కాశీ నుంచి అయోధ్యకు... ఐఆర్‌సీటీసీ అద్భుత ప్యాకేజీ | Tour Package From Kashi Vishwanath To Ayodhya Ramlala Darshan, Check Ticket Fare And Journey Details | Sakshi
Sakshi News home page

కాశీ నుంచి అయోధ్యకు... ఐఆర్‌సీటీసీ అద్భుత ప్యాకేజీ

Published Tue, Aug 20 2024 11:09 AM | Last Updated on Tue, Aug 20 2024 12:44 PM

Tour Package Book Kashi Vishwanath Ramlala Darshan

ఉత్తరప్రదేశ్‌లోని కాశీ, అయోధ్యలను సందర్శించాలనుకునేవారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. భారతీయ రైల్వేకు అనుబంధ సంస్థ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్  అండ్‌ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) వారణాసి, అయోధ్యలను సందర్శించేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణ సదుపాయం, వసతి, ఆహారం మొదలైనవి అందజేయనున్నారు.

ఈ ప్యాకేజీ ఆరు పగళ్లు, ఐదు రాత్రులు ఉండనుంది. ఈ ప్యాకేజీలో ప్రయాణం సాగించేందుకు రూ.15,750(ఒక్కరు) చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణికుల తమకు అందుబాటులో ఉండే ప్యాకేజీని కూడా ఎన్నుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి ‘రామ్ మందిర్ దర్శన్’ అనే పేరు పెట్టారు.  ఈ ప్యాకేజీ వారణాసి నుంచి అయోధ్య వరకూ కొనసాగనుంది. ఈ టూర్‌ ప్రతి శుక్రవారం ప్రారంభమవుతుంది.

ఐఆర్‌సీసీటీ వెబ్‌సైట్ www.irctctourism.comని సందర్శించడం ద్వారా ప్రయాణికులు ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. అలాగే ఐఆర్‌సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా ఈ ప్యాకేజీని బుక్‌ చేసుకోవచ్చు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement