నిలిచిన వందేభారత్‌ | Vande Bharat stopped due to rains: Andhra pradesh | Sakshi
Sakshi News home page

నిలిచిన వందేభారత్‌

Published Tue, Oct 15 2024 2:23 AM | Last Updated on Tue, Oct 15 2024 2:23 AM

Vande Bharat stopped due to rains: Andhra pradesh

వర్షాల కారణంగా మాచవరంలో దెబ్బతిన్న ట్రాక్‌

మరమ్మతుల తర్వాత కదిలిన రైలు

బాపట్ల టౌన్‌: వర్షాల కారణంగా ట్రాక్‌ దెబ్బతినడంతో బాపట్ల ప్రాంతంలో వందేభారత్‌ రైలు సుమారు గంటన్నరకుపైగా నిలిచి­పోయింది. చెన్నై నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న వందేభారత్‌ రైలు సోమవారం సాయంత్రం 6.12 గంటలకు ఒంగోలు నుంచి బయలు­దేరింది. 7.45 గంటలకు గుంటూరు చేరుకోవాల్సి ఉంది.

7 గంటలకు పొన్నూరు మండలం మాచవరం రైల్వేస్టేషన్‌ ప్రాంతానికి చేరుకునే సమయానికి మాచవరం సమీపంలో ట్రాక్‌ దెబ్బతిన్న సమాచారం అందుకున్న లోకో పైలట్‌  రైలు నిలిపేశాడు. ట్రాక్‌ ఏ ప్రాంతంలో దెబ్బతిందో.. ఎంతమేర దెబ్బతిందనే విషయంపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో రైలును మాచవరం నుంచి అప్పికట్ల రైల్వేస్టేషన్‌ వరకు వెనక్కి తీసుకొచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో ట్రాక్‌ మరమ్మతు చేయడంతో రైలు యధా­విధిగా గుంటూరు వైపు ప్రయాణించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement