train
-
లైంగిక దాడికి యత్నం.. రైలు నుంచి దూకిన యువతి
సికింద్రాబాద్/గాంధీ ఆస్పత్రి: ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచార యత్నం జరిగింది. ఆగంతకుడి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి బాధితురాలు కిందకు దూకటంతో తీవ్రంగా గాయపడింది. ఈ నెల 22న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ప్రస్తుతం సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో కోలుకుంటోంది. నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ జి.సాయీశ్వర్గౌడ్ తెలిపారు.బోగీలో ఒంటరిగా ఉండటంతో..అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి (23) మేడ్చల్లోని ఒక ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన మొబైల్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్కు వచ్చింది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తెల్లాపూర్– మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది.ఆమె ఎక్కిన లేడీస్ కోచ్లో ఉన్న మరో ఇద్దరు మహిళలు రాత్రి 8 గంటల సమయంలో అల్వాల్ స్టేషన్లో దిగిపోవటంతో బోగీలో బాధితురాలు ఒక్కరే మిగిలింది. అది గమనించిన ఒక ఆగంతకుడు బోగీలోకి ప్రవేశించి బాధి తురాలిపై అఘాయిత్యం చేయబోయాడు. భయాందోళనకు గురైన ఆమె కొంపల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో నడుస్తున్న రైలు నుంచి కిందికి దూకేసింది. తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితికి చేరిన యువతిని గుర్తించిన స్థానికులు అంబులెన్స్లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. రెండు స్టేట్మెంట్లుగాంధీ ఆస్పత్రిలో అదే రోజు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అయితే, తాను ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడ్డట్లు ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగానే పోలీసులు రికార్డు చేశారు. ఆ తర్వాత ఆస్పత్రికి వచ్చిన తన కుటుంబ సభ్యులకు తనపై అత్యాచార యత్నం జరిగిందన్న విషయాన్ని బాధితురాలు చెప్పటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మరోమారు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్న పోలీసులు అత్యాచార యత్నం కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని కుటుంబ సభ్యులు సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.నాలుగు బృందాలతో గాలింపుబాధితురాలిని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) ఎస్పీ చందనదీప్తి సోమవారం పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. రెండు బృందాలు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన, సాంకేతిక ఆధారాల సేకరణలో ఉన్నాయని వివరించారు. నిందితుడిని గుర్తించడంలో పురోగతి సాధించామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.మెరుగైన వైద్యం అందించాంబాధితురాలిని 22న రాత్రి 11.30 గంటలకు గాంధీ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారని ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సునీల్కుమార్ తెలిపారు. ఆ సమయంలో ఆమె స్పృహలోనే ఉన్నప్పటికీ మతిస్థిమితం కోల్పోయినట్లు కనిపించిందని చెప్పారు. ఆమె చేయి మణికట్టు వద్ద విరిగిందని, శరీరంపై గాయాలున్నాయని వివరించారు. బాధితురాలికి వెంటనే ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు తగిన వైద్యసేవలు అందించారని, సీటీ స్కానింగ్ చేయించామని వెల్లడించారు.కాగా, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సూచన మేరకు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి సోమవారం సాయంత్రం గాంధీ ఆస్పత్రికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. మంత్రుల ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. లెఫ్ట్ ఎగనెస్ట్ మెడికల్ ఎడ్వైజ్ (లామా) ద్వారా బాధితురాలు గాంధీ ఆస్పత్రి నుంచి వెల్లిపోయినట్లు ప్రొఫెసర్ సునీల్ కుమార్ ఆ తర్వాత వెల్లడించారు. -
పట్టాలపై ఎస్యూవీని ఈడ్చుకెళ్లిన రైలు
సూరత్గఢ్: రాజస్థాన్లో ఒళ్లు గగుర్పొడిచే ఉదంతం చోటుచేసుకుంది. సూరత్గఢ్ థర్మల్ పవర్ ప్లాంట్ సమీపంలోని ఒక లెవెల్ క్రాసింగ్పై కేంద్ర పోలీసు బలగాలకు చెందిన ఎస్యూవీని ఒక రైలు బలంగా ఢీకొంది(Rajasthan Hits SUV). ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో ఎస్యూవీ కారులో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్)నకు చెందిన ముగ్గురు జవానులు ఉన్నారు. ఈ కారు పట్టాలపైకి చేరుకోగానే రైలు బలంగా ఢీకొని కొంత దూరం వరకూ ఈడ్చుకెళ్లింది. దీనికి కారణమేమిటన్నదీ ఇంకా వెల్లడికాలేదు. అయితే సీసీటీవీ ఫుటేజీ(CCTV footage)లో ఉన్న దృశ్యాన్ని చూస్తే ఈ పట్టాల మీదుగా రైళ్ల రాకపోకలు సాగించే సమయంలో అటు రోడ్డు మీదుగా వచ్చే వాహనాలను నిలువరించేందుకు ఎటువంటి గేటు లేదు. 📍Rajasthan | #Watch: An SUV of a central police force was rammed by a train at a level crossing near Suratgarh Super Thermal Power Plant in Rajasthan.CCTV footage of the accident has gone viral on social media.Local reports said there were three personnel of the Central… pic.twitter.com/Zw7GiJbd51— NDTV (@ndtv) March 22, 2025వీడియోను పరిశీలనగా చూస్తే ఎస్యూవీని నడుపుతున్న డ్రైవర్కు అటుగా రైలు వస్తున్న సంగతి తెలియలేదు. ప్రమాదాన్ని గుర్తించిన ఒక సీఐఎస్ఎఫ్ జవాను కారు నుంచి బయటకు దూకి పారిపోయారు. ఇంతలో రైలు ఆ ఎస్యూవీని ఢీకొంది. కారులోని ఇద్దరు జవానులు బయటపడేంతలో ఆ రైలు వారి వాహనాన్ని బలంగా ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఆన్లైన్ గేమింగ్కు రూ. 3.26 కోట్ల ప్రభుత్వ సొమ్ము.. పంచాయతీ అధికారి అరెస్టు -
ఇంజిన్ పేల్చేశారు.. ట్రైన్ కిటికీలు పగలగొట్టారు..!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ లో జాఫర్ ఎక్స్ ప్రెస్ ను బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. వందల సంఖ్యలో ప్రయాణికులున్న ఆ ట్రైన్ ను హైజాక్ చేసిన 27 గంటల పాటు బందించి ఉంచారు. ఈ క్రమంలోనే వారు పలు డిమాండ్లు వినిపించారు పాక్ ప్రభుత్వానికి. అయితే పాక్ ప్రభుత్వం వారి డిమాండ్లను ఏ మేరకు నెరవేర్చిందో కానీ హైజాక్ చేసిన ట్రైన్ ను ఆఖరికి బీఎల్ఏ మిలిటెంట్లు విడిచిపెట్టారు.అయితే ఆ సమయంలో జాఫర్ ఎక్స్ ప్రెస్ కు డ్రైవర్ గా ఉన్న అంజాద్ తన చేదు జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకున్నాడు. అదొక భయానక ఘటన అన్న అంజాద్.. ట్రైన్ ను ఎలా హైజాక్ చేశారనే సంగతిని స్పష్టం చేశాడు. ట్రైన్ ఇంజిన్ కింద, బోగీల కింద కొన్ని పేలుడు పదార్థాలు పెట్టి ట్రైన్ హైజాక్ చేశారన్నాడు. ట్రైన్ ఆగిన తర్వాత విండోలు పగలగొట్టి లోపలికి వచ్చిన మిలిటెంట్లు.. తాము చనిపోయి ఉంటామని భావించారన్నాడు. వందల సంఖ్యలో ప్రయాణికుల్ని చూసిన తర్వాత వారిని రెండు సెపరేట్ గ్రూపులుగా విభజించారని డ్రైవర్ అంజాద్ పేర్కొన్నాడు.హైజాకర్ల నుండి సురక్షితంగా బయటపడ్డ ఓ ప్రయాణికుడు అర్సలాన్ యూసఫ్.. మిలిటెంట్లు వ్యవహరించిన తీరును పేర్కొన్నాడు. అందులో ఉన్న సైనికుల్ని బంధించి తీసుకెళ్లి కొంతమందిని చంపేశారన్నాడు. కొన్ని సందర్భాల్లో కొంతమందిని వారు టార్గెట్ చేసి కాల్చి చంపారన్నాడు. ఎవరైనా వారికి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని కాల్చి చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నాడు.కాగా, మంగళవారం 440 మంది ప్రయాణిలకులతో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను బలూచిస్తాన్ మిలిటెంట్లు హైజాక్ చేశారు.33 మంది మిలిటెంట్లను అంతం చేశామని, 21 మంది ప్రయాణికులు, నలుగురు భద్రతా సిబ్బంది మరణించారని, మిగిలిన ప్రయాణికులను క్షేమంగా విడిపించామని పాక్ సైన్యం బుధవారం వెల్లడించింది. అయితే, పాక్ సైన్యం తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని బీఎల్ఏ ఆరోపించింది. యుద్ధ నియమాలు, అంతర్జాతీయ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని.. రైలులో ఉన్న కొందరు సైనికులను తామే వదిలేశామని వెల్లడించింది. -
రాత్రిపూట రైళ్లు ఎందుకు వేగంగా నడుస్తాయి?
కొన్ని రైళ్లు పగలు కంటే రాత్రిపూటే వేగంగా ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది కదా. నిత్యం రైలు ప్రయాణం చేస్తున్నవారు ఇది గమనించే ఉంటారు. ఇది ఒక మిస్టరీగా అనిపించినప్పటికీ దీని వెనుక కారణాలు లేకపోలేదు. కొన్ని ఆసక్తికరమైన, ఆచరణాత్మక కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాత్రిపూట రైలు వేగం పెరగడానికి దోహదపడే కీలక అంశాలను తెలియజేస్తున్నారు.ట్రాక్ రద్దీ తగ్గుదలపగటిపూట రైల్వే ట్రాక్లు రద్దీగా ఉంటాయి. ప్యాసింజర్ రైళ్లు, సరుకు రవాణా రైళ్లు, ప్రధాన గేట్ల వద్ద పగలు ప్రజల సంచారం వంటి అంశాలతో రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతుంటాయి. పగలు ఇతర రైళ్ల డైవర్షన్ కోసం కొన్ని రైళ్లను గంటల తరబడి నిలిపేస్తుంటారు. రాత్రిపూట ఈ ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. దాంతో రైళ్లు వేగంగా నడిచేందుకు వీలుంటుంది.తక్కువ స్టాప్లుపగటిపూట ప్యాసింజర్ రైళ్లతో పోలిస్తే రాత్రిపూట రైళ్లు, ముఖ్యంగా సుదూర, సరుకు రవాణా సేవలు అందించే రైళ్లకు తక్కువ స్టాపులను షెడ్యూల్ చేస్తారు. దాంతో అంతరాయాలు లేకుండా రైళ్లు వాటి వేగాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది.డ్రైవర్ విజిబిలిటీనైట్ డ్రైవింగ్లో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, పగలు రద్దీగా ఉండే స్టేషన్లు లేదా రద్దీగా ఉండే క్రాసింగ్లపై లోకోపైలట్లు పెద్దగా దృష్టి కేంద్రీకరించే అవసరం ఉండదు. దాంతో పూర్తిగా డ్రైవింగ్, ట్రాక్పైనే దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. హై పవర్డ్ హెడ్ లైట్స్, ఆధునిక సిగ్నలింగ్ సిస్టమ్స్ వంటి అధునాతన సాంకేతికత సురక్షితమైన, సమర్థవంతమైన కార్యకలాపాలను నిర్ధారిస్తుంది.ఇదీ చదవండి: జియోస్టార్ యూట్యూబ్ కంటెంట్ తొలగింపుషెడ్యుల్లో మార్పులురైల్వే నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడానికి రాత్రిపూట రైళ్ల షెడ్యుల్ను వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తారు. వేగవంతమైన ప్రయాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా పీక్ అవర్స్లో ప్రాంతాల మధ్య వస్తువులను రవాణా చేసే సరుకు రవాణా రైళ్ల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు. -
పట్టాలైనా.. పక్కా రోడ్లయినా..
ఖమ్మం రాపర్తినగర్/చింతకాని: పట్టాలు ఉన్నంత వరకు రైలు చక్రాలకు ఉండే యాక్సిల్తో.. పట్టాలు ముగియగానే సాధారణ టైర్లతో రోడ్డుపైనా పరుగులు తీయగల వాహనాన్ని రైల్వే అధికారులు వినియోగిస్తున్నారు. పట్టాలపై పగుళ్లను గుర్తించేందుకు యూఎఫ్ఎస్డీ యంత్రాన్ని అమర్చిన కారులో అధికారులు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుంచి ఖమ్మం జిల్లా పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ వరకు గురువారం పరిశీలించారు. ఈ కారు రామకృష్ణాపురం రైల్వే గేట్ (107) వద్ద ఆగింది. అందులో ఉన్న ఎస్ఎస్ఈటీవే కృష్ణకుమార్ కిందకు దిగడంతో.. స్థానికులు ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గతంలో పట్టాలపై పగుళ్లను గుర్తించేందుకు సిబ్బంది కాలినడకన వెళ్లే వారని తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేక యంత్రం అమర్చిన ఈ కారుకు రైలు చక్రాలకు ఉండే యాక్సిల్ ఉండటంతో పట్టాలపై వెళ్తుందని ఎస్ఎస్ఈటీవే కృష్ణకుమార్ వివరించారు. పట్టాలపై వెళ్లేటప్పుడు యాక్సిల్ కిందకు వచ్చి వాహనం కాస్త పైకి లేస్తుందని చెప్పారు. మళ్లీ కిందకు దింపితే రోడ్డుపై సాధారణ టైర్లతో వెళ్లొచ్చని వివరించారు. -
రైలు హైజాక్ కు తెర!
-
పాక్లో రైలు హైజాక్
కరాచీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్లో బలూచీ వేర్పాటువాదులు ఘోరానికి తెగబడ్డారు. మంగళవారం బలూచిస్తాన్ ప్రావిన్సులో ఏకంగా ఒక ప్రయాణికుల రైలునే హైజాక్ చేసేశారు. ఇది తమ పనేనని నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించుకుంది. ‘‘500 మంది ప్రయాణికుల్లో కనీసం 30 మందిని కాల్చి చంపేశామని, 215 మందిని బందీలుగా పట్టుకున్నాం. మృతులతో పాటు బందీల్లో దాదాపుగా అంతా సైనికులే’’ అని పేర్కొంది. దీనిపై పాక్ ప్రభుత్వం ఇప్పటిదాకా అధికారికంగా స్పందించలేదు. బందీలను విడిపించేందుకు సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగింది.ఘటనా స్థలిని సైనిక హెలికాప్టర్లు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టి బాంబు దాడులకు దిగాయి. దాంతో బీఎల్ఏ మండిపడింది. సైనిక చర్యను తక్షణం నిలిపేయకపోతే బందీలందరినీ చంపేస్తామంటూ పాక్ సర్కారును తీవ్రంగా హెచ్చరించింది. రాజకీయ ఖైదీలుగా నిర్బంధించిన బలూచీ నేతలు, కార్యకర్తలందరినీ 48 గంటల్లోపు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది. దాంతో సైనిక చర్యకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తాత్కాలికంగా విరామం ప్రకటించింది. తీసుకోవాల్సిన చర్యలపై మల్లగుల్లాలు పడుతోంది.బలూచిస్తాన్తో పాటు పరిసర ప్రావిన్సుల్లో ఎమర్జెన్సీ విధించారు. ఘటనను కవర్ చేయకుండా మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించినట్టు చెబుతున్నారు. ముష్కరులతో ఎలాంటి సంప్రదింపులూ ఉండబోవని అంతర్గత శాఖ మంత్రి మొహసిన్ నక్వీ ప్రకటించారు. కడపటి వార్తలు అందే సమయానికి బీఎల్ఏ సాయుధులపై పాక్ సైనిక హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా బాంబు దాడులకు దిగినట్టు సమాచారం.బందీల్లో దాదాపు 80 మందిని విడిపించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య 35 దాటిందన్నాయి. బలూచిస్తాన్ ప్రావిన్సు అఫ్గానిస్తాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఉంటుంది. పాక్ నుంచి స్వాతంత్య్రం కోసం పలు స్థానిక తెగలతో కూడిన వేర్పాటువాద సంస్థలు దశాబ్దాలుగా పోరాడుతున్నాయి. వాటిలో బీఎల్ఏ అతి పెద్దది. దానిపై పాక్తో పాటు అమెరికా, బ్రిటన్లలో కూడా నిషేధముంది.ఇలా జరిగిందిదాదాపు 500 మంది ప్రయాణికులతో కూడిన జాఫర్ ఎక్స్ప్రెస్ మంగళవారం ఉదయం 9 గంటలకు బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషావర్కు బయల్దేరింది. బొలాన్ జిల్లాలో కొండ ప్రాంతంలో కనుమ సమీపంలో గుదలార్, పెరో కున్రీ ప్రాంతాల మధ్య 8వ నంబర్ టన్నెల్ సమీపంలో బీఎల్ఏ సాయుధులు అప్పటికే రైలు పట్టాలను పేల్చేసి మాటు వేశారు. అక్కడికి చేరుకుని అతి నెమ్మదిగా వెళ్తున్న రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. వెంటనే బలూచీ సాయుధులు భారీ సంఖ్యలో రైలును చుట్టుముట్టారు. నేరుగా ఇంజన్పైకి కాల్పులు జరపడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.రైలు ఆగిపోగానే మొత్తం 9 బోగీల్లోకీ చొరబడ్డారు. వారికి, రైల్లోని భద్రతా సిబ్బందికి మధ్య కాసేపు కాల్పులు జరిగాయి. అనంతరం రైలును బీఎల్ఏ సాయుధులు తమ అదీనంలోకి తీసుకుని సమీపంలోని టన్నెల్లోకి తరలించినట్టు సమాచారం. ‘‘ప్రయాణికుల్లో సాధారణ పౌరులు, మహిళలు, చిన్నారులను ఒకవైపు, సైనికులను మరోవైపు విడదీశారు. అనంతరం సైనికుల్లో 20 నుంచి 30 మందిని కాల్చి చంపారు. సాధారణ పౌరులను వదిలేశారు. 215 మందిని బందీలుగా చేసుకున్నారు. వారిలో అత్యధికులు పోలీసు, యాంటీ టెర్రరిజం ఫోర్స్, ఐఎస్ఐకు, సైన్యానికి చెందినవారే.వారంతా సెలవులపై స్వస్థలాలకు వెళ్తున్నారు’’అని స్థానిక మీడియా పేర్కొంది. ఘటనా స్థలిలో మొబైల్ నెట్వర్క్ వంటివేమీ లేకపోవడంతో రైల్లోని సిబ్బందితో ఎలాంటి కాంటాక్టూ వీలవడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాడికి పాల్పడింది బీఎల్ఏలోని మజీద్ బ్రిగేడ్గా భావిస్తున్నారు. వారితో పాటు స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్, ఫతే స్క్వాడ్ ప్రత్యేక విభాగాలు కూడా దాడిలో పాల్గొన్నట్టు బీఎల్ఏ ప్రకటించింది.ప్రయాణికుల్లో మహిళలు, పిల్లలు, పౌరులను వదిలేసినట్టు ప్రకటించింది. బీఎల్ఏ దాడుల నేపథ్యంలో క్వెట్టా, పెషావర్ మధ్య రైలు సేవలను కొంతకాలం నిలిపేశారు. గత అక్టోబర్లోనే పునరుద్ధరించారు. తర్వాత నెల రోజులకే క్వెట్టా రైల్వేస్టేషన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 26 మంది మరణించారు. బలూచీల దాడి ముప్పు నేపథ్యంలో ఈ ప్రాంతం గుండా వెళ్లే రైళ్లన్నీ పటిష్టమైన సాయుధ భద్రత నడుమ ప్రయాణిస్తుంటాయి. భారీ దాడికి బీఎల్ఏ పథక రచన చేస్తోందని కౌంటర్ టెర్రరిజం విభాగం గత మంగళవారమే ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు చెబుతున్నారు. -
పాక్లో ట్రైన్ హైజాక్.. బందీలుగా 182 మంది..!
ఇస్లామాబాద్: పాకిస్థాన్కు చెందిన ట్రైన్ హైజాక్ కలకలం రేపుతోంది. బలూచిస్థాన్ వేర్పాటు వాదులు పాక్ జాఫర్ ఎక్స్ప్రెస్ను (Jaffar Express) తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 182 మంది ప్రయాణికుల్ని బంధించారు. అదే సమయంలో 20 మంది పాక్ సైనికుల్నిచంపేశారు. తొలుత ఆరుగుర్ని పొ ట్టనపెట్టుకున్న వేర్పాటు వాదులు.. ఆపై మరో 14 మంది సైనికుల్ని చంపేశారు.పాకిస్థాన్లోని నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టా నుండి పెషావర్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాకు తొమ్మిది బోగీలలో 450 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్పై వేర్పాటు వాదులు కాల్పులు జరిపారు. అనంతరం హైజాక్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.ట్రైన్ హైజాక్పై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army) అధికారికంగా ప్రకటించింది. ఆ ప్రకటన మేరకు.. జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ప్రయాణికుల్ని హైజాక్ చేశాం. వారిలో పాక్ సైన్యం, పోలీసులు, యాంటీ-టెర్రరిజం ఫోర్స్ (ఏటీఎఫ్), ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)యాక్టివ్ డ్యూటీ సిబ్బంది ఉన్నారు. వీరందరూ సెలవుపై పంజాబ్కు ప్రయాణిస్తున్నారు. ఈ విషయంలో పాకిస్థాన్ సైనిక జోక్యానికి ప్రయత్నిస్తే బందీలందరిని ఉరితీస్తామని హెచ్చరించింది. -
తృటిలో తప్పిన ఘోర రైలు ప్రమాదం.. బోగీలు రెండుగా విడిపోయి..
లక్నో: ఉత్తర ప్రదేశ్లో(Uttar Pradesh) ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణిస్తున్న రైలు బోగి రెండుగా విడిపోయాయి. 200 మీటర్ల మేర ప్రయాణించాయి. బోగి విడిపోవడంపై అప్రమత్తమైన రైల్వే అధికారులు వెంటనే ఆ రైలు ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది.పోలీసుల సమాచారం మేరకు..బీహార్ నుంచి ఒడిశాలోని పురి ప్రాంతానికి నందన్ కానన్ ఎక్స్ప్రెస్ (Nandan Kanan Express ) బయలుదేరాల్సి ఉంది. అయితే, మార్గం మధ్యలో ఉత్తర ప్రదేశ్లో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ్ స్టేషన్ (Pandit Deen Dayal Upadhyaya (DDU) లో నందన్ కానన్ ఎక్స్ప్రెస్ బోగీ విడిపోయింది. #WATCH | Chandauli, Uttar Pradesh: The coupling of the Nandan Kanan Express broke near the Pandit Deen Dayal Upadhyaya (DDU) Junction, splitting it into two parts. pic.twitter.com/QjqUHN7tfe— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 4, 2025ట్రైన్ ఆరు బోగీలు విడిపోయి 200 మీటర్లు ముందుకు వెళ్లిపోయాయి. మిగతా 15 బోగీలు వెనకే ఉన్నాయి. బోగీలు విడిపోవడంతో రైల్లోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో కేకలు వేశారు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ట్రైన్ను నిలివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికుల్ని సురక్షితంగా మరో కోచ్కు తరలించారు. అనంతరం, రైలు బోగీ విడిపోవడంపై రైల్వే అధికారులు ఆరా తీశారు. ఈ క్రమంలోనే రైలు కప్లింగ్ విరిగిపోయిన విషయాన్ని గుర్తించారు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి దాన్ని మళ్లీ అతికించారు. -
9,000 హార్స్పవర్ రైలు ఇంజిన్ సిద్ధం.. ఎంత మాల్ లాగుతుందంటే..
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే(Indian Railways) దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటిదని అంటారు. దేశంలోని చాలామంది రైళ్లపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అటు ప్రయాణికులను, ఇటు వస్తువులను తరలించేందుకు రైళ్లు రవాణా రంగంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. రైల్వేలు ఒకవైపు ఆధునికత దిశగా పరిగెడుతూ, మరోవైపు ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయి. తాజాగా భారతీయ రైల్వే అత్యంత శక్తివంతమైన ఇంజిన్ను రూపొందించింది. ఈ ఇంజిన్ వచ్చే నెలలో ట్రాక్లపై పరుగులు తీయనున్నదని సమాచారం.ఈ అత్యంత శక్తివంతమైన ఇంజిన్ను గుజరాత్(Gujarat))లోని దాహోద్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఈ ఇంజిన్ తయారు చేసిన ఫ్యాక్టరీని సందర్శించారు. ఇక్కడ గూడ్స్ రైలు ఇంజన్లు తయారు చేస్తుంటారు. ప్రస్తుతం మొదటి అత్యంత శక్తివంతమైన ఇంజిన్ సిద్ధం అయ్యింది. ఈ రైల్వే కర్మాగారాన్ని ‘మేక్ ఇన్ ఇండియా’ ధ్యేయంలో భాగంగా ఏర్పాటు చేశారు. ఈ కర్మాగారానికి 2022లో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. కేవలం మూడేళ్లలో ఈ కర్మాగారం దేశంలోనే అత్యంత శక్తివంతమైన రైలు ఇంజిన్ను నిర్మించి, ట్రాక్పైకి తీసుకువచ్చింది.భారతీయ రైల్వే ఎలక్ట్రిక్ లోకోమోటివ్లను 6000 హార్స్పవర్ నుండి 9000 హార్స్పవర్కు అప్గ్రేడ్ చేస్తోంది. ఇంజినీరింగ్ కంపెనీ సీమెన్స్ గుజరాత్లోని దాహోద్లో రూ.20,000 కోట్ల ఖరీదు చేసే 9,000 హార్స్ పవర్ కలిగిన 1,200 ఎలక్ట్రిక్ ఇంజిన్లను తయారు చేయనుంది. 9000 హార్స్పవర్ సామర్థ్యం కలిగిన ఈ ఇంజిన్ 4,500 టన్నుల సరుకును మోసుకెళ్లే గూడ్స్ రైలును అధిక వేగంతో నడుపుతుంది. ఒక సాధారణ ట్రక్కు 7 నుండి 10 టన్నుల వస్తువులను మాత్రమే తీసుకువెళుతుంది. ఈ నూతన ఇంజిన్లతో రైళ్ల వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల మేరకు పెరగనుంది.ఇది కూడా చదవండి: చెఫ్ అవతారంలో సోనూసూద్.. దోశ రేటు రెట్టింపు చేసి.. -
India Bhutan Train : త్వరలో భారత్-భూటాన్ రైలు.. స్టేషన్లు ఇవే..
న్యూఢిల్లీ: సాధారణంగా విదేశాలకు వెళ్లాలంటే విమానాలనే ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా రైలులోనూ మన దేశం నుంచి విదేశాలకు వెళ్లవచ్చనే సంగతి మీకు తెలుసా? త్వరలో భారత్- భూటాన్ల మధ్య నడవబోయే రైలు దీనిని సాకారం చేయనుంది. అస్సాంలోని కోక్రాఝర్ నుంచి భూటాన్లోని గెలెఫు వరకు రైల్వే లైన్ వేయడానికి భారత రైల్వేలు(Indian Railways) ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేశాయి. ఈశాన్య సరిహద్దు రైల్వే (ఎన్ఎఫ్ఆర్)ప్రతినిధి తాజాగా మీడియాకు దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు.ప్రతిపాదిత 69.04 కి.మీ రైల్వే లైను అస్సాంలోని కోక్రాఝర్ స్టేషన్ను భూటాన్లోని గెలెఫుకు అనుసంధానిస్తుందని, ఇందుకోసం రూ.3,500 కోట్లు వ్యయం అవుతుందని ప్రతినిధి తెలిపారు. ఈ రైల్వే లైన్కు సంబంధించిన సర్వే ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు డీపీఆర్ ఆమోదం పొందాల్సివుంది. ఈ ప్రాజెక్టులో బాలజన్, గరుభాస, రునిఖాత, శాంతిపూర్, దద్గిరి గెలెఫు.. ఇలా మొత్తం ఆరు కొత్త స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ రైల్వే మార్గం భారత్-భూటాన్ సంబంధాలను బలోపేతం చేస్తుంది.ఈ ప్రాజెక్టు రెండు దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, సాంస్కృతిక మార్పిడి(Cultural exchange)ని పెంపొందిస్తుంది. ఈ రైల్వే లైను ఏర్పాటుపై భూటాన్ కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తోంది. భారత్- భూటాన్లను రైలు ద్వారా అనుసంధానించేందుకు రెండు దేశాలు 2018 నుండి చర్చలు జరుపుతున్నాయి. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన సందర్భంగా, రెండు దేశాలు అధికారికంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ రైలు మార్గంలో రెండు ప్రధాన వంతెనలు, 29 భారీ వంతెనలు, 65 చిన్న వంతెనలు, ఒక రోడ్డు ఓవర్ బ్రిడ్జి, 39 రోడ్డు అండర్-బ్రిడ్జిలు, 11 మీటర్ల పొడవు గల రెండు వంతెనలు నిర్మాణం కానున్నాయి. -
Mahakumbh: వామ్మో.. ఈ రైళ్లు ఇంతలేటా.. ఇక కుంభమేళాకు వెళ్లినట్లే!
యూపీలో జరుగుతున్న మహాకుంభమేళా(Mahakumbh Mela) మరో మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. దీంతో బీహార్ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్లాలనుకుంటున్న భక్తులు పలు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపధ్యంలో పట్నా జంక్షన్తోపాటు బీహార్లోని పలు రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.ప్రయాగ్రాజ్ వెళ్లే రైళ్లలోకి ఎలాగైనా ఎక్కాలని పలువురు ప్రయాణికులు ప్రయత్నిస్తున్నారు. దీంతో వారిని నిలువరించడం రైల్వే పోలీసులకు కష్టంగా మారింది. కాగా ప్రయాగ్రాజ్కు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రైల్వేశాఖ పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే ఈ రైళ్లు ఊహకందనంత లేటుగా నడుస్తున్నాయి.బీహార్(Bihar)లోని పట్నా మీదుగా 10 రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఇవన్నీ చాలా ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాగ్రాజ్ నుంచి పట్నా వచ్చే ప్రత్యేక రైలు (23320) ఏకంగా 37 గంటలు లేటుగా గమ్యస్థానానికి చేరుకుంది. గురువారం మధ్యాహ్నం 12:30కు ప్రయాగ్రాజ్ నుంచి బయలుదేరిన ఈ రైలు శనివారం రాత్రి 10:18కి పట్నా జంక్షన్ చేరుకుంది. ఇదేవిధంగా సిక్కిం ఎక్స్ప్రెస్ కూడా శనివారం 20 గంటలు లేటుగా పట్నా చేరుకుంది. అనన్సోల్ మహాకుంభ్ రైలు 9 గంటలు ఆలస్యంగా నడిచింది. కామాఖ్య నుంచి బయలుదేరిన కుంభమేళా స్పెషల్ రైలు నాలుగు గంటలు లేటుగా గమ్యస్ణానానికి చేరుకుంది. ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్కు ప్రధాని మోదీ.. క్యాన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన -
పట్టాలెక్కిన వైద్యం
ఒక ఐడియా అనేక జీవితాలను మార్చేసింది. వైద్యానికి నోచుకోని గ్రామాలకు వైద్యం పట్టాల మీద పరుగులు పెడుతోంది. దేశంలో మూలమూలలను కలుపుతోంది రైల్వే. మారుమూల డ్యూటీ చేస్తున్నారు రైల్వే సిబ్బంది. వారిలో చాలామందికి వైద్యం అందుబాటులో లేదు. ఉద్యోగానికి సెలవు పెట్టి సమీప పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాలి. ఈ అంతరాన్ని ఒక్క ఐడియాతో భర్తీ చేసింది ఇటీ పాండే. పేషెంట్లు డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా డాక్టర్లనే పేషెంట్ల దగ్గరకు చేరుస్తోంది. ‘రుద్ర, హాస్పిటల్ ఆన్ వీల్స్’(Hospital on Wheels) పేరుతో ఆమె మొదలు పెట్టిన రైలు పెట్టె క్లినిక్(Train Box Clinic)లు ఊరూరా తిరుగుతూ వైద్యసేవలందిస్తున్నాయి.డాక్టర్లొస్తున్నారు మహారాష్ట్ర, భుసావాల్ రైల్వే డివిజనల్ మేనేజర్ ఇటీ పాండే. అలహాబాద్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గోల్డ్ మెడల్ సాధించింది. రైల్వేలో 26 ఏళ్ల అనుభవంలో ఆమె అనేక సమస్యలను దగ్గరగా చూశారు. చిన్న ఉద్యోగుల కష్టాలను అర్థం చేసుకున్నారు. ఉద్యోగులు పెడుతున్న సెలవుల్లో ఎక్కువభాగం కుటుంబ సభ్యుల అనారోగ్య కారణాలతోనేనని తెలుసుకున్నారామె. ఇప్పటికీ మనదేశంలో గ్రామాలకు వైద్యం సుదూరంలోనే ఉంది. వైద్యం కోసం పట్టణాలకు వెళ్లక తప్పడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా వైద్యాన్ని గ్రామాల బాట పట్టించారు.ఇందుకోసం కొత్తగా డబ్బు ఖర్చు చేసిందేమీ లేదన్నారామె. పాతబడిన రైలు బోగీలకు రిపేర్ చేసి క్లినిక్లుగా మార్చారు. రైల్వే హాస్పిటల్ వైద్యసిబ్బంది ఆ రైళ్లలో గ్రామాలకు వెళ్తారు.ప్రాథమికంగా అవసరమైన మందులుంటాయి. ఈసీజీ, బ్లడ్ సాంపుల్ కలెక్షన్ వంటి అవసరమైన పరికరాలతో వెళ్తుందీ రైలు. ఒక్కోరోజు ఒక్కో రూట్. ఒక గ్రామానికి పదిహేను రోజులకొకసారి చొప్పున నెలలో రెండుసార్లు వెళ్తుందీ ఆరోగ్యరైలు. జనవరిలో పట్టాలెక్కిందిభుసావాల్ డివిజన్లో పాతిక వేల మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది జనవరి 18వ తేదీన పట్టాలెక్కిన ఈ రైలు క్లినిక్లలో తొలిరోజు 259 మంది వైద్యపరీక్షలు చేయించుకున్నారు. హాస్పిటల్ చక్రాలు కట్టుకుని మా ఊరికి వస్తుంటే ఇంతకంటే సంతోషం ఏముంటుంది... అంటున్నారు వైద్యసహాయం అందుకుంటున్న మహిళలు. -
ఓసీడీ ఉన్నట్లు ఉంది.. ట్రైన్ క్లీనింగ్ పెట్టుకున్నాడు!
-
ఓసీడీ ఉన్నట్లు ఉంది.. ట్రైన్ క్లీనింగ్ పెట్టుకున్నాడు!
రైళ్లు స్టేషన్లలో ఆగినప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది కూడా ప్రధాన స్టేషన్లలో వద్దో, జంక్షన్ల వద్దో ట్రైన్లను శుద్ధి చేసే కార్యక్రమం చేస్తూ ఉండటం మనకు తరుచు కనిపిస్తూ ఉంటుంది. దానికి ప్రత్యేకమైన సిబ్బంది ఉంటారు. దానికో ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ట్రైన్ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాడు. అది కూడా ట్రైన్ కదులుతున్నప్పుడే క్లీనింగ్ కార్యక్రమం పెట్టేశాడు. మనోడికి ఆ ట్రైన్ నీట్ గా కనిపించలేనట్లు ఉంది. అందుకే అలా క్లీనింగ్ చేసినట్లు ఉన్నాడు.రైల్వే ట్రాక్ పక్కగా ఉండే వాటర్ \హోస్ తీసుకుని వచ్చే వెళ్లే ట్రైన్లపై నీళ్లు కొడుతూ ఉన్నాడు. అయితే ఒక ట్రైన్ పై వాటర్ హోస్ తో క్లీన్ చేయడాన్ని ఒక యూజర్ తన కెమెరాలో బంధించాడు. దీన్ని సోషల్ మీడియా హ్యాండిల్ ‘రెడ్డిట్’ తన ఖాతాలో పోస్ట్ చేసింది.ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘మనోడికి ఓసీడీ ఉన్నట్లు ఉంది.. ట్రైన్ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాడు’ అని ఒకరు రియాక్ట్ కాగా, ప్యాసింజర్ల పై కోపంలా ఉంది. ప్రత్యేకంగా ట్రైన్ లో డోర్ వద్ద ఉన్న ప్రయాణికుల్నే టార్గెట్ చేసి అలా వాటర్ స్ప్రే చేస్తున్నాడు’ అని మరొకరు స్పందించారు. ‘ ఇలా కొడితే ట్రైన్ ఖాళీ అయ్యి తనకు సీట్ దొరుకుతుందని కాబోలు’ అని మరొక నెటిజన్ రియాక్ట్ అయ్యారు. -
ఫస్ట్ క్లాస్ జర్నీలో ‘హౌస్ అరెస్ట్’.. వీడియో వైరల్
మహా కుంభ మేళా ఇంకా కొన్ని రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో అక్కడకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోతోంది. ఒకసారి మహా కుంభ మేళా వెళ్లి అక్కడ పుణ్య స్నానం రావాలనేది భక్తుల తాపత్రయం. ఈ క్రమంలోనే ఎవరికి దొరికిన వాహనాల్లో వారు ప్రయాగ్ రాజ్ కు పయనం అవుతున్నారు. అయితే ఇక్కడ ఎక్కువ మంది రైలు మార్గంలోనే ప్రయాగ్ రాజ్కు చేరుకుంటున్నారు. ఇందులో కొందరు టికెట్ తీసుకుని వెళ్లేవారైతే, కొందరు టికెట్ లేకుండానే అక్కడకు వెళుతున్నారు.తాజాగా ఓ ప్రయాణికుడు ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. రైలు ఎక్కాడు. అతనికి కేటాయించిన క్యాబిన్లోకి వెళ్లిపోయాడు. అంతా బానే ఉంది. ఫస్ట్ క్లాస్ టికెట్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదనుకున్నాడు సదరు ప్రయాణికుడు. కానీ ఒకానొక సందర్భంలో లేచి క్యాబిన్ డోర్ ఓపెన్ చేశాడు. అంతే ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్ కాస్తా జనరల్ బోగీల కనిపించింది. దాన్ని వీడియోలో బంధించాడు. కనీసం బాత్రూమ్కు వెళ్లే దారి కూడా లేకపోవడంతో 16 గంటల పాటు ఫస్ట్ క్లాస్ క్యాబిన్ లోనే ‘హౌస్ అరెస్టు’ అయినట్లు ఆ ప్రయాణికుడు తెలిపాడు. దీన్ని ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా 26 మిలియన్ వ్యూస్ వచ్చాయట. View this post on Instagram A post shared by Piyushh Agrawal (@piyushhagrawal) -
విద్యుత్ రైలుకి వందనం
కూ.. ఛుక్.. ఛుక్.. ఛుక్.. ఇది రైలు శబ్ద విన్యాసం..!గుప్పు.. గుప్పు.. వెలువడే పొగ బండి.. రైలును ఉద్దేశించి అనాదిగా చెప్పే మాట. ఇప్పుడా శబ్దం మారింది, ఆ పొగ మాయమైంది. అది విద్యుదీకరణ విప్లవం ఫలితం.. మనదేశ పట్టాల మీద ఆ విప్లవానికి బీజం పడి ఫిబ్రవరి 3వ తేదీకి సరిగ్గా వందేళ్లు కావస్తోంది.1925 ఫిబ్రవరి 3వ తేదీ.. బొంబాయి (ప్రస్తుత ముంబై) నగరంలోని విక్టోరియా టెర్మినస్ (ప్రస్తుత ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్) రైల్వేస్టేషన్ కిక్కిరిసి ఉంది. బ్రిటిష్ అధికారులు, పోలీసుల హడావుడి మధ్య నగర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో చుక్ చుక్మనే శబ్దం, గుప్పుమనే పొగ లేకుండానే మూడు కోచ్లతో కూడిన రైలు కామ్గా వచ్చి ఆగింది. అంతే చప్పట్లతో ఆ ప్రాంతం మారుమోగింది. గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే హార్బర్ బ్రాంచి ఆ తొలి సబర్బన్ ఎలక్ట్రిక్ రైలును నడిపింది. – సాక్షి, హైదరాబాద్ముంబై–కుర్లా మార్గంలో..అప్పటికే పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలక్ట్రిక్ రైళ్లు పరుగుతీస్తున్నాయి. మన దేశంలో పెద్ద నగరమైన ముంబైలోనూ వాటిని ప్రవేశ పెట్టాలని నాటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ముంబై–కుర్లా మార్గాన్ని పూర్తి చేసింది. మన దేశంలో ప్రవేశపెట్టిన ఈ తొలి విద్యుత్ లోకోమోటివ్ను స్విస్ లోకోమోటివ్ అండ్ మెషీన్వర్క్స్ సంస్థ తయారు చేసింది. ఇంగ్లండ్లో ఉపయోగించిన న్యూపోర్ట్–షిల్డన్ విద్యుదీకరణ తరహా విధానాన్ని ఇక్కడ అనుసరించారు. దానికోసం 1,500 వోల్ట్స్ డీసీ విద్యుత్ను ఉప యోగించారు. ఈ రైలుకు మూడు కోచ్లను అనుసంధానం చేశారు. వాటిని ఇంగ్లండ్కు చెందిన కామెల్–లెయిర్డ్, జర్మనీకి చెందిన ఉర్డింగెన్ వ్యాగన్ ఫాబ్రిక్ సంస్థలు తయారు చేశాయి.వరుసగా విద్యుత్ రైళ్లను ప్రారంభిస్తూ..గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేకు పోటీగా 1929లో బాంబే బరోడా– సెంట్రల్ ఇండియా రైల్వే బాంబే చర్చ్గేట్ నుండి బోరివలి వరకు 1500 వోల్ట్స్ డీసీ కరెంటును ఉపయోగించి ఈఎంయూ రైళ్లను నడపడం ప్రారంభించింది. గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే 1928లో కొన్ని బ్యాటరీ– ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్లను దిగుమతి చేసుకుంది. ముంబై వీటీ నుంచి పుణె, ఇగత్పురి వరకు మార్గాన్ని 1929–30 నాటికి విద్యుదీకరించి కరెంటు రైళ్లను ప్రారంభించింది. ఆగస్ట్ 1927 నాటికి 41 స్విస్ క్రోకోడిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్లు ముంబైకి చేరుకున్నాయి. తర్వాతి తరం ఇంజన్లను ఇంగ్లండ్లో వల్కన్ ఫౌండ్రీ , మెట్రోపాలిటన్ వికర్స్ సంస్థల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ రెండో తరం ఇంజన్ల గరిష్ట వేగం అప్పట్లోనే గంటకు 136 కిలోమీటర్లు కావటం విశేషం. వాటిని 112 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు అనుమతించారు. కానీ మన దేశంలోని ట్రాక్ సామర్థ్యం దృష్ట్యా అవి 55 కిలోమీటర్ల వేగానికే పరిమితం అయ్యాయి.1930 తర్వాత బ్రేక్ పడి..దేశంలో వరుసగా విద్యుత్ రైళ్లను ప్రవేÔè పెడుతూ వచ్చిన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం.. 1930 తర్వాత వేగం తగ్గించుకుంది. స్వాతంత్య్రోద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటమే దానికి కారణం. 1930 నుంచి 1947 మధ్య 388 కిలోమీటర్ల మార్గాన్ని మాత్రమే విద్యుదీకరించారు. ఇక స్వాతంత్య్రం తర్వాత తొలి ఐదేళ్లు రైల్వే మార్గాల విద్యుదీకరణ పూర్తిగా నిలిచిపోయింది. 1951–56 మధ్య 141 కి.మీ. 1956–61 మధ్య 246 కి.మీ. మేర విద్యుదీకరించారు. 1961 తర్వాత వేగం పుంజుకుంది. కొత్త మార్గాలన్నీ ఎలక్ట్రిక్ విధానంలో చేపడుతూ వచ్చినా అది పరిమితంగానే ఉండిపోయింది. దీంతో 90శాతం ప్రాంతాల్లో డీజి ల్ రైళ్లే నడుస్తూ వచ్చాయి. దక్షిణ భారత్కు సంబంధించి 1931లోనే మద్రాస్ బీచ్ స్టేషన్–తాంబారం స్టేషన్ మధ్య కరెంటు రైళ్లను నడిపారు. కానీ తర్వాత పురోగతి లేకుండా పోయింది. తిరిగి 1980 దశకంలో కదలిక వచ్చింది. ఆ సమయంలోనే ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో లైన్ల విద్యుదీకరణ మొదలైంది.విజయవాడ – గూడూరు మధ్య తొలిసారిగా..విజయవాడ–గూడూరు–చెన్నై సెక్షన్ విద్యుదీకరణ పనులతో తెలుగు నేలపై కరెంటు రైళ్ల వినియోగానికి బీజం పడింది. 1976లో ప్రారంభమైన పనులు 1980 నాటికి పూర్తయ్యాయి. తర్వాత వరుసగా విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. స్థానిక పరిస్థితులు, వాతావరణ కారణాలు, సాంకేతిక సమస్యలు.. వెరసి ఒక మార్గంలో కొంతదూరం విద్యుదీకరణ పనులు పూర్తయితే.. మిగతా మార్గంలో జరిగేవి కావు. దీనితో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లకు విద్యుదీకరణ ఉన్నంత వరకు కరెంటు ఇంజిన్లు వాడి, తర్వాత డీజిల్ ఇంజిన్ జత చేసి ముందుకు పంపేవారు. ఇటీవలి వరకు ఇది కొనసాగడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో తెలంగాణ, ఏపీ సహా 20 రాష్ట్రాల్లో మొత్తం లైన్లను విద్యుదీకరించారు. ప్రస్తుతం కొత్తగా చేపట్టే రైల్వే లైన్లతో సమాంతరంగా విద్యుదీకరణ పనులు కూడా జరుపుతారు.మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలును ధ్వంసం చేసిన కార్మికులు..ప్రపంచంలో తొలి ఎలక్ట్రిక్ రైలు స్కాట్లాండ్లో రూపొందింది. అక్కడి అబెర్డీన్ నగరానికి చెందిన రసాయన శాస్త్రవేత్త రాబర్ట్ డేవిడ్సన్ 1837లో గాల్వానిక్ సెల్స్ (బ్యాటరీలు)తో నడిచే ఎలక్ట్రిక్ లోకోమోటివ్ను రూపొందించారు. అది ఫలితం ఇవ్వకపోవడంతో మార్పు లు చేసి మరో ఏడు టన్నుల బరువును లాగ గలిగిన లోకోమోటివ్ను అభివృద్ధి చేశారు. దాని వేగం గంటకు 6 కిలోమీటర్లు. ప్రయోగ పరీక్షలో ఆరు టన్నుల బరువును రెండున్నర కిలోమీటర్ల దూరం లాగింది. గ్లాస్గో రైల్వేలో దీనిని నడ పాలని నిర్ణయించారు. ఈలోపే తమ ఉద్యోగ భద్రతకు ముప్పు వస్తుందని ఆందోళన చెందిన రైల్వే కార్మికులు ఆ లోకోమోటివ్ను ధ్వంసం చేశారు.» మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ రైలును 1879లో బెర్లిన్లో వెర్నర్ వాన్ సిమెన్స్ ఆధ్వర్యంలో సిద్ధమైంది. 2.2 కిలోవాట్స్ శక్తి గల మోటారుతో నడిపారు. మూడు కోచ్లతో కూడిన ఆ రైలు గంటకు 13 కిలోమీటర్ల వేగంతో నడిచింది.» సొరంగ మార్గాలు, కిక్కిరిసిన పట్టణ ప్రాంతాల్లో డీజిల్, బొగ్గు రైలు పొగతో జనం విసిగిపోయి ఎలక్ట్రిక్ రైళ్ల వైపు మొగ్గుచూపటం ప్రారంభించారు. కొన్ని పట్టణాలు అప్పట్లోనే పొగ రైళ్లను నిషేధించాయి.» అమెరికాలో తొలి ఎలక్ట్రిక్ రైలు 1895లో మొదలైంది. బాల్టిమోర్ ఒహియోను న్యూ యార్క్ మధ్య దాన్ని ప్రారంభించారు.మన దేశంలో కరెంటు రైలు విశేషాలెన్నో..» మన దేశంలో ప్రస్తుతం వినియోగిస్తున్న విద్యుత్ లోకోమోటివ్లు 10,230, డీజిల్ ఇంజన్లు 4,560..» చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్లో 1961లో మన దేశం సొంతంగా ఎలక్ట్రిక్ లోకోమోటివ్ను రూపొందించింది. డబ్ల్యూసీఎం–5 లోకమాన్య అని దానికి పేరు పెట్టారు. అయితే ఇప్పటికీ శక్తివంతమైన లోకోమోటివ్ల తయారీ కోసం మన దేశం విదేశీ కంపెనీలపై ఆధారపడుతోంది.» 2015లో స్విస్ కంపెనీ ఆల్స్టామ్తో కేంద్రం ఒప్పందం చేసుకుని, బిహార్లోని మాధేపురాలో ఎలక్ట్రిక్ లోకోమోటివ్ల తయారీ యూనిట్ ప్రారంభించింది. ఇక్కడ 12,000 హార్స్పవర్ సామర్థ్యమున్న లోకోమోటివ్లు తయారు చేస్తున్నారు. 250 కంటే అధికంగా వ్యాగన్లు ఉండే సరుకు రవాణా రైళ్లకు ఈ లోకోమోటివ్లను వాడుతున్నారు.» ప్రపంచంలో తొలిసారిగా పాత డీజిల్ రైలు ఇంజన్ను ఎలక్ట్రిక్ లోకోమోటివ్గా మార్చిన ఘనత మన రైల్వేదే. ఇప్పటికే ప్రయోగాత్మంగా మూడు ఇంజన్లను మార్చి వినియోగి స్తున్నారు. పాత డీజిల్ ఇంజన్లన్నీ ఎలక్ట్రిక్గా మార్చే ప్రతిపాదన ఉంది. అయితే ఏదైనా సమస్య ఏర్పడి ఎలక్ట్రిక్ రైళ్ల వినియోగంలో ఇబ్బందులు తలెత్తితే.. అత్యవసరంగా వినియోగించేందుకు వీలుగా 3 వేల డీజిల్ ఇంజన్లను సిద్ధంగా ఉంచాలని రైల్వేశాఖ నిర్ణయించింది. -
ప్రయాగరాజ్ వెళ్తున్న ట్రైన్పై మధ్యప్రదేశ్లో రాళ్ల దాడి
-
కుంభమేళా రైలుపై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు
ఝాన్సీ : మహాకుంభమేళాకు వెళుతున్న రైలుపై రాళ్ల దాడి జరిగింది. మధ్యప్రదేశ్లోని హర్పాల్పూర్లో ఝాన్సీ నుండి ప్రయాగ్రాజ్ వెళ్తున్న రైలుపై అల్లరిమూకలు రాళ్లు రువ్వారు. ఈ రైలు మహా కుంభమేళాకు వెళుతోంది.ఝాన్సీ డివిజన్లోని హర్పాల్పూర్ స్టేషన్లో సోమవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అకస్మాత్తుగా రైలుపై దాడి జరిగిన నేపధ్యంలో రైలులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అల్లరిమూకలు రైలులోనికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాకపోవడంతో రాళ్లతో కిటికీలను పగులగొట్టారని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు గాయపడ్డారని సమాచారం.విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక పోలీసులతో పాటు రైల్వే రక్షణ దళం పరిస్థితిని అదుపులోనికి తెచ్చింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఛతర్పూర్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ వాల్మిక్ చౌబే మాట్లాడుతూ ఛతర్పూర్ రైల్వే స్టేషన్లో గేటు తెరవకపోవడంతో తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో కొందరు అల్లరిమూకలు రైలుపై రాళ్లు రువ్వారని తెలిపారు. ఈ రైలు ఛతర్పూర్ నుండి ప్రయాగ్రాజ్ వెళుతోందని, దాడికి పాల్పడినవారంతా పరారయ్యారని తెలిపారు.ఇది కూడా చదవండి: Baghpat Incident: లడ్డూ పండుగలో విషాదం.. ఏడుగురు మృతి -
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, 8 మంది మృతి
-
కనిపించని ఏసీ కోచ్.. కంగుతిన్న ‘రిజర్వేషన్’ ప్రయాణికులు.. తరువాత?
శీతాకాలంలో పొగమంచు కారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటం సర్వసాధారణం. అలాగే ఈ సీజన్లో రైళ్లలో సాంకేతిక సమస్యలు తతెత్తుతుంటాయి. దీనికి భిన్నమైన ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. దీనిగురించి తెలుసుకున్నవారంతా అవాక్కవుతున్నారు.రాజస్థాన్లోని జైపూర్ రైల్వే జంక్షన్(Jaipur Railway Junction)లో విచిత్రమైన ఉదంతం చోటుచేసుకుంది. జైపూర్- జైసల్మేర్ మధ్య నడుస్తున్న లీలన్ ఎక్స్ప్రెస్ (12468)లో వెళ్లేందుకు వచ్చిన 64 మంది ప్రయాణికులు ఆ సమయంలో గందరగోళానికి గురయ్యారు. వారంతా ఏసీ కోచ్లో సీటుకోసం రిజర్వేషన్ చేయించుకున్నారు. అయితే రైలులో తమ కోచ్ కనిపించకపోవడంతా వారంతా అవాక్కయ్యారు. వారు ఎదురు చూసిన రైలులో బీఈ-1 (థర్డ్ ఏసీ) కోచ్ను ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు అయోమయంలో పడ్డారు. ఇంతలో ఒక ప్రయాణికుడి దృష్టి నాన్ ఏసీ కోచ్పై పడింది. దానిపై బీఈ-1/ఎస్ఎల్ అని రాసి ఉంది. లోపలికి వెళ్లి చూసేసరికి అది స్లీపర్ కోచ్, ఏసీ కోచ్ కాదు. దీంతో ఆ 36 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అంతకంతకూ పెరుగుతున్న ఆందోళనను చూసిన రైల్వే అధికారులు(Railway officials) ఆ కోచ్ దగ్గరకు చేరుకున్నారు. వారు ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రయాణికులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ రైలులో థర్డ్ ఏసీ కోచ్ సౌకర్యం ఉండదని, స్లీపర్ కోచ్లోనే ప్రయాణించాలని వారు తెలియజేశారు. అలాంటప్పుడు థర్డ్ ఏసీ టికెట్లు ఎందుకు జారీ చేశారని పలువురు ప్రయాణికులు ప్రశ్నించారు. దీనికి అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు.వాస్తవానికి నెల్లాళ్ల క్రితమే ఈ రైలునుంచి ఏసీ కోచ్ను తొలగించారు. అయితే దీనిని టిక్కెట్లు జారే చేసే కంప్యూటర్ సిస్టమ్ నుంచి తొలగించలేదు. దీంతో టిక్కెట్లు జారీ అయ్యాయి. గత డిసెంబర్లో రైళ్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని, థర్డ్ ఏసీ క్లాస్తో కూడిన తాత్కాలిక కోచ్ను ఈ రైలుకు ఏర్పాటు చేశారు. అయితే దీనిని జనవరి ఒకటి తర్వాత తొలగించారు. సిస్టమ్ను అప్డేట్ చేయకపోవడంతో, ఈ కోచ్లో 64 మంది ప్రయాణికుల బుకింగ్ జరిగింది. తరువాత ఈ పొరపాటును అధికారులు గుర్తించారు. అయితే ఈ విషయాన్ని ప్రయాణికులకు తెలియజేయడంలో అధికారు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలున్నాయి. అయితే ఏసీబోగీలో ప్రయాణానికి టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు వారు అదనంగా చెల్లించిన సొమ్మును వాపసు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: Success Story: రూ. 5 కోట్ల టర్నోవర్కు మార్గం చూపిన ‘గుడిమల్కాపూర్’ -
కొత్త ఏడాదిలో రైల్వేశాఖ కీలక నిర్ణయాలు
భారతీయ రైల్వే 2024 ప్రారంభంలో మొదలు పెట్టిన ‘ట్రైన్ ఎట్ ఎ గ్లాన్స్(TAG)’ 44వ ఎడిషన్ రేపటి వరకు అందుబాటులో ఉంటుంది. తదుపరి ఎడిషన్ను 2025 జనవరి 1 నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. రైల్వేశాఖ కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు, పాత ఎడిషన్లోని కొన్ని అంశాలను సవరించనున్న నేపథ్యంలో దాదాపు మూడు కోట్ల మంది ప్రయాణికులు ప్రభావితం చెందుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.నమో భారత్ ర్యాపిడ్ రైల్ (Vande Metro), రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 136 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను 2025లో ప్రవేశపెట్టాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు 2024లో 70 కొత్త సర్వీసులు, 64 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టారు.ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో సమీక్షించాల్సినవి..మహాకుంభమేళా 2025 ఏర్పాట్లుజనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహించబోయే మహాకుంభమేళా(mahakumbh mela)కు భారతీయ రైల్వే ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా రైల్వే ప్రయాణాల్లో అత్యున్నత సౌకర్యాలను సిద్ధం చేస్తోంది. లక్ష మందికి పైగా ఉండటానికి, 3,000కు పైగా ప్రత్యేక రైళ్లను నడపాలని భావిస్తోంది.మహాకుంభ్ గ్రామ్మహాకుంభమేళా జరగబోయే ప్రదేశంలో త్రివేణి సంగమం పక్కనే మహాకుంభ్ గ్రామ్ అనే లగ్జరీ టెంట్ సిటీని ఐఆర్సీటీసీ(IRCTC) ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి 2025 జనవరి 10 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ ఏర్పాట్లు రానున్న రోజుల్లో రైల్వేశాఖకు భారీగా లాభాలు తీసుకొస్తాయని నమ్ముతుంది. -
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే సీన్.. ట్రైన్ చక్రాల కింద వేలాడుతూ 250 కి.మీ. జర్నీ
నమ్మండి నమ్మకపోండి.. ఇది నిజంగానే ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. రైలు చక్రాల మధ్య వేలాడుతూ ఓ వ్యక్తి చేసిన ప్రయాణం మామూలుగా లేదు. మధ్యప్రదేశ్లోని దానాపూర్ ఎక్స్ప్రెస్ రైలు బోగీ కింద దాక్కున్న ఓ వ్యక్తి.. ఇటార్సీ నుండి జబల్పూర్ వరకు దాదాపు 250 కిలోమీటర్లు రైలు బోగీ చక్రాల మధ్య వేలాడుతూ ప్రయాణించడం షాక్కు గురిచేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జబల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు రోలింగ్ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో S-4 కోచ్ కింద ఈ వ్యక్తిని గుర్తించారు.అతడిని ఆ పరిస్థితిలో చూసిన సిబ్బంది అశ్చర్యానికి గురై వెంటనే. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులకు సమాచారం అందించగా, అతనిని బోగీ కింద చక్రాల మధ్య నుంచి బలవంతంగా బయటకు తీసి అదుపులోకి తీసుకున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి రైలుకు కింద వేలాడుతూ ప్రయాణించినట్లు స్పష్టమవుతోంది.అధికారుల విచారణలో ఆ వ్యక్తి టిక్కెట్ కొనడానికి డబ్బులు లేవని.. అందువలనే ప్రయాణం కోసం ఈ రిస్క్ చేసినట్లు తెలిపాడు. ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా వివరాలు వెల్లడి కాలేదు. ఆ వ్యక్తి రైలు కింద ఎలా దాక్కున్నాడో కూడా అస్పష్టంగానే ఉంది. ప్రస్తుతం ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. #BreakingNews *"यह खबर हैरान कर देगी"**टिकट के लिए पैसा नही था, तो ट्रेन के बोगी के नीचे पहिये के पास बैठ कर एक शख्स ने किया 250 किलोमीटर का सफर!!*मध्य प्रदेश में इटारसी से जबलपुर आने वाली दानापुर एक्सप्रेस ट्रेन के S-4 बोगी के नीचे पहिये के पास बने ट्राली में एक व्यक्ति ने… pic.twitter.com/41ZUpDOBxY— THIS IS WRONG NUMBER (@Thiswrongnumber) December 27, 2024 -
డైరెక్టర్ పెళ్లిలో సందడి చేసిన హీరోయిన్.. ట్రైన్లో వెళ్తూ చిల్
బాలీవుడ్ భామ నోరా ఫతేహి ఓ పెళ్లిలో సందడి చేసింది. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ అనూప్ సర్వే పెళ్లికి హాజరైంది. అయితే ఈ వివాహా వేడుకలో పాల్గొనేందుకు రైలులో ప్రయాణించింది ముద్దుగుమ్మ. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ముంబయిలోని దాదర్ రైల్వే స్టేషన్లో ఉన్న వీడియోను పంచుకుంది.ట్రైన్లో రత్నగిరి చేరుకున్న నోరాకు ఘనస్వాగతం లభించింది. ఆ తర్వాత డైరెక్టర్ హల్దీ వేడుకలో నోరా ఫతేహీ డ్యాన్స్ కూడా చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. డైరెక్టర్ అనూప్ సర్వేతో తనకు ఎనిమిదేళ్లుగా పరిచయం ఉందని నోరా ఫతేహీ తెలిపింది. 2017 నుంచి తన సినీ ప్రయాణంలో ఉన్నాడని రాసుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే నోరా ఫతేహి చివరిసారిగా మడ్గావ్ ఎక్స్ప్రెస్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె ధృవ సర్జా నటిస్తోన్న కేడీ - ది డెవిల్తో కన్నడలో అరంగేట్రం చేస్తోంది. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
తలుపు తెరవడం లేదని.. రాళ్లతో బోగీ ధ్వంసం
లక్నో : టికెట్లు కొనుగోలు చేద్దామంటే సమయం లేదు. కూర్చుందామంటే సీటు దొరకడం లేదు. దీంతో కోపోద్రికులైన ప్రయాణికులు రిజర్వేషన్ రైలు బోగీని రాళ్లతో ధ్వంసం చేశారు. అద్దాలను పగుల గొట్టి దౌర్జన్యంగా బోగీలోకి ప్రవేశించారు. ఆ ఘటన సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ట్రైన్ నెంబర్ 15101 అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైలు బీహార్ రాష్ట్రం సారణ్ జిల్లా ఛప్రా అనే ప్రాంతం నుంచి ముంబైకి వెళ్తుంది. ఆట్రైన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మంకాపూర్ రైల్వే స్టేషన్కు వచ్చింది. ఆ సమయంలో టికెట్ కౌంటర్ వద్ద ఉన్న పలువురు ప్రయాణికులు ఆ ట్రైన్ను ఎక్కేందుకు ప్రయత్నించారు. చేతిలో టికెట్ లేదు. ఎక్కేందుకు బోగీ తలుపు తెరుచుకోవడం లేదుదీంతో ట్రైన్లోకి దౌర్జన్యంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ముందుగా రిజర్వేషన్ బోగీ మెయిన్ డోర్ అద్దాలు పగుల గొట్టి లోపలికి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అదే బోగి కిటికీలను ధ్వంసం చేశారు. పెద్ద పెద్ద బండరాలతో కిటికీ అద్దాలు,కిటికీ ఇనుప కడ్డీ గ్రిల్స్ను తొలగించారు. అనంతరం, లోపలికి వెళ్లారు. Angry passengers pelted stones at the coach due to non-opening of the gate of 15101 Antyodaya Express at Mankapur railway station, which broke the glass and caused a stampede in the train, the train was going from Chhapra to Mumbai:pic.twitter.com/Y0N5va5ImS— Ghar Ke Kalesh (@gharkekalesh) December 19, 2024ఈ ఘటన వీడియోలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతుండగా.. పలువురు నెటిజన్లు రైల్వే ప్రయాణంలో తమకు ఎదురైన ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తున్నారు. మరికొందరు మాత్రం నార్త్ ఇండియాలో ప్రయాణం నరకంతో సమానం. నేను ప్రతి సారి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఈ ప్రాంతం వైపు చట్టానికి లోబడి ప్రయాణించాలంటే మరో 50 ఏళ్లు పడుతుంది. మరికొందరు బీహార్- జార్ఖండ్ మీదుగా ఏ రైళ్ల రాకపోకల్ని నిలిపివేయాలి. ఎందుకంటే అక్కడి ప్రయాణికులు రైలులో గందరగోళం సృష్టిస్తారు. టికెట్లు కొనుగోలు చేయకుండా ట్రైన్ ఎక్కుతారు. అలాంటి వారి వల్ల తోటి ప్రయాణికుల ఇబ్బంది పడుతుంటారు’ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
రైల్వే కొత్త రూల్.. ఒరిజినల్ ఐడీ లేకుండా రైలెక్కితే..
దేశంలో అత్యధిక మంది ప్రయాణించే రవాణా సాధనం రైల్వేలు. రోజూ వేలాది రైళ్లు లక్షలాది మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. కాగా కన్ఫర్మ్డ్ టిక్కెట్లతో ప్రయాణించే వారికి, ముఖ్యంగా ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఇండియన్ భారతీయ రైల్వే కొత్త ఆదేశాన్ని జారీ చేసింది.ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తప్పనిసరిమీరు ఆన్లైన్లో టిక్కెట్లను (ఈ-టికెట్లు) బుక్ చేసుకుంటే ప్రయాణ సమయంలో ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఒరిజినల్ ఐడీ లేకుండా రైలెక్కితే టిక్కెట్ తనిఖీ చేసే టీటీఈ మిమ్మల్ని టిక్కెట్టు లేని ప్రయాణికుడిగా పరిగణించి జరిమానా విధించవచ్చు. మీ టిక్కెట్ను రద్దు చేసి, రైలు నుండి మిమ్మల్ని దించేయవచ్చు.అంగీకరించే ఐడీ ప్రూఫ్లు ఇవే.. » ఆధార్ కార్డ్» పాస్పోర్ట్» ఓటరు గుర్తింపు కార్డు» డ్రైవింగ్ లైసెన్స్» పాన్ కార్డ్» ఫోటోతో ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర ఐడీ» ఈ ఒరిజినల్ ఐడీ ప్రూఫ్లలో ఏదో ఒకదానిని ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. రైల్వేలు ప్రత్యేకంగా అనుమతిస్తే తప్ప ఫోటోకాపీలు లేదా డిజిటల్ ఐడీలను అంగీకరించరు.ఒరిజినల్ ఐడీ లేకపోతే ఏమౌంది?మీ వద్ద ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ లేకపోతే మీ ఈ-టికెట్ చెల్లనిదిగా పరిగణించి టీటీఈ జరిమానా విధిస్తారు. మీకు కన్ఫర్మ్ అయిన సీటును రద్దు చేయవచ్చు. విధించే జరిమానాలు ఏసీ తరగతులకైతే టిక్కెట్ ధరతో పాటు రూ.440, అదే స్లీపర్ క్లాస్ అయితే టిక్కెట్ ధరతో పాటు రూ.220 ఉంటుంది. జరిమానా కట్టినా కూడా మళ్లీ మీకు కేటాయింపు ఉండదు. -
రైలు నుంచి కింద పడిన వస్తువులను ఈజీగా పొందండిలా..
రైల్లో ప్రయాణ సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ప్రమాదవశాత్తు వస్తువులు కింద పడుతుంటాయి. ఆ సందర్భంలో సాధారణంగా చాలామంది ఎమర్జెన్సీ చైన్ లాగితే సరిపోతుంది అనుకుంటారు. కానీ రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు అలా చైన్ లాగితే నిబంధనల ప్రకారం జరిమానా చెల్లించడంతోపాటు, జైలుకు వెళ్లాల్సి రావొచ్చు. రైలు ప్రయాణిస్తున్న సమయంలో వస్తువులు ఏవైనా కిందపడితే వాటిని తిరిగి ఎలా పొందాలో తెలుసుకుందాం.రైలు ప్రయాణంలో ప్రమాదవశాత్తు వాలెట్, ఫోన్ వంటి విలువైన వస్తువులు కింద పడినప్పుడు వెంటనే చైన్ లాగకుండా, వస్తువులు పడిన పరిధిలోని పసుపు, ఆకుపచ్చ రంగులో ఉన్న పోల్ నంబర్ను నోట్ చేసుకోవాలి. వెంటనే టికెట్ కలెక్టర్(టీసీ)ను సంప్రదించాలి. వస్తువు పడిన ప్రదేశం వెనకాల వెళ్లిన స్టేషన్, తదుపరి స్టేషన్ వివరాలు, పోల్ నంబర్ను రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ అధికారులకు అందించాలి. పోల్ నంబర్ను ఆధారంగా చేసుకుని రెండు స్టేషన్ల మధ్య పోయిన వస్తువును వెతికేందుకు అవకాశం ఉంటుంది. ఇతర ఏదైనా సహాయం కోసం రైల్వే పోలీస్ ఫోర్స్ హెల్ప్లైన్ 182 లేదా సాధారణ రైల్వే హెల్ప్లైన్ 139కి కూడా కాల్ చేయవచ్చు.ఇదీ చదవండి: ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపుఇండియన్ రైల్వే యూఎస్, చైనా తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద రైల్వే నెట్వర్క్. రోజూ కోట్లాది మంది ప్రజలను తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ఫిబ్రవరి 1, 2023 లెక్కల ప్రకారం మొత్తం ఇండియన్ రైల్వే సర్వీసులో దాదాపు 11,75,925 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
రైల్లో మంటలు! క్షణాల్లో తప్పించుకునేలా..
రైలు వేగంగా వెళ్తోంది.. బోగీలోని ప్రయాణికుల్లో కొందరు ఫోన్ చూస్తున్నారు.. ఇంకొందరు బంధువులతో ముచ్చటిస్తున్నారు.. చిన్న పిల్లలు ఆడుతున్నారు. పెద్దవారు తమ ఆరోగ్య విషయాలను చర్చించుకుంటున్నారు..అంతలోనే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో అగ్ని జ్వాలలుగా మారాయి. పెద్దగా శబ్దం చేస్తూ ‘మంటలు.. మిమ్మల్ని మీరు కాపాడుకోండి’ అంటూ ప్రయాణికులు అరుస్తున్నారు. చెయిన్ లాగినా ట్రెయిన్ ఆగాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటి సమయంలో వారికి ‘రెడ్ విండో’ గుర్తొచ్చింది. బోగీలోని యువకుల సాయంతో అందరూ అందులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అసలు రైల్వే బోగీల్లో ‘రెడ్ విండో’ అవసరం ఏమిటి.. దాన్ని గుర్తించడం ఎలా.. అనే విషయాలు తెలుసుకుందాం.మనుషులు దూరేందుకు వీలుగా..మీరు రైలు ప్రయాణం చేసినప్పుడు దాదాపు అన్ని కోచ్ల్లో ప్రత్యేకమైన ఎరుపు రంగు విండోను గమనించే ఉంటారు. ఈ ఎరుపు రంగు విండో ప్రయాణీకుల భద్రతలో, ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. రైలు కోచ్ల్లో ఈ విండోను ప్రత్యేకంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్గా రూపొందించారు. రైల్లో ఇతర కిటీకీల మాదిరిగా దీనికి ఇనుప కడ్డీలుండవు. ఇది ఎలాంటి అడ్డంకులు లేకుండా మనుషులు దూరేందుకు వీలుగా ఉంటుంది. అత్యవసర సమయంలో వెంటనే తెరిచేలా దీన్ని డిజైన్ చేశారు.బోగీ మధ్యలో ఉన్నవారికి అనువుగా..అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు, రైలు పట్టాలు తప్పడం వంటి మరేదైనా ఎమర్జెన్సీ సమయాల్లో ప్రయాణికులు తమను తాము రక్షించుకోవడానికి ఈ రెడ్ విండోను వినియోగిస్తారు. బోగీ మెయిన్ డోర్కు దగ్గరగా ఉన్నవారు ఎలాగైనా ఆ డోర్లో నుంచి దూకి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి మధ్యలో ఉన్నవారికి ఆ అవకాశం ఉండదు. కాబట్టి రైల్వే విభాగం బోగీ మధ్యలో ఎమర్జెన్సీ విండోను అందుబాటులో ఉంచింది.ఇదీ చదవండి: షేర్లు.. ఉరితాళ్లు కాకూడదంటే..!ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డోర్లు తెరుచుకోని సందర్భాల్లో రెస్క్యూ టీమ్ ఈ ఎమర్జెన్సీ విండోస్ నుంచి బోగీలోకి ప్రవేశించి ప్రయాణికులను కాపాడేందుకు వీలుంటుంది. రైల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యలో ఉన్న వారు డోర్ నుంచి దిగిపోయి తమ వస్తువులను ఈ విండో ద్వారా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. -
42 గంటలే ప్రయాణం.. మూడేళ్లకు స్టేషన్ చేరింది
రైలు ఆలస్యంగా రావడం సర్వసాధారణమే. ఆలస్యం అంటే ఒక గంట, రెండు గంటలు.. మహా అయితే ఒక రోజు అనుకుందాం. కానీ 42 గంటల్లో గమ్యాన్ని చేరాల్సిన రైలు.. తన గమ్యాన్ని చేరుకోవడానికి 3 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి ఉత్తరప్రదేశ్లోని బస్తీకి వెళుతున్న గూడ్స్ రైలు 42 గంటల్లో గమ్యాన్ని చేరాల్సి ఉంది. 2014లో బస్తీలోని వ్యాపారవేత్త 'రామచంద్ర గుప్తా' తన వ్యాపారం కోసం విశాఖపట్నంలోని ఇండియన్ పొటాష్ లిమిటెడ్ నుంచి సుమారు రూ.14 లక్షల విలువైన డైమోనియం ఫాస్ఫేట్ (డీఏపీ) కోసం ఆర్డర్ ఇచ్చాడు.నవంబర్ 10, 2014న, షెడ్యూల్ ప్రకారం బయలుదేరిన గూడ్స్ రైలులో 1,316 బస్తాల డీఏపీ లోడ్ చేశారు. కానీ చేరుకోవాల్సిన సమయానికి ట్రైన్ చేరలేదు. రామచంద్ర గుప్తా అనేక ఫిర్యాదుల తరువాత, రైలు మార్గమధ్యంలో అదృశ్యమైనట్లు అధికారులు కనుగొన్నారు.ఇదీ చదవండి: రైల్వే ‘ఎం1’ కోచ్ గురించి తెలుసా..?2014 నవంబర్ 10న బయలుదేరిన గూడ్స్ ట్రైన్.. జూలై 25, 2018న బస్తీ స్టేషన్కు చేరింది. కానీ రామచంద్ర గుప్తా ఆర్డర్ చేసిన డీఏపీ మొత్తం పాడైపోయింది. అయితే ఇండియన్ రైల్వే చరిత్రలోనే ఇంత ఆలస్యంగా గమ్యాన్ని చేరుకున్న ట్రైన్ ఇదే కావడం గమనార్హం. ఇప్పటి వరకు కూడా ఏ ట్రైన్ ఇంత ఆలస్యంగా ప్రయాణించలేదు. -
రైల్వే ‘ఎం1’ కోచ్ గురించి తెలుసా..?
రైల్వే టికెటింగ్ విధానంలో జనరల్, స్లీపర్, ఏసీ క్లాస్ గురించి వినే ఉంటాం కదా. అయితే అందులో ఒక్కో కేటగిరీకి ఒక్కో కోడ్తో బోగీలుంటాయి. అందులో డీ క్లాస్ బోగీ, బీ1, బీ2.. ఎస్1, ఎస్2.. సీ1.. ఇలా విభిన్న కోడ్లతో బోగీలు కేటాయిస్తారు. మరి ‘ఎం1’ కోడ్తో ఉన్న బోగీల గురించి తెలుసా? అసలు ఈ కోడ్ బోగీల్లో ఉండే ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.భారతీయ రైల్వే ‘ఎం1’ కోచ్ను ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచడానికి, వారికి మరింత విలాసవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి రూపొందించింది. ఇందులో సౌకర్యాల విషయానికి వస్తే ఇంచుమిందు టైర్ 3 ఏసీ కాంపార్ట్మెంట్ వసతులే ఉంటాయి. అయితే ఎం1 బోగీలో 83 సీట్లు ఉంటాయి. కానీ టైర్ 3 ఏసీలో 72 సీట్లు ఉంటాయి. వీటితోపాటు కొన్ని కొన్ని ఫీచర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: రూ.24,900 కోట్ల అప్పు కోసం బ్యాంకులతో చర్చలు?సౌకర్యవంతమైన లెగ్స్పేస్ ఉంటుంది.దూర ప్రయాణాలకు అనువైన సీట్లు డిజైన్ చేసి ఉంటాయి.మెరుగైన ఎయిర్ కండిషనింగ్, రీడింగ్ లైట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి.ఆధునిక ఫైర్ అలారంలు, అత్యవసర కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉంటాయి.క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా సిబ్బంది అందుబాటులో ఉంటారు.వ్యక్తిగత గోప్యత, సౌకర్యం కోసం 2x2 లేదా 2x1 కాన్ఫిగరేషన్లో సీటింగ్ వ్యవస్థ ఉంటుంది.పైబెర్త్ ఎక్కేందుకు ప్రత్యేకంగా మెట్లు ఉంటాయి. -
రైలుకే ఎదురెళ్తే..
-
ఒక అపరిచితుడి దయ
ఒక మనిషి సాటి మనిషికి సాయానికి రాడని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ముక్కూ ముఖం తెలియని మనుషులు చేయందిస్తారు. అడక్కుండానే మనల్ని సమస్య నుంచి గట్టెక్కిస్తారు. అది ఎంత చిన్నదైనా సరే, ఆ సమయానికి పెద్ద సాయమే అవుతుంది. అయితే, అలాంటి మనుషులను మనం ఎంత నమ్ముతాం? చాలాసార్లు మనుషుల రూపాలను చూసి వాళ్ల గుణాలను అంచనా వేస్తుంటాం. కానీ మనుషులను చూపులతో అంచనా వేయలేం. అలాంటి సందర్భాలు మనకు చాలాసార్లు ఎదురవుతూనే ఉంటాయి. ఎవరో అపరిచితులు అనూహ్యంగా ఇతరులకు సాయపడటం, ఆ తరువాత మన జీవితాల్లోంచి వారు మాయమైపోవడం... ఓహ్! మరచిపోలేం. చేదు అనుభవాలు ఎదురైనా అవి గుర్తుంచుకోవాల్సినవి కావు.అధికారికంగా దాని పేరు ‘లండన్ అండర్గ్రౌండ్’. కానీ అందరూ పిలిచేది ‘ట్యూబ్’ అని! అది నిజంగానే గొట్టం ఆకారంలోనే ఉంటుంది మరి! కానీ, సొరంగం నుంచి రైలు ప్లాట్ఫామ్పైకి వస్తూండటాన్ని చూసినప్పుడు మాత్రం దాన్ని టూత్పేస్ట్తో పోల్చడం మేలని నాకు అనిపిస్తుంది. పదహారేళ్ల వయసులో మొట్టమొదటిసారి ట్యూబ్ను చూసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన కూడా ఇదే. విక్టోరియా స్టేషన్లో ఉన్నాను అప్పుడు నేను. అప్పుడే ఎయిర్పోర్ట్ వాహనం నుంచి కిందకు దిగాను. రెండు చేతుల్లో భారీ ట్రంకు పెట్టెలు. మీరు నమ్మినా నమ్మకపోయినా... ఆరోజు ఎయిరిండియా విమానం రెండు గంటలు ముందుగానే ల్యాండ్ అయ్యింది. నేను ఉండటానికి వెళ్తున్న నా సోదరి కిరణ్ కూడా దానికి ఆశ్చర్యపోయింది.తమ్ముడు సెలవుల కోసం అనుకోకుండా ప్రత్యక్షమవుతున్నాడన్న ఆనందం, షాక్ నుంచి కోలుకుంటూ ‘‘హీత్రూ నుంచి బస్సు పట్టుకో... బాండ్ స్ట్రీట్లో ట్యూబ్’’ అంటూ కిరణ్ తన ఇంటికి దారి చెప్పింది. ‘‘నేను ఆ పక్కన ఉంటా’’ అని ముగించింది.బాండ్ స్ట్రీట్ స్టేషన్ కిరణ్ ఆఫీసుకు దగ్గరలోనే ఉంటుంది. నాకైతే అప్పటికి లండన్ కొత్త. ఒకపక్క ఉత్సాహంగా ఉంది. ఇంకోపక్క కొంచెం ఉద్వేగంగానూ అనిపిస్తోంది. బాండ్ స్ట్రీట్ అన్నది మోనోపలి గేమ్లో కనిపించే పేరు. అక్కడున్న జనాలను చూస్తే మాత్రం అమ్మో ఇంతమందా? అనిపించక తప్పదు. అందరూ ఎవరి హడావుడిలో వారున్నారు. చాలామంది వ్యాపారాలు చేసుకునేవాళ్లనుకుంటా. ఒకరిద్దరు మాత్రం అక్కడక్కడా తచ్చాడుతూ కనిపించారు. బెల్బాటమ్ ప్యాంట్లు, పొడుచుకువచ్చినట్లు ఉన్న జుత్తుతో ఉన్న వాళ్లకు బూడిద రంగు ఫ్లానెల్స్, సరిగ్గా అమరని స్కూల్ బ్లేజర్తో ఉన్న నేను పరాయివాడినన్న విషయం ఇట్టే తెలిసిపోయేలానే ఉంది. వాతావరణం ఇలా ఉన్న సందర్భంలోనే... సొరంగం నుంచి ట్యూబ్ బయటకొస్తూ కనిపించింది. సొరంగంలో ఉండగానే వచ్చిన రణగొణ ధ్వని ట్యూబ్ వస్తున్న విషయాన్ని అందరికీ ఎలుగెత్తి చెప్పింది. శబ్దం వింటూనే చాలామంది ట్యూబ్ రాకను గుర్తించారు. సామన్లు సర్దుకుంటూ రైలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. నాకైతే అంతా కొత్త. పరిసరాలతో పరిచయమూ తక్కువే. ఏం చేయాలో తెలియకుండా అలా... చూస్తూనే ఉండిపోయా కొంత సమయం!ఎవరో గట్టిగా అరిచారు. ‘‘మిత్రమా... రా’’ అని! అప్పటికే రైలు తలుపులు తెరుచుకుని ఉన్నాయి. జనాలు లోపలికి చొరబడుతున్నారు. నేను మాత్రం నా రెండు ట్రంకు పెట్టెలతో ముందుకెళ్లేందుకు తంటాలు పడుతున్నాను. రెండింటినీ ఒక్కో చేత్తో పట్టుకున్నానా... హ్యాండ్బ్యాగ్ పట్టుకునేందుకు ఇంకో చేయి లేకుండా పోయింది. సర్దుదామనుకుంటే పెట్టెలు ఎత్తలేనంత బరువైపోతున్నాయి. ఈ లోపు పక్క నుంచి ఏదో గొంతు వినిపించింది... ‘‘ఒంటిచేత్తోనే చేయగలవు.’’ అంటూ. ‘‘రెండు, మూడు కావాలేమో’’ అని కూడా అనేసిందా గొంతు! యాభై ఏళ్లు పైబడ్డ వ్యక్తి మాటలు కావచ్చు అవి. చిందరవందర బట్టలేసుకుని ఉన్నాడు. తలపై టోపీ ఒకటి. గడ్డం కూడా సరిగ్గా గీసుకోలేదు. బహుశా కంపు కూడా కొడుతున్నాడేమో. మామాలుగానైతే ఆ వ్యక్తితో మాట్లాడేవాడిని కాదేమో. భవిష్యత్తులోనైతే అలాంటి వాళ్లకు దూరంగా జరిగిపోయేవాడినేమో. దిమ్మరి అనుకుని వారిని దూరం నుంచే కొనచూపుతో చూస్తూ ఉండేవాడిని. ఎందుకంటే అలాంటివాళ్లపై నాకున్న అయిష్టం ఇట్టే తెలిసిపోతుంది మరి. అయితే ఆ రోజు నేను ట్యూబ్ ఎక్కేనాటి పరిస్థితి వేరు. కుర్రాడిని. సాయం అవసరం ఉంది. పొగరు ఇంకా తలకెక్కి లేదు. మరీ ముఖ్యంగా... ఆ మనిషి నా ట్రంకు పెట్టెలతోపాటు హ్యాండ్ లగేజీ కూడా లాక్కున్నాడు. ట్యూబ్లోకి చేర్చాడు. ఆ వెంటనే రైలు తలుపులు మూసుకున్నాయి. ఆ వ్యక్తి నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. నోట్లో కొన్ని పండ్లు ఊడిపోయి ఉంటే... ఉన్నవి కూడా గారమరకలతో కనిపించాయి. ‘‘హమ్మయ్యా... ఎక్కేశాం’’ అన్నాడా వ్యక్తి! సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు నాకు. ఓ నీరసపు నవ్వు నవ్వి ఊరుకున్నాను. ‘‘చిటికెలో రైలు తప్పిపోయేది తెలుసా?’’ అన్నాడు. నాకేమో కొత్తవాళ్లతో మాట్లాడటమంటే భయం. అతడేమో ఒకట్రెండు మాటలతో సరిపెట్టేలా లేడు. మొత్తమ్మీద ఇద్దరి మధ్య కాసేపు మౌనమే రాజ్యమేలింది. రెండు స్టేషన్లు దాటిన తరువాత ఆ వ్యక్తి నా వైపు చూసి, ‘‘ఎక్కడికి మిత్రమా?’’ అన్నాడు. తలూపుతూ నా సమాధానం విన్నాడు. కిటికీల్లోంచి బయటకు చూడటం మొదలుపెట్టాడు. సొరంగం నల్లటి గోడలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు బయట! ఆ వ్యక్తి ఆ నల్లగోడలనే కళ్లప్పగించి మరీ చూస్తూ ఉండిపోయాడు.ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందా? అని నేను ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. లగేజీ ఎలా దింపుకోవాలన్న ఆలోచన మెదడును తొలిచేస్తోంది. ఇంతలో బాండ్స్ట్రీట్ రానేవచ్చింది. పెట్టెలు సర్దుకుందామని అనుకునే లోపే ఆ వ్యక్తి వాటిని తన చేతుల్లోకి తీసేసుకున్నాడు. ‘‘చిన్న లగేజీలు నువ్వు తీసుకో’’ అన్నాడు. ‘‘నీ సైజుకు తగ్గవి’’ అని చతుర్లాడాడు కూడా. ప్లాట్ఫామ్ చివరి వరకూ నాకు తోడుగా వచ్చాడు. ‘‘వచ్చేశాం’’ అన్నాడు. ‘‘గుడ్ లక్’’ చెప్పాడు. వచ్చినంత వేగంగా వెనక్కు వెళ్లిపోయాడు. మేమొచ్చిన వైపే వెళ్లాల్సిన ట్యూబ్ కోసం వేచి చూడటం మొదలుపెట్టాడు.ఈ సంఘటన తరువాత నేను ఆ వ్యక్తిని ఎప్పుడూ కలవలేదు. అతడు చేసిన సాయానికి థ్యాంక్స్ అయినా సరిగ్గా చెప్పానో లేదో గుర్తు లేదు. కానీ లండన్ అండర్గ్రౌండ్లో నాకు ఎదురైనా మధురమైన అనుభూతుల్లో ఇదీ ఒకటిగా నిలిచిపోయింది. ఎవరో అపరిచితులు అనూహ్యంగా ఇలా ఇతరులకు సాయపడటం ఆ తరువాత మన జీవితాల్లోంచి వారు మాయమైపోవడం... ఓహ్! మరచిపోలేం. చేదు అనుభవాలూ ఎదురవుతూంటాయి కానీ, వాటిని నేను గుర్తుంచుకోను. ఢిల్లీలోనూ మెట్రో భూగర్భ మార్గం పడుతున్న నేపథ్యంలో మనకూ ఇలాంటి అనుభవాలు బోలెడన్ని ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలు చూసిన వెంటనే మనకు కలిగే ఇంప్రెషన్ తప్పు కావచ్చు అని చెప్పేందుకు ఉపయోగపడుతూంటాయి. చూపులతోనే మనిషిని అంచనా వేయలేమని చెబుతూంటాయి!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఉన్ని దుప్పటి... ఉతికేది నెలకోసారే!
సాక్షి, హైదరాబాద్: చూడ్డానికి అందంగా ఉంటాయి.. తాకితే మెత్తగా ఉంటాయి.. కానీ, కప్పుకొంటే మాత్రం కంపు కొడుతుంటాయి. రైళ్లలోని ఏసీ కోచ్లలో ప్రయాణికులకు అందిస్తున్న దుప్పట్ల పరిస్థితి ఇది. ఈ ఉన్ని దుప్పట్లను వరు సగా 30 రోజులపాటు 30 మంది ప్రయాణికులు వాడుకున్నాకగానీ ఉతకడం లేదు. అయితే, వాటిని నిత్యం మడత నలగకుండా బ్రౌన్ కలర్ కవర్లో పెట్టి అందిస్తుండటంతో శుభ్రం చేసినవే అని ప్రయాణికులు భ్రమపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వాటిని శుభ్రం చేయకుండా 30 రోజులకంటే ఎక్కువే వాడాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు శుభ్రం చేసే లాండ్రీ వ్యవస్థ లేకపోవటమే దీనికి కారణం.మూడు నెలల నుంచి నెలకోసారి..గతంలో ఉన్ని దుప్పట్లను మూడు నెలలకోసారి ఉతికేవారు. 2010లో దాన్ని రెండు నెలలకు మార్చారు. అవి అపరిశుభ్రంగా ఉంటున్నాయన్న ఫిర్యాదులతో కనీసం నెలకోసారి ఉతకాలన్న నిర్ణయం తీసుకుని అమలులోకి తెచ్చారు. ఉన్ని దుప్పట్లను కనీసం పక్షం రోజులకోమారైనా ఉతకాలన్నది రైల్వే బోర్డు సూచన. కానీ దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. పాడయ్యే అవకాశం.. ⇒ ఉన్ని దుప్పట్లను నిత్యం ఉతకటం సాధ్యం కాదు. అలా చేస్తే అవి వెంటనే పాడైపోతాయి. రెండు నెలలకోసారి ఉతికే పద్ధతి ఉన్న సమయంలో ఉన్ని దుప్పటి జీవితకాలాన్ని నాలుగేళ్లుగా లెక్కగట్టారు. నెలకోసారి ఉతకటంతో రెండేళ్లకు తగ్గించారు. 15 రోజులకోమారు ఉతికితే ఏడాదే మన్నుతుంది. ఈ కారణంతో ఉతకటం లేదన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే, డ్రైక్లీనింగ్తోపాటు ఇతర ఆధునిక పద్థతుల్లో నాణ్యత దెబ్బతినకుండా తరచూ శుభ్రం చేయాలన్న సూచనలను రైల్వే అధికారులు పట్టించుకోవటం లేదు. త్వరలో సమస్యకు పరిష్కారం: దక్షిణ మధ్య రైల్వే ⇒ భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో బెడ్రోల్స్ వినియోగించాల్సి రానున్నందున, వాటిని ఎప్పటికప్పుడు ప్రమాణాల మేరకు శుభ్రం చేసే వ్యవస్థను అందుబాటులోకి తేబోతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొత్తగా బీఓఓటీ పద్ధతిలో భారీ సామర్థ్యంతో ఆధునిక లాండ్రీలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. హైదరాబాద్/సికింద్రాబాద్, కాచిగూడల్లో 48 టన్నుల సామర్థ్యంతో, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నర్సాపూర్లలో 10 టన్నుల సామర్థ్యంతో, తిరుపతిలో 22 టన్నులు, కాకినాడలో 6 టన్నులు, నాందేడ్, పూర్ణాలలో 8 టన్నుల సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.‘సాధారణ బెడ్రోల్స్ను నిత్యం ప్రమాణాల ప్రకారం శుభ్రం చేసి అందిస్తున్నాం. శుభ్రపరిచే క్రమాన్ని సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్నాం. ఉన్ని దుప్పట్లను మాత్రం నెలకోసారి శుభ్రం చేస్తున్నాం. అవి దుర్వాసనతో ఉన్నా, ఇతర అపరిశుభ్రతతో కనిపించినా వెంటనే శుభ్రం చేస్తున్నాం. రెండు బెడ్ïÙట్లు ఇస్తున్నందున.. వాటిల్లో ఒకదాన్ని ఈ దుప్పటితో కలిపి వాడటం వల్ల ఉన్ని దుప్పటి అంత తొందరగా అపరిశుభ్రంగా మారదు’అని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. శుభ్రమైన బెడ్ రోల్స్ను అందించేందుకు వాటి చార్జీని రైలు టికెట్ ధరలో భాగంగా వసూలు చేస్తుండటం కొసమెరుపు. ఎందుకీ పరిస్థితి?దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నిత్యం 116 రైళ్లలోని ఏసీ కోచ్లలో ఈ బెడ్ రోల్స్ సరఫరా చేయాల్సి ఉంది. నిత్యం ప్రతి బెర్త్కు రెండు బెడ్ïÙట్లు, ఒక టవల్, దిండు కవర్ అందిస్తారు. నిత్యం 38 వేల దుప్పట్లు, 1, 52,000 బెడ్షీట్స్ సరఫరా చేస్తున్నారు. వీటిని ఉతికించి శుభ్రపరిచేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏడు చోట్ల మెకనైజ్డ్ లాండ్రీలున్నాయి. రోజుకు 2 టన్నుల బెడ్రోల్స్ను శుభ్రపరిచే సామర్థ్యంతో సికింద్రాబాద్లో డిపార్ట్మెంటల్ లాండ్రీ ఉంది. ఇది రైల్వే సొంత లాండ్రీ. కాచిగూడలో 12 టన్నుల సామర్థ్యం, తిరుపతిలో 2.5 టన్నులు, కాకినాడలో 4 టన్నులు, విజయవాడలో 1.5 టన్నులు, నాందేడ్లో 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన లాండ్రీలున్నాయి. ఇవన్నీ ప్రైవేట్ సంస్థలు బీఓఓటీ (బిల్ట్ ఓవన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) పద్ధతిలో ఏర్పాటు చేసినవి. అయితే, ఇవి దక్షిణ మధ్య రైల్వే అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఇటీవల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే నడిపిన కొన్ని ప్రత్యేక రైళ్లలోని ఏసీ కోచ్లలో బెడ్ రోల్స్ సరఫరా చేయలేదు. ఈ విషయాన్ని ముందుగానే రైల్వేశాఖ ప్రకటించింది. క్రమంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో రైళ్ల సంఖ్య కూడా పెంచాల్సి వస్తోంది. ఇటీవల థర్డ్ ఏసీ ఎకానమి పేరుతో కొత్త క్లాస్ను సృష్టించటంతో రైళ్లలో ఏసీ కోచ్ల సంఖ్య పెరిగింది. ఫలితంగా బెడ్ రోల్స్ సంఖ్య కూడా పెంచాల్సి వచి్చంది. కానీ, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరిచే సామర్థ్యం లేకుండాపోయింది. -
మహా కుంభమేళాకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టిక్కెట్ల బుకింగ్ షురూ
న్యూఢిల్లీ: మహాకుంభమేళాకు వెళ్లేవారికి ఐఆర్సీటీసీ శుభవార్త చెప్పింది. యూపీలోని ప్రయాగ్రాజ్లో గల సంగమ నది ఒడ్డున భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం(ఐఆర్సీటీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇవి వీఐపీ తరహాలో ఉండనున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది.ఈ సౌకర్యాలను అందుకునేందుకు ఈరోజు(శనివారం) నుంచి బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం సంగమంలో ప్రత్యేకంగా టెంట్ సిటీని సిద్ధం చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు. దీనికి మహాకుంభ్ గ్రామ్ అని పేరు పెడుతున్నట్లు తెలిపారు. ఈ టెంట్ సిటీ ప్రయాగ్రాజ్కు పర్యాటక రంగంలో కొత్త గుర్తింపుగా మారనుంది. దీనిలో బస చేసేందుకు భక్తులు బుకింగ్ చేసుకోవచ్చు. Mahakumbh Mela 2025: మహాకుంభమేళా జరిగే తేదీలు.. ప్రాంతాలు ఇవే..ఐఆర్సీటీసీ డైరెక్టర్ (పర్యాటకం, మార్కెటింగ్) రాహుల్ హిమాలయన్ మాట్లాడుతూ డేరా నగరంలో బస చేసేందుకు ఒక వ్యక్తికి రాత్రికి రూ. 6000 (పన్నులు అదనంగా) చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇలా బుక్ చేసుకున్నవారికి అల్పాహారంతో సహా డబుల్ ఆక్యుపెన్సీ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ బుకింగ్ రద్దు చేసుకుంటే సొమ్ము రిఫండ్ ఇవ్వనున్నామన్నారు. టెన్త్ సిటీలో బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. కస్టమర్ సపోర్ట్ (వాయిస్) ఫోను నంబరు 1800110139కు కాల్ చేయవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: సహకార రంగంలో 11 కోట్ల ఉద్యోగాలు -
రూ.5 వసూలు చేసినందుకు రూ.లక్ష జరిమానా!
రైలులో వాటర్ బాటిల్, టిఫిన్, మీల్స్, టీ, కాపీ.. వంటివి ఏదైనా కొనుగోలు చేస్తే కొన్నిసార్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికుల నుంచి అధికంగా వసూలు చేస్తుంటారు. ఇటీవల అలా అసలు ధర కంటే అధికంగా వసూలు చేసిన ఓ క్యాటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా రూ.లక్ష జరిమానా విధించింది.పూజా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఓ ప్రయాణికుడు వాటర్ బాటిల్ కొనాలని నిర్ణయించుకున్నాడు. క్యాటరింగ్ సర్వీస్ ద్వారా వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడు. అందుకు సేల్స్మ్యాన్ రూ.20 డిమాండ్ చేశాడు. కానీ దాని ఎంఆర్పీ రూ.15 ఉంది. ఆ ప్రయాణికుడు రూ.5 తిరిగి ఇవ్వాలని కోరగా అందుకు సేల్స్మ్యాన్ ఒప్పుకోలేదు. దాంతో ఆ ప్రయాణికుడు ఈ వ్యవహారం అంతా వీడియో తీసి ఇండియన్ రైల్వేకు ఫిర్యాదు చేశాడు. రైల్వే హెల్ప్లైన్ నంబర్ 139కు కాల్ చేసి జరిగిన సంఘటనను వివరించాడు. కొద్దిసేపటికి క్యాటరింగ్ సర్వీస్ నుంచి ఒక ప్రతినిధి వచ్చి ప్రయాణికుడి నుంచి అధికంగా వసూలు చేసిన రూ.5 తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. అయితే కోచ్లోని ఇతర ప్రయాణికుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తాన్ని సైతం తిరిగి చెల్లించాలని అభ్యర్థించాడు. అధిక ధరలు వసూలు చేస్తుండడంపై రైల్వేశాఖ కఠినంగా వ్యవహరించింది. సదరు క్యాటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా రూ.ఒక లక్ష జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.139 पर आई ओवरचार्जिंग की शिकायत, रेलवे ने लिया फटाफट एक्शन, कैटरिंग कंपनी पर लगा एक लाख का जुर्माना।यात्रियों को ओवर चार्जिंग की राशि की गई रिटर्न! pic.twitter.com/8ZaomlEWml— Ministry of Railways (@RailMinIndia) November 23, 2024అధిక ఛార్జీలు, అనైతిక పద్ధతులకు వ్యతిరేకంగా భారతీయ రైల్వే కఠినమైన జీరో టాలరెన్స్ విధానానికి కట్టుబడి ఉందని తెలిపింది. ధరల నిబంధనలను అందరు విక్రేతలు కచ్చితంగా పాటించాలని తేల్చి చెప్పింది. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తీపికబురుభారతీయ రైల్వేకు ఫిర్యాదు చేయడానికి మార్గాలుకాల్ 139: ఇది ఇంటిగ్రేటెడ్ రైల్వే హెల్ప్లైన్ నంబర్.ఆన్లైన్: భారతీయ రైల్వే వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు గురించి పూర్తి వివరాలను ఆన్లైన్లో తెలియజేయవచ్చు. సంఘటన తేదీ, పాల్గొన్న సిబ్బంది, ప్రాంతం వంటి వివరాలతో కూడిన ఫారమ్ను పూరించాల్సి ఉంటుంది.రైల్మదద్: రైల్మదద్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మొబైల్ నంబర్, ఓటీపీ, ప్రయాణ సమాచారం, రైలు నంబర్, పీఎన్ఆర్ నంబర్ వంటి వివరాలను అందించి కంప్లైంట్ చేయవచ్చు.ఎస్ఎంఎస్: ఫిర్యాదును ఫైల్ చేయడానికి 91-9717680982కి ఎస్ఎంఎస్ చేయవచ్చు. -
గత 75 ఏళ్లుగా ఫ్రీ టిక్కెట్ సర్వీస్ అందిస్తున్న ఏకైక రైలు ఇదే..!
భారతదేశంలో ప్రతిరోజూ దాదాపు 13 వేలకు పైగా రైళ్లు నడుస్తున్నాయి. కానీ ఒక రైలు మాత్రం గత 75 ఏళ్లుగా ప్రయాణికులకు ఉచిత సర్వీస్ని అందిస్తుంది. టిక్కెట్ లేకుండా ఫ్రీగా ఈ రైలులో ప్రయాణించొచ్చు. ఇలాంటి రైల్వే సర్వీస్ కూడా ఉందా..? ఇంతకీ ఏ ట్రైయిన్ ఈ ఉచిత సర్వీస్ని అందిస్తుంది. ఇది నిజమేనా అంటే..ఇలా 75 ఏళ్లుగా ఉచిత సర్వీసులందిస్తున్న ఏకైక రైలు భాక్రా నంగల్ రైలు. ఇది నంగల్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లోని భక్రా మధ్య నడుస్తుంది. చెప్పాలంటే సుందరమైన సట్లెజ్ నది, శివాలిక్ కొండల మీదుగా వెళ్తోంది. ఈ రైలుని భాక్రానంగల్ డ్యామ్ నిర్మించే నిమిత్తం కార్మికులను తరలించడానికి ఉపయోగించేవారు. ఈ రైలు 1948 నుంచి పనిచేస్తుంది. ఇక 1953లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న డీజిల్ ఇంజన్లతో ఈ రైలుని అత్యాధునికంగా మార్చారు అధికారులు. ఈ రైలులోని సీట్లు కూడా నాటి రైళ్లులో ఉండే విధానాన్ని గుర్తుకుతెస్తుంది. ఇది మన సుదీర్ఘ రైల్వే చరిత్రకు ప్రతిబింబంగా నిలిచిన రైలు కావడంతో ఉచిత సర్వీస్ను అందించాలని నిర్ణయించారు. నిజానికి ప్రతిగంటకు ఈ రైలుకి సుమారు 18 నుంచి 20 లీటర్ల ఇంధనం ఖర్చు అవ్వుతుంది. అలాగే భక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు(బీబీఎంబీ) నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఛార్జీలు వసూలు చేయాలని భావించినా..మన సుదీర్ఘ రైల్వే వ్యవస్థకు సజీవ సాక్ష్యంగా ఉన్న ఈ రైలులో ప్రయాణికులకు ఉచిత సర్వీస్ అందించడమే సముచితమని నిర్ణయించారు అధికారులు. అందువల్లే ఈ రైలు ఎక్కాలంటే టిక్కెట్ తీసుకోవాల్సిన పనిలేదు. ప్రయాణికులందరికీ ఉచితంగానే సర్వీస్ అందిస్తోంది. ప్రతిరోజూ 800 మందికి పైగా ఈ రైలును ఉపయోగిస్తున్నారు. చాలామంది సందర్శకులకు ఇది ఓ అద్భుతమైన రైలు ప్రయాణంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రైలు నడిచే మార్గంలో కనిపించే అద్భుతమైన భాక్రా-నంగల్ డ్యామ్, శివాలిక్ కొండలు పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. సర్వీస్:ప్రతి రోజు ఉదయం 7:05 గంటలకు, రైలు నంగల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి 8:20 గంటలకు భాక్రా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నంగల్ నుంచి మధ్యాహ్నం 3:05 గంటలకు మరొక ట్రిప్కు బయలుదేరుతుంది. సాయంత్రం 4:20 గంటలకు భాక్రా రైల్వేలో ప్రయాణీకులను దింపుతుంది. (చదవండి: ఈ రాజుల విచిత్రమైన నమ్మకాలు, క్రేజీ ఆలోచనలు వింటే విస్తుపోతారు..!) -
ట్రైన్ లో తాగుతూ.. తూగుతూ..
-
దేశంలో కొత్త రకం రైలు.. నీళ్లుంటే చాలు!
దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు అతి త్వరలోనే పట్టాలెక్కనుంది. వచ్చే డిసెంబర్ నెలలోనే దీన్ని ఆవిష్కరించేందుకు ఇండియన్ రైల్వేస్ సిద్ధమైంది. డీజిల్ లేదా విద్యుత్తో పని లేకుండా నడిచే ఈ హైడ్రోజన్-ఆధారిత అద్భుతం 2030 నాటికి "నికర శూన్య కార్బన్ ఉద్గారిణి"గా మారాలన్న లక్ష్యంతో ఉన్న భారతీయ రైల్వేలకు ఒక ప్రధాన మైలురాయి కానుంది.హైడ్రోజన్తో నడిచే ఈ రైలు విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి నీటిని తన ప్రాథమిక వనరుగా ఉపయోగించుకుంటుంది. ఈ రైలులో హైడ్రోజన్ ఇంధన కణాలు ఆక్సిజన్తో రసాయన చర్య ద్వారా హైడ్రోజన్ వాయువును విద్యుత్తుగా మారుస్తాయి. ఈ విద్యుత్తుతో రైలు నడుస్తుంది. ఇందులో ఉప ఉత్పత్తులుగా వెలువడేవి నీరు, ఆవిరి మాత్రమే. అవసరమైన రసాయన ప్రక్రియల కోసం రైలుకు గంటకు సుమారు 40,000 లీటర్ల నీరు అవసరమవుతుంది.సాంప్రదాయ డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ఇంజిన్ల మాదిరిగా కాకుండా ఈ వినూత్న రైలు కదలడానికి అవసరమైన విద్యుత్ను హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి ఉత్పత్తి చేసుకుంటుంది. హైడ్రోజన్ ఇంధన ఘటాలు, ఆక్సిజన్తో కలిసి విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, నీరు మాత్రమే వెలువడుతాయి. అంటే పర్యావరణానికి హానికరమైన ఎటువంటి ఉద్గారాలు ఉండవు. ఈ క్లీన్ ఎనర్జీ విధానం దేశంలో భవిష్యత్ రైళ్లకు ప్రమాణాన్ని ఏర్పరుస్తుందని భావిస్తున్నారు.ట్రయల్ రన్హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పురాతన పర్వత ప్రాంతాల రైల్వేలైన డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే , నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కా-సిమ్లా రైల్వేతో పాటు దేశంలోని సుందరమైన, మారుమూల ప్రాంతాల వంటి అదనపు మార్గాలు కూడా పరిశీలనలో ఉన్నాయి.ఈ రైలు గరిష్టంగా గంటకు 140 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదని, ప్రయాణికులకు వేగవంతమైన , సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. రైలులోని హైడ్రోజన్ ఇంధన ట్యాంక్ ఒకసారి ఇంధనం నింపుకొంటే 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీంతో భవిష్యత్తులో సుదీర్ఘ మార్గాలకు కూడా ఈ రైళ్లు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. ఒక్కో హైడ్రోజన్ రైలు అభివృద్ధికి రూ.80 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 2025 నాటికి 35 హైడ్రోజన్ రైళ్లు వివిధ మార్గాల్లో నడపాలని భావిస్తున్నారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
-
అనకాపల్లి రైల్వే స్టేషన్లో దారుణం.. రైలు ఎక్కుతుండగా..
అనకాపల్లి జిల్లా: అనకాపల్లి రైల్వే స్టేషన్లో దారుణం చోటుచేసుకుంది. కదులుతున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కుతుండగా కాళ్లు జారి ఒక వ్యక్తి ట్రైన్కి, ఫ్లాట్ ఫారం మధ్య ఇరుక్కుపోయాడు. దీంతో ట్రైన్ నిలిపివేసి ప్లాట్ ఫారం తవ్వి కోన ఊపిరితో ఉన్న వ్యక్తిని బయటికి తీశారు. ఆ వ్యక్తిని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు
పట్నా: ఇటీవలి కాలంలో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఎక్కువైంది. అయితే ఇప్పుడు రైలులో బాంబు ఉందంటూ ఓ వార్త వచ్చింది. ఈ ఘటన బీహార్లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే బీహార్లోని దర్భంగా నుండి న్యూఢిల్లీకి వెళుతున్న బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలులో బాంబు ఉందంటూ ఢిల్లీ కంట్రోల్ రూమ్కు సమాచారం అందింది. వెంటనే రైల్వే అధికారులు రైలును యూపీలోని గోండా స్టేషన్లో నిలిపివేసి, రైలులో అణువణువుగా తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలను గోండా ఎస్పీ, ఇద్దరు ఏఎస్పీలు ఒక సివిల్ సివిల్ పోలీసులు నిర్వహించారు. ఇదేవిధంగా డాగ్ స్క్వాడ్తో సెర్చ్ ఆపరేషన్ కూడా చేపట్టారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో బాంబు బెదిరింపు కేవలం వదంతేనని తేలింది. రైల్వేశాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలును గొండా స్టేషన్లో శుక్రవారం రాత్రి 7:32 గంటలకు నిలిపివేసి తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి బాంబు లేదని తేలడంతో, రాత్రి 9:45 గంటలకు రైలు ముందుకు కదిలేందుకు అనుమతినిచ్చారు. ప్రస్తుతం పోలీసులు ఈ వదంతు వచ్చిన ఫోన్ నంబర్కు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఇది కూడా చదవండి: రక్షణ శాఖ కార్యదర్శిగా రాజేశ్ కుమార్ సింగ్ -
రైలులో అగ్ని ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు
చండీగఢ్:హర్యానాలోని రోహ్తక్లో కదులుతున్న రైలులో బాణసంచాకు మంటలంటుకున్నాయి.ఈ ప్రమాదంలో రైలులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జింద్ నుంచి ఢిల్లీ వెళుతున్న రైలులో తొలుత మంటలు లేచాయని, తర్వాత రైలు మొత్తం పొగచూరిందని జీఆర్పీ పోలీసులు తెలిపారు.రైలులో షార్ట్సర్క్యూట్ కారణంగా తొలుత మంటలు లేచాయని, ఈ మంటలు రైలులో ఉన్న ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న బాణసంచాకు అంటుకోవడంతో అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదీ చదవండి: గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు -
‘హైపర్ లూప్’పై పరిశోధన
సాక్షి, చెన్నై: రవాణా వ్యవస్థలో అతి వేగంగా దూసుకెళ్లే హైపర్ లూప్ టెక్నాలజీ రైలు సేవల మీద ఐఐటీ తయ్యూరు క్యాంపస్లో విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. చెన్నై మెట్రో రైలు, ఐఐటీ సంయుక్తంగా ఈ పరిశోధన మీద దృష్టి పెట్టింది. ఇది విజయవంతమైతే చెన్నై విమానాశ్రయం నుంచి కొత్తగా నిర్మించబోతున్న పరందూరుకు 15 నిమిషాల వ్యవధిలో దూసుకెళ్లే అవకాశం ఉంది. చెన్నైకు ప్రత్యామ్నాయంగా కాంచీపురం పరిధిలోని పరందూరులో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో చెన్నై విమానాశ్రయం నుంచి పరందూరు వైపుగా మెట్రో సేవలకు సైతం ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. పూందమల్లి వరకు ఉన్న మెట్రో రైలు సేవలను పరందూరు వరకు పొడిగించే విధంగా కార్యాచరణ చేపట్టనున్నారు. మెట్రో మార్గంలో చెన్నై నుంచి పరందూరుకు గంట సమయం పడుతుందని అంచనా. ఈ పరిస్థితుల్లో అతివేగంగా దూసుకెళ్లే హైపర్ లూప్ టెక్నాలజీ ద్వారా చెన్నై–పరందూరు మధ్య 15 నిమిషాల్లో చేరుకునేలా కొత్తమార్గంపై దృష్టి పెట్టనున్నారు. ఈ టెక్నాలజీ మీద ఐఐటీ తయ్యూరు క్యాంప్ పరిశోధకులు, విద్యార్థులు కొంతమేరకు పరిశోధనలో ఫలితాలు సాధించినట్టు సమాచారం. అసలేంటీ ‘హైపర్ లూప్’లూప్ అనేది పైప్లైన్లాంటి మార్గం. పాట్ అనే రైలు పెట్టె లాంటి వాహనంలో వాయువేగంలో దూసుకెళ్లే విధంగా ఈ టెక్నాలజీ ఉంటుంది. అయస్కాంతం సహకారంతో గాల్లో వేలాడుతూ గంటకు 600 కి.మీ వేగంతో ఈ హైపర్ లూప్ అతి వేగంగా దూసుకెళ్తుందని చెబుతున్నారు. ఈ హైపర్ లూప్లో ఒకే సమయంలో 40 మంది ప్రయాణించేందుకు వీలుంటుందని సమాచారం -
Tirumala Express: తిరుమల దూరాభారం
తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే కోస్తాంధ్ర జిల్లాల భక్తులందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క రైలు తిరుమల ఎక్స్ప్రెస్. ఈ రైలు ఎక్కితే.. స్వామి దర్శనానికి సరైన సమయంలో చేరుకోవచ్చు. అందుకే ఈ రైలుకు అంత డిమాండ్. కానీ.. ఇప్పుడా పరిస్థితులు కనిపించవేమో.? ఎందుకంటే తిరుమల ఎక్స్ప్రెస్ రూట్ మార్చేందుకు దక్షిణ మధ్య రైల్వే యత్నిస్తోంది. కొత్త రూట్కు ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వే బోర్డుకు పంపింది. వాల్తేరు డివిజన్ అభిప్రాయం తీసుకోకుండానే కుట్రకు తెర తీసినట్లు తెలుస్తోంది. సాక్షి, విశాఖపట్నం: తిరుమల ఎక్స్ప్రెస్ ఒక రైలు కాదు.. ఆధ్యాత్మిక కేంద్రం. శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు తిరుపతి వెళ్లే ప్రయాణికులు కచ్చితంగా ఎంపిక చేసుకునే మొదటి ఆప్షన్ ఈ రైలే. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే వేళలకు అనువుగా తిరుపతి చేర్చే రైలు దాదాపు ఇదే ఉంది. అందుకే తిరుమల ఎక్స్ప్రెస్ భక్తులకు సెంటిమెంట్గా మారిపోయింది. ఈ ఎక్స్ప్రెస్కి వెళ్తేనే తిరుపతి వెళ్లి.. ఏడుకొండల వాడి దర్శనం సజావుగా సాగుతుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. అందుకే ఈ రైలు ప్రతి రోజూ 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో పరుగులు పెడుతుంటుంది. వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత పెరిగిపోయినా.. రిజర్వేషన్ కన్ఫర్మ్ అవుతుందనే ఏదో ఒక నమ్మకంతో ఈ రైలుకే రిజర్వేషన్ చేస్తుంటారు. ఒక వేళ సీటు దొరక్కపోయినా నిలబడైనా వెళ్లేందుకు సిద్ధమైపోతుంటారు.దర్శన వేళలకు అనువైన రైలుతిరుమల దర్శనానికి అన్ని ప్రాంతాల వారికీ అనువైన రైలు ఇదే. 17488 నంబర్తో నడిచే ఈ సర్వీస్ విశాఖలో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతుంది. తిరుపతి రైల్వేస్టేషన్కు తర్వాత రోజు వేకువజామున 4.30కి చేరుకుంటుంది. అక్కడ దిగే భక్తులు అలిపిరి మార్గంలోనైనా, శ్రీవారి మెట్ల మార్గంలోనైనా వెళ్లేందుకు సరైన సమయం ఇది. అంటే తిరుపతిలో దిగి స్నానమాచరించి శ్రీవారి మెట్ల మార్గానికి ఉదయం 6 గంటలకు చేరుకుంటే ఉదయం 10 లేదా 11 గంటల దర్శనానికి టోకెన్ లభిస్తుంది. ఆ టోకెన్తో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణం కూడా సులువవుతుంది. అందుకే తిరుమల ఎక్స్ప్రెస్నే అందరూ నమ్ముకుంటారు.అదనంగా నాలుగైదు గంటలు వృథావాస్తవానికి ఈ రైలు ఈస్ట్కోస్ట్ జోన్ పరిధిలో ఉన్నప్పటికీ.. నడిచే రూట్ మొత్తం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ఉంది. విశాఖలో బయలుదేరి దువ్వాడ వరకు మాత్రమే ఈస్ట్కోస్ట్ పరిధిలోకి వస్తుంది. మిగిలినదంతా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉంది. అంతే కాకుండా ట్రైన్ టెర్మినేటింగ్ కూడా ఆ జోనే చూస్తోంది. అందుకే తిరుమల ఎక్స్ప్రెస్ రూట్ మార్చే ప్రతిపాదనలు చేసేందుకు ఆ జోన్కు అన్ని అర్హతలున్నాయి. దీన్ని ఆసరాగా తీసుకుని కొన్ని రూట్లకు రైలు అవసరమని.. అందుకే తిరుమల ఎక్స్ప్రెస్ను ఆ వైపుగా దారి మళ్లించేందుకు అంగీకరించాలంటూ రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపించింది. విజయవాడ నుంచి ఒంగోలు మీదుగా కాకుండా.. విజయవాడ నుంచి గుంటూరు, నంద్యాల, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట మీదుగా తిరుపతి వెళ్లేలా రూట్ మార్పులకు అనుమతి కోరింది. దీనికి బోర్డు ఓకే చెబితే.. మన ప్రయాణం మరింత భారంగా మారుతుంది. ప్రస్తుతం విశాఖపట్నంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ రైలు ఎక్కితే 14.30 గంటల పాటు తిరుపతికి ప్రయాణం సాగుతుంది. కొత్త రూట్ అయితే మరో 5 గంటలు అదనపు సమయం పడుతుంది. అంటే విశాఖపట్నంలో మధ్యాహ్నం రెండు గంటలకు రైలు ఎక్కితే.. తర్వాత రోజు ఉదయం 9 లేదా 10 గంటలకు తిరుపతి చేరుకుంటారు. దీని వల్ల దర్శన వేళలకు అందే అవకాశం ఉండదు. ఈ రూట్ మార్చితే ఉత్తరాంధ్రతో పాటు విజయవాడ వరకూ ఉన్న భక్తులు తిరుమల వెళ్లేందుకు అవస్థలు తప్పవు. దక్షిణ మధ్య రైల్వే దుర్బుద్ధిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రూటు మారితే చేటే.!1970లో ప్రారంభమైన తిరుమల ఎక్స్ప్రెస్ సర్వీస్ కొన్నేళ్ల కిందట కడప వరకూ పొడిగించారు. అయినప్పటికీ కోస్తాంధ్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కారణం తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకున్న తర్వాత కడప వెళ్లేది. ఇప్పుడు మరోసారి రూట్ మార్చేందుకు దక్షిణ మధ్య రైల్వే కుయుక్తులు పన్నుతోంది. ప్రస్తుతం ఈ రైలు విజయవాడ నుంచి ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట జంక్షన్ మీదుగా తిరుపతి చేరుకుని అక్కడి నుంచి కోడూరు, రాజంపేట మీదుగా కడప వెళ్తుంది. అయితే ఈస్ట్కోస్ట్ రైల్వే పరిధిలోని తిరుమల ఎక్స్ప్రెస్ సర్వీసు రూటు మార్చాలని దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు భావిస్తున్నారు. కారణాలు ఏమీ చెప్పకుండానే రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలు ఒప్పుకుంటే ఇకపై విజయవాడ నుంచి ఒంగోలు వైపుగా వెళ్లకుండా.. గుంటూరు మీదుగా నడుస్తుంది. ఇదే జరిగితే భక్తులు తిరుపతి వెళ్లే సమయం పూర్తిగా మారిపోతుంది. వేళకు స్వామి దర్శనానికి అందే పరిస్థితి ఉండదు.ఇదేం రూట్ మార్పు?తిరుమల ఎక్స్ప్రెస్ అంటే మాకో నమ్మకం. ఎప్పుడు తిరుపతి వెళ్లాలన్నా.. ఈ రైలునే ఎంచుకుంటాం. ఎందుకంటే వేకువ జామునే తిరుపతి చేరుకుంటుంది. అక్కడ నుంచి ఎండ పెరిగే లోపు మెట్లమార్గంలోనైనా.. కాలినడకనైనా.. ఏ దర్శనానికై నా నిర్ణీత సమయానికి తిరుమలకు చేరుకుంటాం. దర్శనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ప్రయాణం సాగిపోతుంది. అలాంటి రైలు రూట్ను మార్చడం సరికాదు. రైల్వే అధికారులు దీనిపై పునరాలోచించాలి.– ఎం.ఉషారాణి, సీతమ్మధారప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాలితిరుపతి వెళ్లే ప్రతి భక్తుడూ దశాబ్దాలుగా తిరుమల ఎక్స్ప్రెస్ను నమ్ముకుంటున్నారు. అలాంటి ఈ రైలును వేరే మార్గంలో తిప్పాలని ఎలా ప్రతిపాదిస్తారు? జోన్ అధికారులకు భక్తుల మనోభావాలతో సంబంధం లేదా? కొత్త రూట్లో తిప్పితే కోస్తాంధ్ర జిల్లాల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు రైల్వే బోర్డుపై ఒత్తిడి తేవాలి. సౌత్ సెంట్రల్ జోన్ పంపిన ప్రతిపాదనలు తిప్పికొట్టేలా పోరాడాలి.– కె.రామసుధ, ప్రయాణికురాలు -
వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్.. అట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు
-
కిలో ఉల్లి రూ. 35.. ఎక్కడంటే?
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పండుగల సీజన్లో ఉల్లికి మరింత డిమాండ్ ఉంటుంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.ఢిల్లీలో ఉల్లి ధరలు మండుతున్న నేపధ్యంలో ప్రభుత్వం మహారాష్ట్ర నుంచి ఉల్లిని భారీగా దిగుమతి చేసుకుంది. మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయల లోడుతో బయలు దేరిన కందా ఎక్స్ప్రెస్ రైలు ఢిల్లీకి చేరుకుంది. ఈ ఉల్లిని ఢిల్లీలోని ఎన్సీసీఎఫ్, ఎన్ఏఎఫ్ఈడీలతో పాటు వ్యాన్ల ద్వారా ప్రభుత్వం కేజీ రూ. 35కు విక్రయిస్తోంది. ఢిల్లీ రిటైల్ మార్కెట్లో ఉల్లి ధర కిలో 75 రూపాయలకు చేరుకుంది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీపావళికి ముందుగానే ఉల్లి ధరలను నియంత్రించేందుకు భారతీయ రైల్వే సహాయంతో ఢిల్లీలోని హోల్సేల్ మార్కెట్లకు 1,600 టన్నుల ఉల్లిపాయలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబరు నెల నుండి ఉల్లిపాయలు, టమోటాలు, కూరగాయల ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.ఇది కూడా చదవండి: భారతీయులకు ఏ సీజన్ అంటే ఇష్టం? -
దూసుకొస్తున్న రైలు.. ఎదురుగా 60 ఏనుగులు.. తరువాత?
గౌహతి: అస్సాంలో తృటిలో రైలు ప్రమాదం తప్పింది. లోకో పైలట్ అప్రమత్తతతో దాదాపు 60 ఏనుగులు ప్రమాదం బారి నుంచి బయపడ్డాయి. అర్దరాత్రి ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ దాటుతోంది.. ఇంతలో ఒక రైలు అతివేగంతో అదే పట్టాల మీదుగా వస్తోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)భద్రతా వ్యవస్థ లోకో పైలట్కు సిగ్నల్ రూపంలో ఈ విషయాన్ని తెలిపింది. వెంటనే లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు.మీడియాకు అందిన వివరాల ప్రకారం అక్టోబర్ 16న కమ్రూప్ ఎక్స్ప్రెస్ నడుపుతున్న లోకో పైలట్ జెడీ దాస్, అతని సహాయకుడు ఉమేష్ కుమార్ రాత్రి 8.30 గంటలకు హవాయిపూర్- లాంసాఖాంగ్ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ను దాటుతున్న ఏనుగుల గుంపును చూశారు. ఆ రైలు గౌహతి నుంచి లుమ్డింగ్కు వెళ్తోంది. వారు ఏనుగులను చూడగానే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు వేసి, ఏనుగుల గుంపునకు కొద్ది దూరంలో రైలును ఆపారు. దీంతో 60 ఏనుగులు ప్రమాదం బారి నుంచి బయటపడ్డాయి.ఈస్ట్ సెంట్రల్ రైల్వే తన పరిధిలోని అన్ని కారిడార్లలో ఏఐ వ్యవస్థను క్రమంగా నెలకొల్పుతోంది. రైల్వే ట్రాక్లోకి ప్రవేశించిన ఏనుగుల ప్రాణాలను కాపాడడంలో ఈ వ్యవస్థ విజయవతంగా పనిచేస్తోంది. తూర్పు మధ్య రైల్వే 2023లో 414 ఏనుగులను, ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 16 వరకు 383 ఏనుగులను రక్షించింది.ఇది కూడా చదవండి: Subrahmanyan Chandrasekhar: చుక్కల్లో చంద్రుడు -
గుంటూరు: రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెదకాకాని సమీపంలో రైలు కింద పడి ప్రేమికుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతులను దానబోయిన మహేశ్, నండ్రు శైలజగా గుర్తించారు. పెదకాకానికి చెందిన మహేశ్, నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలు గత కొంత కాలంగా లవ్లో ఉన్నారు.రెండేళ్ల క్రితం మహేశ్.. హైదరాబాద్లోని ఓ స్టోర్లో పని చేస్తుండగా.. శైలజతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవలే ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది.అయితే, పెళ్లికి యువతి కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దీంతో కొన్ని రోజుల క్రితం శైలు, మహేశ్ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా, ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్పై పడి ఉన్నారు.ఇదీ చదవండి: టీడీపీ నేత రాసలీలలు.. వీడియో లీక్ -
నిలిచిన వందేభారత్
బాపట్ల టౌన్: వర్షాల కారణంగా ట్రాక్ దెబ్బతినడంతో బాపట్ల ప్రాంతంలో వందేభారత్ రైలు సుమారు గంటన్నరకుపైగా నిలిచిపోయింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందేభారత్ రైలు సోమవారం సాయంత్రం 6.12 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరింది. 7.45 గంటలకు గుంటూరు చేరుకోవాల్సి ఉంది.7 గంటలకు పొన్నూరు మండలం మాచవరం రైల్వేస్టేషన్ ప్రాంతానికి చేరుకునే సమయానికి మాచవరం సమీపంలో ట్రాక్ దెబ్బతిన్న సమాచారం అందుకున్న లోకో పైలట్ రైలు నిలిపేశాడు. ట్రాక్ ఏ ప్రాంతంలో దెబ్బతిందో.. ఎంతమేర దెబ్బతిందనే విషయంపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో రైలును మాచవరం నుంచి అప్పికట్ల రైల్వేస్టేషన్ వరకు వెనక్కి తీసుకొచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో ట్రాక్ మరమ్మతు చేయడంతో రైలు యధావిధిగా గుంటూరు వైపు ప్రయాణించింది. -
Tiruvallur: సహాయక చర్యలు ముమ్మరం
-
స్లీపర్ వందేభారత్ జిగేల్..!
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే గతిని మార్చిన ‘వందేభారత్’సిరీస్లో స్లీపర్ బెర్తులతో కూడిన రైలు త్వరలో పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. పరిమిత దూరంలో ఉన్న నగరాల మధ్య 160 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లు.. ఇక వేయి కిలోమీటర్లను మించిన దూరంలో ఉన్న ప్రాంతాల మధ్య తిరిగేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకుగాను తొలిసారి స్లీపర్ బెర్తులతో కూడిన వందేభారత్ రైలు పూర్తిస్థాయిలో సిద్ధమై తొలి పరుగుకు సన్నద్ధమైంది. ఇప్పటి వరకు మన రైళ్లలో కనిపించని ఆధునిక రూపుతో ఇవి కళ్లు చెమర్చేలా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.రైల్వే శాఖ మంత్రి అశ్వీనీవైష్ణవ్ ఇటీవల ఈ రైలును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ఆమోదముద్ర పడటంతో మరిన్ని రైళ్ల తయారీ కూడా ఊపందుకుంది. త్వరలో దేశంలోని ప్రధాన ప్రాంతాల మధ్య ఇవి రాత్రి వేళ పరుగులు పెట్టబోతున్నాయి. 14 రూట్లలో వీటినే నడిపే ఆలోచనలో రైల్వే అధికారులు ఉన్నారు. స్వదేశీ పరిజ్ఞానం, పూర్తిస్థాయి అగ్ని నిరోధక భద్రతా ప్రమాణాలతో ఈ రైలు రూపుదిద్దుకుంది. ⇒ ఈ రైలును ఆస్టెనిటిక్ స్టెయిన్లెస్ స్టీల్తో రూపొందించారు. వందేభారత్ తరహాలో దీని వెలుపలి రూపు ఏరో డైనమిక్ డిజైన్తో కనువిందు చేయనుంది. ⇒ ఇంటీరియర్ను జీఎఫ్ఆర్పీ ప్యానల్తో రూపొందించారు. ⇒ అగ్ని నిరోధ వ్యవస్థ ఈఎన్ 45545 ప్రమాణ స్థాయితో రూపొందింది (హజార్డ్ లెవెల్:3). ⇒ దివ్యాంగులు కూడా సులభంగా వినియోగించగలిగే పద్ధతిలో ప్రత్యేక బెర్తులు ఇందులో పొందుపరిచారు. ⇒ ఆటోమేటిక్ పద్ధతిలో తెరుచుకొని, మూసుకునే పద్ధతి గల డోర్లు ఏర్పాటు చేశారు. ఇవి సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్తో పనిచేస్తాయి. ⇒ దుర్వాసనను నియంత్రించే ప్రత్యేక వ్యవస్థతో కూడిన పూర్తి సౌకర్యవంతమైన టాయిలెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. లోకోపైలట్ల కోసం ప్రత్యేక టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ⇒ మొదటి శ్రేణి ఏసీ కోచ్లో వేడి నీటితో కూడిన షవర్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ⇒ కోచ్లలోని బెర్తుల వద్ద రీడింగ్ లైట్లు, యూఎస్బీ చార్జింగ్ వసతి ఉంటుంది. ⇒ అనౌన్స్మెంట్ల కోసం ఆడియో, వీడియో వ్యవస్థ, ప్రయాణికుల లగేజీ భద్రపరిచేందుకు విశాలమైన కోచ్ ఉంటుంది. మొత్తం 16 కోచ్లు ఈ ఆధునిక స్లీపర్ వందేభారత్ రైలులో 16 కోచ్లు ఉంటాయి. అప్పర్ బెర్తులోకి చేరుకునేందుకు ప్రత్యేక నిచ్చెన తరహా ఏర్పాటు ఉంటుంది. మిడిల్ బెర్తు నారింజ రంగులో, లోయర్, అప్పర్ బెర్తులు గ్రే కలర్లో ఉంటాయి. అప్పర్ బెర్తులను నిలిపి ఉంచేందుకు గతంలో గొలుసు తరహా ఏర్పాటు ఉంటే, ఇందులో ప్రత్యేక స్టీల్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. బెర్తుల వద్ద మేగజైన్ బ్యాగు, మొబైల్ ఫోన్ పెట్టుకునే బాక్సు ఏర్పాటు చేశారు. బెర్తులు ఆరడుగుల పొడవుతో ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ, రైల్వే సిబ్బందికి ప్రత్యేక గది ఏర్పాటు చేశారు. లోకో పైలట్తో నేరుగా మాట్లాడేందుకు ప్రత్యేక ఆడియో వ్యవస్థ అక్కడ అందుబాటులో ఉంటుంది. -
విజయవాడలో కలకలం.. గంజాయి బ్యాచ్ దాడిలో లోకో పైలట్ మృతి
-
మరో రైలు ప్రమాదానికి కుట్ర.. తప్పిన ముప్పు
మహోబా: ఉత్తరప్రదేశ్లో మరో రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. రైల్వే ట్రాక్పై కాంక్రీట్ పిల్లర్ను ఉంచిన ఉదంతం మహోబా జిల్లాలోని కబ్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ ట్రాక్పై వస్తున్న ప్యాసింజర్ రైలు డ్రైవర్ ఆ పిల్లర్ను చూసి, ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపాడు. రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు మహోబా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అలాగే ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన గురించి స్థానిక పోలీసు అధికారి దీపక్ దూబే మాట్లాడుతూ.. కబ్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందా-మహోబా రైల్వే ట్రాకపై ఫెన్సింగ్ పిల్లర్ ఉంచినందుకు 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నామని, అతనిని విచారిస్తున్నామన్నారు. ప్యాసింజర్ రైలు డ్రైవర్ ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ట్రాక్పై ఉంచిన పోల్ను తొలగించిన అనంతరం ఆ మార్గంలో రైలు రాకపోకలకు సంబంధిత అధికారులు అనుమతిచ్చారని అన్నారు.ఇదేవిధంగా బల్లియా జిల్లాలోని బైరియా ప్రాంతంలో రైలు ఇంజన్.. ట్రాక్పై ఉంచిన రాయిని ఢీకొంది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వారణాసి-బల్లియా-ఛప్రా రైల్వే సెక్షన్లో పట్టాలపై రాయి కనిపించిందని నార్త్ ఈస్టర్న్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అశోక్ కుమార్ తెలిపారు. ట్రాక్పై రాళ్లను చూసిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసినట్లు కుమార్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, పిల్లర్లు మొదలైనవి పెడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్నాయి.ఇది కూడా చదవండి: World Heart Day: హృదయ ఆరోగ్యానికి ఐదు జాగ్రత్తలు -
గుజరాత్లో రైలును పట్టాలు తప్పించేందుకు కుట్ర
బొటాడ్: ఇటీవలి కాలంలో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా గుజరాత్లోని బొటాడ్ జిల్లా కుండ్లి గ్రామ సమీపంలోని రైలును పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగింది. ట్రాక్పై పడివున్న రైలు పట్టా భాగాన్ని ఢీకొన్న పాసింజర్ రైలు అక్కడే నిలిచిపోయింది.ఈ ఘటన నేపధ్యంలో ఓఖా భావ్నగర్ పాసింజర్ రైలు అర్థరాత్రి సుమారు 3 గంటల పాటు పట్టాలపైనే నిలిచిపోయింది. అనంతరం రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్, రాన్పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పట్టాలను సరిచేసి, మరో ఇంజిన్ సాయంతో ఆ రైలును అక్కడి నుంచి ముందుకు పంపించారు. ఈ ఘటన గుజరాత్లోని బొటాడ్లోని రాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ట్రాక్పై ఎవరో నాలుగు అడుగుల పొడవైన పాత ట్రాక్ భాగాన్ని ఉంచారు. దీనిని ఢీకొన్న గూడ్సు రైలు అక్కడే ఆగిపోయింది. రైల్వే పోలీసులు, అధికారులు పరిస్థితిని చక్కదిద్ది, తిరిగి రైళ్లు యధావిధిగా నడిచేలా చూశారు. రాన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: త్వరలో తొలి ఎయిర్ ట్రైన్.. ప్రత్యేకతలివే -
త్వరలో తొలి ఎయిర్ ట్రైన్.. ప్రత్యేకతలివే
న్యూఢిల్లీ: దేశంలోనే తొలి ఎయిర్ ట్రైన్ (ఆటోమేటెడ్ పీపుల్ మూవర్-ఏపీఎం) సర్వీసు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభం కానుంది. ఎయిర్ ట్రైన్ అనేది మెట్రో తరహాలోని డ్రైవర్ లేని రైలు.ప్రయాణికులు ఇప్పటివరకూ విమానాశ్రయంలోని మూడు టెర్మినళ్లకు వెళ్లేందుకు, లేదా విమానాన్ని డీబోర్డింగ్ చేశాక క్యాబ్ను ఎక్కేందుకు బస్సు సర్వీస్ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుంది. ఈ ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం రూ. రెండువేల కోట్లతో 7.7 కి.మీ. పొడవున ఎయిర్ రైలు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2027 నాటికి ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతమున్న బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. 🚨 Delhi airport to get India's first air train by 2027, connection terminals 1, 2, and 3. pic.twitter.com/z9Qsiok9t9— Indian Tech & Infra (@IndianTechGuide) September 24, 2024ఎయిర్ ట్రైన్ అనేది పరిమిత సంఖ్యలో కంపార్ట్మెంట్లను కలిగి ఉంటుంది. ఇది ట్రాక్లపై నడుస్తుంది. నిర్ణీత ట్రాక్లో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళుతుంది. దీంతో వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. విమానాశ్రయంలోని ఇతర టెర్మినళ్లు, పార్కింగ్ స్థలాలు, క్యాబ్ పికప్ పాయింట్లు, హోటళ్లు మొదలైన వాటిని చేరుకోవడానికి ఎయిర్ ట్రైన్స్ ఉపయోగపడతాయి. ఇది కూడా చదవండి: చైనా క్షిపణి ప్రయోగం.. అమెరికా, తైవాన్, జపాన్లకు ముప్పు -
పట్టాలు తప్పించే కుట్ర.. ఆ ముగ్గురు రైల్వే ఉద్యోగుల పనే
సూరత్: ఇటీవలికాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా గుజరాత్లో జరిగిన ఇటువంటి దుశ్చర్య వెనుక రైల్వే ఉద్యోగులే ఉన్నారని తెలియడంతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులు, పోలీసులు కంగుతిన్నారు.గుజరాత్లోని సూరత్లో కీమ్-కొసాంబ మధ్య రైలును పట్టాలు తప్పించేందుకు ఇటీవల కుట్ర జరిగింది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రైల్వే ఉద్యోగి సుభాష్ పొద్దార్ ఈ కేసులో నిందితునిగా గుర్తించింది. సుభాష్ తన ప్రమోషన్ కోసం రైలును పట్టాలను తప్పించాలని ప్లాన్ చేశాడని, ట్రాక్లపై ఉన్న ఫిష్ ప్లేట్, కీలను అతనే తొలగించాడని ఎన్ఐఏ అధికారులు కనుగొన్నారు. ట్రాక్ల నుండి 71 ఫిష్ ప్లేట్లు, కీలను సాధారణ వ్యక్తి సులభంగా తొలగించలేడు.ఎన్ఐఏకు తొలుత ఘటనా స్థలంలో ఎలాంటి పాదముద్రలు లేదా ఇతర అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. అయితే రైలు పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగిందని ముందుగా రైల్వే ఉన్నతాధికారులకు చెప్పిన రైల్వే ఉద్యోగి సుభాష్ పొద్దార్ను ఎన్ఐఏ అధికారులు అనుమానించారు. ఈ కేసులో సుభాష్ కుమార్ కృష్ణదేవ్ పోద్దార్, మనీష్ కుమార్ సుర్దేవ్ మిస్త్రీ, శుభం శ్రీజైప్రకాష్ జైస్వాల్ అనే ముగ్గురు రైల్వే ఉద్యోగులను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ఇద్దరు బీహార్కు చెందిన వారు కాగా, ఒకరు యూపీకి చెందిన ఉద్యోగి. రైల్వేలో పనిచేస్తున్న వీరు పదోన్నతి పొందేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అధికారులు విచారణలో అంగీకరించారు.రైలు ప్రమాదాలను నివారించే రైల్వే ఉద్యోగులకు రివార్డులతో పాటు ప్రమోషన్ కూడా వస్తుందని, ఈ ఆశతోనే తాము ఈ చర్యకు పాల్పడినట్లు నిందితులు అధికారులకు తెలిపారు. ఈ రైల్వే ఉద్యోగులే స్వయంగా రైలు పట్టాలకున్న 71 ఫిష్ ప్లేట్లు, కీలను తొలగించి, ఆ పక్కనే ఉంచారు. తరువాత రైల్వే ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు, ఈ విషయాన్ని వారికి తెలిపారు. దీంతో అధికారులు రైల్వే ఉద్యోగి సుభాష్ పోద్దార్ను మెచ్చుకున్నారు. అయితే ఎన్ఐఏ విచారణలో ఈ ముగ్గురు రైల్వే ఉద్యోగులు తప్పుడు కథనాన్ని అల్లి ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించారని తేలింది. పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: కోటక్ మహేంద్ర బ్యాంక్ చైర్మన్పై ఫోర్జరీ కేసు.. -
పట్టాలు తప్పిన ముజఫర్పూర్- పూణె స్పెషల్ రైలు
ముజఫర్పూర్: బీహార్లోని ముజఫర్పూర్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ముజఫర్పూర్- పూణే ప్రత్యేక రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదు.ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ముజఫర్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. ఈ ప్రత్యేక రైలు (05389) ముజఫర్పూర్ నుంచి పూణెకు వెళ్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఇంజిన్ను తిరిగి ట్రాక్పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంజిన్ సెట్టింగ్ కోసం వెళుతుండగా ఇంజిన్కున్న మూడు జతల ఫ్లైవీల్స్ పట్టాలు తప్పాయని తెలుస్తోంది.ఈ ప్రమాదానికి ముందు ఢిల్లీ- మధుర మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు ఆగ్రాలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయ ప్రజాసంబంధాల అధికారి ప్రశస్తి శ్రీవాస్తవ తెలిపారు.ఈ రైలు పట్టాలు తప్పిన కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు చీఫ్ పీఆర్వో ఎన్సీఆర్ శశికాంత్ త్రిపాఠి తెలిపారు. ఈ రైలు పట్టాలు తప్పడంతో మూడు రైల్వే లైన్లలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడిందని ఆగ్రా డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ తేజ్ ప్రకాశ్ అగర్వాల్ విలేకరులకు తెలిపారు. సూరత్గఢ్ పవర్ ప్లాంట్ కోసం బొగ్గును తీసుకువెళుతున్న గూడ్సు రైలులోని ఇరవై ఐదు కోచ్లు బృందావన్ యార్డ్ తర్వాత పట్టాలు తప్పాయని, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అగర్వాల్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: న్యూజిలాండ్ పైలట్కు 19 నెలల తర్వాత విముక్తి -
Gujarat: రైలు పట్టాలు తప్పేందుకు కుట్ర... తప్పిన ముప్పు
సూరత్: గుజరాత్లో రైలును పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగింది. ఇది భగ్నం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సూరత్ సమీపంలోని వడోదర డివిజన్ పరిధిలోగల అప్ లైన్ రైల్వే ట్రాక్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ట్యాంపరింగ్ చేశారు. ట్రాక్లోని ఫిష్ ప్లేట్, కీని తెరిచివుంచారు. దీని వల్ల పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది.దీనిని గుర్తించిన పశ్చిమ రైల్వే (వడోదర డివిజన్)అధికారులు కొద్దిసేపు రైళ్ల రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చింది. పూర్తిస్థాయిలో తనిఖీలు, మరమ్మతులు చేసిన దరిమిలా రైలు సేవలను పునరుద్ధరించారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ రైల్వే ప్రమాదాలకు కారణమయ్యే ఏ కుట్రనైనా భగ్నం చేస్తామని, దేశవ్యాప్తంగా 1.10 లక్షల కిలోమీటర్ల పొడవైన రైల్వే నెట్వర్క్ భద్రత కోసం ప్రభుత్వం త్వరలో నూతన ప్రణాళికను తీసుకువస్తుందని అన్నారు.రైల్వే భద్రతపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో చర్చించినట్లు అమిత్షా తెలిపారు. రైల్వే నెట్వర్క్ భద్రత కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), రైల్వే పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని, తద్వారా కుట్రలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. కాగా మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే 38 రైల్వే ప్రమాదాలు జరిగాయని కాంగ్రెస్ పేర్కొంది. ఈ ప్రమాదాలను మంత్రి వైష్ణవ్ చిన్న ఘటనలుగా కొట్టిపారేస్తున్నారని ఆరోపించింది.ఇది కూడా చదవండి: Jharkhand: నేడు, రేపు ఐదు గంటలు ఇంటర్నెట్ బంద్#WATCH | Gujarat | Some unknown person opened the fish plate and some keys from the UP line track and put them on the same track near Kim railway station after which the train movement was stopped. Soon the train service started on the line: Western railway, Vadodara Division pic.twitter.com/PAf1rMAEDo— ANI (@ANI) September 21, 2024 -
స్పీడ్ తక్కువ.. సమయం ఎక్కువ
గజ్వేల్: మనోహరాబాద్ మీదుగా సిద్దిపేటకు వచ్చే రైలు స్పీడ్ తక్కువగా ఉండటం, ప్రయాణానికి సమయం ఎక్కువ తీసుకోవడంతో ఈ రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పెద్ద ఆసక్తిగా చూపడం లేదు. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కు వెళ్లడానికి రైలులో మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు సమయం పడితే...బస్సులో అయితే సుమారు రెండు గంటల సమయమే పడుతోంది. దీంతో మనోహరాబాద్–గజ్వేల్–సిద్దిపేట మార్గంలో ప్రయాణికులు లేక రైలు వెలవెలబోతోంది. 8 బోగీలతో నడుస్తున్న ఈ రైలులో ఒకటి గార్డు, ఇతర అవసరాలుపోగా, ఏడింటిలో మొత్తంగా ఒక్క ట్రిప్పులో 644 మంది ప్రయాణం చేయొచ్చు. రోజుకూ రెండు అప్ అండ్ డౌన్ ట్రిప్పులు నడుస్తున్నా, వందమందికి మించి ప్రయాణించడం లేదు. రైలు వేగం కేవలం 60 కిలోమీటర్లకే పరిమితమై సికింద్రాబాద్ వరకు ప్రయాణ సమయం 4 గంటలు పట్టడమే ఇందుకు ప్రధాన కారణం. మనోహరాబాద్ టు కొత్తపల్లి మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్గేజ్ లైన్ నిర్మాణం జరుగుతుండగా, రూ. 1160.47 కోట్లు వెచి్చస్తున్నారు. 2017లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ లైన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్తో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్కత్తా లాంటి మహానగరాలను కలుపుతూ జాతీయ లైన్గా ఆవిర్భవించనున్నది. మనోహరాబాద్– కొత్తపల్లి రైల్వేలై¯Œన్ పూర్తయితే.. ప్రయాణికులకు దూరభారం తగ్గుతుంది. మొత్తానికి ఈలైన్తో ఉత్తర తెలంగాణలోని సిద్దిపేట జిల్లాతో పాటు మెదక్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు భారీ ప్రయోజనం చేకూరుతుంది. రోజుకు రెండు అప్ అండ్ డౌన్ ట్రిప్పులు ప్రతి బుధవారం మినహా మిగిలిన ఆరు రోజుల్లో ప్యాసింజర్ రైలు రోజుకూ రెండు అప్ అండ్ డౌన్ టిప్పులు నడుస్తోంది. ఉదయం 6.45 గంటలకు సిద్దిపేటలో బయలుదేరి.. దుద్దెడ, లకుడారం, కొడకండ్ల, గజ్వేల్, అప్పాయిపల్లి, నాచారం, మేడ్చల్, బొల్లారం, కవల్రీ బ్యారేక్స్(అల్వాల్), మల్కాజిగిరి, సికింద్రాబాద్ వరకు ఉదయం 10.15 గంటలకు చేరుకుంటోంది. తిరిగి సికింద్రాబాద్ నుంచి ఉదయం 10.35 గంటలకు బయలుదేరి సిద్దిపేటకు మధ్యాహ్నం 1.45 నిమిషాలకు చేరుతుంది. అన్నీ సజావుగా సాగితే సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కు వెళ్లాలన్నా అక్కడి నుంచి సిద్దిపేటకు రావాలన్నా 3.30 గంటల ప్రయాణం తప్పదు. కానీ ట్రైన్ లేటయినా, సిగ్నల్స్ సమస్య ఉత్సన్నమైనా ఆలస్యం అవుతోంది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కు బస్సులో వెళితే కేవలం 2 గంటల సమయయే పడుతుంది. ఈ కారణం వల్ల ఈ రైలుపై ఆసక్తి చూపడంలేదు. మనోహరాబాద్ టు సికింద్రాబాద్ వరకు రద్దీ..: ఇదే రైలు మనోహరాబాద్ స్టేషన్ వెళ్లగానే అక్కడి నుంచి సికింద్రాబాద్కు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా, ఈ మార్గంలో రద్దీ భారీగానే ఉంటుంది. కేవలం మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు మాత్రమే అతి తక్కువ ప్రయాణికులతో వెళుతోంది. ప్రస్తుతం సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు 117 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న రైలు మనోహరాబాద్ వరకు 74 కిలోమీటర్లు అతి తక్కువ ప్రయాణికులతో, ఆ తర్వాత మనోహారాబాద్ నుంచి సికింద్రాబాద్వరకు 43 కిలోమీటర్లు రద్దీగా వెళుతోంది. ఇదే మార్గంలో గజ్వేల్ వరకు 2022 జూన్ 27న రైల్వేశాఖ గూడ్స్ రైలు సేవలను దక్షిణ మధ్య రైల్వేశాఖ రేక్ పాయింట్ కోసం ప్రారంభించింది. దీని ద్వారా రైల్వేశాఖకు మంచి ఆదాయం కూడా సమకూరుతోంది. స్పీడ్ పెరిగితేనే మెరుగు.. మనోహరాబాద్–గజ్వేల్–సిద్దిపేట మార్గంలో వేగం తక్కువగా ఉండటం వల్ల సమయం ఎక్కువగా పడుతుంది. ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్లడానికి ప్రయాణికులు కొంత వెనుకంజ వేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ లైన్ స్పీడ్ పెరిగి, ప్రయాణానికి సమయం తగ్గనుంది. దీని ద్వారా ప్రయాణికుల సంఖ్య కూడా పెరగుతుంది. కొత్తపల్లి వరకు లింకు పూర్తయితే ఇక భారీగా పుంజుకుంటుంది. – దక్షిణ మధ్య రైల్వే ఇంజినీర్ జనార్దన్ -
రైలు ఢీకొని ముగ్గురు మహిళలు మృతి
కాసర్గోడ్: కేరళలోని కాసర్గోడ్లో హృదయ విదారక ఉదంతం చోటుచేసుకుంది. కంజనగడ్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ముగ్గురు మహిళలు మృతి చెందారు. మృతులు దక్షిణ కొట్టాయం జిల్లా చింగవనం వాసులుగా పోలీసులు గుర్తించారు.వీరు ఇక్కడికి ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన బృందంలోని వారని పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్ ప్లాట్ఫారమ్పైకి వెళ్లేందుకు వారు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఆ సమయంలో సూపర్ఫాస్ట్ రైలు ఢీకొనడంతో ఆ ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంపై విచారణ కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దిగువ సియాంగ్ జిల్లాలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో 52 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా, ఒక చిన్నారికి గాయాలయ్యాయి. దిమోవ్ సమీపంలోని పాలే వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ) అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గణేష్ హజారికా తెలిపారు. మృతుడిని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ సబ్ ఇన్స్పెక్టర్ రిగో రిబాగా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: గుళికల ప్యాకెట్ను తెచ్చిన కోతి.. టీ పొడి అనుకుని.. -
తొలిసారి పరుగులు పెట్టనున్న వందే భారత్ మెట్రో రైలు
భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పరుగులు తీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు రూట్లలో ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్, కాచిగూడ-యశ్వంత్పూర్-కాచిగూడ, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు సైతం రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.తాజాగా వందే భారత్ రైళ్లకు తోడు వందే భారత్ మెట్రో రైళ్లు, వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 16వ తేదీన తొలి వందే భారత్ మెట్రో రైలు పట్టాలు ఎక్కనుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి భుజ్ మధ్య ప్రయాణించనున్న తొలి వందే భారత్ మెట్రో రైలును..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.ఈ రైలు దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న మెట్రో రైళ్ల మాదిరిగానే ఉండగా.. వాటి కంటే సుదూర ప్రయాణాలకు ఉపయోగించనున్నారు. అహ్మదాబాద్-భుజ్ మధ్య 334 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 గంటల 45 నిమిషాల్లోనే ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రయాణించనుంది. భుజ్ రైల్వే స్టేషన్లో తెల్లవారుజామున 5.50 గంటలకు ప్రారంభమై.. ఉదయం 10.50 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్కు చేరుకోనుంది. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు అహ్మదాబాద్లో ప్రారంభమై.. రాత్రి 11.10 గంటలకు భుజ్ చేరుకోనుంది. వారంలో 6 రోజులు ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రయాణం చేయనుంది. ఇక భుజ్-అహ్మదాబాద్ మార్గంలో ఈ రైలుకు 9 స్టాప్లు ఉండగా.. ప్రతీ స్టేషన్లో 2 నిమిషాలు మాత్రమే ఆగుతుందని భారతీయ రైల్వే తెలిపింది.వందే భారత్ మెట్రో అనేది సెమీ-హై-స్పీడ్ రైలు. ఇది గంటకు 100 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది. వందే భారత్ రైలు లాగానే ఈ రైలు కూడా పూర్తిగా ఎయిర్ కండీషన్ కలిగి ఉంటుంది. మొదట 12 కోచ్లతో ప్రారంభం కానున్న ఈ వందే భారత్ మెట్రో రైలుకు.. ప్రయాణికుల రద్దీ దృష్టా వాటిని 16 కోచ్లకు పెంచనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఈ రైళ్లకు ప్రత్యేకమైన కోచ్ కాన్ఫిగరేషన్ ఉండనుండగా.. నాలుగు కోచ్లు ఒక యూనిట్గా ఉంటాయి. ఇందులో మన మెట్రో రైలు లాగా ఆటోమేటిక్ డోర్లు ఉండటం మరో ప్రత్యేకత. ఈ వందే భారత్ మెట్రో రైలును గంటకు 100 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టేలా రూపొందించారు.ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో రైలు డ్రైవర్తో నేరుగా కమ్యూనికేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రతి కోచ్లో మంటలు, పొగ వంటి ప్రమాదాన్ని వెంటనే గుర్తించేలా మొత్తం 14 సెన్సార్లతో కూడిన సెన్సార్ సిస్టమ్ ఉంటుంది. దివ్యాంగుల కోసం కోచ్లలో వీల్చైర్ యాక్సెస్ కలిగిన టాయిలెట్లు ఏర్పాటు చేశారు. -
షార్ట్ సర్క్యూట్తో రైలును పేల్చేందుకు కుట్ర?
హర్దోయ్: కోల్కతా నుంచి అమృత్సర్ వెళ్తున్న దుర్గియానా ఎక్స్ప్రెస్ ఓహెచ్ఈ వైర్ను బలంగా తాకడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన యూపీలోని హర్దోయ్లో చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో షార్ట్ సర్క్యూట్తో రైలును పేల్చేసేందుకు ఎవరో కుట్రపన్ని ఉంటారని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు.ఈ రైలు బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు యూపీలోని లక్నో నుంచి బయలుదేరింది. ఉదయం ఐదు గంటలకు ఉమర్తాలి స్టేషన్ దాటిన వెంటనే ట్రాక్పై వేలాడుతున్న ఓహెచ్ఈ వైర్ను బలంగా తాగింది. వెంటనే పేలుడు సంభవించింది. దీంతో పైలట్ రైలును ఆపి ఉమ్రతాలి, దలేల్నగర్ స్టేషన్లకు సమాచారం అందించాడు. దీంతో అధికారులు ఆ మార్గంలో నడిచే రైళ్లను నిలిపివేశారు. దాదాపు ఆరు గంటల తర్వాత దుర్గియానా ఎక్స్ప్రెస్ బయలుదేరేందుకు అనుమతినిచ్చారు. ఈ ఘటన నేపధ్యంలో రాజధాని, వందే భారత్లతో పాటు మరికొన్ని రైళ్లను మరో మార్గంలోకి మళ్లించారు. రెండు రైళ్లను రద్దు చేశారు.ఈ ఘటన దరిమిలా దుర్గియానా ఎక్స్ప్రెస్ రైలు విద్యుత్ కేబుల్ను బలంగా తాకడమనేది సహజంగా జరిగినది కాదని రైల్వే అధికారులు భావిస్తున్నారు. సాంకేతిక లోపం కంటే ట్యాంపరింగ్కే ఎక్కువ అవకాశాలున్నాయని వారు అంటున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోంది. ఇది కూడా చదవండి: దేశంలో భద్రత గుర్తింపు పొందిన తొలి కంపెనీ -
Bihar: ట్రయల్ రన్లోని ‘వందేభారత్’పై రాళ్ల దాడి
గయ: బీహార్లోని గయలో ట్రయల్ రన్లో ఉన్న వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ రైలును సెప్టెంబర్ 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇంతలోనే ఈ రైలుపై కొందరు అల్లరి మూకలు రాళ్లు రువ్వి, రైలు అద్దాలు పగలగొట్టారు. ధన్బాద్ రైల్వే డివిజన్ పరిధిలోని గయలోని బంధువా-టంకుప్ప స్టేషన్ మధ్య ఈ రాళ్ల దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ రైలు జంషెడ్పూర్ నుండి పట్నా వరకు నడవనుంది.ఈ ఘటనలో వందేభారత్ రైలు ఇంజన్కు ఆనుకుని ఉన్న రెండో కోచ్లోని సీటు నంబర్ నాలుగు దగ్గరున్న కిటికీ అద్దం పగిలిందని రైల్వే అధికారులు తెలిపారు. ట్రయల్ రన్ కావడంతో ఈ వందే భారత్ రైలులో ప్రయాణికులెవరూ లేరు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ మొదలు పెట్టారు. ఇదిలావుండగా సోమవారం న్యూఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఇటావా జిల్లాలోని భర్తానా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రైలు కొన్ని గంటలపాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. -
మరో రైలు ప్రమాదానికి భారీ కుట్ర..
-
ట్రాక్పై సిమెంట్ దిమ్మలు.. మరో రైలుకు తప్పిన ప్రమాదం
జైపూర్: రాజస్థాన్లోని అజ్మీర్లో గూడ్స్ రైలును పట్టాలు తప్పించేందుకు దుండగులు ప్రయత్నించారు. ఆదివారం(సెప్టెంబర్8) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రాక్పై ఏకంగా రెండు భారీ సిమెంట్ దిమ్మలను ఉంచారు. ఈ సిమెంట్ దిమ్మలు ఒక్కోటి 70 కిలోల బరువున్నవి కావడం గమనార్హం.రైలు ఎప్పటిలానే ఆ రూట్లో వచ్చింది. సిమెంట్ దిమ్మలను ఢీకొట్టింది. అయినా రైలు పట్టాలు తప్పకుండా వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి రైల్వే అధికారులు కేసు పెట్టారు. సిమెంట్ దిమ్మలు ట్రాక్ మీద ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రైలు ఢీకొని ఒక సిమెంట్ దిమ్మ పగిలిపోగా మరొకటి ట్రాక్పైనే కొంత దూరం జరిగి ఉంది.ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యూపీ కాన్పూర్లోని అన్వర్గంజ్-కాస్గంజ్ మార్గంలో కాళింది ఎక్స్ప్రెస్ను పట్టాలు తప్పించేందుకు సిలిండర్ ఉంచిన ఘటన తాజాగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: రైలు పట్టాలపై సిలిండర్..ఉగ్రవాదుల పనేనా..? -
Uttar Pradesh: తప్పిన రైలు ప్రమాదం.. అనుమానిత వస్తువులు స్వాధీనం
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. కాన్పూర్లోని అన్వర్గంజ్-కాస్గంజ్ రైలు మార్గంలో భివానీకి వెళ్లే కాళింది ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న ఈ రైలు.. పట్టాలపై ఎవరో ఉంచిన సిలిండర్ను బలంగా ఢీకొంది. ఈ ఘటన వెనుక కుట్ర దాగివుందని రైల్వే వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం కాళింది ఎక్స్ప్రెస్ ప్రయాగ్రాజ్ నుండి కాన్పూర్ సెంట్రల్ మీదుగా భివానీకి వెళ్తోంది. శివరాజ్పూర్ సమీపంలో సిలిండర్తో పాటు మరికొన్ని వస్తువులను ఈ రైలు ఢీకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది.విచారణ అనంతరం ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఓపీ మీనా బృందం సిలిండర్ను స్వాధీనం చేసుకుంది. అలాగే సంఘటనా స్థలంలోపలు అనుమానాస్పద వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. సిలిండర్ దొరికిన ప్రదేశంలో ఒక సీసాలో పసుపు రంగు పదార్థం, తెల్లటి పొడి కనిపించింది. రైలును కొద్దిసేపు నిలిపివేసి, ఆ మార్గాన్ని పరిశీలించిన అనంతరం ఆ రైలును ముందుకు వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్వే ట్రాక్పై ఆదమరిచి నిద్రపోయి.. లోకో పైలెట్ అప్రమత్తం కావడంతో
న్యూఢిల్లీ: ఓ ట్రైన్ లోకో పైలెట్ అప్రమత్తంతో పెను ప్రమాదమే తప్పింది. రైల్వే ట్రాక్పై గొడుగు కింద ఆద మరిచి నిద్రపోతున్న ఓ వ్యక్తి ప్రాణాల నుంచి బయటపడ్డాడు.ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని రైల్వే ట్రాక్పై ఓ వ్యక్తి నిద్రిస్తున్నాడు. అదే సమయంలో అటు నుంచి వస్తున్న ఓ ట్రైన్ లోకో పైలెట్ ట్రాక్పై నిద్రుస్తున్న వ్యక్తిని చూసి వెంటనే ట్రైన్ ఆపాడు.అనంతరం ట్రైన్ దిగి సదరు వ్యక్తిని నిద్ర లేపే ప్రయత్నం చేశాడు. ఆదమరిచి నిద్రపోతున్న వ్యక్తికి మెలుకువ వచ్చిన వెంటనే పక్కకు వెళ్లాడు. ఆ ఘటనలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో లోకో పైలట్ తన రైలును ఆపిన తర్వాత వ్యక్తి వద్దకు వెళుతున్న దృశ్యాల్ని చూడొచ్చు.ఇక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించలేదని, నిద్రపోయేందుకు అనువైన ప్రదేశం రైల్వే ట్రాక్ అని భావించి నిద్రపోయినట్లు తెలుస్తోంది. ఆ వీడియోపై ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని అభిప్రాయం వ్యక్తంచేస్తుండగా.. మరో యూజర్ ఈ విషయంపై తీవ్రమైన విచారణ జరిపి సరైన రైల్వే భద్రతా నిబంధనలను అమలు చేయాలని కోరాడు. A person was sleeping on the railway track with an umbrella. Seeing this, the loco pilot stopped the train, Then he woke him up and removed him from the track. Then the train moved forward in Prayagraj UPpic.twitter.com/OKzOpHJeih— Ghar Ke Kalesh (@gharkekalesh) August 25, 2024 -
డిసెంబరులో పట్టాలపైకి వందేభారత్ స్లీపర్ రైలు
భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అమితమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ కొత్తగా వందే భారత్ స్లీపర్ రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానుంది.2019లో వందేభారత్ చైర్-కార్ రైలును ప్రారంభించారు. ఇప్పుడు వస్తున్న వందేభారత్ స్లీపర్ రైలు ఈ సిరీస్లో మూడవ ఎడిషన్. మొదటి వందే భారత్ స్లీపర్ రైలు గుజరాత్లో నడపాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. అధికారికంగా ఇంకా దీనిపై స్పష్టత రాలేదు. ఈ రైలును రెండు నెలల పాటు పరీక్షించనున్నారు.వందే భారత్ తొలి స్లీపర్ రైలు బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఇఎంఎల్) ప్లాంట్ నుండి సెప్టెంబర్ 20 నాటికల్లా బయలుదేరుతుందని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐపీఎఫ్) చెన్నై జనరల్ మేనేజర్ యూ సుబ్బారావు మీడియాకు తెలిపారు. దీని తర్వాత రైలు ట్రయల్ రన్ జరగనుంది. వాయువ్య రైల్వే జోన్లో హైస్పీడ్ రైలు ట్రయల్ను నిర్వహించనున్నారు.స్లీపర్ వందేభారత్లో స్టెయిన్లెస్ స్టీల్ కార్ బాడీ, ప్రయాణీకులకు మెరుగైన రక్షణ సదుపాయాలు, జీఎఫ్ఆర్పీ ఇంటీరియర్ ప్యానెల్లు, ఏరోడైనమిక్ డిజైన్, మాడ్యులర్ ప్యాంట్రీ, ఫైర్ సేఫ్టీ కంప్లైయెన్స్, డిసేబుల్డ్ ప్యాసింజర్ల సౌకర్యాలు, ఆటోమేటిక్ డోర్లు, సెన్సార్ ఆధారిత ఇంటర్కమ్యూనికేషన్, ఫైర్ బారియర్ డోర్లు ఉన్నాయి. యూఎస్బీ ఛార్జింగ్తో కూడిన ఎర్గోనామిక్ టాయిలెట్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్ కూడా దీనిలో ఉండనున్నాయి. -
కాశీ నుంచి అయోధ్యకు... ఐఆర్సీటీసీ అద్భుత ప్యాకేజీ
ఉత్తరప్రదేశ్లోని కాశీ, అయోధ్యలను సందర్శించాలనుకునేవారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. భారతీయ రైల్వేకు అనుబంధ సంస్థ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) వారణాసి, అయోధ్యలను సందర్శించేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణ సదుపాయం, వసతి, ఆహారం మొదలైనవి అందజేయనున్నారు.ఈ ప్యాకేజీ ఆరు పగళ్లు, ఐదు రాత్రులు ఉండనుంది. ఈ ప్యాకేజీలో ప్రయాణం సాగించేందుకు రూ.15,750(ఒక్కరు) చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణికుల తమకు అందుబాటులో ఉండే ప్యాకేజీని కూడా ఎన్నుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి ‘రామ్ మందిర్ దర్శన్’ అనే పేరు పెట్టారు. ఈ ప్యాకేజీ వారణాసి నుంచి అయోధ్య వరకూ కొనసాగనుంది. ఈ టూర్ ప్రతి శుక్రవారం ప్రారంభమవుతుంది.ఐఆర్సీసీటీ వెబ్సైట్ www.irctctourism.comని సందర్శించడం ద్వారా ప్రయాణికులు ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. అలాగే ఐఆర్సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. Embark on a divine journey to the land of spiritual awakening! Join IRCTC Tourism’s Ram Mandir Darshan and seek blessings at the revered destinations - Ayodhya & Varanasi!To experience the essence of Hinduism and rejuvenate your soul, book your journey at… pic.twitter.com/hMPlPIbTsN— IRCTC (@IRCTCofficial) August 18, 2024 -
పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్
లక్నో: సబర్మతి ఎక్స్ప్రెస్ శనివారం(ఆగస్టు17) తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ రైల్వేస్టేషన్లో రైలు పెద్ద రాయిని గుద్దుకోవడంతో 12 బోగీలు పట్టాలు తప్పాయని నార్త్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఏమీ కాకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వారణాసి జంక్షన్ అహ్మదాబాద్ రూట్లో పలు రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. సబర్మతి ఎక్స్ప్రెస్ ప్రయాణికులను వేరే రైలులో గమ్యస్థానాలకు తరలించారు. -
Madhya Pradesh: పట్టాలు తప్పిన గూడ్సు రైలు
మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కత్నీ నుంచి సాగర్కు వెళుతున్న బొగ్గుతో కూడిన గూడ్సు రైలు దామోహ్ జిల్లాలోని పఠారియా సమీపంలో పట్టాలు తప్పింది. ఈ గూడ్సు రైలులోని ఏడు వ్యాగన్లు ట్రాక్పై బోల్తా పడ్డాయి.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాద ఘటనలో ట్రాక్లు, స్లీపర్లు, ఓహెచ్ఈ కేబుల్స్ దెబ్బతినడంతోపాటు సాగర్, దామోహ్, కట్ని మార్గాల్లో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గూడ్సు రైలు కోచ్ల చక్రాలు విడిపోయి, ట్రాక్పై చెల్లాచెదురుగా పడిపోవడంతో వ్యాగన్లలోని బొగ్గంతా నేలపాలయ్యింది. అర కిలోమీటరు పొడవునా పదుల సంఖ్యలో రైలు స్తంభాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. Breaking News: Goods train loaded with coal derailed in Damoh, MP;- Darbhanga Express narrowly escapes accident. pic.twitter.com/TFP4DVPnBm— زماں (@Delhiite_) August 14, 2024 -
ఆకతాయి పనితో కదులుతున్న ట్రైన్ నుంచి దూకిన ప్రయాణికులు
కదులుతున్న ట్రైన్లో మంటలు చెలరేగుతున్నాయనే అకతాయిలు చేసిన పుకార్లు ప్రయాణికులు ప్రాణాల మీదకు తెచ్చాయి. ఉత్తరప్రదేశ్ బిల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్యాసింజర్లు ప్రయాణిస్తున్న ట్రైన్లో మంటలు చెలరేగుతున్నాయని పుకార్లు వ్యాపించాయి. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు కదులుతున్న ట్రైన్ నుంచి బయటకు దూకారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు.మొరాదాబాద్ డివిజన్ పరిధిలోకి వచ్చే బిల్పూర్ స్టేషన్ సమీపంలోని హౌరా-అమృత్సర్ మెయిల్ జనరల్ కోచ్లో ఈ సంఘటన జరిగింది . గాయపడిన వారిని అన్వారీ (26), అఖ్తరీ (45), కుల్దీప్ (26), రూబీ లాల్ (50), శివ శరణ్ (40), చంద్రపాల్ (35)లుగా గుర్తించారు. ఆరుగురు ప్రయాణికులను షాజహాన్పూర్ మెడికల్ కాలేజీలో చేర్చినట్లు జీఆర్పీ స్టేషన్ ఇన్ఛార్జ్ రెహాన్ ఖాన్ వెల్లడించారు. రైల్వే స్టేషన్లో గందరగోళంరైలు బరేలీలోని బిల్పూర్ స్టేషన్కు చేరుకోగానే గందరగోళం నెలకొంది. రైలులో మంటలు చెలరేగిపోయాయనే పుకారుతో ప్రయాణికులు ఆందోళనకు గురైరయ్యారు. భయాందోళనతో ట్రైన్ చైన్ లాగారు. చాలా మంది ప్రయాణికులు ఇంకా కదులుతున్న రైలు నుండి దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు.రైల్లో చోటు చేసుకున్న ఘటనపై రెహాన్ ఖాన్ మాట్లాడుతూ.. కొంతమంది ఆకతాయిలు గాల్లో మంటలు వ్యాపించాయనే పుకార్లు పుట్టించినట్లు మా దృష్టికి వచ్చింది. పుకార్లు చేసిన అనంతరం ట్రైన్ చైన్ లాగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) దర్యాప్తు చేస్తుందని ఆయన తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. -
పలు రైళ్ల దారి మళ్లింపు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): గుంటూరు డివిజన్లోని కొండ్రపోలు–విష్ణుపురం సెక్షన్లలో జరుగుతున్న ట్రాఫిక్ బ్లాక్ పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్లించి నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్–సంత్రగచ్చి (07221) ఎక్స్ప్రెస్ నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు మీదుగా నడవాల్సిన ఈ రైలును ఈ నెల 13న వయా కాజీపేట, వరంగల్, విజయవాడ మీదుగా దారి మళ్లించారు. అదే విధంగా భువనేశ్వర్–పూణే (22882) ఎక్స్ప్రెస్ ఈ నెల 13న నల్గొండ, గుంటూరుకు బదులుగా వయా విజయవాడ, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్ మీదుగా ప్రయాణించనుంది. పలు ఎక్స్ప్రెస్ రైళ్లు పొడిగింపు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే ప్రకటించిన పలు ఎక్స్ప్రెస్ రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. నర్సాపూర్–బెంగళూరు (07153) ఈ నెల 16 నుంచి సెపె్టంబర్ 27 వరకు, బెంగళూరు–నర్సాపూర్ (07154) ఈ నెల 17 నుంచి సెపె్టంబర్ 28 వరకు, ధనాపూర్–బెంగళూరు (03245) ఈ నెల 14న, బెంగళూరు–ధనాపూర్ (03246) ఈ నెల 16న, ధనాపూర్–బెంగళూరు (03251) ఈ నెల 11, 12 తేదీలలోను, బెంగళూరు–ధనాపూర్ (03252) ఈ నెల 13, 14 తేదీలలోను, ధనాపూర్–బెంగళూరు (03259) ఈ నెల 13న, బెంగళూరు–ధనాపూర్ (03260) ఈ నెల 15న, ధనాపూర్–బెంగళూరు (03247) ఈ నెల 15న, బెంగళూరు–ధనాపూర్ (03248) ఈ నెల 17న, ధనాపూర్–బెంగళూరు (03241) ఈ నెల 16న, బెంగళూరు–ధనాపూర్ (03242) ఈ నెల 18న రైళ్లను నడవనున్నట్లు తెలిపారు. -
Vizag: ట్రైన్లో కామాంధుడు.. యువతిపై లైంగికదాడికి యత్నం
సాక్షి, విశాఖపట్నం: విజయవాడ నుంచి విశాఖ వెళ్తున్న రైలులో కామాంధుడు రెచ్చిపోయాడు. గాఢ నిద్రలో ఉన్న విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించాడు..పలు మార్లు తాకడానికి ప్రయత్నించడంతో అలెర్ట్ అయిన బాధితురాలు ప్రతిఘటించింది. దీంతో అప్రమత్తమైన తోటి ప్రయాణికులు నిందితుడిని చితకబాది రైల్వే పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం సాయంత్రం ఓ విద్యార్ధిని విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లేందుకు ఓ రైలు ఎక్కింది. రాత్రి పూట కావడంతో నిద్రలోకి జారుకుంది. అదే రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో కదులుతున్న రైల్లో రెచ్చిపోయిన నిందితుడు విద్యార్ధినిని లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. పలుమార్లు ఆమెను అసభ్యంగా తాకేందుకు యత్నించాడు. దీంతో నిద్రలో ఉన్న విద్యార్ధిని అతడిని నుంచి తప్పించుకుంది. గట్టిగా కేకలు వేయడంతో తోటి ప్రయాణికులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని దేహశుద్ది చేశారు. తెల్లవారుజామున ఐదున్నర గంటలకు నిందితుడ్ని రైల్వే పోలీసులకు అప్పగించారు. -
పోకిరీల భయంతో రైలెక్కిన ఇద్దరు బాలికలు
యువతులను వేధించే పోకిరీల ఆగడాల గురించి తరచూ వింటుంటాం. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే కుర్రాళ్ల గురించి కూడా వినేవుంటాం. ఇలాంటి యువకుల నుంచి తప్పించుకునేందుకు మహిళలు, యువతులు నానా అవస్థలు పడుతుంటారు. తాజాగా పోకిరీల భయంతో ఇద్దరు బాలికలు చేసిన పని చర్చనీయాంశంగా మారింది.ఉత్తరప్రదేశ్లోని ఇటావా రైల్వే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న గార్డుకు ఇద్దరు బాలికలు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో ఆయన వారిని ప్రశ్నించగా వారు తమకు ఎదురైన అనుభవాన్ని తెలిపారు. తాము హత్రాస్లో నివాసముంటామని, ట్యూషన్ ముగిశాక, ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు పోకిరీలు తమకు ఎదురయ్యారని, వారి నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్కు చేరుకుని హడావుడిగా రైలు ఎక్కినట్లు తెలిపారు. ఇంతలో రైలు స్టార్ట్ అయ్యిందని, తాము 140 కిలోమీటర్ల దూరంలోని ఇటావా స్టేషన్ రాగానే స్టేషన్లో దిగేశామని తెలిపారు. వీరి మాటలు విన్న గార్డు ఈ సమాచారాన్ని చైల్డ్ వెల్ఫేర్ సంస్థకు తెలిపారు. వారు ఈ బాలికలను వారి హత్రాస్లోని వారి ఇళ్లకు పంపించారు. -
నల్లగబ్బిలం పువ్వును ఎప్పుడైనా చూశారా!
అరుదైన ఈ పువ్వు నల్లగా గబ్బిలంలా కనిపిస్తుంది. ఈ పూలు పూసే మొక్కలను దూరం నుంచి చూస్తే, మొక్కల మీద గబ్బిలాలు వాలి ఉన్నాయేమోననిపిస్తుంది. గబ్బిలం వంటి ఆకారం వల్లనే ఈ పువ్వుకు ‘బ్లాక్ బ్యాట్ ఫ్లవర్’ అనే పేరు వచ్చింది. కంద జాతికి చెందిన ఒక మొక్కకు ఈ పూలు పూస్తాయి. ఫ్రెంచ్ వర్తకుడు, కళాసేకర్త ఎడ్వర్డ్ ఆండ్రూ తొలిసారిగా ఈ పూల గురించి 1901లో రాసిన తన పుస్తకంలో వర్ణించాడు.ఈ పూల మొక్కలు బంగ్లాదేశ్, కంబోడియా, దక్షిణ చైనా, లావోస్, మలేసియా, మయాన్మార్, థాయ్లండ్ అడవుల్లో కనిపిస్తాయి. ఈ పూల కేసరాలు పిల్లి మీసాల్లా ఉంటాయి. రేకులు గబ్బిలం రెక్కల్లా ఉంటాయి. పన్నెండు అంగుళాల వెడల్పు, పది అంగుళాల పొడవుతో గబ్బిలం ఆకారంలో కొంత భయం గొలిపేలా ఉండటంతో ఈ పువ్వులను దక్షిణాసియా స్థానిక భాషల్లో ‘దెయ్యం పువ్వులు’ అని కూడా పిలుస్తారు. చైనీస్ సంప్రదాయ వైద్యంలో ఈ పువ్వులను కొన్ని ప్రత్యేక ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు.అతి పురాతన రైల్వేస్టేషన్..ఇది ప్రపంచంలోనే అతి పురాతన రైల్వేస్టేషన్. ఇక్కడి నుంచే తొలి పాసింజర్ రైలుబండి నడిచింది. ఇంగ్లండ్లో ఉన్న ఈ రైల్వేస్టేషన్ పురాతన భవంతిని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. ఇంగ్లండ్లోని మాంచెస్టర్లో లివర్పూల్ రోడ్ స్టేషన్ను 1830లో నిర్మించారు. లివర్పూల్ రోడ్ నుంచి మాంచెస్టర్ వరకు తొలి పాసింజర్ రైలు నడిచేది. లివర్పూల్ అండ్ మాంచెస్టర్ రైల్వే కంపెనీ తరఫున ఈ రైల్వేస్టేషన్ను జార్జ్ స్టీఫెన్సన్ అనే ఇంజినీరు నిర్మించాడు.ప్రస్తుతం మ్యూజియంగా మార్చిన ఈ పురాతన రైల్వేస్టేషన్ భవంతిలో రైల్వే మ్యూజియంతో పాటు సైన్స్ ప్లస్ ఇండస్ట్రీ మ్యూజియం, పిల్లల ఆట స్థలం వంటివి కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే తొలి పారిశ్రామిక నగరంలో మాంచెస్టర్ గత వైభవాన్ని తెలిపే వస్తువులను ఇక్కడ కొలువు దీర్చారు. పారిశ్రామిక విప్లవం నాటి పురాతన యంత్రపరికరాలను ఇందులో భద్రపరచారు. రైల్వే మ్యూజియంలో బొగ్గుతో నడిచే తొలినాటి ఆవిరి ఇంజిన్లను, ఆనాటి రైలు బోగీలను, వివిధ కాలాల్లో వచ్చిన మార్పులను ప్రతిబింబించే రైలు ఇంజిన్లను, బోగీలను భద్రపరచారు. ఈ మ్యూజియంను చూడటానికి పద్నాలుగేళ్ల లోపు పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నారు.అతిచిన్న లకుముకి పిట్ట..ఇది ప్రపంచంలోనే అతిచిన్న లకుముకి పిట్ట. అత్యంత అరుదైన పక్షుల్లో ఇది కూడా ఒకటి. పొడవాటి ఎర్రని ముక్కుతో రంగురంగుల శరీరంతో ఉండే ఈ పక్షి, చూడటానికి పిచుక పరిమాణంలో ఉంటుంది. ఫిలిప్పీన్స్ అడవుల్లో ఈ జాతి పక్షులు కనిపించేవి. ఫ్రెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త బెర్నార్డ్ జర్మెయిన్ డి లేస్పెడె 1799లో వీటిని తొలిసారిగా చూసినప్పుడు, ఇవి చిన్నసైజు కింగ్ఫిషర్ పక్షుల్లా కనిపించడంతో వీటికి ‘ఫిలిప్పీన్ డ్వార్ఫ్ కింగ్ఫిషర్’ అని పేరుపెట్టాడు.ఈ పక్షులు క్రమంగా తగ్గిపోయి, కనిపించడం మానేశాయి. ఈ పక్షులను స్థానికులు చివరిసారిగా 130 ఏళ్ల కిందట చూశారు. ఆ తర్వాత ఈ పక్షులు ఎవరికీ కనిపించకపోవడంతో ఇవి అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు కూడా భావించారు. ఫిలిప్పీన్స్ విహంగ శాస్త్రవేత్త మీగెల్ డేవిడ్ డి లియాన్ ఇటీవల దక్షిణ ఫిలిప్పీన్స్ అడవుల్లో ఈ పక్షులను గుర్తించి ఫొటోలు తీశాడు. -
6 వారాల్లో 3 రైలు ప్రమాదాలు.. 17 మంది మృతి.. 100 మందికి గాయాలు
ఒడిశా రైలు ప్రమాదం(2023) తర్వాత రైళ్లలో భద్రతకు సంబంధించిన అనుమానాలు ప్రజల్లో అలానే ఉన్నాయి. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 290 మంది మృతిచెందారు. ఈ ప్రమాదం తర్వాత కూడా దేశంలో పలు రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.తాజాగా జార్ఖండ్లోని బారాబంబో వద్ద హౌరా-ముంబై మెయిల్కు చెందిన 18 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గత ఆరు వారాల్లో మూడు ప్యాసింజర్ రైలు ప్రమాదాలు సంభవించాయి. ఈ ఘటనల్లో 17 మంది మృతి చెందారు. ఈ ప్రమాదాలన్నీ ఈ ఏడాది జూన్-జూలై మధ్య జరిగాయి. ఈ ప్రమాదాల్లో 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గత నెల జూన్ 17న కాంచన్జంగా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 11 మంది మృతి చెందగా, 60 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.ఈ నెల జూలై 18న ఉత్తరప్రదేశ్లోని గోండా రైల్వే స్టేషన్ సమీపంలో చండీగఢ్-దిబ్రూగఢ్ రైలుకు చెందిన ఎనిమిది బోగీలు పట్టాలు తప్పడంతో నలుగురు మృతి చెందగా, 35 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. జూలై 30న హౌరా-ముంబై మెయిల్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు.కాగా రైల్వే మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం రైలు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. 2000-01లో మొత్తం 473 రైలు ప్రమాదాలు జరిగాయి. అది 2014-15 నాటికి 135కి తగ్గింది. అది 2022 నాటికి 48కి చేరింది. రైల్వే ప్రమాదాల దృష్ట్యా కవచ్ వ్యవస్థ అమలును ముమ్మరం చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది. -
Russia: పట్టాలు తప్పిన రైలు.. 100 మందికి గాయాలు
రష్యాలోని దక్షిణ వోల్గోగ్రాడ్ ప్రాంతంలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 800 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.ట్రక్కును ఢీకొట్టిన అనంతరం రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. రష్యా టుడే తెలిపిన వివరాల ప్రకారం 20 బోగీలతో కూడిన ఈ రైలు రష్యాలోని టాటర్స్థాన్ రిపబ్లిక్లోని కజాన్ నుంచి సోచి సమీపంలోని రిసార్ట్ నగరం అడ్లెర్కు వెళుతోంది. రైలులోని తొమ్మిది బోగీలు పట్టాలు తప్పినట్లు వోల్గోగ్రాడ్ రీజియన్ గవర్నర్ ఆండ్రీ బోచారోవ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ప్రమాదం నుంచి ట్రక్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే అతని తలకు, కాళ్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ ఏడాది జూన్లో రష్యాలోని కోమిలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్యాసింజర్ రైలులోని తొమ్మిది కోచ్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 70 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్యాసింజర్ రైలు ఈశాన్య కోమిలోని వోర్కుటా నుండి నల్ల సముద్రపు నొవోరోసిస్క్ ఓడరేవుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రాంతాల మధ్య దూరం ఐదు వేల కిలోమీటర్లు ఉంటుంది. WATCH | Russia Train-Truck Accident Injures 140, Derails Multiple Carriages#Russia #accident #Train https://t.co/Fs6k6KYVfe— Oneindia News (@Oneindia) July 29, 2024 -
క్షణికం! ట్రైన్లో అడుగు పెట్టి.. బెర్త్ కింద సూట్కేసు తోసి..
ట్రైన్లో అడుగు పెట్టి బెర్త్ కింద సూట్కేసు తోసి సీట్లో కూర్చున్నాను. ఢిల్లీకి వెడుతున్న ఈ రైలు టూ టైర్ ఏసీ కంపార్టుమెంట్లో చాలా బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ప్రయాణికులు ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కువ మంది లేరు. విండో గ్లాస్లోంచి బయటకి చూస్తూ కూర్చున్నాను. సూర్యాస్తమయవుతోంది.. నెత్తురు రంగు పూసుకున్న మబ్బులు వేగంగా కదులుతున్నాయి. టీలు, కాఫీలు అమ్ముకుంటున్న హాకర్స్, ప్రయాణికులతో ఫ్లాట్ఫారం హడావుడిగా ఉంది. కాళ్ళు పారజాపి చేతిలో వున్న మొబైల్ చూస్తూ కూర్చున్నాను.రైలు కదిలే సమయంలో ‘ఎక్స్క్యూజ్ మీ’ అంటూ ఒకామె హడావుడిగా చేతిలో చిన్న సూట్కేసుతో వచ్చి పక్కనే నిలబడింది. కాళ్లు వెనక్కి లాక్కున్నాను. సూట్కేసు బెర్త్ కిందకు తోసి, ‘హుష్’ అంటూ నిట్టూరుస్తూ ఎదురు సీట్లో కూర్చుంది. నుదుటన పట్టిన చెమటని కర్చీఫ్తో తుడుచుకుంది. ఆమెకు ఏభై ఏళ్లు దాటి ఉండవచ్చు. జుత్తు అక్కడక్కడ నెరిసింది. మొహంలో అలసట కనిపించింది. కిటికీ దగ్గరకు జరిగి కూర్చుంది. ఆమెకేసి తేరిపార చూశాను. ఎక్కడో చూసినట్టుగా అనిపించింది.ఆమె కళ్ళలో ఏదో ఆందోళన లీలామాత్రంగా కనబడింది. ఆమె నాకేసి అభావంగా చూసి, తన మొబైల్ ఫోను చూసుకోవడంలో నిమగ్నమైంది. ఆమెకు ఎవరో చాలాసార్లు ఫోన్ చేశారు.. కానీ చూసీచూడనట్టుగా మొబైల్ పక్కన పెట్టేసింది. మరో ఫోన్ కాల్ మటుకు ఆన్ చేసి.. ‘అవునండి! అలా చేద్దాం .. నా నిర్ణయం మారదు’ అంటోంది.ఆకాశంలో చిన్నగా మెరుపులు మెరుస్తున్నాయి. వర్షం వచ్చేలా ఉంది. ఢిల్లీ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో పాటు వాళ్ళ ఆనందాలని, బాధలని .. వెంట మోసుకుని వెడుతోంది వేగంగా. నా జీవితంలో ఆనందం ఆమడ దూరం. బాధ ఐతే మోయలేనంత బరువుగా! జీవితంలో పడిన కష్టాలకి మనస్సు కరడు కట్టేసింది.. చిన్నగా మొదలైన వాన ఉద్ధృతమైంది. కంపార్ట్మెంట్ పార్టిషన్ ఎవరైనా తీసినప్పుడు పిడుగుల శబ్దాలు గట్టిగా లోపలికి వినబడుతున్నాయి.చిన్నప్పుడు పిడుగుల శబ్దానికి భయపడితే.. ‘అర్జునా! ఫల్గుణా అని.. ప్రార్థిస్తే .. పిడుగులు పడవురా!’ అని మా బామ్మ చెప్పేది. ఇప్పుడు సామాన్యుల, దీనార్తుల నెత్తి మీద ఎన్నో బాధల పిడుగులు పడుతున్నా .. ఎంత గొంతెత్తి ప్రార్థించినా .. కాపాడటానికి ఏ అర్జునుడు, ఫల్గుణుడు రావడం లేదు. అప్రయత్నంగా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. కర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నాను.ఎదురుగా వున్నామె రైల్వే వారు ఇచ్చిన తెల్లని దుప్పటి ఒంటిమీద సగం వరకు కప్పుకుని కూర్చుని బయటకి చూస్తోంది. మళ్ళీ బుర్ర దొలచడం మొదలెట్టింది.. ఈమెని ఎక్కడ చూశాను? తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఇంతలో టీసీ వచ్చి.. ‘టికెట్ చూపించండి..’ అంటూ మా పేర్లు, బెర్త్ నంబర్లు బయటకి చదివాడు. నేను నా టికెట్ను ఫోన్లో చూపించే ప్రయత్నంలో ఉన్నాను. ‘ధరణీధరి’ అన్న పేరు చెవిన బడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. వెంటనే ఆమెని గుర్తుపట్టాను. అవును! ఆమే! ఆ ఘాతుకం జరిగి ఎంతో కాలమైనా.. ఆ కుటుంబసభ్యుల పేర్లు ఎలా మర్చి పోగలను? గుండె రగిలిపోయింది.. ఎస్ .. ఆరోజు అందరం మూకుమ్మడిగా కర్రలు, రాళ్ళు పుచ్చుకుని దుర్గారావు ఇంటి మీద దాడి చేసినప్పుడు చూశాను ఈమెను.పచ్చి మోసగాడు, పరమనీచుడు, ఎందరో అభాగ్యులను మోసం చేసిన .. ‘ధరణిధరి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ’ ఓనర్ దుర్గారావు గాడి భార్య ఈ ధరణి. చిన్న చితకా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిరు ఉద్యోగులు, రాత్రనకా పగలనకా ఎంతో కాయకష్టం చేసి చెమటోడ్చి రోజువారీ కూలి చేసుకునే వాళ్లు తమ పిల్లల చదువులకని,పెళ్ళిళ్ళకు పైసా పైసా కూడబెట్టిన డబ్బులను ఎక్కువ వడ్డీ ఇస్తానన్న వాడి మాయ మాటలు నమ్మి వాడి దొంగ సంస్థలో దాచుకున్నారు. కంపెనీలో పెట్టిన డబ్బులు మూడు ఏళ్లలో రెట్టింపు అయిపోతుందని మభ్యపెట్టాడు. ఆశల పల్లకి ఎక్కించాడు. ఊహల రంగుల ఇంద్రధనుస్సులు చూపించాడు.ఏజెంట్లను నియమించి వాళ్ళకి కమిషన్ ఆశ చూపి.. వ్యాపారాన్ని చుట్టు పక్కల ఊర్లకి విస్తరింప చేశాడు. అందర్నీ నమ్మించడానికి కొంతకాలం బాగానే నడిపాడు. ఆ డబ్బులతో ఆస్తులు కూడబెట్టాడు. దాచుకున్న డబ్బులు అవసరం వచ్చినప్పుడు తీసుకోవడానికి వెడితే, చెల్లించకుండా సాకులు చెప్పాడు. అనుమానం వచ్చి కొందరు నిలదీశారు. హఠాత్తుగా ఒకరోజు బోర్డు తిప్పేశాడు. మాయ మాటలు చెప్పి తప్పించుకుపోతుంటే, అందరూ మూకుమ్మడిగా దాడి చేశారు. దుర్గారావుని పోలీసులు అరెస్ట్ చేశారు.కానీ క్షణంలో బెయిల్ మీద బయటకి వచ్చాడు. దాచుకున్న ‘అసలు’ కూడా తిరిగి ఇవ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పాడు. ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది న్యాయం జరుగుతుందేమోనన్న ఆశ చావక.. కొన ఊపిరితో వేచి చూస్తున్నారు. మరికొందరు కాలసర్పం కాటుకు అసువులు బాశారు. వాడి మోసపు వలలో నా కుటుంబం కూడా అమాయకంగా చిక్కుకు పోయింది. అక్క పెళ్ళి కోసం నాన్న దాచుకున్న సొమ్ము మొత్తం పోయింది.చిన్నప్పటి నుండి.. ‘బంగారుతల్లి’ అంటూ ఎంతో మురిపెంగా పిలుచుకుని, గారంగా పెంచుకున్న అక్క కూడా ‘ఈ జన్మలో నా పెళ్ళి చేయలేవులే!’ అంటూ ఛీత్కారంగా మాట్లాడింది. అందరం తలో మాట అన్నాము. అది నాన్న జీర్ణించుకోలేక, ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మంటలు ఇప్పటికీ నా గుండెలో ప్రజ్వలిస్తున్నాయి. అమ్మ.. నాన్న కోసం బెంగ పెట్టుకుని చనిపోయింది. అక్క ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రాణంతో ఉందో లేదో తెలియదు. నా చదువు మధ్యలో ఆగిపోయింది. అపురూపమైన మా పొదరిల్లు కూలిపోయింది. నేను ఒంటరి పక్షిగా మిగిలిపోయాను.అనాథ శరణాలయంలో చేరి, ఎంతో కష్టపడి చదువుకుని.. మంచి కంపెనీ ఉద్యోగంలో నిలదొక్కుకున్నాను. కానీ నా ఉన్నతిని, అభివృద్ధిని చూడడానికి నా కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు అన్న బాధ నన్ను పట్టి పీడిస్తోంది. మా చిన్నగూడుని చిన్నాభిన్నం చేసిన నీచుడి భార్య ఎంత ప్రశాంతంగా ఉందో? బాధ, కోపం ఆజ్యాలై .. నా గుండెలో రగిలిన మంటలని మరింతగా రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఈ నీచులను ఏ చట్టాలు శిక్షించలేదు. నేనే అమలుపరిస్తే? ఆ ఆలోచన విత్తుగా మొలకెత్తి మహా వృక్షమై, వేళ్లూనుకుంది. అవును .. ఆ దుర్గారావు గాడిని మానసికంగా దెబ్బతీయాలి. వాడు కుళ్ళికుళ్ళి చావాలి.. దానికి మార్గం.. ధరణిని ఎవరికి తెలియకుండా చంపేస్తే? ఎన్నో కుటుంబాలని రోడ్డుకీడ్చి ఊపిరి తీసేసిన పాపానికి, వాడికి ఇదే సరైన శిక్ష. అదను కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను.ఇంతలో ఆమె టాయ్లెట్ వైపు వెళ్ళింది. రెండు నిమిషాలు గడిచాయి. నేను కూడా టాయ్లెట్ వైపు నడిచాను. కంపార్ట్మెంట్ ఎగ్జిట్ డోర్ తీసి వుంది. పార్టిషన్ డోర్ పక్కన సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎవ్వరూ చూడటానికి అవకాశం లేదు. బయటకి చూశాను. కటిక చీకటిని ఆకాశం తన మొహానికి కాటుకలా పులుముకుంది. ఆకాశం బద్దలైనట్టు, దిక్కులు పిక్కటిల్లేలా శబ్దం చేస్తూ పిడుగులతో కూడిన వర్షం హోరున పడుతోంది. అక్కడక్కడ మెరుపులు మేఘాలకు దారిచూపిస్తున్నాయి. అంత వర్షంలోనూ చీకటిని, వర్షాన్ని చీల్చుకుంటూ రైలు వేగంగా పరుగెడుతోంది. ఒక తెలివైన ఆలోచన వచ్చింది.ఇదే సమయం.. ధరణి టాయ్లెట్ బయటకి రాగానే తెరిచి ఉంచిన కంపార్ట్మెంట్ ద్వారంలోంచి బయటకి ఒక్క తోపు తోసేస్తే.. ఆమె అరిచినా ఈ గాలివాన హోరులో వినబడదు. ఆమె బయటపడ్డ వెంటనే రైలు చక్రాలు ఆమెని నుజ్జునుజ్జు చేసేస్తాయి. శవం గుర్తుపట్టలేనంతగా ఛిద్రం అయిపోతుంది.. ఒక వేళ పక్క పట్టాల మీద ఈమె శరీరం పడ్డా వేగంగా వస్తున్న ఏదో రైలు దీని ప్రాణం తీస్తుంది. కసిగా అనుకుంటుంటే .. మనస్సుకి తృప్తిగా అనిపించింది. మూడో కంటి వాడికి కూడా తెలియదు.. చంపేయి! మనసు రెచ్చ కొడుతోంది. వద్దు పాపం. వాళ్ళ ఖర్మన వాళ్ళే పోతారు.. చంపొద్దని లోపలి మనిషి హెచ్చరిస్తున్నాడు. లోపల సంఘర్షణ మొదలైంది. ఎన్నో రాత్రులు కంటికి మింటికి ధారాపాతంగా ఏడ్చిన మా అమ్మానాన్నల దీనమైన ముఖాలు హఠాత్తుగా గుర్తుకు వచ్చాయి. నా వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది .. మనసు చెప్పినట్టే చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నాను.ఇంతలో టాయ్లెట్ తలుపు తెరిచిన శబ్దం వినిపించింది. నేను వెంటనే ఎడమ వైపున్న సింక్ దగ్గరకు వెళ్ళి చేతులు కడుక్కున్నట్టు నటిస్తున్నాను.. ధరణి బయటకి వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తోంది. నేను వేగంగా .. ఆమె వైపు దూసుకు వెళ్ళాను.. ఇంతలో పక్క కంపార్ట్మెంట్ నుంచి ఒకతను.. మా ఇద్దరి మధ్యలోకి వచ్చాడు. నేను నిగ్రహించుకుని ఆగిపోయాను.ఆమె పార్టిషన్ డోర్ పుష్ చేసుకుని తన బెర్త్ వైపు వెళ్ళిపోయింది. ‘ఛ ఛ చాన్స్ మిస్ అయ్యింది!’ తలబాదుకుని.. నిరాశగా నా బెర్త్ వైపు నడిచాను. ‘ఆమె చేతిలో ఏదో ఫైల్.. కళ్లజోడు పెట్టుకుని చదువుతోంది. నేను బెర్త్ మీద దుప్పటి, తలగడ, సర్దుకుని.. కాళ్ళ షూస్ విప్పి.. వాటర్ తాగి.. కళ్ళుమూసుకున్నాను.ఆమె వెంట తెచ్చుకున్న టిఫిన్ తింది. ఒక గంట పోయాకా చేయి కడుక్కోవడానికి టాప్ దగ్గరకు బయలుదేరింది. కంపార్ట్మెంట్ మధ్యలో లైట్లు ఆపేసి ఉన్నాయి. అక్కడక్కడా ఉన్న ప్రయాణికులు పార్టిషన్ కర్టె¯Œ ్స వేసుకుని పడుకున్నారు. నేను మా బెర్త్ల దగ్గర కూడా లైట్లు ఆపేశాను. మొత్తం చీకటి అయిపోయింది. కానీ టాయ్లెట్ దగ్గర వెలుగుతున్నాయి. అయినా ఫర్వాలేదు. వేగంగా ఆమె వైపు వెళ్ళాను. ఆమె చేతులు కడుక్కుని, వెనక్కి రాబోతోంది. నేను ఆమెకు అతి దగ్గరగా వెళ్ళగానే.. ఆ హఠాత్పరిణామానికి ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి.కంగారుపడి గట్టిగా అరవబోతుంటే, చేత్తో నోరు నొక్కి ఆమె భుజం మీద చేయి వేసి తెరిచి ఉంచిన ఎగ్జిట్ డోర్లోంచి బలంగా రైలు బయటకి ఒక్క తోపు తోశాను. వేగంగా అప్పుడే పక్క పట్టాల మీద ఒక రైలు రావడం, ఆమె దాని కింద పడటం లిప్త పాటులో జరిగిపోయింది. ఆమె అరిచిన కేక వర్షపు ధ్వనిలో కలిసిపోయింది. భార్య చనిపోయిందన్న వార్త తెలియగానే, భోరుభోరుమంటూ ఏడుస్తున్న దుర్గారావు గాడి మొహం మనసులో మెదిలింది. ఈ శిక్ష పరోక్షంగా వాడికే! వేగంగా కొట్టుకుంటున్న గుండెని అదిమి పెట్టుకుని, నుదుట పట్టిన చెమటను తుడుచుకుంటూ ఏమీ తెలియనట్టు వచ్చి బెర్త్ మీద పడుకున్నాను.. ∙∙ ఎవరో పిలుస్తున్నట్టు , తడుతున్నట్టనిపించి ఉలిక్కిపడి ఒక్క ఉదుటన లేచాను. ఎవరూ లేరు.. రైలు ఆగినట్టుంది. బయట నుంచి చాలా మంది ప్రయాణికులు గట్టిగా మాట్లాడుకుంటూ సీట్లు వెతుక్కుంటున్నారు. మెడ కింద పట్టిన చెమటని తుడుచుకున్నాను. గట్టిగా కొట్టుకున్న గుండె వేగం కాస్త తగ్గింది. మంచి నీళ్ళు తాగుదామని లైటు వేశాను. ఎదురుగా మెడ వరకు దుప్పటి కప్పుకుని ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమెని చూసి దిగ్భ్రాంతి చెందాను. ఆమెని బయటకి తోసేశాను కదా.. ఎలా బతికింది? కళ్ళు నులుముకున్నాను. అంటే.. అంటే .. నేను నిద్రలోకి జారుకున్నానన్న మాట .. అంతా కలన్నమాట? అయ్యో దొరికిన అవకాశాన్ని చేతులారా వదిలేశాను.చేతిని బర్త్ మీద కసిగా కొట్టుకున్నాను. నిద్రపట్టక కిటికీలోంచి బయటకి చూశాను నిరాశగా. నాగపూర్ స్టేషన్ అన్న పేరు కనబడింది. ఇంతలో మా కంపార్ట్మెంట్లోకి ఎవరో ఒకతను చిన్న సూట్కేసు పుచ్చుకుని ఎక్కాడు.. ధరణి బెర్త్ దగ్గరకు వచ్చి ‘ధరణి మేడమ్..’ అంటూ దూరంగా నిలబడి ఆమెని పిలిచాడు.‘ఆమె .. నిద్రలోంచి వెంటనే లేచి.. సారీ.. నిద్రపట్టేసింది లాయర్ గారు..’ అంటున్న ఆమె మొహంలో సిగ్గు కనబడింది. అతను ‘నో ప్రాబ్లం మేడమ్’అంటూ వినయంగా ఆమెకి దూరంగా బెర్త్ చివర కూర్చున్నాడు. ఆమె జుట్టు సరిచేసుకుంది. కళ్ల జోడు పెట్టుకుంది. నేను వెంటనే పడుకుని, నిద్రపోతున్నట్టు నటిస్తూ కనురెప్పల కింద నుంచి చూస్తూ, నెమ్మదిగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారోనని, చెవులు రిక్కించి వినసాగాను.‘నాగపూర్ కోర్టులో పని అయి పోయిందా లాయర్ గారు? అడిగింది. ‘పోస్ట్పోన్ అయ్యింది మేడమ్! అందుకనే మీరు ఢిల్లీ వస్తున్నారని చెప్పగానే ఇక్కడ ట్రైన్ ఎక్కే ఏర్పాటు చేసుకున్నాను.’ ‘థాంక్స్ అండి..’ అంది వినయం ఉట్టిపడే గొంతుతో. పక్కన ఉన్న చిన్న లైట్ కాంతిలో ఆమె మొహం కనబడుతోంది. లాయర్ నెమ్మదిగా, లోగొంతుకతో ‘మేడమ్! రేపు మీరు జడ్జ్ గారి ముందు అన్నీ చెప్పుకోవచ్చు. మీరు రాసిచ్చిన కాగితాలన్నీ కోర్టులో ఆల్రెడీ సబ్మిట్ చేశాం. మీరు చేసిన పని హర్షించ తగ్గది’ అన్నాడు. నేను ఆశ్చర్యపోయి ఏంటో ఈ మహాతల్లి చేసిన హర్షించదగ్గ పని.. వెటకారంగా అనుకుని వాళ్ళ మాటలను ఏకాగ్రతగా వినసాగాను.ధరణి విరక్తిగా నవ్వి ‘ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది లాయర్ గారు. డబ్బు పాపిష్టిది అని తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది. మనకి ఈ పాపపు సంపాదన వద్దండీ అన్నా కూడా నా మాటలు పెడచెవిన పెట్టి , అమాయకుల్ని మోసం చేసిన పాపానికి మా ఆయనకి కాలు చేయి పడిపోయి, మంచం మీద తీసుకుని తీసుకుని చనిపోయాడు. కొన్ని ఆస్తులు నా పేరు మీద ఉన్నాయి. మరి కొన్ని కోర్టు అధీనంలో ఉన్నాయి. కొడుకులిద్దరూ నా పేరు మీద ఉన్న ఆస్తుల కోసం నన్ను చంపడానికి కూడా వెనుకాడడం లేదు. నాకు అన్నం పెట్టే దిక్కు లేదు. ఎందరో అమాయకుల ఉసురు మాకు తగిలింది. మాకు తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు నా కొడుకులు నా కోసం వెతుకుతూ ఉండవచ్చు.అందుకనే, రేపు కోర్టు వారిని అభ్యర్థించి ఈ కేసుని ముగించమని, ప్రజలని మోసం చేసి కూడబెట్టిన ఆస్తులన్నీ కోర్టు ద్వారా అమ్మి .. డిపాజిటర్స్కి చెల్లించమని వేడుకుంటాను. అప్పుడు గాని నాకు మనఃశాంతి ఉండదు’ అంటూ కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంది. ఆమె మాటలు వినగానే నాకు గుండె ఒక్క క్షణం ఆగినట్టనిపించింది. అయ్యో! ఎంత ఘోరం తలపెడదామనుకున్నాను? క్షణికావేశంలో ఆమెని చంపేసి ఉంటే.. నా వాళ్ళందరికీ ద్రోహం చేసిన వాడినై, జీవితాంతం ఆ పాపం నన్ను వెంటాడేది.ఆలస్యం అయినా.. ఇన్నాళ్ళకి మా అందరికీ న్యాయం జరగబోతోంది. ఏదో తెలియని ఆనందం కలిగింది. నా కనుకొలనులోంచి కన్నీటి బొట్టు జారీ తలగడ మీద పడి ఇంకిపోయింది. లాయర్ అప్పర్ బెర్త్ మీద పడుకుని ఉన్నాడు. తెలతెలవారుతోంది. బెర్త్ దిగి రైలు కిటికీ గ్లాస్లోంచి చూశాను. వర్షం లేదు.. ఆకాశం స్వచ్ఛంగా ఉంది. పది నిమిషాలలో రైలు ఢిల్లీ చేరుతుంది అని మొబైల్లో రైల్ స్టేటస్ ట్రాక్ చూపిస్తోంది. ధరణి మేడమ్కేసి చూశాను. నిద్రపోతోంది. మొహంలో ప్రశాంతత. ఇంక అక్కడ ఉండలేక ఆమె పాదాలని దూరం నుంచి నమస్కరించుకుని .. ట్రైన్ ఎగ్జిట్ డోర్ దగ్గరకు చేరాను. – చాగంటి ప్రసాద్ -
దిగడం సరే.. ఎక్కడమెలా!
రాజంపేట: ఒక రైలుకు ఒక స్టేషన్లో హాల్టింగ్ ఇస్తే.. ఆ రైలు అప్, డౌన్లకు హాల్టింగ్ ఉన్నట్లే.. అయితే గుంతకల్లు డీవోఎం(కోచ్) పేరిట విడుదలైన ఉత్తర్వులలో హాల్టింగ్స్ పై వింతవైఖరి శనివారం బట్టబయలైంది. పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు కన్ఫ్యూజ్ హాల్టింగ్ ఆర్డర్స్ జారీ చేసి ప్రయాణికులను గందరగోళంలోకి నెట్టేశాయి. మోదీ పాలనలో అడ్డగోలుగా అధికారులు తీసుకుంటున్న వింత నిర్ణయాలతో కేంద్రం పేద, మధ్యతరగతి వారి నుంచి చెడ్డపేరు మూటకట్టుకుందనే విమర్శలున్నాయి. ఈ పరిస్థితి ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో రైల్వేపరంగా గుర్తింపు కలిగిన నందలూరు రైల్వేకేంద్రంలో చోటుచేసుకుంది. కడప నుంచి విశాఖకు (17487) తిరుమల ఎక్స్ప్రెస్ రైలుకు నందలూరులో హాల్టింగ్ ఎత్తివేశారు. అయితే విశాఖ నుంచి తిరుపతికి వచ్చే తిరుమల ఎక్స్ప్రెస్ రైలుకు నందలూరులో హాల్టింగ్ ఇచ్చారు. ఎక్కేందుకు వీలులేకుండా, వచ్చేందుకు వీలు కల్పించే హాల్టింగ్ ఇచ్చారు. అలాగే 17415 నంబరుతో నడిపించే తిరుపతి నుంచి కోల్హాపూర్కు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలుకు హాల్టింగ్ను ఎత్తివేశారు. అయితే కోల్హాపూర్ నుంచి తిరుపతికి వెళ్లే ఎక్స్ప్రెస్కు నందలూరు హాల్టింగ్ను ఇచ్చారు. ఈ విధంగా హాల్టింగ్స్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని రైల్వే వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఓబులవారిపల్లె, రాజంపేటలో..ఓబులవారిపల్లెలో రైల్వే జంక్షన్లో నందలూరు రైల్వేకేంద్రం తరహాలోనే 17415 నంబరు గల తిరుపతి –కోల్హాపూర్, తిరుపతి–నిజాముద్దీన్, నిజాముద్దీన్–తిరుపతి మధ్య నడిచే (12793/12794) రైలుకు పూర్తిగా హాల్టింగ్ ఎత్తివేశారు. రాజంపేట రైల్వేస్టేషన్లో మధురై నుంచి లోకమాన్యతిలక్ (22102)కు హాల్టింగ్ ఎత్తేశారు. ఎక్కడానికి మాత్రమే హాల్టింగ్, దిగడానికి హాల్టింగ్ లేకుండా చేశారు. రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది కంటి ఆపరేషన్లకు మధురైకు వెళుతుంటారు. అదే రైల్లో తిరిగి తమ గమ్యాలకు చేరుకుంటున్నారు. వారు రైల్వే అధికారులు తీసుకున్న వింత నిర్ణయాలపై పెదవి విరిస్తున్నారు. ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో కాచిగూడ నుంచి చెంగల్పట్టుకు వెళ్లే (17652)రైలుకు హాల్టింగ్ ఎత్తివేశారు. -
గొడుగు పట్టుకొని ట్రైన్ నడుపుతున్న లోకోపైలట్
-
చెన్నై–మైసూర్ మధ్య హైస్పీడ్ రైలు
సాక్షి, అమరావతి : దక్షిణ భారతదేశంలో చెన్నై–మైసూర్ మధ్య తొలి హైస్పీడ్ రైలును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల మీదుగా ప్రత్యేక కారిడార్ను నిరి్మంచాలని జాతీయ హైస్పీడ్ రైల్ కారిడార్ కార్పొరేషన్ ప్రణాళిక రూపొందించింది. మొత్తం 463 కి.మీ. మేర ఈ కారిడార్ను నిర్మిస్తారు. మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోనూ 83 కి.మీ.మేర నిరి్మంచనున్నారు. ఈ మేరకు ప్రాజెక్టు డిజైన్ను రైల్వేశాఖ సూత్రప్రాయంగా ఆమోదించి భూసేకరణ ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. అనంతరం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఖరారు చేయనుంది. మూడు రాష్ట్రాల మీదుగా.. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మీదుగా నిర్మిస్తారు. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, కర్ణాటక రాజధాని బెంగళూరు మీదుగా మైసూర్ వరకు నిరి్మస్తారు. మొత్తం 463 కి.మీ. పొడవైన ఈ కారిడార్ ఆంధ్రప్రదేశ్లో 83 కి.మీ. మేర ఉంటుంది. తమిళనాడులో 122 కి.మీ, కర్ణాటకలో 258 కి.మీ. మేర నిరి్మస్తారు. రెండు దశలుగా చేపట్టే ఈ ప్రాజెక్టును మొదటి దశ కింద చెన్నై నుంచి బెంగళూరు వరకు 306 కి.మీ., రెండో దశ కింద బెంగళూరు నుంచి మైసూర్ వరకు 157 కి.మీ. మేర నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇక అత్యంత ఆధునికంగా నిర్మించే ఈ హైస్పీడ్ కారిడార్లో భాగంగా ఏలివేటెడ్ కారిడార్, ఎట్ గ్రేడ్, టెన్నెల్, గ్రీన్ఫీల్డ్ సెగ్మెంట్లుగా నిర్మించాలని డిజైన్ను ఖరారుచేశారు. ఈ కారిడార్లో భాగంగా 30 కి.మీ.మేర సొరంగాలు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. చెన్నైలో 2.8 కి.మీ, చిత్తూరులో 11.8 కి.మీ., బెంగళూరు రూరల్లో 2 కి.మీ., బెంగళూరులో 11 కి.మీ. మేర వీటిని నిర్మిస్తారు. మొత్తం 11 స్టేషన్లు.. ఏపీలో చిత్తూరులో హాల్ట్.. ఇక ఈ హైస్పీడ్ రైలుకు చెన్నై–మైసూర్ మధ్య 11 చోట్ల హాల్ట్లు కల్పిస్తారు. ఏపీలో ఒక్క చిత్తూరులోనే ఉంటుంది. దీంతోపాటు చెన్నై, పూనమల్లి, కోలార్, కొడహళ్లి, వైట్ఫీల్డ్, బైయపనహళ్లి, ఎల్రక్టానిక్స్ సిటీ, కెంగేరీ, మాండ్య, మైసూర్లలో ఎలివేటెడ్ రైల్వేస్టేషన్లను నిరి్మస్తారు. భూసేకరణ ప్రక్రియపై కసరత్తు.. హైస్పీడ్ రైల్ కారిడార్ మొత్తం 303 గ్రామాలు, పట్టణాల మీదుగా నిరి్మంచాల్సి ఉంటుందని రైల్వేశాఖ ప్రకటించింది. అందుకోసం తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరు, ఏపీలోని చిత్తూరు, కర్ణాటకలోని కోలార్, బెంగళూరు రూరల్, బెంగళూరు అర్బన్, రామనగర, మాండ్య, మైసూర్ జిల్లాల్లో 2,905 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇందులో 2,660 ఎకరాలు ప్రైవేటు భూములే. ప్రస్తుతం రైల్వేశాఖ ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదికను రూపొందించే ప్రక్రియను వేగవంతం చేసింది. మరోవైపు.. భూసేకరణ ప్రక్రియపై ప్రాథమిక కసరత్తు చేపట్టింది. అనంతరం డీపీఆర్ను ఖరారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదించిన అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. 2025–26 ఆరి్థక సంవత్సరంలో హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలన్నది రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గరిష్ట వేగం గంటకు 350 కి.మీ..ఇక ఈ హైస్పీడ్ రైల్ గంటకు గరిష్టంగా 350 కి.మీ. వేగంతో దూసుకపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని నిర్వహణ వేగం గంటకు 320 కి.మీ.గా నిర్ణయించారు. సగటు వేగం గంటకు 250 కి.మీ. ఉంటుందని రైల్వేశాఖ ప్రకటించింది. మొత్తం 730 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. -
షిర్డీ-కాకినాడ రైల్లో అర్ధరాత్రి అసలేం జరిగింది? బాధితులు ఏం చెప్పారంటే..
సాక్షి, ఖమ్మం జిల్లా: దొంగల బీభత్సం సృష్టించిన షిర్డీ సాయి నగర్ టూ కాకినాడ రైలు ఖమ్మం రైల్వే స్టేషన్ చేరుకుంది. సుమారు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో దోపిడీ జరిగినట్లు బాధితులు చెబుతున్నాయి. 30 మందికి పైగా బాధితుల లగేజీ బ్యాగ్లు, మని పర్సులు.. మొబైల్ ఫోన్లు దొంగలు ఎత్తుకెళ్లారు. సుమారు 30 లక్షల విలువ చోరీ అయినట్టు సమాచారం.బి3,బి4,బి5 ఏసీ కోచ్లలో ప్రయాణికులు నిద్రలో ఉండగా దోపిడీ జరిగింది. పర్భని దగ్గర జరిగినట్లుగా ప్రయాణికులు చెబుతున్నారు. బాధితులు పర్ని బైదనాడ్ స్టేషన్ వద్ద ప్రయాణికులు తమ వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఒకటి తర్వాత ఒకరు తమ వస్తువులు పోయాయంటూ కోచ్లో ఆందోళన దిగారు..రైల్వే పోలీసులకు సమాచారం అందించగా సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. రైలు సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకోగానే రైల్వే పోలీసులకు పలువురు ఫిర్యాదు చేశారు. మరికొందరు ఖమ్మం జీఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వైరల్ వీడియోల కోసం మరీ ఇలానా..! ఏకంగా రైలు పట్టాలనే..!
ఇటీవల సోషల్ మీడియా పిచ్చి మాములుగా లేదు. ఎంతలా అంటే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేసేందుకు ఎలాంటి పిచ్చి పనులు చేసేందుకైనా వెనకాడటం లేదు. వ్యూస్, లైక్లు, ఫాలోవర్లు ఇదే లోకం, లక్ష్యం అన్నట్లుగా ఎలా పడితే అలా వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. అది సమంజసమైన వీడియోనేనా, నెటిజన్లకు ఉపయోగపడుతుందా అనేది అనవసరం. కొందరైతే ఘోరం ప్రమాదాలను సృష్టించి ఇతరుల ప్రాణాల రిస్క్లో పడేసి మరీ వీడియోలు తీసేస్తున్నారు. ఇలాంటి పనే చేశాడు 17 ఏళ్ల కుర్రాడు.ఏం చేశాడంటే..అమెరికాలోని నెబ్రస్కా రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల కుర్రాడికి యూట్యూబ్లో వీడియో వైరల్ చేయాలనే కోరికతో దారుణానికి ఒడిగట్టాడు. వీడియో కోసం అని ఏప్రిల్లో మోన్రోయ్ అనే ప్రాంతం వద్ద ఉన్న రైలు క్రాసింగ్ వద్దకు వెళ్లాడు. అక్కడ రైళ్ల మార్గాలను నిర్దేశించే స్విచ్ల లాక్ తీసి వాటిల్లో మార్పులు చేశాడు. సమీపంలో తన కెమెరా ట్రైపాడ్ అమర్చి కాచుకొని కూర్చున్నాడు. ఇంతలో బీఎన్ఎస్ఎఫ్ సంస్థకు చెందిన రెండు లోకోమోటీవ్లు, ఐదు బోగీలు వచ్చాయి. ఆ డ్రైవర్ ఏం జరిగిందో గుర్తించే సమయానికి అవి పట్టాలు తప్పాయి.ప్రమాదం సృష్టించిన ఈ బాలుడే మళ్లీ రైల్వే అధికారులకు ఫోన్ చేసి అప్రమత్తం చేశాడు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఎవరో కీలక స్విచ్లను మార్చినట్లు గుర్తించారు. ఎందుకనో పోలీసులు అనుమానంతో సమాచారం అందించిన బాలుడినే గట్టిగా విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. విచారణలో ఆ బాలుడు..తాను పట్టాలు తప్పుతున్న రైలు వీడియో చిత్రీకరించాలనుకున్నట్లు తెలిపాడు. కానీ ఆ స్విచ్ మార్పులతో తనకు సంబంధం లేదని బుకాయించాడు. అయితే అధికారులు అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. ప్రమాదానికి ముందు వాహనంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చినట్లు గుర్తించారు. అతడు బాలుడితో సరిపోలాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. ఈ ప్రమాదం కారణంగా ఒహామా పబ్లిక్ పవర్ డిస్ట్రిక్ట్కు, బీఎన్ఎస్ఎఫ్ రైల్వేకు దాదాపు రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందట.(చదవండి: స్టైల్ ఐకాన్ నటాషా పూనావాలా గ్లాస్ మాదిరి పర్సు ధర ఎంతంటే..?) -
Gujarat: పట్టాలు తప్పిన గూడ్సు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
గుజరాత్లోని వల్సాద్లో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగపోయినా, ఈ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ప్రయాణికులు పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.గూడ్స్ రైలు సూరత్ వైపు వెళుతుండగా ముంబై-అహ్మదాబాద్ ట్రంక్ మార్గంలో డుంగ్రీ స్టేషన్ సమీపంలో బోగీ ఒకటి అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. అయితే రైలు వేగం ఎక్కువగా లేకపోవడంతో బోగీ బోల్తా పడలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు పట్టాలు తప్పిన కోచ్ను ట్రాక్పై నుంచి తొలగించి, రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చూశారు. ఘటన ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.ఇటీవలికాలంలో రైలు బోగీలు పట్టాలు తప్పుతున్న కేసులు పెరుగుతుండడంతో రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈశాన్య రైల్వేలోని బారాబంకి-గోరఖ్పూర్ జోన్లోని మోతీగంజ్-జిలాహి స్టేషన్ల మధ్య చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్కు చెందిన ఎనిమిది బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన పలువురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. BIG BREAKING 🚨⚡Another Day, Another Train Accident as one more goods train derailed in Valsad, Gujarat todayAnother PR opportunity for that shameless Reel Minister 👏 pic.twitter.com/Gyfde5JQvb— Ankit Mayank (@mr_mayank) July 19, 2024 -
భార్యను రైలు ఢీకొన్నదని.. భర్త కూడా రైలుకెదురెళ్లి..
భార్యాభర్తల బంధం విడదీయరానిదని అంటారు. ఒకవేళ భాగస్వామిలో ఒకరు దూరమైతే మరొకరు తల్లడిల్లిపోతుంటారు. ఊహకందని నిర్ణయాలు కూడా తీసేసుకుంటారు. ఇంటిలోనివారికి, బంధువులకు విషాదాన్ని మిగులుస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఉదంతం రాజస్థాన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..రాజస్థాన్లోని చురు జిల్లాలో రాజల్దేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ రైలు ఢీకొని మృతి చెందింది. ఈ విషయం తెలియగానే భర్త అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అతను కూడా రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. బాబులాల్ రేగర్ (50)కు తన భార్య సంతోష్ రేగర్ (43)తో ఏదో విషయమై మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారిద్దరూ కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు.రెండు రోజుల క్రితం సంతోష్ రేగర్ తన ఇంటికి సమీపంలోని రాజల్దేసర్లోని రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఢీకొని మృతి చెందింది. ఈ విషయం తెలియగానే భర్త బికనీర్-ఢిల్లీ ప్యాసింజర్ రైలుకు ఎదురెళ్లాడు. ఆ రైలు అతనిని ఢీకొనడంతో మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం భార్యాభర్తల మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
విజయ్ సేతుపతి ‘ట్రైన్’ కోసం.. ‘శ్రుతి’ గానం
తమిళ సినిమా: నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం మహారాజా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ట్రైన్ చిత్రం. నటి డింపుల్ హైయతీ నాయకిగా నటిస్తున్నారు. ఆర్.దయానంద, నాజర్, దర్శకుడు కేఎస్.రవికుమార్, వినయ్ రాయ్, భావన, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీ.క్రియేషన్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిష్కిన్ దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు చోటు చేసుకుంటాయని, అందులో ఓ పాటను దర్శకుడు మిష్కిన్ నే పాడినట్లు సమాచారం. కాగా మరో పాటను ఆయన కోరిక మేరకు నటి శ్రుతిహాసన్ పాడటానికి సమ్మతించినట్లు తెలిసింది. కథానాయకిగా బిజీగా ఉన్న ఈమె అప్పుడప్పుడూ పాటలను కూడా పాడుతున్న విషయం తెలిసిందే. అలా ట్రైన్ చిత్రం కోసం ఈ బ్యూటీ పాడనున్న పాట ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. కాగా డార్క్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందుతున్న ట్రైన్ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లు తెలిసింది. కాగా దర్శకుడు మిష్కిన్ ఈ చిత్రానికి ముందు పిశాచి – 2 చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కాగా ఆ చిత్రాని కంటే ముందు ట్రైన్ చిత్రం తెరపైకి రానుందని సమాచారం. -
‘మా ఆయన ఆత్మకు శాంతి చేకూరింది’
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో ఆమధ్య కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొంది. ఈ ఘటనపై విచారణ అనంతరం గూడ్స్ రైలు లోకో పైలట్ అనిల్కుమార్ కుటుంబానికి ఊరట లభించింది. రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్ (సీసీఆర్ఎస్)తన నివేదికలో జూన్ 17న జరిగిన కాంచనజంగా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గూడ్స్ రైలు లోకో పైలట్ అనిల్కుమార్ కారకుడు కాదని తేల్చి చెప్పారు. దీనిని విన్న అనిల్కుమార్ భార్య ఇప్పుడే తన భర్త ఆత్మకు శాంతి చేకూరిందని పేర్కొన్నారు.ఆ నాటి ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 43 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సీసీఆర్ఎస్ నివేదిక వెలువడిన అనంతరం లోకో పైలట్ అనిల్ భార్య రోష్ణి కుమార్ మాట్లాడుతూ ‘రైలు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే నా భర్త ప్రమాదానికి కారకుడంటూ అధికారులు తేల్చేశారు. దర్యాప్తు ప్రారంభించకముందే నా భర్తను బాధ్యుడుగా చేయడాన్ని విని నేను షాక్ అయ్యాను. అయితే ఇప్పుడు రైల్వేశాఖ సరైన విచారణ జరిపి, తన భర్తను నిర్దోషిగా తేల్చినందుకు సంతోషిస్తున్నాను. ఇప్పుడు మా ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది’ అని పేర్కొన్నారు.నాడు గూడ్స్ రైలు కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను వెనుక నుండి ఢీకొన్న దరిమిలా రైల్వే బోర్డు చైర్పర్సన్ జయ వర్మ సిన్హాతో పాటు ఇతర రైల్వే అధికారులు ఈ ప్రమాదానికి ఘటనలో మృతి చెందిన పైలట్ అనిల్ కుమార్, అతని సహాయకుడు కారణమనే నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ప్రమాదంపై అధికారుల జరిపిన విచారణలో.. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ట్రాక్పై ఉన్నప్పటికీ, గూడ్స్ రైలు లోకో పైలట్ను ఆ సెక్షన్లో వెళ్లడానికి అనుమతించారని, ఎటువంటి జాగ్రత్తలు లేకుండా అతనికి తప్పుడు సంకేతాలను పాస్ చేశారని సీసీఆర్ఎస్ ప్రాథమిక నివేదిక పేర్కొంది.ఆ సమయంలో గూడ్స్ రైలు గంటకు 78 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. గూడ్సు రైలు పైలట్ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ వెనుక భాగాన్ని గమనించి, అత్యవసర బ్రేకులు వేశాడు. దీంతో గూడ్సు రైలు వేగం నెమ్మదించి, అది కాంచన్జంగాను గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఢీకొన్నదని తేలింది. ఇది అనిల్ అప్రమత్తతను తెలియజేస్తుందని నివేదికలో పేర్కొన్నారు.ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు నివేదిక అందిన దరిమిలా అనిల్ కుమార్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందజేశామని రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ విషయమై ఎన్ఎఫ్ఆర్ సీనియర్ అధికారి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి పెన్షన్ ఆర్డర్ కూడా జారీ అయ్యిందని, త్వరలో గ్రాట్యుటీ కూడా చెల్లించనున్నారన్నారు. మృతుని కుమారులు మైనర్లు అయినందున వారిలో ఒకరికి పెద్దయ్యాక రైల్వేలో ఉద్యోగం ఇవ్వనున్నారని తెలిపారు. -
రైలు ఢీకొని పులిపిల్ల మృతి.. మరో రెండింటికి గాయాలు
మధ్యప్రదేశ్లోని సెహోర్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బుధ్ని ప్రాంతంలో రైలు ఢీకొని ఒక పులి పిల్ల మృతి చెందగా, మరో రెండు పులి పిల్లలు తీవ్రంగా గాయపడ్డాయి. గాయపడిన ఈ పులి పిల్లలను చికిత్స కోసం ప్రత్యేక రైలులో భోపాల్లోని వనవిహార్కు తరలించారు. మృతి చెందిన పులి పిల్లకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం దానికి అంత్యక్రియలు చేశారు.ఈ ఉదంతం గురించి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) రాజేష్ ఖరే మాట్లాడుతూ ఉదయం వేళ పులి తన పిల్లలతో కలిసి నీరు తాగడానికి వెళ్లి ఉంటుంది. ఆ సమయంలోనే మూడు పిల్లలు రైలు ప్రమాదం బారిన పడ్డాయి. ఈ ఘటనలో ఒక పులి పిల్ల మృతి చెందగా, రెండు పులి పిల్లలు గాయపడ్డాయి. దీనిపై సమాచారం అందగానే ఘటనా స్థలానికి వెళ్లాం. గాయపడిన రెండు పులి పిల్లలను చికిత్స కోసం భోపాల్లోని వన విహార్కు తరలించామని తెలిపారు. #WATCH | Madhya Pradesh | A tiger cub died and 2 other cubs were injured after being hit by a train in the Budhni area of Sehore. Both the injured cubs were rescued and taken to Van Vihar, Bhopal by a special train for treatment. The dead cub was cremated after post-mortem.… pic.twitter.com/3WkaRDD2p2— ANI (@ANI) July 16, 2024 -
‘అయోధ్య టు జనక్పూర్’ ప్రత్యేకత ఏమిటంటే..
రామ జన్మభూమి అయోధ్య నుంచి సీతామాత జన్మస్థలం జనక్పూర్కు వెళ్లాలనుకునేవారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. శ్రీరాముడు కొలువైన అయోధ్య నుండి గోరక్ష నగరం మీదుగా నేపాల్లోని జనక్పూర్కు అంటే సీతామాత జన్మస్థలానికి ప్రత్యేక రైలును నడపడానికి రైల్వేశాఖ సన్నాహాలు ప్రారంభించింది. భారతదేశం నుండి నేరుగా నేపాల్కు వెళ్లే మొదటి రైలు ఇదేకానుంది. ఈ రైలును రైల్వేశాఖ, ఐఆర్సీటీసీ సంయుక్తంగా పర్యవేక్షించనున్నాయి.ఈ రైలు అయోధ్యలో ప్రయాణాన్ని ప్రారంభించి, గోరఖ్పూర్ మీదుగా వివిధ మార్గాల గుండా నేపాల్లోని జనక్పూర్కు చేరుకోనుంది. ఈ రైలు అయోధ్య నుంచి జనక్పూర్ చేరుకునేందుకు 22 గంటల సమయం పడుతుంది. ఈ ప్రత్యేక రైలులో మొత్తం 22 కోచ్లు ఉంటాయి. సెకండ్, థర్డ్ ఏసీలే కాకుండా స్లీపర్, జనరల్ కోచ్లు కూడా ఉంటాయి. ప్రస్తుతానికి ఈ రైలును వారానికి ఒకసారి నడపాలని, ప్రయాణికుల స్పందన చూశాక మిగతా రోజుల్లో కూడా నడపాలని రైల్వే అధికారులు యోచిస్తున్నారు. ఈ రైలు అయోధ్య నుండి బయలుదేరి గోరఖ్పూర్, నార్కతియాగంజ్-రక్సాల్-సీతామర్హి-దర్భంగా మీదుగా జనక్పూర్ చేరుకుంటుంది. -
‘అమర్కంటక్’లో మంటలు... తప్పిన ముప్పు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అమర్కంటక్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. మిస్రోడ్- మందీదీప్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఏసీ కోచ్ కింది భాగంలో మంటలు చెలరేగడాన్ని గమనించిన ప్రయాణికులు ఈ విషయాన్ని వెంటనే రైల్వే అధికారులకు తెలియజేశారు. బీ-3, బీ-4 ఏసీ కోచ్ల కింద మంటలు చెలరేగాయి. రైల్వే అధికారులు అగ్ని నిరోధక యంత్రాల సాయంతో మంటలను ఆర్పివేశారు. ఈ ఉదంతంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. అమర్కాంత్ ఎక్స్ప్రెస్ ఛత్తీస్గఢ్లోని దుర్గ్.. మధ్యప్రదేశ్లోని భోపాల్ మధ్య నడుస్తుంది. ఈ రైలుకు 27 హాల్ట్లు ఉన్నాయి. -
రైలుకు ఎదురెళ్లి తండ్రికొడుకుల...
ముంబయి: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏం కష్టం వచ్చిందో పాపం.. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం(జులై 8) ఉదయం 9.30 గంటలకు దూసుకొస్తున్న లోకల్ రైలుకు ఎదురుగా నిల్చొని ప్రాణాలు వదిలారు. ఇద్దరు ఒకరి చేతిని ఒకరు పట్టుకుని ట్రాక్పై నిల్చున్నపుడు రైలు వచ్చి ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. మృతి చెందిన వారిలో తండ్రి హరీశ్ మెహతా(60), కొడుకు జే(35)గా గుర్తించారు. తండ్రి, కొడుకుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గోవా వెళ్లే తెలుగు వారికి కేంద్రం గుడ్న్యూస్..
సాక్షి, ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ను ప్రారంభించనుంది. సికింద్రాబాద్ నుంచి బుధ, శుక్రవారాల్లో ఈ రైలు గోవా బయలుదేనుంది. గోవా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం కానుంది. సికింద్రాబాద్, కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుంది. ఈ సందర్భంగా ప్రధాని, రైల్వే శాఖ మంత్రులకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకూ వారానికి ఒకరైలు 10 కోచ్లతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్కు చేరుకొని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్ళే మరో 10 కోచ్లతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది. ఇది కాకుండా కాచీగూడ - యలహంక మధ్యన వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్ళే 4 కోచ్ లను కలిపేవారు. ఈ 4 కోచ్ లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ - గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు.ఇలా సికింద్రాబాద్ - గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ మార్చి 16, 2024 నాడు రాశారు. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రైల్వేశాఖ ఈ ప్రతిపాదనను పక్కన పెట్టాల్సి వచ్చింది.మళ్లీ కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు అధికారంలోకి రావడంతో.. ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసిన సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తుచేశారు. దీనిపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. దీంతో సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ప్రకటించింది.ఈ నిర్ణయంపై కిషన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో అవసరమైన ఈ రైలును ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ బైవీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడగామా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుంది. ఇది సికింద్రాబాద్, కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుంది. -
బెడిసికొట్టిన ప్రాంక్.. కదులుతున్న రైలుపై నీళ్లు చల్లడంతో..
ఇస్లామాబాద్: కొంతమంది యువతలో పిచ్చి చేష్టలు పెరిగిపోతున్నాయి. చేయకూడని పనులు చేసి, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా రైలు ప్రయాణికులను భయపెట్టేందుకు కొందరు యువకులు కాలువ వద్ద నిలిపిన బైక్ ద్వారా కదులుతున్న రైలుపై నీటిని చిమ్మారు. రైలు ఆగదని భావించి తమ చర్యకు సంబరపడ్డారు. అయితే ఒక్కసారిగా ఆ రైలు ఆగడంతో సిబ్బంది, ప్రయాణికులు ఆ యువకుల వెంటపడ్డారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాకిస్థాన్లో ఈ సంఘటన జరిగింది. రైలు పట్టాల సమీపంలో ఉన్న కాలువ వద్ద కొందరు యువకులు ఫ్రాంక్ కోసం ప్రయత్నించారు. రైలు రావడాన్ని గమనించిన వారు బైక్ ద్వారా నీటిని చిమ్మారు. రైలు ఆగదని భావించి తమ చేష్టలకు సంతోష పడ్డారు. కాగా, రైలు ఇంజిన్పై నీరు పడటంతో ప్రమాదకరంగా భావించిన సిబ్బంది రైలును నిలిపారు. దీంతో వెంటనే భయపపడిన యుకులు తప్పించుకునేందుకు పరుగులు తీశారు. అయితే కొందరు ప్రయాణికులు ఆ యువకుల వెంబడించి పట్టుకొని కొట్టారు.అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు యువకులు రైలుపై నీటిని చిమ్మిన బైక్ను స్వాధీనం చేసుకున్నారు. దానిని రైలులోకి ఎక్కించారు. కొంతసేపటి తర్వాత ఆ రైలు అక్కడి నుంచి కదిలింది. ان لوگوں کو لگ رھا تھا ٹرین رکے گی نہیں،ٹرین رکی،مسافروں نے طبیعت صاف کرکے ان کو دھویا اور پولیس نے بائیک بھی ضبط کرلی۔لیکن ان ذلیل لوگوں کو گرفتار کیا جانا چاھئے تھا۔ pic.twitter.com/sGCbbjugVL— صحرانورد (@Aadiiroy2) June 25, 2024 -
రష్యాలో ఘోర రైలు ప్రమాదం... 70 మందికి తీవ్రగాయాలు
రష్యాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్యాసింజర్ రైలులోని తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 70 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. రష్యా మీడియా కథనాల ప్రకారం గాయపడివారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఎవరూ మృతి చెందినట్లు సమాచారం లేదు.ఈ ప్యాసింజర్ రైలు ఈశాన్య కోమిలోని వోర్కుటా నుండి నల్ల సముద్రపు నొవోరోసిస్క్ ఓడరేవుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం ఐదు వేల కిలోమీటర్లు. ఇటీవల కురిసిన భారీ వర్షాలే రైలు ఇలా పట్టాలు తప్పడానికి కారణం కావచ్చని భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన రైలులో మొత్తం 14 కోచ్లు ఉన్నాయని, 232 మంది ప్రయాణికులు ఉన్నారని రైలు ఆపరేటర్ తెలిపారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.12 గంటల ప్రాంతంలో ఇంటా సిటీకి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అత్యవసర సేవల విభాగానికి చెందిన అధికారులు, సహాయక బృందాలు సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రులకు తరలించారు. ఈ మార్గంలో ప్రయాణించే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. రైల్వే అధికారులు బాధితుల వివరాలను సేకరిస్తున్నారు. Passenger train derails in Komi Region, Russia pic.twitter.com/Ywh4s6NEaH— RT (@RT_com) June 26, 2024 -
వంతెన మధ్యలో మొరాయించిన రైలు.. ప్రమాదాన్ని నివారించిన లోకో పైలట్లు
ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు అందరినీ బెంబెలెత్తిస్తున్నాయి. అయితే ఇటువంటి సందర్భాల్లో ఒక్కసారి ఆ రైలు నడుపుతున్న పైలట్లు తెగువ చూపి, ప్రమాదాన్ని నివారిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఉదంతం బీహార్లో చోటుచేసుకుంది.బీహార్లోని సమస్తీపూర్లో రైలు ప్రమాదాన్ని నివారించిన లోకో పైలట్లను అందరూ మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే సమస్తీపూర్ రైల్వే సెక్షన్లోని వాల్మీకినగర్-పనియవా స్టేషన్ల మధ్యగల వంతెనపై రైలు ఉన్నట్టుండి ఆగిపోయింది. వంతెనపై రైలు అలా ఆగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అయితే రైలులోని ఏదో వాల్వ్ నుంచి ఎయిర్ ప్రజర్ లీక్ అవడాన్ని లోకో పైలట్లు గమనించారు. అందుకే రైలు అలా ఆగిపోయిందని గుర్తించారు.బయటి నుంచి సాంకేతిక సాయం అందించడానికి వీలులేని చోట రైలు ఆగింది. దీంతో రైలును నడుపుతున్న ఇద్దరు లోకో పైలట్లూ ఇంజిన్లోని లీకేజీని సరిచేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. వారు రైలు కిందుగా పాకుకుంటూ లీకేజీ అవుతున్న చోటుకువెళ్లి మరమ్మతులు చేశారు.ఈ ఘటన గురించి రైల్వే అధికారులు మాట్లాడుతూ నార్కతియాగంజ్ - గోరఖ్పూర్ ప్యాసింజర్ రైలు వాల్మీకినగర్- పనియావాన్ మధ్య గల వంతెనపైకి చేరుకోగానే ఇంజిన్ (లోకో)కు చెందిన అన్లోడర్ వాల్వ్ నుండి అకస్మాత్తుగా ఎయిర్ ప్రజర్ రావడం మొదలైంది. ఫలితంగా ఎంఆర్ ఒత్తిడి తగ్గింది. దీంతోట్రాక్షన్ ఆగిపోయి, రైలు వంతెనపై నిలిచిపోయింది. రైలు బ్రిడ్జి మధ్యలో ఆగడంతో దాన్ని సరిచేసే మార్గం కనిపించలేదు. అయితే రైలు నడుపుతున్న పైలట్లు ఎంతో తెగువ చూపి, దానికి మరమ్మతులు చేసి, రైలు ముందుకు కదిలేలా చేశారు.ఈ సందర్భంగా సమస్తీపూర్ డీఆర్ఎం మాట్లాడుతూ లోకో పైలట్లు అజయ్ కుమార్ యాదవ్, జీత్ కుమార్ ఎంతో తెగువచూపి వంతెనపై ఆగిపోయిన రైలు ముందుకు కదిలేలా చేశారని, వీరికి రైల్వేశాఖ రూ.10 వేల నగదు అందించడంతోపాటు ప్రశంసా పత్రం ఇవ్వనున్నదని తెలిపారు. -
మెట్టుగూడ వద్ద రైలులో మంటలు..
-
రైల్వే సిగ్నల్స్ ట్యాంపర్..రెండు రైళ్లలో దోపిడీ
బిట్రగుంట: విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని కావలి– శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు రెండు రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే సిగ్నల్స్ను ట్యాంపర్ చేయడం ద్వారా రెడ్ సిగ్నల్ వేసి రైళ్లను నిలిపి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే జీఆర్పీ అధికారుల సమాచారం మేరకు.. కావలి–శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్య నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో తెల్లవారుజామున 1.50 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి రెడ్ సిగ్నల్ పడేలా చేశారు. ఆ సమయంలో నరసాపురం నుంచి ధర్మవరం వెళుతున్న ధర్మవరం ఎక్స్ప్రెస్ (నంబరు 17247)ను నిలిపివేసి ఎస్–11, ఎస్–13 బోగీల్లోకి ప్రవేశించారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు, బ్యాగులు చోరీ చేసి పారిపోయారు. ఈ ఘటన జరిగిన 20 నిమిషాల తర్వాత అదే మార్గంలో వచి్చన షిర్డిసాయినగర్ నుంచి తిరుపతికి వెళ్తున్న తిరుపతి స్పెషల్ (07638) ట్రైన్ను ఇదే తరహాలో నిలిపి ఎస్–3, ఎస్–5 కోచ్ల్లోకి ప్రవేశించారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోని 38 గ్రాముల బంగారు గొలుసులు, బ్యాగులు అపహరించారు. ఈ క్రమంలో దోపిడీని అడ్డుకునేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించగా రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. అనంతరం పక్కనే ఉన్న కొండబిట్రగుంట అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రైల్వే పోలీసులు దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
రైలుతో సెల్ఫీకి యత్నం.. చూస్తుండగానే ప్రాణం పోయింది
ఫొటోలు దిగడం సరదాకే అయినా.. ఒక్కోసారి ఆ సరదానే ఏమరపాటులో ప్రాణాలు పోయేందుకు కారణం అవుతోంది. స్మార్ట్ఫోన్లు వచ్చాక సెల్ఫీల మోజుతో ప్రాణాలు పొగొట్టుకున్న వాళ్లెందరినో చూస్తున్నాం. అలాంటి ఘటనలు చూశాక కూడా.. అత్యుత్సాహం ప్రదర్శించడం ఆపడం లేదు చాలామంది. తాజాగా.. మెక్సికోలో ఓ యువతి అంతా చూస్తుండగానే.. సెకన్ల వ్యవధిలో ప్రాణం పొగొట్టుకుంది. కెనడా నుంచి బయల్దేరి ఎంప్రెస్ అనే రైలు.. సుదీర్ఘ ప్రయాణం తర్వాత మెక్సికో సిటీకి చేరుకుంటుంది. ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహణ కోసం ఈ రైలును నడిపిస్తున్నారు. దీనికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. పైగా అందుకే అది వెళ్లే దారిలో చాలామంది ఫొటోలు, సెల్ఫీలు, వీడియోల కోసం ప్రయత్నిస్తుంటారు. సోమవారం రైలు వెళ్తున్న టైంలో హిడాల్గో వద్ద ఓ యువతి పట్టాలకు అతి దగ్గరగా వెళ్లి మోకాళ్ల మీద కూర్చుని సెల్ఫీ కోసం యత్నించింది. అంతే.. రైలు ఢీ కొట్టడంతో స్పాట్లోనే ఆమె మృతి చెందింది. ఘటనపై రైలు యాత్రను నిర్వహించిన కెనడియన్ ఫసిఫిక్ కానాస్ సిటీ కంపెనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. MEXICO - In Hidalgo, a famous train that comes from Canada and travels all the way to Mexico City, attracting locals, struck a woman who was trying to take a selfie as the train approached. She passed at the scene. Article in comments. pic.twitter.com/32XdsCehEB— The Many Faces of Death (@ManyFaces_Death) June 5, 2024 -
పంజాబ్లో రైలు ప్రమాదం.. ఇద్దరు లోకోపైలట్ల పరిస్థితి విషమం
పంజాబ్లోని ఫతేఘర్ సాహిబ్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సిర్హింద్ రైల్వే స్టేషన్కు కూతవేటు దూరంలోని మాధోపూర్ చౌకీ సమీపంలో ఈరోజు (ఆదివారం) తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. తొలుత రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఒక గూడ్స్ రైలుకు చెందిన ఇంజన్ బోల్తా పడి, ప్యాసింజర్ రైలును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు లోకో పైలట్లకు తీవ్ర గాయాలయ్యాయి.బాధితులను యూపీలోని సహరాన్పూర్కు చెందిన వికాస్ కుమార్ (37), హిమాన్షు కుమార్ (31)గా గుర్తించారు. వారిని 108 అంబులెన్స్లో ఫతేఘర్ సాహిబ్లోని ఆసుపత్రికి తరలించారు. వికాస్ కుమార్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని రాజింద్ర ఆసుపత్రికి తరలించారు. వికాస్ కుమార్ తలకు బలమైన గాయమైందని డాక్టర్ ఈవెన్ప్రీత్ కౌర్ తెలిపారు. హిమాన్షు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. #WATCH | Punjab: Two goods trains collided near Madhopur in Sirhind earlier this morning, injuring two loco pilots who have been admitted to Sri Fatehgarh Sahib Civil Hospital. pic.twitter.com/0bLi33hLtS— ANI (@ANI) June 2, 2024 ఈ ప్రమాదంలో పెద్దగా ప్రాణ నష్టం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గూడ్స్ రైళ్ల కోసం నిర్మించిన న్యూ సిర్హింద్ స్టేషన్ సమీపంలోని డీఎప్సీసీ ట్రాక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ మార్గంలో అప్పటికే బొగ్గు లోడుతో కూడిన రెండు గూడ్స్ రైళ్లను నిలిపి ఉంచారు. అయితే ఒక గూడ్స్ రైలుకు చెందిన ఇంజిన్ విడిపోయి మరో గూడ్సును ఢీకొంది. తరువాత అది అంబాలా నుంచి జమ్ముతావికి వెళ్తున్న సమ్మర్ స్పెషల్ ప్యాసింజర్ రైలును ఢీకొంది.దీంతో ఆ రైలులోని ప్రయాణికులు ఆందోళనతో కేకలు వేశారు. వెంటనే రైలు నిలిచిపోవడంతో ఎవరికీ ఎటువంటి అపాయం కలగలేదు. ఈ ఘటన నేపధ్యంలో అంబాలా నుంచి లూథియానా వైపు వెళ్లే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అంబాలా డివిజన్ డీఆర్ఎంతోపాటు రైల్వే, జీఆర్పీ, ఆర్పీఎఫ్ సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. -
జపాన్ బుల్లెట్ రైలు తలరాతని మార్చిన కింగ్ఫిషర్!
శాస్త్రవేత్తలు, మహామహా మేధావులు ఎన్నో కొంగొత్త ఆవిష్కరణలు చేయడం గురించి విన్నాం. అవన్నీ పూర్తి స్థాయిలో ఫలవంతమయ్యేందుకు దేవుడు వైపు(ప్రకృతి వైపు) చూడక తప్పేది కాదు. ఆయన చేసిన సృష్టి అద్భుతమే ఓ గొప్ప మేథస్సు. దాని సాయంతోనే ఆవిష్కరణలు ఫలమంతమయ్యేవి. అలాంటి ఘటనే జపాన్ బుల్లెట్ రైలు విషయంలో చోటు చేసుకుంది. అదేంటంటే..జపాన్ శాస్త్రవేత్తలు సాంకేతికతో కూడిన అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైళ్లను రూపొందించారు. అవి ప్రజల దూరాలను దగ్గర చేసి సమయాన్ని ఆదా చేసేలా అత్యంత నాణ్యతతో రూపొందించారు. అయితే జపాన్లో రైలు మార్గం చాలా వరకు టన్నెళ్లతో కూడినది. దీంతో గంటక సుమారు 240 నుంచి 320 కిలోమీటర్లు దూరం ప్రయాణించే ఈ బల్లెట్ రైళ్లు ఈ టన్నెల్ గుండా వెళ్లగానే భారీ శబ్దాలు వచ్చేవి. ఎంతలా అంటే ఇవి దాదాపు 400 మీటర్లు దూరంలో ఉన్న నివాసితులకు వినిపించేంత పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేవి. దీంతో ఈ రైళ్లపై ఫిర్యాదులు రావడం మొదలయ్యింది. నిజంగానే ఆ శబ్దాలు భరిచలేనంత పెద్దగా వచ్చేవి. దీంతో శాస్త్రవేత్తలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటని వెతకడం ప్రారంభించారు. పలు సమావేశాల్లో చర్చల్లో దీనికి పరిష్కారం ప్రకృతిని పరిశీలించే కనుగొనగలమని ఒక శాస్త్రవేత్త సూచించడంతో..ఈ బుల్లెట్ ట్రెయిన్ని ఆవిష్కరించిన ఇజీ నకాట్సు ఆ దిశగా ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇక్కడ బుల్లెట్ రైలు అత్యంత వేగంతో టన్నెల్ గుండా వెళ్తుండటంతో దాని ముందున్న అట్మాస్పియరిక్ ప్రెజరే ఈ బారీ శబ్దానికి కారణమని గుర్తించాడు. ఇలా ఆకాశం నుంచి వేగవంతంగా పయనించి భూమ్మీదకు వచ్చే జీవి ఉందా అనే దిశగా ఆలోచించడం ప్రారంభించాడు. అప్పుడే కింగ్ ఫిషర్ బర్డ్ జ్ఞప్తికి వచ్చింది. అది ఆకాశ నంచి అత్యంత వేగంగా వచ్చి నీటిలోకి శబ్దం లేకుండా తల ముంచి చేపలను లటుక్కున పట్టుకునే తీరు నకాట్సని సరికొత్త ఆలోచనను రేకెత్తించింది. దాని ముక్కు అత్యంత సూదిగా పొడుగుగా ఉండటంతోనే కదా నీటిపై శబ్దం చేయకుండా లోపలకు ముంచి చేపను పట్టుకోగలుగుతుంది అని గుర్తించాడు. దీన్నే బుల్లెట్ రైలుకి అప్లైచేసి దాని రూపురేఖలు మార్పు చేస్తాడు. అనుహ్యాంగా అది టన్నెల్ గుండా వెళ్లినప్పుడూ ఎలాంటి శబ్ద కాలుష్యాన్ని సృష్టించకుండా నిశబ్దంగా వెళ్తుంది. ఈ కొత్త డిజైన్ శబ్దాన్ని తగ్గించడమే కాకుండా, రైళ్లను 15% వేగంగా, 15% శక్తిని ఆదాచేసేలా చేసింది. దేవుడి అద్భత సృష్టిని కాపీ కొట్టడం ద్వారా ఇది సాధ్యం అయ్యిందని ఆయన మేథస్సు ముందు మానవ మేథస్సు చిన్నదేనని నకాట్సు అన్నారు. Japan's famous bullet train used to make a loud boom when it travelled through tunnels. But, thanks to a spot of bird-watching, an engineer was able to fix the problem after he was inspired by a kingfisher.#biomimicry #designthinking #uxRead more at: https://t.co/MzROXEt3aV pic.twitter.com/2HZd9P8FIy— Black Bee (@BlackBeeCoIndia) June 27, 2021 (చదవండి: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగేస్తున్నారా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
పరుగులకు మరో ‘వందేభారత్’ సిద్ధం
పట్టాలపై పరుగులు తీసేందుకు మరో వందేభారత్ రైలు సిద్ధంకానుంది. పట్నా- ఢిల్లీ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ త్వరలో పట్టాలు ఎక్కనుంది. ఈ రైలు రాకతో పట్నా నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి పట్నాకు కేవలం తొమ్మది గంటల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతం పట్నా-న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్, సంపూర్ణ క్రాంతి ఎక్స్ప్రెస్, తేజస్ ఎక్స్ప్రెస్ వంటి హై స్పీడ్ రైళ్లు ఢిల్లీ నుండి పట్నా చేరుకోవడానికి 13 గంటలు పడుతోంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం రైల్వే బోర్డు త్వరలో పట్నా- ఢిల్లీ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించనుంది. అంటే త్వరలోనే పట్నా- న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్ షెడ్యూల్ విడుదల కానున్నది. భారతీయ రైల్వే తొలిసారి ఢిల్లీ-హౌరా లైన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడిపింది. అయితే అది గయ జంక్షన్ మీదుగా ఢిల్లీకి చేరుతుంది. అయితే ఇప్పుడు మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ను బీహార్ రాజధాని పట్నా నుండి నడపడానికి ప్లాన్ చేస్తున్నది.న్యూఢిల్లీ- పట్నా వందే భారత్ ఎక్స్ప్రెస్ వేగం గంటకు 130 కి.మీ. వందే భారత్ పట్నా నుండి అర్రా, బక్సర్ మీదుగా 9 గంటల ప్రయాణంతో ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ రైలులో ఒక కోచ్ ఎగ్జిక్యూటివ్ చైర్కార్ క్లాస్, ఏడు కోచ్లు ఎయిర్ కండిషన్డ్ చైర్కార్గా ఉండవచ్చు. ఎగ్జిక్యూటివ్ చైర్కార్లో 52 సీట్లు, ఎయిర్ కండిషన్డ్ చైర్కార్లో 478 సీట్లు ఉండనున్నాయి. కాగా పట్నా-ఢిల్లీ మార్గంలో వందేభారత్ను నడిపే విషయమై భారత రైల్వే నుండి ఇంకా అధికారిక సమాచారం రాలేదు. -
నిర్ణీత వేగాన్ని అధిగమించిన రెండు రైళ్లు.. లోకోపైలట్లు సస్పెండ్!
భారతీయ రైళ్లు దేశంలోని లక్షలాది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అయితే ఒక్కోసారి రైళ్లు నడిపే పైలట్ల పొరపాటు కారణంగా ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. తాజాగా అటువంటి ఉదంతం యూపీలో చోటు చేసుకుంది. నిర్ణీత వేగ పరిమితి కంటే అధిక వేగంతో రైళ్లను నడిపిన ఇద్దరు లోకో పైలట్లు (డ్రైవర్), రైలు సహాయకులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గతిమాన్ ఎక్స్ప్రెస్, మాల్వా ఎక్స్ప్రెస్ డ్రైవర్లు, వారి సహాయకులపై రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. ముందుజాగ్రత్త చర్యగా గంటకు 20 కిలోమీటర్ల వేగ పరిమితిని నిర్ణయించిన సెక్షన్లో 120 కిలోమీటర్ల వేగంతో రైలును నడుపుతున్నందుకు వారిని సస్పెండ్ చేశారు. రైలు బ్రిడ్జి పునరుద్ధరణ పనుల కారణంగా తాత్కాలిక వేగ పరిమితి అమలులో ఉన్న ఆగ్రా కాంట్కు సమీపంలోని జాజౌ- మణియన్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు సిబ్బంది వేగంగా రైలును పోనిచ్చిన ఉదంతం చోటుచేసుకుంది. ఆగ్రా డివిజనల్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్ఓ) ప్రశస్తి శ్రీవాస్తవ ఈ సంఘటనను ధృవీకరిస్తూ సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మొదటి సంఘటనలో రైలు ఆగ్రా కాంట్ నుంచి గ్వాలియర్కు బయలుదేరిన తర్వాత గతిమాన్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ వేగ పరిమితిని ఉల్లంఘించారు. మరో ఘటనలో కత్రా (జమ్మూ)- ఇండోర్ (మధ్యప్రదేశ్) మధ్య నడిచే మాల్వా ఎక్స్ప్రెస్ డ్రైవర్ కూడా నిబంధనలను ఉల్లంఘించారు. ఈ సెక్షన్లో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో రైలు నడపడానికి అనుమతి ఉంది. అయితే ఇటీవల నది వంతెన మరమ్మతు పనుల కారణంగా గంటకు 20 కిలోమీటర్ల పరిమితిని నిర్ణయించారు.ఈ విషయమై ఆపరేషన్స్ విభాగానికి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ వారు చెప్పిన సెక్షన్లో లోకో పైలట్లు రైలు వేగాన్ని తగ్గించడం మరచిపోయి ఉండవచ్చు. అయినా ఇది రైలు ప్రయాణికులకు ముప్పు వాటిల్లే చర్య. అందుకే రైల్వే శాఖ దీనిని సీరియస్గా తీసుకుందని తెలిపారు. సాధారణంగా ట్రాక్ పరిస్థితి, ట్రాక్ మరమ్మతు పనులు, పాత రైల్వే వంతెనలు, స్టేషన్ యార్డ్ పునర్నిర్మాణం తదితర సందర్భాల్లో రైల్వేశాఖ ఆ రూట్లో వైళ్లే రైళ్లకు వేగ పరిమితులను విధిస్తుంది. -
సెంట్రల్ రైల్వే కారిడార్లో నిలిచిపోయిన రైళ్లు.. కారణం..
ముంబయి సెంట్రల్ రైల్వే ప్రధాన కారిడార్లో సోమవారం ఉదయం సిగ్నలింగ్ సమస్యల వల్ల రైలు సేవలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. ఉదయం 9.16 గంటలకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల థానే రైల్వేస్టేషన్ పరిధిలో సబర్బన్ రైలు సేవలు నిలిచిపోయాయని సెంట్రల్ రైల్వే ప్రతినిధి పేర్కొన్నారు.థానే రైల్వేస్టేషన్ పరిధిలో సిగ్నల్ వైఫల్యం కారణంగా కళ్యాణ్(థానే), కుర్లా (ముంబయి) మధ్య సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. దాంతో ఇరుప్రాంతాలకు ప్రయాణిస్తున్నవారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఉదయం 10.15 గంటలకు సిగ్నలింగ్ వ్యవస్థను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.సెంట్రల్ రైల్వే ప్రధాన కారిడార్ సబర్బన్ పరిధి దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి కళ్యాణ్ (థానే జిల్లా), ఖోపోలి (రాయ్గఢ్) వరకు విస్తరించి ఉంది. ఈ కారిడార్లో రోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. తాజాగా సుమారు గంటపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం వల్ల ప్యాసింజర్లు ఇబ్బందులు పడ్డారు. -
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
చార్ధామ్ వెళ్లాలనుకుంటున్నవారికి శుభవార్త. 2025 నుండి చార్ధామ్ యాత్రకు రైలులో వెళ్లే అవకాశం కలగబోతోంది. ఈ రూట్లోని 327 కిలోమీటర్ల రైలు మార్గాన్ని రైల్వేశాఖ సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రిషికేష్-కర్ణప్రయాగ్ మధ్య 125 కి.మీ. రైల్వే లైన్ పనులు దాదాపు పూర్తయ్యాయి.రైల్వేశాఖ చేపట్టిన చార్ధామ్ ప్రాజెక్టు కింద గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను రైల్వేలతో అనుసంధానం చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైల్వే బోర్డు సీఈవో జయ వర్మ సిన్హా ఇటీవల ఈ పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టులో ఇంకా 327 కి.మీ రైల్వే ట్రాక్ను సిద్ధం చేయాల్సి ఉంది. మూడు దశలుగా విభజించిన ఈ ప్రాజెక్టును 2025 నాటికి పూర్తి చేస్తామని రైల్వే పేర్కొంది.ఈ ప్రాజెక్టులో 153 కి.మీ. రైలు మార్గం మొరాదాబాద్ డివిజన్లో ఉంది. దీనిలో 105 కి.మీ. రైల్వే లైన్ సొరంగం గుండా వెళుతుంది. ఈ రూట్లో మొత్తం 12 స్టేషన్లు నిర్మిస్తున్నారు. రూ.16 వేల 216 కోట్లతో 125 కిలోమీటర్ల రైలు మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు.హిమాలయాల్లోని చార్ధామ్ దేవాలయాలైన గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లకు రైలు కనెక్టివిటీని అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. సొరంగాల్లో రైల్వే లైన్లు వేయడం, ఇతర పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 2025 నాటికి ఈ మార్గంలో రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. -
పిల్లలతో రైలు ప్రయాణం మరింత భారం!
వేసవి సెలవుల్లో పిల్లలతో రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీపై మరింత భారం పడనుంది. భారతీయ రైల్వే ప్రయాణ టిక్కెట్లపై ఐచ్ఛిక బీమా నిబంధనలలో పలు మార్పులు చేసింది. ఇకపై రైలు ప్రయాణంలో పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకుంటే వారికి ఐచ్ఛిక బీమా ప్రయోజనం లభ్యకాదు.ఐఆర్సీటీసీ తెలిపిన వివరాల ప్రకారం ఇకపై పిల్లలకు పూర్తి టిక్కెట్ తీసుకుంటేనే బీమా సౌకర్యంలోని ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మరోవైపు ఐఆర్సీటీసీ ప్రత్యామ్నాయ బీమా ప్రీమియంను కూడా పెంచింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఒక్కో ప్రయాణికుడి ప్రీమియం 45 పైసలకు పెంచింది. గతంలో ఇది 35 పైసలు ఉండేది.ఐచ్ఛిక బీమా పథకం అందించే ప్రయోజనం ఈ-టికెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రైల్వే టికెట్ కౌంటర్ నుండి కొనుగోలు చేసే టిక్కెట్లపై ఈ బీమా పథకం వర్తించదు. ఆన్లైన్ లేదా ఈ-టికెట్ను కొనుగోలు చేసిన వారికే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు వారు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటున్నారా లేదా అనేది ఎంచుకోవాలి. ప్రయాణీకుడు బీమా సౌకర్యాన్ని పొందాలనుకుంటే, అతను ఆ ఎంపికపై క్లిక్ చేయాలి. అప్పుడు రైల్వే ప్రయాణీకుడి మొబైల్, ఈ-మెయిల్కు బీమా కంపెనీ నుండి సందేశం వస్తుంది.ఈ బీమా పథకం కింద రైల్వే ప్రయాణీకులు మరణిస్తే రూ.10 లక్షలు, పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు, గాయాలపాలైతే చికిత్స కోసం కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తారు. రైల్వే ప్యాసింజర్ ఐచ్ఛిక బీమా పథకాన్ని భారతీయ రైల్వే సెప్టెంబర్ 2016లో ప్రారంభించింది. -
దీన్నే పిచ్చి అంటారు..మారండి ప్లీజ్! వైరల్ వీడియో
లేని పోని ప్రయోగాలకు పోతూ ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా వేగంగా కదులుతున్న ట్రైన్లోంచి ఒక బాలిక దూకేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. విపరీత పోకడలతో సాహసాలు చేయొద్దని ఎంత చెప్పినా ప్రయోజనం ఉండటంలేదు అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఒక బాలిక చాలా వేగంగా కదులుతున్న రైలు ద్వారం దగ్గర నిలబడి ఉంటుంది.. మెల్లిగా మెట్లు దిగుతూ సడెన్గా పట్టాలపైకి దూకేసింది. అయితే ఆమెను నివారించాల్సిన వారు వీడియో తీయడం విమర్శలకు తావిచ్చింది. ఇది కావాలనే చేశారా? లేదా ఆమె ఆత్మహత్యకు యత్నించిందా? ఎక్కడ జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. అయితే ఆమె తీవ్ర గాయాలతో బతికే ఉందని మాత్రం కొంత మంది కమెంట్ చేశారు. Girl jumps from a running train expecting to get off like in Bollywood 🤦♂️🤦♂️🤦♂️ pic.twitter.com/5ktDKMus6o — Pagan 🚩 (@paganhindu) April 12, 2024 -
రైలులో నోట్ల కట్టలు.. రూ. 4 కోట్లకు పైగా సీజ్
చెన్నై, సాక్షి: చెన్నై తాంబరం రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. నెల్లూరు ఎక్స్ప్రెస్ రైలులో 4 కోట్లకు పైగా నగదును పోలీసులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ముగ్గురు వ్యక్తులు ఎనిమిది బ్యాగులతో ఎగ్మోర్లో రైలు ఎక్కారు. సమాచారం అందుకున్న పోలీసులు, తాంబరంలో విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్లు శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తాంబరం రైల్వే స్టేషన్కు చేరుకుని నిందితులను పట్టుకున్నారు. నిందితులను అగరానికి చెందిన ఎస్ సతీష్, అతని సోదరుడు ఎస్ నవీన్, తూత్తుకుడికి చెందిన ఎస్ పెరుమాల్గా గుర్తించారు. సెకండ్ క్లాస్ ఏసీ కోచ్ (ఏ1)లో వెతకగా వారి వద్ద ఉన్న బ్యాగుల్లో రూ. 500 నోట్ల కట్టలు దొరికాయి. దీంతో పోలీసులు ముగ్గురు అనుమానితులను పోలీస్ స్టేషన్లో అదుపులోకి తీసుకుని ఆదాయపు పన్ను శాఖను అప్రమత్తం చేశారు. ఐటీ బృందాలు నిందితులను ఆదివారం లేదా సోమవారం విచారించనున్నాయి. తిరునల్వేలి బీజేపీ అభ్యర్థి నైనార్ నాగేంద్రన్కు చెందిన కిల్పాక్, ట్రిప్లికన్, సాలిగ్రామం ప్రాంతాలలో కూడా పోలీసులు సోదాలు చేశారు. నిందితులు నగదును ఎగ్మోర్ రైల్వే స్టేషన్కు తీసుకెళ్లే ముందు బీజేపీ నేతకు సంబంధించిన ప్రదేశాల్లో ఉంచినట్లు తెలిసింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరునెల్వేలి లోక్సభ నియోజకవర్గంలో పంపిణీ చేసేందుకు ఈ డబ్బును తీసుకెళ్లారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. తమిళనాడులోని 39 లోక్సభ నియోజకవర్గాలకు మొదటి దశ అంటే ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. -
రంగు మారనున్న గరీబ్ రథ్.. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు!
అందరికీ ఏసీ కోచ్లలో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో రైల్వేశాఖ గరీబ్ రథ్ రైలును ప్రారంభించింది. ఇప్పుడు ఈ రైలులో పలు మార్పులు సంతరించుకుంటున్నాయి. బోగీల సంఖ్యను పెంచడంతోపాటు, రంగు కూడా మార్చనున్నారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ గరీబ్ రథ్లో చోటుచేసుకోబోయే మార్పులను మీడియాకు తెలియజేశారు. బీహార్కు అనుసంధానమైన అన్ని గరీబ్రథ్ ఎక్స్ప్రెస్లలో సీట్ల సంఖ్యను పెంచనున్నారు. ముజఫర్పూర్-ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య నడుస్తున్న రైలు నంబర్ 12211/12 గరీబ్రథ్ ఎక్స్ప్రెస్తో సహా బీహార్ మీదుగా వెళ్లే గరీబ్రథ్ గరీబ్రథ్ ఎక్స్ప్రెస్లను లింక్ హాఫ్మన్ బుష్గా మార్చనున్నారు. ఈ మార్పుల తరువాత గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ 16 కోచ్లకు బదులుగా 20 కోచ్లతో నడుస్తుంది. దీంతో ఒక్కో గరీబ్రథ్ ఎక్స్ప్రెస్లో 352 బెర్త్లు పెరగనున్నాయి. ఈ రైళ్లకు కొత్త త్రీ టైర్ ఎకానమీ కోచ్ను అనుసంధానం చేయనున్నారు. దీంతో గతంలో కంటే ఎక్కువ మంది ఒకేసారి ప్రయాణించే అవకాశం ఏర్పాడుతుంది. ఇప్పటివరకూ ఆకుపచ్చ రంగుతో విభిన్నంగా కనిపించిన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఇకపై ఎరుపు రంగులో కనిపించనుంది. -
‘ఆటోమేటిక్ డోర్కు అలవాటు పడలేదు’
‘వందే భారత్’ రైలులో ప్రయాణించాలని ఎవరికి ఉండదు చెప్పండి? ఆధునిక సౌకర్యాలతో తళతళలాడుతున్న ఈ రైలు ఎక్కాలని చాలామంది తహతహలాడిపోతుంటారు. అయితే ఈ రైలులోని కొన్ని సాంకేతిక విషయాలు తెలియక కొందరు చిక్కుల్లో పడుతున్నారు. సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా రైలు ప్రయాణానికి బయలుదేరినప్పుడు వారిని దిగబెట్టేందుకు తోడుగా ఎవరో ఒకరు వెళుతుంటారు. ఇదేవిధంగా ఒక భర్త తన భార్యను వందేభారత్ రైలు ఎక్కించేందుకు వెళ్లాడు. ఆమె తన సీటులో కూర్చున్నాక భర్త కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు. అయితే ఇంతలో వారుంటున్న కోచ్ డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. మరి అప్పుడేం జరిగింది? వివరాల్లోకి వెళితే ఒక మహిళ తన కుమార్తె దగ్గర ఉండేందుకు తొలిసారిగా వందే భారత్ రైలులో గుజరాత్లోని వడోదర నుంచి ముంబైకి బయలుదేరింది. ఆ మహిళకు తోడుగా స్టేషన్ వరకూ ఆమె భర్త వచ్చాడు. లగేజీని ఆమె కూర్చున్న సీటు దగ్గర ఉంచి, కాసేపు కూర్చున్నాడు. ఇంతలో రైలు తలుపులు మూసుకుపోయిన శబ్ధం వినిపించింది. ఆ వ్యక్తి రైలు దిగకముందే డోర్ మూసుకుపోయింది. దీంతో ఆ వ్యక్తి టీసీతో మాట్లాడి రైలును ఆపాలనుకున్నాడు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో రైలు వేగం అందుకుంది. దీంతో ఆ వ్యక్తి తనకు ఇష్టం లేకపోయినా తదుపరి స్టేషన్ వచ్చే వరకు ప్రయాణించవలసి వచ్చింది. అతని కుమార్తె తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ పోస్ట్ను ఇప్పటివరకూ కొన్ని లక్షలమంది వీక్షించారు. ఈ పోస్ట్ చూసిన ఒక యూజర్.. ‘అతను స్టేషన్లోని నో పార్కింగ్ జోన్లో పెట్టిన తన కారు గురించి ఆందోళన చెందుతున్నాడేమోనని’ రాయగా, మరొక యూజర్ ‘ఇది అతనికి అందమైన జ్ఞాపకంగా మిగులుతుందని’ రాశాడు. మరో యూజర్ ‘అతనింకా ఆటోమేటిక్ డోర్కు అలవాటుపడలేదని’ పేర్కొన్నాడు. My mother is travelling for the first time in Vande Bharat from Vadodara to Mumbai today to visit me. As it is going to be a longer stay, she had two big bags to travel with. (1/4) — Kosha (@imkosha) April 2, 2024 -
రైలులో మంటలు.. బయటకు దూకేసిన ప్రయాణికులు!
బీహార్లోని భోజ్పూర్ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ-హౌరా ప్రధాన రైల్వే మార్గంలోని పాట్నా-డీడీయూ రైల్వే సెక్షన్లో మంగళవారం అర్థరాత్రి దానాపూర్-లోకమాన్య తిలక్ టెర్మినస్ హోలీ స్పెషల్ రైలులో మంటలు చెలరేగాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం భోజ్పూర్ జిల్లా పరిధిలోని బిహియా- కరిసాత్ స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హోలీ ప్రత్యేక రైలులోని ఏసీ బోగీలో మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ప్రయాణికులు భయాందోళనకు గురై ప్రాణాలను కాపాడుకునేందుకు రైలు నుంచి బయటకు దూకేశారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత యూపీ రైల్వే లైన్లోని ఓహెచ్ఈలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు రైళ్లను ప్రత్యామ్నాయ మార్గంలో నడిపారు. నేటి (బుధవారం) ఉదయం ట్రాక్ను క్లియర్ చేసిన తర్వాత, నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్, పాట్నా ఎల్టిటి ఎక్స్ప్రెస్ వంటి కొన్ని రైళ్లను వాటి షెడ్యూల్ మార్గం గుండా రాకపోకలకు అనుమతించారు. ఈ హోలీ స్పెషన్ రైలులో అగ్నిప్రమాదానికి గురైన కోచ్ను తొలగించారు. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపడానికి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. -
మరో ‘వందే భారత్’ ట్రయల్ రన్ విజయవంతం
ఇది రామ భక్తులకు పండుగలాంటి వార్త. అయోధ్యలోని రాములోరిని చూసేందుకు యూపీ భక్తులు ఇకపై కాషాయ రంగులో మెరిసిపోయే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కాల్సి ఉంటుంది. ఈ వందే భారత్ రైలు యూపీ రాజధాని పట్నా నుండి అయోధ్య మీదుగా లక్నో వరకు నడుస్తుంది. ఈ రైలుకు సంబంధించిన తుది ట్రయల్ రన్ కూడా పూర్తయింది. ఈ ట్రయల్ రన్లో ఈ రైలు నిర్ణీత సమయానికి ముందుగానే లక్నోకు చేరుకుంది. ఈ రైలును మార్చి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. కాగా అధికారికంగా ఈ రైలు టైమ్ టేబుల్ను ఇంకా విడుదల చేయలేదు. పట్నా నుంచి అయోధ్య మీదుగా లక్నో వరకు నిర్వహించిన ఈ రైలు ట్రయల్ రన్లో నిర్ణీత సమయానికి 15 నిమిషాల ముందుగా వారణాసి, 12 నిమిషాల ముందుగా అయోధ్య , 20 నిమిషాల ముందుగా లక్నో చేరుకుంది. ట్రయల్ రన్లో ఈ రైలు ఉదయం 6:05 గంటలకు పట్నా నుంచి లక్నోకు బయలుదేరింది. ఈ సమయంలో రైలు వేగం 130 కి.మీ.గా ఉంది. -
‘ఆ ప్రయాణం చేస్తే శరీరం కరిగిపోతుంది.. కాళ్లూ చేతులు విడిపోతాయి’
ప్రపంచంలో నిత్యం కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉంటాయి. పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అయితే కొత్త పరిజ్ఞానాలు పుట్టుకొచ్చిన ప్రతీసారి కొత్త భయాలు మొదలవుతాయి. ప్రస్తుతం జనరేటివ్ ఏఐ ఆధారిత సాధనాలతో ఈ భయం ఎక్కువవుతోంది. ప్రముఖ టెక్నాలజీ నిపుణులు, వ్యాపావేత్తలు ఏఐ భవిష్యత్తు తరానికి ముప్పు తెస్తుందని కొందరు భావిస్తే, ఆ సాంకేతికతతో మరింత మేలు జరుగుతుందని ఇంకొందరు అంటున్నారు. వారి భావనలు ఎలాఉన్నా మర్పు సత్యం. కొత్త పరిజ్ఞానాలు వచ్చినప్పుడు ఇలాంటి వాదోపవాదాలు జరగటం, భయాలు తలెత్తటం మొదటి నుంచీ ఉన్నవే. అప నమ్మకం, సందేహం, ఆవిష్కరణల్లోని సంక్లిష్టత, టెక్నాలజీ మీద అవగాహన లేకపోవటం, అర్థం చేసుకోలేక పోవటం వంటివన్నీ వీటికి కారణమవుతుంటాయి. తమ జీవనోపాధికి భంగం కలుగుతుందనే అభిప్రాయమూ భయాన్ని సృష్టిస్తుంది. చరిత్రలో ఇలాంటి ఒక ఆవిష్కరణ గురించి తెలుసుకుందాం. విచిత్రమైన భయాలు ‘రైలులో ప్రయాణం చేస్తే తీవ్ర గాయాలవుతాయి. ప్రాణాలూ పోవచ్చు.’ ‘శరీరం కరిగిపోతుంది. కాళ్లూ చేతులు విడిపోయి, పక్కలకు ఎగిరి పడతాయి.’ ‘గర్భిణుల రైళ్లలో ప్రయాణం చేస్తే వారి కడుపులోంచి పిండాలు బయటకు వచ్చేస్తాయి.’ ఇప్పుడంటే ఇవి నవ్వు తెప్పిస్తుండొచ్చు గానీ ఒకప్పుడు ఇలాగే భయపడేవారు. రైల్ సిక్నెస్ ప్రపంచంలో మొట్టమొదటి ప్రజా రైలు ప్రయాణం ఇంగ్లండ్లో 1825లో ప్రారంభమైంది. రైలు వేగం, అది చేసే చప్పుడు, దాన్నుంచి వెలువడే పొగ చాలామందిని భయభ్రాంతులకు గురిచేశాయి. అప్పటికి రైలు వేగం గంటకు 30 కిలో మీటర్లు. అంత వేగంతో ప్రయాణిస్తే ప్రమాదమని, బోగీ కదలికలకు ఎముకలు విరిగిపోతాయని వణికిపోయేవారు. ఈ రైలు భయానికి జర్మనీలో ‘ఈసెన్బాంక్రాన్కీట్’ అనీ పేరు పెట్టారు. అంటే ‘రైల్ సిక్నెస్’ అని అర్థం. ఇదీ చదవండి: పెళ్లికొడుకు వాచ్పై కన్నేసిన జూకర్బర్గ్ దంపతులు.. ధర ఎంతో తెలుసా.. బుల్లెట్ రైలు ఇంగ్లండ్ మొత్తానికి రైలు మార్గం విస్తరించిన తర్వాత కూడా భయాలు పోలేదు. విమర్శలూ తగ్గలేదు. రైలు ప్రయాణాన్ని వెటకారం చేస్తూ సెటైర్లు కూడా వెలువడ్డాయి. గుర్రాలు, గుర్రపు బగ్గీల వంటి ఆనాటి ప్రయాణ సాధనాలను, పరిస్థితులను బట్టి చూస్తే కొత్త రైలు భయం అర్థం చేసుకోదగిందే. టెక్నాలజీ పురోగమిస్తున్నకొద్దీ, వాడకం పెరుగుతున్నకొద్దీ మామూలు విషయంగా మారుతుంది. అక్కడి నుంచి ఇప్పుడు గంటకు 460 కి.మీ. వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లకు చేరుకున్నాం. -
హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం
-
రైళ్లలో ఫుడ్.. ఐఆర్సీటీసీ లేటెస్ట్ అప్డేట్
IRCTC Update : రైళ్లలో ఫుడ్ సప్లయికి సంబంధించి భారతీయ రైల్వే నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ప్రీ-ఆర్డర్ చేసిన భోజనాన్ని సరఫరా చేయడానికి, డెలివరీ చేయడానికి ప్రసిద్ధ డెలివరీ ప్లాట్ఫారమ్ స్విగ్గీ ఫుడ్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రకటించింది. వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం.. ముందుగా ఆర్డర్ చేసిన భోజనాన్ని ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా డెలివరీ చేస్తారు. తొలిదశలో భాగంగా బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలో ఈ సదుపాయం త్వరలో ప్రారంభించనున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. “సెబీ (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్) రెగ్యులేషన్స్, 2015 రెగ్యులేషన్ 30 ప్రకారం.. ఐఆర్సీటీసీ ఈ-క్యాటరింగ్ పోర్టల్ ద్వారా ముందస్తు ఆర్డర్ చేసిన భోజనం సరఫరా & డెలివరీ కోసం PoC (ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్) బండ్ల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (స్విగ్గీ ఫుడ్స్)తో ఐఆర్సీటీసీ టైఅప్ అయిందని తెలియజేస్తున్నాం. మొదటి దశలో నాలుగు రైల్వే స్టేషన్లలో అంటే బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, విశాఖపట్నంలో బండ్ల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ- క్యాటరింగ్ సర్వీస్ త్వరలో అందుబాటులోకి రావచ్చు” అని బీఎస్ఈ ఫైలింగ్లో ఐఆర్టీసీ పేర్కొంది. -
Kruger National Park: ట్రైన్ రిసార్ట్
చుట్టూ పచ్చని పచ్చికబయళ్లు, వన్యప్రాణులు. నాలుగు అడుగులేస్తే మన కోసమే ప్రత్యేకంగా ఈతకొలను. ఇంకాస్త పక్కకెళితే ప్రకృతి రమణీయతను చూసేందుకు విడిగా వ్యూ డెక్కులు, మనం ఉన్నచోటు కిందే ఉరకలెత్తుతూ సాగే నది, సకల సౌకర్యాలతో సిద్ధంగా ఉన్న విలాసవంతమైన గది. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర జీవనానికి చిరునామాగా నిలిచే ఇలాంటి చోట కొంతకాలమైనా గడపాలని ఎంతో మంది ఆశ పడతారు. అలాంటి ప్రకృతి ప్రేమికుల కోసం ఒక రైలును సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది ఒక పాత వంతెనపై హోటల్గా మార్చారు. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా పేరొందిన దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ వనంలో ఈ ‘ది ట్రైన్ ఆన్ ది బ్రిడ్జ్’ హోటల్ ఉంది. ఈ కదలని రైలు అరుదైన అనుభూతిని పంచుతుంది. ఇందులో పర్యాటకుల కోసం అన్ని సౌకర్యాలతో 31 సూట్లు సిద్ధంచేశారు. అన్ని రకాల వంటకాలతోపాటు స్థానిక రుచులనూ ఆస్వాదించవచ్చు. గైడ్ల సాయంతో అడవిలోకెళ్లి స్వేచ్ఛగా సింహం, చిరుతపులి, ఏనుగు, నీటిగుర్రం, అడవి బర్రెలను దగ్గర్నుంచి చూసిరావచ్చు. ఒక ట్విన్(జంట)రూమ్లో పర్యాటకులు ఒక రాత్రి గడపాలంటే ఒక మనిషికి దాదాపు రూ.44,000 రుసుము వసూలుచేస్తారు. 100 ఏళ్లకు పైబడిన ఈ వంతెనపై గతంలో స్టీమ్ రైళ్లు నడిచేవి. వారసత్వంగా నిలిచిన ఈ వన వంతెనను విభిన్నంగా వినియోగిద్దామని ఈ హోటల్కు రూపకల్పన చేశామని మోట్సామయీ టూరిజం గ్రూప్ సీఈవో జెరీ మబేనా చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పట్టాలెక్కనున్న ‘స్లీపర్ వందే భారత్’.. రూట్ ఇదే!
వందే భారత్ ఎక్స్ప్రెస్ అనంతరం ‘స్లీపర్ వందే భారత్’ త్వరలో పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. దీని కోసం పలువురు ప్రయాణికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వందే భారత్ మాదిరిగానే ‘స్లీపర్ వందే భారత్’ కూడా ప్రత్యేకమైన రైలుగా గుర్తింపు పొందనుంది. దేశంలోనే మొట్టమొదటి ‘స్లీపర్ వందే భారత్’ ఏ మార్గంలో నడుస్తుందో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం 41 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో 39 రైళ్లు ట్రాక్పై నడుస్తుండగా, రెండు రైళ్లు రిజర్వ్లో ఉన్నాయి. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లన్నీ చైర్ కార్ సౌకర్యం కలిగినవి. అంటే వీటిలో కూర్చుని ప్రయాణించవచ్చు. రాబోయే రోజుల్లో ‘వందే భారత్’ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ‘స్లీపర్ వందే భారత్’ రైళ్లలో మరింత సౌకర్యవంతమైన ఏర్పాట్లు ఉన్నాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లు చాలా దూరం వరకూ ప్రయాణిస్తాయి. ఇవి రాత్రిపూట నడుస్తాయి. ఇందులో ప్రయాణికులు నిద్రిస్తూనే ప్రయాణం సాగించవచ్చు. రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని ప్రధాన మార్గాలైన ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై మధ్య మొదటి వందే భారత్ స్లీపర్ రైలును నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రూట్లలో సాధారణంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఏకకాలంలో ఈ రెండు మార్గాల్లో నడపపనున్నారని తెలుస్తోంది. ఈ రెండు మార్గాలే కాకుండా, ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-చెన్నై, ఢిల్లీ-గౌహతి, ఢిల్లీ-భువనేశ్వర్, ఢిల్లీ-పాట్నా రూట్లలో 10 ‘స్లీపర్ వందే భారత్’ రైళ్లు నడవనున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మొదటి స్లీపర్ వందే భారత్ రైలును ఐసీఎఫ్ చెన్నై తయారు చేయనుంది. దీని స్లీపర్ కోచ్ రాజధాని, ఇతర ప్రీమియం రైళ్లకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో ఒక్కో కోచ్లో నాలుగు టాయిలెట్లకు బదులుగా మూడు టాయిలెట్లు ఉంటాయి. దీనితో పాటు మినీ ప్యాంట్రీ కూడా ఉంటుంది. స్లీపర్ వందే భారత్ రైలులో మొత్తం 823 బెర్త్లు ఉంటాయి. ఇందులో ప్రయాణికులకు 823 బెర్త్లు, రైల్వే సిబ్బందికి 34 బెర్త్లు ఉంటాయి. -
secunderabad: అయోధ్యకు బయలుదేరిన మొదటి ట్రైన్
సాక్షి, హైదరాబాద్: అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం అనంతరం దేశవ్యాప్తంగా ప్రజలు బాలరాముడి దర్శించుకోవటానికి భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకి ప్రయాణికులతో మొదటి ట్రైన్ బయలుదేరింది. 1400 మంది ప్రయాణికులతో ఈ ట్రైన్ మొదలైంది. Flagged off special train to #Ayodhya from Secunderabad Railway station along with MLA Shri @kvr4kamareddy ji, MLA Shri @Dhanpal_Suranna ji, Shri @ShyamSunder_BJP ji and Senior leaders. #JaiShreeRam pic.twitter.com/32M624iMlv — Kontham Deepika BJP (@KonthamDeepika) February 5, 2024 అయోద్య రైలు కోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయోధ్య దర్శనం అనంతరం తిరిగి 9వ తేదీన మళ్ళీ సికింద్రబాద్కు ప్రత్యేక రైలు రానున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. -
అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి?
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. దీని తరువాత అంటే జనవరి 23 నుంచి అయోధ్యను సందర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. మరి అయోధ్యకు ఎలా వెళ్లాలి? అక్కడ రోజూ జరిగే పూజలేమిటి? రామాలయం సందర్శనలో ఎటువంటి విధివిధానాలు ఆచరించాలి? ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. రైలు మార్గం రైలు మార్గం ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునేవారు దేశంలోని ఏ ప్రాంతం నుంచి అయినా అయోధ్యకు చేరుకోవచ్చు. న్యూ ఢిల్లీ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకుంటే దాదాపు 10 గంటలపైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునేవారు సికింద్రాబాద్ నుంచి రైలులో గోరఖ్ పూర్ వెళ్లాలి. అక్కడి నుంచి అయోధ్యకు రైలు లేదా బస్సు ద్వారా అయోధ్యకు చేరుకోవచ్చు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల 50 నిమిషాలకు సికింద్రా బాద్ నుంచి గోరఖ్ పూర్కు వెళ్లే రైలు అందుబాటులో ఉంది. ఈ రైలులో 30 గంటల పాటు ప్రయాణం చేయాలి. ఇదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీదర్ అయోధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రతి సోమ, ఆదివారాలలో అందుబాటులో ఉంది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునే వారు ప్రతి శుక్ర, ఆది, సోమ వారాల్లో రైలు ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. రోడ్డు మార్గం అయోధ్యకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో 40 గంటల ప్రయాణం అనంతరం ఢిల్లీకి చేరుకుంటారు. ఏసీ బస్సులో ఒకరికి టికెట్ ధర రూ. 6 వేలు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ప్రైవేటు వాహనాల్లో వెళ్లాలనుకునే వారు నాగపూర్, జబల్ పూర్, ప్రయాగ్రాజ్ మీదుగా అయోధ్యకు చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే మొత్తం 1305 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయాలి. కాగా అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం సికింద్రా బాద్ నుంచి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. విమానయాన సంస్థలు కూడా స్పెషల్ ఫ్లైట్స్ ను నడిపేందుకు సిద్ధమయ్యాయి. విమానయానం విమానాల ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునే రామ భక్తులు హైదరాబాద్ శంశాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అయోధ్యకు నేరుగా వెళ్లేందుకు విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. దీంతో శంశాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ, లేదా గోరఖ్ పూర్, లక్నో విమానాశ్రయాలకు చేరుకుని, అక్కడి నుంచి 140 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యకు బస్సు లేదా రైలులో ప్రయాణించే చేరుకోవచ్చు. దర్శనం ఎలా? అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్టేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం (https://online.srjbtkshetra.org) అధికారిక వెబ్సైట్లో మొబైల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. ఓటీపీ నమోదు చేశాక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో ‘దర్శన్’ ఎంపికపై క్లిక్ చేశాక, ఓపెన్ అయిన పేజీలో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతోపాటు వచ్చేవారి సంఖ్య, దేశం, రాష్ట్రం, మొబైల్ నంబర్తో పాటు మీ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియతో దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. ఆఫ్లైన్లో.. ఆఫ్లైన్లో టిక్కెట్లు పొందాలనుకున్నప్పుడు ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్లి, ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి, టికెట్ పొందవచ్చు. పదేళ్లకన్నా తక్కువ వయసుగల పిల్లలకు దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. దర్శనం కోసం టిక్కెట్తో పాటు ఐడీప్రూప్ ప్రూఫ్ను వెంట తీసుకువెళ్లాలి. సంప్రదాయ దుస్తులలో.. దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టిక్కెట్ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా స్త్రీలు, పురుషులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే దర్శనానికి రావాలి. పురుషులు ధోతీ-కుర్తా లేదా కుర్తా, పైజామా.. మహిళలు చీర, దుపట్టాతో కూడిన పంజాబీ దుస్తులు లేదా దుపట్టాతో చుడీదార్ సూట్ ధరించి శ్రీరాముని దర్శనానికి రావచ్చు. అయోధ్యలో నిత్యపూజలు అయోధ్య రామాలయంలో బాలరామునికి రోజుకు ఐదుసార్లు హారతులు ఇవ్వనున్నారు. అయితే భక్తులు మూడు హారతులను మాత్రమే దర్శించుకోగలుగుతారు. ఈ హారతులు ఉదయం 6:30 గంటలకు, మధ్యాహ్నం 12:00 గంటలకు, సాయంత్రం 7:30 గంటలకు నిర్వహిస్తారు. ఇక శ్రీరాముని దర్శనం విషయానికి వస్తే ఉదయం 6 నుండి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. ఇది కూడా చదవండి: ప్రాణ ప్రతిష్ఠను ‘ప్రత్యక్షం’గా చూడటమెలా? -
టీసీఎస్ కీలక నిర్ణయం.. 5 లక్షల మందికి ట్రైనింగ్!
2023 ప్రారంభం నుంచి టెక్ ఉద్యోగులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఏడాది (2024) ప్రారంభంలో కూడా కొన్ని దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించగా.. టీసీఎస్ మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మీద ఏకంగా ఐదు లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. భారతీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. పరిశ్రమలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రారంభ దశలో ఉన్న Gen AIలో ఐదు లక్షలమందికి ట్రైనింగ్ ఇవ్వడానికి సంకల్పించింది. రాబోయే రోజుల్లో కృత్రిమ మేధను ఉపయోగించుకోవాల్సి వస్తుందని, అప్పటికి అందులో శిక్షణ పొందిన ఉద్యోగుల అవసరం కంపెనీకి ఉంటుందని TCS ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వర్క్ఫోర్స్ ట్రైనింగ్ అండ్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్లు అనే రెండు కీలక రంగాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా AI భవిష్యత్తు కోసం TCS చురుకుగా సిద్ధమవుతోందని కంపెనీ AI.Cloud యూనిట్ హెడ్ శివ గణేశన్ తెలిపారు. ఏఐ మీద శిక్షణ ఇవ్వడానికి కంపెనీ అత్యధునిక సాంకేతికతలను ఉపయోగించనున్నట్లు సమాచారం. అయితే ట్రైనింగ్ ఎప్పటి నుంచి ప్రారంభించనుంది, ఎప్పటికి పూర్తి చేయనుందనే విషయాలను వెల్లడించలేదు. కానీ గతంలో టీసీఎస్ కంపెనీ 150,000 మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి ఏడు నెలల సమయం తీసుకుంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజులో ఐదు లక్షల మందికి ఎన్ని రోజుల్లో శిక్షణ ఇస్తుందనేది అంచనా వేసుకోవచ్చు. ఇదీ చదవండి: వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం, వెండి - నేటి కొత్త ధరలు ఇవే ఏఐ టెక్నాలజీ ద్వారా ఉద్యోగాలు పోతాయని చాలా కంపెనీల సీఈఓలు గతంలో వెల్లడించారు, కానీ ఈ టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకోవడానికి మానవ ప్రమేయం అవసరమని, తద్వారా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని కొందరు భావించారు. ప్రస్తుతం ఆ భావనే నిజమవుతోంది. పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజుల్లో మరిన్ని టెక్ కంపెనీలు ఈ ఏఐపైన ఉద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. 22 రైళ్లు ఆలస్యం
ఢిల్లీ: దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రోడ్లపై విజిబిలిటీ(దృశ్యమానత) సున్నాకి పడిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఢిల్లీకి వెళ్లే దాదాపు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ)లో అనేక విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐజీఐ విమానాశ్రయంలో విజిబిలిటీ 350 మీటర్లుగా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొద్ది గంటల్లో ఇది 200 మీటర్ల మేర తగ్గే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్, చండీగఢ్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. #WATCH | Visibility affected in parts of the national capital as a blanket of dense fog covers Delhi. (Visuals from Rajaji Marg shot at 7.30 am) pic.twitter.com/Nfm5eAHTVi — ANI (@ANI) January 14, 2024 ఉత్తరప్రదేశ్లోని లక్నోలో దట్టమైన పొగమంచు ఏర్పడింది. తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ వేగంతో ప్రయాణించాలని వాహనదారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్పా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. #WATCH | Visibility affected due to dense fog in Uttar Pradesh's Lucknow as cold wave conditions prevail in the region (Visuals shot at 7.00am) pic.twitter.com/BH6DMRWw3W — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 14, 2024 దేశ రాజధానిలో 3.6 డిగ్రీల సెల్సియస్కు తగ్గడంతో ఈ సీజన్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే 3-4 రోజుల్లో వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది. 22 trains to Delhi from various parts of the country are running late due to dense fog conditions as on 14th January. pic.twitter.com/vmY6LBOSvr — ANI (@ANI) January 14, 2024 ఇదీ చదవండి: ‘ఇండియా’కు ఖర్గే సారథ్యం! -
ట్రైన్ టికెట్ ధరలపై రాయితీ.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
అహ్మదాబాద్ : దేశంలో రైల్వే ఛార్జీలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలో జరుగుతున్న బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులపై అశ్విని వైష్ణవ్ రివ్వ్యూ నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పలువురు జర్నలిస్ట్లు రైల్వే ఛార్జీలపై పలు ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే ఇస్తుంది కదా సీనియర్ సిటిజన్ల కోసం ప్రీ-కోవిడ్కు ముందు ఉన్న ఛార్జీలను అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నారన్న మీడియా మిత్రుల ప్రశ్నలకు ఆయన స్పందించారు.. ‘‘ ఇండియన్ రైల్వే ఇప్పటికే ప్రతి ప్రయాణికుడి ట్రైన్ టికెట్పై 55 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ప్రయాణికుల గమ్యస్థానానికి వెళ్లేందుకు అయ్యే ట్రైన్ టికెట్ ధర రూ. 100 అయితే, రైల్వే కేవలం రూ. 45 మాత్రమే వసూలు చేస్తోంది. ఇది రూ. 55 రాయితీ ఇస్తోంది.’’ అని అన్నారు. రాయితీలపై అదే మాట కోవిడ్-19 లాక్ డౌన్ ముందు అంటే మార్చి 2020లో రైల్వే శాఖ టికెట్ ఛార్జీలపై సీనియర్ సిటిజన్లకు, అక్రేడియేటెడ్ జర్నలిస్ట్లకు 50 శాతం రాయితీ కల్పించింది. లాక్డౌన్ సమయంలో రైల్వే కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. అయితే జూన్ 2022లో పూర్తి స్థాయి పునఃప్రారంభమైనప్పుడు, రైల్వే మంత్రిత్వ శాఖ ఈ రాయితీలను పునరుద్ధరించలేదు. అప్పటి నుండి ఈ సమస్య పార్లమెంటులో పలు మార్లు ప్రస్తావనకు వచ్చింది. ఆ సమయాల్లో వైష్ణవ్ పై విధంగా స్పందించారు. ఆర్టీఐలో ఏముందంటే? అంతకుముందు, మధ్యప్రదేశ్కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుపై స్పందిస్తూ భారతీయ రైల్వే 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు 15 కోట్ల మంది సీనియర్ సిటిజన్ల నుండి సుమారు రూ. 2,242 కోట్లు ఆర్జించిందని తెలిపింది. -
జీవితంపై విరక్తితో వ్యక్తి బలవన్మరణం
రామన్నపేట: జీవితంపై విరక్తితో రైలు కింద పడి వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం రామన్నపేట శివారులో వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేటకు చెందిన బొడ్డు శ్రీరాములు(52) మేసీ్త్ర పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆదివారం సాయంత్రం మద్యం తాగి వచ్చిన శ్రీరాములును కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో శ్రీరాములు ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి వరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం రామన్నపేట–వలిగొండ రైల్వేస్టేషన్ల మధ్య కీ మ్యాన్ ట్రాక్ చెక్ చేస్తుండగా 48/8–9పోల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండడం గమనించి రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. సమాచారం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకుని శ్రీరాములు మృతదేహంగా గుర్తించారు. జీవితంపై విరక్తితో గుర్తుతెలియని రైలుకింద పడి శ్రీరాములు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. రైల్వే అధి కారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ కె. సాలకమ్మ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com. -
తృటిలో తప్పిన రైలు ప్రమాదం
రాజస్థాన్లోని కోటా రైల్వే స్టేషన్లో శుక్రవారం రాత్రి జోధ్పూర్-భోపాల్ పాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కోటా రైల్వే స్టేషన్లోని నాల్గవ నంబర్ ప్లాట్ఫాంపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఆకస్మిక ఘటనతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. దీంతో పలువురు ప్రయాణికులు కంపార్ట్మెంట్లో నుంచి దూకేశారు. వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఈ రైలు శుక్రవారం ఉదయం 10 గంటలకు జోధ్పూర్లో బయలుదేరి భోపాల్కు వెళ్తోంది. కోటా వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది. రైలులోని రెండు కోచ్లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఘటన అనంతరం రైల్వే బృందం ప్రయాణికులను రైలు నుంచి బయటకు తీసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఈ ఘటన అనంతరం ట్రాక్పై రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పలు రైళ్లను ఇతర రైల్వే ట్రాక్లపైకి మళ్లించారు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం రైల్వే ట్రాక్ పునరుద్ధరణ జరిగింది. అయితే ఈ లైనులో రైళ్లు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. #WATCH | Rajasthan: Two coaches of the Jodhpur-Bhopal passenger train derailed near Kota Junction. No casualties have been reported. Rescue operations underway. Details awaited. (5.1) pic.twitter.com/zKR7MLQRAr — ANI (@ANI) January 5, 2024 -
430 నగరాల నుంచి అయోధ్యకు నేరుగా 72 రైళ్లు..
అయోధ్యలో జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అనంతరం అయోధ్యను సందర్శించేవారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అయోధ్యకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అయోధ్య సందర్శనకు వచ్చే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఏసీ మొదలుకొని స్లీపర్ క్లాస్, జనరల్ సౌకర్యాలతో కూడిన అన్ని రకాల రైళ్లు నడిపేందుకు సిద్ధమవుతోంది. అయోధ్య వైపు వెళ్లే రైళ్ల షెడ్యూల్ త్వరలో విడుదల కానున్నదని సమాచారం. ప్రస్తుతం అయోధ్యకు 35 రైళ్లు నడుస్తున్నాయి. రోజువారీ రైళ్లతో పాటు, వీక్లీ రైళ్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రైళ్లతో పాటు జనవరి 22 నుంచి 37 అదనపు రైళ్లను నడపనున్నారు. దీంతో దేశంలోని 430 నగరాల నుంచి మొత్తం 72 రైళ్లు అయోధ్యకు నడవనున్నాయి. దీని గురించి రైల్వే మంత్రిత్వ శాఖ సమాచార, ప్రచురణ డైరెక్టర్ శివాజీ మారుతీ సుతార్ మాట్లాడుతూ భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని అయోధ్యకు అదనపు రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. మరిన్ని నగరాలను నేరుగా అయోధ్యకు అనుసంధానం చేసేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తోందని అన్నారు. ఇది కూడా చదవండి: బాలరామునికి బొమ్మల బహుమానం -
చైనా కొత్త టెక్నాలజీ - ట్రాక్లెస్ ట్రైన్ వీడియో వైరల్
ఇప్పటి వరకు ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించిన చైనా.. మరో కొత్త ఆవిష్కరణను తీసుకువచ్చింది. ఇందులో పట్టాలు లేని లేదా ట్రాక్లెస్ ట్రైన్స్ నగరం నడిబొడ్డున తిరగడం చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ వాడుతున్నాయి. పట్టాలు లేకుండా ట్రైన్ ఎలా వెళ్లగలుగుతుంది, దాని పూర్వాపరాలు ఏంటనే వివరాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం. రోడ్డుపై పరుగులు పెట్టే ఈ ట్రైన్ గంటకు 60 మైల్స్ వేగంతో ప్రయాణిస్తుంది, ఒక్క సారికి 100మందిని తీసుకెళ్లే కెపాసిటీని కలిగి ఉంటుంది. ఈ ట్రైన్ నగరంలో ప్రయాణించడం వల్ల సిటీ బస్సు మాదిరిగా ఎక్కువ మందికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది పూర్తిగా విద్యుత్తుతో పనిచేస్తుండం వల్ల జీరో ఉద్గారాలను విడుదల చేస్తుంది. అంటే ఇది పూర్తిగా కాలుష్య రహితమైన ట్రైన్ అని తెలుస్తోంది. ఇదీ చదవండి: మునుపెన్నడూ చూడని అద్భుతాలు 'ఏఐ'తో సాధ్యం - బిల్ గేట్స్ ట్రాక్లెస్ అవసరం లేని ఈ ఎలక్ట్రిక్ ట్రైన్.. వేగంగా ప్రయాణించడమే కాకుండా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ప్రయాణ సమయంలో ట్రాఫిక్ సిగ్నెల్ పడితే ఆగుతుంది కూడా. ఇది ఆటోమాటిక్ టెక్నాలజీని కలిగి ఉండటం వల్ల రూట్ బాగా ఫాలో అవుతుంది. స్టీరింగ్ వీల్ కూడా ఈ టెక్నాలజీ ద్వారా ఆపరేట్ అవ్వడానికి ప్రత్యేకమైన సెన్సార్ సిస్టం కలిగి ఉంటుంది. Trackless train in China ...pic.twitter.com/MsMrW4Wi26 — Figen (@TheFigen_) December 29, 2023 -
మృత్యువుతో పోరాడి.. బిడ్డలను కాపాడిన తల్లి
పాట్నా: తల్లిప్రేమ అనంతమైంది. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మృత్యువు ఎదురొచ్చినా పిల్లలకు రక్షక కవచంగా మారుతుంది. తన ప్రాణాలను లెక్కచేయకుండా పిల్లల కోసం పోరాడుతుంది. ఇలాంటి ఘటనే బిహార్లో జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఢిల్లీ వెళ్లడానికి బార్హ్ రైల్వే స్టేషన్ స్టేషన్ చేరుకుంది. జనం ఎక్కువగా ఉండటంతో తోపులాట జరిగింది. ఇంతలో ప్రమాదవశాత్తు తల్లి ఇద్దరు పిల్లలు రైల్వేట్రాక్పై పడిపోయారు. ఈ క్రమంలోనే రైలు కదిలింది. ఇక ఏం చేయాలో తెలియక ఆ తల్లి అక్కడే ఉండిపోయింది. రైలు పట్టాలపైనే తన పిల్లలకు రక్షణ కవచంగా మారింది ఆ తల్లి. పిల్లలను కిందికి వంచి పట్టాలపై కదలకుండా ఉండిపోయింది. వారికి తగలకుండానే వేగంగా రైలు వారి మీద నుంచి దూసుకుపోయింది. రైలు వెళ్లిన తర్వాత వారిని క్షేమంగా స్థానికులు పైకి తీసుకువచ్చారు. స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఇదీ చదవండి: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్ -
కుటుంబ సభ్యులు మందలించారని తీవ్ర నిర్ణయం తీసుకున్న విద్యార్థి!
మిర్యాలగూడ అర్బన్: కుటుంబ సభ్యులు మందలించారని ఓ విద్యార్థి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామానికి చెందిన గుంటుపల్లి శ్రీనాథ్(15) మిర్యాలగూడ పట్టణంలోని ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. శ్రీనాథ్ రెండు రోజులుగా పాఠశాలకు వెళ్లకుండా పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో వడ్డించేందుకు క్యాటరింగ్ బృందంతో కలిసి వెళ్లాడు. శ్రీనాథ్ పాఠశాలకు హాజరు కావడం లేదని హాస్టల్ సిబ్బంది అతడి తల్లికి సమాచారం అందించారు. శ్రీనాథ్ను కుటుంబ సభ్యులు ఫోన్లో అతడిని మందలించారు. మనస్తాపం చెందిన శ్రీనాథ్మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో హాస్టల్ నుంచి బయటకు వచ్చి మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం రైల్వే సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ హుస్సేన్ తెలిపారు. -
ఒడిశా, బీహార్ గుణపాఠాల తర్వాత రైల్వేశాఖ ఏం చేస్తున్నదంటే..
ఒడిశా, బీహార్ రైలు ప్రమాదాల తరువాత భారతీయ రైల్వే.. వ్యవస్థాగతంగా భద్రతను మరింత పటిష్టం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ఏటీపీ) ‘కవచ్’ను ఇప్పటి వరకు 139 లోకోమోటివ్లపై (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రేక్) 1465 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వే విభాగాల్లో అమర్చింది. లింగంపల్లి- వికారాబాద్- వాడికి చెందిన 265 కిలోమీటర్లు, వికాబాద్- బీదర్ సెక్షన్, మన్మాడ్- ముద్ఖేడ్ ధోనే- గుంతకల్ సెక్షన్కు చెందిన 959 కిలోమీటర్లు, బీదర్-బర్బణీ సెక్షన్కు చెందిన 241 కిలోమీటర్ల పొడవునా కవచ్ ఏర్పాటుకు సంబంధించిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అలాగే ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా కారిడార్కు చెందిన సుమారు మూడు వేల కిలోమీటర్ల మార్గం కోసం టెండర్లు జారీ చేయగా, ఈ మార్గాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. భారతీయ రైల్వే ఆరు వేల కిలోమీటర్ల రైలు మార్గంలో సర్వే, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్), పకడ్బందీ అంచనాలతో సహా అనేక సన్నాహక పనులను కూడా ప్రారంభించింది. ‘కవచ్’ అనేది నడుస్తున్న రైళ్ల భద్రతను పెంచడానికి ఉపయోగించే ఆటోమేటెడ్ రైలు రక్షణ వ్యవస్థ. దీనిని మూడు భారతీయ కంపెనీల సహకారంతో రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ)దేశీయంగా అభివృద్ధి చేసింది. ‘కవచ్’ అనేది రైలు డ్రైవర్కు సిగ్నల్స్ పాస్ చేయడంలో, ప్రమాదాలను నివారించడంలో సహాయపడటమే కాకుండా ప్రతికూల వాతావరణంలోనూ రైలును నడపడంలో సహాయపడుతుంది. ‘కవచ్’ కారణంగా రైలు కార్యకలాపాల భద్రత, సామర్థ్యం మరింతగా పెరుగుతుంది. రీసెర్చ్ డిజైన్, స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ సహాయంతో భారతీయ రైల్వే ఈ ‘కవచ్’ వ్యవస్థను సిద్ధం చేసింది. 2012లో ఈ పకడ్బందీ వ్యవస్థను ఉపయోగంలోకి తీసుకువచ్చింది. మొదట్లో ఈ ప్రాజెక్ట్ పేరు ‘ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్’. రైళ్లలో జీరో యాక్సిడెంట్ లక్ష్యాన్ని సాధించేందుకు రైల్వేశాఖ ఈ పకడ్బందీ వ్యవస్థను సిద్ధం చేసింది. పాసింజర్ రైళ్లలో మొదటి ఫీల్డ్ ట్రయల్స్ 2016 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. ఇది కూడా చదవండి: రాబోయే రోజుల్లో... దేశంలోని వాతావరణం ఇలా.. -
రైలు నుంచి జారి పడి వ్యక్తి అక్కడిక్కడే మృతి
గద్వాల్ క్రైం: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం, నాపాడు జిల్లా, బాబుపలికి చెందిన గౌరి శంకర్(40) మంగళవారం ఉదయం 7 గంటలకు యశ్వంత్పూర్ నుంచి కోర్బా వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైల్లో భార్య లంబేసాగర్, 6 ఏళ్ల కుమారుడితో బెంగుళూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గద్వాల్ రైల్వేస్టేషన్ దాటిన అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో పూడూరు రైల్వేస్టేషన్ సమీపంలో వెళ్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు గౌరిశంకర్ జారి కిందపడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ తెలిపారు. తాగిన మైకంలో కిందపడి.. జడ్చర్ల టౌన్: పట్టణానికి చెందిన విష్ణు (26) బుధవారం వీరశివాజీనగర్లోని మద్యం దుకాణం సమీపంలో ఉన్న డ్రెయినేజీ పక్కన పడి మృతిచెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మద్యానికి బానిసయ్యాడు. తాగిన మైకంలో పడిపోగా.. బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి బంధువులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి చూడగా అప్పటికే చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. అంత్యక్రియలకు వెళ్తూ మరొకరు.. జడ్చర్ల టౌన్: సమీప బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు రైల్వే ప్లాట్ఫారంపై పడి మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్కు చెందిన శ్రీనివాసులు (52) మహబూబ్నగర్లో సమీప బంధువు చనిపోవడంతో బుధవారం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రైలులో బయలుదేరాడు. జడ్చర్లలో ఉన్న కుమార్తెను తీసుకెళ్లేందుకు స్టేషన్లో రైలు ఆగకముందే దిగేందుకు ప్రయత్నించి ప్లాట్ఫారంపై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. రైల్వే పోలీసులు పంచనా మా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ఆస్పత్రికి తరలించారు. ఇంటి తాళం పగలగొట్టి బంగారం, నగదు అపహరణ చారకొండ: మండల కేంద్రంలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి బంగారం, వెండి, నగదు చోరీకి పాల్పడ్డారు. ఎస్ఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొప్పుల బాల్నారయ్య ఈనెల 4న తమ కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లారు. తిరిగి 5వ తేదీన ఇంటికి వచ్చారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లో దాచిన రెండు చైన్లు, పూసలదండా, రింగులు, బంగారు నగలు నాలుగు తులాలు, వెండి ఆభరణాలు, రూ.98 వేల నగదు చోరీకి గురయ్యాయి. బుధవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
రైలు టాయిలెట్లో ఐదు నెలల చిన్నారి.. తరువాత?
దిక్కులేనివారికి దేవుడే దిక్కు అంటారు. ఐదు నెలల బాలుని విషయంలో ఈ మాట నూటికి నూరుపాళ్లు నిజమైంది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కు చెందిన ఒక ముస్లిం కుటుంబానికి రైలులోని టాయిలెట్లో ఒక పసిబాలుడు కనిపించాడు. వారు ఆ చిన్నారిని తమ ఇంటికి తీసుకువెళ్లారు. వారి ఫిర్యాదు మేరకు ఆ చిన్నారి సంబంధీకుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. డెహ్రాడూన్లోని జీఎంఎస్ రోడ్డులో నివాసం ఉంటున్న ఫర్నిచర్ వ్యాపారి ఫయాజ్ అహ్మద్ కుటుంబం ఆదివారం జ్వాలాపూర్ నుంచి డెహ్రాడూన్కు రైలులో తిరిగి వస్తోంది. ఈ నేపధ్యంలో ఆ కుటుంబానికి చెందిన ఒక మహిళకు టాయిలెట్లో ఐదు నెలల బాలుడు కనిపించాడు. దీంతో ఆ మహిళ కోచ్లోని వారందరికీ ఈ విషయాన్ని తెలిపింది. వారెవరూ ఆ బాలుడు తమకు చెందినవాడు కాదని స్పష్టం చేశారు. ఇంతలో డెహ్రాడూన్ స్టేషన్ వచ్చింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు బాలుడిని తమ ఇంటికి తీసుకువచ్చారు. ముందుగా ఆ బాలునికి వైద్య చికిత్స అందించారు. తరువాత ఇందిరానగర్ పోలీస్ పోస్ట్లో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ చిన్నారి సంబంధీకుల కోసం దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ చిన్నారిని పెంచే బాధ్యతను అధికారులు తమకు అప్పగిస్తే అందుకు తాను సిద్ధమేనని ఫయాజ్ తెలిపారు. కాగా ఆ చిన్నారికి ఇంకా పేరు పెట్టలేదు. ఇది కూడా చదవండి: ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు ఊహించని ఫలితం! -
రైలు ఎక్కుతూ కాలు జారిన మహిళ.. కాపాడిన కానిస్టేబుల్!
పశ్చిమ బెంగాల్లోని హౌరాలో రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ జారి పడిపోయిన ఓ మహిళను రైల్వే కానిస్టేబుల్ కాపాడిన ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటన హౌరా స్టేషన్ ఓల్డ్ కాంప్లెక్స్ స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బుధవారం ఉదయం 10.50 గంటలకు 40 ఏళ్ల ఫాతిమా ఖాతూన్ తన బంధువుతో పాటు హౌరా-తారకేశ్వర్ లోకల్ ఎక్కేందుకు వచ్చారు. వీరిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో ఫాతిమా బ్యాలెన్స్ తప్పి ప్లాట్ఫారమ్పై పడిపోయింది. ఇంతలో రైలు వేగం పెరగడంతో ఆమె రైలు పట్టాలకు ప్లాట్ఫారమ్కు మధ్య ఇరుక్కుపోయింది. అయితే ఆమె బంధువు ఆమెను రైలు కిందకు జారిపోకుండా పైకి లాగడానికి ప్రయత్నించారు. దీనిని గమనించిన అక్కడే ఉన్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎల్కే బౌరీ వెంటనే ఫాతిమా వద్దకు పరిగెత్తారు. ఆమె చేయి పట్టుకుని పైకిలాగి ఆమె ప్రాణాలను కాపాడారు. సీసీటీవీ ఫుటేజీలో.. ప్లాట్ఫారమ్పై ఉన్న పలువురు ప్రయాణికులు ఫాతిమాను రక్షించేందుకు ప్రయత్నించడాన్ని గమనించవచ్చు. పలువురు పోలీసులు కూడా ఆమెకు సహాయం చేసేందుకు పరుగులు తీశారు. ఈ ఘటనలో పోలీసుల చొరవను తూర్పు రైల్వే ప్రశంసించింది. ఇది కూడా చదవండి: రసాయనాల ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం चलती ट्रेन में चढ़ते समय फिसल गई महिला, फरिश्ता बनकर आए पुलिसकर्मी ने बचाई जान pic.twitter.com/7hyYXCh6Pc — NDTV India (@ndtvindia) November 30, 2023 -
వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
భువనేశ్వర్: రూర్కెలా–పూరి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. మెరామండలి, బుద్ధపంక్ రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్లోని ఒక కిటికీ రాళ్ల తాకిడికి దెబ్బతిందని తెలిపింది. -
వందేభారత్ స్నాక్ ట్రేలు ధ్వంసం చేస్తున్న పిల్లలు?
భారతీయ రైల్వేకు సంబంధించిన ఓ వింత ఘటన బుధవారం వెలుగు చూసింది. రైలులో పరిశుభ్రత లోపించడం, సరిగా లేని ఆహారం తదితర విషయాలపై ప్రతిరోజూ రైల్వే అధికారులకు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తుంటారు. అయితే ఈసారి ఇందుకు భిన్నంగా రైల్వే అధికారి ఒకరు ప్రయాణికులపై ఆరోపణలు చేశారు. అనంత్ రూపనగుడి అనే రైల్వే అధికారి ఇద్దరు చిన్నారుల ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వందే భారత్, ఇతర రైళ్లలో స్నాక్ ట్రేలు విరిగిపోవడానికి లేదా పాడైపోవడానికి ఇదే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ఫోటోలో ఆ పిల్లలు ట్రేపై కూర్చున్నారు. అయితే ఆ ఫోటో సరైనదో కాదో ఇంకా తెలియరాలేదు. ఈ పోస్ట్ను లక్ష మందికి పైగా నెటిజన్లు చూశారు. వెయ్యిమందికిపైగా యూజర్లు లైక్ చేశారు. 350 మందికి పైగా యూజర్లు ఈ పోస్టును షేర్ చేశారు. దీనిపై స్పందించిన ఒక యూజర్.. ఇలాంటి పిల్లల తల్లిదండ్రుల నుండి జరిమానా వసూలు చేయాలని రాశారు. అయితే రైల్వేశాఖ నుంచి ఈ ఘటనపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది కూడా చదవండి: మనిషి పాదరక్షలు ఏనాటివి? ఆశ్చర్యపరుస్తున్న పరిశోధనలు! One of the main reasons for breaking of snack trays or defective snack trays in #VandeBharat and other trains! Even with photographic evidence, whiners would say that I pass on the blame only to passengers! #IndianRailways #Responsibility #passengers pic.twitter.com/ykv0VNED9a — Ananth Rupanagudi (@Ananth_IRAS) November 22, 2023 -
‘దర్భంగా ఎక్స్ప్రెస్’ ఘటన మరువకముందే మరో రైలు ప్రమాదం
ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి సహర్సా వెళ్తున్న 12554 వైశాలి ఎక్స్ప్రెస్లోని ఎస్-6 కోచ్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇటావాలోని సరాయ్ భూపత్ రైల్వే స్టేషన్ సమీపంలో క్లోన్ ఎక్స్ప్రెస్లో బుధవారం పొద్దుపోయాక ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్ పూజలో పాల్గొనేందుకు బీహార్, యూపీకి చెందిన పలువురు ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిలో తూర్పు యూపీకి చెందిన ఇద్దరు, రాజస్థాన్కు చెందిన ఒకరు ఉన్నారు. గాయపడిన 11 మంది రైల్వే ప్రయాణికులను సైఫాయ్ మెడికల్ యూనివర్సిటీకి ఆసుపత్రికి తరలించారు. మరో ఎనిమిది మంది ప్రయాణికులను డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ప్రభుత్వ జాయింట్ హాస్పిటల్లో చేర్చారు. రైలులో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన మైన్పురి ఔటర్ గేట్ ఆఫ్ ఫ్రెండ్స్ కాలనీ వద్ద చోటుచేసుకుంది. కాగా బుధవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీకి థాయ్ రెస్క్యూ బృందాలు -
ఇదు శ్రీలంక: చుక్ చుక్ చుక్... నాను వోయా టూ ఎల్లా !
శ్రీలంకకు వాయుమార్గం, జలమార్గాల్లో వెళ్లవచ్చు. అక్కడి రోడ్లు నల్లగా నున్నగా మెరుస్తూ ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ద్రవ్యోల్బణంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన దేశ ఇదేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. విమాన ప్రయాణం, పడవ ప్రయాణం, రోడ్డు ప్రయాణం తర్వాత మిగిలింది రైలు ప్రయాణమే. శ్రీలంక ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే ట్రైన్లో ప్రయాణించాల్సిందే. గంటకు పాతిక కిమీమీటర్ల వేగంతో ప్రయాణించే టాయ్ ట్రైన్ జర్నీ ఆద్యతం అలరించడమే కాదు, ఆ దారిలో వచ్చే చిన్న చిన్న గ్రామాలు స్థానికుల సౌకర్యాలతో కూడిన నిరాడంబరమైన జీవనశైలిని కళ్లకు కడుతుంది. బౌద్ధ ప్రాశస్త్య్రాల పర్యటనలో భాగంగా తెలంగాణ నుంచి వెళ్లిన మా మహిళా విలేకరులమందరం ‘నాను వోయా’లో టాయ్ ట్రైన్ ఎక్కాం. పిల్లలతో ప్రయాణం టాయ్ ట్రైన్లో ఫస్ట్ క్లాస్ టికెట్లకు డిమాండ్ ఎక్కువ. ముందుగా రిజర్వ్ చేసుకోవాలి. మిగతా తరగతులు కూడా రద్దీగా ఉంటాయి. మేము వెళ్లిన రోజు ఒక స్కూల్ నుంచి దాదాపుగా డెబ్బై మంది పిల్లలు మాతో ప్రయాణించారు. వాళ్లు జురాసిక్ పార్క్ సినిమా చూడడానికి వెళ్తున్నారు. ‘ఎల్లా’ కంటే ముందు ఒక స్టేషన్లో దిగేశారు. ఆ పిల్లల పేర్లన్నీ భారతీయతతో ముడిపడినవే. సంస్కృత ద్రవిడ సమ్మేళనంగా ఉన్నాయి. అయితే నకారాంతాలుగా లేవు, అన్నీ అకారాంతాలే. పిల్లల స్కూల్ డ్రస్ మీద వాళ్ల పేర్లు కూడా ఎంబ్రాయిడరీ చేసి ఉన్నాయి. వాటిని మనసులో చదువుకుని పైకి పలుకుతుంటే ఏదో సొగసుదనం ఉంది. పిల్లలు చక్కటి ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు. రైలు ప్రయాణించే దారిలో వచ్చే స్టేషన్ల పేర్లను మేము తడుముకుంటూ చదువుతుంటే మా ఉచ్చారణను సరిదిద్దుతూ మా ప్రయాణానికి మరింత సంతోషాన్నద్దారా పిల్లలు. మబ్బుల్లో విహారం నాను వోయా స్టేషన్ క్యాండీ నగరానికి 70 కిమీల దూరంలో, నువారా ఎలియాకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిల్స్టేషన్ల మధ్య సాగే ప్రయాణం అది. దట్టంగా విస్తరించిన అడవుల మధ్య టక్టక్మని శబ్దం చేస్తూ వెళ్తుంది రైలు. ఆకాశాన్ని తాకడానికి పోటీ పడి పెరిగినట్లున్న వృక్షాల తలలను చూడడానికి తల వంచిన కిటికీలో నుంచి పైకి చూసే ప్రయత్నం అయితే చేస్తాం, కానీ మనకు మొదళ్లు కనిపించిన వృక్షాల తలలను చూడలేం. లోయలో నుంచి పెరిగి వచ్చిన వృక్షాల తలలను మాత్రమే చూడగలం. పచ్చటి ప్రకృతి చిత్రం చూస్తూ ఉండగానే మసకబారుతుంది. ఏంటా అని పరికించి చూస్తే మందపాటి మబ్బు ప్రయాణిస్తూ ఉంటుంది. రైలును తాకుతూ వెళ్లే మబ్బు కిటికీ లో నుంచి దూరి మనల్ని చల్లగా తాకి పలకరిస్తుంది. ఈ దారిలో కొండల మధ్య జలపాతాలు కూడా ఎక్కువే. జలపాతం సవ్వడి వినిపించనంత దూరంలో కనువిందు చేస్తుంటాయి. హాయ్ హాయ్గా... రైలు అర్ధచంద్రాకారపు మలుపుల్లో ప్రయాణించేటప్పుడు కిటికీలో నుంచి బయటకు చూస్తే లెక్కలేనన్ని చేతులు స్మార్ట్ ఫోన్లు, హ్యాండీకామ్లతో ఫొటో షూట్ చేస్తూ కనిపిస్తాయి. ఈ రైల్లో స్థానికులు వారి అవసరార్థం ప్రయాణిస్తారు. పర్యాటకులు ప్రకృతి పరవశం కోసమే ప్రయాణిస్తారు. ప్రతి విషయాన్ని స్వయంగా ఎక్స్పీరియన్స్ చేయాలనే పాశ్చాత్య పర్యాటకులు ఈ రైల్లో ఎక్కువగా కనిపిస్తారు. వాళ్లు ముందుగానే ఫస్ట్ క్లాస్లో బుక్ చేసుకుంటారు. కొండలను కలుపుతూ వేసిన వంతెనలు, కొండను తొలిచిన సొరంగాల మధ్య సాగే ఈ ప్రయాణం మన తెలుగు రాష్ట్రంలో విశాఖ– అరకు ప్రయాణాన్ని, ఊటీ టాయ్ ట్రైన్ జర్నీని తలపిస్తుంది. బ్రిటిష్ పాలకులు నిర్మించిన రైలు మార్గం ఇది. అప్పటి నుంచి నిరంతరాయంగా నడుస్తూనే ఉంది. పర్యాటకులు త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరపాటులో చేసే ప్రయాణం కాదిది. దృష్టి మరలిస్తే చూడాల్సిన వాటిలో ఏం మిస్సవుతామోనన్నంత ఉత్సుకతతో సాగే ప్రయాణం. మన స్టేషన్ త్వరగా రావాలని కూడా ఉండదు. రైల్లో ఒక బోగీలో వాళ్లకు మరో బోగీలో ఉన్న వాళ్లు ‘హాయ్’ చెప్పుకుంటూ చిన్న పిల్లల్లా కేరింతలు కొడుతూ ప్రయాణిస్తారు. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: రావణ్ ఫాల్స్... ఎల్లా!) -
రైలు ఢీకొని వ్యక్తి మృతి.. కుడి చేతిపై పచ్చబొట్టు
బాలానగర్: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి (35) మృతిచెందిన ఘటన బాలానగర్ రైల్వేస్టేషన్లో మంగళవారం చోటుచేసుకుంది. మృతుడి కుడి చేయిపై హితేష్ అనే పచ్చబొట్టు ఉందని రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. మృతదేహాన్ని షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
దేవరకద్ర మార్గంలో ఎలక్ట్రిక్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: పాత లైన్ల విద్యుదీకరణ పూర్తి చేసిన రైల్వే శాఖ ఇప్పుడు కొత్త లైన్లను వేగంగా విద్యుదీకరిస్తోంది. మహబూబ్నగర్–కర్నాటకలోని మునీరాబాద్ మధ్య రైల్వే లైన్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణ సరిహద్దు పరిధిలో దేవరకద్ర– కృష్ణా స్టేషన్ల మధ్య ఇటీవలే లైన్ అందుబాటులోకి వచ్చింది. 64 కి.మీ. ఈ నిడివిలో ప్రయాణికుల రైళ్లను ఇటీవలే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు దేవరకద్ర–కృష్ణా స్టేషన్ల మధ్య మార్గాన్ని కూడా విద్యుదీకరించారు. పనులు పూర్తి కావటంతో డీజిల్ లోకోమోటివ్ల బదులు ఎలక్ట్రిక్ లోకో మోటివ్లతో రైళ్లను తిప్పనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. ఉపయోగాలెన్నో.. ప్రస్తుతం కాచిగూడ నుంచి బెంగుళూరు, రాయచూరు తదితర ప్రాంతాలకు గద్వాల మీదు గా ఎలక్ట్రిక్ లోకోమోటివ్ రైళ్లు నడుస్తున్నాయి. వాస్తవానికి రాయచూరుకు గద్వాల మీదుగా కాకుండా కృష్ణా మీదుగా వెళ్లేది దగ్గరి దారి. ఇన్నాళ్లూ విద్యుదీకరణ పూర్తి కాకపోవటంతో రైళ్లను నడపటం సాధ్యం కాలేదు. ఇప్పుడు దేవరకద్ర– కృష్ణా స్టేషన్ల మధ్య విద్యుత్ లైన్ అందుబాటులోకి రావటంతో ఇక రాయచూరు సహా కొన్ని ఇతర రైళ్లను ఈ మార్గం మీదుగా మళ్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనివల్ల గద్వాల మార్గంపై ఒత్తిడి తగ్గుతుంది. ఎలక్ట్రిక్ ఇంజన్లతో పోలిస్తే డీజిల్ లోకోమోటివ్ల వినియోగం ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు ఆ ఇంధన భారం కూడా తగ్గనుంది. వేగంలో పెద్దగా తేడా రాకున్నా, ఇంజన్ పికప్ బాగా మెరుగుపడుతుంది. ఇది ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. సరుకు రవాణా రైళ్లకు ఒకటికి మించి ఇంజన్లను వాడుతుంటారు. మూడు డీజిల్ ఇంజన్ల బదులు రెండు ఎలక్ట్రిక్ ఇంజన్లు ఎక్కువ వ్యాగన్లు ఉన్న రైలును సులభంగా లాగుతాయి. కొన్ని రకాల సరుకును తరలించే సందర్భంలో.. రెండు డీజిల్ ఇంజిన్ల బదులు ఒక్క ఎలక్ట్రిక్ ఇంజన్ సరిపోతుంది. ఇక విద్యుదీకరించాల్సింది ఆ రెండు మార్గాలే ఇక మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైన్ (పనులు జరుగుతున్నాయి), ఇటీవలే అందుబాటులోకి వచ్చిన మెదక్–అక్కన్నపేట మార్గాలను మాత్రమే విద్యుదీకరించాల్సి ఉంది. మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా, సిద్దిపేట వరకు లైన్ అందుబాటులోకి రావటంతో ఇటీవలే ప్రయాణికుల రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. మనోహరాబాద్–సిద్దిపేట మధ్య విద్యుదీకరణ ప్రాజెక్టు మంజూరు కావటంతో వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పనులు ప్రారంభమైన ఏడాదిలో అది కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. -
రైల్లో అలారం చైన్కు లగేజీ తగిలిస్తే కేసు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు ప్రయాణికులు తమ వ్యక్తిగత వస్తువులు, లగేజీ బ్యాగులు, సెల్ఫోన్లను అలారం చైన్ పుల్లింగ్ పరికరానికి వేలాడదీయడం చట్టరీత్యా తీవ్ర నేరమని రైల్వే అధికారులు గురువారం ప్రకటనలో హెచ్చరించారు. పలు ఎక్స్ప్రెస్, పాసింజర్ రైళ్ల కోచ్లను ఎల్బీహెచ్ కోచ్లుగా ఆధునీకరించారు. అత్యవసర పరిస్ధితిలో రైలును ఆపేందుకు గతంలో ఉపయోగించిన అలారం చైన్ స్థానంలో పాసింజర్స్ ఎమర్జెన్సీ అలారం సిగ్నలింగ్ డివైజ్ (పీఈఏఎస్డీ) అమర్చారు. ఈ పరికరం ఎరుపు రంగుతో హ్యాండిల్ను పోలి ఉండటంతో ప్రయాణికులు తమ వ్యక్తిగత వస్తువులు, లగేజీలు, సెల్ఫోన్ను వేలాడదీస్తున్నారు. ఈ కారణంగా పరికరం ఆటోమెటిక్గా లాక్ అయ్యి రైలు నిలిచిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. ఈ తరహా ఘటనలు అక్టోబరు వరకూ డివిజన్ వ్యాప్తంగా 2,159 జరిగినట్టు పేర్కొన్నారు. ప్రయాణికులు సరైన కారణం లేకుండా అలారం చైన్ ఉపయోగించడం తీవ్ర నేరమని, రైల్వే చట్టం 141 సెక్షన్ ప్రకారం రూ.1000 జరిమానా, లేదా ఒక ఏడాది జైలు శిక్ష లేదా రెండు విధించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. చదవండి: ‘స్కిల్’ శిక్షకులకు ఆహ్వానం -
బంగ్లాదేశ్లో రెండు రైళ్లు ఢీ.. 20 మంది మృతి
బంగ్లాదేశ్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 20 మంది మృతిచెందారు. 100 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 80 కిలోమీటర్ల దూరంలోని ఖైరబ్ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. కిషోర్ గంజ్ రైల్వేస్టేషన్ దగ్గర గూడ్స్ రైలును ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా ఢీకొనటంతో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఢాకా వెళుతున్న గోథూళి ఎక్స్ ప్రెస్.. గూడ్స్ రైలును బలంగా ఢీకొన్నట్లు స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. కాగా ప్రమాద తీవ్రత అధికంగా ఉందని, మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని అధికారులు అంటున్నారు. ప్రమాదంలో కొన్ని బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయని, వాటిలో ప్రయాణికులు చిక్కుకుపోయారని, ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు అధికారులు. ఈ ఘటన నేపధ్యంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా పలు రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గాయపడిన వంద మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద స్థలానికి అత్యవసర సర్వీసులు తరలివచ్చాయని, స్థానికుల సహకారంతో సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు బంగ్లాదేశ్ రైల్వే అధికారులు తెలిపారు. కాగా విచారణ అనంతరం ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలను వెల్లడించగలమని అధికారులు చెబుతున్నారు. రైలులో సురక్షితంగా ఉన్న ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు ప్రత్యేక వాహనాలలో తరలిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: హమాస్ చెర నుంచి మరో ఇద్దరు బందీల విడుదల! -
పుల్ అండ్ పుష్ ట్రైన్ అంటే ఏమిటి? ఎక్కడ నడవనుంది?
భారతదేశంలో ప్రస్తుతం రవాణా రంగంలో నూతన ఆవిష్కరణలు, ప్రయోగాలు, నిర్మాణాలు జరుగుతున్నాయి. సాధారణ రైళ్లను ఆధునీకరిస్తున్నారు. సెమీ హైస్పీడ్ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తున్నాయి. ర్యాపిడ్ రైలు ప్రారంభం కానుంది. బుల్లెట్ రైళ్లకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ఈ దిశగా మరో ముందడుగు వేస్తూ భారత్ పుల్ అండ్ పుష్ రైళ్లను నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. పుల్ అండ్ పుష్ రైళ్ల నిర్వహణకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయంలో ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. భారతదేశపు మొట్టమొదటి పుల్-పుష్ రైలును నవంబర్ నెలలో బీహార్ రాజధాని పాట్నా, మహారాష్ట్ర రాజధాని ముంబై మధ్య నడపనున్నారని సమాచారం. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో రైళ్ల వేగంతో పాటు సామర్థ్యాన్ని పెంచడమే రైల్వేల లక్ష్యం. ఈ నేపధ్యంలో పుల్ అండ్ పుష్ రైళ్లను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం పుల్ అండ్ పుష్ రైళ్ల కోచ్లు ఈ నెలలోనే సిద్ధం కానున్నాయి. కాగా ఈ రైళ్లను ఎప్పుడు, ఎక్కడి నుంచి నడపాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ రైళ్ల గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు. ఈ రైలుకు రెండు ఇంజన్లు అమర్చడం విశేషం. ఈ రైలుకు ముందు ఒక ఇంజన్, వెనుక ఒక ఇంజన్ ఉంటుంది. రైలులో జనరల్, స్లీపర్ క్లాస్ల చొప్పున మొత్తం 22 కోచ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రారంభంలో ఈ రైలు నాన్-ఏసీగా నిర్వహించనున్నారు. ఈ రైలు కోసం పశ్చిమ బెంగాల్లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్లో ప్రత్యేక కోచ్లను సిద్ధం చేశారు. ఈ డబుల్ ఇంజిన్ రైలులో ఒకసారి ఒక ఇంజిన్ మాత్రమే నడుస్తుంది. పుల్ అండ్ పుష్ టెక్నాలజీని ఉపయోగించడం వలన రైలు వేగాన్నిపెంచవచ్చు . అలానే తగ్గించవచ్చు. ఈ టెక్నాలజీ కారణంగా రైళ్ల సగటు వేగం 10 నుంచి 15 శాతం పెరుగుతుందని రైల్వేశాఖ చెబుతోంది. కొన్ని మార్గాల్లో ఈ రైలు రాజధాని ఎక్స్ప్రెస్ కంటే వేగంగా నడవనుందని తెలుస్తోంది. ఈ రైలుకు ‘వందే జనసాధారణ’ అని పేరు పెట్టవచ్చని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: దేశంలో ఎవరికి అత్యధిక రిజర్వేషన్లు? మహారాష్ట్రలో ఏం జరుగుతోంది? -
రైల్వే కిచెన్లో ఎలుకల సంచారం.. అధికారుల స్పందన ఇది..!
ముంబయి: రైల్వేలలో ఆహారం నాణ్యతపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఆహారంలో అపరిశుభ్రమైన వస్తువులు రావడం తరచూ చూస్తుంటాం. కానీ తాజాగా రైల్వే కిచెన్(ప్యాంట్రీ)లో ఏకంగా ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ఘటన మడగావ్ ఎక్స్ప్రెస్లో జరిగింది. రైల్వే కిచెన్లో ఎలుకలు సంచరిస్తున్న వీడియోను ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాను మడగావ్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తుండగా ఈ దృశ్యాలను చూశానని ఆ ఘటనపై ఇలా పేర్కొన్నాడు. '11099 నెంబర్గల మడ్గావ్ ఎక్స్ప్రెస్లో అక్టోబర్ 15న ప్రయాణిస్తున్నాను. అప్పటికే మధ్యాహ్నం 1:45 గంటలకు బయలుదేరాల్సిన రైలు.. మధ్యాహ్నం 3:30 గంటలకు ఆలస్యమైంది. రైలు వెనుకభాగంలోకి వెళ్లి చూస్తే ప్యాంట్రీలో ఎలుకలు దర్శనమిచ్చాయి. ఆహార పదార్థాలను ఎలుకలు తింటూ కనిపించాయి.' అని ఆ యూజర్ తెలిపాడు. View this post on Instagram A post shared by RF Drx. Mangirish Tendulkar (@mangirish_tendulkar) ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసుకు తెలిపినా ప్రయోజనం లేకపోయిందని ఆ ప్రయాణికుడు తెలిపాడు. రైల్వే ట్రాక్పై ఉండే ఎలుకలు లోపలికి దూరి ఉండవచ్చని సాధారణంగా మాట్లాడి నిరుత్సాహపరిచాడు. ఆ తర్వాత అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ మీనాకు ఫిర్యాదు చేస్తే ప్యాంట్రీ మేనేజర్తో మాట్లాడామని వెల్లడించారు. అయితే.. రైలు కోచ్లలో లోపాల కారణంగానే ఎలుకలు లోపలికి ప్రవేశిస్తున్నాయని ఆయన ఆరోపించారు. చివరికి రైల్వే పెద్దలు ఈ ఘటనపై స్పందించి.. తగు నివారణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్యాంట్రీలో శుభ్రతపై తగు జాగ్రత్తలు తీసుకుంటామని సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చారు. The matter is viewed seriously and suitable action has been taken.Pantry Car Staff have been sensitised to ensure hygiene and cleanliness in the pantry car. The concerned have been suitably advised to ensure effective pest and rodent control measures which is being ensured. — IRCTC (@IRCTCofficial) October 18, 2023 ఇదీ చదవండి: కశ్మీరీ వలస కుటుంబాలకు ఇకపై నెలకు రూ.27 వేలు -
రైలులో అగ్ని ప్రమాదం
ముంబయి: మహారాష్ట్రలో రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. అహ్మద్నగర్ నుంచి అష్టికి వెళ్లే సబర్బన్ రైలులోని ఐదు కోచ్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించామని వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: పాక్ క్రికెటర్ల ఎదుట ఆ నినాదాలు సరైనవి కావు: ఉదయనిధి -
మళ్లీ ‘లోకల్’ ఫైట్: మెడపట్టి రైలులో నుంచి..
ఢిల్లీ మెట్రో- ముంబై లోకల్ మధ్య వైరల్ వీడియోల వార్ జరుగుతోంది. రీల్స్ చేయడం మొదలుకొన్ని ప్రయాణికులు పరస్పరం తన్నుకునేవరకూ ఇలా లెక్కలేనన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజా వీడియో ముంబై లోకల్ ట్రైన్కు సంబంధించినది. వేగంగా వెళుతున్న రైలులో డోరు దగ్గర నిలుచున్న ఇద్దరు ప్రయాణికుల మధ్య వివాదం చేటుచేసుకోవడాన్ని వీడియోలో చూడవచ్చు. ముంబై మేటర్స్ పేరుతో ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసిన ఈ వీడియోలో ఇద్దరు ప్రయాణికులు రైలు డోర్ దగ్గర నిలుచుని ఉండటం కనిపిస్తుంది. వారిద్దరూ ఏదో విషయమై గొడవపడుతుంటారు. ఇంతలో ఒక వ్యక్తి తన ఎదురుగా ఉన్న వ్యక్తి గొంతుపట్టి అతనిని రైలు నుంచి బయటకు నెట్టివేసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఆ వ్యక్తి ట్రైన్ గ్రిల్ పట్టుకుని తనను తాను కాపాడుకుంటాడు. దీనిని చూసిన రైలులోని తోటి ప్రయాణికులు పెద్దగా కేకలు పెడతారు. ఈ వీడియోను చూసినవారికి తృటిలో ప్రమాదం తప్పిందని అనిపిస్తుంది. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో పలువురు యూజర్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ముంబై మెట్రోలో ఇది నిత్యకృత్యమై పోయిందని కామెంట్ చేయగా, మరొక యూజర్ ‘ఇంత చిన్న గొడవకే ప్రాణాలు తీసుకుంటారా?’ అని ప్రశ్నించాడు. ఇది కూడా చదవండి: ఈ ఆమ్లెట్ తింటే లక్ష.. కండీషన్స్ అప్లై! Commuter Fights inside speeding #MumbaiLocal trains that too near the Open Doors (Gate) is very very Risky. Whenever the much promised conversion of all the Mumbai local trains into AC Local trains (with doors) happens, commuters can fight in cool comfort without sweating &… pic.twitter.com/d8KCxYc9Np — मुंबई Matters™ (@mumbaimatterz) October 11, 2023 -
అక్కడ మొదటి హైడ్రోజన్ రైలు.. త్వరలోనే ట్రయల్స్
ప్రత్యామ్నాయ ఇంధనాలకు ఇటీవల ప్రధాన్యత పెరుగుతోంది. కాలూష్య రహిత పర్యావరణం దిశగా ప్రపంచ దేశాలు పయనిస్తున్నాయి. ఇందులో భాగంగా హైడ్రోజన్ ఇంధనం వెలుగులోకి వచ్చింది. ఈ ఇంధనంతో నడిచే వాహనాలను పలు దేశాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా సౌదీ అరేబియా త్వరలోనే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రారంభించనుంది. ఈమేరకు ఆ దేశ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో మొదటి హైడ్రోజన్ రైలును పరీక్షించడాన్ని తమ దేశం ప్రారంభిస్తుందని రియాద్లో జరిగిన UN MENA క్లైమేట్ వీక్ కార్యక్రమంలో వెల్లడించారు. (ఇండియన్ ఫుడ్కు భారీ డిమాండ్.. భారత్ను వేడుకుంటున్న దేశాలు) హైడ్రోజన్ రైలు అనేది విద్యుత్తును ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేకమైన రైలు. హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి దాని ప్రొపల్షన్ సిస్టమ్కు శక్తినిస్తుంది. సంప్రదాయ డీజిల్తో నడిచే రైళ్ల కంటే పర్యావరణపరంగా మేలైనవి. ఇవి పర్యావరణానికి హాని కలిగించే ఎటువంటి ఉద్గారాలను విడుదల చేయవు. మొట్టమొదటి హైడ్రోజన్ రైలు "కోరాడియా ఐలింట్" అనేది హైడ్రోజన్ శక్తితో ప్రత్యేకంగా నడిచే ప్రపంచంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు. ఫ్రెంచ్ బహుళజాతి రైలు రవాణా సంస్థ Alstom దీనిని తయారు చేసింది. 2016లో దీని పరిచయం రైలు ఆధారిత హైడ్రోజన్ ఇంధన సెల్ సాంకేతికత అభివృద్ధిలో ఒక కీలక మలుపు. ఈ రైలు ఒక ట్యాంక్ హైడ్రోజన్కు సుమారు 1,000 కిలోమీటర్లు నడుస్తోంది. ఇది మొదట 2018 సెప్టెంబర్లో జర్మనీలోని లోయర్ సాక్సోనీలో కమర్షియల్గా ప్రారంభమైంది. భారత్లోనూ.. భారత్ సైతం హైడ్రోజన్తో నడిచే రైళ్లను అభివృద్ధి చేస్తోందని, ఇవి 2023 డిసెంబర్ నాటికి సిద్ధమవుతాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో తెలిపారు. హర్యానాలోని జింద్-సోనీపట్ మార్గంలో వీటిని నడపనున్నారు. -
రాజస్థాన్లో మొదటి వారసత్వ రైలు ప్రారంభం
జైపూర్: రాజస్థాన్లో మొదటి హెరిటేజ్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 150 ఏళ్లనాటి ఆవిరి ఇంజిన్ను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ రైలు పాలీ జిల్లాలో మార్వార్ ప్రాంతం నుంచి ఖామ్లిఘాట్ వరకు ప్రయాణించనుంది. ప్రముఖ చారిత్రక ప్రదేశాలను కలుపుతూ పర్యటన సాగుతుంది. అందమైన లోయల గుండా సాగే ఈ ప్రయాణం భారత రైల్వే చరిత్ర, వారసత్వ సంపదను ప్రతిబింబిస్తుంది. రైలు ప్రత్యేకతలు.. ఈ హెరిటేజ్ రైలులో 60 మంది ప్రయాణికులు ప్రయాణించనున్నారు. పర్యటక ప్రదేశాలను చూడటానికి ట్రైన్లో పెద్ద ద్వారాలు ఏర్పాటు చేశారు. గోరమ్ ఘాట్(రాజస్థాన్ మినీ కశ్మీర్), భిల్ బేరీ వాటర్ఫాల్ వంటి ప్రదేశాలను కలుపుతూ రైలు ప్రయాణం సాగుతుంది. రైలు రూపకల్పన 150 ఏళ్ల నాటి ఆవిరి ఇంజిన్ను ప్రతిబింబిస్తుంది. రైలు వేళలు.. మార్వార్ జంక్షన్ వద్ద ఉదయం 8:30కు ప్రారంభమైన ఈ రైలు కామ్లిఘాట్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుతుంది. వారానికి నాలుగు సార్లు ఈ రైలు ప్రయాణం ఉంటుంది. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ హెరిటేజ్ రైలు.. సాయంత్రం 5:30కి మార్వార్ చేరుతుంది. హెరిటేజ్ రైలు ప్రయాణానికి ఒక్కొ టికెట్కు రూ.2000 వసూలు చేయనున్నారు. హెరిటేజ్ రైలు ప్రారంభం సందర్భంగా బీజేపీ ఎంపీ దివ్యా కుమారి తన మొదటి ప్రయాణం అద్భుతంగా ఉందని వెల్లడించారు. UNESCO భారత్లో నాలుగు రైల్వే లైన్లకు ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (1999), నీలగిరి మౌంటైన్ రైల్వే (2005), కల్కా సిమ్లా రైల్వే (2008), ఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబై (2004)లు అందులో ఉన్నాయి. మథెరన్ లైట్ రైల్వే, కాంగ్రా వ్యాలీ రైల్వే తాత్కాలిక జాబితాలో ఉన్నాయి. ఇదీ చదవండి: అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై దృష్టి: ఇస్రో -
కూత.. సంబరాల మోత.. దశాబ్దాల కల సాకారమైన వేళ..
సిద్దిపేట: సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల కళ్ల ముందు ఆవిష్కృతమైంది. ఎన్నో ఏళ్లుగా రైలు సౌకర్యం కోసం ఎదురుచూసిన క్షణాలు నిజమయ్యాయి. సిద్దిపేట–సికింద్రాబాద్ మధ్య రైలు ప్రయాణికులతో పరుగులు పెట్టింది. మంగళవారం నిజామాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా, సిద్దిపేట రైల్వేస్టేషన్ వద్ద రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్, పరిసరాలను అందంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రైలు వద్ద సెల్ఫీలు దిగుతూ మురిసిపోయారు. కొంత మంది సరదాగా రైలులోకి ఎక్కారు. బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటూ మంత్రికి స్వాగతం పలికారు. మంత్రి హరీశ్రావు దుద్దెడ స్టేషన్ వరకు రైలులో ప్రయాణించారు. తొలి ప్రయాణంలో 327 మంది ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్రావు, ఫారుఖ్ హుస్సేన్, జెడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. -
దశాబ్దాల స్వప్నం సాకారమైంది!
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. సిద్దిపేట– సికింద్రా బాద్ రైలును నిజామాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా మంగళవారం సాయంత్రం 4:20 గంటలకు ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి హరీశ్రావు జెండా ఊపి ప్రారంభించి.. అనంతరం రైలులో ప్రయా ణించారు. కొండపాక మండలం దుద్దెడ స్టేషన్లో దిగి కొండపాక మండలంలో ప లు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే రైలులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు గజ్వేల్ వరకు ప్రయాణించారు. బీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీ నినాదాలు.. రైలు ప్రారంభోత్సవం సందర్భంగా సిద్ది పేట రైల్వే స్టేషన్కు బీఆర్ఎస్, బీజేపీ కార్య కర్తలు భారీగా చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు వల్లే సిద్దిపేటకు రైలు వచ్చిందని, బీజేపీ కార్యకర్తలు మోదీ వలనే సిద్దిపేటకు రైలు వచ్చిందని పోటాపోటీగా నినాదాలు చేశారు. ప్ల కార్డులు, తమ పార్టీకి చెందిన జెండాలు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే మంత్రి హరీశ్రావు రైలు ప్రారంభించేందుకు అక్కడకు చేరుకున్నారు. ప్లెక్సీలో సీఎం కేసీఆర్, స్థానిక ఎంపీ ఫొటోలను ఏర్పాటు చేయకపోవడంతో రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అహసనం వ్యక్తం చేస్తూ మోదీ చిత్రాలను ప్రదర్శిస్తున్న ఎల్ఈడీ టీవీని పక్కన పెట్టించారు. అప్పటికే బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఉద్రి క్తత నెలకొంది. స్టేజీ పైన మోదీ చిత్రంతో ఏర్పాటు చేసిన ప్లెక్సీని చింపేశారు. దీంతో కార్యకర్తలు పరస్పరం బాహాబాహీకి దిగారు. కుర్చీలు, పార్టీల జెండాలను విసురుకోవడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి తదితరులకు స్వల్పంగా గాయాలయ్యాయి. రైల్వే పోలీసు చంద్రశేఖర్కు తలకు కూడా గాయమైంది. సొమ్ము ఒకడిది...సోకు ఒకడిది: హరీశ్ సిద్దిపేటకు రైల్వే లైన్ కోసం రూ. 310 కోట్ల వ్య యంతో 2,508 ఎకరాల భూమిని సేకరించి రైల్వే శాఖకు ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.330 కోట్లను చెల్లించామని మంత్రి హరీశ్రావు చెప్పారు. ఇంత కష్టపడితే కనీసం సీఎం ఫొటోను పెట్టకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుద్దెడ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత కొండపాక ఐవోసీ బిల్డింగ్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. బీజేపీ వాళ్లు రైలు వాళ్ల వల్లే వచ్చిందని చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. -
యాప్ తప్పుడు సమాచారంతో.. ఆగని రైలు..! ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు..!!
మహబూబాబాద్: ‘షిర్డీ’ ఎక్స్ప్రెస్కు కేసముద్రం రైల్వేస్టేషన్లో హాల్టింగ్ లేదు. అయినా ఓ యాప్లో హాల్టింగ్ చూపడంతో ప్రయాణికులు సోమవారం ఆ రైలు ఎక్కారు. తీరా ఆగకుండా వెళ్లడంతో గందరగోళానికి గురయ్యారు. ‘షిర్డీ’ ఎక్స్ప్రెస్కు కేసముద్రం రైల్వేస్టేషన్లో హాల్టింగ్ ఉండగా, ఇటీవల రద్దు చేశారు. అయితే ఓ యాప్లో హాల్టింగ్ ఉన్నట్లు చూపడంతో కేసముద్రంలో దిగాల్సిన ప్రయాణికులు పలు రైల్వే స్టేషన్లలో ఆ రైలు ఎక్కారు. తీరా చూస్తే డౌన్లైన్లో కేసముద్రంలో ఆగకుండా వెళ్లడంతో మహబూబాబాద్లో దిగారు. అలాగే, అప్లో లూప్లైన్ మీదుగా ఆగకుండా వెళ్తుండడంతో రైలులో ప్రయాణిస్తున్నవారితోపాటు, ప్లాట్ఫాంపై ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు పెట్టారు. దీంతో స్టేషన్లో రైలును నిలిపారు. అనంతరం యథావిధిగా ముందుకు కదిలింది. మొత్తానికి ఓ యాప్ తప్పుడు సమాచారం చూపడంతో గందరగోళానికి గురైనట్లు పలువురు ప్రయాణికులు తెలిపారు. -
ఏం టాలెంట్ సామీ నీది? బెర్త్ అదుర్స్!
‘నిదుర పోరా తమ్ముడా’ అని పాడింది లతా మంగేష్కర్. ‘కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది’ అన్నాడు ఆత్రేయ. ‘నిదర ముదర పోయాక పాడె వొక్కటే వల్లకాడు ఒక్కటే’ అన్నాడు జాలాది. నిజమే. నిద్ర పట్టాక, గాఢంగా నిద్ర కమ్ముకున్నాక మనం ఎక్కడ పడుకున్నామో ఎక్కడ తెలుస్తుంది? అందుకే నిద్ర సుఖమెరగదు అన్నారు పెద్దలు. అదేం ఖర్మోగాని రైలెక్కితే నిద్ర పోవాలనిపిస్తుంది. బెర్తులున్నవారు చక్కా తొమ్మిది దాటగానే దుప్పట్లు పరుచుకుని, కప్పుకుని గుర్రుపెడతారు. మరి జనరల్లో ఉన్నవారో?పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటుంటుంది. మన రైల్వే వారు జనరల్ కంపార్ట్మెంట్కు ఇదే సూత్రం అప్లై చేస్తారు. ఎంతమందెక్కినా ఏదో ఒక మూల కూలబడతారని టికెట్లు తెగ ఇస్తారు. ఎక్కాక బాత్రూమ్కు వెళ్లడానికి కూడా వీల్లేని తాకిడి. జనరల్లో ఎవరెక్కుతారు? బీదసాదలు. కాయకష్టం చేసి సొంత ఊరికో, ఏదో కొంపలంటుకు పోయే వర్తమానం అందినందుకో అప్పటికప్పుడు టికెట్ కొనుక్కుని ఎక్కుతారు. లేకపోయినా ఎక్కుతారు. నిద్రకు టికెట్తో పని లేదు. కిటికీల్లో నుంచి చల్లగాలి తగులుతుంటే, వెళ్లే రైలు ఊయల వలే ఊగుతుంటే ఎలాగైనా చోటు చూసుకుని పడుకో అంటుంది.రెండు బెర్తుల మధ్య కింద పడుకునేవారు ఎప్పుడూ కనపడతారు. లగేజ్ స్టాండ్ ఎక్కి నిద్రపోయేవారు కూడా మన దేశంలో విరివిగా విస్తృతంగా ఉన్నారు. అయితే ఈ కుర్రవాడు మాత్రం అసాధ్యుడు. పైన ఉన్న రెండు బెర్తులకు దుప్పటి కట్టి ఒక బెర్తు సృష్టించాడు. ఆ తర్వాత దానిలోకి జారి ఒళ్లెరగని నిద్రపోయాడు. హాతిమ్ ఇస్మాయిల్ అనే కేరళ ట్రావెలర్ ఈ వీడియో తీసి పోయిన నెల ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఇప్పటికి 10 లక్షల లైక్స్ వచ్చాయి. అంత మంచి సెటప్ చేసుకుని నిద్రపోతున్నవాణ్ణి చూసి కొందరు కుళ్లుకున్నారు. కొందరు దుప్పటి నాణ్యతను శ్లాఘించారు. మరికొందరు ఇకపైన స్లీపర్ బుక్ చేసుకోకుండా ఇదే ఫార్ములా వాడుతానని అన్నారు. ఆగ్రా రైలు ఇలాగే ఉంటుందని మరొకరు అన్నారు.ఈ మధ్య జనరల్ కంపార్ట్మెంట్లు పెరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. జనరల్ కంపార్ట్మెంట్లు ఎందుకు తక్కువ ఉంటాయో రైల్వేవారు ఎప్పుడూ చెప్పరు. ప్రభుత్వాలకు ఓట్లు కావాలి. వారి మాటలకు పగటి కలలు చూసే జనం బోగీల్లో ఇలాంటి నిద్రకే ఉపక్రమించాలి. (చదవండి: కళ్లు మూసుకొని... కళ్లు చెదిరే విజయం)