసుల సంఖ్య 5 కోట్ల మార్కును దాటనుందని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఇలాంటి కేసులు కొంత తగ్గుముఖం పడుతున్నప్పటికీ కింది కోర్టుల్లో మాత్రం పరిస్థితి సవాలుగానే మారిందని పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టులో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో కిరణ్ రిజిజు మాట్లాడారు. కింది కోర్టులను మౌలిక వసతుల కొరత వేధిస్తోందని, అందుకే పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. పరిష్కారం కాని కేసులు కొన్ని నెలల క్రితం వరకు 4.83 కోట్లు ఉండేవన్నారు. ఇలాంటి కేసులపై ఎవరైనా తనను ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం చాలా కష్టమని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బొల్లినేని గాంధీపై సస్పెన్షన్ వేటు -
Satyendar Jain: ఆప్ మంత్రికి మరో దెబ్బ
సాక్షి, ఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ కుమార్ జైన్కు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆయన బెయిల్ అభ్యర్థనలు తిరస్కణకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. శనివారం ఆయనకు మరో చేదు అనుభవం ఎదురైంది. జైల్లో మత విశ్వాసాలకు తగ్గట్లుగా ఆహారం తీసుకునేట్లు తనను అనుమతించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రత్యేక ఆహారం అందించాల్సిందిగా తీహార్ జైలు అధికారులను ఆదేశించాలన్న ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. తీహార్ జైలులో మంత్రి జైన్కు సరైన ఆహారం, వైద్య సదుపాయాలు అందడం లేదని, ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా జైలు అధికారులను ఆదేశించాలంటూ కూడా ఆ అభ్యర్థన పిటిషన్ పేర్కొంది. అయితే.. ప్రత్యేక న్యాయవాది వికాస్ ధూల్ ఆ పిటిషన్ను తిరస్కరించారు. మే 31వ తేదీన జైన్ అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన జైన్ టెంపుల్కు వెళ్లలేదు. జైన మత విశ్వాసాలను నికచ్ఛిగా పాటించే సత్యేందర్ కుమార్ జైన్.. అందుకు తగ్గట్లుగా ఆహారం తీసుకోలేకపోతున్నారు అని ఆయన తరపున పిటిషన్ దాఖలైంది. కానీ, జైలు అధికారులు మాత్రం ఆ డిమాండ్ను అంగీకరించలేదు. ఒక ఖైదీని ప్రత్యేకంగా చూడడం వీలు కాదని, ఖైదీలందరికీ కుల, మతాలకు అతీతంగా ఒకేరకమైన ఆహారం అందిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో పోలీసులతో ఏకీభవించిన స్పెషల్ జడ్జి వికాస్.. సత్యేందర్ జైన్ పిటిషన్ను కొట్టేశారు. ఇక.. 2017లో ఆప్ నేత సత్యేందర్ జైన్కు వ్యతిరేకంగా సీబీఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఆయనకు సంబంధించిన నాలుగు కంపెనీల ద్వారా మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఈ ఏడాది మే చివరన ఆయన్ని అరెస్ట్ చేసి.. తీహార్ జైలుకు తరలించారు. నవంబర్ 17వ తేదీన ఆయనతో ఈ కేసులో అరెస్ట్ అయిన మరో ఇద్దరికీ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. -
శ్రద్ధ హత్య కేసు.. నేరం అంగీకరించని అఫ్తాబ్.. పోలీస్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: శ్రద్ధ వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా పోలీస్ కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగించింది ఢిల్లీ కోర్టు. ఈ కేసులో ఇంకా కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందని పోలీసులు కోరడంతో అంగీకరించింది. సాకెత్ కోర్టులో మంగళవారం విచారణ సందర్భంగా ఈ ఘటన క్షణికావేశంలోనే జరిగిందని అఫ్తాబ్ కోర్టుకు చెప్పాడు. విచారణ అనంతరం అఫ్తాబ్ తరఫు న్యాయవాది అవినాశ్ మాట్లాడుతూ.. అతడు ఇంకా కోర్టులో నేరాన్ని అంగీకరించలేదని పేర్కొన్నాడు. ఘటన సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు కూడా న్యాయస్థానం ఎదుట ఒప్పుకోలేదని వివరించాడు. అఫ్తాబ్ కుటుంబ సభ్యులు అతడ్ని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. కోర్టు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. మరోవైపు అఫ్తాబ్కు ఐదు రోజుల్లో నార్కో టెస్టు నిర్వహించాలని గత సెషన్లో కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే అతను విచారణకు సహకరించడం లేదని, తప్పుడు సమాచారం ఇస్తున్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అందుకే నార్కో టెస్టుకు ముందు పాలీగ్రాఫ్ టెస్టు నిర్వహించేందుకు అనుమతించాలని కోర్టును కోరారు. శ్రద్ధ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆరు నెలల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. శ్రద్ధ బాయ్ ఫ్రెండ్ అఫ్తాబే ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని 35 ముక్కలు చేసి అడవిలో పడేశాడు. అయితే ఈ కేసులో అఫ్తాబ్ ఉపయోగించిన కత్తి, శ్రద్ధ దుస్తులు, మొబైల్ ఫోన్, ఇంకా కొన్ని శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. చదవండి: అత్యాచార బాధితురాలి నుంచి లంచం తీసుకున్న మహిళా పోలీస్.. -
Shraddha murder case: నార్కో పరీక్షలకు కోర్టు అనుమతి
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడైన అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు నార్కో పరీక్షలు నిర్వహించడానికి గురువారం ఢిల్లీ కోర్టు అనుమతిచ్చింది. ఇందుకోసం మరో అయిదు రోజులు పోలీసు కస్టడీని పొడిగించింది. మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ శుక్లా నార్కో పరీక్షలకు నిర్వహించడానికి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అఫ్తాబ్ విచారణ జరిగినప్పుడు కోర్టు వెలుపల భారీ సంఖ్యలో నిరసనకారులు చేరుకొని వెంటనే అతనిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. దీంతో అఫ్తాబ్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి తెచ్చినందుకు తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్ను గొంతు నులిపి హత్య చేసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా కోసి, ఫ్రిజ్లో ఉంచి కొన్ని రోజుల పాటు దాచి తర్వాత అఫ్తాబ్ ఆ ముక్కలను పారేయడం తెలిసిందే. హత్యాయుధం దొరక్కపోవడంతో పోలీసులు నార్కో పరీక్షలకు అనుమతి కోరారు. ముఖాన్ని కాల్చేసి.. పోలీసుల విచారణలో అఫ్తాబ్ అమీన్ ఒళ్లు జలదరించే విషయాలు బయటపెడుతున్నాడు. సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి ఎన్నో హేయమైన చర్యలకు దిగాడు. ఆమె ముఖం ఎవరూ గుర్తు పట్టకుండా కాల్చినట్టుగా పోలీసుల ఎదుట అంగీకరించాడు. కట్టెలా బిగుసుకుపోయిన మృతదేహం కొయ్యడానికి వీలుగా వేడినీళ్లలో బ్లీచింగ్ పౌడర్ కలిపి వేశానని, అప్పుడే శవాన్ని కొయ్యగలిగానని పోలీసులు దగ్గర చెప్పినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో నెలకి 20వేల లీటర్ల వరకు నీళ్లు ఉచితమైనా అతని ఫ్లాట్కి నీటి బిల్లు రూ.300 పైగా రావడానికి కారణాలను కనుగొన్నారు. మృతదేహాన్ని కోస్తున్నప్పుడు చప్పుడు బయటకు వినిపించకుండా నీళ్ల పైపులు తిప్పి ఉంచాడని, ఇంట్లో మరకలు కనిపించకుండా తరచూ ఫ్లాట్ని కడిగేవాడని పోలీసులు విచారణలో తేలింది. వారిద్దరి మధ్య తరచూ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గొడవలు అవుతూ ఉండేవని తెలుస్తోంది. -
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు కోర్టులో మరోసారి చుక్కెదురు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. జైన్తో పాటు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు వైభవ్ జైన్, అంకుశ్ జైన్లకు కూడా బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. మనీలాండరింగ్ కేసులో సత్యేంజర్ జైన్ను మే 30న అరెస్టు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆయన జూన్లో బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా.. నిరాశే ఎదురైంది. ఇప్పుడు రెండో సారి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ కేసులో విచారణకు జైన్ సహకరించడం లేదని, దర్యాప్తు ముందుకుసాగకుండా తమను తప్పదోవ పట్టిస్తున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో న్యాయస్థానం జైన్కు బెయిల్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. 2017 ఆగస్టు 24న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా జైన్ను ఈడీ అదికారులు మే 30న అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. తిహాడ్ జైల్లో జైన్కు వీఐపీ సదుపాయాలు కల్పిస్తున్నాడనే ఆరోపణలతో ఆ జైలు సూపరింటెండెంట్ను సస్పెండ్ చేశారు. చదవండి: ధైర్యముంటే భారత్ జోడో యాత్ర ఆపండి.. రాహుల్ గాంధీ ఛాలెంజ్ -
సుశీల్కు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి రెజ్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్ దాదాపు ఏడాదిన్నర తర్వాత జైలునుంచి బయటకు రానున్నాడు. కుటుంబపరమైన సమస్యను ఎదుర్కొంటున్న కారణంగా మానవతా దృక్పథంతో ఈ నెల 12 వరకు అతనికి ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేసింది. సుశీల్ భార్య తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతుండటంతో శస్త్రచికిత్సకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె బాగోగులు చూసుకునేందుకు 3 వారాల బెయిల్ ఇవ్వాల్సిందిగా సుశీల్ న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అయితే చివరకు కోర్టు వారం రోజుల బెయిల్ కోసం ఆదేశాలు ఇచ్చింది. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్యకేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ 2021 జూన్ 2నుంచి జైల్లో ఉన్నాడు. -
మనీ లాండరింగ్ కేసు.. ఆ నటిపై ఈడీ సంచలన ఆరోపణలు
రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్పై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఆమె దేశం విడిచి పారియేందుకు యత్నించిందని.. ఆధారాలను తారుమారు చేసేందుకు యత్నించిందని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. ఆమెపై లుక్ అవుట్ నోటీసులు ఉన్నందున విదేశాలకు వెళ్లలేకపోయిందని ఈడీ తెలిపింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విచారణకు సహకరించడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఆమె తన మొబైల్ డేటాను డిలీట్ చేసి సాక్ష్యాలు తారుమారు చేసేందుకు యత్నించారని ఈడీ కోర్టుకు వివరించింది. జాక్వెలిన్, మరో నటి నోరా ఫతేహీ ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ నుంచి ఖరీదైన కార్లు బహుమతులుగా స్వీకరించారని ఈడీ తెలిపింది. మధ్యంతర బెయిల్ పొడిగింపు: మరోవైపు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు కోర్టులో ఊరట లభించింది. ఆమె మధ్యంతర బెయిల్ను పొడిగిస్తున్నట్లు ఢిల్లీ కోర్టు ప్రకటించింది. తాజాగా నటి పిటిషన్పై మళ్లీ విచారణ చేపట్టిన ఢిల్లీ న్యాయస్థానం బెయిల్ గడువు తేదీని పొడిగించింది. ఆ బెయిల్ గడువు తేదీని నంవబర్ 10 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. -
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు: జాక్వెలిన్కు బిగుస్తున్న ఉచ్చు..
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా ఆమెకు డిల్లీ పాటియాల హౌజ్ కోర్టు షాకిచ్చింది. సెప్టెంబర్ 26వ తేదీన కోర్టులో హాజరు కావాలని జాక్వెలిన్ను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కోర్టు ఆమెకు సమాన్లు ఇచ్చింది. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పరిగణించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవల జాక్వెలిన్పై ఛార్జ్షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్పై నమోదు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో జాక్వెలిన్ పేరును చేర్చింది ఈడీ. ఈ ఛార్జ్షీట్ను ఈడీ కోర్టులో సమర్పించగా దాని ఆధారంగా తాజాగా కోర్టు జాక్వెలిన్కు సమాన్లు జారీ చేసింది. చదవండి: సుమన్ ఇకలేరంటూ వార్తలు.. ఆ యూట్యూబ్ చానళ్లకు నటుడు వార్నింగ్ కాగా రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లను రూ.200 కోట్లకు మోసం చేసిన కేసులో సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతనితో జాక్వెలిన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. అతని నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్లు గుర్తించారు. ఇప్పటికే జాక్వెలిన్కు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే.. ఈడీ అటాచ్ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు తన కష్టార్జితమని జాక్వెలిన్ ఇప్పటికే స్పష్టం చేసింది. తన సంపాదనకు సంబంధించి ఆదాయపు పన్ను కూడా చెల్లించానని, క్రైమ్ ప్రొసీడింగ్స్ను నిలిపి వేయాలని జాక్వెలిన్ ఈడీని కోరిన సంగతి తెలిసిందే. చదవండి: యాంకర్ సుమ పెళ్లి చీర ధరెంతో తెలుసా? అదే ఆమె రేంజ్ అట నటుడు బ్రహ్మాజీ సటైరికల్ ట్వీట్.. అనసూయను ఉద్ధేశించేనా? -
స్మృతి ఇరానీ కూతురు బార్ కేసులో ట్విస్ట్.. కాంగ్రెస్ నేతలకు షాక్
Smriti Irani Defamation Case.. గోవాలో బార్ వ్యవహారంలో దేశంలో హాట్ టాపిక్గా మారింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు గోవాలో అక్రమంగా బార్ నిర్వహిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. అయితే, కాంగ్రెస్ నేతల ఆరోపణలు నిరాధారమైనవని స్మృతి ఇరానీ తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలపై కేంద్ర మంత్రి పరువు నష్టం దావా వేశారు. కాగా, శుక్రవారం ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు కాంగ్రెస్ నేతలకు భారీ షాకిచ్చింది. ముగ్గురు హస్తం నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెత్తా డిసౌజాలకు నోటీసులు జారీ చేసింది. పరువునష్టం కేసులో ముగ్గురు కాంగ్రెస్ నేతలు ఆగస్టు 18వ తేదీన కోర్టు ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అలాగే, గోవాలో బార్ సంబంధించి చేసిన ట్వీట్లను 24 గంటల్లోగా డిలీట్ చేయాలని కోర్టు తెలిపింది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. జైరాం రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. స్మృతి ఇరానీ వేసిన దావాను కోర్టులోనే ఛాలెంజ్ చేస్తామని కౌంటర్ ఇచ్చారు. అసలు వాస్తవాలను కోర్టుకు దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఇదిలా ఉండగా.. గోవాలో బార్ల విషయంలో తన కూతురుపై ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని స్మృతి ఇరానీ తెలిపారు. ఈ విషయాన్ని లీగల్ నోటీసుల్లో కూడా పేర్కొన్నారు. అలాగే, రెండు కోట్ల నష్టపరిహారం చెల్లించాలని మంత్రి స్మృతి ఇరానీ తన పరువు నష్టం దావాలో డిమాండ్ చేశారు. Smriti Irani defamation case: Delhi HC directs three Congress leaders to remove social media posts #SmritiIrani #DelhiHighCourt #Congress https://t.co/2YnwX7jPHD — Lagatar English (@LagatarEnglish) July 29, 2022 ఇది కూడా చదవండి: బెంగాల్ స్కామ్.. నటి అర్పితా ముఖర్జీ కేసులో ఊహించని పరిణామం -
Terror Funding Case: యాసిన్ మాలిక్కు యావజ్జీవం
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ (56)కు పటియాలా హౌస్ ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు బుధవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మాలిక్ ఇటీవలే తన నేరాన్ని అంగీకరించడం తెలిసిందే. అతనికి మరణ శిక్ష విధించాలని ఎన్ఐఏ కోరింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంతో పాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద మాలిక్పై కేసులు నమోదయ్యాయి. అతనికి యావజ్జీవంతో పాటు ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ రూ.11 లక్షల జరిమానా కూడా విధించారు. 2017లో కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించడానికి ఫ్రీడమ్ స్ట్రగుల్ పేరుతో నిధులు సమకూర్చాడంటూ మాలిక్పై ఎన్ఐఏ తొలి కేసు నమోదు చేసింది. కోర్టును మాలిక్ క్షమాభిక్ష కోరలేదని అతని లాయర్ వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలితే ఉరి తీయండనే కోరాడన్నారు. తీర్పు సందర్భంగా కోర్టు వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పీఓకేలో శిక్షణ.. భారత్లో ధ్వంస రచన నిషేధిత జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) నేతగా తరచూ వార్తల్లో కనిపించే మాలిక్ 1966 ఏప్రిల్ 3న శ్రీనగర్లోని మైసుమాలో పుట్టాడు. 1980ల నుంచే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు తెర తీశాడు. 1988లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆయుధాల వాడకం, ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ పొందాడు. జేకేఎల్ఎఫ్లో చేరి చురుగ్గా పనిచేశాడు. 1990 ఆగస్టులో ఎన్కౌంటర్లో పోలీసులకు దొరికిపోయాడు. 1994 మేలో బెయిల్పై విడుదలయ్యాడు. కశ్మీర్ విముక్తికి శాంతియుత ఉద్యమం కొనసాగిస్తానని ప్రకటించాడు. జేకేఎల్ఎఫ్ చైర్మన్గా ఎదిగాడు. కొన్నాళ్లు హురియత్ కాన్ఫరెన్స్లోనూ çపనిచేశాడు. కశ్మీర్లో ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తూ 1999లో ప్రజా భద్రత చట్టం (పీఎస్ఏ) కింద అరెస్టయ్యాడు. 2002లో విడుదలయ్యాడు. 2009లో పాకిస్తానీ కళాకారిణి ముషాల్ హుస్సేన్ ములిక్ను పెళ్లి చేసుకున్నాడు. వారికి పదేళ్ల కుమార్తె రజియా ఉంది. ఆమె ప్రస్తుతం తల్లితో కలిసి పాకిస్తాన్లో నివసిస్తోంది. యాసిన్ మాలిక్ 2013 ఫిబ్రవరిలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్తో కలిసి వేదిక పంచుకున్నాడు. 2017 నాటి టెర్రర్ ఫండింగ్ కేసులో 2019లో మాలిక్ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. జమ్మూకశ్మీర్లో హింసాకాండకు సంబంధించి అతడిపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె రుబైయా సయీద్ను 1989లో కిడ్నాప్ చేసిన కేసులో కూడా విచారణను ఎదుర్కొన్నాడు. 1990లో శ్రీనగర్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ సిబ్బందిపై దాడి చేశాడు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. -
ఆ స్తోమత లేదా? అయినా తప్పదు! భర్తకు షాక్
భర్త పెట్టే వేధింపులు భరించలేక.. దూరంగా, వేరుగా ఉంటోందామె. అయితే భర్త తనకు దూరంగా మంచి జీతంతో విలాసవంతంగా బతుకుతున్నాడని, కాబట్టి, తనకు మెయింటెనెన్స్ కోసం కొంత డబ్బు ఇప్పించాలని ఆ భార్య కోర్టును ఆశ్రయించింది. ఆపై పరిణామాలు ఆ భార్యకు అనుకూలంగా రాగా.. పైకోర్టును ఆశ్రయించిన భర్తకు పెద్ద షాకే తగిలింది. చాలా ఏళ్ల క్రితమే భర్తను వీడి.. దూరంగా ఉంటున్న ఆ భార్యకు మధ్యంతర భరణంగా నెలకు రూ.5,133 చెల్లించాలని భర్తను ఆదేశించింది మహిళా కోర్టు. అయితే ఈ తీర్పుపై ఢిల్లీ కోర్టును ఆశ్రయించగా.. చేదు అనుభవమే ఎదురైంది. తాను నిరుద్యోగినని, భరణంగా డబ్బులు ఇవ్వలేనని పిటిషన్లో వేడుకున్నాడు ఆ భర్త. దీనిపై ఈమధ్యే విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు, భర్త నిరుద్యోగి అయినంత మాత్రాన తన భార్యను పోషించే బాధ్యత నుంచి తప్పించుకోలేడని స్పష్టం చేసింది. నిరుద్యోగం కారణంగా చూపి భార్యకు మధ్యంతర భరణం ఇచ్చే బాధ్యత నుంచి భర్త తప్పించుకోలేడని తీస్ హజారీ కోర్టుల అదనపు సెషన్స్ జడ్జి సంజయ్ శర్మ తీర్పునిచ్చారు. ‘‘భర్త నిరుద్యోగి. అది వాస్తవమే కావొచ్చు. అయినప్పటికీ భార్యకు భరణం చెల్లించే బాధ్యత నుంచి అది తప్పించలేదు. ఈ కేసులో భర్తకు మంచి విద్యార్హత ఉంది. వృత్తిపరంగా అనుభవమూ ఉంది. ఇప్పుడు ఉద్యోగం లేనంత మాత్రానా.. తర్వాతి రోజుల్లో మరో ఉద్యోగం సంపాదించలేడా?. వైకల్యం ఏం లేదు కదా’’ అని జడ్జి భర్తను ఎదురు ప్రశ్నించారు. వరకట్న వేధింపులకు పాల్పడి మరీ తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆ భర్తపై భార్య ఆరోపణలు చేసింది. అతడి వేధింపులు తాళలేక వేరుగా నివసిస్తూ.. నెలకు రూ.50 వేల జీతంతో విలాసవంతంగా బతుకుతున్నాడని, తన మెయింటెనెన్స్ కోసం కొంత ఇప్పించాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. అయితే.. తాను ఇంటి ఖర్చులు భరిస్తున్నానని, అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూసుకుంటున్నానని, కుట్టుపని ద్వారా తన కంటే తన భార్యే ఎక్కువ సంపాదిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ ఆమెకు మంచి సౌకర్యాలు అందించాలని, అది నైతిక, చట్టపరమైన బాధ్యత అని ఢిల్లీ కోర్టు వ్యాఖ్యానించింది. -
జేఎన్యూ విద్యార్థి ఇమామ్పై దేశద్రోహం కేసు
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి షర్జీల్ ఇమామ్పై దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ఇమామ్ రెచ్చగొట్టే ప్రసంగం చేశాడని పేర్కొంది. జామియా మిలియా ఇస్లామియాలో 2019 డిసెంబర్ 13న, అలీఘర్ ముస్లిం వర్సిటీలో 2019 డిసెంబర్ 16న ఇమామ్ మాట్లాడుతూ.. అస్సాంను, ఈశాన్య భారతాన్ని భారత్ నుంచి వేరు చేస్తామని బెదిరించారని విచారణలో తేలిందంది. అంతకుముందు ఇమామ్ తానేం ఉగ్రవాదిని కాదని కోర్టుకు విన్నవించాడు. 2020 జనవరి నుంచి ఇమామ్ జుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో ద్వేషం, ధిక్కారం పెరిగేలా ఇమామ్ ప్రసగించాడని, ప్రజలను రెచ్చగొట్టాడని, దీని వల్ల 2019 డిసెంబర్లో హింస జరిగిందని ఢిల్లీ పోలీసులు అతనిపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. -
విరాట్ కోహ్లిని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుని, భార్యకు భరణం కట్టలేనంటావా..?
Virat Kohli: టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న ఓ కంపెనీకి డైరెక్టర్గా ఉన్న ఓ వ్యక్తికి ఢిల్లీ కోర్టు అక్షింతలు వేసింది. కోహ్లిని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుని, భార్యకు భరణం కట్టలేనంటావా..? అంటూ మొట్టికాయలు వేసింది. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన ఓ వివాహిత.. తన భర్త, అతడి తల్లి కలిసి వేధిస్తున్నారని ఆరోపిస్తూ కేసు దాఖలు చేసింది. ఈ క్రమంలో భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఆ మహిళ.. భర్త నుంచి భరణం ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది. దీనిని విచారించిన ట్రయల్ కోర్టు.. ఆమెకు నెలకు రూ. 30 వేల భరణం చెల్లించాలని సదరు భర్తను ఆదేశించింది. అయితే, ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్ భర్త ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్టులో అప్పీల్ చేశాడు. తనకు ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదని, ఛారిటీల ద్వారా వచ్చే డబ్బుతో నెట్టుకొస్తున్నానని, తాను భరణాన్ని చెల్లించే పరిస్థితి లేదని కోర్టుకు విన్నవించుకున్నాడు. పిటిషనర్ అప్పీల్పై అడిషినల్ సెషన్స్ జడ్జ్ అనూజ్ అగ్రవాల్ స్పందిస్తూ.. ‘విరాట్ కోహ్లి లాంటి సెలబ్రిటి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న కంపెనీకి డైరెక్టర్గా ఉండి భరణం చెల్లించేందుకు డబ్బులు లేవంటే నమ్మేలా లేదని అప్పీల్ను తిరస్కరించారు. మెయింటెనెన్స్ తప్పనసరిగా చెల్లించాల్సిందేనంటూ పిటిషనర్ను ఆదేశించారు. చదవండి: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ విరాట్ కోహ్లి! ఇప్పటికే... -
25 ఏళ్ల తర్వాత.. ‘ఉపహార్ కేసు’లో ఇద్దరికి ఏడేళ్ల జైలు
న్యూఢిల్లీ: 1997నాటి ‘ఉపహార్’అగ్ని ప్రమాద ఘటన కేసులో రియల్ ఎస్టేట్ యజమానులు సుశీల్ అన్సాల్, గోపాల్ అన్సాల్లకు ఢిల్లీ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.2.25 కోట్ల చొప్పున జరిమానా విధించింది. కోర్టు మాజీ ఉద్యోగి దినేశ్ చంద్కు మరో ఇద్దరు పీపీ బాత్రా, అనూప్ సింగ్లకు ఏడేళ్ల చొప్పున జైలు శిక్షతోపాటు, రూ.3 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పంకజ్ శర్మ సోమవారం తీర్పు వెలువరించారు. దోషులకు విధించిన జరిమానాలను బాధితులకు పరిహారంగా చెల్లించనున్నట్లు జడ్జి చెప్పారు. ఉపహార్ సినిమా హాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 59 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసినట్లు సుశీల్, గోపాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరికీ ఇప్పటికే సుప్రీంకోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఢిల్లీలో ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ. 30 కోట్ల చొప్పున ఇచ్చేందుకు అంగీకరించడంతో అనంతరం విడుదల చేసింది. -
సునంద పుష్కర్ మృతి కేసు: శశిథరూర్కు ఊరట
న్యూఢిల్లీ: భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు ఊరట లభించింది. ఈ కేసులో శశిథరూర్కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారలు లేవన్న ప్రత్యేక కోర్టు శశిథరూర్ మీద ఉన్న ఆరోపణలను కొట్టిపారేసింది. సునంద పుష్కర్ జనవరి 17, 2014 రాత్రి ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్ సూట్లో శవమై కనిపించింది. ఈ క్రమంలో శశి థరూర్పై ఢిల్లీ పోలీసులు ఆత్మహత్య, క్రూరత్వ ఆరోపణలపై కేసు నమోదు చేశారు. -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియాకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు భారీ ఊరట లభించింది. ఢిల్లీ ప్రభుత్వ అప్పటి ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్పై దాడిచేసిన కేసులో ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర 9 మంది ఇతర ఎమ్మెల్యేలను ఢిల్లీ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2018 నాటి ఈ కేసులో కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. అయితే, ఈ కేసులో ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు అమాంతుల్లా ఖాన్, ప్రకాష్ జర్వాల్పై అభియోగాలు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తాజా తీర్పుపై ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు.ఇది తప్పుడు కేసు అని మొదటినుంచీ చెబుతూనే ఉన్నామనీ, ఈ కేసులో అన్ని ఆరోపణలు అబద్ధమని కోర్టు తేల్చి చెప్పిందన్నారు. సత్యానికి, న్యాయానికి లభించిన గొప్ప విజయమని ఆయన పేర్కొన్నారు. తమ సీఎంకు వ్యతిరేకంగా పన్నిన కుట్ర అని సిసోడియా వ్యాఖ్యానించారు. కాగా 2018 ఫిబ్రవరి 19వ తేదీ రాత్రి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సమావేశంలో అప్పటి సీఎస్ ప్రకాష్పై ఎమ్మెల్యేలు దాడి చేశారనే ప్రధాన ఆరోపణతో కేసునమోదైంది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు మరో 11 మంది ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు ఛార్జిషీటు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
ప్రశ్నించే గళాలకు ప్రాణవాయువు
‘దేశం పునాదులెంతో బలోపేతంగా ఉన్నాయి. అసమ్మతి గళాలు, నిరసన ప్రదర్శనలతోనే కదిలిపోయేంత బలహీనంగా అవి లేవు, పకడ్బంది మూలాలతోనే ఉన్నట్టు మేం భావిస్తున్నాం’ అన్న ఢిల్లీ న్యాయస్థానపు ధర్మాసనం మాటలు ప్రజాస్వామ్య వాదులకు సరికొత్త భరోసా కల్పిస్తున్నాయి. ప్రజాస్వామ్య సువాసనను మరింత పరిమళభరితంగా వెదజల్లాయి. ఈ ప్రక్రియలో అవిభాజ్యాలైన... ‘ప్రశ్న’కు ప్రాణం పోసేవిగా, ‘అసమ్మతి’కి ఆయువిచ్చేవిగా, ‘నిరసన’కు నీడ పట్టేవిగా ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే ఏ పద్దతుల్ని జాగ్రత్తగా కాపాడు కోవాలో, మరే సరికొత్త బాటలు పరచి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టకూడదో కూడా న్యాయస్థానం ఈ సందర్భంగా సెలవిచ్చింది. ఏడాది కింద ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లు– దాడులకు సంబంధించిన కేసులో అరెస్టయిన ముగ్గురు విద్యార్థులు, హక్కుల కార్యకర్తలకు బెయిల్ ఇస్తూ ధర్మాసనం నిర్దిష్ట వ్యాఖ్యలు చేసింది. బెయిల్ ఇవ్వరాదన్న వాదనను నిర్ద్వందంగా తోసి పుచ్చింది. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వెల్లడించిన అభిప్రాయాలు దేశంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ–సామాజిక వాతావరణంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాజ్యాంగ రక్షణకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వాలకు, చట్టాల అమలుకు కృషి చేయాల్సిన పోలీసు వంటి కార్యనిర్వాహక వ్యవస్థకు విస్పష్ట సందేశం ఈ వ్యాఖ్యల్లో ఉంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, యూఏపీఏ(ఉప)ను దుర్వినియోగ పరచడం తప్పని ఢిల్లీ పోలీసుల్ని ధర్మాసనం మందలించింది. ‘అసమ్మతిని అణచివేయాలనే ఉత్సుకత, పరిస్థితులు చెయిదాటి పోతాయే మోనన్న అసహజ భయంతోనే రాజ్యం ఈ చర్యలకు పాల్పడి ఉంటుంది, పౌరుల ‘నిరసన తెలిపే హక్కు’ కు ‘తీవ్రవాద కార్యకలాపాల’కు మధ్యనుండే స్పష్టమైన విభజన రేఖను మసక బార్చింద‘ని ధర్మాసనం వాఖ్యానించింది. బెయిల్ పిటిషన్లను విచారిస్తూ, ప్రాసిక్యూషన్ అభియోగ పత్రంలో నమోదు చేసిన తీవ్రవాద నేరాలను నిర్ధారించగల ప్రాథమిక సాక్ష్యాధారాలేవీ ఈ కేసుల్లో కన్పిం చలేదని స్పష్టపరుస్తూ సదరు వ్యాఖ్యలు చేసింది. రాజకీయ, మేధావి వర్గం నుంచి తనపై వస్తున్న విమర్శల్ని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సహించడం లేదని, ఆరోపణలు చేసే, ప్రశ్నించే వారిపైన తప్పుడు పద్ధతుల్లో చట్టాలనుపయోగించి తీవ్ర చర్యలకు పాల్పడుతోందని విమర్శలు వస్తున్న నేప థ్యంలో.. ధర్మాసనం ప్రస్తుత వ్యాఖ్యలు చర్చను రేకెత్తిస్తున్నాయి. సీనియర్ సంపాదకుడు వినోద్ దువాపై రాజద్రోహం కేసు నమోదు చేయడం వంటివి సుప్రీంకోర్టు వరకూ వెళ్లి విమర్శల పాల వడం తెలిసిందే! ఈ కేసులోనూ అసమ్మతిని, నిరసన గళాల్ని నియంత్రించే క్రమంలో చట్టాన్ని తప్పుగా, నిర్హేతుకంగా వినియోగించడమేనని ధర్మాసనం సుస్పష్టంగా పేర్కొంది. నిరాయుధులై శాంతియుత నిరసన తెలుపడం ప్రజాస్వామ్యం భద్రత కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కుగా న్యాయస్థానం గుర్తుచేసింది. శాంతియుతంగా సమావేశ మయ్యేందుకు, భావాలను వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించిన రాజ్యాంగ అధికరణం 19 (1) ‘బి’లో ఈ హక్కు మూలాలు నిక్షిప్తమై ఉన్నాయంది. ‘ఉప’ చట్టంలోని వివిధ సెక్షన్లలో పేర్కొన్న అంశాల ఆధారంగా చూసినా.. శాంతియుతంగా నిరసన తెలిపే పౌరుల హక్కు నిషేధించిందేం కాదు. తీవ్రవాద చర్య అంతకన్నా కాదనే భావనను వ్యక్తం చేసింది. ఇంకో అడుగు ముందుకు వేసి, ‘సరే, కొద్దిసేపు వాదన కోసమైనా నిందితుల ప్రసంగాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనుకుందాం, దారుల్ని దిగ్బం ధించారనే అనుకుందాం, ఇతర మహిళల్ని ప్రేరేపించారనీ భావిద్దాం, అభియోగ పత్రంలో చెప్పి నట్టు రాజ్యాంగం అనుమతించిన పరిమితుల్ని దాటి, మితిమీరిన నిరసననే వ్యక్తం చేశారను కుందాం... అయినా అది ‘ఉప’ చట్టంలో పేర్కొన్నట్టు ‘తీవ్రవాద చర్య’ (సెక్షన్–15), ‘తీవ్రవాద కార్యకలాపాలకై నిధుల సమీకరణ’ (సెక్షన్–17), ‘కుట్ర’ (సెక్షన్–19) వంటి నేరమేమీ కాజాలదని గ్రహించాలని దర్మాసనం వివరించింది. ‘ఇలా ప్రశ్నించే గళాలను, అసమ్మతిని అణచివేసేందుకు ‘చట్టబద్ధ నిరసన’కు ‘తీవ్రవాద చర్య’లకు మధ్య విభజన రేఖను మసకబార్చో, చెరిపేసో... దాన్నొక కొత్త బాటగా మలిస్తే, ఇక ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డట్టే’ అన్న తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారు లేవనెత్తే ప్రశ్న తప్పా? ఒప్పా? ‘న్యాయ బద్ధమా!’ ‘న్యాయ బద్ధం కాదా!’ అన్నదానితో నిమిత్తం లేకుండా చట్టబద్ధ అసమ్మతి తెలియపర చడం ప్రజాస్వామ్యంలో ఒక ఎన్నదగిన, గౌరవప్రదమైన ప్రక్రియ అనీ నొక్కి చెప్పింది. పాలకుల నిర్ణయాలకు ప్రభావితులైన వారు తమకు జరిగిన అన్యాయాలను వెల్లడించే హక్కు ఉంటుందన్నదే నిరసనల వెనుక స్ఫూర్తిగా పరిగణించాలనీ వ్యాఖ్యానించింది. ధర్మాసనం ముఖ్యంగా ‘.... భారత శిక్షా స్మృతి (ఐపీసీ) లోని సాధారణ నేరాలకు, ‘ఉప’ చట్టంలో నిర్దేశించిన తీవ్రవాద నేరాలకు చాలా వ్యత్యాసమున్నట్టు గ్రహించాలంది. ఈ ప్రత్యేక చట్టం తీసుకురావడమైనా, తదుపరి 2004, 2008 లో తెచ్చిన సవరణల వెనుక స్ఫూర్తి అయినా ‘భారతదేశ భద్రత’ అన్న స్థూలార్థంలోని అంశాల కోసమే తప్ప... పైసా ఎక్కువ కాదు, పైసా తక్కువ కాదు’అని స్పష్టపరిచింది. ‘‘ఏ కొందరి చేతుల్లోకో అధికారం కట్టబెట్టడం కాదు, వారి నడక గతి తప్పినపుడు, ప్రశ్నించే అధికారం ప్రతి పౌరుడికి ఉండటమే నిజమైన ప్రజాస్వామ్యం’‘ అన్న పూజ్య బాపూజీ మాటల్ని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం గుర్తుకు తెచ్చింది. -
రెజ్లర్ హత్యకేసు: సుశీల్ కుమార్ రిమాండ్ పొడిగింపు
ఢిల్లీ: జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఒలింపియన్.. రెజ్లర్ సుశీల్ కుమార్కు మరో నాలుగు రోజుల రిమాండ్ పొడిగిస్తున్నట్లు ఢిల్లీ రోహిణి కోర్టు శనివారం తెలిపింది. కాగా ఢిల్లీ పోలీసులు సుశీల్ను విచారించేందుకు ఏడు రోజుల కస్టడీకి కోరగా.. కోర్టు నాలుగు రోజలు మాత్రమే పొడిగించింది. సుశీల్తో పాటు మరో నిందితుడిగా ఉన్న అజయ్కి ప్రతీరోజు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. కాగా మే 23న కోర్టులో హాజరుపరిచిన సుశీల్కు ఆరు రోజుల రిమాండ్ విధించింది. నేటితో ఆ గడువు పూర్తి కావడంతో కోర్టు మరోసారి రిమాండ్ను పొడిగించినట్లు స్పష్టం చేసింది. కాగా ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో మే4 వ తేదీన సాగర్ రాణా దారుణ హత్యకు గురయ్యాడు. సుశీల్, సాగర్ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో సాగర్ హత్యకు గురైనట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. అప్పటినుంచి అజ్థాతంలోకి వెళ్లిపోయిన సుశీల్ కుమార్ను పంజాబ్లోని జలంధర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా రెజ్లర్ సుశీల్ కుమార్ హాకీ స్టిక్తో సాగర్ రాణాపై దాడికి పాల్పడినట్లుగా రిలీజైన వీడియో వైరల్గా మారింది. చదవండి: Wrestler Sushil Kumar: సుశీల్ హాకీ స్టిక్తో... -
రెజ్లర్ సుశీల్కు చుక్కెదురు.. ముందస్తు బెయిల్ కొట్టివేత
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో నిందితుడిగా ఉన్న భారత రెజ్లింగ్ స్టార్ సుశీల్ కుమార్కు కోర్టులోనూ చుక్కెదురైంది. గత రెండు వారాలుగా పరారీలో ఉన్న అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ సోమవారం స్థానిక రోహిణి కోర్టులో సుశీల్ పిటిషన్ దాఖలు చేయగా... మంగళవారం అతని విజ్ఞప్తిని అడిషనల్ సెషన్స్ జడ్జి జగదీశ్ కుమార్ కొట్టి పారేశారు. ఘటనలో ప్రధాన కుట్రదారుడిగా సుశీల్పై ఉన్న అభియోగాలు తీవ్రమైనవవి న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. మే 4న ఛత్రశాల్ స్టేడియం ముందు రెండు వర్గాలు కొట్టుకున్న ఘటనలో జాతీయ మాజీ జూనియర్ చాంపియన్ సాగర్ రాణా మరణించగా... సుశీల్పై ఆరోపణలు రావడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 37 ఏళ్ల సుశీల్ భారత్ తరఫున 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్లో రజతం... 2010 ప్రపంచ చాంపియన్ షిప్లో స్వర్ణం... 2010 ఢిల్లీ, 2014 గ్లాస్గో, 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లలో స్వర్ణం... 2006 దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించాడు. దర్యాప్తునకు సహకరిస్తాం... బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుశీల్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా హాజరయ్యారు. ‘సదరు ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దర్యాప్తు మొత్తం నాకు వ్యతిరేకంగా పక్షపాత ధోరణిలో సాగుతోంది. విచారణ ముగిసేవరకు నేను సహకరించి వాస్తవాలు ఏమిటో చెబుతా. బాధితుల స్టేట్మెంట్లు ఇప్పటికే రికార్డు చేశారు. ఘటన జరిగిన స్థలం వద్ద నాకు సంబంధించిన ఎలాంటి వస్తువులు లభ్యం కాలేదు. అక్కడ జరిగినట్లుగా చెబుతున్న కాల్పులతో కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు. పోలీసులకు లభించిన తుపాకీ, వాహనం నావి కావు. ఇలాంటి స్థితిలో నన్ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాల్సిన అవసరం లేదు’ అని సుశీల్ తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నాడు. గొడవ సమయంలో అక్కడే ఉన్న సోనూ అనే వ్యక్తి రౌడీషీటర్ అని... తనతో విభేదాలు ఉన్న సోనూ నుంచి సుశీల్కు హాని జరిగే అవకాశం కూడా ఉందని లుథ్రా వాదించారు. సాక్ష్యాలు బలంగా ఉన్నాయి... అయితే నిందితుడి తరఫు వాదనతో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాత్సవ విభేదించారు. ‘సుశీల్కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. చేతిలో కర్రతో అతడు కొడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. మొత్తం ఘటనలో అతనే ప్రధాన నిందితుడు. దాడి చేయడంలో అతనిదే కీలకపాత్ర. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు కూడా నేరం చేయడంలో సుశీల్ చురుగ్గా పాల్గొన్నాడని నిర్ధారించారు. కేసులో వాస్తవాలు వెలికితీయాలంటే సుశీల్ను కస్టడీలోకి తీసుకొని విచారించడం తప్పనిసరి. అతను దేశం విడిచి వెళ్లి పారిపోకుండా ఇప్పటికే పాస్పోర్ట్ను కూడా స్వాధీనం చేసుకున్నాం’ అని వాదించారు. దీనిని అంగీకరిస్తూ న్యాయమూర్తి బెయిల్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ‘విచారణ ఇంకా కొనసాగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొందరు ఇంకా అరెస్టు కాలేదు. సుశీల్పై ఇప్పటికే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ అయింది. ఇలాంటి స్థితిలో ముందస్తు బెయిల్ కుదరదు’ అని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 302 (హత్య) సహా ఐపీసీ, ఆయుధాల చట్టంలోని 11 వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ముందస్తు బెయిల్ కుదరదు చదవండి: Sushil Kumar: ఆచూకీ చెబితే రూ.1 లక్ష! -
సుశీల్పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ... గత పదకొండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్తోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఆరుగురిపై ఢిల్లీ కోర్టు నాన్బెయిలబుల్ వారంట్లను జారీ చేసింది. మే 4వ తేదీ రాత్రి ఢిల్లీలోని ఛత్రశాల్ స్టేడియం ఆవరణలో జరిగిన గొడవలో 23 ఏళ్ల యువ రెజ్లర్ సాగర్ రాణా ధన్కడ్, అతని ఇద్దరు మిత్రులు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సాగర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన తర్వాత కనిపించకుండా పోయిన సుశీల్ ఆచూకీ కోసం ఢిల్లీ పోలీసులు గత సోమవారం ‘లుక్ అవుట్’ నోటీసులు జారీ చేశారు. సుశీల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేయడంతో పోలీసులు అతని ఆనవాళ్లు కనిపెట్టడంలో విఫలమయ్యారు. హరిద్వార్లోని విఖ్యాత యోగా గురువుకు చెందిన ఆశ్రమంలో సుశీల్ తలదాచుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఎఫ్ఐఆర్ నమోదు చేశాక సుశీల్కు నోటీసులు జారీ చేశాం. కానీ అతను స్పందించలేదు. సుశీల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉంది. సుశీల్ మిత్రుల ఇంటిపై కూడా దాడులు నిర్వహించినా ఎలాంటి సమాచారం లభించలేదు. దాంతో సుశీల్ ఆచూకీ చెప్పినవారికి తగిన రివార్డు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కేసులో బాధితుల నుంచి తీసుకున్న స్టేట్మెంట్స్లో అందరూ సుశీల్ పేరు చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సుశీల్ అనుచరుడు అజయ్ ప్రభుత్వ వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అజయ్పై డిపార్ట్మెంటల్ చర్య తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశాం’ అని ఢిల్లీకి చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. 37 ఏళ్ల సుశీల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్లో రజతం సాధించాడు. ఒలింపిక్స్ చరిత్రలో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. వరుసగా మూడు కామన్వెల్త్ గేమ్స్లో (2010, 2014, 2018) స్వర్ణ పతకాలు నెగ్గిన సుశీల్ 2010లో సీనియర్ విభాగంలో ప్రపంచ చాంపియన్గా నిలిచిన ఏకైక భారత రెజ్లర్ కావడం విశేషం. ప్రాణాలు తీసేంత తప్పేం చేశాడు... నా కొడుకు సాగర్ ఛత్రశాల్ స్టేడియంలో ఎనిమిదేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నాడు. 2017 ఆసియా, ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సుశీల్ను, అతని మామ సత్పాల్ సింగ్ను సాగర్ ఎంతో ఆరాధించేవాడు. సాగర్ తప్పు చేసి ఉంటే అతడిని నాలుగు చెంప దెబ్బలు కొట్టాల్సింది. లేదంటే ఛత్ర శాల్ స్టేడియం నుంచి బయటకు పంపించాల్సింది. ప్రాణాలు తీసేంత తప్పు పని నా కొడుకు చేశాడా? ఈ కేసుతో సంబంధం ఉన్న వారు చాలా పెద్ద వ్యక్తులు. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు నాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వారు తమ మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను. –అశోక్ (సాగర్ తండ్రి), ఢిల్లీ పోలీసు హెడ్కానిస్టేబుల్ -
భార్య మృతి: శశిథరూర్కు బిగుస్తున్న ఉచ్చు
న్యూఢిల్లీ: భార్య మృతి కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్కు చుక్కెదురైంది. తమ కూతురు సునంద పుష్కర్ చాలా ధ్రుడమైన మనిషి అని, ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు ముందు ఇదే విషయం చెప్పారు. దీంతో శశిథరూర్ ఇరకాటంలో పడ్డట్టు అయ్యింది. తమ కుమార్తె సునంద హత్యకు గురయ్యిందని కుటుంబీకులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శశిథరూర్కు ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ శుక్రవారం జరిగింది. హత్య చేశారని ఎలాంటి ఆధారాలు లేవని శశి తరఫు న్యాయవాది వికాస్ పావా కోర్టుకు విన్నవించారు. స్పెషల్ జడ్జి గీతాంజలి గోయెల్ ఇరు వైపు వాదనలు విన్నారు. ఈ కేసుకు సంబంధించి విచారణ ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా పడింది. అంతకుముందు దీనిపై వాదోపవాదనలు జరిగాయి. సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకుందని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కుటుంబసభ్యుల తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలు ఏ ఆధారంగా చెబుతున్నారని శశి తరఫు న్యాయవాది పావా ప్రశ్నించారు. కనీసం అదనపు కట్నం, వేధింపులపై ఒక్క ఆధారం కూడా లేదని పావా స్పష్టం చేశారు. ఓ విలాసవంతమైన హోటల్ 2014, జనవరి 17వ తేదీన సునంద పుష్కర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి కేసులో శశి థరూర్పై కొన్ని కేసులు నమోదయ్యాయి. -
బాట్లాహౌస్ కేసు: అరిజ్ఖాన్కు ఉరిశిక్ష
న్యూఢిల్లీ: 2008 నాటి బాట్లాహౌస్ ఎన్కౌంటర్ కేసులో అరిజ్ ఖాన్కు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు ఇన్స్పెక్టర్ మోహన్చంద్ శర్మను చంపినందుకు అతడికి ఈ శిక్షను ఖరారు చేసింది. అరిజ్ చేసిన నేరం గరిష్ట శిక్ష విధించేందుకు వీలు కల్పించే అత్యంత అరుదైన కేటగిరీలోకి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. అతడిని మరణించే వరకూ ఉరికి వేలాడదీయాలని అదనపు సెషన్స్ జడ్జి సందీప్ యాదవ్ తన తీర్పులో పేర్కొన్నారు. అలాగే ఈ కేసులో అరిజ్ ఖాన్కు మొత్తం రూ.11 లక్షల జరిమానా విధించారు. రూ.10 లక్షలను తక్షణమే మోహన్చంద్ శర్మ కుటుంబానికి అందజేయాలని ఆదేశించింది. న్యాయాన్ని కాపాడే అధికారిని చంపేశారు బాట్లా హౌస్ ఎన్కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఢిల్లీ పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ.టి.అన్సారీ వాదనలు వినిపించారు. అరిజ్ ఖాన్కు ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్తో సంబంధాలున్నాయని చెప్పారు. న్యాయాన్ని కాపాడే ఒక అధికారిని చంపిన అరిజ్ ఖాన్కు మరణ శిక్ష విధించాలని కోరారు. ఇన్స్పెక్టర్ మోహన్చంద్ శర్మ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. అరిజ్ ఖాన్తోపాటు మరికొందరు ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే మారణాయుధాలతో విచ్చలవిడిగా కాల్పులు జరిపారని గుర్తుచేశారు. అరిజ్ ఖాన్ తరపున అడ్వొకేట్ ఎం.ఎస్.ఖాన్ వాదనలు వినిపించారు. అరిజ్కు ఉరిశిక్ష విధించాలన్న వాదనను వ్యతిరేకించారు. అతడు ముందస్తు ప్రణాళిక ప్రకారం కాల్పులు జరపలేదన్నారు. ఎం.ఎస్.ఖాన్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. బాట్లా హౌస్ ఎన్కౌంటర్ కేసులో ట్రయల్ కోర్టు 2013 జూలైలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది షాజాద్ అహ్మద్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఏమిటీ కేసు? ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులు బాట్లా హౌస్లో దాక్కున్నారన్న సమాచారంతో పోలీసులు వారిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. పోలీసులపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇన్స్పెక్టర్ మోహన్చంద్ శర్మ అమరులయ్యారు. ►2008 సెప్టెంబర్ 13: ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లు. 39 మంది మృతి, 159 మందికి గాయాలు. ►2008 సెప్టెంబర్ 19: దక్షిణ ఢిల్లీలోని జామియా నగర్లో ఉన్న బాట్లా హౌస్లో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు. ►2009 జూలై 3: అరిజ్ ఖాన్, షాజాద్ అహ్మద్ను నిందితులుగా ప్రకటించిన న్యాయస్థానం. ► 2010 ఫిబ్రవరి 2: యూపీలోని లక్నోలో షాజాద్ అహ్మద్ అరెస్టు. ►2010 అక్టోబర్ 1: ఎన్కౌంటర్ కేసు విచారణ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్కు బదిలీ. ►2013 జూలై 30: షాజాద్ అహ్మద్కు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు. ►2018 ఫిబ్రవరి 14: అరిజ్ ఖాన్ అరెస్టు. ►2021 మార్చి 8: హత్య, ఇతర నేరాల్లో అరిజ్ ఖాన్ దోషిగా గుర్తింపు. ►2021 మార్చి 15: అరిజ్కు మరణ శిక్ష -
దిశారవికి బెయిల్: కుటుంబీకులను చూసి కంటతడి
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా చర్యలు చేపట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పర్యావరణ ఉద్యమకారిణి దిశ రవికి బెయిల్ లభించింది. రూ.లక్ష పూచీకత్తుగా చెల్లించి బెయిల్ పొందాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. టూల్ కిట్ కేసులో దిశ రవి అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు కోర్టుకు హాజరయ్యే సమయంలో కుటుంబసభ్యులను చూసి దిశా రవి భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి దిశా రవి సామాజిక మాధ్యమాల ద్వారా మద్దతు తెలిపిందని.. గణతంత్ర దినోత్సవం రోజు రెచ్చగొట్టేలా ప్రయత్నాలు చేసినట్లు దిశ రవిపై అభియోగాలు నమోదయ్యాయి. టూల్ కిట్ పేరుతో పక్కా ప్రణాళికతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుందని దిశ రవిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బెంగళూరులోని నివాసంలో 22 ఏళ్ల దిశా రవిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు మంగళవారం ఢిల్లీ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విచారణ సందర్భంగా ధర్మాసనం ‘అసలు టూల్కిట్ ఏమిటి’ అని ప్రశ్నించింది. ఆధారాలు అస్పష్టంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేస్తూ దిశా రవికి కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే రూ.లక్ష పూచీకత్తు చెల్లించడం దిశా రవికి కష్టతరమని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. ఇదే కేసులో నిఖితా జాకబ్, శంతను ములుక్లను కూడా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి గతంలోనే బెయిల్ మంజూరైంది. -
‘టాటూ’ ట్విస్ట్.. అత్యాచార నిందితుడికి బెయిల్
న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి.. బాధితురాలి చేతి మీద ఉన్న టాటూ ఆధారంగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎందుకంటే బాధితురాలి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించిన వ్యక్తి పేరునే తన చేతి మీద టాటూగా వేయించుకుంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విచారణ సందర్భంగా సదరు మహిళ.. నిందితుడు బలవంతంగా అతడి పేరును తన చేతి మీద టాటూ వేయించాడని ఆరోపించింది. అయితే కోర్టు బాధితురాలి ఆరోపణలని కొట్టి పారేసింది. బలవంతంగా ఓ వ్యక్తికి టాటూ వేయడం అంత సులభం కాదని తెలిపింది. ఈ సందర్భంగా జస్టిస్ రజ్నిష్ భట్నాగర్ మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం టాటూ వేయడం అనేది ఓ కళ. అందుకు ప్రత్యేకమైన పరికరం కావాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఓ వ్యక్తికి బలవంతంగా టాటూ వేయలేం. పచ్చబొట్టు పొడిపించుకోవడం ఇష్టం లేకపోతే అవతలి వారు దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. కనుక బలవంతంగా టాటూ వేయడం.. ఒకవేళ వేసినా అది పర్ఫెక్ట్గా రావడం అనేది జరగదు’’ అని తెలిపారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో సదరు మహిళ.. నిందితుడు తనను బెదిరించి, భయపెట్టి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. 2016 నుంచి 2019 వరకు ఇది కొనసాగిందని తెలిపింది. చివరకు ధైర్యం చేసి అతడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించింది. మహిళ ఆరోపణలు ఇలా ఉండగా.. నిందితుడు మాత్రం సదరు వివాహితను తాను ప్రేమించానని.. ఇద్దరి సమ్మతితోనే తమ మధ్య శారీరక సంబంధం కొనసాగిందని వెల్లడించాడు. అయితే కొద్ది రోజులుగా మహిళ తనను దూరం పెడుతుందని.. దాని గురించి ప్రశ్నిస్తుండటంతో తన మీద పోలీసులకు ఫిర్యాదు చేసిందని వెల్లడించాడు. చదవండి: బెయిల్ ఓకే, ఆ బిడ్డకు తండ్రెవరు! ఏం జరిగింది? -
నిర్భయ దోషులకు నేడే ఉరి
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషుల ఉరికి ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. ఏడు సంవత్సరాల మూడు నెలలపాటు దర్యాప్తు, విచారణ ప్రక్రియ శిక్ష అమలుపై ఇక ముగియనుంది. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలంటూ దోషులు మరోసారి పెట్టుకున్న పిటిషన్ను గురువారం ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. దీంతో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు అక్షయ్ కుమార్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్ అనే నలుగురు దోషులు బలిపీఠం ఎక్కడం ఖాయమైంది. ఇప్పటికే మూడు పర్యాయాలు ఉరిశిక్ష వాయిదా పడగా మరోసారి స్టే విధించాలంటూ దోషులు పెట్టుకున్న పిటిషన్ను పటియాలా హౌస్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా గురువారం విచారించారు. ‘ఈ పిటిషన్ సమర్థనీయం కాదని నేను భావిస్తున్నాను. అందుకే ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నాను’అని ప్రకటించారు. ‘ఈ కేసు కోసం న్యాయవ్యవస్థ ఎంతో సమయాన్ని వెచ్చించింది. చట్ట పాలనపై తలెత్తిన ఎన్నో అనుమానాలకు సమాధానాలు కూడా ఇచ్చింది’ అని పేర్కొన్నారు. కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత: తీర్పు వెలువడిన తర్వాత కోర్టు ప్రాంగణంలో హైడ్రామా చోటుచేసుకుంది. అక్షయ్ భార్య తనతోపాటు తన కుమారుడిని కూడా ఉరితీయాలంటూ గుండెలు బాదుకుంటూ రోదించింది. రేపిస్టు భార్యగా జీవించలేకనే విడాకుల కోసం పిటిషన్ వేసినట్లు తెలిపింది. నిర్భయ తల్లి వ్యాఖ్య తన కూతురి ఆత్మకు ఇక ప్రశాంతత లభిస్తుందని ఈ తీర్పు వెలువడిన తర్వాత నిర్భయ తల్లి వ్యాఖ్యానించారు. ‘దోషులకు ఇక ఉరి తప్పదు. నాకు ఇప్పటికి శాంతి దొరికింది’అని తెలిపారు. దోషి అక్షయ్ భార్య విడాకుల కోసం పెట్టుకున్న పిటిషన్ పెండింగ్లో ఉన్నందున ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలంటూ ముగ్గురు దోషులు పెట్టుకున్న పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.ఢిల్లీకి చెందిన ఫిజియోథెరపీ విద్యార్థిని(23) 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి దారుణ అత్యాచారానికి గురై దాదాపు 15 రోజుల తర్వాత మృత్యువుతో పోరాడుతూ చనిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దురంతానికి నిర్భయ ఘటనగా పేరుంది. ఈ కేసులో ఆరుగురు దోషులు కాగా వీరిలో ఒకరు మైనర్. మరొకరు జైలులోనే ఉరి వేసుకున్నారు. మిగిలిన నలుగురు ముకేశ్(32), పవన్(25), వినయ్(26), అక్షయ్(31) అప్పటి నుంచి జైలు జీవితం అనుభవిస్తున్నారు. -
ఆఖరి ప్రయత్నం విఫలం; ఇక ఉరే
ఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితులకు మరోసారి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ నిందితులు చేసిన చివరి ప్రయత్నం కూడా విఫలమైంది. ఢిల్లీ హైకోర్టులో ముగ్గురు దోషులు దాఖలు చేసిన స్టే పిటిషన్ను న్యాయస్థానం కొట్టిపారేసింది. పిటిషన్ దాఖలు చేసిన దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్కి కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. 'లిఖితపూర్వక డాక్యుమెంట్ ఏదీ లేదు.. పార్టీల మెమో లేదు,అఫిడవిట్లు లేవు. అసలు ఈ పిటిషన్ దాఖలు చేయడానికి మీకు అనుమతి ఉందా..?' అని కోర్టు ఆయన్ను ప్రశ్నించింది. అయితే కరోనా వైరస్ కారణంగా ఫోటో కాపీలు జతచేయడం సాధ్యపడలేదని ఏపీ సింగ్ బదులిచ్చారు. ఏపీ సింగ్ వాదనపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. (నిర్భయ దోషులకు ఏ అవకాశాలు లేవు: ఢిల్లీ కోర్టు) 'చూడండి కోర్టులు ఎంత విశాల దృక్పథంతో పనిచేస్తున్నాయో.. ఈ ఒక్కరోజే మీరు మూడు కోర్టుల చుట్టూ తిరిగారు. ఈ రాత్రి 10గంటల సమయంలో మీ పిటిషన్పై విచారణ జరుపుతున్నాం.. కాబట్టి సాధ్యపడలేదు వంటి మాటలు చెప్పవద్దు' అని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు నిర్భయ దోషుల స్టే పిటిషన్ కొట్టివేయడంతో.. పటియాలా హౌజ్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం శుక్రవారం(మార్చి 20) తెల్లవారుజామున ఉరిశిక్ష అమలుకానుంది. అంతకుముందు గురువారం మధ్యాహ్నం దోషుల స్టే పిటిషన్ను పటియాలా కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆ పిటిషన్ను సవాల్ చేస్తూ దోషులు హైకోర్టును ఆశ్రయించారు. -
నిర్భయ: ‘బతకాలని లేదు.. నేను చచ్చిపోతా’
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరితీతకు ఇంకా కొన్ని గంటలే(అన్నీ సజావుగా సాగితే) మిగిలి ఉన్న వేళ వరుసగా వాళ్లకు కోర్టులు షాకిస్తున్నాయి. నిర్భయ దోషులు పవన్ గుప్తా, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ దాఖలు చేసిన వివిధ పిటిషన్లను ఢిల్లీ కోర్టు, ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టు కొట్టివేశాయి. సుప్రీంకోర్టు సైతం పవన్ గుప్తా క్యూరేటివ్ పిటిషన్ను గురువారం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో మరో కొన్ని గంటల్లో వారిని ఉరితీసేందుకు తీహార్ జైలు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే డమ్మీ ఉరి కూడా పూర్తైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టు వద్ద గురువారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. (నిర్భయ దోషులకు ఏ అవకాశాలు లేవు: ఢిల్లీ కోర్టు) ఈ నేపథ్యంలో దోషుల పిటిషన్లపై వాదోపవాదాలు జరుగుతున్న వేళ అక్షయ్ ఠాకూర్ భార్య పునీతా దేవి కోర్టు ప్రాంగణంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డను తన పక్కనే కూర్చోబెట్టుకున్న ఆమె... చెప్పులతో తన ముఖంపై కొట్టుకుంటూ... బిగ్గరగా ఏడ్చారు. ఈ క్రమంలో స్పృహ తప్పిపడిపోయారు. మెలకువ వచ్చిన తర్వాత మళ్లీ అదే విధంగా చేస్తూ... ‘‘నాకు బతకాలని లేదు. శిక్ష అమలైతే నేను చచ్చిపోతా’’ అంటూ బెదిరింపులకు దిగారు. కాగా అక్షయ్ భార్య ఇదివరకే తనకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ‘‘ నా భర్త అమాయకుడు. ఆయనను ఉరి తీసేముందు నాకు చట్టపరంగా విడాకులు కావాలి. ఎందుకంటే నేను అత్యాచార దోషి భార్యగా ఉండాలనుకోవడం లేదు’’ అని ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ఇక నిర్భయ దోషులను మార్చి 20 ఉదయం 5.30 గంటలకు ఉరితీయాలంటూ డెత్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉరిశిక్షను నిలిపివేసేందుకు దోషులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.(‘ప్రతీకారమే శక్తికి నిర్వచనం కాదు’) నిర్భయ కేసు: 20న ఉరి; విడాకులు కోరిన అక్షయ్ భార్య నేనప్పుడు అసలు ఢిల్లీలో లేను: నిర్భయ దోషి -
వాళ్లకు ఏ అవకాశాలు లేవన్న కోర్టు.. కానీ మళ్లీ
న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఇక ఎటువంటి చట్టపరమైన అవకాశాలు మిగిలిలేవని ఢిల్లీ కోర్టు గురువారం స్పష్టం చేసింది. మార్చి 20న నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు దోషులు ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలను ఉరితీయాలంటూ ఢిల్లీ కోర్టు డెత్వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... తాము దాఖలు చేసిన పలు పిటిషన్లు, అభ్యర్థనలు పెండింగ్లో ఉండటం, రెండోసారి క్షమాభిక్ష కోరే అవకాశాలు పరిశీలించేంత వరకు ఉరిని నిలుపుల చేయాలని బుధవారం వీరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం.. దోషులకు ఇక ఏ అవకాశాలు లేవని పేర్కొంది. ఈ సందర్భంగా వారు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఇదిలా ఉండగా... ఈ కేసులో దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ను గురువారం సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చిన విషయం తెలిసిందే.(‘నిర్భయకు ఇక న్యాయం జరుగుతుంది’) మరోవైపు దోషి అక్షయ్ ఠాకూర్ గురువారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రాష్ట్రపతి తన క్షమాభిక్షను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో అక్షయ్ లాయర్ ఏపీ సింగ్ తన వాదనలు వినిపిస్తూ.. అక్షయ్ క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించిన అంశం మిగిలిన ముగ్గురు దోషులు, అతడితో సంబంధం కలిగి ఉన్న ప్రతీ ఒక్కరిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన న్యాయస్థానం... ‘‘మీరు రెండోసారి క్షమాభిక్ష పిటిషన్ను దాఖలు చేస్తే దానిని రాష్ట్రపతి తిరస్కరించారు. ఇప్పుడు దానిపై న్యాయ సమీక్ష చేయాల్సిన అవసరం ఏముంది?’’ అని ప్రశ్నించింది. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు అవుతుందా లేదా అన్న విషయంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక నిర్భయ తల్లి ఆశాదేవి మాత్రం తన కూతురికి రేపు న్యాయం జరుగుతుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. (నిర్భయ దోషుల ఉరికి డమ్మీ పూర్తి) -
నిర్భయ: తీహార్ జైలు అధికారులకు నోటీసులు
న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు దోషుల ఉరిశిక్ష అమలుకు రంగం సిద్ధమైన వేళ వారు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ కోర్టు తలుపుతట్టారు. తాము దాఖలు చేసిన పలు పిటిషన్లు, అభ్యర్థనలు పెండింగ్లో ఉన్న కారణంగా... రెండోసారి క్షమాభిక్ష కోరే అవకాశాలు పరిశీలించాల్సి ఉన్నందున ఉరిని నిలుపుల చేయాలని కోరారు. ఈ క్రమంలో నిర్భయ దోషుల తాజా పిటిషన్ను ఢిల్లీ కోర్టు గురువారం విచారించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తీహార్ జైలు అధికారులు, ప్రభుత్వ న్యాయవాదికి నోటీసులు జారీ చేసింది. కాగా 2012, డిసెంబరు 16 నాటి నిర్భయ అత్యాచార కాండలో ఆరుగురు వ్యక్తులు దోషులుగా తేలగా... ప్రధాన దోషి రామ్ సింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మరో దోషి మైనర్ కావడంతో సాధారణ జైలు శిక్ష తర్వాత అతడిని విడుదల చేశారు. (నిర్భయ కేసు: విడాకులు కోరిన అక్షయ్ భార్య) ఇక మిగిలిన నలుగురు దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్లకు ఉరిశిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును ఖరారు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయగా.. ఇప్పటికే మూడుసార్లు వారిని ఉరితీసేందుకు డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. అయితే ఎప్పటికప్పుడు వారు పిటిషన్లు దాఖలు చేస్తుండటంతో ఉరి వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మార్చి 20న ఉదయం ఆ నలుగురికి మరణ శిక్ష విధించాలనే ఆదేశాల నేపథ్యంలో వరుసగా మరోసారి పిటిషన్లు దాఖలు చేస్తూ ఈసారి కూడా శిక్ష అమలు తేదీని వాయిదా వేసేందుకు దోషులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వారిని ఉరి తీస్తారా లేదా అన్న అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. (నేనప్పుడు అసలు ఢిల్లీలో లేను: నిర్భయ దోషి) మరో ట్విస్టు: ఐసీజేకు నిర్భయ దోషులు! శరీరమంతా రక్తం.. తల మీద చర్మం ఊడిపోయి -
నేనప్పుడు అసలు ఢిల్లీలో లేను: నిర్భయ దోషి
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు తేదీ సమీపిస్తున్న వేళ వరుసగా మరోసారి తాజా పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. శిక్ష నుంచి తప్పించుకునేందుకు న్యాయపరంగా తనకు ఉన్న హక్కులను తిరిగి పునరుద్ధరించాలంటూ దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ పెట్టుకున్న పిటిషన్ సమర్థనీయం కాదంటూ సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మిగిలిన ముగ్గురు దోషులు అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బాధితురాలి సన్నిహితులు చెప్పిన తప్పుడు సాక్ష్యం ఆధారంగా శిక్ష ఖరారు చేసి తమను బలిపశువులు చేశారంటూ ఐసీజేలో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.(మరో ట్విస్టు: ఐసీజేకు నిర్భయ దోషులు!) ఇక తాజాగా ముఖేశ్ సింగ్ మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించాడు. నిర్భయ ఘటన జరిగిన సమయంలో అసలు తాను ఢిల్లీలో లేనని.. డిసెంబరు 17, 2012లో తనను పోలీసులు రాజస్తాన్లో అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువచ్చారు గనుక.. తనకు ఉరిశిక్ష రద్దు చేయాలని పిటిషన్లో కోరాడు. అదే విధంగా తీహార్ జైలులో అధికారులు తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించాడు. ఈ పిటిషన్పై తీర్పును రిజర్వు చేస్తున్నట్లు అదనపు సెషన్స్ కోర్టు జడ్జి ధర్మేంద్ర రాణా పేర్కొనగా... ముఖేశ్ సింగ్ ఉరిశిక్ష తేదీని మరోసారి వాయిదా వేయించాలనే దురుద్దేశంతోనే పిటిషన్ దాఖలు చేశాడని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. ముఖేశ్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు కొట్టివేసినట్లు తెలుస్తోంది.(ఇంకా ఏం మిగిలి ఉంది: సుప్రీంకోర్టు) -
నిర్భయ దోషులకు మరోసారి డెత్ వారెంట్లు జారీ
-
నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్లు
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచార కేసులో దోషులకు ఢిల్లీ పటియాల హౌస్కోర్టు కొత్త డెత్వారెంట్లు జారీచేసింది. మార్చి 20న ఉదయం 5.30 నిమిషాలకు నలుగురు దోషులను ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. తీహార్ జైల్లో దోషులను ఉరితీయానున్నారు. కాగా ఈ విధంగా డెత్వారెంట్లు జారీచేయడం ఇది నాలుగోసారి. గత మూడుసార్లు దోషులను కోర్టులను ఆశ్రయించడంతో ఉరితీత వాయిదా పడిన విషయం తెలిసిందే. నిజానికి, ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 17న జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం.. నిర్భయ దోషులు నలుగురినీ మార్చి 3 ఉదయం ఆరు గంటలకు ఉరితీయాల్సి ఉంది. నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా రాష్ట్రపతి ముందు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ పరిశీలనలో ఉండడంతో తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఉరిశిక్షను నిలిపివేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించడంతో శిక్షను నిలిపివేశారు. -
అన్ని పూర్తయ్యాయి, ఇక మిగిలింది ఉరే
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2012 నిర్భయ సామూహిక హత్యాచార కేసులో దోషి పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్ను రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ తాజాగా తోసిపుచ్చారు. దీంతో మరణశిక్షను తప్పించుకునేందుకు మొత్తం నలుగురు దోషులకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలు దాదాపు పూర్తి అయ్యాయి. దీంతో నిర్బయ దోషుల ఉరిశిక్షకు లైన్ క్లియర్ అయినట్టుగానే భావించవచ్చు. అయితే రాష్ట్రపతి నిర్ణయంపై పవన్ గుప్తా న్యాయ సమీక్షను కోరే అవకాశం లేకపోలేదు. ఈ నెలలో దోషులను ఉరితీస్తారని ఆశిద్దామంటూ నిర్భయ తండ్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తాజా పరిణామంపై నిర్భయ తల్లిదండ్రుల తరపు వాదిస్తున్న న్యాయవాది సీమా ఖుష్వాహా మాట్లాడుతూ ఇక మిగిలింది ఉరిశిక్ష అమలేనని పేర్కొన్నారు. నలుగురు దోషుల ఉరిశిక్షకు సంబంధించిన తాజా తేదీని నిర్ణయించేలా ఢిల్లీ కోర్టును అశ్రయించనున్నామని తెలిపారు. అక్షయ్ ఠాకూర్ (31) పవన్ గుప్తా (25) వినయ్ శర్మ (26) ముఖేష్ సింగ్ (32) దోషులందరికి అన్ని అవకాశాలు ముగిసాయి...ఇక ఇపుడు నిర్ణయించే తేదీ తుది తేదీ అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు ఉరిశిక్ష అమలు వివిధ న్యాయపరమైన అడ్డంకుల కారణంగా ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. Seema Khushwaha, Lawyer of Nirbhaya's parents: We are moving a fresh application in Delhi court to fix a fresh date for the execution of the four convicts. All the convicts have exhausted their complete rights. The date which will be fixed now will be the final date. pic.twitter.com/UADL2sobsa — ANI (@ANI) March 4, 2020 -
నిర్భయ దోషులకు రేపే ఉరి ...
-
నిర్భయ దోషులకు రేపే ఉరి..!
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై ఉత్కంఠ తొలగింది. డెత్వారెంట్పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పటియాల హౌజ్ కోర్టు నిరాకరించింది. దీంతో రేపు(మార్చి 3) ఉదయం 6గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. మరోవైపు తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ ఖైదు శిక్షగా మార్చాలంటూ నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త పెట్టుకున్న పిటిషన్ను సుప్రీం ధర్మాసనం కొట్టి వేసింది. దీంతో నలుగురు దోషులకు రేపు తీహార్ జైల్లో ఉరి శిక్ష అమలు అయ్యే అవకాశం ఉంది. (చదవండి : మార్చి 3న ఉరితీయండి ) అయితే పవన్కి ఇంకా రాష్ట్రపతికి క్షమాభిక్షకు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది. మరో వైపు ఈ కేసులో ఉరి అమలు వాయిదా పడేందుకు దోషులు విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చివరి నిమిషంలో కొత్త పిటిషన్లు దాఖలు చేయడంతో గతంలో రెండు సార్లు శిక్ష అమలు వాయిదా పడింది. అయితే ప్రస్తుతం అన్నీ అడ్డంకులు తొలిగిపోవడంతో రేపు ఉదయం ఆరు గంటలకు నలుగురు నిందితులను తీహార్ జైల్లో ఉరి తీయనున్నారు. -
మరోసారి కోర్టుకు నిర్భయ దోషులు
న్యూఢిల్లీ: నిర్భయ దోషులు వారి ఉరిశిక్ష అమలుపై మళ్లీ కోర్టును ఆశ్రయించారు. నలుగురు దోషుల్లో ఇద్దరు తమ శిక్ష అమలుపై స్టే ఇవ్వాల్సిందిగా ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈనెల 3వ తేదీన వారికి ఉరి శిక్ష అమలు కానున్న సంగతి తెలిసిందే. దోషులు అక్షయ్ సింగ్, పవన్కుమార్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్లపై ఈనెల 2లోగా వివరణ ఇవ్వాలని తీహార్ జైలు అధికారులకు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా నోటీసులు జారీచేశారు. అక్షయ్ సింగ్ తన పిటిషన్లో తాజాగా మరో క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశానని, అది పెండింగ్లో ఉందని పేర్కొన్నాడు. సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ పెండింగ్లో ఉందని పవన్కుమార్ గుప్తా పిటిషన్లో పేర్కొన్నాడు. -
గోడకి తలబాదుకున్న నిర్భయ దోషి
న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసు దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, అతనికి మెరుగైన వైద్యం అందించాలంటూ శర్మ తరఫున అతని లాయర్ దాఖలు చేసిన పిటిషన్ను గురువారం ఢిల్లీ కోర్టు విచారణ చేపట్టింది. స్కిజోఫేర్నియా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడంటూ పిటిషన్లో పేర్కొనడంతో ఎలాంటి వైద్యం అందిస్తున్నారో వెల్లడించాలని తీహార్ జైలు అధికారుల్ని ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తి ధర్మేంద్ర రాణా ఆదేశించారు. ఉరిశిక్ష విధించిన దగ్గర్నుంచి వినయ్ శర్మ ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు. అసహనంగా సెల్లోనే పచార్లు చేస్తున్నట్టు తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. మానసికంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న వినయ్ శర్మ ఆదివారం మధ్యాహ్నం తీహార్ జైలులో తనను ఉంచిన గదిలో తల గోడకేసి బాదుకోవడంతో గాయాలయ్యాయి. వెంటనే అతనికి అక్కడికక్కడే తీహార్ జైలు వైద్యులే చికిత్స అందించినట్టు అధికారులు చెప్పారు. ఆ గాయాలు ఏమంత పెద్దవి కావని వారు వెల్లడించారు. అయితే శర్మ తరఫు లాయర్ మాత్రం క్లయింట్ మానసికంగా తీవ్ర ఆందోళనలో ఉన్నాడని, తన తల్లిని కూడా గుర్తించడం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వినయ్ శర్మ కుటుంబ సభ్యుల కోరిక మేరకు లాయర్ తీహార్ జైలుకి వెళితే తలకి గాయాలు, కుడి భుజానికి ఫ్రాక్చర్ అయి కట్టుతో కనిపించాడని, అతనికి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందంటూ లాయర్ తాను దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిని విచారించిన కోర్టు తీహార్ జైలు అధికారులు స్పందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. -
నిర్భయ దోషులకు తాజా డెత్ వారంట్
-
మార్చి 3న ఉరితీయండి
న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్యకేసులో దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలుకు తేదీ ఖరారయ్యింది. నలుగురు దోషులకు ఢిల్లీ కోర్టు తాజాగా డెత్ వారంట్ జారీచేసింది. రోజుకో మలుపు తిరుగుతూ యావత్ దేశం దృష్టినీ ఆకర్షిస్తోన్న నిర్భయ కేసులో దోషులకు మార్చి 3న ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలుచేయాలని ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. ఇంకా దోషులకు శిక్ష అమలును ఆలస్యం చేయడం బాధితుల హక్కులకు భంగకరమని కోర్టు వ్యాఖ్యానించింది. ముకేశ్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ కుమార్ శర్మ(26), అక్షయ్కుమార్(31)లకు మార్చి 3వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరి శిక్ష అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించాలని కోర్టు ఆదేశించడం ఇది మూడోసారి. జనవరి 7, 2020 తేదీన కోర్టు ఇచ్చిన ఆదేశాలు మార్చి 3న అమలులోకి వస్తాయని ఢిల్లీ కోర్టు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా వెల్లడించారు. దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ జనవరి 7, 2020న కోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే జనవరి 17, జనవరి 31న రెండు సార్లు దోషులకు విధించిన మరణశిక్ష వాయిదాపడింది. శిక్ష అమలును ఇంకా వాయిదా వేయడం వల్ల బాధితుల హక్కులకూ, సత్వర న్యాయానికీ నష్టమని కోర్టు అభిప్రాయపడింది. ‘నిర్భయ’ కేసులో నలుగురు దోషులకు కొత్తగా డెత్ వారంట్ జారీ చేసేందుకు ట్రయల్ కోర్టును ఆశ్రయించొచ్చంటూ సుప్రీంకోర్టు అధికారులకు స్వేచ్ఛనివ్వడంతో, నిర్భయ దోషుల తల్లిదండ్రులూ, ఢిల్లీ ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తులను పటియాలా హౌజ్ కోర్టు విచారించింది. ఉరిశిక్ష అమలుపై నిర్భయ తల్లి ఆశాభావం తన కుమార్తె నిర్భయపై సామూహిక అత్యాచారంచేసి, హత్య చేసిన నలుగురు దోషులకూ ఒకేసారి శిక్షపడుతుందని నిర్భయ తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలు అమలు జరుగుతాయని ఆమె భావిస్తున్నానన్నారు. క్షమాభిక్ష కోరతాం: పవన్, అక్షయ్ పవన్గుప్తా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ను దాఖలు చేయాలనీ, రాష్ట్రపతి ఎదుట క్షమాభిక్ష పిటిషన్ వేయాలని భావిస్తున్నట్టు న్యాయవాది రవిఖాజీ కోర్టుకి వెల్లడించారు. అలాగే, అక్షయ్ కూడా త్వరలోనే రాష్ట్రపతికి పూర్తిస్థాయిలో క్షమాబిక్ష పిటిషన్ దాఖలు చేస్తాడని న్యాయవాది ఏపీ సింగ్ కోర్టుకి విన్నవించారు. వినయ్ శర్మ దీక్ష విరమణ తీహార్ జైల్లో వినయ్ శర్మ నిరాహార దీక్ష చేస్తున్న విషయం కోర్టుకి తెలిసింది. ఆ తరువాత అతడు దీక్షను విరమించుకున్నట్టు కోర్టు వెల్లడించింది. వినయ్ మానసిక ఆరోగ్యం సరిగాలేనందున ఉరితీయడం కుదరదనీ అతడి తరఫు న్యాయవాది వాదించారు. అయితే కోర్టు ఈ వాదనని తోసిపుచ్చింది. 33 నెలలు... దోషుల అప్పీల్ను 2017, మే 5న సుప్రీంకోర్టు కొట్టివేసింది. 33 నెలల తరువాత కూడా నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా ఎటువంటి క్యూరేటివ్ పిటిషన్ను గానీ, క్షమాభిక్ష పిటిషన్ని కానీ దాఖలు చేయలేదని కోర్టు వ్యాఖ్యానించింది. న్యాయపరమైన అవకాశాలన్నింటినీ వినియోగించుకోని ఏకైక వ్యక్తి పవన్ గుప్తాయేనని కోర్టు వెల్లడించింది. నిర్భయ దోషులు వీరే.. -
నిర్భయ నలుగురు దోషులను ఒకేసారి ఉరి
-
నిర్భయ దోషుల ఉరిశిక్ష తేదీ ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార, హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారైంది. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులు వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్, అక్షయ్ సింగ్లను ఉరితీయాలని ఢిల్లీలోని పటియాల హౌస్ కోర్టు సోమవారం కొత్త డెత్వారెంట్లు జారీచేసింది. నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయాలని జైలు అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం వారున్న తీహార్ జైలులోనే వారిని ఉరితీయనున్నారు. కాగా జనవరి 22, ఫిబ్రవరి 1 దోషుల ఉరిశిక్ష అమలుకై రెండుసార్లు డెత్ వారెంట్లు జారీ అయినప్పటికీ.. వారు వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తూ శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలంటూ కేంద్ర హోంశాఖ ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దోషుల తీరుపై న్యాయస్థానం కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పటియాల కోర్టు దోషులను ఉరితీయాలంటూ తాజాగా డెత్వారెంట్లు జారీచేసింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడటంతో.. ఈసారైనా ఉరిశిక్ష అమలు అవుతుందా లేదా అనేది అసక్తికరంగా మారింది. -
నిర్భయ దోషికి లాయర్.. హక్కులు కాపాడాలి!
న్యూఢిల్లీ: ఏడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్యోదంతం దోషుల్లో ఒకడైన పవన్ గుప్తాకు ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టు కొత్త లాయర్ను నియమించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును అనుసరించి దోషి తరఫున వాదించేందుకు రవి ఖాజీ అనే న్యాయవాదిని నియమిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా.. దోషి చివరి శ్వాస వరకు అతడి హక్కుల్ని, స్వేచ్చను కాపాడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థకు ఉందని పేర్కొంది. కాగా తన తరఫున వాదిస్తున్న ప్రస్తుత లాయర్ను తొలగించిన కారణంగా.. తాను కొత్త లాయర్ను నియమించుకునేంత వరకు విచారణ వాయిదా వేయాలని పవన్ గుప్తా కోర్టును కోరిన విషయం తెలిసిందే. (లాయర్ లేడట.. నేనేమో న్యాయం కోసం అడుక్కోవాలి: నిర్భయ తల్లి) ఇదిలా ఉండగా.. నిర్భయ దోషి వినయ్ శర్మ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరగా ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రపతి తిరస్కరణను సవాలు చేస్తూ అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష అమలులో జాప్యం చేసేందుకే దోషులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిర్భయ నలుగురు దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయడం కోసం డెత్వారెంట్లు జారీ చేయాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్ను గురువారం విచారించిన కోర్టు.. తదుపరి విచారణను ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది. వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పటికిప్పుడు డెత్ వారెంట్లు జారీ చేయలేమని పేర్కొంది. (నిర్భయ దోషులకు ‘సుప్రీం’ నోటీసులు) కాగా 2012, డిసెంబర్ 16న అర్ధరాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి... ఆపై ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డు మీదకు విసిరేసిన విషయం విదితమే. ప్రాణాల కోసం పోరాడి చివరకు ఆ యువతి సింగపూర్లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఆమెకు నిర్భయగా నామకరణం చేసిన పోలీసులు నిందితులు రామ్సింగ్, అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు(అతనిపై నిఘా కొనసాగుతుంది). అనేక పరిణామాల అనంతరం మిగిలిన నలుగురు దోషులకు సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో 2020లో (జనవరి 22, ఫిబ్రవరి 1) దోషుల ఉరిశిక్ష అమలుకై రెండుసార్లు డెత్ వారెంట్లు జారీ అయినప్పటికీ.. వారు వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తు శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.(నిర్భయ: ‘సుప్రీం’ను ఆశ్రయించిన వినయ్ శర్మ) -
కీలక నిందితుడిని స్వేచ్ఛగా వదిలేస్తారా?
న్యూఢిల్లీ: సొంత డీఎస్పీని అరెస్ట్ చేసి, కీలక నిందితుడిని స్వేచ్ఛగా వదిలేయడంపై సీబీఐకి ఢిల్లీ కోర్టు అక్షింతలు వేసింది. సీబీఐ మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా అవినీతికి సంబంధించిన ఒక కేసును సీబీఐ స్పెషల్ కోర్టు విచారించింది. ఈ కేసులో కీలక నిందితుడిగా అనేక ఆధారాలు కన్పిస్తున్న సోమేశ్వర్ శ్రీవాస్తవను అరెస్ట్ చేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన దుబాయ్ వ్యాపారి, ప్రధాన నిందితుడు అయిన మనోజ్ ప్రసాద్కు శ్రీవాస్తవ్ సోదరుడవుతాడు. ‘శ్రీవాస్తవ్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? మనోజ్ ప్రసాద్ కన్నా ఈయనే కీలకంగా కనిపిస్తున్నాడు. ఆయనను స్వేచ్ఛగా ఎందుకు వదిలేశారు? మీరు మీ సొంత డీఎస్పీనే అరెస్ట్ చేశారు. కేసులో పెద్ద పాత్ర పోషించినవారిని వదిలేశారు’ అని సీబీఐ కోర్టు న్యాయమూర్తి సంజీవ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన సీబీఐ.. శ్రీవాస్తవ్ పాత్రపై దర్యాప్తు జరుపుతున్నామని వివరణ ఇచ్చింది. దేశం విడిచి వెళ్లకుండా ఆయనపై ఎల్ఓసీ(లుక్ ఔట్ సర్క్యులర్) జారీ చేశామంది. దీనిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘ఎల్ఓసీ ఎందుకు? దాంతో ఏం లాభం. భారతదేశం చాలా పెద్దది. ఇక్కడే హ్యాపీగా లైఫ్ను ఎంజాయ్ చేయొచ్చు’ అని పేర్కొన్నారు. మనోజ్ ప్రసాద్ కన్నా శ్రీవాస్తవ్కు వ్యతిరేకంగా ఎక్కువ సాక్ష్యాలున్నాయని, కీలక నిందితుడైన ఆయనను అలా వదిలేశారని వ్యాఖ్యానించారు. అనంతరం.. అవసరమైతే గతంలో ఈ కేసును విచారించిన అధికారిని పిలిపిస్తామని చెప్పి.. కేసు విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేశారు. కేసు వివరాల్లోకి వెళితే.. మాంసం ఎగుమతిదారు అయిన మొయిన్ ఖురేషీకి సంబంధించిన 2017 నాటి కేసులో హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త సాన సతీశ్ బాబు నిందితుడు. ఆ కేసును విచారిస్తున్న సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు తనపై చర్యలేవీ తీసుకోకూడదని కోరుతూ పలు విడతలుగా రూ. 2 కోట్లు మనోజ్ ప్రసాద్, శ్రీవాస్తవ్ల ద్వారా ఇచ్చానని సతీశ్ బాబు ఫిర్యాదు చేశారు. దాంతో ఆస్థానాపై కేసు నమోదు చేశారు. సహ నిందితుడిగా సీబీఐ డీఎస్పీ దేవేందర్ కుమార్ను, మధ్యవర్తిగా వ్యవహరించిన మనోజ్ ప్రసాద్ను అరెస్ట్ చేశారు. -
లాయర్ లేడట.. నేనేమో అడుక్కోవాలి
-
లాయర్ను తొలగించా.. టైం కావాలి: నిర్భయ దోషి
న్యూఢిల్లీ: తన తరఫున వాదిస్తున్న ప్రస్తుత లాయర్ను తొలగించిన కారణంగా తనకు మరింత గడువు ఇవ్వాలని నిర్భయ దోషి పవన్ గుప్తా కోర్టును అభ్యర్థించాడు. కొత్త లాయర్ను నియమించుకునేంత వరకు విచారణ వాయిదా వేయాలని కోరాడు. కాగా నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులైన (ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా) వాళ్లందరికీ ఒకేసారి శిక్ష విధించాలని... చట్టపరంగా వాళ్లకు అన్ని అవకాశాలు కల్పించాలని ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వాళ్లకు ఏడు రోజుల గడువు ఇస్తున్నట్లు ఫిబ్రవరి 5న పేర్కొంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. ఈ క్రమంలో నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా.. తన తరఫున వాదించేందుకు ఎవరూ లేని కారణంగా మరింత సమయం ఇవ్వాలని కోరాడు. ఇందుకు స్పందించిన కోర్టు.. తామే లాయర్ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కోర్టు హాలులోనే ఉన్న నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శిక్ష అమలును జాప్యం చేసేందుకే దోషులు నాటకాలు ఆడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.(ఒకేసారి కాదు.. ఒక్కొక్కరిని ఉరి తీయండి: నిర్భయ తల్లి) ‘‘దోషుల ఉరిశిక్ష అమలుకు సంబంధించి న్యాయపరమైన అవరోధాలు తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలని ఏడాదిన్నరగా అడుగుతూనే ఉన్నాను. ఢిల్లీ హైకోర్టు తీర్పును అనుసరించి వారికి డెత్ వారెంట్లు జారీ చేయలేదు. వారం రోజుల గడువు ఇచ్చారు. ఇప్పుడు వాళ్లు లాయర్ లేకుండా కోర్టుకు హాజరయ్యారు. బాధితురాలి తల్లినైన నేను ఇక్కడ ఉన్నాను. చేతులు కట్టుకుని న్యాయం కోసం అర్థిస్తున్నాను. మరి నా హక్కులు ఏమై పోయినట్లు’’ అని న్యాయమూర్తి ముందు తన బాధను వెళ్లగక్కారు. ఇందుకు స్పందించిన జడ్జి.. ‘‘ఇక్కడ ప్రతీ ఒక్కరు మీ హక్కుల గురించి ఆలోచిస్తున్నారు. అందుకే ఈ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి’’ అని సమాధానమిచ్చారు. (తనను రక్తపు మడుగులో చూశా.. బండరాయిని) ఇక నిర్భయ తరఫు లాయర్ వాదిస్తూ.. సోమవారం దాకా దోషులకు లాయర్గా వ్యవహరించిన ఏపీ సింగ్ ఏమయ్యారని.. ఇప్పుడు పవన్ గుప్తా తన లాయర్ను తొలగించుకోవడం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన జడ్జి.. ‘‘అతడికి గొప్ప లాయర్ను పెడతాం. ఇంకా వేరే ఏమైనా ఆప్షన్లు ఉన్నాయో ఆలోచిస్తాం’’అని సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో నిర్భయ తండ్రి మాట్లాడుతూ దోషులకు కోర్టు లాయర్ను నియమిస్తే.. నిర్భయకు అన్యాయం చేసినవాళ్లు అవుతారు అని పేర్కొనగా.. వాళ్లకు లాయర్ను పెట్టకపోవడం అన్యాయం అవుతుందని జడ్జి సమాధానమిచ్చారు. ఈ క్రమంలో నిర్భయ తల్లిదండ్రులు, మహిళా హక్కుల కార్యకర్త యోగితా భయానా కోర్టు ప్రాంగణంలో నిరసనకు దిగారు. దోషులను ఉరి తీయాలంటూ నినాదాలు చేస్తున్నారు.(దోషుల లాయర్ నన్ను సవాలు చేశాడు: నిర్భయ తల్లి) కాగా ఏడేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులైన ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్ న్యాయపరమైన అన్ని అవకాశాలు ఉపయోగించుకోగా.. వినయ్ శర్మ పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించగా... పవన్ గుప్తా కేవలం రివ్యూ పిటిషన్ మాత్రమే దాఖలు చేశాడు. ఇంకా అతడికి క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇక ఒకే కేసులో దోషులైన వాళ్లందరికీ ఒకేసారి శిక్ష విధించాలని... చట్టపరంగా వాళ్లకు అన్ని అవకాశాలు కల్పించాలని ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. దోషులు వరుసగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇందులో భాగంగా.. తాను పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ వినయ్ శర్మ సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టాడు. ఇక ఈరోజు పవన్ తనకు లాయర్ లేడంటూ కొత్త నాటకానికి తెరతీశాడు. కాగా నిర్భయ దోషులను జనవరి 22న ఉరితీయాలంటూ తొలుత డెత్ వారెంట్లు జారీ కాగా... వారికి చట్టపరంగా అన్ని హక్కులు కల్పించాలంటూ దోషుల తరఫు లాయర్ వాదించడంతో.. ఫిబ్రవరి 1 ఉరితీసేందుకు ఢిల్లీ పటియాలా కోర్టు మరోసారి వారెంట్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోగా అన్ని అవకాశాలు వినియోగించాలంటూ కోర్టు సూచించగా.. లాయర్ లేడంటూ మరోసారి శిక్ష అమలులో జాప్యం నెలకొంది. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణను సవాలు చేసిన దోషి! -
నిర్భయ: ‘సుప్రీం’ను ఆశ్రయించిన వినయ్ శర్మ
న్యూఢిల్లీ: నిర్భయ దోషి వినయ్ శర్మ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాను పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టాడు. వినయ్ శర్మ తరఫున అతడి లాయర్ ఏపీ సింగ్ ఈమేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కాగా నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తనకు ఉరిశిక్ష రద్దు చేసి, యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు అర్జీ పెట్టుకోగా... ఫిబ్రవరి 1న ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇక నిర్భయ కేసులో దోషులందరినీ ఒకేసారి ఉరితీయాలనీ, న్యాయపరమైన అవకాశాలన్నింటినీ వినియోగించుకోవడానికి వారికి ఢిల్లీ హైకోర్టు గడువు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన విషయం విదితమే. నిర్భయ దోషుల ఉరితీతపై స్టేకు వ్యతిరేకంగా నోటీసులు జారీ చేయడానికి న్యాయస్థానం విముఖత వ్యక్తం చేసింది. దోషులకు నోటీసులు ఇవ్వాలన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనతో జస్టిస్ భానుమతి జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్.బోపన్నలతో కూడిన ధర్మాసనం ఏకీభవించలేదు. చదవండి: నిర్భయ కేసు.. ప్రస్తుత స్థితి కాగా ఈ కేసులో దోషులైన ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్ న్యాయపరమైన అన్ని అవకాశాలు ఉపయోగించుకోగా.. వినయ్ శర్మ పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించగా... పవన్ గుప్తా కేవలం రివ్యూ పిటిషన్ మాత్రమే దాఖలు చేశాడు. ఇంకా అతడికి క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇక ఒకే కేసులో దోషులైన వాళ్లందరికీ ఒకేసారి శిక్ష విధించాలని... చట్టపరంగా వాళ్లకు అన్ని అవకాశాలు కల్పించాలని ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్లకు ఏడు రోజుల గడువు ఇస్తున్నట్లు ఫిబ్రవరి 5న పేర్కొంది. ఈ క్రమంలో దోషులు మరోసారి వరుసగా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. -
నిర్భయకు న్యాయమా..? పాపీ చిరాయువా..?
-
నేను విన్న అత్యంత అసహ్యకరమైన విషయం: వర్మ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడటంపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్ష పడకుంటా అడ్డుకుంటున్న న్యాయవాది ఏపీ సింగ్పై మండిపడుతూ వరుస ట్వీట్లు చేశాడు. ‘మురికి మనిషి ఏపీ సింగ్ నీతినియమాలను ఉల్లంఘిస్తే తన కూతురునైనా కాల్చేస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో చూడండి. ఇది మన సిస్టమ్కు ఉరి వేస్తూ అతడు వేసిన ఒట్టు అది. మన దేశానికి ఎంతో అవమానకరం’అంటూ 2013లో ఏపీ సింగ్కు సంబంధించిన ఇంటర్వ్యూ లింక్ను షేర్ చేశాడు. ‘అత్యంత క్రూరంగా, అహంకారంతో మన వ్యవస్థను న్యాయవాది ఏపీ సింగ్ మార్చుతుంటే.. మన వ్యవస్థ కంటే తెలంగాణ పోలీసులపైనే ప్రజలకు ఎక్కువ నమ్మకం కలుగుతుంది’, ‘నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడనివ్వని ఏపీ సింగ్ సవాల్ చేస్తున్నాడు. నేను విన్న అత్యంత అసహ్యకరమైన విషయం’అంటూ మరో రెండు ట్వీట్లు శనివారం చేశాడు. అయితే శుక్రవారం దోషులకు ఉరిశిక్ష వాయిదా వేస్తూ ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన వెంటనే వర్మ ట్విటర్ వేదికగా మండిపడిన విషయం తెలిసిందే. నాడు నిర్భయ జంతువుల చేతిలో గ్యాంగ్ రేప్నకు గురైతే.. నేడు మన వ్యవస్థ చేతిలో గ్యాంగ్ రేప్నకు గురవుతోందంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘నిర్భయ తల్లిదండ్రుల ఫీలింగ్స్ని మీరు ఊహించగలరా మోదీ గారూ. దానిని తెలుసుకోవడం కోసం.. నిర్భయను చంపేసిన నిందితులను శిక్షించేందుకు మన కోర్టులన్నీ ఎలా కింద మీదా పడుతున్నాయో చూడండి’ అంటూ మరో ట్వీట్ చేశారు. కాగా నిర్బయ దోషులకు ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు శిక్ష అమలుకానుండగా.. కొన్ని గంటల ముందు కోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. తదుపరి తీర్పు వచ్చేవరకు ఉరిశిక్ష అమలు చేయరాదని ఆదేశించింది. నలుగురు దోషులకు ఉరిశిక్ష పదే పదే వాయిదా పడటాన్ని యావత్ దేశం జీర్ణించుకోలేకపోతోంది. Just check the interview of this dirt piece called A P Singh where he’s bragging to burn his own daughter and this is the scum who made our system stay the hanging ..SHAME ON OUR COUNTRY https://t.co/hjQb3gBati — Ram Gopal Varma (@RGVzoomin) February 1, 2020 If even filthy scum like advocate A P Singh also can manipulate the system with such brutal arrogance, it’s no wonder people have more faith in the telangana police than in our system https://t.co/w8UwJebNP8 — Ram Gopal Varma (@RGVzoomin) February 1, 2020 చదవండి: ఆ కీచకులను వెంటనే ఉరితీయండి: గంభీర్ ‘నిర్భయ’ దోషుల ఉరి మళ్లీ వాయిదా -
ఆ కీచకులను వెంటనే ఉరితీయండి: గంభీర్
న్యూఢిల్లీ : ‘నిర్భయ’ దోషులకు ఉరిశిక్ష అమలు మళ్లీ వాయిదా పడటంపై బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అసహనం వ్యక్తం చేశారు. మన న్యాయవ్యవస్థకు ఇదొక మాయని మచ్చ వంటిదని పేర్కొన్నారు. నిర్భయ కీచకులు భూమ్మీద ఇంకా జీవించి ఉంటే అది మన న్యాయవ్యవస్థను అపహాస్యం చేసినట్టేనని వ్యాఖ్యానించారు. అంతటి పైశాచిక చర్యకు పాల్పడిన దోషులు ఏడేళ్లైన ఇంకా శిక్షను అనుభవించడం లేదని వాపోయారు. నిర్భయ తల్లి కడుపుకోత తీరేదెప్పుడని ప్రశ్నించారు. ‘నిర్భయ దోషుల్ని వెంటనే ఉరితీయండి’అని గంభీర్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, నిర్భయ దోషులు పవన్ గుప్తా, ముకేశ్ సింగ్, అక్షయ్ సింగ్, వినయ్ శర్మకు ఈరోజు (ఫిబ్రవరి 1) విధించాల్సిన ఉరిశిక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. చట్టపరంగా తమలో కొందరికి మిగిలి ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని దోషుల విజ్ఞప్తి మేరకు.. ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలంటూ అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా శుక్రవారం ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు శిక్షను అమలు చేయొద్దని స్పష్టం చేశారు. (చదవండి : నిర్భయ కేసు : వినయ్ శర్మ పిటిషన్ తిరస్కరణ) -
‘నిర్భయ’ దోషుల ఉరి మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ: ‘నిర్భయ’దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు శిక్షను అమలు చేయరాదంటూ ఢిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. చట్టపరంగా తమలో కొందరికి మిగిలి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాల్సి ఉన్నందున శిక్ష అమలును నిరవధికంగా వాయిదా వేయాలంటూ దోషులు పెట్టుకున్న పిటిషన్పై అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఈ మేరకు ఆదేశాలిచ్చారు. నిర్భయ కేసులో దోషులైన పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్, ముకేశ్ కుమార్ సింగ్లను ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలంటూ కోర్టు జనవరి 17వ తేదీన ఆదేశించిన విషయం తెలిసిందే. వినయ్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి కోవింద్ వద్ద పెండింగ్లో ఉండగా, మిగతా ఇద్దరు చట్టపరమైన అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉరి శిక్ష అమలును వాయిదా వేయాలంటూ దోషులు పవన్, వినయ్, అక్షయ్ల తరఫున లాయర్ ఏపీ సింగ్ గురువారం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం జడ్జి ధర్మేందర్ రాణా విచారణ చేపట్టారు. నలుగురిలో ఏ ఒక్కరి పిటిషన్ పెండింగ్లో ఉన్నా మిగతా వారిని ఉరి తీయడం నిబంధనలకు విరుద్ధమని దోషుల తరఫు న్యాయవాది వాదించారు. ఏకీభవించిన న్యాయమూర్తి డెత్ వారెంట్లను వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చారు. పవన్ పిటిషన్ కొట్టివేత మరోవైపు, నిర్భయ కేసులో మరో దోషి పవన్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నేరానికి పాల్పడిన సమయానికి మైనర్ అయినందున తనకు విధించిన ఉరిశిక్షపై సమీక్ష జరపాలంటూ అతడు పెట్టుకున్న పిటిషన్ను కొట్టివేసింది. దీంతో ఆఖరి అవకాశంగా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇలా ఉండగా, న్యాయం దక్కే దాకా పోరాటం కొనసాగిస్తామని నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో అన్నారు. ఉరిశిక్ష వాయిదా పడేలా దోషులు వ్యవహరిస్తున్న తీరుపై చర్చ జరగాల్సి ఉందని హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి అన్నారు. మరోవైపు, హేయమైన నేరాలకు విధించిన ఉరిశిక్ష అమలుపై బాధితుల కోణంలో నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందంటూ కేంద్రం వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. -
బ్రేకింగ్: నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా
-
నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్షపై ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు దోషుల మరణ శిక్షను నిలుపుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కాగా నిర్భయ దోషులకు ఫిబ్రవరి ఒకటో తేదీన ఉరిశిక్ష అమలు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే దోషులకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలుగా శిక్ష అమలును వాయిదా వేయాలన్న నిర్భయ దోషుల పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీహార్ జైలు అధికారులకు నోటీసులు పంపింది. ఇక ఇదే కేసులో దోషి అక్షయ్ వేసిన క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదే విధంగా కేసులో మరో దోషి అయిన పవన్ గుప్తా ఘటన జరిగే నాటికి తాను మైనర్ అంటూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను శుక్రవారం కొట్టివేసింది.(నిర్భయ కేసు: పవన్ గుప్తాకు సుప్రీంకోర్టు షాక్) కాగా కాగా ఏడేళ్ల క్రితం ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఓ యువతిపై ఆరుగురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా హింసించగా.. సింగపూర్లో చికిత్స పొందుతూ ఆమె మరణించిన విషయం విదితమే. ఈ కేసులో ప్రధాన దోషి రామ్ సింగ్ జైలులో ఆత్మహత్య చేసుకోగా.. ఘటన నాటికి మైనర్గా ఉన్న మరో నిందితుడు విడుదలయ్యాడు. మిగిలిన నలుగురు దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31)లకు దాదాపు రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించింది. ఈ క్రమంలో జనవరి 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసినప్పటికీ... వినయ్ శర్మ, ముఖేష్ కుమార్ సర్వోన్నత న్యాయస్థానంలో క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడం.. ముఖేష్ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన నేపథ్యంలో.. నిబంధనలను అనుసరించి ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో వినయ్ శర్మ రాష్ట్రపతి క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. అదే విధంగా అక్షయ్ కుమార్ ఉరిశిక్షపై స్టే విధించాలంటూ కోర్టును ఆశ్రయించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో పటియాలా హౌజ్ కోర్టు ఆదేశాలతో మరోమారు ఉరిశిక్ష వాయిదా పడింది. వీటన్నింటిపై విచారణ జరిగిన తర్వాత కోర్టు మరోసారి డెత్ వారెంట్లు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. కోర్టు తాజా ఆదేశాలు రాకమునుపు.. దోషులను ఉరి తీసేందుకు తలారి తీహార్ జైలుకు చేరుకున్నాడు. బస్తాలతో డమ్మీ ట్రయల్స్ కూడా నిర్వహించారు. నిర్భయ దోషుల వివరాలు ముఖేష్ సింగ్: తీహార్ జైల్లో ఉరి వేసుకొని చనిపోయిన బస్సు డ్రైవర్ రామ్ సింగ్ తమ్ముడే ముఖేష్ సింగ్ (32). దక్షిణ ఢిల్లీలోని రవిదాస్ మురికివాడల్లో సోదరుడితో కలసి నివసించేవాడు అప్పుడప్పుడు తానే ఆ బస్సుని నడిపించేవాడు. క్లీనర్గా చేసేవాడు. ఘటన రోజు ముఖేశ్ బస్సు నడిపాడు. అత్యాచారం చేశాక నిర్భయ, ఆమె స్నేహితుడిని ఐరన్ రాడ్తో చితకబాదాడని ముఖేష్పై అభియోగాలు నమోదయ్యాయి. వినయ్ శర్మ: వినయ్శర్మ (26) కూడా రవిదాస్ మురికివాడల్లో నివసించే వాడు. అతను ఫిటినెస్ ట్రైనర్. ఒక జిమ్లో అసిస్టెంట్గా పనిచేసేవాడు. ప్రాథమిక విద్య అభ్యసించాడు. అక్షయ్ కుమార్ ఠాకూర్: అక్షయ్ ఠాకూర్ (31) బిహార్ వాసి. నిర్భయను అత్యాచారం చేసిన బస్సులో హెల్పర్గా ఉన్నాడు. స్కూల్ డ్రాపవుట్ అయిన అక్షయ్ 2011లో బిహార్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. నేరం చేయడమే కాదు సాక్ష్యాధారాల్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నించాడు. నేరం జరిగిన ఐదు రోజుల తర్వాత అక్షయ్ని బిహార్లో అరెస్ట్ చేశారు. పవన్ గుప్తా: పవన్ గుప్తా (25) పండ్ల వ్యాపారి. డిసెంబర్ 16 మధ్యాహ్నం మద్యం సేవించి బయటకు వెళ్లాడు. అరెస్ట్ చేసిన తర్వాత పవన్ తాను చాలా దుర్మార్గానికి పాల్పడ్డానని, తనకి ఉరి శిక్షే సరైనదని కోర్టులో చెప్పుకున్నాడు. -
చిన్నారిపై అత్యాచారం.. దోషులకు 20 ఏళ్ల జైలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని గాంధీనగర్లో 2013లో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఇటీవల దోషులుగా తేల్చిన కోర్టు.. గురువారం వారికి శిక్ష ఖరారు చేసింది. దోషులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే బాధిత బాలికకు నష్ట పరిహారంగా రూ.11 లక్షలు చెల్లించాలని అదనపు సెషన్స్ జడ్జి నరేశ్ కుమార్ మల్హోత్రా ఆదేశించారు. గాంధీనగర్లో ఐదేళ్ల చిన్నారిని 2013 ఏప్రిల్ 15న మనోజ్ షా, ప్రదీప్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు ఓ గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని అత్యంత క్రూరంగా హింసించారు. అనంతరం బాలిక చనిపోయిందనుకుని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఘటన జరిగిన 40 గంటల తర్వాత బాలికను గుర్తించిన పోలీసులు.. ఆమెకు ఆస్పత్రికి తరలించారు. దీంతో బాలిక ప్రాణాలతో బయటపడింది. దోషులకు జీవిత ఖైదు విధించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని బాధితురాలి తరఫు లాయర్ చెప్పారు. -
'నిర్భయ దోషికి స్లో పాయిజన్ ఇస్తున్నారు'
న్యూఢిల్లీ: ఉరిని ఆలస్యం చేసేందుకు నిర్భయ దోషులు రోజుకో రకంగా పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా వినయ్ శర్మకు జైలు అధికారులు స్లో పాయిజన్ ఇచ్చారంటూ ఆయన తరుపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశాడు. తన క్లయింటును ఆసుపత్రిలో చేర్పించారని ఆయన ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు వెల్లడించారు. పైగా వినయ్ శర్మకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా అందజేయడం లేదన్నారు. శనివారం ఆయన ఈ మేరకు కోర్టుకు దరఖాస్తును అందజేశారు. కేరళ, పంజాబ్ బాటలో రాజస్తాన్..! దోషులు ఉరి తప్పించుకునేందుకు తప్పుడు పిటిషన్లు వేస్తున్నారని.. వారికి సంబంధించిన అన్ని పత్రాలు ఇచ్చామని ప్రాసిక్యూషన్ అభిప్రాయపడింది. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి వినయ్ శర్మ లాయర్ వేసిన పిటిషన్ కొట్టివేశారు. దీంతో ఉరి నుంచి తప్పించుకునేందుకు మెల్లమెల్లగా దారులన్నీ మూసుకుపోతున్నాయి. ఇప్పటికే క్షమాభిక్ష అభ్యర్థన తిరస్కరించగా ఫిబ్రవరి 1న ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘తీహార్’ అధికారులు సహకరించట్లేదు! -
చంద్రశేఖర్ ఆజాద్కు బెయిల్ సవరణ
న్యూఢిల్లీ: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్కు విధించిన బెయిల్ షరతులను ఢిల్లీ కోర్టు మంగళవారం సవరించింది. వైద్యకారణాలు, ఎన్నికల ప్రయోజనాల కోసం ఢిల్లీని సందర్శించడానికి కోర్టు అనుమతిస్తున్నట్లు అదనపు సెషన్స్ న్యాయమూర్తి కామిని ఆదేశాలిచ్చారు. చంద్రశేఖర్ ఆజాద్ గత నెలలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనల్లో ప్రజలను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అరెస్టు కాగా.. ఆజాద్కు ఢిల్లీలోని స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చదవండి: జామా మసీదు ముందు భీమ్ ఆర్మీ చీఫ్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగే నిరసన ప్రదర్శనల్లో పాల్గొనరాదని, నాలుగు వారాల వరకు ఢిల్లీకి రావద్దని ఆయనపై కోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆజాద్ తనకు విధించిన బెయిల్ షరతులను సవరించాలని పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు షరతులను సవరించింది. అదే విధంగా ఆజాద్ కార్యాలయం రాజకీయపార్టీకి సంబంధించిందా.. కాదా.. అని ఎన్నికల సంఘం నుంచి నివేదిక తీసుకోవాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. చదవండి: జామా మసీద్ పాక్లో ఉందా..? -
నిర్భయ దోషులకు కొత్త డెత్వారెంట్లు జారీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న నిర్భయ దోషుల ఉరిశిక్ష తేదీలను ఢిల్లీకోర్టు ఖరారు చేసింది. గతంలో ప్రకటించిన తేదీ కాకుండా మరోసారి డెత్ వారెంట్లు జారీచేసింది. నలుగురు దోషులకు ఫిబ్రవరి 1 ఉదయం 6గంటలకు (శనివారం) ఉరిశిక్ష అమలు చేయాల్సిందిగా పటియాల హౌస్కోర్టు శుక్రవారం తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. కాగా జనవరి 22న దోషులను ఉరి తీసేందుకు జైలు అధికారులు ఇదివరకే ఏర్పాట్లు పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే హత్య కేసులో దోషి ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష పెట్టుకున్నారు. ఈ పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం తిరస్కరించారు. కాగా ఉరిశిక్ష అమలు ఆలస్యంపై నిర్భయ తల్లితో పాటు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఉరితీత తేదీల్లో మార్పులు చేస్తూ.. తాజాగా డెత్వారెంట్లను జారీచేశారు. -
నిర్భయ కేసు : దోషుల ఉరిపై స్టే
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలులో జాప్యం నెలకొంది. ఈ కేసులో నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడంతో ఈ నెల 22న వారి ఉరిశిక్షను ఢిల్లీ కోర్టు గురువారం నిలిపివేసింది. వారికి డెత్ వారెంట్ ఇస్తూ తాను జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించడం లేదని, క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉండటంతో వారి ఉరి శిక్ష అమలుపై స్టే విధిస్తున్నామని తీస్ హజారి కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. కేసుపై పూర్తి నివేదికను రేపటిలోగా ఇవ్వాలని జైలు అధికారులను ఆదేశించారు. కాగా, రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉన్నందున నిర్భయ దోషులను తాము ఈనెల 22న ఉరితీయడం లేదని అంతకుముందు తీహార్ జైలు అధికారులు కోర్టుకు నివేదిక సమర్పించారు. కాగా నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడంతో ఈనెల 22న వారి ఉరిశిక్ష నిలిచిపోయిందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఈ కేసులోనలుగరు దోషులు ముఖేష్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తాలను జనవరి 22న ఉరి తీయాలని ఈనెల 7న ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. చదవండి : నిర్భయ కేసులో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం -
జామా మసీద్ పాక్లో ఉందా..?
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జామా మసీద్లో నిరసన తెలిపిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఢిల్లీ కోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిరసన తెలపడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కని, పార్లమెంట్లో చెప్పాల్సిన విషయాలు చెప్పనందుకే ప్రజలు వీధుల్లోకి వచ్చారని స్పష్టం చేసింది. చంద్రశేఖర్ ఆజాద్పై మోపిన ఆరోపణలను ప్రస్తావిస్తూ జామా మసీద్ పాకిస్తాన్లో ఉన్నట్టు మీరు ప్రవర్తిస్తున్నారని, గతంలో పాకిస్తాన్ అవిభక్త భారత్లో అంతర్భాగమైనందున మీరు అక్కడికి వెళ్లైనా నిరసన తెలుపవచ్చని ఢిల్లీ పోలీసుల తీరును తప్పుపట్టారు. ఆజాద్ సోషల్ మీడియా పోస్ట్లను ప్రాసిక్యూటర్ ప్రస్తావిస్తూ హింసను ప్రేరేపించేలా ఆయన పోస్ట్లున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జామా మసీద్ వద్ద ధర్నా చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఆజాద్ పోస్ట్ చేశారని ప్రాసిక్యూటర్ చెబుతుండగా ధర్నా చేస్తే తప్పేముందని, నిరసన తెలపడం పౌరుల రాజ్యాంగ హక్కని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ పోస్టుల్లో తప్పేముందని, హింస ఎక్కడ చెలరేగిందని..మీరసలు రాజ్యాంగాన్ని చదివారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సెక్షన్ 144 అమల్లో ఉన్నందున ముందస్తు అనుమతి అవసరమని ప్రాసిక్యూటర్ వాదిస్తుండగా ఏం అనుమతి కావాలని అంటూ పదేపదే సెక్షన్ 144 విధించడం వేధింపుల కిందకు వస్తుందని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసిందని చెప్పారు. ఆజాద్ హింసను ప్రేరేపించారనేందుకు ఆధారాలు చూపాలని న్యాయమూర్తి కోరగా ఇందుకు తమకు తగినంత సమయం ఇవ్వాలని ప్రాసిక్యూటర్ కోరగా విచారణ బుధవారానికి వాయిదా పడింది. -
‘పనికి బలవంతం చేయొద్దు’
న్యూఢిల్లీ: పిల్లల సంరక్షణలో ఉన్న మహిళను పనికి/ ఉద్యోగానికి వెళ్లమని బలవంతం చేయరాదని ఢిల్లీ కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. పిల్లల సంరక్షణ కోసం ఇస్తున్న రూ.10వేలను రూ.35వేలకు పెంచాలంటూ భార్యనుంచి విడిపోయిన ఓ భర్తను కోర్టు ఆదేశించింది. భర్త నుంచి విడిపోయిన భార్య పిల్లాడి సంరక్షణకోసం తనకు మంచి లాభదాయకమైన ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చిందని, ఆమెకు ఇచ్చే మెయింటెనెన్స్ను రూ.10,000 నుంచి రూ. 35,000కు పెంచి ఆ మొత్తాన్ని రెండు నెలల్లోగా పూర్తిగా చెల్లించాలని సదరు భర్తను ఆదేశించింది. పిల్లల సంరక్షణలో ఉన్న మహిళలను బలవంతంగా పనికి వెళ్లమని చెప్ప జాలరని, వారు రోజంతా పనిచేసే యంత్రాలు కాదని కోర్టు వ్యాఖ్యానించింది. -
సెంగార్కు జీవిత ఖైదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సెంగార్ తన తుది శ్వాస విడిచేవరకు జైలు జీవితం గడపాలని స్పష్టం చేసింది. ఢిల్లీ తీస్హజారీ కోర్టు జిల్లా న్యాయమూర్తి జస్టిస్ ధర్మేశ్ శర్మ శుక్రవారం తుది తీర్పు వెలువరించారు. నెల రోజుల్లోగా రూ.25 లక్షలు జరిమానా కూడా చెల్లించాలని సెంగార్ను ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం యూపీ ప్రభుత్వమే ఆ మొత్తాన్ని కట్టాలని చెప్పారు. నష్ట పరిహారం కింద అదనంగా రూ.10 లక్షలు ఉన్నావ్ బాధితురాలి తల్లికి అందజేయాలని తీర్పులో పేర్కొన్నారు. నిందితుడిపై కాస్త కరుణ చూపాలన్న సెంగార్ తరఫు లాయర్ వాదనలను తోసిపుచ్చారు. ఎమ్మెల్యేగా ఉంటూ సెంగార్ ప్రజల విశ్వాసాలను దెబ్బ తీశారని, ఈ కేసు తీవ్రతను తగ్గించి చూడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. బాధితురాలికి, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలకు హాని ఉందని, అందుకే వారి భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీబీఐని ఆదేశించారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా ఢిల్లీ మహిళా కమిషన్ పర్యవేక్షణలో ఏడాదిపాటు అద్దె ఇంట్లో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. నెలకు రూ.15 వేల అద్దెను యూపీ సర్కారే భరించాలని స్పష్టం చేశారు. బాధితురాలి సాక్ష్యానికి మించింది లేదు: న్యాయమూర్తి సమాజంలో పలుకుబడి కలిగి, శక్తిమంతమైన ఒక వ్యక్తిపై బాధితురాలు చెప్పిన మాటలకు మించిన సాక్ష్యం మరేదీ ఉండదని న్యాయమూర్తి తీర్పు సందర్భంగా చెప్పారు. ఈ కేసులో సహ నిందితురాలు శశి సింగ్ను నిర్దోషిగా ప్రకటించారు. ఆమె కూడా సెంగార్ బాధితురాలేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తీర్పు వెలువరించిన సమయంలో దోషి సెంగార్ కోర్టు హాలులోనే ఉన్నారు. న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష అనగానే ఆయన ఒక్కసారిగా భోరుమని విలపించారు. తన కుమార్తె, సోదరిని పట్టుకొని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. మైనర్లపై అత్యాచార నేరానికి గాను పోక్సో చట్టం కింద మరణ శిక్ష విధించాలి కానీ, ఈ నేరం జరిగిన 2017లో ఆ చట్టానికి సవరణలు జరగలేదు. అందుకే సెంగార్కు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఉరి శిక్ష విధించాల్సింది : బాధితురాలి సోదరి బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కులదీప్ సెంగార్కు ఉరి శిక్ష విధించి ఉంటే బాగుండేదని బాధితురాలి సోదరి అన్నారు. అప్పుడే తమ జీవితాలు భద్రంగా ఉండేవని ఆమె పేర్కొన్నారు. ‘సెంగార్కు ఉరిశిక్ష విధిస్తే మాకు న్యాయం జరిగేది. అతను జైల్లో ఉన్నప్పటికీ అనుక్షణం భయపడ్డాం. సెంగార్ జైలు నుంచి బయటకు వస్తే మమ్మల్ని బతకనివ్వడు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. నేరం జరిగిన సమాయానికి పోక్సో సవరణలు చేపట్టలేదు. దీంతో సెంగార్ మరణ శిక్ష నుంచి తప్పించుకున్నాడు. కిడ్నాప్, గ్యాంగ్రేప్, కస్టడీ డెత్.. ఉద్యోగం కోసం వెళ్లిన బాధితురాలిపై బీజేపీకి చెందిన ఎమ్మెల్యే సెంగార్ 2017 జూన్ 4వ తేదీన అత్యాచారానికి పాల్పడ్డాడు. సెంగార్ అనుచరులు ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్రేప్ చేశారు. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించు కోలేదు. 2018 ఏప్రిల్లో బాధితురాలి తండ్రిపై దాడి జరిగింది. దీంతో బాధితురాలు ముఖ్యమంత్రి నివాసం ఎదుటే ఆత్మాహుతికి యత్నించింది. అనంతరం బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలోనే చనిపోయాడు. ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సెంగార్ను సీబీఐ అరెస్ట్ చేíసినా బెదిరింపులు వస్తున్నాయంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బాధితురాలు లేఖ రాసింది. ఆ తర్వాత ఆమె ప్రయాణిస్తున్న కారుని ఒక లారీ ఢీకొంది. దీంతో సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించిన కేసులన్నిటి ఢిల్లీ కోర్టుకు మార్చాలని ఆదేశించింది. -
నేరానికి తగిన శిక్ష
అధికార మదంతో, తలపొగరుతో ఇష్టానుసారం చెలరేగే రాజకీయ నాయకుల వెన్నులో వణుకు పుట్టేలా ఉన్నావ్ అత్యాచార ఉదంతంలో బహిష్కృత బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సెంగార్కు ఢిల్లీ కోర్టు యావజ్జీవశిక్ష విధించింది. ఆయన తన శేష జీవితం మొత్తం జైల్లోనే గడపాలని, బాధితురాలికి రూ. 25 లక్షల జరిమానా చెల్లించాలని, మరో పది లక్షల రూపాయలు ఆమె తల్లికి ఇవ్వాలని శుక్రవారం తీర్పునిచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో రెండేళ్లక్రితం జరిగిన ఈ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా అలజడి రేపింది. చివరకు ఐక్యరాజ్యసమితి సైతం ఈ ఉదంతంపై ఆందోళన వ్యక్తం చేసి, నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఉన్నావ్ బాధితురాలు పడిన వెతలు అన్నీ ఇన్నీ కాదు. ఆమెను అపహరించి పదిరోజులపాటు అత్యాచారం చేయడం మాత్రమే కాదు... అదేమని ప్రశ్నించిన పాపానికి ఆ ఇంటిల్లిపాదినీ సెంగార్, ఆయన అనుచరగణం భయభ్రాంతులకు గురిచేశారు. వారికి పనులు దొరక్కుండా చేశారు. ఆ కుటుంబంతో మాట్లాడా లంటే భయపడేలా ఊరు మొత్తాన్ని శాసించారు. అతగాడిపై కేసు పెట్టాలంటూ బాధితురాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుండగా ఎప్పటికప్పుడు ఆమె కుటుంబసభ్యులను బెదిరించడం, దౌర్జన్యం చేయడం వారికి నిత్యకృత్యంగా మారింది. తనను అపహరించారని, సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారని బాధితురాలు ఫిర్యాదు చేస్తే పోలీసులు మాత్రం అపహరించడం(ఐపీసీ సెక్షన్ 363), బలవంతంగా పెళ్లాడేందుకు ప్రయత్నించడం(ఐపీసీ 366) వంటి ఆరోపణలు మాత్రమే ఎఫ్ఐఆర్లో రాశారు. సెంగార్ సోదరుడు బాధితురాలి తండ్రిని తీవ్రంగా కొట్టి గాయపరిచినప్పుడు పోలీసులు ఆయన్ను ఆసుపత్రికి తరలించకుండా పోలీస్ లాకప్లో ఉంచారు. ఆలస్యంగా వైద్య చికిత్స అంద డంతో ఆయన రెండురోజులు నరకం అనుభవించి కన్నుమూశాడు. ఇక తానూ, తన కుటుంబం ఏకాకులమని, ఎవరి ఆసరా తమకు లభించే అవకాశం లేదని నిర్ధారణయ్యాక బాధితురాలు ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసగృహం సమీపంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. సెంగార్ సోదరుడు, మరికొందరు ఆమె తండ్రిపై దౌర్జన్యం చేయడం, నెత్తురు ముద్దలా మారిన ఆ వృద్ధుణ్ణి స్టేషన్లో కూర్చోబెట్టి పోలీసులు తాపీగా ప్రశ్నించడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాలకెక్కి అల్లరై జనం ఛీ కొట్టాకగానీ ఎమ్మెల్యే సోదరుణ్ణి అరెస్టు చేయలేదు. అటు తర్వాత ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పజెప్పింది. ఆ తర్వాతే కులదీప్ సెంగార్ను అరెస్టు చేశారు. ఈలోగా బాధితురాలి బాబాయ్పై తప్పుడు కేసులుపెట్టి జైలుకు పంపారు. ఉన్నావ్ ఉదంతం మన దేశంలో రాజ్యాంగమూ, చట్టమూ ఉన్నాయా అన్న సందేహాన్ని కలిగించింది. ఉన్నావ్ బాధితురాలు ఆ ఉదంతం జరిగేనాటికి మైనర్. 2012లో వచ్చిన పోక్సో చట్టం కఠినమైనది. మొన్న జూలైలో సవరణలు చేసి దాన్ని మరింత కఠినంగా మార్చి నేరగాళ్లకు ఉరిశిక్ష పడే నిబంధన తీసుకొచ్చారు. కానీ 2017లో ఆ చట్టం బాధితురాలికి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఆ చట్టం ఉన్నా అది తమకు తెలియనట్టు, అసలు లేనట్టు పోలీసులు ప్రవర్తించారు. మన దగ్గరున్న సమస్య అదే. నేరగాళ్లు సాధారణ వ్యక్తులైతే ఒకలా, రాజకీయ పలుకుబడి గలవారైతే మరోలా వ్యవహరిస్తుండటం రివాజుగా మారింది. ఉన్నావ్లో అది పరాకాష్టకు చేరింది. మొన్న జూలైలో న్యాయస్థానంలో జరిగే విచారణలో పాల్గొనడానికి బాధితురాలి కుటుంబం కారులో వెళ్తుండగా ఒక ట్రక్కు దాన్ని ఢీకొట్టింది. ఇందులో ఆమె పిన్ని, మేనత్త మరణించారు. బాధితురాలు, న్యాయవాది గాయపడ్డారు. ఈ ఉదంతం తర్వాత బాధితురాలు నేరుగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి రంజన్ గొగోయ్కి లేఖ రాశాక ఆయన జోక్యం చేసుకుని ఇందుకు సంబంధించిన కేసుల న్నిటినీ లక్నో న్యాయస్థానం నుంచి ఢిల్లీకి మార్చారు. రోజువారీ విచారించాలని, 45 రోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించారు. అటు తర్వాతే బీజేపీ సెంగార్ను పార్టీ నుంచి బహిష్కరించింది. నేరారోపణలొచ్చిన వ్యక్తి అధికార పక్ష నాయకుడైతే అధికార యంత్రాంగాన్ని కదిలించడం ఎంత కష్టమో, ఎంత ప్రాణాంతకమో ఉన్నావ్ బాధితురాలు, ఆమె కుటుంబం పడిన కష్టాలు గమనిస్తే బోధపడుతుంది. సెంగార్ ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నిటిలోనూ పనిచేశాడు. ఎక్కడున్నా ఆయనపై ఆరోపణలు తరచు వస్తూనే ఉన్నాయి. బీజేపీలో చేరకముందు ఆయన బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీల్లో పనిచేశాడు. కానీ ఆయన ఓట్లు సాధించిపెట్టే బలమైన నాయకుడు గనుక ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన అరాచకాలపై ఎవరూ నోరెత్తలేదు. దేశంలో, మరీ ముఖ్యంగా ఉత్తరా దిలో ఇలాంటివారే నాయకులుగా చలామణి అవుతున్నారు. ఉన్నావ్ బాధితురాలు రెండేళ్లపాటు ఒంటరి పోరు చేయాల్సి రావడం ఇందువల్లే. నేరం జరిగినప్పుడు వెంటవెంటనే వ్యవస్థలు కదలకపోయినా, ఆ నేరానికి తగిన శిక్ష పడకపోయినా సమాజంలో మరింతమంది నేరగాళ్లు పుట్టుకొస్తారు. ఏం చేసినా తమకేమీ కాదన్న ధైర్యంతో బరితెగిస్తారు. కనుక చట్టాలు కఠినంగా ఉండటం మాత్రమే సరిపోదు. అవి సత్వరం రంగంలోకి దిగాలి. అప్పుడే అందరిలోనూ చట్టాలంటే భయం ఏర్పడుతుంది. నిర్భయ ఉదంతం జరిగాక నియమించిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ ఒక విలువైన మాట చెప్పింది. సమాజంలో నేరాలు అధికంగా అణగారిన వర్గాలు, మహిళలు, పిల్లలపైనే జరుగుతాయని, అందువల్ల వారి రక్షణకు ఉద్దేశించిన విభాగాలు ఎలా పనిచేస్తున్నాయో ఎప్పటి కప్పుడు తనిఖీలు నిర్వహిస్తుండాలని ఆ కమిటీ తెలిపింది. ఏ అధికారి అయినా, కింది స్థాయి సిబ్బంది అయినా అలసత్వం ప్రదర్శిస్తున్నట్టు తేలితే తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని సూచిం చింది. ఉన్నావ్ ఉదంతం దేశంలోని అన్ని ప్రభుత్వాలకూ గుణపాఠం కావాలి. చట్టాలు సమర్థ వంతంగా పనిచేసేలా, వ్యవస్థలు సత్వరం కదిలేలా తీర్చిదిద్దాలి. అప్పుడు మాత్రమే చట్టాలంటే భయభక్తులు ఏర్పడతాయి. -
ఉన్నావ్ కేసు: కుల్దీప్ సింగ్కు జీవితఖైదు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీ తీస్హజారీ కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో ఇప్పటికే దోషిగా తేలిన కుల్దీప్ సింగ్ సెంగార్కు న్యాయస్థానం జీవితఖైదు శిక్షను విధించింది. బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేసును విచారించిన ధర్మాసనం శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని కుల్దీప్ సింగ్ సెంగార్పై ఓ మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం నమోదైన ఈ కేసుకు సంబంధించి రహస్య విచారణ చేపట్టారు. సీబీఐ వాదనలు పూర్తయిన తర్వాత ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్దీప్సింగ్ సెంగార్ను ఈ నెల 16న దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పును వెలువరించింది. అత్యాచారం (376) కింద ఆయనను దోషిగా కోర్టు నిర్థారించింది. బాలిక కిడ్నాప్.. అత్యాచారం.. బాధితురాలి తండ్రి లాకప్ మరణం.. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం.. వంటి మలుపులతో రెండేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో ఎట్టకేలకు బాధితురాలికి న్యాయం జరిగింది. (సెంగార్కు ఉరే సరి) కాగా అభియోగాల నమోదుకు సుమారు పది రోజుల ముందు అత్యాచార బాధితురాలు ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఈ ఏడాది జూలై 28న బాధితురాలు, ఆమె బంధువులు, న్యాయవాది ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలు గాయపడగా, ఆమె బంధువులిద్దరూ మరణించారు. న్యాయవాది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇది సాధారణ ప్రమాదం కాదనీ, తనను అంతం చేసే ప్రయత్నంలో భాగంగానే జరిగిందని బాధితురాలు అప్పట్లో ఆరోపించింది. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్కి బాధితురాలు ఈ పరిణామాలపై లేఖ రాసింది. దీంతో ఆయన స్పందించి ఇందుకు సంబంధించిన అన్ని కేసులను లక్నో నుంచి ఆగస్టు 1వ తేదీన ఢిల్లీకి బదిలీ చేశారు. రోజువారీ విచారణ జరిపి 45 రోజుల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. (‘ఉన్నావ్’ దోషి ఎమ్మెల్యేనే) సుప్రీంకోర్టు జోక్యంతో ఆగస్టు నుంచి రోజువారీ విచారణ చేపట్టింది. ఐపీసీ సెక్షన్ 120 బి (నేరపూరిత కుట్ర), 363 (కిడ్నాపింగ్), 366 (కిడ్నాప్, వివాహం చేసుకోవాలంటూ బలవంతం చేయడం), 376 (అత్యాచారం), పోక్సో చట్టంలోని ఇతర సెక్షన్ల కింద సెంగార్పై పోలీసులు కేసులు పెట్టారు. కాగా బీజేపీకి చెందిన కుల్దీప్ సింగ్ ఉన్నావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నాడు. -
ఆ రేప్ కేసులో తండ్రీకొడుకులు నిర్దోషులు
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో నాలుగేళ్ల క్రితం జరిగిన ఒక అత్యాచారం కేసులో ఓ తండ్రి, కొడుకులను నిర్దోషులుగా ప్రకటించిన సంఘటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాధితురాలు నిందితుల కూతురు, సోదరి కావడం గమనార్హం. వివరాలు.. ఇలా ఉన్నాయి. సుమారు 10 మంది కుటుంబ సభ్యులతో ఒకే గది ఉన్న ఇంట్లో బాధితురాలు నివాసం ఉంటోంది. ఇందులోనే ఓ చిన్న కిరాణా కొట్టు కూడా నడుపుతున్నారు. 2015 ప్రాంతంలో తనకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి, సోదరుడు కొన్ని నెలలపాటు అత్యాచారం చేశారని, విషయం ఇతరులకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ అంశంపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఆలస్యంగా దాఖలు చేయడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఈ కేసులో విచారణ చేపట్టిన ఢిల్లీ అదనపు సెషన్స్ కోర్టు మూడు కారణాలను చూపి ఫిర్యాదు చేసిన యువతి తండ్రి, సోదరుడిని నిర్దోషులుగా విడిచిపెట్టింది. ఎఫ్ఐఆర్ ఆలస్యంగా దాఖలు కావడం ఒక కారణమైతే, కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యాచారం జరగడం అసంభవమని కోర్టు అంచనాకు రెండో కారణం. విచారణ సమయంలో బాధితురాలు వేర్వేరు తేదీలు, నెలల పేర్లు చెప్పిందని, పైగా ఇతర కుటుంబ సభ్యులెవరూ బాధితురాలి పక్షాన విచారణలో పాల్గొనకపోవడాన్ని బట్టి కూడా ఆ యువతి చెప్పేది నిజం కాకపోవచ్చునని కోర్టు భావించింది. ఆ యువతి అప్పుడప్పుడూ కిరాణా కొట్లో వ్యాపారం చేసేదని, తనను బయట ఎక్కడకూ పంపేవారు కాదన్న బాధితురాలి వాంగ్మూలానికి ఇది భిన్నమని కోర్టు చెప్పింది. కొనుగోళ్ల కోసం వచ్చిన వాళ్ల (ఎక్కువగా ఇరుగుపొరుగు కావచ్చు)కు చెప్పుకున్నా ఎవరో ఒకరు సాయపడి ఉండేవారని కోర్టు పేర్కొంది. -
ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరానికి ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో చిదంబరంను నవంబర్ 13 వరకూ జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది. మరోవైపు చిదంబరం రిమాండ్ను మరొక రోజు పొడిగించాలన్న ఈడీ వినతిని కోర్టు తోసిపుచ్చింది. కాగా చిదంబరంను ఈనెల 30 వరకూ ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఈనెల 24న కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. చిదంబరం కస్టడీ సమయంలో రెండు సార్లు ఆస్పత్రిలో చేరిన క్రమంలో విచారణ అసంపూర్తిగా సాగిందని, ఆయనను మరో రోజు తమ కస్టడీకి అప్పగించాలన్న ఈడీ వినతిని కోర్టు తోసిపుచ్చింది. ఇదే కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న చిదంబరానికి బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. -
చిదంబరంపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం తదితరులపై ఢిల్లీ కోర్టులో సీబీఐ చార్జిషీటు వేసింది. శుక్రవారం ప్రత్యేక కోర్టు జడ్జి లాల్ సింగ్కు దీనిని సమర్పించింది. ఈ చార్జిషీటులో పీటర్ ముఖర్జీ, చార్టెర్డ్ అకౌంటెంట్ ఎస్.భాస్కరరామన్, నీతి ఆయోగ్ మాజీ సీఈవో సింధుశ్రీ ఖుల్లర్, మాజీ ఉన్నతాధికారులు అనుప్ కె.పుజారి, ప్రబోధ్ సక్సేనా, రవీంద్ర ప్రసాద్లతోపాటు ఐఎన్ఎక్స్ మీడియా, ఏఎస్సీఎల్ అండ్ చెస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంస్థల పేర్లున్నాయి. అప్రూవర్గా మారిన మరో నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ పేరు కూడా ఇందులో ఉంది. వీరిపై అవినీతి నిరోధక చట్టం, భారతీయ శిక్షాస్మృతి కింద పలు అభియోగాలు మోపింది. కాగా, ఇదే కేసులో చిదంబరం పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. -
మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో అరెస్ట్ అయ్యి నెల రోజులకు పైగా (సెప్టెంబరు 5) తీహార్ జైల్లో గడుపుతున్న చిదంబరానికి బెయిల్ విషయంలో ఢిల్లీ సీబిఐ కోర్టులో ఊరట లభించలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆయనను రేపు (బుధవారం) ఈడీ అధికారులు అరెస్ట్ చేయనున్నారు. తీహార్ జైల్లో ప్రశ్నించిన అనంతరం ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఈడీకి ఢిల్లీ కోర్టు అనుమతిని మంజూరు చేసింది. ఒక వైపు సిబిఐ, ఇంకో వైపు ఈడీ ఇలా వరుస కేసులతో చిదంబరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే తాజాగా స్పెషల్ కోర్టు ఆదేశాలతో చిదంబరానికి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. -
అక్టోబర్ 17 వరకూ చిదంబరం కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు అక్టోబర్ 17 వరకూ పొడిగించింది. జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోరుతూ దర్యాప్తు సంస్థ సీబీఐ అప్పీల్ చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంను ఆగస్ట్ 21న సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంద్రాణి ముఖర్జి, పీటర్ ముఖర్జియాలు అప్రూవర్గా మారిన ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తి చిదంబరంపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. కాగా ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్య కేసులో ప్రస్తుతం పీటర్, ఇంద్రాణిలు ముంబై జైలులో ఉన్నారు. ఇక ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంపై ఈడీ సైతం 2017లో మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. మరోవైపు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్ను కోరుతూ సుప్రీం కోర్టులో గురువారం చిదంబరం తాజాగా అప్పీల్ చేశారు. ఈ బెయిల్ పిటిషన్ను తక్షణమే విచారించాలని చిదంబరం తరపు న్యాయవాది సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజీవ్ ఖన్నా,జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన సుప్రీం బెంచ్ను కోరారు. -
మధ్యవేలు చూపించి జైలుపాలయ్యాడు
ఢిల్లీ : ఎదుటివారిని అవహేళన చేస్తూ మధ్య వేలును చూపించటమనేది పాశ్చాత్య దేశాల్లో కనిపించేదే. బండ బూతే అయినప్పటికీ ఆ సైగను అక్కడి ప్రజలు అంతగా పట్టించుకోరు కూడా. కానీ, మన దేశంలో అలా చేయడం నేరమని తీర్పునిచ్చింది ఢిల్లీ కోర్టు. ఓ మహిళకు మధ్యవేలు చూపించి జైలు శిక్షకు గురయ్యాడు ఓ ఢిల్లీ వ్యక్తి. 2014లో నమోదైన ఈ కేసుపై పలు వాదనల తర్వాత ఢిల్లీ కోర్టు ఇటీవల తీర్పు వెలువడించింది. బాధిత మహిళ తనకు బావ వరసయ్యే వ్యక్తి మధ్య వేలు చూపించడమే కాకుండా అసభ్యకరంగా ముఖ కవలికలు చూపించి చెంపమీద కొట్టాడని 2014లో కేసు పెట్టారు. పోలీసులు నిందితునిపై సెక్షన్ 509, 323ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనిపై కోర్టు 2015 అక్టోబరు 8నాటికే తీర్పు వెలువరించింది. అయినప్పటికీ నిందితుడు తనపై మోపిన అభియోగం సరైంది కాదంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. ఆమెతో ఆస్తి విభేదాలు ఉండడంతో ఇలాంటి నిందలు వేస్తుందని అతను ఆరోపించాడు. ఢిల్లీ కోర్టు నిందితుడి చర్యలను హెచ్చరిస్తూ.. మహిళ మర్యాదకు భంగం కలిగించాడని తీర్పునిచ్చింది. నిందితుడికి జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. -
చిదంబరానికి ఢిల్లీ కోర్టు షాక్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం(73)కు మరోసారి షాక్ తగిలింది. తీహార్ జైలు నుంచి బయటపడేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను ఢిల్లీలోని ఓ కోర్టు తిరస్కరించింది. ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీకి అప్పగించాలని చిదంబరం శుక్రవారం ఓ న్యాయస్థానంలో సరెండర్ పిటిషన్ దాఖలుచేశారు. దీంతో చిదంబరం దాఖలుచేసిన సరెండర్ పిటిషన్ను విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ దాన్ని తోసిపుచ్చారు. ఈ సందర్భంగా ఈడీ అధికారుల తీరుపై చిదంబరం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తీవ్రంగా మండిపడ్డారు. చిదంబరాన్ని మరింత వేధించేలా ఈడీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో సీబీఐ న్యాయస్థానం చిదంబరాన్ని సెప్టెంబర్ 19 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. సరైన సమయంలో అరెస్ట్ చేస్తాం: ఈడీ ఈ కేసు విచారణ సందర్భంగా ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించి సీబీఐ నమోదుచేసిన అవినీతి కేసులో చిదంబరం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని తెలిపారు. ‘చిదంబరం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఆయన ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేయలేరు. చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకుని విచారించేముందు కొన్ని అంశాల్లో మేం దర్యాప్తును పూర్తిచేయాల్సి ఉంది. కనీసం ఆరుగురు వ్యక్తులను విచారించాకే మేం చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకోగలం. ఎందుకంటే ఈ అక్రమ నగదు చెలామణి కేసు దేశాన్ని దాటి విస్తరించింది. ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో చిదంబరం అరెస్ట్ తప్పనిసరి. దాన్ని మేం సరైన సమయంలో చేపడతాం. తనను కస్టడీలోకి తీసుకోవాలని ఓ నిందితుడు విచారణ సంస్థను ఆదేశించలేడు. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం విచారణ సంస్థదే. మేం చిదంబరాన్ని అరెస్ట్ చేశాక, అప్పటివరకూ సేకరించిన ఆధారాల్ని ఆయనముందు పెడతాం’ అని చెప్పారు. చిదంబరాన్ని వేధించాలనే: సిబల్ ఈ ఏడాది ఆగస్ట్ 20–21 తేదీల మధ్య చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు ఈడీ అధికారులు ఆయన ఇంటికి వచ్చారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. ‘కానీ ఇప్పుడు ఈడీ అధికారులు చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఆయన మరింతకాలం జ్యుడీషియల్ కస్టడీలోనే కొనసాగేలా, బాధపెట్టేలా ఈడీ అధికారులు దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారు’ అని సిబల్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, చిదంబరం దాఖలుచేసిన సరెండర్ పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ నేతను ఎప్పుడు అరెస్ట్ చేయాలన్నది ఈడీ విచక్షణాధికారానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ.305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఈ సందర్భంగా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) నుంచి అనుమతుల కోసం భారీగా ముడుపులు చేతులుమారాయని సీబీఐ కేసు నమోదుచేసింది. -
మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి బెయిల్
-
శివకుమార్కు 13 వరకు కస్టడీ
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కర్ణాటక సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ను సెప్టెంబర్ 13 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం రాత్రి అరెస్టు చేసిన శివకుమార్ను 14 రోజుల కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరిన నేపథ్యంలో ప్రత్యేక జడ్జి ఈ ఉత్తర్వులిచ్చారు. బుధవారం రామ్మనోహర్ లోహియా ఆస్పత్రిలో పరీక్షల అనంతరం శివకుమార్ను ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరిచారు. శివకుమార్ తరఫున వాదిస్తున్న న్యాయవాదులు అభిషేక్మను సింఘ్వీ, దయన్ కృష్ణన్ వాదనలు వినిపిస్తూ శివకుమార్ అరెస్టు అన్యాయం అనీ, అతను పరారవుతాడన్న ఈడీ అనుమానాలు నిరాధారమని వాదించారు. శివకుమార్ను ఈడీ అరెస్టు చేసినందుకు నిరసనగా బుధవారం కర్ణాటక, ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను ఢిల్లీలోని యువజన కాంగ్రెస్ కార్యాలయం బయట దహనం చేశారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ నిరసనలు నిర్వహించింది. ఐదారు బస్సులపై రాళ్ల దాడి జరిగిందని, కనకపుర, బెంగళూరులో బస్సులను తగలబెట్టడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. -
సానా సతీష్కు మరో వారం కస్టడీ
-
రాబర్డ్ వాద్రాకి ఊరట
-
శశిథరూర్కు ఢిల్లీ కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత శశిథరూర్కు ఢిల్లీ కోర్టు ఒకటి సమన్లు జారీ చేసింది. జూన్ 7న కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. పేరు తెలియని ఆర్ఎస్ఎస్ నేత ఒకరు ప్రధాని మోదీని శివలింగంపై కూర్చున్న తేలుతో పోల్చారంటూ థరూర్ గత అక్టోబర్లో చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ బీజేపీ నేత రాజీవ్ బబ్బర్ ఫిర్యాదు చేశారు. ‘థరూర్ వ్యాఖ్యలు నాతో పాటు దేశంలోను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివభక్తుల విశ్వాసాలను గాయపరిచాయి. ఇది సహించరాని దూషణ. లక్షలాది మంది ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా అపఖ్యాతి పాలుచేయడమే..’ అని బబ్బర్ పేర్కొన్నారు. పరువు నష్టానికి సంబంధించిన సెక్షన్ల కింద ఫిర్యాదు దాఖలు చేశారు. శనివారం ఈ ఫిర్యాదును విచారించిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ విశాల్ సమన్లు జారీ చేశారు. -
ఆ ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారు?
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలంటూ దాఖలైన ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది. సైనికుల రక్తం చాటున మోదీ దాక్కున్నారని, వారి త్యాగాలను స్వార్థానికి వాడుకుంటున్నారంటూ 2016లో ఓ కార్యక్రమంలో రాహుల్ వ్యాఖ్యానించారంటూ లాయర్ జోగిందర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు గాను రాహుల్పై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. -
చార్జిషీటు లీకేజీపై విచారణ
న్యూఢిల్లీ: రూ.3,600 కోట్ల అగస్టావెస్ట్ల్యాండ్ కుంభకోణం చార్జిషీటు వివరాలు బయటకు వెల్లడి కావడంపై దర్యాప్తు చేయించాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఈ కేసులో అరెస్టయిన మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా, చార్జిషీటులోని వివరాలను ఎలా సంపాదించారో తెలపాలంటూ సదరు వార్తా సంస్థను ఆదేశించాలని ఈడీ.. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయాలని చూస్తున్న ఈడీపై విచారణ జరపాలంటూ క్రిస్టియన్ మిషెల్ పిటిషన్లు వేశారు. ‘కోర్టుకు సమర్పించిన సప్లిమెంటరీ చార్జిషీటు ప్రతులను ఈ కేసులోని నిందితులకు మేం ఇంకా ఇవ్వనేలేదు. అయినా అందులో ఏముందో మిషెల్ లాయర్లకు తెలిసింది. ఆ ప్రకారమే వారు పిటిషన్ వేశారు. దీనిని చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. చార్జిషీటు వివరాలు వెల్లడిపై దర్యాప్తు జరగాలి’ అని ఈడీ వాదించింది. తమ క్లయింట్కు చార్జిషీటు కాపీని ఇవ్వకమునుపే ఈడీ మీడియాకు లీక్ చేసిందని మిషెల్ లాయర్ ఆరోపించారు. కోర్టు ప్రత్యేక జడ్జి ఈ వ్యవహారంపై 11న విచారిస్తామన్నారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సప్లిమెంటరీ చార్జిషీటు ప్రతిని సీల్డు కవర్లో భద్రపరచాలని ఈడీని ఆదేశించారు. హెలికాప్టర్ల కొనుగోలు కోసం అప్పటి కేంద్రప్రభుత్వం, అగస్టావెస్ట్ల్యాండ్ల మధ్య 2010నాటి ఒప్పందం వల్ల ఖజానాకు రూ.2,666 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ గతంలో తెలిపింది. -
రాహుల్గాంధీ బావకు ఊరట
న్యూఢిల్లీ: లండన్లో ఆస్తుల కొనుగోలు కేసులో నగదు అక్రమ రవాణాకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా తాత్కాలిక బెయిల్ను ఢిల్లీ కోర్టు గురువారం పొడిగించింది. ఈ కేసులో ఇప్పటికే మార్చి 27 వరకు రాబర్ట్ వాద్రాకు తాత్కాలిక బెయిల్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు తాజాగా ఏప్రిల్ 1వ తేదీ వరకు బెయిల్ పొడిగింపునకు అనుమతిని ఇచ్చింది. అప్పటివరకు వాద్రాను అరెస్ట్ చేయరాదని దర్యాప్తు సంస్థకు ఈ సందర్భంగా కోర్టు సూచించింది. గురువారం ఈ కేసులో వాదనలు జరిగాయి. ఇంటరాగేషన్ కోసం రాబర్ట్ వాద్రాను అప్పగించాలని ప్రత్యేక న్యాయమూర్తి అర్వింద్ కుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోరింది. అయితే వాద్రా తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి వాదనలు వినిపిస్తూ, వాద్రాపై వచ్చినవి నిరాధార ఆరోపణలని, కోర్టు మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్ను ఆయన దుర్వినియోగం చేయలేదని న్యాయమూర్తికి వివరించారు. -
ఈడీ దర్యాప్తుపై స్టే కుదరదు..
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొం టున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణపై స్టే విధించాలన్న వాద్రా పిటిషన్ను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. మంగళవారం జరగనున్న ఈడీ విచారణకు హాజరుకావాలని వాద్రాను ఆదేశించింది. ఇక గతేడాది వాద్రా ఆఫీసుల్లో నిర్వహించిన దాడుల్లో సేకరించిన డాక్యుమెంట్ల హార్డ్కాపీలను వాద్రాకు అందించాలని సీబీఐ ప్రత్యేక జడ్జి అరవింద్ కుమార్ ఈడీని ఆదేశించారు. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేశారు. గతేడాది డిసెంబర్ 7న ఢిల్లీలో ఉన్న వాద్రా ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించిన ఈడీ పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. వీటి ఆధారంగా ప్రస్తుతం తనను విచారిస్తోందని.. ఈ డాక్యుమెంట్ల కాపీలను తనకు అందించాలని కోరుతూ వాద్రా కోర్టును ఆశ్ర యించారు. డాక్యుమెం ట్ల కాపీలు తనకు ఇచ్చేవరకు విచారణ ఆపేయాల్సిందిగా ఈడీని ఆదేశించాలని వాద్రా తన పిటిషన్లో కోరారు. తొందరేముంది.. వస్తా ప్రస్తుతం తనపై ఉన్న కేసులన్నీ పూర్తయిన తర్వాత రాజకీయాల్లోకి వస్తానని వాద్రా అన్నారు. సోమవారం ఆయన ఈ మేరకు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. వాద్రా రాజకీయాల్లోకి వస్తున్నారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘రాజకీయాల్లోకి వస్తా. ప్రజా సేవ చేస్తా. తొందరేముంది. తొలుత నాపై ఉన్న నిరాధార ఆరోపణలన్నీ తొలగిపోవాల్సి ఉంది. అలాగే నేను మార్పు తీసుకురాగలనని ప్రజలు కూడా నమ్మాలి’ అని పేర్కొన్నారు. -
21న సునందా పుష్కర్ హత్య కేసు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసును ఢిల్లీలోని సెషన్స్ కోర్టు ఈనెల 21న విచారించనుంది. సునందా పుష్కర్ హత్య కేసులో ఆమె భర్త శశి థరూర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సునందా పుష్కర్ కేసును అంతకుముందు అదనపు చీఫ్ మెట్రపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సెషన్స్ కోర్టుకు బదలాయించింది. కాగా,ఈ కేసులో విజిలెన్స్ నివేదికను పదిలపరచాలని ఢిల్లీ పోలీసులను సెషన్స్ కోర్టు ఆదేశించింది. కాగా, ఈ కేసులో న్యాయస్ధానానికి సహకరించేందుకు అనుమతించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అప్పీల్ను కోర్టు తోసిపుచ్చింది. కాగా సునంద పుష్కర్ కేసును దర్యాప్తు చేసిన సిట్ శశిథరూర్పై హత్యారోపణలు చేయలేదు. భార్య సునందా పుష్కర్ను శశిథరూర్ నిత్యం వేధింపులకు గురిచేయడం ఆమె మరణానికి దారితీసిందని చార్జ్షీట్లో సిట్ పేర్కొంది. -
రాబర్ట్ వాద్రాకు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ బావ రాబర్ట్ వాద్రాకు ఢిల్లీలోని ఓ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఈ నెల 6వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరై విచారణకు సహకరించాలని సూచించింది. లండన్లోని రూ.17.77 కోట్ల విలువ చేసే ఆస్తులను మనీలాండరింగ్ ద్వారానే వాద్రా సమకూర్చున్నారంటూ ఈడీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వాద్రా తన న్యాయవాది ద్వారా మధ్యంతర బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ‘వాద్రా తన తల్లికి చికిత్స చేయించేందుకు లండన్ వెళ్లారు. 6న ఇక్కడికి వచ్చిన తర్వాత ఈడీ ఎదుట హాజరవుతారు’ అని వాద్రా తరఫు లాయర్ చెప్పారు. దీంతో కోర్టు వాద్రాకు బెయిలు మంజూరు చేసింది. ఇందుకోసం, రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుతోపాటు అంతే సమానమైన జామీను సమర్పించాలని ఆదేశించింది. -
అనుమతుల్లేకుండా చార్జిషీటా?
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ఆమోదం లేకుండా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, ఇతరులపై చార్జిషీట్ దాఖలు చేయడంపై ఢిల్లీ కోర్టు పోలీసులను తప్పుబట్టింది. ‘ఆమోదం లేకుండా ఎలా మీరు చార్జిషీట్ దాఖలు చేశారు. మీకు న్యాయ సలహాలు ఇచ్చే శాఖ లేదా’ అని పోలీసులను ప్రశ్నించింది. దీనిపై పోలీసులు సమాధానమిస్తూ.. మరో 10 రోజుల్లో ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో అనుమతి తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దీపక్ షెరావత్ ఫిబ్రవరి 6వ తేదీ వరకు పోలీసులకు గడువు ఇచ్చారు. కన్హయ్య కుమార్ 2016 ఫిబ్రవరిలో జేఎన్యూలో దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారంటూ ఢిల్లీ పోలీసులు జనవరి 14న చార్జిషీట్ దాఖలు చేశారు. -
ఎవరీ మైకేల్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: అగస్టా కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మధ్యవర్తి, బ్రిటిషర్ క్రిస్టియన్ మైకేల్ను ఢిల్లీలోని ఓ కోర్టు ఐదు రోజుల పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కస్టడీకి అప్పగించింది. భారత్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రక్షణ మంత్రి సహా పలువురు వీవీఐపీల కోసం రూ.3,600 కోట్లతో 12 విలాసవంతమైన హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో మైకేల్ను సీబీఐ అధికారులు నిన్న రాత్రి యూఏఈ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన్ను గట్టి భద్రత నడుమ ఢిల్లీలోని కోర్టు ముందు సీబీఐ అధికారులు హాజరుపర్చారు. అగస్టా కుంభకోణంలో లోతైన కుట్ర దాగుందనీ, ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల పాత్రపై దర్యాప్తు జరపడానికి వీలుగా 14 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ న్యాయవాది డీపీ సింగ్ కోరారు. దీంతో సీబీఐ ప్రత్యేక జడ్జి.. మైకేల్ను 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించారు. అగస్టా ఒప్పందంలో భాగంగా మైకేల్ రూ.225 కోట్లు అందుకున్నారనీ, ఈ మొత్తాన్ని ప్రభుత్వ పెద్దలు, ఐఏఎఫ్ అధికారులకు లంచంగా చెల్లించారని సీబీఐ చార్జిషీటులో తెలిపింది. అలాగే మైకేల్ కంపెనీ గ్లోబల్ సర్వీసెస్ ద్వారా ఢిల్లీలోని ఓ మీడియా సంస్థలోకి నగదు వచ్చిన విషయాన్ని తాము గుర్తించినట్లు ఈడీ వెల్లడించింది. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం ముదిరింది. మైకేల్పై తప్పుడు వాంగ్మూలం ఇప్పించి ప్రతిపక్ష నేతలపై బురద చల్లేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అగస్టా కుంభకోణంలో మధ్యవర్తిగా ఉన్న మైకేల్ను కాపాడాలనుకుంటోందా? అని బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రశ్నించారు. కాంగ్రెస్కు ఇబ్బంది తప్పదా! మైకేల్ను విచారించడం ద్వారా అగస్టా కుంభకోణంలో కాంగ్రెస్ నేతల పాత్రపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయనీ, తద్వారా కాంగ్రెస్ను రాజకీయంగా ఇరుకునపెట్టాలని కేంద్రం భావిస్తోంది. విజయ్ మాల్యా, నీరవ్మోదీ వంటి ఆర్థిక నేరస్తులను వెనక్కి రప్పించడంలో బీజేపీ సర్కారు విఫలమయిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టేందుకు మైకేల్ను బీజేపీ ఆయుధంగా ఉపయోగించుకుంటుందని పరిశీలకులు అంటున్నారు. ఈ ఒప్పందం కుదరాలంటే సోనియాగాంధీని ప్రసన్నం చేసుకోవాలంటూ 2008లో అప్పటి అగస్టా కంపెనీ భారత్ విభాగం చీఫ్ పీటర్ హ్యూలెట్కు రాసిన లేఖలో మైకేల్ సూచించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ అధికారులు ఇప్పటికే మైకేల్ డైరీని సంపాదించారు. అగస్టా ఒప్పందం కోసం ఎవరెవరికి ఎంత ముడుపులు ఇచ్చింది మైకేల్ తన డైరీలో కోడ్ భాషలో రాసుకున్నారు. కాగా, అగస్టా కుంభకోణానికి సోనియాకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. కేంద్రం ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు ఒత్తిడి చేసి మైకేల్ చేత బలవంతపు వాంగ్మూలం ఇప్పించారని ఆరోపించింది. సల్వార్కమీజ్లో పారిపోయేందుకు యత్నం! భారత అధికారులకు దొరక్కుండా ఉండేందుకు మైకేల్ చాలా వ్యూహాలు రచించాడు. తొలుత దుబయ్ పోలీసులు తనను అరెస్ట్ చేయగానే తాను బ్రిటన్ పౌరుడ్ని అయినందున భారత్కు అప్పగించడం కుదరదని వాదించారు. వెంటనే అప్రమత్తమైన జాతీయభద్రతా సలహాదారు అజిత్ దోవల్ మైకేల్ చేజారిపోకుండా ఏడాది క్రితం సీబీఐ, నిఘా సంస్థ ‘రా’ అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటుచేశారు. సెప్టెంబర్లో దుబయ్లోని కోర్టు ఆయనకు ఇచ్చిన బెయిల్ను రద్దుచేసింది. దీంతో సల్వార్ కమీజ్, టోపీ ధరించి మారువేషంలో పారిపోయేందుకు మైకేల్ యత్నించగా భారత నిఘావర్గాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అయన్ను పట్టుకున్నారు. దౌత్యమార్గంలోనూ ఒత్తిడి పెంచడంతో యూఏఈ మైకేల్ను భారత్కు అప్పగించింది. ఎవరీ మైకేల్? బ్రిటన్ పౌరుడైన మైకేల్ వెస్ట్ల్యాండ్ కంపెనీకి కన్సల్టెంట్గా పని చేస్తున్నారు. భారత్ నుంచి అగస్టాకు కాంట్రాక్టులు సాధించిపెట్టడమే మైకేల్ పని. మైకేల్ తండ్రి వోల్ఫ్గంగ్ మైకేల్ సైతం 1980లలో వెస్ట్ల్యాండ్ కంపెనీకి ఇండియాలో కన్సల్టెంట్గా చేశారు. ఆయన మూడు కంపెనీలు నిర్వహించారు. తరచూ భారత్లో పర్యటించే మైకేల్కు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో స్నేహం ఏర్పడింది. పరిచయాలను స్వదినియోగం చేసుకున్న ఆయన భారత్ నుంచి 12 హెలికాప్టర్ల కాంట్రాక్టును అగస్టా కంపెనీకి ఇప్పించేందుకు రంగంలోకి దిగారు. ఇందుకోసం రాజకీయ నేతలకు, ఐఏఎఫ్ అధికారులకు భారీగా లంచాలిచ్చారు. దీంతో అప్పటివరకూ హెలికాప్టర్ ప్రయాణించే ఎత్తు పరిమితిని అధికారుల సాయంతో 6,000 మీటర్ల నుంచి 4,500కు తగ్గించగలిగారు. దీంతో అప్పటివరకూ రేసులోనే లేని అగస్టా ఏకంగా కాంట్రాక్టునే ఎగరేసుకుపోయింది. భారత రక్షణ, వైమానిక దళాలకు చెందిన రహస్య పత్రాలు, సమాచారాన్ని సంపాదించిన మైకేల్ ముంబైలోని తన సహాయకుడి ద్వారా దాన్ని వెస్ట్ల్యాండ్ కంపెనీకి చేరవేయగలిగాడు. వీవీఐపీ హెలికాప్టర్ కొనుగోలు ప్రక్రియ మొదలయ్యాక 1997–2013 మధ్యకాలంలో మైకేల్ 300 సార్లు ఇండియాకు వచ్చాడు. -
ఆ ఆరోపణలు కేసు పెట్టదగినవే
న్యూఢిల్లీ: అవినీతి కేసులో తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దుచేయాలన్న ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా పిటిషన్ను సీబీఐ వ్యతిరేకించింది. ఈ వ్యవహారంలో అస్థానాతో పాటు ఇతర అధికారులపై వచ్చిన ఆరోపణలు కేసు పెట్టదగినవేనని ఢిల్లీ కోర్టుకు తెలిపింది. అస్థానా పిటిషన్పై అభిప్రాయం తెలపాలని కోర్టు ఆదేశించగా సీబీఐ గురువారం ఈ మేరకు బదులిచ్చింది. ఇంకా చార్జిషీట్ దాఖలుచేయలేదని, విచారణ పూర్తయ్యే సరికి చాలా విషయాలు బయటికి వస్తాయని తెలిపింది. అస్థానా, సీబీఐ డీఎస్పీ దేవేంద్రకుమార్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్ల పిటిషన్లను జస్టిస్ నజ్మీ వాజిరి బెంచ్ విచారణకు చేపట్టింది. ఈ దశలో అనవసర సందేహాలొద్దు.. ‘అవినీతి సంబంధ కేసుల్లో నమోదైన ఎఫ్ఐఆర్ను రిట్ పిటిషన్ ద్వారా సవాలుచేసినప్పుడు, ఆ ఎఫ్ఐఆర్లోని ఆరోపణల్లో కేసు పెట్టదగినవి ఉన్నాయా? లేవా? అన్న విషయాన్ని పరిశీలించాలి. ఈ దశలో కేసుతో సంబంధంలేని విషయాలు, సందేహాల్ని లేవనెత్తకూడదు. ఇక ప్రస్తుత కేసులో వచ్చిన ఆరోపణలు కేసుపెట్టదగినవే అని తేలడంతోనే ఎఫ్ఐఆర్ నమోదుచేసి విచారణ ప్రారంభించాం. కొత్త బృందం దర్యాప్తును ప్రారంభించి, కీలక పత్రాలను పరిశీలిస్తోంది. తదుపరి దశలో సవివర అఫిడవిట్ దాఖలుచేస్తాం’ అని సీబీఐ పేర్కొంది. కాగా, అస్థానాపై విచారణ చేపట్టకుండా యథాతథ స్థితిని కోర్టు నవంబర్ 14 వరకు పొడిగించింది. -
సీబీఐ డీఎస్పీ దేవేందర్ కుమార్కు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డీఎస్పీ దేవేందర్ కుమార్కు ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాపై ముడుపుల ఆరోపణల కేసుకు సంబంధించి అరెస్టయిన దేవేందర్ కుమార్కు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి సంతోష్ స్నేహి మన్ రూ 50,000 వ్యక్తిగత పూచీ కత్తుపై బెయిల్ మంజూరు చేశారు. తనను నిర్బంధించడం అక్రమమని, తనకు విముక్తి కల్పించాలని కోరుతూ కుమార్ ఢిల్లీ కోర్టులో బెయిల్ దరఖాస్తులో పేర్కొన్నారు. బెయిల్ ఇచ్చే క్రమంలో తనకు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని కూడా కుమార్ కోర్టుకు నివేదించారు. కాగా తమపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ చట్టబద్ధతను కుమార్, ఆస్ధానాలు ఇప్పటికే న్యాయస్ధానంలో సవాల్ చేశారు. ఈ కేసులో వీరితో పాటు మనోజ్ ప్రసాద్, సోమేష్ ప్రసాద్లను సైతం నిందితులుగా చేర్చారు. మరో కేసులో సాక్ష్యాలను రూపుమాపేందుకు కుమార్ ప్రయత్నించాడని దర్యాప్తు ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. సీబీఐలో సీనియర్ అధికారుల మధ్య వివాదంలో తనను ఇరికించడంతో తాను బాధితుడు అయ్యానని కుమార్ పేర్కొన్నారు.