‘అమర్‌కంటక్‌’లో మంటలు... తప్పిన ముప్పు | Fire Broke out in Amarkantak Express | Sakshi
Sakshi News home page

‘అమర్‌కంటక్‌’లో మంటలు... తప్పిన ముప్పు

Published Thu, Jul 11 2024 12:31 PM | Last Updated on Thu, Jul 11 2024 12:31 PM

Fire Broke out in Amarkantak Express

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో రైలు ‍ప్రమాదం చోటుచేసుకుంది. అమర్‌కంటక్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. మిస్రోడ్-  మందీదీప్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఏసీ కోచ్‌ కింది భాగంలో మంటలు చెలరేగడాన్ని గమనించిన ప్రయాణికులు ఈ విషయాన్ని వెంటనే రైల్వే అధికారులకు తెలియజేశారు. బీ-3, బీ-4 ఏసీ కోచ్‌ల కింద మంటలు చెలరేగాయి. రైల్వే అధికారులు అగ్ని నిరోధక యంత్రాల సాయంతో మంటలను ఆర్పివేశారు. ఈ ఉదంతంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. అమర్‌కాంత్ ఎక్స్‌ప్రెస్ ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ మధ్య నడుస్తుంది. ఈ రైలుకు 27 హాల్ట్‌లు ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement