స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారయత్నం | tiuvannamalai 17 year Old girl and what Happened to this boy friend in chennai old building | Sakshi
Sakshi News home page

స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారయత్నం

Jun 3 2025 1:47 PM | Updated on Jun 3 2025 1:47 PM

tiuvannamalai 17 year Old girl and what Happened to this boy friend in chennai old building

అన్నానగర్‌: ఓ యువకుడు స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.  తిరువణ్ణామలై జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక, ఆమె తల్లి చెన్నైలోని పూందమల్లిలో నివసిస్తున్నారు. ఆ అమ్మాయికి ఇన్‌స్ట్రాగామ్‌ చూసే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఉత్తర చెన్నైకి చెందిన సాయి (22) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది చివరికి ప్రేమగా మారింది. ఈ విషయం తెలిసిన ఆ అమ్మాయి తల్లి తరచుగా కూతురిని మందలించింది. 

దీంతో ఆ బాలిక కొన్ని రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయి, స్నేహితురాలి ఇంట్లో బస చేసింది. మళ్లీ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆ బాలిక తన ప్రియుడిని ఓ సారి కలిసి మాట్లాడాలని ప్లాన్‌ చేసుకుంది. ఆదివారం రా త్రి 11 గంటల ప్రాంతంలో ఆ అమ్మాయి చెన్నైలోని కొత్తవల్సావడి ప్రాంతంలోని ఒక భవనం వద్ద ప్రియుడిని కలవడానికి వెళ్లింది.

 ఆ సమయంలో సాయి స్నేహితులు రాహుల్‌ (26)సహా ఇద్దరు వ్యక్తులు మోటార్‌ సైకిల్‌పై అక్కడికి వచ్చారు. హఠాత్తుగా సా యి, అతని స్నేహితులు కూడా ఆ బాలికను ఆ భవనంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ప్రయతి్నంచారు. ఆ ప్రాంత ప్రజలు దీనిని చూసి పోలీసులకు సమాచారం అందించారు.  పోర్ట్‌ మహిళా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌  లక్ష్మీ నేతృత్వంలోని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో యువకులు పారిపోయారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement