damage
-
సెక్రటేరియట్లో పెచ్చులు.. మంత్రి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్లోసీఎం చాంబర్ పక్కన పెచ్చులు ఊడిన ఘటనపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. ఈ విషయమై శుక్రవారం(ఫిబ్రవరి14) కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రెయిలింగ్ ఊడిన ఘటనపై విచారణ చేయాలని ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రెటరీని ఆదేశించినట్లు తెలిపారు.విచారణ నివేదిక వచ్చాక అసలు విషయం ఏంటనేది తెలియజేస్తాం.ప్రభుత్వానికి రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) లాంటి ప్రధానమైన పనులు చాలా ఉన్నాయి.పెచ్చులు ఊడటం చిన్న విషయం..ఆ అంశాన్ని అధికారులు చూసుకుంటారు’అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.కాగా, ఇటీవల తెలంగాణ సచివాలయంలో పీవోపీ పార్టిషన్ స్వల్పంగా కూలింది. పెచ్చులు ఊడిపడ్డాయి. సీఎం ఛాంబర్ అంతస్తులో పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడి కింద ఉన్న రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారుపై పడ్డాయి. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పెచ్చులు ఊడిపడడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు.పీఓపీ పెచ్చులు ఊడి పడటంతో అధికారులు, భదత్రా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇటీవలే కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయం పీఓపీ కూలడం చర్చనీయాంశంగా మారింది. సచివాలయ నిర్మాణ లోపాలపై చర్చ జరుగుతోంది. -
పదేళ్లు.. ప్రకృతి నష్టం
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లలో ప్రకృతి వైపరీత్యం రాష్ట్రానికి పెద్ద నష్టమే చేసిందని గణాంకాలు చెబుతున్నాయి. వడగళ్లు, కరువు, భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్, అకాల వర్షాలు, వరదలు, అధిక వేడి, పిడుగుల్లాంటి ఘటనల కారణంగా భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 16వ ఆర్థిక సంఘానికి నివేదించిన లెక్కల ప్రకారం గత పదేళ్ల కాలంలో (2015–2024) ప్రకృతి వైపరీత్యాల కారణంగా వేల కోట్ల రూపాయల విలువైన నష్టం జరిగింది. ఒక్కో ఏడాది ఒక్కో రకమైన వైపరీత్యం కారణంగా ఇప్పటివరకు 371 మంది చనిపోయినట్టు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక, మూగజీవాలు అయితే లక్షకు పైగా మృత్యువాత పడ్డాయి. మొత్తం 80 వేల ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాదాపు 40 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. వీటన్నింటి విలువ రూ.1,500 కోట్ల వరకు ఉందని ప్రభుత్వ నివేదికలో పేర్కొన్న గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
నిలిచిన వందేభారత్
బాపట్ల టౌన్: వర్షాల కారణంగా ట్రాక్ దెబ్బతినడంతో బాపట్ల ప్రాంతంలో వందేభారత్ రైలు సుమారు గంటన్నరకుపైగా నిలిచిపోయింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందేభారత్ రైలు సోమవారం సాయంత్రం 6.12 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరింది. 7.45 గంటలకు గుంటూరు చేరుకోవాల్సి ఉంది.7 గంటలకు పొన్నూరు మండలం మాచవరం రైల్వేస్టేషన్ ప్రాంతానికి చేరుకునే సమయానికి మాచవరం సమీపంలో ట్రాక్ దెబ్బతిన్న సమాచారం అందుకున్న లోకో పైలట్ రైలు నిలిపేశాడు. ట్రాక్ ఏ ప్రాంతంలో దెబ్బతిందో.. ఎంతమేర దెబ్బతిందనే విషయంపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో రైలును మాచవరం నుంచి అప్పికట్ల రైల్వేస్టేషన్ వరకు వెనక్కి తీసుకొచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో ట్రాక్ మరమ్మతు చేయడంతో రైలు యధావిధిగా గుంటూరు వైపు ప్రయాణించింది. -
వాయుగుండాలు.. పెనుగాలులు.. క్లౌడ్ బరస్ట్!
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లా ఏటూరునాగారం–తాడ్వాయి అటవీ ప్రాంతంలోని 332 హెక్టార్ల పరిధిలో ఆగస్టు 31న సుమారు 50 వేల చెట్లు నేలకూలడానికి గల శాస్త్రీయ కారణాలపై శాస్త్రవేత్తలు, నిపుణులు అటవీశాఖ అధికారులతో చర్చించారు. మంగళవారం హైదరాబాద్లోని అరణ్య భవన్లో పీసీసీఎఫ్ డోబ్రియాల్ ఆధ్వర్యంలో ఈ అంశంపై వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), జాతీ య వాతావరణ పరిశోధన ప్రయోగశాల (ఎన్ఏఆర్ఎల్), ఎ¯న్జీఆర్ఐ, ఐఎండీ శాస్త్రవేత్తలు, ఎ¯న్ఐటీ వరంగల్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏకకాలంలో ఏర్పడిన వాయుగుండాల వల్ల పెను గాలులు వీయడంతోపాటు కుంభవృష్టి (క్లౌడ్ బరస్ట్ ) వర్షాలు కురవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఏటూరునాగారం అటవీ ప్రాంతంలోని సారవంతమైన నేల కూడా భారీ స్థాయిలో చెట్లు కుప్పకూలేందుకు దారితీసిందని భావిస్తున్నట్లు చెప్పారు. అక్కడి నేలలో చెట్లు త్వరగా ఎదగడం వల్ల వాటి వేర్లు భూమి లోపలకు బదులు అడ్డంగా విస్తరించడం వల్ల చెట్లు 130– 140 కి.మీ. వేగంతో వీచిన పెను గాలులను తట్టుకోలేక పడిపోయి ఉండొచ్చన్నారు. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులతో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. అయితే చెట్లు కూలిన ప్రదేశంలో సారవంతమైన భూమి ఉన్నందున చెట్ల పునరుజ్జీవనానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. త్వరలో కేంద్ర, రాష్ట్రాలకు నివేదిక.. పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ మాట్లాడుతూ చెట్లు నేలకొరిగిన ప్రాంతంలో కలుపు మొక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని తద్వారా చెట్లు త్వర గా పెరిగే అవకాశం ఉంటుందని అటవీ సిబ్బందిని ఆదేశించారు. అంతకుముందు ములుగు డీఎఫ్వో రాహుల్ కిషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అటవీ నష్టాన్ని శాస్త్రవేత్తలకు వివరించారు. వర్క్షాపులో వెల్లడైన అభిప్రాయాలు, సూచనలతో త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమరి్పంచాలని అటవీ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తి
సాక్షి, అమరావతి: వరద నష్టం ఎన్యూమరేషన్ పక్కాగా జరగాలని, నష్టపోయిన ప్రతి బాధితునికి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరద నష్టం ఎన్యూమరేషన్, బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు శుక్రవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా 2,13,456 ఇళ్లు నీట మునిగాయని, ఇప్పటి వరకు 84,505 ఇళ్లలో నష్టం అంచనా లెక్కలు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. వేలాది ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు పాడైపోయాయని, 2,14,698 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, ఎన్యూమరేషన్లో రీ వెరిఫికేషన్ చేసి ప్రతి బాధితుడికి జరిగిన నష్టాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, పరిహారం విషయంలో కూడా శాస్త్రీయంగా ఆలోచన చేసి జాబితా రూపొందించాలని సూచించారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే ఈ నెల 17వ తేదీన బాధితులకు సాయం అందజేద్దామని పేర్కొన్నారు. రుణాలు రీషెడ్యూల్ చేయండి: సీఎం వరద బాధితులకు వివిధ ఏజెన్సీలు అందించే సర్వీసులపై శుక్రవారం సాయంత్రం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈలు నడుపుతున్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని, వారి బ్యాంక్ రుణాలు రీ షెడ్యూల్ చేయాలని, ఈఎంఐల చెల్లింపునకు గడువు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష అనంతరం ఆయన బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. -
కేంద్ర ప్రభుత్వాన్ని రూ.6,880 కోట్లు అడిగాం
సాక్షి, అమరావతి: వరద నష్టాలను ప్రాథమికంగా అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. వరద వల్ల రాష్ట్రానికి రూ.6,880 కోట్ల నష్టం కలిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని, ఈ మేరకు తక్షణ సాయం అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. ఆదివారం విజయవాడ కలెక్టరేట్లో మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వినాయక చవితి రోజు బుడమేరు మూడో గండిని ఆర్మీ సాయంతో విజయవంతంగా పూడ్చినట్టు చెప్పారు. వరద వచ్చి వారం రోజులైనా తగ్గకపోవడంతో ప్రజలు ఆవేశంగా ఉన్నారని, శనివారం కూడా రాజరాజేశ్వరిపేటలో 4 అడుగుల నీరు ఉందని వ్యాఖ్యానించారు. రెండు రోజుల వర్షాలపై అప్రమత్తం చేశాంరానున్న రెండు రోజుల్లో శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించినట్టు సీఎం చెప్పారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనుండటంతో ఏలేరు రిజర్వాయర్ నిండి దిగువ ప్రాంతమైన పిఠాపురం పరిసర ప్రాంతాలకు వరద ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఏలేరు నదికి సోమ, మంగళ వారాల్లో 10 వేల నుంచి 20 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ఏలేరు రిజర్వ్యర్లో 21 టీఎంసీల నీరు ఉండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బుడమేరు నుంచి వరద కొల్లేరుకు చేరుతుండటంతో నందివాడ మండలం ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. విజయవాడ ముంపు ప్రాంతాల్లో వరద నీరు క్రమేపీ తగ్గుతోందని, వర్షాలు లేకపోతే సోమవారం సాయంత్రానికి మొత్తం నీరు లాగేస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రానున్న 36 గంటల్లో ఎంత వర్షం నీరు వస్తుందన్న అంచనాలు వేసుకుని దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు.ఆపరేషన్ బుడమేరుభవిష్యత్లో విజయవాడకు వరద భయం లేకుండా ఆపరేషన్ బుడమేరు చేపడుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. బుడమేరు చుట్టుపక్కల ఆక్రమణలు తొలగించి నీరు వేగంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బుడమేరు సామర్థ్యాన్ని 10–15 వేల క్యూసెక్కులకు పెంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. -
8 శాఖలు.. రూ.339.46 కోట్లు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలతో ఎనిమిది శాఖల పరిధిలో ప్రధానంగా నష్టం ఎదురైందని అ«ధికార యంత్రాంగం గుర్తించింది. ఆయా శాఖల పరిధిలో రూ. 339.46 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసింది. మొత్తంగా 15,201 ఇళ్లు దెబ్బతినగా అందులో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 6,500, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 8 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని లెక్కగట్టింది. రెవెన్యూ, పశుసంవర్థక శాఖ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయ, మత్స్య శాఖల పరిధిలో నష్టంపై ప్రభుత్వానికి యంత్రాంగం నివేదిక పంపింది. ముఖ్యంగా 53,528 మంది రైతులకు సంబంధించి 79,914 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల రూ. 111.87 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా వరదలతో 76 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వానికి నివేదించారు. అలాగే 45 చెరువులకు గండ్లు పడ్డాయని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారంపై బాధితులు మండిపడుతున్నారు. వరద ఉధృతికి ఇళ్లు కొట్టుకుపోయిన తమకు ప్రభుత్వం అరకొర సాయం చేస్తే ఎలా సరిపోతుందని ప్రశి్నస్తున్నారు. -
కేంద్రం ఆదుకోవాలి... తక్షణ సాయం అందించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరద బీభత్సంతో అపారనష్టం వాటిల్లిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు వివరించారు. రాష్ట్రంలో వరద నష్టం దాదాపు రూ.5,438 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలిపారు. సమగ్రంగా అంచనాలు వేసిన తర్వాత ఈ నష్టం మరింత పెరిగే అవకాశముందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి వచి్చన కేంద్రమంత్రి శివరాజ్సింగ్చౌహాన్, బండి సంజయ్తో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం సాయంత్రం సచివాలయంలో సమావేశమయ్యారు.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఖమ్మం, మహబూబ్నగర్, సూర్యాపేటతోపాటు పలు జిల్లాల్లో ఒకే రోజు అత్యధికంగా 40 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసిందని, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించటంతో భారీ ప్రాణనష్టం తప్పిందని, కానీ వరద నష్టం భారీగా జరిగిందని సీఎం వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని దృశ్యాలను సమావేశంలో పవర్పాయింట్ ప్రజెంటేషన్తోపాటు ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర మంత్రులకు చూపించారు.మహబూబాబాద్ జిల్లాలో వరదలో కట్ట కొట్టుకుపోవటంతో వేలాడుతున్న రైల్వే ట్రాక్ పరిస్థితిని, రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. తెగిన చెరువులు, కుంటలు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల తాత్కాలిక మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం తక్షణసాయం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. వీటిని శాశ్వతంగా పునరుద్ధరించే పనులకు తగినన్ని నిధులు కేటాయించాలని కోరారు. ఆయిల్ పామ్ రైతులకు సరైన ధర కలి్పంచండి: తుమ్మల విన్నపం ఆయిల్ పామ్ రైతులకు సరైన ధర వచ్చే విధంగా చూడాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్చౌహాన్కు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విన్నవించారు. తెలంగాణలో కొబ్బరి తోటలకు సంబంధించి ఒక రీజినల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్గానిక్ ఫారి్మంగ్ను అశ్వారావుపేట (ట్రైబల్, నాన్ ట్రైబల్ శిక్షణ)లో ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన చౌహాన్ త్వరలోనే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.నిబంధనలను సడలించాలి విపత్తు నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ఇప్పుడు అమల్లో ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించాలని సీఎం రేవంత్రెడ్డి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వరద బాధిత ప్రాంతాల్లో తక్షణ మరమ్మతులకు, శాశ్వత పునరుద్ధరణ పనులకు అంశాల వారీగా నిర్దేశించిన యూనిట్ రేట్లు కూడా పెంచాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వరదలతో దెబ్బతిన్న చెరువులు, కుంటల తక్షణ మరమ్మతులకు కనీసం రూ.60 కోట్లు అవసరమవుతాయని, ఇప్పుడున్న నిర్ణీత రేట్ల ప్రకారం రూ.4 కోట్లు కూడా విడుదల చేసే పరిస్థితి లేదని అధికారులు వివరించారు. ఏపీకి ఎలా సాయం అందిస్తారో అదే తీరుగా తెలంగాణకూ కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. విపత్తులు సంభవించినప్పుడు ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేసే విషయంలో పారీ్టలు, రాజకీయాలకు తావులేదని కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. -
ఎస్డీఆర్ఎఫ్ కింద రూ.3,448 కోట్లు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎఫ్) కింద రూ.3,448 కోట్లు వెంటనే విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వరద ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు అక్కడి రైతులను, ప్రజలను కలిసి పరిస్థితులను అంచనా వేసిన అనంతరం.. రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్రెడ్డి, చంద్రబాబులతో చర్చించిన తర్వాత ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.రెండు రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో సాయం అందించడానికి కట్టుబడి ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణలో పంటలు దెబ్బతిన్న మీనవాలు, పెద్దగోపవరం, మన్నూరు, కట్టలేరు పరిశీలించడంతో పాటు ఖమ్మంలో మున్నేరు వరదను ఏరియల్ సర్వే చేసినట్లు వెల్లడించారు. ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ అందర్నీ ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. నష్టం అంచనా వేసిన తర్వాత పరిహారంపై నిర్ణయం వరదల వల్ల జరిగిన పంటనష్టాన్ని అంచనా వేసిన తర్వాత ఏ మేరకు నష్టపరిహారం ఇవ్వాలన్నది నిర్ణయిస్తామని చౌహాన్ చెప్పారు. వరదల్లో అరటి, పసుపు, కూరగాయ ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ఇది ఊహించని విపత్తు అని మంత్రి వ్యాఖ్యానించారు. రైతులను ఆదుకోవడం, పంటల బీమా పథకం అమలు, రైతులు పొలాల్లో పనిచేసుకునే పరిస్థితులు కలి్పంచడం, తదుపరి పంటలు వేసుకునేలా సహకరించడం.. కేంద్ర ప్రభుత్వ నాలుగు ప్రాథమ్యాలని పేర్కొన్నారు. ఎరువులు, విత్తనాలకు ఎలాంటి లోటు లేకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
రాజకీయాలకు కాదు..రైతుల కోసం వచ్చాం
కూసుమంచి: ‘భారీగా వరదలు వచ్చాయి.. రైతులు ఎంతో నష్ట పోయారు. ఈ నష్టాన్ని కళ్లారా చూశాను. రైతులను ఆదుకునేందుకే నేనూ, హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మీ వద్దకు వచ్చామే తప్ప రాజకీయాల కోసం కాదు’ అని కేంద్ర వ్యవసా యశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు శుక్రవారం కేంద్రమంత్రులు శివరాజ్సింగ్ చౌహాన్, బండి సంజయ్ ఖమ్మం జిల్లాకు వచ్చారు. ముందుగా ఖమ్మం నగరంలోని ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించాక.. కూసుమంచి మండలానికి చేరుకున్నారు.అక్కడ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి జాతీయరహదారి గుండా వెళుతూ పాలేరువాగు వద్ద దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పాలేరు వద్ద ఎడమకాల్వకు పడిన గండి, నర్సింహులగూడెం వద్ద దెబ్బతిన్న వరిని పరిశీలించి నష్టంపై ఆరా తీశారు. ఆ తర్వాత నవోదయ విద్యాలయంలో ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో వరద నష్టంపై ఆయా జిల్లాల అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు.నేనూ రైతునే..వరదలకు వరి, మిర్చి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు ఏరియల్ సర్వే ద్వారా గమనించానని కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ తెలిపారు. తాను రైతునేనని, రైతుల కష్టా లు తెలుసునని చెప్పారు. వందేళ్లలో ఇవే భారీ వర దలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పగా.. వాస్తవాన్ని చూసి చలించిపోయానన్నారు. ఒక్క పంటలే కాకుండా ఇళ్లు, వస్తువులు దెబ్బతినగా జంతు వులు మృత్యువాత పడ్డాయని, రైతులు ఈ వరదల్లో పంటలనే కాదు, వారి జీవనాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి రైతులకు ఎలా మేలు చేయా లో నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని, అందుకే ఇప్పుడు రైతులు తీవ్రంగా నష్టపో వాల్సి వచ్చిందని మంత్రి చౌహాన్ తెలిపారు.రైతు కన్నీరు.. ఓదార్చిన కేంద్ర మంత్రినవోదయ విద్యాలయంలో రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేయగా కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన రైతు హలావత్ వెంకన్న హిందీలో మాట్లాడారు. వరదలతో తాము సర్వస్వం కోల్పోయామని, ఆశలన్నీ గల్లంతయ్యాయని కన్నీరు పెడుతూ కేంద్రమంత్రి చౌహాన్ కాళ్లపై పడబోగా ఆయన రైతును పైకి లేపి ఓదార్చారు. ‘మీ బాధలు కళ్లారా చూశాను.. కంటనీరు రానివ్వం’ అని భరోసా కల్పించారు. పర్యటన అనంతరం నాయ కన్గూడెం టోల్ప్లాజా నుంచి కేంద్ర మంత్రులతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి, తుమ్మల ఒకే హెలికాప్టర్లో హైదరాబాద్ బయలుదేరారు. -
నష్టం అంచనాకు ప్రత్యేక యాప్
సాక్షి, అమరావతి: వరద ముంపు ప్రాంతంలో దెబ్బతిన్న వ్యాపారులు, నష్టపోయిన ఇంటి వస్తువులను అంచనా వేయడానికి ప్రత్యేక యాప్ ద్వారా సర్వే చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తాము తిరిగి నిలదొక్కుకోగలము అన్న ధీమా కల్పించేలా బాధితులకు ప్యాకేజీని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆయన గురువారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇంట్లో చెడిపోయిన వస్తువులను బాగు చేయడానికి వర్కర్లను ఏర్పాటు చేస్తామని, అవసరమైతే ఉబరైజేషన్ (ఆన్లైన్ ద్వారా వినియోగదారులకు సేవలందించే సంస్థలు) సేవలను కూడా వినియోగించుకుంటామని తెలిపారు.వరద ప్రాంతాల్లో ఈ నెల విద్యుత్ బిల్లులను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. తక్షణం కుళాయిల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నా, వాటిని రెండు రోజుల పాటు వంటకు, తాగడానికి వినియోగించవద్దని సూచించారు. రెండు రోజుల్లోగా రేషన్, శానిటేషన్, టెలీకమ్యూనికేషన్, విద్యుత్ సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు రోజుకు 80,000 మందికి చొప్పున నూడుల్స్ ప్యాకెట్లు, ఆరు యాపిల్స్, ఆరు బిస్కట్లు, పాలు, వాటర్ బాటిళ్లు అందిస్తామని, చౌకగా కూరగాయలు కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బుడమేరులో వరద తిరిగి కొద్దిగా పెరుగుతోందని, 6,000 క్యూసెక్కుల వరకు వస్తే నగరంలోకి తిరిగి కొద్దిగా నీళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మూడో గండి కూడా పూడిస్తే నగరంలోకి నీళ్లు వచ్చే ప్రమాదం తప్పిపోతుందన్నారు. ఈ గండిని పూడ్చడానికి ఆర్మీ రంగంలోకి దిగినట్లు తెలిపారు. -
అంటగట్టారు!
నల్లగొండ రూరల్/గుర్రంపోడు/ తిప్పర్తి/నిడమనూరు: రంగాపూర్ వెరైటీ బత్తాయి మొక్కలతో రైతులు నిండా మునిగారు. పూత, కాత బాగానే ఉన్నా, కాయ సైజు పెరగలేదు. పైగా నిమ్మకాయల సైజులో ఉండగానే పసుపు రంగులోకి మారి రాలిపోయాయి. తిరుపతిలోని ఉద్యాన యూనివర్సిటీ నుంచి బత్తాయిలో రంగాపూర్ రకం మొక్కలు తీసుకొచ్చి సాగు చేసిన సుమారు 200 మంది రైతులు రూ.60 కోట్ల మేర నష్టపోయారు. దీంతో కొందరు రైతులు ఓ సంఘంగా ఏర్పడి ఉద్యాన కమిషనర్కు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అధికారులు నివేదికను ఆశాఖకు పంపించారు.శాస్త్రవేత్తల ప్రచారంతో..ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2014 కంటే ముందు సాగుచేసిన జంబేరి మొక్కలు అతివృష్టి, అనావృష్టి, వాతావరణ పరిస్థితుల కారణంగా క్షీణిన్నాయి. అప్పట్లో జిల్లాలో పర్యటించిన ఉద్యాన శాస్త్రవేత్తలు పరిశో«ధనా కేంద్రాల్లో లభించే రంగాపూర్ వేరు మూలంపై అంటుగట్టిన సాత్గుడి రకం బత్తాయి మొక్కలు నాటుకోవాలని ప్రచారం చేశారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతి, మహానంది, పెట్లూరు, రైల్వే కోడూరు, మల్లేపల్లి పరిశోధన కేంద్రాల్లోని అంటు మొక్కలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.2014 నుంచి..తిరుపతిలోని ఉద్యాన యూనివర్సిటీ నుంచి నల్లగొండ జిల్లాకు చెందిన రైతులు రంగాపూర్ వెరైటీ బత్తాయి మొక్కలు తీసుకురావడం 2014లో మొదలైంది. సాధారణంగా ఐదునుంచి ఆరు సంవత్సరాలలోపు కాతకు వచ్చి దిగుబడి ఇస్తాయి. కానీ రంగాపూర్ వెరైటీ బత్తాయి మాత్రం కాపు వచ్చినా, కాయలు, రంగుమారి, రాలిపోవడంతో దిగుబడిపై ప్రభావం చూపింది. తాము నష్టపోవడానికి మొక్కల నాణ్యత లోపాలే కారణమని గుర్రంపోడు, నల్లగొండ, తిప్పర్తి, నిడమనూరు, కనగల్ మండలాల్లో సుమారు 400 ఎకరాల్లో ఈ రకం సాగు చేసిన సుమారు 70 మంది రైతులు నిర్ధారణకు వచ్చి ఈనెల 11న రాష్ట్ర ఉద్యాన కమిషనర్కు ఫిర్యాదు కూడా చేశారు.నాసిరకం మొక్కల విషయమై నాగాపూర్ శాస్త్రవేత్తలతో శాస్త్రీయ పరిశోధన చేయించాలని ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై నల్లగొండ కలెక్టర్ ఉద్యాన అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ70 మంది రైతులు రూ.21కోట్ల మేర నష్టపోయారు. దీనిపై విచారణ చేసిన అధికారులు ఉద్యానశాఖకు నివేదిక సమర్పించారు. చాలామంది రైతులు ఇప్పటికే తోటలు తొలగించగా, బిల్లులు లేని కారణంగా ఫిర్యాదు చేయని వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎకరానికి రూ.6లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు గుర్రం శ్రీనివాస్రెడ్డి. ఈయనది నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని తిప్పలమ్మగూడెం. 2019లో తిరుపతి ఉద్యాన యూనివర్సిటీ నుంచి 700 రంగాపూర్ వెరైటీ బత్తాయి మొక్కలను తీసుకొచ్చి ఐదు ఎకరాల్లో నాటాడు. మొక్కలకు రూ.49వేలు, గుంతలు తీసి నాటినందుకు రూ.50వేలు ఖర్చు చేశాడు.మొక్కలు నాటినప్పటి నుంచి ఎకరానికి ఏడాదికి రూ.80వేల చొప్పున నిర్వహణ ఖర్చులయ్యాయి. అన్ని యాజమాన్య పద్ధతులు పాటించడంతోపాటు ఉద్యాన వన అధికారుల సలహాలు, సూచనలు తీసుకున్నాడు. దిగుబడి ఎకరానికి 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి రావాల్సి ఉంది. కానీ రెండు నుంచి రెండున్నర టన్నుల వరకు దిగుబడి వస్తోంది. గతనెల 27న తిçరుపతి వర్సిటీ నుంచి వచ్చిన ఈ బత్తాయి తోటను పరిశీలించారు. అనంతరం శాంపిల్స్ సేకరించారు. కానీ ఇప్పటి వరకు ఆ రైతు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.ఇతడు నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం జొన్నలగడ్డగూడెం గ్రామానికి చెందిన రైతు చిర్ర భూపాల్రెడ్డి. రంగాపూర్ బత్తాయి వెరైటీ అధిక దిగుబడులు, చీడపీడలనుంచి తట్టుకుంటుందని ఎనిమిది ఎకరాల్లో సాగుచేశాడు. ఆరున్నర సంవత్సరాలు గడిచినా నేటికి దిగుబడి రావడం లేదు. దీంతో మూడు ఎకరాల తోటను తొలగించాడు. ఇప్పటి వరకు రూ.30లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. కాయలు కాస్తున్నా, సైజురాక పసుపురంగులోకి మారి రాలిపోతున్నాయి.మంచి సైజుకు రాకముందే రాలుతున్నాయితిరుపతి పరిశోధన కేంద్రం నుంచి 450 మొక్కలు తెచ్చి 2016లో నాలుగున్నర ఎకరాల్లో నాటాను. ఎనిమిదేళ్లయినా సరైన పూత, కాత రావడం లేదు. 45 నుంచి 50టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా 20 టన్నులే వస్తోంది. కాయ సైజు లేకపోగా పక్వానికి రాకముందే రాలిపోతున్నాయి. – కేసాని అనంతరెడ్డి, పిట్టలగూడెం రైతుదిగుబడి బాగా వస్తుందని చెప్పిదిగుబడి బాగా వస్తుందని చెప్పి మొక్కలు అంటగట్టారు. నాకున్న మూడున్నర ఎకరాల్లో 380 మొక్కల వరకు నాటాను. మొక్కకు రూ.75 నుంచి రూ.100 వరకు వ్యయం చేసి ఏపీ నుంచి మొక్కలు తెచ్చాను. ఇప్పుడు నాలుగో కాత తెంపాల్సి ఉంది. మొక్కలకు కాయలు అంతంత మాత్రంగానే ఉండడం, కాయ బలంగా రాకపోవడం వల్ల దిగుబడి తగ్గి అనుకున్న విధంగా పెట్టుబడులు రాలేదు. – చిత్రం ప్రసాద్, మారుపాక రైతు -
సర్పంచ్ కుమారుడి కారు ధ్వంసం
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు సర్పంచ్, వైఎస్సార్సీపీ నేత వరి శ్రీదేవి కుమారుడి కారును గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈనెల 5వ తేదీరాత్రి ప్రసాదంపాడుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కొమ్మా కోట్లు కారు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే మళ్లీ అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ టీడీపీ నాయకులు ఇటువంటి దాడులకు తెగబడుతున్నారని ఆరోపిస్తున్నారు. సేకరించిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ సీపీకి చెందిన రామవరప్పాడు గ్రామ సర్పంచ్ వరి శ్రీదేవి కుమారుడు గణేష్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల రామవరప్పాడుకు తన కుటుంబంతో కలిసి కారులో వచ్చారు. తన కారును రైవస్ కాలువ వంతెన సమీపంలోని కృష్ణుడి బాల ఆలయం (కోర్టులో వేయడంతో నిర్మాణం ఆగింది) వద్ద పార్కింగ్ చేశాడు. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఇంతటితో ఆగకుండా కృష్ణుడి బాల ఆలయంలోని రాధాకృష్ణుల విగ్రహాలను దొంగిలించారు. తెల్లారిన తర్వాత కారుపై దాడి విషయాన్ని గమనించి పటమట పోలీసులకు సమాచారం అందించారు. ఘటనలు బయటకు రాకుండా పోలీసులు గోప్యంగా ఉంచడానికి గల కారణాలు ఏమిటని ప్రశి్నస్తున్నారు. పటమట సీఐ మోహన్రెడ్డిని వివరణ కోరేందుకు ప్రయతి్నంచగా ఫోన్కు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. -
Medigadda Barrage: గత సర్కారే కారణం!
సాక్షి,హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 2019 వరదల సమయంలోనే ప్రమాద సంకేతాలిచ్చింది. బ్యారేజీ దిగువన దెబ్బతిన్న భాగానికి మరమ్మతులు నిర్వహించాలని సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పలుమార్లు నిర్మాణ సంస్థను కోరారు. స్పందించిన నిర్మాణ సంస్థ మరమ్మతులు నిర్వహణ కోసం బ్యారేజీని ఖాళీ చేయాలని కోరింది. ఖాళీ చేయడానికి (గత)రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడంతోనే బ్యారేజీ పరిస్థితి నానాటికి క్షీణిస్తూ వచ్చింది.’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు 2019 వర్షాకాలంలో ప్రమాద సంకేతాలిచ్చినా, నిర్లక్ష్యం చేయడంతోనే వాటి పరిస్థితి రోజురోజుకు క్షీణించడంతో పాటు బ్యారేజీల్లోని స్ట్రక్చర్లకు నష్టం పెరిగిందా? అని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ అడిగిన ఓ కీలక ప్రశ్నకు నీటిపారుదల శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది.2019లో మేడిగడ్డ బ్యారేజీ ప్రమాద సంకేతాలిచ్చినా, ప్రాజెక్టు యంత్రాంగం సకాలంలో మరమ్మతులు, నిర్వహణ, పర్యవేక్షణ(ఓ అండ్ ఎం) చేపట్టకపోవడంతోనే బ్యారేజీ పియర్లు, ర్యాఫ్ట్ కుంగిపోయాయని మరో ప్రశ్నకు సమాధానమిచ్చింది. సుందిళ్ల బ్యారేజీ 2019లో ప్రమాద సంకేతాలిచ్చినా, మరమ్మతులు నిర్వహించడంతో ఆ తర్వాతికాలంలో పరిస్థితి క్షీణించలేదని వెల్లడించింది. బ్యారేజీలోని 46, 52, 50, 33 గేట్ల వద్ద సీపేజీ ఏర్పడగా, పీయూ గ్రౌంటింగ్ ద్వారా పూడ్చివేశారని, బ్యారేజీ దిగువన చెల్లాచెదురైన సీసీ బ్లాకులను మళ్లీ పూర్వ స్థితికి తెచ్చినట్టు నిపుణుల కమిటీకి తెలియజేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి, పరిష్కారాలను సూచించడానికి చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత మార్చిలో రాష్ట్రంలో రెండోసారి పర్యటించిన కమిటీ .. నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) జి.అనీల్కుమార్కి 25 ప్రశ్నలను అందించగా, ఆయన ఈ మేరకు రాతపూర్వకంగా బదులిచ్చారు.బ్యారేజీలు తాత్కాలిక నిల్వకే ! వరదల సమయంలో తాత్కాలికంగా నీళ్లను నిల్వ చేసి మళ్లించడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించినట్టు అయ్యర్ కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ తెలిపింది. గోదావరి నుంచి మళ్లించి త్కాలికంగా నిల్వ చేసిన నీళ్లను..మేడిగడ్డ బ్యారేజీ నుంచి అన్నారం బ్యారేజీకి...అక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజీ.. అక్కడి నుంచి ఎల్లంపల్లి బ్యారెజీకి.. అక్కడ నుంచి మిడ్మానేరు జలాశయానికి తరలించి కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు సరఫరా చేయడమే బ్యారేజీల ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది.కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి ముఖ్య ఉద్దేశాలను తెలపాలని కమిటీ కోరగా, ఈ మేరకు బదులిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను నిర్మాణం పూర్తైన నాటి నుంచి గతేడాది అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగే వరకు.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిరంతరం పూర్తిగా నీటితో నింపిపెట్టారు. దీనికి విరుద్ధంగా కేవలం వరదల సమయంలో తాత్కాలికంగా నీళ్లను నిల్వ చేయడానికే బ్యారేజీలను నిర్మించినట్టు ఇప్పుడు నీటిపారుదల నిపుణుల కమిటీకి బదులివ్వడం ఆశ్చర్యకరంగా మారింది.గత ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ లోని నిలువలను ఖాళీ చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో సకాలంలో మరమ్మతులు నిర్వహించక పోయామని, బ్యారేజీ పరిస్థితి నానాటికి క్షీణించడానికి ఇదే కారణమని చంద్రశేఖర్ అయ్యర్ కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ తెలిపిన అంశాన్ని లేఖలో చూడవచ్చు -
Telangana Rains Photos: తెలంగాణలో అకాల వర్షం కారణంగా ఆవేదనలో అన్నదాత (ఫొటోలు)
-
నిజాంసాగర్ కెనాల్కు గండి.. ఇళ్లలోకి నీరు
నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్లో నిజాంసాగర్ కెనాల్కు గండి పడింది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీకి ఆనుకొని ఉన్న నిజాంసాగర్ కెనాల్ కట్టకు ఓ చోట గండి పడింది. దీంతో కాలనీలోని ఇండ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సొమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇండ్లు పూర్తిగా వరద నీటితో మునిగిపోవటంతో..చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యమే కారణంగానే ఈ ఘటన జరిగింది అంటూ స్థానికుల ఆరోపణ చేస్తున్నారు. త్వరగా సహాయక చర్యలు మొదలు పెట్టాలని కాలనీవాసుల డిమాండ్ చేస్తున్నారు. -
ప్రమాద సంకేతాల విస్మరణతోనే నష్టమా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు 2019 వానాకాలం తర్వాత ప్రమాద సంకేతాలు ఇచ్చినా.. నివారణ చర్యలు తీసుకోకపోవడంతోనే నష్టాన్ని పెంచిందా? అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖను ప్రశ్నించింది. మూడు బ్యారేజీలను ప్రారంభించిన కొద్దిరోజులకే వాటి దిగువన రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్లింత్ శ్లాబు, సీసీ బ్లాకులు, టోయ్ వాల్, లాంచింగ్ అప్రాన్ వంటివి ఎందుకు కొట్టుకుపోయాయని నిలదీసింది. ఇటీవల మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన అయ్యర్ కమిటీ.. నీటి పారుదలశాఖలోని అన్ని విభాగాలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించింది. తిరిగి వెళ్లేప్పుడు ఒక ప్రశ్నావళిని అందించి, సీల్డ్ కవర్లో సమాధానాలు అందజేయాలని కోరింది. ప్రమాదం పొంచి ఉంటే ఏం చేశారు? బ్యారేజీలకు ప్రమాదాలు పొంచి ఉన్నట్టు/నష్టాలు జరిగినట్టు గుర్తించిన సమాచారాన్ని వరుస క్రమంలో తెలుపుతూ సమగ్ర నివేదిక సమర్పించాలని అయ్యర్ కమిటీ కోరింది. ‘‘ప్రమాదాలు పొంచి ఉన్నట్టు గుర్తించినప్పుడు తీసుకున్న చర్యలేమిటి? నిర్మాణ సంస్థలకు జారీచేసిన ఆదేశాలేమిటి? తక్షణమే నిర్మాణ సంస్థలు మరమ్మతులు నిర్వహించాయా? వంటి వివరాలు నివేదికలో ఉండాలి. ముందు జాగ్రత్త చర్యలేమైనా తీసుకుని ఉంటే తెలపాలి. తీసుకోకపోతే కారణాలు వెల్లడించాలి. బ్యారేజీలలో ఏదైనా అసాధారణ మార్పును గుర్తించిన సందర్భాల్లో పరికరాల డేటా నమోదు, విశ్లేషణ, అన్వయింపు(డేటా ఇంటర్ప్రిటేషన్), వాటి ఆధారంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసే విభాగం ఏదీ? దీనికోసం ఎలాంటి ప్రొటోకాల్స్ను అనుసరిస్తున్నారు?’’ అని ప్రశ్నించింది. జరిగిన తప్పులేమిటి? చేసింది ఎవరు? నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాల పనితీరు, సమన్వయా న్ని అర్థం చేసుకోవడానికి శాఖ మౌలిక స్వరూపం వివరాలును అయ్యర్ కమిటీ కోరింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోటుపాట్లకు బాధ్యులను తేల్చడానికి ఈ సమాచారం కీలకమని పే ర్కొంది. శాఖలోని అన్ని విభాగాల ఈఎన్సీల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు ఉన్న అధికారుల క్రమాన్ని తెలిపేలా శాఖ ఆర్గనైజేషన్ చార్ట్ను సమరి్పంచాలని కమిటీ కోరింది. ‘‘ఈఎన్సీ (జనరల్), హైడ్రాలజీ అండ్ ఇన్వెస్టిగేషన్, సీడీఓ, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్, ఓ అండ్ ఎం, ఇతర విభాగాల బాధ్యతలు, విధులు వివరించండి. బ్యారేజీల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్, రామగుండం చీఫ్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగం చీఫ్ ఇంజనీర్, ఈఎన్సీ (ఓఅండ్ఎం)లు తమపై అధికారిగా ఎవరికి రిపోర్ట్ చేస్తారు?’’ అని ప్రశ్నించింది. సీడీఓ, క్వాలిటీ సలహాలను పాటించారా? ‘‘సీడీఓ, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగాలు ఇచ్చే సలహాలు/ఆదేశాలకు ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ విభాగం కట్టుబడి ఉంటుందా? బ్యారేజీల గేట్లను ఎత్తే సమయం (ఆపరేషన్ షెడ్యూలింగ్)ను నిర్ణయించడంలో బాధ్యులు ఎవరు? ఈ విషయంలో సీడీఓ/ తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్(టీఎస్ఈఆర్ఎల్)ల సలహాను ఏమైనా ఉల్లంఘించారా?’’ అని కమిటీ ప్రశ్నించింది. ప్రాజెక్టు డీపీఆర్ను కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమరి్పంచడానికి ముందు దాని రూపకల్పన సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగేలా పర్యవేక్షణ చేసే విభాగం ఏది? దానికోసం నీటిపారుదల శాఖలో ఎలాంటి ప్రొటోకాల్స్ ఉన్నాయో తెలపాలని కోరింది. బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమా? నిల్వ కోసమా? మూడు బ్యారేజీలను నీటి నిల్వ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్, నిర్మాణం చేశారా? లేక నీటి మళ్లింపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జరిపారా? అని అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీలను ప్రారంభించిన నాటి నుంచి నిల్వ స్థాయిలను నెలవారీగా తెలియజేసే నివేదికను సమరి్పంచాలని కోరింది. బ్యారేజీలకు తనిఖీలు, మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం ఎప్పుడైనా నిల్వలను తగ్గించారా? చేస్తే వివరాలు అందించాలని సూచించింది. బ్యారేజీల నిర్మాణ ప్రారంభం, ముగింపు తేదీలను అందించాలని.. డీపీఆర్ల ప్రకారం బ్యారేజీల విశిష్టతల(సేలియంట్ ఫీచర్స్)ను తెలిపాలని పేర్కొంది. నిర్మాణంలో ఈ విశిష్టతలను పాటించారా? అని ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సమరి్పంచాలని కోరింది. సీడబ్ల్యూసీ అభ్యంతరాలను పరిష్కరించారా? డీపీఆర్ మదింపు సందర్భంగా సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఏమిటి? సీఎస్ఎంఆర్ఎస్, జీఎస్ఐ, సీజీడబ్ల్యూబీ వంటి ఇతర సంస్థల కామెంట్లు/ అబ్జర్వేషన్లు ఏమిటి? వాటిని తగిన రీతిలో పరిష్కరించారా? అని అయ్యర్ కమిటీ కోరింది. నిర్మాణ దశ డిజైన్లు ఎవరివి? నిర్మాణ దశలో మూడు బ్యారేజీల డిజైన్లు, బ్యారేజీల వివిధ విభాగాల డ్రాయింగ్స్ను రూపొందించింది ఎవరని కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి ప్రత్యామ్నాయ ప్రాంతాల ఎంపిక కోసం జరిపిన అధ్యయనాలు, ప్రస్తుత ప్రాంతాల ఎంపికను సమర్థించే కారణాలు, బ్యా రేజీల కింద భూగర్భంలో నీటి ప్ర వాహంపై చేసిన అంచనాల వివరాలను ఇవ్వాలని కోరింది. లోపాలు బహిర్గతమైన తర్వాత బ్యారేజీలకు ని ర్వహించిన సబ్సర్ఫేస్ జియోలాజికల్ పరీక్షల నివేదికలు సమరి్పంచాలని సూచించింది. లోపాలు, పునరుద్ధరణ పనులపై మీ అభిప్రాయమేంటి? ‘‘మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్, పియర్లు కుంగిపోవడానికి కారణాలేమిటి? బ్యారేజీల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి సీపేజీ జరగడానికి కారణాలేమిటి? వచ్చే వర్షాకాలంలో బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో వివరించండి’’ అని నీటి పారుదల శాఖను అయ్యర్ కమిటీ కోరింది. ఈ ప్రశ్నావళి మేరకు తగిన సమాధానాలను సిద్ధం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
ఇడ్లీ లవర్స్కు షాకింగ్ న్యూస్, జీవవైవిధ్యానికి అత్యంత ప్రమాదకారిగా
మనకెంతో ఇష్టమైన వంటకాల వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటుందంటే నమ్ముతారా? లేటెస్ట్ స్టడీ ఈ భయాల్నే రేకెత్తిస్తోంది. భారతీయులు తినే పలు ఆహార పదార్థాలు జీవ వైవిధ్యానికి ముప్పు కలిగిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 151 వంటకాలపై జరిపిన పరిశోధనల్లో కొన్ని భారతీయ వంటకాల వల్ల జీవ వైవిధ్యానికి ఎక్కువ ముప్పు ఉన్నట్టు తేలిందట. ముఖ్యంగా ఇడ్లీ, వడ, చనా మసాలా, రాజ్మా, చపాతి సహా పలు ఆహార పదార్థాలుంటం గమనార్హం. అలాగే శాకాహారం , శాకాహార వంటకాలతో పోలిస్తే మాంసాహార వంటకాలు జీవవైవిధ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతాయని అధ్యయనం చెబుతోంది. శుభవార్త ఏమిటంటే, బియ్యం , పప్పుధాన్యాల వంటకాలు అధిక స్కోర్లు ఉన్నప్పటికీ, భారత జనాభాలో ఎక్కువ భాగం శాకాహారుల కారణంగా, జీవవైవిధ్య ముప్పుకు పెద్ద ప్రమాదం లేదని పరిశోధకులు వివరించారు. బ్రెజిల్లో వాడే గొడ్డు మాంసం ,స్పెయిన్కు చెందిన రోస్ట్ లాంబ్ డిష్ , బ్రెజిల్ నుండి లెచాజో,జీవవైవిధ్యానికి అత్యధిక నష్టం కలిగించిన ఆహార పదార్థాలుగా నిలిచాయి. ఈ జాబితాలో ఇడ్లీ ఆరో స్థానంలో ఉంది. అంతేకాదు అధ్యయనం ప్రకారం ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రభావం చాలా తక్కువ. ఈ లిస్ట్లో ఆలూ పరాటా 96వ స్థానంలో, దోస 103వ స్థానంలో, బోండా 109వ స్థానంలో ఉన్నాయి. భారతదేశంలో జీవవైవిధ్యంపై అపారమైన ఒత్తిడిని ఈ అధ్యయనం నొక్కి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 151 ప్రసిద్ధ వంటకాలపై నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పరిశోధన నిర్వహించారు. పర్యావరణంపై ప్రభావం చూపించే దాదాపు 25 ప్రమాదకర ఆహారాల పదార్థాలను గుర్తించారు .యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్లోని బయోలాజికల్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ లూయిస్ రోమన్ కరాస్కో మాట్లాడుతూ, ప్రతి వంటకం దాని పదార్థాల ఆధారంగా జాతులు, అడవి క్షీరదాలు, పక్షులు ఉభయచరాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. -
మేడిగడ్డ ప్రాజెక్టుపై సంచలన రిపోర్ట్..
-
మేడిగడ్డ డొల్ల తనాన్ని కేంద్ర కమిటీ బయటపెట్టింది
-
గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ పాత్రల్లో తింటున్నారా?దీనిలోని బిస్ఫినాల్ వల్ల..
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి.గత కొన్నేళ్లుగా ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఓవైపు ప్లాస్టిక్ను నిర్మూలించాలని చెబుతున్నా మరింత ఎక్కువగా వాడుతున్నాం. ఇప్పటికే ప్లాస్టిక్ ఉత్పత్తి సంవత్సరానికి 40 కోట్ల టన్నులకు చేరుకుందని అంచనా. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో సమస్య సంక్షోభంగా మారే అవకాశం తొందర్లోనే ఉంది. ప్లాస్టిక్ కవర్ల వల్ల కలిగే నష్టాలివే పర్యావరణ_కాలుష్యం: ►సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు పర్యావరణ కాలుష్యానికి ప్రధాన మూలం. ఎందుకంటే అవి భూమిలో ఇంకిపోవడానికి చాలా సమయం పడుతుంది.ప్లాస్టిక్ కవర్లు వన్యప్రాణులకు హాని కలిగిస్తాయి. జంతువులు వాటిని ఆహరంగా భావించి తినేస్తున్నాయి. ఇది ఎక్కువైతే, మరణానికి కూడా దారితీయొచ్చు. ► ప్లాస్టిక్ కవర్లు అనేక రసాయనాలు కలిగి ఉంటుంది. వీటిని నీటిలో వదలడం వల్ల అవి కూడా కలుషితం అయ్యి ప్రమాదాన్ని కలిగిస్తాయి. ► కొన్ని ప్లాస్టిక్ కవర్లలో మానవ ఆరోగ్యానికి హాని కలిగించే బిస్ఫినాల్ A (BPA), థాలేట్స్ ,ఫ్లేమ్ రిటార్డెంట్స్ వంటి రసాయనాలు ఉండవచ్చు. ఈ రసాయనాలు ప్లాస్టిక్ నుండి బయటకు వెళ్లి ఆహారం లేదా పానీయాలలోకి వెళ్లి, హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి సమస్యలు మరియు క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ► ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తి, పారవేయడం గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు దోహదం చేస్తుంది. ఇది వాతావరణ మార్పు, ఇతర పర్యావరణ సమస్యలకు దోహదం చేస్తుంది. ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారం తింటున్నారా? మీరు రోజూ ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారం తీసుకుంటున్నారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే. వేడి పదార్థాలను ప్లాస్టిక్ లేదా డిస్పోజబుల్ ప్లేట్లలో ఉంచడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని పరాశోధకులు ప్లాస్టిక్ (Plastic) తయారు చేసేందుకు బిఎస్ ఫినాల్ను ఉపయోగిస్తారు. ప్రధానంగా పాలికార్బోనేట్ లేదా రీసైకిల్ కోడ్7గా పిలువబడే ఇది ప్లాస్టిక్లో కలుస్తుంది. ఇది విషపూరితమైనది. దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ పొంచివుండే ప్రమాదం ఉంది. బీపీఏ అనేది మానవ శరీరంలోని ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను అసమతుల్యత చేసే రసాయనమని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి మొదలైన వాటికి దారి తీస్తుంది. అలాగే అలెర్జీలు, గుండెకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ తీవ్రతను పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గుతుంది ఎక్కువగా ప్లాస్టిక్ పాత్రల్లో తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ పాత్రలలో ఆహారం తినడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మైక్రోవేవ్లో ప్లాస్టిక్ పాత్రలలో ఆహారాన్ని వేడి చేయడం కూడా హానికరమంటున్నారు. మీరు మైక్రోవేవ్ ఉపయోగించాల్సి వస్తే ప్లాస్టిక్కు బదులుగా మీరు పేపర్ టవల్, గ్లాస్ ప్లేట్ లేదా సిరామిక్ వస్తువులను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఓవైపు ప్లాస్టిక్ను నిషేధించాలని పదేపదే చెబుతున్నా, ఇంకా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. ప్లాస్టిక్ కవర్స్ని నిషేధించే విధంగా చర్యలు చేపట్టినా, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్లాస్టిక్ భూమిలో కరగడానికి కొన్ని వందల ఏళ్లు సమయం పట్టడం, అందులో ప్లాస్టిక్ తయారీలో కలిసే పదార్థం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఎంతో మంది నిపుణులు చెబుతున్నా.. ఇంకా ప్లాస్టిక్ రూపుమాపడం లేదు. ప్లాస్టిక్ కవర్ల హానికరమైన ప్రభావాలను తగ్గించడానికి, సింగిల్-యూజ్ ప్లాస్టిక్ల వినియోగాన్ని తగ్గించడం, కంటైనర్లు, పత్తి లేదా బీస్వాక్స్ వంటి సహజ పదార్థాలతో తయారు చేయబడిన ర్యాప్ల వంటి మరింత స్థిరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్లాస్టిక్ కవర్లను రీసైక్లింగ్ చేయడం సరైన పరిష్కారం కాదు. దానికంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే సమస్యను పరిష్కరించడానికి ఉత్తతమైన మార్గం. -నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు -
వందే భారత్కు తప్పని రాళ్ల దెబ్బలు
ఇది సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలు పరిస్థితి. ఏకంగా ఆరు కోచ్ల అద్దాలను ఆకతాయిలు పగలకొట్టేశారు. ఇటీవల ప్రారంభమై ప్రయాణికుల ఆదరణ చూరగొంటూ దాదాపు 115 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తున్న ఈ రైలును ఆకతాయిలు టార్గెట్గా చేసుకుంటున్నారు.– సాక్షి, హైదరాబాద్ వందేభారత్ రైళ్లపైనే కసిగా.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రైళ్లపై రాళ్ల దాడులు జరగటం ముందు నుంచీ ఉంది. కానీ వందేభారత్ రైళ్లు పట్టాలెక్కిన తర్వాత అది మరింతగా పెరిగింది. గత ఏడు నెలల్లో రాష్ట్రంలో దాదాపు 300 పర్యాయాలు రైళ్లపై దాడులు జరిగితే, అందులో వందేభారతపై జరిగినవే 50కి పైగా ఉండటం గమనార్హం. వెడల్పాటి అద్దాలుండటంతో వందేభారత్ రైళ్లకు ఈ రాళ్లదాడి తీవ్ర నష్టం చేస్తోంది. సాధారణంగా రైలు అద్దాలు పగిలితే, మెయింటెనెన్స్ సమయంలో వాటిని మార్చేస్తారు. కానీ, వందేభారత్ రైళ్ల అద్దాలు తరచూ పగిలిపోతుండటంతో వాటిని మార్చటం ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం దక్షిణ మధ్య పరిధిలో సికింద్రాబాద్–విశాఖపట్నం, సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో విశాఖపట్నం రైలు విశాఖలో మెయింటెయిన్ అవుతుండగా,తిరుపతి రైలు సికింద్రాబాద్లో అవుతోంది. వారానికి ఒక రోజు వీటికి సెలవు ఉండటంతో ఆ రోజు పూర్తిస్థాయిలో నిర్వహణ పనులు చేపడుతూ పగిలిన అద్దాలను మారుస్తున్నారు. బాగా పగిలితే మాత్రం వెంటనే మార్చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో అద్దాలను స్థానికంగా నిల్వ చేసుకుంటున్నారు. సికింద్రాబాద్ డివిజన్లోనే ఎక్కువగా.. తాజాగా తిరుపతి రైలులో ఆరు కోచ్ల అద్దాలు పగలగా, విశాఖ రైలుకు మూడు కోచ్ల అద్దాలు పగిలాయి. ఈ ఏడాది రైళ్లపై జరిగిన 300 రాళ్ల దాడుల్లో ఎక్కువ సికింద్రాబాద్ డివిజన్లోనే చోటు చేసుకున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రైళ్లపై దాడుల విషయంలో నిందితులపై తీవ్రచర్యలుంటాయి. రైళ్లపై దాడి చేయటాన్ని జాతి ఆస్తి విధ్వంసంగా పరిగణిస్తూ కఠిన సెక్షన్లు దాఖలు చేస్తారు. అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం పోతుంది. దాడి చేసి అలాంటి కేసులుకొని తెచ్చుకోవద్దని ఎంతగా ప్రచారం చేసినా ఆకతాయిలు వినటం లేదు. దీంతో ఆ సెక్షన్ల కింద గరిష్ట జైలు శిక్షలు విధించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నుంచి పట్టుబడిన వారికి వీలైనంత ఎక్కువ కాలం జైలు శిక్ష పడే ప్రమాదం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
పోలవరం నిధులపై అభ్యంతరం చెప్పలేదు
పోలవరం ప్రాజెక్ట్లో 41.15 మీటర్ల వరకూ నీటిని నింపడానికి రూ.10,911.15 కోట్లు వరద నష్టం రూ.2 వేల కోట్లు నిధులకు ఆర్థిక శాఖ అభ్యంతరం చెప్పలేదని జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జనవిశ్వాస్ బిల్లుకు మద్దతు లోక్సభలో కేంద్రం గురువారం ప్రవేశపెట్టిన జన విశ్వాస్ సవరణ బిల్లు, 2022కు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. బిల్లుపై చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ.. దేశంలో జీవన సౌలభ్యానికి బిల్లు ఎంతో తోడ్ప డుతుందన్నారు. బిల్లులో కొన్ని మార్పులను ఎంపీ సత్యవతి సూచించారు. తిట్టలేదు.. అవాస్తవాల ప్రచారంపై ప్రశ్నించానంతే: ఎంపీ ఎంవీవీ తనతో పాటు తన కుటుంబ సభ్యుల గౌరవానికి భంగం కలిగేలా మీడియాతో మాట్లాడిన వ్యవహారంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కేవలం ప్రశ్నించాను తప్ప అసభ్య పదజాలంతో తిట్టలేదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. తనపై చేసిన అసత్య ప్రచారంపై రఘురామను నిలదీశానని, వాస్తవాలు తెలియకుండా ఇష్టానురీతిన ఎలా మాట్లాడుతారని ప్రశ్నించినట్టు తెలిపారు. ఈ నెల 20న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్సభ వాయిదా పడిన అనంతరం సెంట్రల్ హాల్లో తనను అసభ్య పదజాలంతో తిడుతూ.. చంపేస్తాననే ధోరణిలో బెదిరింపులకు పాల్పడ్డారంటూ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లాకు ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఎంవీవీ సత్యనారాయణ స్పందిస్తూ.. ఆయన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని కొట్టిపారేశారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఉదంతంపై రఘురామ తలాతోక లేని ఆరోపణలు చేశారని విమర్శించారు. -
పొగలుకక్కే ఫుడ్ పెట్టినందుకు..మెక్డొనాల్డ్స్ రూ. 6 కోట్లు
మనం రెస్టారెంట్కి లేదా హోటల్కి వెళ్లితే..నిర్వాహకులు మంచి వేడి..వేడిగానే ఆహారం తీసుకొస్తారు. ఒకవేళ తొందరపడి తింటే..కాలినా.. అక్కడ ఉన్న సర్వర్పై అరవలేం. పైగా కేసు పెట్టను కూడా పెట్టం. కానీ ఓ కుటుంబం వేడిగా ఉందని మాకు చెప్పలేదు, అందువల్లే మా పాపకు కాలిపోయిందని కోర్టు మెట్లు ఎక్కింది. పైగా మెక్డొనాల్డ్స్ కంపెనీని ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేసింది ఓ కుటుంబం. ఈ ఘటన యూఎస్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాలోని ఫిలానా హోమ్స్, ఆమె భర్త, తన నాలుగేళ్ల పాప ఒలివియా కారబల్లోతో కలిసి మెక్డొనాల్డ్స్కి వెళ్లారు. అప్పుడు వారు తమ చిన్నారి కోసం హాట్ చికెన్ మెక్ నగెట్ని ఆర్డర్ చేశారు. అది కాస్త తినే తొందరలో చిన్నారి తొడపై పడటంతో.. తీవ్ర గాయమైంది. దీంతో ఆ జంట ఆహరం వేడిగా ఉందని ఎందుకు చెప్పలేదంటూ గొడవ చేసింది. తమకు న్యాయం కావలంటూ..కోర్టు మెట్లు ఎక్కింది. చికెన్లోని సాల్మొనెల్లా విషాన్ని నివారించడానికి 160 డిగ్రీల హీట్ కంటే ఎక్కువ వేడి చేయకూడదు. కానీ మెక్డొనాల్డ్స్ 200 డిగ్రీ వేడితో ఉన్న చికెన్ నగ్గెట్ని ఇచ్చిందని వాదించింది. తన కూతురు ఒలివియాకు అయిన గాయాన్ని, దానివల్ల ఆమె అనుభవించిన బాధను ఆధారంగా చూపించింది. అంతేగాదు ఇప్పటికీ తన కూతురు చికెన్ నగెట్ని తింటోంది. కానీ ఇలా జరగలేదు కదా అని గట్టిగా తన వాదన వినిపించింది. దీంతో కోర్టు.. అక్కడ చిన్నారుల హక్కుల ప్రకారం ఆమెకి జరిగిన గాయానికి గానూ పరిహారంగా సదరు మెక్డొనాల్డ్స్ ఏకంగా ఆరు కోట్లు నష్టపరిహారం చెల్లించాలని గత బుధవారమే ఆదేశించింది. అంతేగాదు ముందుగా గత నాలుగేళ్లకు పరిహారంగా రూ. 3.27 కోట్లు చెల్లించాలని ఆ తర్వాత మిగతా డబ్బును నిర్ణిత గడువులోపల చెల్లించాలని పేర్కొంది. పాపం మెక్ డొనాల్డ్కి ఓ రేంజ్లో దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందిగా సదరు కుటుంబం. (చదవండి: 'గోల్డెన్ వాటర్ స్పౌట్'..ప్రకృతి అద్భుతం) -
జలప్రళయం.. హిమాచల్ కకావికలం
సిమ్లా: ఎడతెరిపిలేని వర్షాలు హిమాచల్ ప్రదేశ్ని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాష్ట్రమంతటా రోడ్లు కొట్టుకుపోయిన కారణంగా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. విద్యుత్ వ్యవస్థ నిలిచిపోయింది. వరద నీటితో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గత నాలుగు రోజుల్లో వర్షాల ధాటికి 80 మంది మృతి చెందారు. రూ.4000 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 1300 రోడ్లు బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఛండీగఢ్-మనాలీ, సిమ్లా-కాల్కా జాతీయ రహదారులను మూసివేసినట్లు వెల్లడించారు. మనాలీలో చిక్కిన 1000 మంది పర్యటకుల వాహనాలను తరలించడానికి అర్ధరాత్రి పూట వన్వే ట్రాఫిక్ను తెరిచినట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో పర్యటకులు చిక్కుకుపోయినట్లు పేర్కొన్నారు. More Scary visuals from Thunag area of Mandi, Himachal#Thunag #Mandi #HimachalPradesh #Manali #Kullu pic.twitter.com/qtyyo3OHcD — Anil Thakur (@Ani_iTV) July 9, 2023 ఇప్పటివరకు రాష్ట్రంలో 40 వంతెనలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. జులై 5 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 20,000లకు పైనే ప్రజలను పునరావాస ప్రదేశాలకు తరలించినట్లు వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడి, వరదలతో భారీ నష్టం జరిగిన కులూ ప్రాంతాల్లో రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుకూ పర్యటించారు. పరిస్థితిని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకువచ్చామని తెలిపారు. నష్టాన్ని పూరించడానికి చేయాల్సిన పని చాలా ఉందని అన్నారు. This is Temple in Sirmaur Himachal Pradesh under flood pic.twitter.com/PI3IIibmzp — Go Himachal (@GoHimachal_) July 11, 2023 గత నాలుగు రోజులుగా ఉత్తర భారతం భారీ వర్షాలతో వణికిపోతోంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. వర్షాల ధాటికి వరద నీటితో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు సంభవిస్తుండగా.. హిమాచల్ ప్రదేశ్లో భారీ నష్టం వాటిల్లింది. 80 Killed, ₹ 3,000 Crore Damage: Himachal Rain Devastation In Numbers https://t.co/7xnflWjHa5 pic.twitter.com/FFgvfMddRA — NDTV (@ndtv) July 12, 2023 కాగా.. రానున్న 24 గంటల్లో భారీ స్థాయిలో వర్షాలు రానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో 23 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఉత్తరాఖండ్లో రెడ్ అలర్ట్ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇదీ చదవండి: Yamuna Rivar: డేంజర్ మార్క్ దాటి మహోగ్రంగా ప్రవహిస్తున్న యమునా.. ఢిల్లీ హై అలర్ట్.. -
Adipurush: థియేటర్ అద్దాలు పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్
ప్రభాస్ రాముడిగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం'ఆదిపురుష్' ప్రపంచవ్యాప్తంగా నేడు (జూన్ 16) విడుదలైంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్ల వద్ద జై శ్రీరామ్ నామంతో ప్రభాస్ ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. సినిమా ఇప్పటికే హిట్ టాక్ అందుకుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమాకు మంచి బజ్ రావడంతో థియేటర్లలో బొమ్మ పడటం ఒక నిమిషం ఆలస్యం అయినా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. (ఇదీ చదవండి: ఎవరైనా అలాంటి వేషాలు వేస్తే.. తాట తీస్తాం: ప్రభాస్ ఫ్యాన్స్) తాజాగా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని జ్యోతి థియేటర్లో ఆదిపురుష్ సినిమా ఆలస్యంగా ప్రదర్శించడం వల్ల యాజమాన్యంతో ఫ్యాన్స్ గొడవకు దిగారు. థియేటర్ సిబ్బంది సర్దిచెప్పడంతో సమస్య సద్దుమనిగింది. కానీ వారు థియేటర్లోకి వెళ్లిన తర్వాత అసలు సమస్య మొదలైంది. సినిమా ప్రారంభం అయ్యాక సౌండ్ సిస్టం సరిగా లేకపోవడంతో వారికి డైలాగ్లు అర్థం అవ్వడం లేదని మళ్లీ గొడవకు దిగడమే కాకుండా థియేటర్ అద్దాలను పగలగొట్టారు. దీంతో చేసేదేమి లేక థియేటర్ యాజమాన్యం సినిమా ప్రదర్శనను నిలిపేశారు. (ఇదీ చదవండి: Adipurush: ఎవరీ ఓం రౌత్.. ప్రభాస్కు ఎలా పరిచయం?) -
బండి, ఈటల మాటలతో కాషాయ పార్టీలో మంటలు..!
-
Vande Bharat: వడగళ్లు, పిడుగుపడి దెబ్బతిన్న వందేభారత్
భువనేశ్వర్: దేశంలో అత్యంత వేగంగా పేరున్న సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్. అయితే ఈ రైలు నాణ్యత విషయంలోనే పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలు అందుకు కారణం. తాజాగా.. వడగండ్ల వానకు, పిడుగుపడి ఓ వందేభారత్ రైలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఒడిషాలో ఈమధ్యే ప్రారంభమైన పూరీ-హౌరా వందేభారత్ ఎక్స్ప్రెస్(22896) ఆదివారం మధ్యాహ్నం ముందు భాగం దెబ్బతింది. భద్రాక్ రైల్వే స్టేషన్కు 30 కిలోమీటర్ల దూరంలో.. పిడుగుపడి డ్రైవర్ క్యాబిన్ విండ్స్క్రీన్, సైడ్ విండోలు పగుళ్లు వచ్చాయి. అయితే ఎవరికీ ఏం కాలేదు. అలాగే వడగండ్ల వాన కురిసి.. పలు కోచ్ల సైడ్ విండోలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇదేకాదు.. ఓవర్హెడ్ ఎలక్ట్రిక్ వైర్ తెగిపోవడంతో వైతరణి రోడ్డు రైల్వే బ్రిడ్జి వద్ద రెండు గంటలపాటు రైలు ఆగిపోయింది. రైలులో పవర్ సప్లై నిలిచిపోవడంతో చాలామంది ప్రయాణికులు.. సామాజిక మాధ్యమాల్లో ఆ ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక.. ఓ డీజిల్ ఇంజిన్ను పంపించి రైలును అక్కడి నుంచి తరలించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మరమ్మత్తుల నేపథ్యంలో.. ఇవాళ(సోమవారం) రైలును రద్దు చేశారు. ఒడిషా పూరీ నుంచి పశ్చిమ బెంగాల్ హౌరాను కనెక్ట్ చేస్తూ ఈ రైలును ప్రధాని మోదీ వర్చువల్గా గత గురువారం ప్రారంభించారు. వచ్చే నెల ముగింపు లోపు దేశంలోని అన్ని రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ వందేభారత్ రైళ్లను ప్రారంభించే యోచనలో ఉంది భారత రైల్వేస్. Odisha | Puri-Howrah Vande Bharat Express halted between Dulakhapatna-Manjuri Road Station after the overhead wire was damaged due to thunderstorms and lightning. Purna Chandra Shahu, Station Manager, Bhadrak said, "Front glass and side windows of the driver cabin were damaged… pic.twitter.com/bhuAIGQFiI — ANI (@ANI) May 21, 2023 -
తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయడం లేదు
-
రోడ్లకు వాన దెబ్బ.. గాలికొదిలేసిన ప్రభుత్వం
గత రెండు మూడేళ్లుగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. భారీ, అతి భారీ వానలతో వరద పోటెత్తడంతో చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న చోట పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నా ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదు. పలుచోట్ల నామ్కేవాస్తేగా పైపైన సాధారణ మరమ్మతులు చేసినా.. ఇటీవలి వర్షాలకు మరింతగా పాడయ్యాయి. చాలా చోట్ల గతుకులు, గుంతలు పడ్డాయి. కొన్నిచోట్ల పైన తారు కొట్టుకుపోయి.. మట్టిరోడ్లలా మారిపోయాయి. దీనితో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. మరో నెల రోజుల్లో వానాకాలం ముంచుకొస్తుండగా.. ఇప్పటికీ రోడ్ల మరమ్మతు అంశం కొలిక్కి రాలేదు. రోడ్ల పీరియాడికల్ రెన్యువల్స్కు సంబంధించి నిర్ధారించుకున్న నిడివిలో కేవలం 20 శాతమే పూర్తయింది. వానాకాలం మొదలైతే పనులు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. రోడ్ల పీరియాడికల్ రెన్యువల్స్ తీరు ఇదీ.. మొత్తం ఎంపిక చేసిన రోడ్ల నిడివి: 6,617 కి.మీ. ఇందుకు మంజూరు చేసిన నిధులు: రూ.2,852 కోట్లు ఇప్పటివరకు పూర్తయిన రెన్యువల్: 1,400 కి.మీ. ఇంకా పనులు జరుగుతున్న రోడ్లు: 1,350 కి.మీ. పనులు ప్రారంభం కావాల్సిన నిడివి: 2,263 కి.మీ. టెండర్లు కూడా ఖరారు కాని రోడ్లు: 1,190 కి.మీ. భారీ వర్షాలు పడితే ఇబ్బందే.. గత రెండు వానాకాలాల్లో కలిపి దాదాపు రూ.2 వేల కోట్ల మేర రోడ్లకు నష్టం జరిగినట్టు అంచనా. ఎప్పటికప్పుడే రోడ్లను మెరుగుపరిస్తే.. తదుపరి వరదకు అంతగా నష్టం ఉండదు. అదే మరమ్మతులు చేయని పక్షంలో.. మళ్లీ వరద పోటెత్తితే ఆ రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు రోడ్లను పూర్తిగా పునరుద్ధరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఖర్చు భారీగా పెరుగుతుంది. రాష్ట్రంలో గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గుంతలు, దెబ్బతిన్న రోడ్ల కారణంగా ప్రమాదాలు జరుగుతాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు మొదలుపెట్టినా.. 2021 వానాకాలంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు దాదాపు రూ.800 కోట్లు అవసరమని అంచనా వేశారు. గతేడాది భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు రూ.1,200 కోట్లు అవసరమని నిర్ధారించారు. 2021లో దెబ్బతిన్న రోడ్లను సకాలంలో బాగు చేయకపోవటంతో.. వాటి పటుత్వం తగ్గి 2022లో మరింతగా దెబ్బతిన్నాయి. అయినా సకాలంలో పునరుద్ధరణ చేపట్టలేదు. గతేడాది చివరలో రోడ్ల పీరియాడికల్ రెన్యూవల్స్ చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. రూ.2,852 కోట్లను మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేసరికి ఫిబ్రవరి వచ్చేసింది. ఏప్రిల్ రెండో వారం నాటికి 20 శాతం పనులు పూర్తి చేశారు. కానీ అప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో పనులు నిలిచిపోయాయి. పదేళ్ల తర్వాత రెన్యూవల్స్.. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం.. ప్రతి ఐదేళ్లకోసారి రోడ్లకు రెన్యూవల్స్ జరగాలి. అంటే పైన దెబ్బతిన్న తారు పూతను పూర్తిగా తొలగించి కొత్తగా వేయాలి. దీనికి భారీగా వ్యయం అవనున్నందున.. ఐదేళ్లకు బదులు కనీసం ఏడేళ్లకోసారి కొత్తగా వేసినా సరిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక అసలు పీరియాడికల్ రెన్యూవల్స్ చేపట్టలేదు. దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి ఇప్పుడు పనులకు శ్రీకారం చుట్టారు. 6,617 కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్ధరించాలని నిర్ణయించి.. వరదలతో దెబ్బతిన్న రోడ్లను ఇందులో చేర్చి పనులు ప్రారంభించారు. కానీ అనుమతులు, నిధుల విడుదలలో జాప్యంతో పనులు ఆలస్యంగా చేపట్టారు. మరో నెలలో వానాకాలం మొదలవుతుండటంతో.. గతంలో రోడ్లు మరింతగా పాడైపోయే పరిస్థితి నెలకొందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జడ్చర్ల–వనపర్తి మధ్య బిజినేపల్లి ప్రాంతంలో రోడ్డు కనీస మరమ్మతులు కూడా లేక వానలకు దెబ్బతిని ఇలా గోతులమయంగా మారింది. ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో టిప్పర్లు తిరుగుతుండటంతో గోతులు మరింత పెరిగి వాహన దారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గతంలో బిజినేపల్లి–జడ్చర్ల మధ్య ప్రయాణ సమయం అరగంట అయితే... ఇప్పుడు గోతుల వల్ల గంటకుపైగా పడుతోంది. బిజినేపల్లి సమీపంలోని నల్లవాగుపై నిర్మిస్తున్న వంతెనపై రోడ్డుమీద రెండు చిన్న వంతెనల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పక్కన నిర్మించిన తాత్కాలిక రోడ్డు వానలకు పాడైపోయింది. ఇటీవల ఈ రోడ్డుమీద అదుపుతప్పిన ఓ టిప్పర్ కరెంటు స్తంభాన్ని ఢీకొంది. తెగిన కరెంటు వైరు ఆ పక్కగా వస్తున్న ఆర్టీసీ బస్సుపై పడింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఉండటంతో.. బస్సులో ఉన్న 70 మంది పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. నల్గొండ జిల్లా యాద్గార్పల్లి– కేశవాపురం మధ్య ఉన్న సింగిల్ రోడ్డు కాస్తా భారీ వర్షాలకు ధ్వంసమైంది. వరదలతో దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే క్రమంలో ఇలా పునరుద్ధరించారు. ఇప్పుడు ప్రయాణాలు సాఫీగా సాగుతున్నాయి. -
విటమిన్ ట్యాబ్లెట్లు వాడితే మంచిదా? ఎంతవరకు! డాక్టర్లు చెప్తున్నదేంటి?
ఇటీవల మనందరిలో పెరిగిన ఆరోగ్యస్పృహ గురించి తెలిసిందే. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ప్రయత్నంలో ‘విటమిన్ల’ కోసం సప్లిమెంట్లు అతిగా తీసుకునేవారూ ఉన్నారు. జీవక్రియల కోసం విటమిన్లు కీలకమే. కానీ ‘ఆరోగ్య స్పృహ’ అంటూ అతిచేయడంతో విటమిన్ల మోతాదు పెరిగి ‘హైపర్ విటమినోసిస్’ కు గురయ్యే ప్రమాదమూ ఉంది. ఆ అనర్థాలేమిటో తెలిపే కథనమిది. మోతాదుకు మించి విటమిన్లు తీసుకోవడం వల్ల ‘హైపర్ విటమినోసిస్’ అనే కండిషన్ వస్తుందంటూ వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కండిషన్ను ‘విటమిన్ టాక్సిసిటీ’గా కూడా పేర్కొంటున్నారు. నీటిలో కరిగేవాటికంటే... ఫ్యాట్లో కరిగేవే డేంజర్ విటమిన్లలో ఏ, బీ కాంప్లెక్స్, సీ, డీ, ఈ, కే అనే విటమిన్లు ఉంటాయి. వీటిల్లో ‘ఏ, డీ, ఈ, కే’ అనేవి కొవ్వు (ఫ్యాట్)లో కరిగితేనే దేహంలోకి ఇంకుతాయి. ఇక విటమిన్ ‘బీ–కాంప్లెక్స్’తో పాటు విటమిన్ ‘సీ’ మాత్రం నీళ్లలో కరుగుతాయి. ఈ బీ కాంప్లెక్స్, సీ విటమిన్లు నీళ్లలో కరగడం వల్ల కాస్త ఎక్కువైనా... మూత్రంతో పాటు బయటకు తేలిగ్గా వెళ్తాయి. దాంతో హానికి పెద్దగా అవకాశం ఉండదు. కానీ సమస్యల్లా విటమిన్ ఏ, డీ, ఈ, కే లు కొవ్వుల్లో కరగడం వల్ల... వీటి మోతాదు పెరిగినప్పుడు అంత తేలిగ్గా బయటకు వెళ్లడం సాధ్యపడదు. దాంతో ఎక్కువైనప్పుడు కొన్ని అనర్థాలు తెచ్చిపెడతాయి. విటమిన్–ఏ పెరిగితే... విటమిన్–ఏ లోపిస్తే రేచీకటి వంటి సమస్యలు వస్తాయి. విటమిన్– ఏ పెరగడం వల్ల ఒకే వస్తువు రెండుగా కనిపించడం (డిప్లోపియా), వికారం లేదా వాంతులు, తలనొప్పి, కండరాల–కీళ్ల నొప్పులు, మరీ మోతాదు ఎక్కువైతే కాలేయం తన విధులు నిర్వర్తించలేకపోవడం వంటి అనర్థాలు వస్తాయి. విటమిన్–డీ ఎక్కువైతే... ఆరుబయట చేసే ఉద్యోగాలు బాగా తగ్గడం, దాదాపుగా అందరూ ఆఫీసుల (ఇన్డోర్స్)కే పరిమితం కావడంతో ఇటీవల మన దేశంలో విటమిన్ ‘డీ’ లోపం బాగానే పెరిగింది. ఒక దశలో విటమిన్–డీ లోపం కేసులు చాలా పెద్ద సంఖ్యలో రావడంతో చాలామంది డాక్టర్లు చాలా సందర్భాల్లో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విటమిన్–డీ సప్లిమెంట్లను ఇవ్వడం మొదలుపెట్టారు. డీ–విటమిన్ ఎక్కువైతే అది రక్తంలో క్యాల్షియమ్ మోతాదుల్ని పెంచుతుంది ఫలితంగా కుంగుబాటు (డిప్రెషన్) వంటి కొన్ని మానసిక సమస్యలు కనిపించవచ్చు. అలాగే తలనొప్పి, తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ, జీర్ణవ్యవస్థకు (గ్యాస్ట్రో ఇంటస్టినల్) సమస్యలు రావచ్చు. అంటే ఉదాహరణకు వికారం, వాంతులు, మలబద్ధకం, కడుపునొప్పి వంటివి కనిపించే అవకాశాలున్నాయి. ఇక మూత్ర వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు... అంటే తరచూ మూత్రవిసర్జనకు వెళ్లడం, మూత్రపిండాల్లో క్యాల్షియమ్ ఎక్కువగా చేరే ‘నెఫ్రోక్యాల్సినోసిస్’ వంటి సమస్యలూ రావచ్చు. ఫలితంగా కిడ్నీ పనితీరు దెబ్బతినేందుకు అవకాశాలుంటాయి. విటమిన్–ఈ పెరగడం వల్ల దేహాన్ని అందంగా ఉంచడంతో పాటు కొంతమేరకు ప్రత్యుత్పత్తికి ఉపయోగపడే ఇదే విటమిన్ దేహంలో పెరగడం వల్ల... అది మరో విటమిన్ అయిన విటమిన్–కే చేయాల్సిన విధుల్ని దెబ్బతీస్తుంది. దాంతో తేలిగ్గా రక్తస్రావం జరగడానికీ, అంతర్గత రక్తస్రావాలకూ అవకాశం ఏర్పడుతుంది. విటమిన్–కే పెరుగుదలతో దుష్ప్రభావాలివి... దేహంలో విటమిన్–కే పెరగడం అన్నది చాలా చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. అయితే ఇలా పెరగడం వల్ల కామెర్లు, హీమోలైటిక్ అనీమియా వంటి కండిషన్లు ఏర్పడతాయి. చికిత్స : సమస్య నిర్ధారణలో హైపర్ విటమినోసిస్ వల్ల వచ్చిన అనర్థమే అన్నది చాలా కీలకం. దేహంలో ఏ విటమిన్లు ఎక్కువయ్యాయో దాన్ని బట్టి నిర్దుష్టమైన చికిత్స ఉంటుంది. ఉదాహరణకు విటమిన్–ఏ ఎక్కువైతే... దానికి విరుగుడుగా మూత్రం ఎక్కువగా వచ్చేందుకు ఉపకరించే ‘ఎసెటజోలమైడ్’ వంటి మాత్రలు సూచిస్తారు. ∙విటమిన్–డీ పెరిగినట్లు తెలిస్తే... దానికి విరుగుడుగా దేహంలోని క్యాల్షియమ్ మోతాదులు తగ్గించేందుకు రక్తనాళం ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం, చాలా ఎక్కువ మోతాదులో మూత్రం వచ్చేందుకు వాడే ‘లూప్ డైయూరెటిక్స్’ వంటివి వాడతారు. అలాగే క్యాల్షియమ్ మోతాదులు తగ్గించేందుకు కల్సిటోనిన్ వంటి ముక్కు ద్వారా ఇచ్చే స్ప్రేలు, బిస్ఫాస్ఫోనేట్ వంటివి ఇస్తారు. ► విటమిన్–ఈ పెరిగినట్లు నిర్ధారణ అయితే రక్తస్రావాలు, అంతర్గత రక్తస్రావాలు నివారించేందుకు విటమిన్–కే, ఎఫ్ఎఫ్పి (ఫ్రెష్ ఫ్రోజెన్ ΄్లాస్మా) వంటి ప్రక్రియలు చేస్తారు. ► విటమిన్–కే పెరిగినట్లు తెలిస్తే... దాని అనర్థాలు నివారించేందుకు వార్ఫేరిన్ వంటి మందులు లేదా కామెర్లకు వాడే మందులు ఉపయోగిస్తారు. నివారణ : దేహంలోని జీవక్రియలకు ఎంతో కీలకమైన విటమిన్లు చాలావరకు మనం తీసుకునే సమతులాహారంతోనే సమకూరుతుంటాయి. నిర్దుష్టంగా ఏవైనా విటమిన్ లోపాల వల్ల వచ్చే లక్షణాలను కనుగొంటే డాక్టర్లు వీటిని సూచిస్తారు. అంతేతప్ప... విటమిన్లు పెరిగితే ఆరోగ్యమూ పెరుగుతుందనే అపోహతో ‘ఆన్ కౌంటర్ మెడిసిన్’లలా విటమిన్ సప్లిమెంట్లు వాడటం ఎంతమాత్రమూ సరికాదు. - డాక్టర్ కె. శివరాజు ,సీనియర్ ఫిజీషియన్ -
'కారు' మెజారిటీకి గండి పెట్టిన రోడ్డు రోలర్, రోటీ మేకర్
నల్లగొండ: టీఆర్ఎస్ పార్టీ మెజారిటీకి కారును పోలిన గుర్తులతో గండి పడింది. ఉప ఎన్నికలో ఇండిపెండెంట్లకు కారును పోలి ఉన్న రోడ్డు రోలర్, చపాతి మేకర్ గుర్తులు వచ్చాయి. దీంతో కొందరు ఓటర్లు వాటిని చూసి కారు గుర్తే అనుకుని ఓటేసినట్లు తెలుస్తోంది. కారును పోలిన గుర్తులను మిగతావారికి ఇవ్వొద్దని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేసింది. అయినా దాన్ని తొలగించలేదు. మొత్తం ఉప ఎన్నికలో 47 మంది పోటీలో ఉండగా 12వ నెంబర్లో ఉన్న అభ్యర్థికి చపాతి మేకర్ గుర్తు వచ్చింది. ఆ గుర్తుకు 2,407 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా 14వ నెంబర్లో ఉన్న అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తు కేటాయించారు. ఆ గుర్తుకు 1,874 ఓట్లు వచ్చాయి. ఈ రెండు గుర్తులకు వచ్చిన ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి పడితే మెజారిటీ మరింత పెరిగేదని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. కాగా, రెండో బ్యాలెట్లో 18వ నంబర్ అభ్యర్థి చెప్పుల గుర్తుకు 2,270 ఓట్లు వచ్చాయి. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
Climate Transparency Report 2022: భారత్ను దెబ్బతీసిన వాతావరణ మార్పులు
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులు మన దేశాన్ని ఆర్థికంగా కూడా తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. 2021లో వడగాడ్పులకి భారత్కి 15,900 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని క్లైమేట్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్–2022 వెల్లడించింది. పర్యావరణం, వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తున్న కొన్ని అంతర్జాతీయ సంస్థలు కలసికట్టుగా ఈ నివేదిక రూపొందించాయి. వ్యవసాయం, నిర్మాణం, తయారీ, సేవా రంగాల్లో ఈ నష్టం వాటిల్లింది. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 5.4% నష్టం జరిగినట్టు ఆ నివేదిక వివరించింది. ఆ నివేదికలో ఏముందంటే..! ► మండే ఎండలతో గత ఏడాది దేశంలో 16,700 పని గంటలు వృథా అయ్యాయి. 1990–1999తో పోల్చి చూస్తే 39% పెరిగింది. ► 2016–2021 మధ్య కాలంలో తుపానులు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి 3.6 కోట్ల హెక్టార్లలో పంటలకి నష్టం వాటిల్లింది. దీంతో రైతన్నలు 375 కోట్ల డాలర్లు నష్టపోయారు. ► దేశంలో 30 ఏళ్లలో వర్షాలు పడే తీరులో ఎన్నో మార్పులు వచ్చాయి. వ్యవసాయం, అటవీ, మత్స్య ఆర్థిక ప్రభావాన్ని కనబరిచింది. ► 1850–1900 మధ్య కాలంతో పోల్చి చూస్తే భూ ఉష్ణోగ్రతలు 1.1 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి ► వాతావరణ మార్పుల ప్రభావం అన్ని దేశాలతో పాటు భారత్పై రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నిలువ నీడ లేని వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ► వాతావరణ మార్పులతో జరుగుతున్న నష్టాన్ని అరికట్టాలంటే ప్రపంచ దేశాలు భూ ఉష్ణోగ్రతల్ని 2 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గించడానికి కృషి చేయాలి. 2015 పారిస్ ఒప్పందాన్ని అన్ని దేశాలు వినియోగించడమే దీనికి మార్గం. ► పర్యావరణ మార్పుల్ని కట్టడి చేయాలంటే మనం వాడుతున్న ఇంధనాలను మార్చేసి, పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాల్సి అవసరం ఉందని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్లో ఎర్త్ సైన్సెస్, క్లైమేట్ చేంజ్ డైరెక్టర్ సురుచి భద్వాల్ పేర్కొన్నారు. -
వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి విడదల రజిని
-
Telangana: వరద నష్టం రూ.1400 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రానికి రూ.1,400 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనా నివేదికను కేంద్రానికి పంపించింది. తక్షణ సాయంగా రూ.1,000 కోట్లను విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. శాఖలవారీగా జరిగిన నష్టాలను నివేదికలో పొందుపర్చింది. కాజ్వేలు, రోడ్లు కొట్టుకుపోవడం తదితర కారణాలతో రోడ్లు, భవనాల శాఖకు రూ.498 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.449 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.33 కోట్లు. పురపాలక శాఖకు రూ.379 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.7 కోట్ల నష్టం వాటిల్లినట్టు వివరించింది. భారీ వర్షాలు, వరదలతో ఇళ్లు కూలిపోవడంతో పునరావాసం కల్పిండానికి రూ.25 కోట్ల వ్యయమైనట్టు నివేదికలో పేర్కొంది. -
నిజంగానే మట్టిలో మాణిక్యం మన కీర్తి జల్లి
దిస్పూర్: సాధారణంగా ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏమనుకుంటాం..పైనుండి ప్రభుత్వ విధానాల అమలు పరిధిని మాత్రమే చూసుకుంటూ తగిన సూచనలు చేసేవారనే అనుకుంటాం. ప్రధాన విధాన నిర్ణయాలను ప్రభావితం చేయగలిగే సామర్థ్యం వీరి సొంతమైనా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ‘మేము సైతం’ అంటూ ప్రజల కష్టాల్లో అడుగులు వేయడానికి కూడా వీరు వెనుకడుగు వేయరు. అచ్చం అలానే అస్సాంకి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారారు. అస్సాంలో వరదలు ముంచెత్తుతున్న తరుణంలో మహిళా ఐఏఎస్ ఆఫీసర్ కీర్తి జల్లి స్వయంగా ఆ మునిగిపోయిన ప్రాంతాలను పర్యవేక్షించారు. చాలా సింపుల్గా చీరకట్టులో ఆ ప్రాంతాల్ని పర్యవేక్షించడానికి వచ్చిన ఆమె.. బురదలో సైతం నడుచుకుంటూ వెళ్లి బాధితులకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడ జరిగిన నష్టాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఒక ఐఏఎస్ అధికారిణి మట్టి, బురద, నీరు అనేది చూడకుండా ఆ ప్రాంతాలు కలియదిరడగం విశేషంగా ఆకట్టుకుంది. నిజంగానే ఆమె మట్టిలో మాణిక్యం అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇంతకీ కీర్తి జల్లి ఎవరు? ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కీర్తి జల్లి పేరు ఇప్పుడు వైరల్గా మారింది. అసలు కీర్తి జల్లి ఎవరు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్న చేస్తున్నారు నెటిజన్లు. కీర్తి జెల్లి స్వస్థలం వరంగల్ జిల్లా. ఆమె తండ్రి జెల్లి కనకయ్య న్యాయవాది. తల్లి వసంత గృహిణి. 2011లో బి.టెక్ పూర్తి చేసిన కీర్తి తన చిరకాల కోరిక అయిన ఐ.ఏ.ఎస్ ఎంపికను నెరవేర్చుకోవడానికి కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్లింది. రెండేళ్లు కష్టపడిన కీర్తి 2013 సివిల్స్లో జాతీయస్థాయిలో 89వ ర్యాంకూ, రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు ఐ.ఏ.ఎస్ ట్రయినింగ్ పూర్తయ్యాక కీర్తికి అస్సాంలో వివిధ బాధ్యతల్లో పని చేసే అవకాశం లభించింది. జోర్హట్ జిల్లాలోని తితబార్ ప్రాంతానికి సబ్ డివిజనల్ ఆఫీసర్గా కీర్తి పని చేస్తున్నప్పుడు 2016 అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చాయి. ఓటింగ్ శాతం పెంచేందకు ఆమె చేసిన కృషికి నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘బెస్ట్ ఎలక్టొరల్ ప్రాక్టిసెస్ అవార్డ్’ దక్కింది. ఉసిరి మురబ్బాతో సమస్యకు చెక్ 2019లో ‘హైలాకండి’ జిల్లాలో డెప్యూటి కమిషనర్గా కీర్తి బాధ్యతలు నిర్వహించే సమయంలో అక్కడి ప్రజలు ముఖ్యంగా ముఖ్యంగా టీ ఎస్టేట్స్లో పని చేసే కార్మిక మహిళలు రక్తహీనతతో బాధ పడుతున్నారు. పిల్లల్లో పౌష్టికాహారలోపం విపరీతంగా ఉంది. స్త్రీలకు రక్తహీనత పోవడానికి అక్కడ విస్తృతంగా దొరికే కొండ ఉసిరి నుంచి ‘ఉసిరి మురబ్బా’ (బెల్లంపాకంలో నాన్చి ఎండబెట్టిన ఉసిరి ముక్కలు) తయారు చేసి పంచడంతో గొప్ప ఫలితాలు వచ్చాయి. ఇక అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు అందించే ఆహారంతో పాటు వారంలో ఒకరోజు తల్లులు తమ ఇంటి తిండి క్యారేజీ కట్టి పిల్లలతో పంపే ఏర్పాటు చేసింది కీర్తి. అంగన్వాడీ కేంద్రాలలో ‘డిబ్బీ ఆదాన్ ప్రధాన్’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించింది. అంటే పిల్లలు ఆ రోజు తమ బాక్స్ వేరొకరికి ఇచ్చి వేరొకరి బాక్స్ తాము తింటారు. దాని వల్ల ఇతర రకాల ఆహారం తిని వారి పౌష్టికాహారం లోపం నుంచి బయట పడతారు. ఇది కూడా మంచి ఫలితాలు ఇచ్చి కీర్తికి కీర్తి తెచ్చి పెట్టింది. పెళ్లైన మరుసటి రోజే విధుల్లోకి 2020 మే నెల నుంచి కచార్ జిల్లా డిప్యూటి కమిషనర్గా ఇటు పాలనా విధులు, ఇటు కోవిడ్ నియంత్రణ కోసం పోరాటం చేస్తోంది కీర్తి. సిల్చార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో 16 పడకల ఐ.సి.యు కోవిడ్ పేషెంట్స్కు సరిపోవడం లేదు కనుక కీర్తి ఆధ్వర్యంలో ఆఘమేఘాల మీద అక్కడ కొత్త ఐ.సి.యు యూనిట్ నిర్మాణం జరుగుతోంది. పెళ్లి చేసుకున్న మరుసటి రోజున కీర్తి ఈ నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి హాజరవడం చూస్తే ఆమె పని స్వభావం అర్థమవుతుంది. కీర్తి ప్రచారానికి, ఇంటర్య్వూలకు దూరంగా ఉంటుంది. తన గురించి తాను కాకుండా తన పని మాట్లాడాలని ఆమె విశ్వాసం. అది ఎలాగూ జరుగుతోంది. ప్రజలూ, పత్రికలు ఆమెను మెచ్చుకోకుండా ఎందుకు ఉంటాయి. చదవండి👉: కన్నీళ్లలో అస్సాం.. మునుపెన్నడూ లేనంతగా డ్యామేజ్.. పదేళ్లలో చేసిందంతా నీళ్లపాలు! This photo should have gone viral today A rare photo In the photo, Kachar District Commissioner (Srmti Keerthi Jalli, IAS) How to walk in the mud alongside the flood victims A nice photo 🙏🙏 One of them is going to spoil the expensive shoes😀 .. pic.twitter.com/FFEEHw9WLt — Ajit Sonowal (Jit) (@AjitSonowal3) May 26, 2022 A real defination of simplicity. Keerthi Jalli IAS, Deputy Commissioner Cachar.#AssamFloods pic.twitter.com/vPVnik77LF — Naini Vishnoi🇮🇳 (@NainiVishnoi) May 26, 2022 This is an appreciation tweet for @dccachar, Smt. Keerthi Jalli, IAS. Her eagerness to work for the people has no limits. The way she visited the remotest flood affected areas, taking stock of the damage and understanding the suffering of the people deserves huge respect. pic.twitter.com/ki7WPkUZOC — Karim Uddin Barbhuiya (@KUBarbhuiya) May 25, 2022 -
కన్నీళ్లలో అస్సాం.. మునుపెన్నడూ లేనంతగా నష్టం!
దిస్పూర్: ప్రతీ ఏటా అస్సాం వరదలు రావడం.. నష్టం వాటిల్లడం జరుగుతున్నదే. అయితే మునుపెన్నడూ లేనంతగా ఈసారి భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. దిమా హసావో జిల్లాలో గత ఐదు-పదేళ్ల చేపట్టిన నిర్మాణాలు, రోడ్లు వరదల్లో కోట్టుకోవడంపై స్వయంగా సీఎం హిమంత బిస్వ శర్మ ప్రకటన చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అస్సాం వరదలతో ఇప్పటిదాకా 30 మంది చనిపోయారు. వానా-వరద నష్టంతో.. కేవలం ఏడు రాష్ట్రాల్లోనే సుమారు ఐదున్నర లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 956 గ్రామాలు పూర్తిగా నీట మునగ్గా, 47, 139, 12 హెక్టార్ల పంట సర్వనాశనం అయ్యిది. ఒక్క నాగోవ్ జిల్లాలో దాదాపు నాలుగు లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాచర్లో లక్షన్నర, మోరిగావ్లో 40వేలమందికి పైగా నిరాశ్రయులయ్యారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ASDMA). ఆరు జిల్లాల్లో 365 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి.. వరద బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. Assam Floods 2022 ధుబ్రి, దిబ్రుగఢ్, గోలాఘాట్, నల్బరి, శివసాగర్, సౌత్ సాల్మరా, టిన్సుకియా, ఉదల్గురి జిల్లాల్లో నష్టం ఊహించని స్థాయిలో నమోదు అయ్యింది. రోడ్లు సహా అంతటా బ్రిడ్జిలు ఘోరంగా దెబ్బతిన్నాయి. భారీ ఎత్తున్న నిత్యావసరాల పంపిణీ జరుగుతోంది. రెండు లక్షలకు పైగా కోళ్లు, పెంపుడు జంతువులు మృత్యువాత పడ్డాయి. బ్రహ్మపుత్ర ఉపనది కోపిలి.. ధరమ్తుల్ దగ్గర ప్రమాద స్థాయికి దాటి ప్రవహిస్తుండడంతో.. ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. ఎస్డీఆర్ఎఫ్ కింద 324 కోట్ల రూపాయల సాయం ప్రకటించింది కేంద్రం. వాన ప్రభావం తగ్గినా.. వరదలతో నీట మునిగిన ఇళ్లలోకి వెళ్లేందుకు జనాలు ఇష్టపడడం లేదు. A real defination of simplicity. Keerthi Jalli IAS, Deputy Commissioner Cachar.#AssamFloods pic.twitter.com/vPVnik77LF — Naini Vishnoi🇮🇳 (@NainiVishnoi) May 26, 2022 -
లోపాల్లేవు, అకాల వర్షంతోనే అలా!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన అకాలవర్షంతో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం అతలాకుతలమైనప్పటికీ, పనుల్లో ఎక్కడా లోపాలు లేవని అధికారులు తేల్చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించారు. ఓ వైపు పనులు జరుగుతుండగా, ఉన్నట్టుండి ఒకేసారి భారీ వర్షం కురవటంతోనే ఈ పరిస్థితి నెలకొందని, నాణ్యతలో లోపాలు లేవని నివేదించారు. ఈ మేరకు శనివారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్వహించిన సమీక్షలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకు సాక్ష్యంగా కొన్ని ఫొటోలు చూపించారు. వాన నిలిచిపోయిన వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్టు కూడా ఫొటోల ద్వారా వివరించారు. ఇటీవల ఉన్నట్టుండి భారీవర్షం కురవడంతో యాదగిరిగుట్ట దేవాలయం వద్ద దిగువన కొత్త రోడ్డు కొట్టుకుపోయి నేల కుంగిపోవడం, క్యూ కాంప్లెక్సుల్లోకి భారీగా వాననీరు చేరడం, చలువ పందిళ్లు కొట్టుకుపోవడం వంటివి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో పనుల్లో నాణ్యత లోపం ఉందంటూ సర్వత్రా ఆగ్రహం, విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి శనివారం యాడా ఉన్నతాధికారులు, రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీతో సమీక్ష నిర్వహించారు. పనులన్నీ సవ్యంగానే సాగాయని అధికారులు మంత్రికి వివరించారు. పనులు జరుగుతున్న వేళ ఒకేసారి 79 మిల్లీమీటర్ల వాన కురవటంతో గుట్టపై నుంచి వరదలో మట్టి కొట్టుకొచ్చిందని, అది పైపులైన్లలోకి చేరి దిగువకు అడ్డుపడటం వల్లే క్యూ కాంప్లెక్సులోకి నీళ్లు చేరాయని పేర్కొన్నారు. రోడ్డు నాణ్యతతో నిర్మించినా, పైపులైన్ల కోసం పక్కన గుంతలు తవ్వటంతో ఒక్కసారిగా వచ్చిన వరదతో దిగువ మట్టి కొట్టుకుపోయి రోడ్డు దెబ్బతిన్నదని, ఆ ప్రాంతం కుంగిపోయిందని పేర్కొన్నారు. గుట్టపై నుంచి భారీగా కొట్టుకొచ్చిన ఇసుకలో బస్సులు దిగబడి ముందుకు సాగలేకపోయాయని వివరించారు. వానాకాలం నాటికి పూర్తిచేయండి ఒకేసారి భారీవర్షం కురవటంతో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనందున, వచ్చే వానాకాలం నాటికి పనులన్నీ పూర్తి చేస్తే ఈ పరిస్థితి పునరావృతం కాదని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. వర్షాలు కురిసేనాటికి అంతా సిద్ధం చేసి అప్రమత్తంగా ఉండాల ని ఆదేశించారు. ఇంత భారీ ప్రాజెక్టు పనులు పూర్తి అవుతున్న తరుణంలో ఇలాంటి చిన్న, చిన్న సమస్యలు ఉత్పన్నమవుతాయని, వీటిని అధిగమించేందుకు ప్రయత్నించాలని సూ చించారు. చలువ పందిళ్లు, మురుగునీటి నిర్వహ ణ, క్యూ లైన్లలో ఫ్యాన్ల ఏర్పాటు, వీల్చైర్లు అందుబాటులో ఉంచటం, గుట్ట దిగువన మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. రాజకీయలబ్ధి కోసం యాదాద్రిపై విమర్శలు చేయటం తగదని, ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడొద్దని, చిన్న, చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూడ్డం మానుకోవాలని మంత్రి హితవు పలికారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, యాడా వైస్ చైర్మన్ కిషన్రావు తదితరులు హాజరయ్యారు. ఆ ‘ఖాళీ’ ముప్పుపై దృష్టి పెట్టండి యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ క్యూలైన్లో ఏర్పడిన ఖాళీపై ‘పొంచి ఉన్న ముప్పు’శీర్షికతో శనివారం సాక్షి లో ప్రచురితమైన వార్తపై దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పందించారు. శనివారం హైదరాబాద్లోని అరణ్య భవన్లో నిర్వహించిన వైటీడీఏ సమావేశంలో ప్రత్యేకంగా ఈ వార్తపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాక్షిలో ప్రచురితమైన వార్త క్లిప్పింగ్ను పరిశీలించమని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావుకు మంత్రి చూపించారు. ప్రమాదం జరగకుండా వెంటనే అక్కడ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. -
పది కాలాలు పదిలంగా ఉండాలంటే...
భూమి మీద జరుగుతున్న పర్యావరణ విధ్వంసం గురించి ఆందోళన రానురానూ పెరుగుతున్నది. పర్యావరణ విధ్వంసం తగ్గించే ప్రయత్నాలు జరుగు తున్నా కూడా ప్రకృతి వనరుల భక్షణ మీద దేశాల ఆర్థిక వ్యవస్థల నిర్మాణం కొనసాగడం వల్ల ఫలితాలు రాలేదు. ఈ రోజు అవే ఆర్థిక వ్యవస్థలు కాలుష్య దుష్పరిణామాల భారంతో కుప్పకూలుతున్నాయి. విలువైన ప్రాణాలు పోతున్నాయి. ఆహార లేమి బాధిస్తున్నది. నీటి కొరత ఆందోళన కలిగిస్తున్నది. మానవ సమాజ మనుగడ ప్రశ్నార్థకం అవుతున్నది. ప్రకృతి వనరుల సుస్థిర ఉపయోగంలో పాటించాల్సిన సమన్యాయం అంతకంతకూ కొరవడుతున్నది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దిశగా పరిణతి కలిగిన ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కదలాల్సిన అవసరం ఉంది. అనేక రూపాలలో, అనేక విధాలుగా పుడమి ప్రస్తుతం ఎదుర్కొంటున్న భారీ సంక్షోభానికి దీటుగా అంతర్జాతీయ ప్రతిస్పందన ఉండాలనే ఆకాంక్ష ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నది. అయితే ప్రభుత్వాల స్పందన చాలా నెమ్మదిగా ఉంది. భారతదేశం పర్వతాలు, అడవులు, సముద్రాలు, నదులు, ఇతర జలవనరులతో విలసిల్లుతోంది. 91,000 జాతులకు పైగా జంతువులు, 45,000 జాతుల మొక్కలకు ఇది నిలయం. వీటి ఉనికికి ముప్పు ఉంది. ఫలితంగా, ఆహార ఉత్పత్తికి విఘాతం కలుగు తున్నది. పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు, ఉభయచరాలు, చేపలు, సాలెపురుగులు, పగడాలు, చెట్లు మానవ మనుగడకు వివిధ పాత్రల ద్వారా దోహదపడుతున్నాయి. దాదాపు 1,000 జాతులు ప్రమాదంలో పడ్డాయి. ప్రాంతాల వారీగా, ఆయా పరిస్థితుల ప్రభావంతో క్రమంగా అంతరించి పోతున్నాయి. వీటిలో అనేకం ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్స్ రెడ్ లిస్ట్’లో చేర్చారు. వీటిని ఇప్పుడు కాపాడుకోలేకపోతే భూమిపై శాశ్వతంగా అదృశ్యమవుతాయి. పర్యావరణవాదుల ఒత్తిడి మేరకు 2015లో పారిస్లో 197 దేశా లకు చెందిన ప్రపంచ దేశాధినేతలు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిస్తామని ప్రతిజ్ఞ చేశారు. పారిస్ ఒప్పందంలో ప్రధాన లక్ష్యం భూతాపాన్ని 2 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గించడం, 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్కు పరిమితం చేయడానికి చర్యలు తీసుకోవడం. పారిస్ ఒప్పందం మేరకు చేసిన వాగ్దానాలపై ప్రభుత్వాలు వేగంగా వ్యవహరిస్తే, వాతా వరణ మార్పుల వలన ఏర్పడుతున్న విపరిణామాలను నివారించ వచ్చు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఉపయోగపడే ప్రభుత్వ విధా నాలను నిలువరించడానికి కొన్ని వర్గాలు సర్వ ప్రయత్నాలు చేస్తు న్నాయి. భారీగా నిధులు ఖర్చు చేస్తున్నాయి. ‘సీఓపీ 26’లో తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి శిలాజ ఇంధనాల మీద ఒప్పం దానికి రాకుండా, శిలాజ ఇంధనాల మీద అంతర్జాతీయ నిషేధం రాకుండా సఫలీకృతం అయినారు. విపరీత ప్రకృతి వైపరీత్యాల రూపంలో వాతావరణ మార్పుల గురించి ఏడాదికేడాది స్పష్టత వస్తున్నప్పటికీ, బహుళ జాతి కార్పొరేట్ సంస్థలు (కార్బన్ ఉద్గారాలు అధిక భాగం వాటివల్లే) శిలాజ ఇంధ నాల కోసం డ్రిల్లింగ్, బర్నింగ్ కొనసాగిస్తున్నాయి. శిలాజ ఇంధన వ్యవస్థ ద్వార లాభాలు పొందుతున్న సంస్థలు, వర్గాలు తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికి పుడమి భవిష్యత్తును పణంగా పెడుతున్నాయి. ఈ సంవత్సరం పుడమి దినోత్సవ సందర్భంలో సుస్థిర భవి ష్యత్తు కొరకు పెట్టుబడులు పెంచాలని నినాదం ఇచ్చారు. ప్రధాన మైన మూల పరిష్కారాలు మూడున్నాయి. అన్ని దేశాలు అనుసరిం చాల్సిన మార్గాలు ఇవి. శిలాజ వనరులను భూమిలోనే ఉంచాలి. శిలాజ ఇంధనాలలో బొగ్గు, చమురు, సహజ వాయువు ఉన్నాయి. వీటిని వెలికితీసి కాల్చినకొద్దీ, పర్యావరణం మీద, పంచ భూతాల మీద దుష్ప్రభావం పెరుగుతున్నది. అన్ని దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను సాధ్యమైనంత త్వరగా శిలాజ ఇంధనాల నుండి ప్రత్యా మ్నాయ ఇంధనాల వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది. పునరుత్పా దక శక్తిలో పెట్టుబడులు కూడా వేగంగా పెంచాలి. ప్రధాన ఇంధన వనరులను పరిశుభ్రమైన, పునరుత్పాదక శక్తిగా మార్చడం శిలాజ ఇంధనాల వినియోగాన్ని ఆపడానికి ఉత్తమ మార్గం. వీటిలో సోలార్, విండ్, వేవ్, టైడల్, జియోథర్మల్ పవర్ వంటి వనరులు ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి ఈ మార్గాల ద్వారా చేసుకోవడం ఉత్తమమైన పరిష్కారం. పెట్రోల్, డీజిల్ వాహనాలు, విమానాలు, ఓడలు శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తాయి. వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం, విమాన ప్రయాణాన్ని తగ్గించడం వలన వాయు కాలుష్యం తగ్గుతుంది. సుస్థిర రవాణా వ్యవస్థకు మారడం చాలా అవసరం. రాజకీయ నాయకులు, పార్టీలు ఈ దిశగా ఆలోచన చేసే విధంగా పర్యావరణ స్పృహ పెంచుకున్న ప్రజల నుంచి ఒత్తిడి రావాలి. ఎన్నికల వేళ పునరుత్పాదక శక్తి వనరుల మీద విధానాల మార్పునకై కృషి చేస్తామని రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేసే విధంగా ప్రజలు వ్యవహరించాలి. వాతావరణంలో పెరుగుతున్న కార్బన్ డై ఆక్సైడ్ను సహజంగా గ్రహించే వ్యవస్థలలో కీలకమైనవి రెండు: దట్టమైన అడవులు, సము ద్రాలు. అడవుల నరికివేతను పూర్తిగా నిషేధించాలి. పచ్చదనాన్ని కాపాడితే, కాలుష్య ఉద్గారాలను ప్రకృతి పరిమితిలో ఉంచే అవకాశం ఏర్పడుతుంది. వాతావరణ మార్పుల వ్యతిరేక పోరాటంలో దట్టమైన అడవులు కీలకం. వాటిని రక్షించడం ఒక ముఖ్యమైన వాతావరణ పరి ష్కారం. 30 నుంచి 100 ఏళ్ళ పైన వయసు గల చెట్లు చాలా ముఖ్యం. పెరుగుతున్న భూతాపం నేపథ్యంలో సముద్ర జీవావరణ వ్యవస్థలను రక్షించాల్సిన బాధ్యత పుడమి వాసుల మీద ఉన్నది. సముద్రాలు వాతావరణం నుండి పెద్ద మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తాయి. సముద్రాల జీవావరణ వ్యవస్థ వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ను తగ్గించే ఏకైక అతిపెద్ద పెట్టుబడి అవసరం లేని సహజ వ్యవస్థ. ఈ ప్రక్రియ పుడమి వాతావరణాన్ని స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. సముద్రాలలో ఉన్న జీవావరణ వ్యవస్థల మీద భూతాపం ప్రభావం కూడా ఉంటుంది. సముద్రాలు వేడెక్కడం వలన అందులోని కోట్లాది జీవాలు అతలాకుతలం అయ్యి, అంతరించే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. దురదృష్టవశాత్తూ సీఓపీ 26లో ఈ వ్యవస్థ సంరక్షణ మీద చర్చ కూడా చేపట్టలేదు. పారిశ్రామికీకరణ, భూతాపాల మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్ర వేత్తలు చాలా కాలంగా ప్రస్తావిస్తున్నారు. విధానకర్తలు, పెట్టుబడి దారులు, కంపెనీలు డీకార్బనైజేషన్ మార్గంలో వెళ్ళడానికి కలిసి కట్టుగా పర్యావరణ అనుకూల చర్యలు తీసుకోవాలి. నూతన పారిశ్రామిక విప్లవం పర్యావరణహితంగా ఉండాలంటే, వనరుల దోపిడీతో కూడిన ప్రస్తుత పారిశ్రామిక ఉత్పత్తి మారాలి. అటువంటి మార్పు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్న సాంప్రదాయ వస్తూత్పత్తి వ్యవస్థల ద్వారా సాధ్యం అవుతుంది. చేనేత వస్త్రోత్పత్తికి ఊతం ఇవ్వడం ద్వారా పర్యావరణం మీద దుష్ప్రభావం గణనీయంగా తగ్గ డంతో పాటు ఉపాధి కూడా పెరుగుతుంది. సహజ నూలు ఉత్పత్తికి ప్రోత్సాహం ఇస్తే ఆధునిక జౌళి పరిశ్రమ వల్ల పెరుగుతున్న కాలుష్య ఉద్గారాలను సులభంగా తగ్గించవచ్చు. విని మయ జీవన శైలిలో తీవ్ర మార్పులు రావాలి. పరిశ్రమల ఉత్పత్తులను సమీక్షించి కాలుష్యాన్ని పెంచే వస్తువుల ఉత్పత్తిని తగ్గించడం లేదా పూర్తిగా మానివేయడం ద్వారా నిరంతర కార్బన్ కాలుష్యం తగ్గించ వచ్చు. పుడమి సుస్థిరతకు చేపట్టవలసిన చర్యలు ధనిక దేశాలు, ధనిక వర్గాలు మొదలు పెట్టాలి. సుస్థిర మార్పు దిశగా చేయాల్సిన కార్యక్రమాలకు అత్యవసరమైన త్యాగాలు వాళ్ళు చెయ్యాలి. నిధులు సమకూర్చాల్సిన బాధ్యత కూడా వారి మీదనే ఉంది. కాలుష్య ఉద్గారాల వల్ల, భూతాపం పెరగడం వల్ల జరిగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా పేద వర్గాల పైననే ఉంటున్నది. ఆహారం దొరకని అభాగ్యుల సంఖ్య పెరుగుతున్నది. కాబట్టి, పుడమిని కాపాడు కోవడానికి అందరూ నడుం బిగించాలి. భూతాపం వల్ల ఏర్పడుతున్న సామాజిక ఆర్థిక సమస్యల పట్ల, వాటి పరిష్కారాల మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. పర్యావరణ పరిరక్షణకు, వన్యప్రాణుల సంరక్షణకు, జీవ వైవిధ్య విస్తృతికి, ఆహార భద్రతకు, సహజ వనరుల ఉపయోగంలో సమన్యాయానికి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అమలు చేసే దిశగా పరిణతి కలిగిన ప్రజలు ఈ పుడమి దినోత్సవ సందర్భంగా ముందుకు కదులుతారని ఆశిద్దాం. డాక్టర్ దొంతి నరసింహారెడ్డి ,వ్యాసకర్త విధాన విశ్లేషకులు (నేడు ధరిత్రీ దినోత్సవం) -
కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు.. ఎంపీ ఫ్లెక్సీని కత్తిరించిన దుండగులు..
సాక్షి, మేడ్చల్: కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మేడ్చల్ జిల్లాలో కోమడిరెడ్డితో పేరుతో ఉన్న ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు కత్తిరించారు. కొంపల్లిలో ఈ నెల 9,10 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. శిక్షణా తరగతులను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో.. ఎంపీ కోమటిరెడ్డి పేరుతో కాంగ్రెస్ నాయకుడు మహిపాల్రెడ్డి హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్లను గుర్తుతెలియని ఆగంతకులు కత్తిరించారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది. అంతర్గత విభేదాల కారణంగా సొంత పార్టీ నాయకులే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
నష్టాలు తెచ్చిన వానలు
-
అమెరికాపై ప్రకృతి ‘పంజా’.. ఎటు చూసినా బీభత్సమే!
-
అప్పుడే బయటకు కొత్తకారు.. ఒక్కసారిగా మొదటి అంతస్తు పైనుంచి
సాక్షి,నాగోలు( హైదరాబాద్): మేడిపల్లికి చెందిన ఎల్ఐసీ ఉద్యోగి భగవత్ (59) అల్కాపురి చౌరస్తా వద్ద ఉన్న టాటా కార్ల షోరూంలో నూతనంగా టాటా టియాగో ఎస్టీ 1.2 కారును కొనుగోలు చేశాడు. మొదటి అంతస్తు నుంచి ఓపెన్ లిఫ్టులో తన కారును కిందికు దించుతుండగా అదుపు తప్పి కిందపడింది. దీంతో ఆయన ముఖానికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనలో షోరూం కింద ఉన్న పార్కు చేసిన మరో కారు, ద్విచక్రవాహనం ధ్వంసమయ్యింది. బాధితుడి ఫిర్యాదుతో ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అల్కాపురి చౌరస్తాలో టాటా కార్ల షోరూం భవనానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతి లేదన్నారు. షోరూం నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఓపెన్ లిఫ్టుకు కూడా ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనుమతులు లేకుండా ఓపెన్ లిఫ్టు నిర్వహస్తున్న టాటా కార్ల షోరూంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భగవత్కు సరిగా డ్రైవింగ్ రాకపోవడంతోనే ప్రమాదం జరిగిందని షోరూం సిబ్బంది చెప్తున్నారు. -
‘యాస్’ నష్టం రూ.610 కోట్లు: జల దిగ్బంధంలో 500 గ్రామాలు
భువనేశ్వర్: యాస్ తుపానుతో రాష్ట్రంలో రూ.610 కోట్ల నష్టం సంభవించింది. రూ. 520 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు నష్టపోగా ప్రభుత్వేతర ఆస్తులకు రూ.90కోట్ల నష్టం వాటిల్లిందని పలు విభాగాల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు వివరించారు. యాస్ తుపాను నష్టం, పునరుద్ధరణ కార్యకలాపాల్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆన్లైన్లో గురువారం సమీక్షించారు. అధికారులకు అభినందనలు ప్రభుత్వ అధికారులు, ప్రభావిత జిల్లా యంత్రాంగం అద్భుతమైన కార్యాచరణతో ప్రజల ప్రాణాలతో పాటు ఆస్తులను పరిరక్షించారని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ కార్యకలాపాలు అత్యంత స్వల్ప వ్యవధిలో ముగించడం విశేషమని మెచ్చుకున్నారు. యాస్ తుపాను తీరం తాకే ముందు, తాకే సమయం, తదనంతర పరిస్థితుల్లో చేపట్టిన సమగ్ర విపత్తు నిర్వహణ దస్తావేజులతో భద్రపరిస్తే భావి విపత్తు నిర్వహణ వ్యవహారాల్లో మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయ పడ్డారు. జల దిగ్బంధంలో 500 గ్రామాలు సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్ర మహాపాత్రో మాట్లాడుతు యాస్ తుపాను ప్రభావంతో సమగ్రంగా 150 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమద్రపు నీరు పొలాల్లోకి వచ్చి పంటలకు నష్టం కలిగించింది. తుపాను తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, తాగు నీరు సరఫరా పునరుద్ధరణకు 1,000 డీజీ సెట్లతో ట్యాంకర్లు, పీవీసీ ట్యాంకులు వినియోగించినట్లు వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జీరో ప్రాణ హాని నినాదంతో యాస్ తుపాను విపత్తు నిర్వహణ కోసం నిరంతరం కృషి చేసినట్లు ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్సార్సీ) ప్రదీప్ కుమార్ జెనా తెలిపారు. పంటలపై తుపాను ప్రభావం యాస్ తుపాను తీవ్రతతో కోస్తా ప్రాంతంలోని పొలాల్లోకి సముద్రపు నీరు చొరబడింది. దీని ప్రభావం ఖరీఫ్ సాగుపై పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితులపై ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వ విద్యాలయం, కేంద్రీయ వరి పరిశోధన సంస్థ పరిశోధన చేసి రైతాంగానికి సరైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఎస్సార్సీ ప్రతిపాదించారు. ముగిసిన విద్యుత్ పునరుద్ధరణ యాస్ తుపానుతో 30 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ప్రభావితమయ్యారని ఆ విభాగం కార్యదర్శి తెలిపారు. 99.8 శాతం వినియోగదారులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కార్యకలాపాలు ముగిశాయి. 230 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పునరుద్ధరించారు. విద్యుత్ విభాగానికి రూ.150 కోట్ల నష్టం సంభవించిందని వివరించారు. రహదారులు ఛిన్నాభిన్నం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మే 31వ తేదీ నాటికి గొట్టపు బావులు, కుళాయి నీరు సరఫరా, పారిశుద్ధ్యం కార్యకలాపాలు ముగించినట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, తాగునీరు విభాగం తెలిపింది. యాస్ తుపాను 8 నగర, పట్టణ ప్రాంతాల్లో 58 రహదారుల్ని ఛిన్నాభిన్నం చేసింది. తుపాను ఉద్ధృతితో సముద్ర తీరం, నదీ గట్లు కోతకు గురవడంతో జల వనరుల విభాగానికి రూ.108 కోట్లు, రోడ్లు–భవనాల శాఖకు రూ.246 కోట్లు, గ్రామీణ అభివృద్ధి విభాగానికి రూ.60 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయా విభాగాలు వివరించాయి. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేశ్చంద్ర మహాపాత్రో, ప్రత్యేక సహాయ కమిషనర్ ప్రదీప్ కుమార్ జెనా, యాస్ ప్రభావిత జిల్లాలు బాలాసోర్, భద్రక్, మయూర్భంజ్, కేంద్రాపడా కలెక్టర్లు, విద్యుత్, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖ అధికారులు, పాల్గొన్నారు. -
డ్యామెజ్ అయిన ‘శ్యామ్ సింగరాయ్’ సెట్!.. కోట్లలో నష్టం
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ‘టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తుండగా, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా కోసమే హైదరాబాద్లో కోల్కత్తాని సృష్టించి భారీ సెట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల కోల్కత్తాను తలపించే భారీ సెట్ను హైదరాబాద్లో సృష్టించారు. ఆరున్నర కోట్లతో పదెకరాల్లో ఈ సెట్ను నిర్మించారు. ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా లాక్డౌన్ కారణంగా షూట్ నిలిచిపోయింది. అయితే హైదరాబాద్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 'శ్యామ్ సింగ రాయ్' కోసం నిర్మించిన సెట్ డామేజ్ అయినట్లు సమాచారం. దీని వల్ల దాదాపు రెండు కోట్ల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. దీంతో శ్యామ్ సింగరాయ్ నిర్మాతలకు అదనపు భారం పడనుందని టాక్ వినిపిస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ ఎస్. బోయనపల్లి నిర్మిస్తున్నారు. కోల్కత్తా బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చదవండి : ఆ కారణంతోనే బాలీవుడ్ సినిమా చేయలేకపోతున్నా: నాని హీరో సుధీర్బాబు భార్య పద్మిణి గురించి ఈ విషయాలు తెలుసా? -
పక్కా పథకం ప్రకారమే అలజడులకు కుట్ర
సాక్షి, అమరావతి: ఆలయాల్లో అకృత్యాలకు పాల్పడి అలజడులు రేపేందుకు తెలుగుదేశం పార్టీ చేసిన కుట్ర బట్టబయలవుతోంది. రాష్ట్రంలో వరుసగా జరిగిన దేవాలయాల్లోని విగ్రహాల ధ్వంసం ఘటనలను నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన నిఘా వర్గాలు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించినట్టు విశ్వసనీయంగా తెల్సింది. ఈ నెలలోనే జరిగిన ఐదు ఘటనలను, పోలీసులు నమోదు చేసిన కేసులను నిశితంగా పరిశీలించిన నిఘా వర్గాలు ఇప్పటికి మూడింటిలో టీడీపీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తల ప్రమేయం ఉండటాన్ని గుర్తించాయి. ఈ మేరకు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్టు సమాచారం. చదవండి: ఎన్నిసార్లు మారతారు బాబు గారూ? జనసంచారం లేని చోట మారుమూల జన సంచారం లేనిచోట ప్రైవేటు లేదా టీడీపీ నేతల అజమాయిషీలో ఉన్న చిన్నపాటి ఆలయాన్ని ఎంచుకుని విగ్రహాలు ధ్వంసం చేయడం, మరునాడే టీడీపీ నేతలు అక్కడికి చేరుకుని గగ్గోలు పెట్టడం, సొంత మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై విషం కక్కడం.. ఇదీ టీడీపీ వేసిన స్కెచ్ ప్రకారం రాష్ట్రంలో జరుగుతున్న తంతు. ఇదే విషయం నిఘా వర్గాల పరిశీలనలోనూ వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు విశాఖపట్నం రూరల్, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో జరిగిన మూడు ఆలయాల విషయంలో ఆలజడులు రేపేందుకు టీడీపీ శ్రేణులు, వారి అనుకూల మీడియా చేసిన ప్రయత్నాలను పసిగట్టిన పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వివరాలను నిఘా వర్గాలు తమ నివేదికలో పొందుపరిచాయి. గతేడాది డిసెంబర్ 28న జరిగిన రామతీర్థం శ్రీరాముడి విగ్రహ ధ్వంసంలోనూ టీడీపీ నేతల హస్తంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారించిన 21 మందిలో టీడీపీ శ్రేణులు కూడా ఉండటం గమనార్హం. చదవండి: తిరుమలలో అవినీతి రహిత పాలన టీడీపీ నేతలు, రిపోర్టర్లపై కేసులు, అరెస్టులు ►కర్నూలు జిల్లా కొసిగి మండలం సజ్జలగూడెంలో ఆంజనేయస్వామి ఆలయ టవర్(ఆర్చి)పై సీతారాముని విగ్రహం కాళ్లను ధ్వంసం చేసి హుండీని దొంగిలించిన ఘటనపై ఈ నెల 2న పోలీసులు కేసు నమోదు చేశారు. సజ్జలగూడెం గ్రామ టీడీపీ అధ్యక్షుడు కురువ విశ్వనాథరెడ్డి ఈ ఆలయానికి చైర్మన్గా ఉన్నారు. ఆయనతో పాటు ఆలయ పూజారి శ్రీరాములు పథకం ప్రకారం దాన్ని వీడియో తీసి ఏబీఎన్ రిపోర్టర్ హనుమేష్, తెలుగు టీవీ రిపోర్టర్ హరిజన శ్రీరాములుకు పంపి దాన్ని టెలికాస్ట్ చేయించారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. ►ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ గ్రామం లక్ష్మీనరసింహాస్వామి ఆలయం ఆర్చిలోని విగ్రహాలు ఇటీవల కొంతమేర దెబ్బతిన్నాయి. దీనిపై ఈనెల 5న పోలీసులు 13 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఆరుగురు టీడీపీకి చెందిన వారు కాగా.. మిగిలిన ఏడుగురు ఆ పార్టీ అనుకూల మీడియా రిపోర్టర్లు. టీడీపీకి చెందిన మద్దసామి, మౌలాలి, గాలి హరిబాబులతో పాటు మరో ఆరుగురు రిపోర్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగతావారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
నిందితుల్ని కలిసిన మాజీ మంత్రి తనయుడు
విశాఖ : విగ్రహాల ధ్వంసం దుష్ర్పచారంపై తప్పుడు ప్రచారం చేసిన నిందితులను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కలవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఉన్న ఆయన.. నిందితులను కలవడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కాగా గొలుగొండ ఏటిగైరమ్మపేటలో గణేష్ విగ్రహం ధ్వంసమయ్యిందని కొందరు టీడీపీ నేతలు దుష్ర్పచారం చేశారు. ఏడాది క్రితం విరిగిన విగ్రహం.. ఇప్పుడు ధ్వంసమైనట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైరల్ చేసిన చేసిన నలుగురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వీరిలో కిలాడి నరేష్, పోలిశెట్టి సంతోషం, పోలిశెట్టి కనకరాజు, కల్యాణరావులు ఉన్నారు. ప్రస్తుతం వీరిని గొలుగొండ పీఎస్లో పోలీసులు విచారిస్తున్నారు. విగ్రహాల ధ్వంసం దుష్ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారిని ఉపేక్షించకూడదు: సచ్చిదానంద స్వామి దైవ ద్రోహానికి పాల్పడితే భగవంతుడు క్షమించడని గణపతి సచ్చిదానందస్వామి అన్నారు. విగ్రహాలను ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని, ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించాలన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విగ్రహాల ధ్వంసం దుష్ప్రచారం చేస్తున్న వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదన్నారు. -
రోడ్లకు నష్టం.. రూ.500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా మంగళవారం కురిసిన అతిభారీ వర్షానికి రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెరువులు ఉప్పొంగడం, గండ్లుపడటంతో వచ్చిన ఉధృతికి సమీప రోడ్లు దెబ్బతిన్నాయి. భారీగా కోతకు గురైతారు అట్టముక్కలా లేచి కొట్టుకునిపోయాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు, విజయవాడ, భూపాలపల్లి వెళ్లే జాతీయ రహదారులకు భారీగా నష్టం వాటిల్లింది. అలాగే సిద్దిపేట, వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో రాష్ట్ర రహదారులు బాగా దెబ్బతిన్నాయి. గత నెల రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు రూ.1,200 కోట్ల నష్టం వాటిల్లితే, మంగళవారం ఒక్కరోజే రూ.500 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ఇంకా పారుతుండటంతో తాత్కాలిక మరమ్మతులకు అవకాశం లేకుండా పోయింది. ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రం మట్టి, కంకరతో గుంతలను పూడ్చి వాహనాలను అనుమతిస్తున్నారు. హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై కొత్తగూడ వద్ద విజయవాడవైపు వంతెన అప్రోచ్రోడ్డు కోతకు గురై గోతులు ఏర్పడ్డాయి. దీని మీదుగా వాహనాల ప్రయాణం సాధ్యం కాకపోవటంతో ఎడమవైపు కాజ్వే మీదుగానే వాహనాలను అనుమతిస్తున్నారు. హైదరాబాద్–భూపాలపట్నం 163వ నంబరు జాతీయ రహదారిపై నారపల్లి వద్ద అర కిలోమీటరు వెడల్పుతో వరద నీరు ప్రవహించింది. వాహనాల రాకపోకలను బుధవారం మధ్యాహ్నం తర్వాత పునరుద్ధరించారు. అలాగే జోడిమెట్ల జంక్షన్ వద్ద చెరువు ఉప్పొంగడంతో అర కిలోమీటరు మేర రోడ్డు నీట మునిగింది. నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో బుధవారం మధ్యాహ్నం వరకు వాహనాల రాకపోకలను నిలిపేశారు. రూ.2 వేల కోట్లు కావాల్సిందే.. ప్రస్తుతం వరదలతో ముంచెత్తిన ప్రాంతాల్లో కొన్ని వంతెనలు కూడా నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. భవిష్యత్తులో ఈ తరహా ముంపు లేకుండా ఉండాలంటే ఆయా ప్రాంతాల్లో పనులు చేపడితే రూ.2 వేల కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జరిగిన నష్టాన్ని పూడ్చి పూర్వపు స్థితికి పునరుద్ధరించాలంటే రూ.500 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా. -
ఆగమాగం!
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి వరంగల్, మంచిర్యాల జిల్లాల్లో శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షం రైతులను ఆగం చేసింది. మహబూబాబాద్, వరంగల్ రూరల్ జిల్లాల్లో భారీ వర్షం కురవగా.. జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లితో పాటు వరంగల్ అర్బన్ జిల్లాలోనూ వర్షం కురిసింది. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యం, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. అంతా నిద్రలో ఉన్న సమయంలో వర్షం కురవగా రైతులు తేరుకుని కొనుగోలు కేంద్రాలకు వచ్చే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాంటాలు కాని ధాన్యంతో పాటు కాంటాలు పూర్తయిన ధాన్యం కూడా తడిసిపోయింది. లారీల కొరత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు పూర్తయిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించడం లేదు. దీంతో తీరని నష్టం వాటిల్లింది. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మంచిర్యాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో జనం బెంబేలెత్తిపోయారు. పలు చోట్ల ఇళ్లపైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు పడిపోయాయి. జిల్లావ్యాప్తంగా సగటున 41.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా భీమారంలో 110 మిల్లీమీటర్ల వర్షం పడింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. అర్ధరాత్రికావడం.. భారీ వర్షం రావడంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు ఆగమాగం అయ్యారు. జిల్లావ్యాప్తంగా 155 విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్ శాఖకు సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.మంచిర్యాల జిల్లా నస్పూర్లో కారుపై పడిన చెట్టు -
తాటి, కొబ్బరి చెట్లు కూలిపోతాయి!
సాక్షి, హైదరాబాద్: సూపర్ సైక్లోన్ 'అంఫన్' బీభత్సం సృష్టించే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న 'అంఫన్' తుపాను బుధవారం మధ్యాహ్నం దిఘా (పశ్చిమ బెంగాల్) మరియు హతియా దీవులు (బంగ్లాదేశ్) మధ్య తీరం దాటనుందని వెల్లడించింది. రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 155 నుంచి165 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. గరిష్టంగా 185 కిలోమీటర్ల వరకు భీకర గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ఈ సమయంలో 'అంఫన్' బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పూరి పాకలు, పురాతన నిర్మాణాలతో పాటు ఎగిరే వస్తువులకు ప్రమాదం ఉందని పేర్కొంది. కమ్యూనికేషన్, విద్యుత్ స్తంభాలు కూలిపోతాయని తెలిపింది. అనేక చోట్ల రైలు, రహదారి ప్రయాణాలకు అంతరాయం కలుగుతుందని అంచనా వేసింది. నిలబడి ఉన్న పంటలు, తోటలకు విస్తృతమైన నష్టం వాటిల్లుతుందని తెలిపింది. తాటి, కొబ్బరి చెట్లు ఎక్కువగా కూలిపోయే అవకాశముందని..పెద్ద పడవలు, ఓడలు ధ్వంసం కావొచ్చని ఐఎండీ హెచ్చరించింది. 'అంఫన్' ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ముఖ్యంగా ఈదురు గాలులు వీచే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. (అంఫన్తో జాగ్రత్త) బెంగాల్, ఒడిశా అప్రమత్తం 'అంఫన్' అతి తీవ్ర తుపానుగా మారడంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తుపాను ప్రభావిత ప్రాంతాలను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాలపై 'అంఫన్' ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) 37 బృందాలను బెంగాల్, ఒడిశాలోని తీర ప్రాంతాలకు తరలించింది. గత రెండు దశాబ్దాల కాలంలో బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ ఏర్పడటం రెండోసారి కావడం గమనార్హం. (అతి తీవ్ర తుపానుగా అంఫన్) -
ఆంధ్రప్రదేశ్ తీరం దాటేసిన ఫొని
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో పెను విధ్వంసం సృష్టించే దిశగా పయనిస్తున్న ఫొని పెను తుపాన్ శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ తీరం దాటింది. ఒడిశా రాష్ట్రంలోకి ప్రవేశించిన ఫొని తుపాను గంటకు 11 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పెను తుపానుగా కొనసాగుతూ గురువారం రాత్రి ప్రచండ తుపాను (సూపర్ సైక్లోన్)గా బలపడిన ఫొని ప్రచండ తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పయ నిస్తూ బలం పుంజుకుంటోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫొని పెను తుపాను ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోంది. గురువారం రాత్రికి విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 150 కిలోమీటర్లు, పూరీకి దక్షిణ నైరుతి దిశగా 275 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శుక్రవారం ఉదయం 10–11 గంటల మధ్య ఒడిశాలోని పూరీ సమీపంలో బలుగోడు వద్ద పెను తుపానుగానే తీరాన్ని దాటనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేస్తోంది. పెను తుపాను తీరాన్ని దాటాక ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ తీవ్ర తుపానుగా బలహీనపడి పశ్చిమ బెంగాల్ తీరంలోకి ప్రవేశించనుంది. క్రమంగా బలహీనపడుతూ బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోకి ప్రవేశించి అల్పపీడనంగా మారనుంది. తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ తుపాను తీరం దాటే సమయంలో గంటకు 170–180 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, ఇవి ఒక దశలో 200 కిలోమీటర్లకు పైగా గరిష్ట వేగానికి చేరే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఇవి 115 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని తాకే అవకాశం ఉందని ప్రకటించింది. తుపాను నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు శుక్రవారం బయటకు వెళ్లొద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) సూచించింది. ఉత్తరాంధ్రలో మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ వెల్లడించింది. ఒడిశాలో తుపాను భూమిని తాకే (తీరం దాటే) ప్రాంతం చాలాదూరం సమతలంగా ఉన్నందున ఉప్పెన ఏర్పడే ప్రమాదం ఉన్నట్లు గోపాల్పూర్ డాప్లర్ రాడార్ కేంద్రం అధికారులు అంచనా వేశారు. అదే జరిగితే ఒడిశాలో నష్టం తీవ్రంగా ఉండడం ఖాయం. పదో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ భీమిలి, కళింగపట్నం పోర్టుల్లో అత్యంత ప్రమాదకరమైన పదో నంబరు ప్రమాద హెచ్చరికలను వాతావరణ శాఖ గురువారం జారీ చేసింది. విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో ప్రమాదకరమైన ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, కాకినాడ, వాడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. గాలివానలు కొనసాగుతున్నాయి. కోస్తాంధ్రలో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని ప్రభుత్వం హెచ్చరించింది. శ్రీకాకుళంలో ఈదురు గాలుల ధాటికి ఊగుతున్న చెట్లు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గాలుల వేగం, వర్షం తీవ్రతకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూరిళ్లు నేలకూలుతాయని, పైకప్పు రేకులు ఉంటే లేచి పోయే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. విద్యుత్తు స్తంభాలు వంగిపోవడం, నేలకూలడం వల్ల విద్యుత్తు సరఫరా వ్యవస్థ దెబ్బతింటుందని పేర్కొంది. రోడ్డు, రైలు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వెల్లడించింది. మామిడి, అరటి, జీడి, కొబ్బరి వంటి తోటలు కూలిపోయే ప్రమాదం ఉన్నట్లు తెలిసింది. కోస్తా ప్రాంతాల్లో మొబైల్ టీమ్లను ఏర్పాటు చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించింది. ఒడిశా నుంచి వచ్చే వరద నీటితో గండం ఒడిశాలో తుపాను తీరం దాటనుండడం, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అక్కడి నుంచి వంశధార, మహేంద్రతనయ నదులు శ్రీకాకుళం జిల్లాలోకి ఉప్పొంగే ప్రమాదం ఉంది. పూరీ జిల్లా బ్రహ్మగిరి సమితి బలుకుండో వద్ద శుక్రవారం మధ్యాహ్నం 11–12 గంటల తుపాను మధ్య తీరం దాటే అవకాశం ఉందని గోపాల్పూర్ డాప్లర్ రాడార్ కేంద్రం అధికారులు తెలిపారు. తుపాను నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ సమీక్షించింది. ఇప్పటికే శ్రీకాకుళం, ఒడిశా తీరం వెంబడి వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలో ఉప్పెన తప్పదా? ఒడిశాకు తుపానుతో పాటు ఉప్పెన ముప్పు కూడా పొంచి ఉందని గోపాల్పూర్ డాప్లర్ రాడార్ కేంద్రం అధికారులు బాంబు పేల్చారు. ఒడిశాలో ఆస్తి, ప్రాణ నష్టం అధికంగా ఉంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ‘ఫొని’ తుపాను తీరం దాటే సమయంలో సముద్రంలో 1.5 నుంచి 2 మీటర్ల ఎత్తు వరకూ రాకాసి అలలు ఎగిసిపడే అవకాశముందని వాతావరణ అధికారులు అంటున్నారు. తుపాను తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసిన ఒడిశాలోని పూరీ జిల్లా బ్రహ్మగిరి సమితి బలుకుండో ప్రాంతం చాలా సమతలంగా ఉంటుంది. సాధారణంగా సమతల ప్రాంతంలో అధిక తీవ్రత గల తుపాన్లు సంభవిస్తే ఉప్పెన ప్రమాదం పొంచి ఉంటుంది. అలల తీవ్రతకు సముద్ర జలాలు గ్రామాల్లోకి పొంగిపొర్లడాన్ని ఉప్పెన అంటారు. సమతల భాగంలో తుపాను తీరం దాటితేనే ఇలా ఉప్పెన ముప్పు ఉంటుందని ఒడిశాలోని గోపాల్పూర్ డాప్లర్ రాడార్ కేంద్రం డైరెక్టర్ ఉమాశంకర్ దాస్ తెలిపారు. ‘‘పూరీ నుంచి జగత్సింగ్పూర్ వరకు 175 కిలోమీటర్ల పరిధిలో సముద్ర తీరం మొత్తం సమతల భూభాగమే ఉంది. అందువల్ల ఫోని తుపాను వల్ల ఉప్పెన వచ్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నాం. పూరీ–జగత్సింగ్పూర్ మధ్య బ్రహ్మగిరి, కృష్ణప్రసాద్, యరసమ, మహాకాలపడ, పారాదీప్ ప్రాంతాల్లో ఈ ముప్పు పొంచి ఉంది’’ అని దాస్ పేర్కొన్నారు. ఒడిశాలో 5 నదులకు వరద ముప్పు ‘‘తుపాను ప్రభావం వల్ల ఒడిశా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. తుపాను తీరం దాటే సమయంలో శుక్రవారం ఒక్కరోజే 25 నుంచి 30 సెంటీమీటర్లు (250 నుంచి 300 మిల్లీమీటర్ల) రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అకాశం ఉంది. దీంతో ఒడిశాలోని మహానది, వైతరణి, రుషికుయ్య, సురవర్ణరేఖ, దేవీ నదులతోపాటు వాటి ఉప నదులకు కూడా వరద ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి’’ అని ఐఎండీ హెచ్చరించింది. ఎక్కడి రైళ్లు అక్కడే.. ఫొని తుపాను ముప్పును దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ అప్రమత్తమైంది. హౌరా, భువనేశ్వర్ల నుంచి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, చెన్నై వైపునకు వెళ్లే 74 రైళ్లను రద్దు చేసింది. ఇప్పటికే మార్గమధ్యంలో ఉన్న రైళ్లను ప్రధాన రైల్వే స్టేషన్లలో నిలిపివేశారు. సహాయక చర్యలకు నౌకాదళం సిద్ధం ఫొని తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తూర్పు నౌకాదళం సిద్ధమైంది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నం నుంచి ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ రణ్వీర్, ఐఎన్ఎస్ కద్మత్ యుద్ధ నౌకలను సహాయక సామగ్రితోపాటు వైద్య బృందాలను సిద్ధం చేసినట్లు ఈఎన్సీ అధికారులు తెలిపారు. దీంతో పాటు అదనపు సహాయక సామగ్రి, వైద్య బృందాలు, డైవింగ్ టీమ్లను విశాఖ నుంచి ఒడిశాకు రోడ్డు మార్గంలో పంపిస్తున్నట్లు వెల్లడించారు. తుపాను తీరం దాటే ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించేందుకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ని విశాఖలో సిద్ధంగా ఉంచామన్నారు. టెంట్లు, దుస్తులు, మందులు, దుప్పట్లను బాధిత ప్రాంతాల ప్రజలకు అందించనున్నట్లు నౌకాదళ వర్గాలు వివరించాయి. అధికార యంత్రాంగం సర్వసన్నద్ధం ఫోని తుపానును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సహాయక కార్యక్రమాల నిమిత్తం జాతీయ విపత్తు సహాయక బృందాలు(ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు సహాయక దళాలు (ఎస్డీఆర్ఎఫ్)లను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాలకు చెందిన 15,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. విద్యుత్ స్తంభాలు, వైర్లు పడిపోతే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు విద్యుత్తు శాఖ అవసరమైన పనిముట్లను, సిబ్బందిని సిద్ధంగా ఉంచింది. -
చార్మినార్ అపశ్రుతి: కూలిన మినార్లోని ఆర్చి!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రసిద్ధిగాంచిన చారిత్రక కట్టడం చార్మినార్ సుందీకరణ పనుల్లో అపశ్రుతి దొర్లింది. ఒక మీనార్ పైన వున్న ఆర్చిలోని ఒక భాగం నేల కూలింది. రాత్రి జరిగిన ఈ ఘటనతో పాతబస్తీ ఉలిక్కిపడింది. అది కూలిన సమయంలో కింద ఎవరూ లేక పోవడంతో ఎటువంటి ప్రాణహానీ జరుగలేదు. కొద్దిరోజులుగా చార్మినార్ సుదరీకరణ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సుందీకరణ పనులు పూర్తయిన మినార్ ఆర్చిలోని కొంతభాగం ఇప్పుడు కూలింది. అయితే ఎండ వేడి వల్ల ఇలా జరిగిందా.. లేక మరేదైనా కారణమా అన్న విషయమై పురావస్తు శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
చార్మినార్ సుందరీకరణ పనుల్లో అపశ్రుతి
-
తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు!
న్యూయార్క్: కళాశాలకు చెందిన కంప్యూటర్లకు భారీగా నష్టం కల్గించినందుకు తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు శిక్ష పడనుంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన విశ్వనాథ్ ఆకుతోట(27) స్టూడెంట్ వీసాపై 2015లో అమెరికా వెళ్లాడు. అల్బనీ సిటీలో సెయింట్ రోజ్ కాలేజీలో 2017లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఫిబ్రవరిలో ‘యూఎస్బీ కిల్లర్’ అనే పెన్డ్రైవ్ సాయంతో కాలేజీలోని 66 కంప్యూటర్లను పాడుచేశాడు. ఈ పనిని మొబైల్లో షూట్చేశాడు. అధికారుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన నార్త్ కరోలినా పోలీసులు విశ్వనాథ్ను అరెస్ట్చేశారు. కావాలనే ఈ పనికి పూనుకున్నట్లు ఒప్పుకున్న అతడు జరిగిన నష్టం రూ.40 లక్షలు చెల్లించేందుకు కూడా అంగీకరించాడు. ఆగస్టులో కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. -
ఇందిరాపార్క్కు నష్టం కలిగించొద్దు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఇందిరాపార్క్కు నష్టం కలిగించే చర్యలు చేపట్టవద్దంటూ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ చట్ట నిబంధనలకు విరు ద్ధంగా ఇందిరాపార్క్కు నష్టం చేకూర్చడం, అందు లోని చెట్లను కూల్చివేయడం, టెన్నిస్ ప్లే గ్రౌండ్ను తరలించడం లాంటివి చేయొద్దని గురువారం ఆదేశించింది. వీఎస్టీ నుంచి ఇందిరాపార్క్ మైసమ్మగుడి వద్ద వరకు నిర్మిస్తున్న స్కైవేకి సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టంచేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఆర్డీపీ) ప్రాజెక్ట్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఆర్డీపీలో భాగంగా వీఎస్టీ నుంచి ఇందిరా పార్క్ మైసమ్మగుడి వద్ద వరకు రూ.350 కోట్లతో స్కైవే నిర్మించా లని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ స్కైవే వల్ల ఇందిరాపార్కు నష్టపోవాల్సి వస్తోందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ 102 మంది పౌరులు ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కోదండరాం గురువా రం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది రాజ్కుమార్ వాదనలు వినిపిస్తూ.. 2.6 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న స్కైవే వల్ల ఇందిరా పార్క్ తీవ్రంగా ప్రభావితమవుతోందని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న దాదాపు 200 చెట్లను కొట్టేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో ఇక్కడ తప్ప ఎక్కడా కూడా సింథటిక్ టెన్నిస్ కోర్టు లేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఇందిరాపార్క్ పరిరక్షణకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, పిటిషనర్లు కోరినవిధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులుగా ఉన్న అధికారులకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేశారు. -
ప్రమాదపు అంచున పాఠశాల
సాక్షి,బేతంచెర్ల : కర్నూలు జిల్లా బేతంచెర్ల పట్టణానికి సమీపాన ఉన్న అయ్యలచెర్వు ప్రాథమిక పాఠశాల పరిసరాలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ పాఠశాలలో సుమారు 158 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ముఖ్యంగా 15 సంవత్సరాల నుంచి పరిశ్రమల నుంచి వచ్చే నాపరాయి వేస్టేజీ, ఒండ్రు మట్టిని పాఠశాల వెనక భాగాన తరలించి, అక్కడే డంప్ చేయడంతో.. ఆ ప్రాంతం పెద్ద కొండలా కనిపిస్తోంది. ఎప్పుడైనా వర్షాలు ఎక్కువై నాపరాయి వేస్టేజీ కొండ కూలితే పాఠశాలపై పడే అవకాశం ఉంది. దానికితోడు, ఆ వేస్టేజీ రాళ్ల కింద ఉండే ఒండ్రుమట్టి పాఠశాల ఆవరణలోకి వచ్చి అసౌకర్యంగా దర్శనమిస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపి, నాపరాళ్లు, ఒండ్రుమట్టి వేస్టేజీని వేరే ప్రాంతానికి తరలించి, పాఠశాల ఆవరణాన్ని విద్యార్థులకు సౌకర్యంగా మార్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కొచ్చి విమానాశ్రయానికి భారీ నష్టం
కొచ్చి : ప్రకృతి బీభత్సానికి విలవిల్లాడిన కేరళ ఇపుడిపుడే కోలుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఎడతెగని వర్షాలు, వరదలతో రాష్ట్రానికి తీరిని నష్టం వాటిల్లింది. ప్రాణనష్టంతోపాటు, ఆస్తినష్టం భారీగా నమోదైంది. రోడ్డు, రైలు తదితర రవాణా వ్యవస్థలు అస్తవ్యస్థంగా మారిపోయాయి. జిల్లాలోని అనేక రోడ్డుమార్గాలు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా వరదల్లో చిక్కుకున్న కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం భారీగా నష్టపోయింది. ఆగస్టు 15నుంచి విమాన సర్వీసులు నిలిపివేసిన ఈ విమానాశ్రయ నష్టం 200 నుంచి 250 కోట్ల రూపాయల దాకా వుండవచ్చని అధికారులు అంచనా వేశారు. కేరళలో అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయం కొచ్చి. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులద్వారా అత్యధిక ఆదాయాన్ని సాధిస్తుంది. అయితే వరదల కారణంగా రన్వే మొత్తం నీటితో నిండిపోవడంతో విమానాశ్రయాన్ని ఆగస్టు 26వ తేదీవరకు మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వరద పరిస్థితి శాంతించడంతో తమ సేవల్ని పునరుద్ధరించడానికి 24 గంటలూ శ్రమిస్తున్నామనీ, ప్రస్తుతం, రన్వేను బాగు చేస్తున్నామని కొచ్చి విమానాశ్రయాధికారి అధికారి ఒకరు చెప్పారు. 250 కి పైగా ప్రజలు ఈ పునరుద్ధరణ ప్రయత్నాలలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారని పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ జయనా తెలిపారు. ఆగస్టు 26 నుంచి తమ విమాన సేవలు పునఃప్రారంభయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. పూర్తిగా సోలార్ ప్యానెల్స్తో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ కార్యాలయంలో ఎనిమిది విద్యుత్ స్టోరేజ్ ప్లాంట్లలో నాలుగు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. సోలార్ పానళ్ళలో 20 శాతం దెబ్బతిన్నాయి. ప్రస్తుతం 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాం . ఒక నెలలోనే సాధారణ పరిస్థితికి చేరుకుంటామని పీఆర్వో చెప్పారు. వీటి మరమ్మతులకు దాదాపు 10కోట్ల రూపాయలదాకా ఖర్చవుతుందని అంచనావేశామని తెలిపారు. అయితే విమానాశ్రయానికి మొత్తానికి బీమా ఉన్నకారణంగా రూ. 250 కోట్ల అంచనా నష్టం తమకు బీమా సంస్థ నుంచి పరిహారం లభించే అవకాశడం ఉండటం ఊరటనిచ్చే అంశం. -
కామరెడ్డి జిల్లాలో అకాలవర్షంతో అపారనష్టం
-
వాటర్ ట్యాప్ తాకగానే.. 240 వోల్ట్స్ షాక్
పెర్త్ : నిత్యం ఉపయోగించే వాటర్ ట్యాప్ (నీళ్ల కొళాయి)ను తాకడం ఆ బాలిక పాలిట శాపంగా మారింది. పెరడులోని మొక్కలకు నీళ్లు పట్టిన అనంతరం వాటర్ ట్యాప్ను బంద్ చేసేందుకు ఆమె దానిని ముట్టుకోవడంతో ఏకంగా 240 వోల్ట్స్ పవర్తో షాక్ కొట్టింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిన ఆ బాలిక మెదడు దెబ్బతినడంతో తిరిగి మామూలు స్థితికి రాలేని పరిస్థితుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని పెర్త్ పట్టణమైన బెల్డన్లో చోటుచేసుకుంది. డేనిషర్ వుడ్స్ అనే బాలిక తన ఇంటి పెరడులోని మొక్కలకు నీళ్లు పెట్టిన అనంతరం.. వాటర్ ట్యాప్ను ఆఫ్ చేయడానికి దాన్ని ముట్టుకోగానే.. షాక్ కొట్టింది. దీంతో డేనిషర్ అక్కడికక్కడే కుప్పకూలింది. అది గమనించిన ఆమె తల్లి లేసీ హ్యారిసన్ ఆస్పత్రికి తరలించగా.. హై ఓల్టేజ్ పవర్ కారణంగా ఆ బాలిక మెదడు పూర్తిగా దెబ్బతిన్నదని వైద్యులు తెలిపారు. 50 ఓల్ట్ల కన్నా ఎక్కువ విద్యుత్ శరీరానికి తగిలినపుడు తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వివరించారు. దాదాపు 240 ఓల్ట్ల షాక్ తగలటం వల్ల ఆమె మెదడుకు తీవ్రగాయమైందని, ఇక ఎప్పటికీ ఆమె తిరిగి కోలుకునే అవకాశం లేదని తెలిపారు. ప్రాణపాయ స్థితిలో ఆస్పత్రి బెడ్ పై ఉన్న కూతుర్ని చూసి డేనిషర్ తల్లి కంటతడిపెట్టుకుంది. ఎలాగైనా తన కూతురిని బతికించాలని వైద్యులను ప్రాధేయపడింది. ఇదివరకే తనకు చిన్నపాటి కరెంట్ షాక్ తగిలిందని విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కనీసం ఎలాంటి హెచ్చరికలు కూడా చేయలేదని ఆమె తెలిపింది. న్యూట్రల్ కేబుల్ వైర్ తెగిపోయినపుడు ఇంటిలో ఎర్తింగ్ అనుసంధానం చేయబడిన ప్రతి వస్తువుకు కరెంట్ పాస్ అయ్యే అవకాశం ఉంటుందని విద్యుత్ అధికారులు అంటున్నారు. అసలు నీళ్ల కొళాయికి కరెంట్ ఎలా వచ్చింది. అందుకు ఇంటిలోని విద్యుత్ సమస్యలే కారణమా అన్నవిషయాలపై అధికారులు దృష్టి సారించారు. -
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
సాక్షి, తిప్పిరెడ్డిపల్లె(చాపాడు): తిప్పిరెడ్డిపల్లెలో శనివారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలి గ్రామానికి చెందిన పామిడి ఓబయ్యకు చెందిన ఇల్లు దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. రాత్రి ఇంట్లోకి వెళ్లిన ఓబయ్య భోజనం చేసుకునేందుకు గ్యాస్ స్టవ్ వెలిగించేందుకు ప్రయత్నించగా ఉన్నట్టుండి స్టవ్ పేలింది. వెంటనే అప్రమత్తమైన ఆయన బయటికి రాగా ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లోని సామగ్రితో పాటు లక్ష రూపాయల నగదు, తులానికి పైగా ఉన్న ఉంగరం కాలిపోయాయి. ఫైర్ ఇంజిన్ వెంటనే వచ్చి మంటలను ఆర్పి వేసింది. -
అమరజీవి విగ్రహం ధ్వంసం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జోగిపేటలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెల రోజుల్లో రెండోసారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల ఆర్యవైశ్య సంఘాలు మండిపడుతున్నాయి. అలాగే విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, అలాగే భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. -
బ్యారేజీ....డామేజీ....?
ధవళేశ్వరం ఆనకట్ట భద్రత గాలికి నిషేధాజ్ఞలున్నా భారీ వాహనాల రాకపోకలు చెక్ పోస్టులున్నా ’చెకింగ్’ శూన్యం శ్లాబు పెచ్చులూడి గోతులు ప్రశ్నార్ధకమవుతున్న బ్యారేజీ పటిష్టత మర్మమతులు చేయని ప్రభుత్వం 1982 బ్యారేజీ కం బ్రిడ్జి ప్రారంభం ధవళేశ్వరం వద్ద బ్యారేజీ కం బ్రిడ్జిని 1982 అక్టోబర్ 29న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జాతికి అంకితం చేశారు. 1969లో దీని నిర్మాణ వ్యయం రూ.26.59 కోట్లు కాగా తర్వాత అది రూ.70 కోట్లకు పెరిగింది. బ్యారేజీ పనులు పూర్తయ్యే సమయానికి (ఆనకట్టతో కలుపుకుని) రూ.150 కోట్లకు చేరింది. 500 పనిచేసిన ఇంజినీర్లు ముంబాయికి చెందిన నేషనల్ ప్రాజెక్ట్సు కనస్ట్రక్షన్ కంపెనీ (ఎన్పీïసీసీ) ఆ«ధ్వర్యంలో నిర్మాణం జరిగింది. సెంట్రల్ వాటర్ కమిషన్ న్యూఢిల్లీ, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ హైదరాబాద్లు కన్సటెంట్స్గా వ్యవహరించాయి. అప్పట్లో ఐదువందల మంది ఇంజినీర్లు, 1,500 మంది టెక్నికల్ సిబ్బంది పనిచేశారు. 300 వంతెనపై రోజుకు తిరిగే వాహనాలు 2001 నుంచి బ్యారేజీ భద్రతను దృష్టిలో ఉంచుకుని భారీ వాహనాల రాకపోకలు నియంత్రించారు. ప్రస్తుతం కార్లు, బస్సులు, ఇతర మినీ వాహనాలు రోజుకు సుమారు మూడు వందల వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. 10.13 లక్షలు ఆయకట్టు ఎకరాలలో భారీ వాహనాల రాకపోకల పూర్తి నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. లేకపోతే బ్యారేజీ బేరింగ్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల దెబ్బతిన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని 10.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బ్యారేజీ భద్రత ఎంతో ముఖ్యం. ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూపకపోతే జాతీయ కట్టడం శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉంది. కొవ్వూరు: ఉభయ గోదావరి జిల్లాలకు తలమానికంగా ఉన్న ధవళేశ్వరం బ్యారేజీ పటిష్టత ప్రశ్నార్థకంగా మారింది. సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్టను స్వాతంత్య్రానికి పూర్వమే నిర్మించిన విషయం తెలిసిందే. ఆనకట్టను అనుకుని 1982లో బ్యారేజీ కం బ్రిడ్జిని నిర్మించారు. దశాబ్దాలుగా సేవలందిçస్తున్న ఈ వారధిపై భారీ వాహనాల రాకపోకలకు నిషేధాజ్ఞలు ఉన్నా ఆచరణకు నోచుకోవడం లేదు. 2001లో ఈ బ్యారేజ్ను సందర్శించిన నిపుణుల కమిటీ ఇది అత్యంత ప్రమాదకరంగా ఉందని నిర్ధారించింది. కాంక్రీట్ నిర్మాణం కూడా పలుచోట్ల పెచ్చులు ఊడుతున్నట్టు గుర్తించారు. దాంతో ఈ బ్యారేజీపై నుంచి భారీ వాహనాల రాకపోకలను నిలిపి వేశారు. నీటిపారుదల శాఖ అధికారులు ఆనకట్టకు రెండు వైపులా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సిబ్బందిని కాపలా పెట్టారు. అయితే సిబ్బంది చేతివాటంతో రాత్రి పూట భారీ వాహనాలు గుట్టుచప్పుడు కాకుండా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇటీవల ధవళేశ్వరం వైపు అధిక సంఖ్యలో వెళుతున్న భారీ వాహనాలను గుర్తించి మద్దూరులంక గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో బండారం బయట పడింది. బ్యారేజీపై పదిటన్నుల సామర్ధ్యం మించిన వాహనాలకు అనుమతి లేదు. అయినప్పటికీ కొందరు అధికారులు, సిబ్బంది సహకారంతో యాభై, ఆరవై టన్నుల సామర్ధ్యం కలిగిన భారీ వాహనాలు పట్టపగలు వెళుతుండడాన్ని గుర్తించి స్ధానికులు అడ్డుకున్నారు. నీటి పారుదలశాఖ పనులు నిమిత్తం వస్తున్న లారీలు కావడంతో అనుమతించినట్టు అధికారులు సమర్ధించుకుంటున్నారు. నిడదవోలుకి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధికి చెందిన భారీ వాహనాలు బ్యారేజీపై నుంచే నిత్యం రాకపోకలు సాగిస్తున్నట్టు సమాచారం. కాకినాడ నుంచి వచ్చే వారి వాహనాలకు ఈ మార్గం దగ్గరగా ఉండడంతో అధికారులను బెదిరించి మరీ రాకపోకలు సాగిస్తున్నట్టు చెబుతున్నారు. మరమ్మతులకు నోచుకోని బ్యారేజీ: సీతంపేట నుంచి ధవళేశ్వరం వరకు ఎనిమిది కిలో మీటర్లు దూరం ఏర్పాటు చేసిన రోడ్డు పలు చోట్ల దెబ్బతింది. 3.5 కిలో మీటర్లు పొడవున నాలుగు అంచెలుగా బ్యారేజి మీదుగా రాకపోకలు సాగించేందుకు ఏర్పాటు చేíసిన రహదారి భారీ వాహనాలతో దెబ్బతింతోంది. రెండేళ్ల కిత్రం పుష్కరాల సమయంలో పూర్తిగా దెబ్బతిన్న బ్యారేజీపై రోడ్డును పునర్ నిర్మాణం చేశారు. ప్రస్తుతం పలుచోట్ల శ్లాబు పెచ్చులూడి గోతులు పడుతున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో ఈ గోతులు మరింత పెద్దవి కావడమే కాకుండా బ్యారేజీ పటిష్టత దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతోంది. ప్రయివేటు సెక్యూరిటీ ఏర్పాటు: భారీ వాహనాల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. బ్యారేజీ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏడాదిపాటు పనిచేసే ఒప్పందంతో ప్రయివేటు సెక్యూరిటీని నియమించాం. ఆనకట్టకు ఇరువైపులా చెక్పోస్టులు నిర్వహిస్తాం. ఆగష్టు మొదటి వారం నుంచి ప్రయివేటు సెక్యూరిటీ అందుబాటులోకి వస్తుంది. బ్యారేజీ రోడ్డు దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేయిస్తాం. పలు చోట్ల మరమ్మతులతో పాటు కాంక్రీటు వేయాల్సి ఉంది. దీనికి రూ.4 లక్షలు కేటాయించాం. ఎన్.కృష్ణారావు, ఈఈ, గోదావరి హెడ్వర్స్,ధవళేశ్వరం -
మీలో క్షమాగుణం ఉందా?
సెల్ఫ్ చెక్ క్షమాగుణం చాలా గొప్పది. పగ, కసి, ద్వేషం, ప్రేమరాహిత్యం వంటివి క్షమ ద్వారా దూరం అవుతాయి. క్షమించే గుణం ఉంటే మన చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలంగా కనిపిస్తుంది. దీర్ఘకాలంగా ఆత్మీయులతో దూరంగా ఉన్నప్పుడు వారిని క్షమించగలిగితే తిరిగి పూర్వపు అనుబంధాలను సొంతం చేసుకోవటం కష్టమేమీ కాదు. మీలో క్షమాగుణం ఎంతమేర ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. 1. మీకు హాని చేసిన వ్యక్తి మీ ముందుకు వచ్చి క్షమించమంటే సహనంతో ఉండగలరు. ఎ. అవును బి. కాదు 2. గతాన్ని ఒకసారి పరికించుకొని వారిని క్షమించే ప్రయత్నం చేస్తారు. ఎ. అవును బి. కాదు 3. మీరు క్షమించాలనుకొనే వ్యక్తి భవిష్యత్తులో మళ్లీ మీకు ఇబ్బంది కలిగించకుండా ఉండగలరా? అని తర్కించుకుంటారు. ఎ. అవును బి. కాదు 4. పాజిటివ్గా ఆలోచించటానికే ప్రయత్నిస్తారు. ఈ విధమైన ఆలోచనల ద్వారా క్షమాగుణాన్ని పెంపొందించుకుంటారు. ఎ. అవును బి. కాదు 5. క్షమించాలనుకున్నప్పుడు వారితో ముఖాముఖి లేదా ఫోన్లో మాట్లాతారు. ఎ. అవును బి. కాదు 6. అప్పుడప్పుడు కలుసుకోవటం ద్వారా వారితో పూర్వపు సంబంధాలు కొనసాగించే ప్రయత్నం చేస్తారు. ఎ. అవును బి. కాదు 7. మీ సమస్యను తీర్చగలరనుకున్న వారికి ఈ సంగతి చెప్పి సలహాలు పొందుతారు. ఎ. అవును బి. కాదు 8. క్షమాగుణం వల్ల కలిగే అనుభూతి గొప్పదనుకుంటారు. ప్రేమించటం ద్వారా మనసు తేలిక పడుతుందని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 9. మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసిన వారు అప్పుడు అలా ఎందుకు ప్రవర్తించారు? దానిలో మీ పాత్ర ఎంత? వంటివి గుర్తుచేసుకొని కారణాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తారు. ఎ. అవును బి. కాదు 10. మీకు– వారికి మధ్య ఉన్న అనుబంధం ఎంత దృఢమైన దో గుర్తిస్తారు. తిరిగి వారితో రిలేషన్ కొనసాగించటం మీకు ఆనందమే. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు ఏడు వస్తే మీలో క్షమించే గుణం ఉంటుంది. మిమ్మల్ని అవమానించిన/బాధ పెట్టిన వారిని క్షమించేస్తారు. ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువ వస్తే క్షమించే తత్వం తక్కువే. మీకు ఇబ్బంది కలిగించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించలేరు. దీనివల్ల ప్రశాంతంగా ఉండటం మీ వల్ల కాదు. కానీ... ఫర్గివ్నెస్ ఎలా ఉంటుందో ప్రయత్నించి చూడండి. -
వర్షంతో దెబ్బతిన్న వరి
రుద్రవరం: అకాల వర్షంతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. రుద్రవరం మండలంలో గురువారం రాత్రి గంటకు పైగానే గాలివాన బీభత్సం సృష్టించింది. రుద్రవరం, ఆలమూరు, ముత్తలూరు, టి. లింగందిన్నె, తదితర గ్రామాలలో కోత దశలో ఉన్న 500 ఎకరాల్లో వరి నేల కొరిగింది. అలాగే మామిడి కాయలు నేలరాలి రైతులకు నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసిన పసుపు తడిసి ముద్దయింది. -
విజయవాడ వన్టౌన్లో కుంగిన రోడ్డు
-
అవి తెగ లాగించేస్తున్నారా...అయితే జాగ్రత్త!
ఆరోగ్యంగా ఉండాలని ఎక్కువ పళ్లు తీసుకోవడం మనకందరికీ తెలిసిందే.. బాడీలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికంటూ ఎక్కువగా, పండ్లు, పళ్లరసాల పైనే ఆధారపడే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అయితే పండ్లను, జ్యూస్ లను, కార్న్ సిరప్, దీనితోపాటు ఎక్కువ తేనెను సేవించడం వల్ల బరువు తగ్గడం మాట అటుంచి బరువు ఇంకా బాగా పెరుగుతారని ఓ ఆశ్చర్యకరమైన పరిశీలనలో తేలింది. అంతేకాదు నరాల వ్యాధికి గురికాడం, లివర్ పాడైపోవడం లాంటి ప్రమాదమూ సంభవించే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. శరీర మెటబాలిజం, నరాల పనితీరుపై రెండురకాల సుగర్ ప్రభావాలపై ఆడ ఎలుకమీద అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం కోసం, ఆడ ఎలుకలలో గ్లూకోజ్ (శరీరంలో కార్బొహైడ్రేట్స్ విచ్ఛిత్తి తర్వాత సహజంగా కనిపించే చక్కెర రూపం) ఫ్రక్టోజ్ (పండ్లు మరియు పండ్ల రసాల్లోఉండే చక్కెర ) సాధారణ ఆహారానికి బదులుగా ద్రవరూపంలో ఎనిమిది వారాల పాటు అందించారు. గ్లూకోజ్ తినిపించిన ఎలుకల్లో కంటే ఫ్రక్టోజ్ ఇచ్చిన ఎలుకల్లో మొత్తం కేలరీల శాతం ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. వీటిలో అధిక ట్రైగ్లిజరైడ్స్, కారణంగా కాలేయం బరువు పెరగడంతో , కాలేయంలో కొవ్వును కరిగించే శక్తి క్షీణించడం, రక్తపోటును ప్రభావితం చేసే బృహద్ధమని పనితీరు మందగించడాన్ని గుర్తించినట్టు తెలిపారు. ఫలితంగా అధిక బరువుతోపాటు, గుండె వ్యాధి, మధుమేహం లాంటి ఇతర ప్రమాదకారక దీర్ఘ వ్యాధుల్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు తేల్చారు. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కారణంగా శరీర బరువులో మార్పులు ఉన్నప్పటికీ కేవలం ఫ్రక్టోజ్ గ్రూపు లో మాత్రమే ఎక్కువ బరువు పెరిగిందని తెలిపారు. హార్ట్ అండ్ సర్క్యులేటరీ ఫిజియాలజీ సమర్పించిన ఈ పరిశోధనా పేపర్ ను అమెరికన్ జర్నల్ ప్రచురించింది. అయితే దీర్ఘకాల ఆరోగ్యంపై ప్రభావం చూపేవాటిల్లో తీపి పదార్థాల మూలంగా శరీరంలో చేరే కాలరీస్ మాత్రమే కాదని గుర్తించాలన్నారు. -
బాటిల్ పగిలితే పండగే..
• డ్యామేజ్ పేరిట ఐఎంఎల్ డిపోలో దోపిడీ • పగిలేది తక్కువ....చూపించేది ఎక్కువ • వైరా మద్యం డిపోలో సిబ్బంది చేతివాటం వైరా: మద్యం డిపోలో ఐఎంఎల్(ఇండియన్ మేడ్ లిక్కర్) సిబ్బంది బహిరంగంగానే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వైరా ఐఎంఎల్ డిపోలో తక్కువ డ్యామేజ్ను ఎక్కువగా చూపి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వైరా డిపో నుంచి జిల్లా వ్యాప్తంగా బార్లు, వైన్స్కు మద్యం సరఫరా చేస్తుంటారు. వివిధ మద్యం కంపెనీల సరఫరాదారుల ద్వారా వచ్చిన మద్యాన్ని డిపోల్లో నిల్వ ఉంచుతారు. మద్యం సరఫరాకు సంబంధించిన లోడింగ్, అన్లోడింగ్ సమయంలో కొంత మేర డ్యామేజ్ కావడం సహజం. పగిలిన బాటిళ్లను డ్యామేజ్ను లాస్ కింద చూపించడాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు డ్యామేజ్ను ఎక్కువగా చూపుతున్నారు. ఈ తతంగం చాలాకాలం నుంచి జరుగుతోంది. ఒకటికి....రెండు లెక్క... డిపోలో ఒక బాటిల్ పగిలితే రెండు లెక్క రాస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మామూలుగా ఐదు బాక్సుల(కాటన్లు) లిక్కర్, బీర్ డ్యామేజ్ అయితే 10 బాక్సులు డ్యామేజ్ అయినట్లు చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పగిలిన సీసాల పేరు చెప్పి మిగుల్చుకున్న మద్యం బాటిళ్లను తమకు తెలిసిన వారు నిర్వహించే బార్లు, వైన్స్ షాపులకు సరాసరి ధరకు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డ్యామేజ్ అయిన సరుకుకు అధికారికంగా ఎలాంటి బిల్లులూ ఉండకపోవడం వీరి తెరచాటు వ్యవహారానికి దోహదపడుతోంది. డిపోలో ధర కన్నా తక్కువకు కొందరు డిపో సిబ్బంది సరుకు బయటకిస్తుండటంతో వైన్స్ యజమానులు వాటిపై మక్కువ చూపుతున్నారని వినికిడి. ఈ విధంగా వచ్చిన రోజువారీ ఆదాయం తిలాపాపం తలా పిడికెడు అన్నచందంగా పంపిణీ జరుగుతుంది. ప్రతిరోజూ రూ.వేలల్లో ఆదాయం ఐఎంఎల్ డిపోలకు రోజు వారీగా పదుల సంఖ్యలో లారీలు మద్యాన్ని తీసుకొస్తుంటాయి. ఇక్కడి నుంచి తిరిగి రెండు జిల్లాల్లోని వైన్స్లు, బార్ షాపులకు అదేస్థాయిలో వెళ్తుంటాయి. ఒక్కో లారీలో తక్కువలో తక్కువ రెండు మూడు బాక్సులైనా పగిలినట్లుగా ఇక్కడి సిబ్బంది చూపుతున్నట్లు సమాచారం. రవాణా సమయంలో డ్యామేజ్ అయితే సదరు కంపెనీ వారే ఆ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. రోజుకు డిపోలో పది నుంచి పదిహేను బాక్సులనైనా డ్యామేజ్ కింద చూపుతారని తెలుస్తోంది. ఓ కంపెనీకి చెందిన క్వార్టర్ బాటిళ్ల మద్యం ఒక్కో బాక్సు ధర వైన్స్ షాపులో పెరిగిన ధరల ప్రకారం రూ.4 వేల నుంచి రూ.5 వేల మధ్యలో ఉంటుంది. ఒక రోజు ఈ కంపెనీకి చెందిన కనీసం ఐదు బాక్సులు డ్యామేజ్ చూపితే ఒక్కో బాక్సుకు రూ.2 వేల చొప్పున ఐదు బాక్సులకు సుమారుగా రూ.10 వేల వరకు ఆదాయం వస్తుందని తెలుస్తోంది. ఇక్కడి విధులకు పోటీ ఎక్కువ వైరాలోని ఐఎంఎల్ డిపోలో పని చేసేందుకు ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది ఇష్టపడతారు. ఇక్కడ పనిచేస్తే వేతనంతో పాటు చేతి నిండా ఆదాయం ఉంటుందనే ఉద్దేశంతో ఎక్సైజ్ వారు ఐఎంఎల్ డిపోలో పని చేసేందుకు పోటీ పడతారని సమాచారం. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు ముడుపులు ముట్టజెప్పి మరీ పోస్టింగ్లు వేయించుకుంటారు. ఇక్కడ పని చేస్తున్న కొద్ది మంది అధికారులు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. వారికి బదిలీలు కూడా లేవు. అంటే ఇక్కడ పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. -
జీఎంఆర్ ఇన్ఫ్రాకు రూ.700 కోట్ల నష్టం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సెప్టెంబరు త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో రూ.700 కోట్ల నష్టం వాటిల్లింది. అనుబంధ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడుల విలువ తగ్గడమే ఇందుకు కారణమని కంపెనీ వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.7.4 కోట్ల నష్టం వచ్చింది. క్యూ2లో టర్నోవరు క్రితంతో పోలిస్తే రూ.281 కోట్ల నుంచి రూ.330 కోట్లకు చేరింది. -
ఎలక ఎక్కిరించె!
– ఫలితం ఇవ్వని ఎలుకల నిర్మూలన కార్యక్రమం – రూ.20 లక్షలు వృథా – పంటలపై ఎలుక దాడి ఉధృతం – చేసేది లేక రైతులు సొంతంగా ఖర్చు చేసుకుంటున్న వైనం ఉండి : పిల్లి గుడ్డిదైతే ఎలక ఎక్కిరించిందన్నది సామెత. ఈ ఏడాది సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం ఫలితం చూస్తే ఈ సామెత గుర్తుకురాకమానదు. జిల్లావ్యాప్తంగా మూషికాల నిర్మూలనకు వ్యవసాయ శాఖ రూ.20 లక్షలు ఖర్చు చేయగా పంచాయతీలు ఇంకా ఎక్కువగా ఖర్చు చేశాయి. ఫలితం మాత్రం శూన్యం. సామూహిక ఎలుకల నిర్మూలన పేరుతో ప్రభుత్వం చేసిన హంగామా అంతాఇంతా కాదు. వారం ముందు నుంచి వారం తరువాత వరకు ప్రచారం చేస్తూనే ఉన్నారు. రైతును ఆదుకుటున్నాం అంటూ ఊదరగొట్టారు. తీరా చూస్తే ప్రయోజనం శూన్యం. ఆగస్ట్ 21, 22 తేదీల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. దీని కోసం జిల్లావ్యాప్తంగా 52 మండలాల్లో 903 గ్రామాల్లో ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని రైతులకు రూ.20 లక్షల ఖర్చుతో వ్యవసాయ శాఖ ఎలుకల మందును అందించింది. అంతే కాకుండా సొసైటీలు ఉచితంగా నూకలు అందించాయి. అంతేకాకుండా గ్రామ పంచాయతీలు ఒక్కొక్కటి సుమారుగా రూ.2 వేల చొప్పున ఖర్చు చేశాయి. ఇలా జిల్లాలోని గ్రామ పంచాయతీలు సుమారు రూ.25 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఫలితం శూన్యం సామూహికంగా ఎలుకల నిర్మూలన చేపట్టాలంటూ ప్రభుత్వం భారీగా ప్రచారం కూడా చేసింది. రైతులు ఎన్నో ఆశలతో ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుండగా పూర్తిస్థాయిలో ఎలుకల మందును వినియోగించారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. ప్రస్తుతం వరిచేలల్లో ఎలుకలు ఉధతి విపరీతంగా ఉంది. ప్రభుత్వం సరఫరా చేసిన ఎలుకల మందు ఏమాత్రం ఫలితం ఇవ్వలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. దాదాపు 3 లక్షల ఎకరాల్లో ఎలుకల ఉధతి ఎక్కువగా ఉంది. ప్రభుత్వం అందించిన ఎలుకల మందు పెట్టాము కదా అనే ఆలోచనలో ఉన్న రైతన్నలకు ఎలుకలు సామూహికంగా దాడి చేసి విపరీతమైన పంట నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీంతో చేసేది లేక రైతులు తమ సొంత ఖర్చులతో ఎలుకలను పట్టిస్తున్నారు. సొంత రైతులు అయితే కొంతమేర ఇబ్బంది లేదు గాని కౌలు రైతులు అధిక ఖర్చుతో అల్లాడిపోతున్నారు. రైతులంతా ఒకేసారి ఈ కార్యక్రమం చేపట్టడంతో ఎలుకలు పట్టుకునే వారికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఒక్కో ఎలుకకు రైతుల నుంచి రూ.40 నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి ఎలుకల మందును వాడినందుకు తగిన ఫలితాన్ని అనుభవించాము అని రైతులు వాపోతున్నారు. ఏమాత్రం ప్రయోజనం లేదు ప్రభుత్వం అందించిన ఎలుకల మందు వాడటం వల్ల పెద్దగా ప్రభావం చూపడం లేదు. చెప్పినంతగా ఫలితాలు రావడం లేదు. ఎలుకల ఉధతి పంటపై తీవ్రంగా ఉండడంతో సొంత ఖర్చుతో నిర్మూలించుకోవాల్సి వస్తోంది. దీంతో ఖర్చు తడిసిమోపెడవుతోంది. – పీవీ గోపాలకష్ణంరాజు, రైతు, యండగడి అధిక వర్షాల వల్లే.. సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో కొంత మేర ఫలితాలు వచ్చాయి. వర్షాలు అధికంగా కురవడంతో ఎలుకల మందు అంతగా ఫలించలేదు. అయితే రైతులంతా సామూహికంగా ఎలుకల నిర్మూలన చేపడితే మంచి ఫలితాలు ఉంటాయి. – వై.సాయిలక్ష్మీశ్వరి, జేడీ, వ్యవసాయ శాఖ -
అన్నదాత ఆక్రందన
-
నష్టంపై పూర్తి నివేదిక అందజేస్తాం
దామరచర్ల : పంట నష్టంపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని డీడీఏ మాదవి తెలిపారు. మంగళవారం దామరచర్ల, తాళ్లవీరప్పగూడెం, వాడపల్లి, అడవిదేవులపల్లి తదితర ప్రాంతాల్లో నష్టపోయిన పంటలను రాష్ట్ర బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా పత్తి, వరి తదితర పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు తాము వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడుతూ మండలంలో భారీగా పంట నష్టం జరిగిందన్నారు. పంట దెబ్బ తిన్న ప్రతి గ్రామాన్ని సందర్శించి నివేదికలు పంపితే రైతులకు పరిహారం అందేలా తాను కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో బృందం సభ్యులు శైలజ, వినోద్, బాలాజీ, శంకర్, ఎంపీపీ కురాకుల మంగమ్మ, ఏఓ నూతన్కుమార్, తహసీల్దార్ గణేష్, వీరకోటిరెడ్డి పాల్గొన్నారు. -
కుంగిన సర్వన్పల్లి ప్రాజెక్ట్ కట్ట
-
కుంగిన సర్వన్పల్లి ప్రాజెక్ట్ కట్ట
ధారూర్: రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలంలోని సర్వన్పల్లి ప్రాజెక్ట్ కట్ట రెండున్నరడుగుల మేర కుంగింది. విషయం తెలుసుకున్న ప్రాజెక్ట్ ఎస్ఈలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులు ప్రారంభమయ్యాయి. రూ. 2.92 కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల్లో నాణ్యత లేకపోవడంతోనే కట్ట కుంగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
రోడ్లు చిద్రం
-
తిరుపతి నుంచే టీడీపీ పతనం
– నగరపాలక సంస్థ ఎన్నికలే నాంది కావాలి – వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి – కార్పొరేషన్ ఎన్నికలపై పార్టీ కార్యాచరణ సమావేశం సాక్షి ప్రతినిధి, తిరుపతి : ప్రజామోదం లేని పాలన సాగిస్తున్న టీడీపీ పతనం తిరుపతి నుంచే ప్రారంభం కావాలనీ, ఇందుకు నగర పాలకసంస్థ ఎన్నికలే నాంది కావాలని కమలాపురం ఎమ్మెల్యే, జిల్లా వైఎస్సార్సీపీ పరిశీలకులు రవీంద్రనాథ్రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి ఎయిర్బైపాస్రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఉదయం వైఎస్సార్సీపీ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణస్వామి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి హాజరైన రవీంధ్రనాథ్రెడ్డి పార్టీ నేతలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందనీ, రైతులు, డ్వాక్రా మహిళలు, ఉద్యోగులను హామీలతో మాయ చేసిన సీఎం చంద్రబాబుపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. అన్నింటా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న చంద్రబాబుకు తిరుపతి కార్పోరేషన్ ఎన్నికలు చెంపపెట్టు కావాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బూత్ కమిటీలను బలోపేతం చేయాలని, మంచి మెజార్టీతో కార్పోరేషన్ను కైవసం చేసుకోవాల్సి ఉందన్నారు. తిరుపతిలో ప్రజా స్పందన వైఎస్సార్సీపీకే ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అన్ని బూత్లకు కమిటీలను వేసి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసినట్లు తెలిపారు. సాంకేతికతను వాడుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సూచించారు. డివిజన్ల వారీగా పార్టీ ఇన్చార్జ్లను నియమిస్తే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. సమావేశంలో కార్పొరేషన్ ఎన్నికల పరిశీలకులు సామినేని ఉదయభాను, ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ సునీల్,పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్తలు ఆదిమూలం, చంద్రమౌళి, జంగాలపల్లి శ్రీనివాసులు, రాకేశ్రెడ్డి, సీవీ కుమార్, రెడ్డెమ్మ, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి, ఎస్సీసెల్ నేత దామినేటి కేశవులు, ఎంవీఎస్ మణి, పోకల అశోక్కుమార్, హనుమంత్నాయక్, బీరేంద్రవర్మ, యుగంధర్రెడ్డి, సయ్యద్ అహ్మద్ఖాద్రి తదితరులు పాల్గొన్నారు. -
తైవాన్ లో తుపాను బీభత్సం
తైపీ: తూర్పు ఆసియా దేశం తైవాన్ను మెరాంటి తుపాను చుట్టుముట్టింది. గంటకు 227 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన తుపాను ధాటికి ఆ దేశంలోని తూర్పు, దక్షిణ తీరాలు అతలాకుతలం అయ్యాయి. కుండపోతగా వర్షం కురుస్తుండటంతో ఊళ్లన్నీ జలమయం అయ్యాయి. సమాచార, విద్యుత్ వ్యవస్థ స్థంభించిపోయింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాఠశాలలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) గడిచిన 120 ఏళ్లలో తైవాన్ ను ముంచెత్తిన భారీ తుపాను ఇదే కావడంతో తీవ్రమైన నష్టం సంభవించిందని ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది. పర్యాటక ప్రాంతాలు, తీరప్రాంతాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పది మీటర్ల ఎత్తులో విరుచుకుపడిన కెరటాల ధాటికి దక్షిణ తైవాన్ కౌంటీలో ఓ షిప్పింగ్ పోర్ట్ లోని లైట్ హౌస్ పూర్తిగా సముద్రంలోకి తిరగబడిందని ప్రభుత్వం వెల్లడించింది. కేయాంహ్స్ పోర్ట్ నగరంలో కనీసం 10 సరుకు రవాణా ఓడలు, రెండు కార్గో క్రేన్లు, 1,40,000 టన్నుల నౌక సైతం ధ్వంసమయింది. మెరంటో ధాటికి భారీ కంటైనర్లు సైతం తిరగబడ్డాయి. పాఠశాలలును మూసివేశారు. 65,000 మంది కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దేశీయంగా 300 పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇతర రవాణా సేవలు నిలిచిపోయాయి. వీదులన్నీ జలమయమయ్యాయి. పలు వాణిజ్య సముదాయాలు చెల్లాచెదురయ్యాయి. కొరంటి దక్షిణ చైనా వైపు కదులుతుండడంలో ఆ దేశం తీరప్రాంత ప్రజలను హెచ్చరించింది. అధికారులను భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసింది. -
మార్కెట్ కు రెండో రోజూ నష్టాలు
సెన్సెక్స్కు 59 పాయింట్ల నష్టం ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు బుధవారం కూడా స్వల్పంగా నష్టపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్... సెప్టెంబర్ మొదటి వారంలోనే వడ్డీ రేట్లను పెంచవచ్చన్న తాజా అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా కౌంటర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 59 పాయింట్లు కోల్పోయి 28005.37 పాయింట్ల వద్ద ముగిసింది. మంగళవారం సెన్సెక్స్ 87.79 పాయింట్ల నష్టాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. నిఫ్టీ సైతం 18.50 పాయింట్ల నష్టంతో 8624.05 వద్ద స్థిరపడింది. సూచీలు ఆద్యంతం ఊగిసలాట ధోరణిలోనే కొనసాగాయి. న్యూయార్క్ ఫెడ్ ప్రెసిడెంట్ విలియమ్ డూడ్లే యూఎస్ ఫెడ్ సెప్టెంబర్లోనే వడ్డీరేట్లను పెంచవచ్చంటూ చేసిన ప్రకటన... రేట్ల పెంపుపై అంచనాలకు అవకాశం కల్పించిందని, దీంతో ప్రపంచ మార్కెట్లు వేచి చూసే ధోరణి అనుసరించాయని జియోజిత్ బీఎన్పీ పారిబా చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ తెలిపారు. ముఖ్యంగా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ మినిట్స్ వెలువడనుండడం కూడా దేశీయ మార్కెట్ల నష్టాలకు కారణంగా పేర్కొన్నారు. ఆసియా మార్కెట్లు చైనా, హాంగాకాంగ్, సింగపూర్, దక్షిణకొరియా 0.02 నుంచి 0.54 శాతం వరకూ నష్టపోయాయి. యూరోపియన్ మార్కెట్లు ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ మార్కెట్లు కూడా స్వల్ప నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. -
మొబైల్షాపులో అగ్నిప్రమాదం
రూ.5 లక్షల ఆస్తినష్టం నెల్లూరు (క్రైమ్) : విద్యుత్షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మొబైల్షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు రూ.5లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. బుజబుజనెల్లూరుకు చెందిన వై. మోహన్ అదే ప్రాంతంలోని దర్గా సమీపంలో శ్రీవెంకటేశ్వర మొబైల్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. మొబైల్స్తో పాటు ద్విచక్రవాహనాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ను సైతం విక్రయిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వ్యాపించాయి. స్థానికులు గమనించి మోహన్కు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అయితే అప్పటికే దుకాణంలోని మొబైల్స్, రీచార్డ్ కార్డ్లు, ఇంజన్ అయిల్స్, స్పేర్పార్ట్లు, మోహన్ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. దుకాణం వెనుక వైపు ఉన్న కరుణాకర్ ఇంట్లోకి మంటలు వ్యాపించాయి. వారు మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ మొత్తం ఘటనలో రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. -
మాడ్గులలో భారీ అగ్నిప్రమాదం
– రెండంతస్తుల భవనం దగ్ధం – రూ.50లక్షల ఆస్తి బుగ్గిపాలు మాడ్గుల : ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ రెండంతస్తుల భవనం దగ్ధమైంది. ఈ సంఘటనతో సుమారు రూ.50 లక్షల విలువచేసే ఆస్తికి నష్టం వాటిల్లినట్టు బాధితుడు వాపోయారు. వివరాలిలా ఉన్నాయి. మాడ్గులకు చెందిన పోలిశెట్టి శ్రీనుకు స్థానిక పంచాయతీ కార్యాలయ సమీపంలో రెండు అంతస్తుల భవనముంది. కింద కిరాణం, జనరల్స్టోర్ నడిపిస్తూ పై అంతస్తులో భార్యాపిల్లలతో నివాసముంటున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి 11గంటలకు దుకాణం మూసివేసి అందరూ నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు రెండు గంటలకు షాపులో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. శబ్దానికి మేల్కొన్న యజమాని తలుపు తెరవగా మంటలు తగిలి స్వల్పంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి పక్కింట్లోకి చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. వారి కేకలు విన్న చుట్టుపక్కలవారు వచ్చి మంటలు ఆర్పేందుకు విఫలయత్నం చేశారు. వెంటనే నల్లగొండ జిల్లా దేవరకొండ ఫైర్స్టేషన్కు సమాచారమిచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎంపీటీసీ సభ్యుడు దేవయ్యగౌడ్ తలుపులు విరగ్గొట్టి వంట గదిలో ఉన్న సిలిండర్లను బయటకు పడవేశారు. ఒకవేళ అవి పేలి ఉంటే పెద్దప్రమాదం సంభవించి ఉండేదన్నారు. ఈ సంఘటనలో రూ.5.5లక్షలతోపాటు 35తులాల బంగారం, 1,800గ్రాముల వెండి, రూ.రెండు లక్షల విలువజేసే కిరాణం, వంటసామగ్రి, పెట్రోల్, డీజిల్ డబ్బాలు, దుస్తులు, బియ్యం కాలిపోయాయి. శనివారం ఉదయం సంఘటన స్థలాన్ని సర్పంచ్ సునీతాకొండల్రెడ్డి, తహసీల్దార్ శంకర్, ఎంపీడీఓ ఫారూఖ్హుస్సేన్, ఆర్ఐ మురళి, కార్యదర్శి జంగయ్య పరిశీలించి పంచనామా నిర్వహించారు. కాగా, షార్ట్సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా నిప్పంటించారా? శ్రావణ శుక్రవారం సందర్భంగా దీపం వెలిగిస్తే పడిపోయిందా? అనేది తెలియరాలేదు. -
అవినీతి పూత!
– పుష్కరాలకు ముందే పనులు ఖలాస్ – ఒక్క వాహనమూ తిరగకముందే దెబ్బతింటున్న రోడ్లు – రోజూ చక్కర్లు కొడుతున్నా.. పట్టించుకోని అధికారులు – 25 శాతం మేరకు కమీషన్లు దండుకుంటున్న టీడీపీ నేతలు మిలుగు రూ. కోటి? కపిలేశ్వరం నుంచి సంగమేశ్వరం వరకు రూ.90 లక్షలు, ఆత్మకూరు నుంచి కపిలేశ్వరం వరకు రూ.2 కోట్లతో రోడ్లు నిర్మించాల్సి ఉంది. ఇందుకు దాదాపు రూ.3 కోట్ల ఖర్చు చేయాల్సి ఉంది. అయితే రూ.కోటి మాత్రమే ఖర్చు చేసి.. మిగిలిన రూ.2 కోట్లలో 25 శాతం వరకూ అధికారపార్టీ నేతలు వాటాలు పంచుకున్నారు. అధికారుల వాటా పోగా కనీసం కోటి రూపాయల మేరకు కాంట్రాక్టర్లు మిగిలించుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్నది కొత్తపల్లి నుంచి లింగాపురానికి వెళ్లే రోడ్డు. ఈ పనులను కృష్ణా పుష్కర పనుల్లో భాగంగా చేపట్టారు. పూరై ్త పది రోజులు కూడా కాలేదు. అప్పుడే కంకర తేలుతోంది. ఇప్పుడు మళ్లీ కంకర వేసి ప్యాచ్ పనులు చేసి పూతలు పూసేస్తున్నారు. విచిత్రమేమిటంటే ఈ రోడ్డుపైనే పుష్కర పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు రోజూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. పైగా పనులు పూర్తిచేశారంటూ బిల్లులు కూడా చెల్లించేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కృష్ణా పుష్కర పనులపై మొదటి నుంచీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో హడావుడిగా పనులకు టెండర్లు పిలవడం... ఈ పనులన్నీ అధికార పార్టీ నేతల అనుచరులే సంపాదించుకోవడం జరిగింది. ఇందులోనూ నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో జరిగిన పనులల్లో వాటాను ఆ నియోజకవర్గ అధికార పార్టీ నేత తీసుకుంటున్నారు. ఇక శ్రీశైలం నియోజకవర్గ పరిధిలో జరిగిన పనులల్లో అధికార పార్టీలకు చెందిన నేతలు ఇద్దరికీ వాటాలు ఇవ్వాల్సి వస్తుండటంతో పనులు మరింత నాసిరకంగా తయారవుతున్నాయి. అందులోనూ అధికారులకూ చేయిచాస్తుండటంతో పనుల నాణ్యత పూర్తిగా కొరవడింది. ఈ పనులపై అటు సంబంధిత శాఖ అధికారులు కానీ... నాణ్యతను పరిశీలించాల్సిన క్వాలిటీ కంట్రోలు విభాగం అధికారులు కానీ కన్నెత్తి చూడటం లేదు. పైగా నాణ్యతను పరిశీలించవద్దంటూ క్వాలిటీ కంట్రోలు అధికారులకు అనధికారికంగా ఆదేశాలు జారీకావడంతో.. కాంట్రాక్టర్లు మరింత రెచ్చిపోయి పనులను నాసిరకంగా చేపడుతున్నారని తెలుస్తోంది. అధికారులు రోజూ తిరుగుతున్నా... వాస్తవానికి సంగమేశ్వరానికి వెళ్లే దారిలో ప్రతీ రోజూ ఎవరో ఒక అధికారి వచ్చిపోతున్నారు. ఈ అధికారుల వాహనాలూ ఇదే రోడ్లపై వెళుతున్నాయి. కళ్ల ముందు రోడ్లన్నీ పెచ్చులూడి పాడైపోయినప్పటికీ కనీసం ఈ పనులపై విచారణ సైతం చేయడం లేదు. ఈ పనులు చేసిన కాంట్రాక్టర్లను పల్లెత్తు మాట కూడా అనడం లేదు. పైగా రోడ్డు వేసి పది రోజులు కాకముందే పెచ్చులూడిపోతే... పైపైన ప్యాచ్లు వేయాలంటూ ఆదేశిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్యాచ్ పనులు కూడా నాసిరకంగానే జరుగుతున్నాయి. అసలు వేసిన రోడ్డే ప్యాచ్ వర్క్లాగా చేసేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు పాడైపోయిన రోడ్డులకు వేస్తున్న ప్యాచ్పనుల్లోనూ అదే తీరు కొనసాగుతోంది. ప్రయాణికులకు తప్పని కష్టాలు... కృష్ణా పుష్కరాల కోసం వేస్తున్న రోడ్లపై ఇప్పటివరకు ఇంకా ఒక్క భక్తుడి వాహనం కూడా రాకపోకలు సాగించలేదు. అయినప్పటికీ రోడ్లు మాత్రం పాడైపోతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా మొరుసు వేయాల్సి ఉండగా.. పక్కనే ఉన్న పొలం మట్టిని తీసేస్తున్నారు. ఫలితంగా ఘాటుకు వెళ్లే సందర్భంగా వాహనాలు రోడ్డు పక్కన ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం కిమ్మనకుండా బిల్లులు కానిచ్చేస్తున్నారు. ఇందుకు కారణం పనులు చేస్తోంది అధికార పార్టీ నేతల అనుచరులు కావడమే. మొత్తం మీద పుష్కర పనులన్నీ పుష్కరాలకు ముందే కృష్ణా నదిలో కలిసిపోతున్నాయి.