Madhya Pradesh: పట్టాలు తప్పిన గూడ్సు రైలు | Train Derailed in Damoh will Take Time to Clear Track | Sakshi
Sakshi News home page

Madhya Pradesh: పట్టాలు తప్పిన గూడ్సు రైలు

Published Thu, Aug 15 2024 8:01 AM | Last Updated on Thu, Aug 15 2024 11:53 AM

Train Derailed in Damoh will Take Time to Clear Track

మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కత్నీ నుంచి సాగర్‌కు వెళుతున్న బొగ్గుతో కూడిన గూడ్సు రైలు దామోహ్ జిల్లాలోని పఠారియా సమీపంలో పట్టాలు తప్పింది. ఈ గూడ్సు రైలులోని ఏడు వ్యాగన్లు ట్రాక్‌పై బోల్తా పడ్డాయి.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాద ఘటనలో ట్రాక్‌లు, స్లీపర్‌లు, ఓహెచ్‌ఈ కేబుల్స్‌ దెబ్బతినడంతోపాటు సాగర్, దామోహ్, కట్ని మార్గాల్లో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గూడ్సు రైలు కోచ్‌ల చక్రాలు విడిపోయి, ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోవడంతో వ్యాగన్లలోని బొగ్గంతా నేలపాలయ్యింది. అర కిలోమీటరు పొడవునా పదుల సంఖ్యలో రైలు స్తంభాలు దెబ్బతిన్నాయని  అధికారులు తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement