రైల్వే ట్రాక్‌పై ఆదమరిచి నిద్రపోయి.. లోకో పైలెట్‌ అప్రమత్తం కావడంతో | Train Halts For Man Sleeping Under Umbrella On Railway Track In UP | Sakshi
Sakshi News home page

రైల్వే ట్రాక్‌పై ఆదమరిచి నిద్రపోయి.. లోకో పైలెట్‌ అప్రమత్తం కావడంతో

Published Mon, Aug 26 2024 7:47 PM | Last Updated on Mon, Aug 26 2024 8:23 PM

Train Halts For Man Sleeping Under Umbrella On Railway Track In UP

 న్యూఢిల్లీ: ఓ ట్రైన్‌ లోకో పైలెట్‌ అప్రమత్తంతో పెను ప్రమాదమే తప్పింది.  రైల్వే ట్రాక్‌పై గొడుగు కింద ఆద మరిచి నిద్రపోతున్న ఓ వ్యక్తి ప్రాణాల నుంచి బయటపడ్డాడు.

ఉత్తర ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి నిద్రిస్తున్నాడు. అదే సమయంలో అటు నుంచి వస్తున్న ఓ ట్రైన్‌ లోకో పైలెట్‌ ట్రాక్‌పై నిద్రుస్తున్న వ్యక్తిని చూసి వెంటనే ట్రైన్‌ ఆపాడు.

అనంతరం ట్రైన్‌ దిగి సదరు వ్యక్తిని నిద్ర లేపే ప్రయత్నం చేశాడు. ఆదమరిచి నిద్రపోతున్న వ్యక్తికి మెలుకువ వచ్చిన వెంటనే పక్కకు వెళ్లాడు. ఆ ఘటనలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో లోకో పైలట్ తన రైలును ఆపిన తర్వాత వ్యక్తి వద్దకు వెళుతున్న దృశ్యాల్ని చూడొచ్చు.

ఇక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించలేదని, నిద్రపోయేందుకు అనువైన ప్రదేశం రైల్వే ట్రాక్‌ అని భావించి నిద్రపోయినట్లు తెలుస్తోంది.  ఆ వీడియోపై ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని అభిప్రాయం వ్యక్తంచేస్తుండగా.. మరో యూజర్‌ ఈ విషయంపై తీవ్రమైన విచారణ జరిపి సరైన రైల్వే భద్రతా నిబంధనలను అమలు చేయాలని కోరాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement