ఉత్తరాఖండ్‌లో కూలిన సిగ్నేచర్‌ బ్రిడ్జ్‌ | Under Construction Signature Bridge Collapses Uttarakhand | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న సిగ్నేచర్‌ బ్రిడ్జ్‌

Published Thu, Jul 18 2024 7:29 PM | Last Updated on Thu, Jul 18 2024 7:53 PM

Under Construction Signature Bridge Collapses Uttarakhand

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఓ సిగ్నేచర్‌ బ్రిడ్జ్‌ కూలిపోయింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ప్రాణ నష్టం ఏం జరగలేదని అధకారులు తెలిపారు. ఉత్తరఖండ్‌ రుద్రప్రయాగ్‌లోని నార్కొట గ్రామ సమీపంలో  భద్రినాథ్‌పై నిర్మిస్తున్న సిగ్నేచర్‌ వంతెన​ కూలిపోయింది. ఇటువంటి  సిగ్నేచర్‌ వంతెన రాష్ట్రంలో నిర్మించటం తొలిసారి కావటం గమనార్హం.  ఈ వంతెనను ఆర్‌సీసీ డెవలపర్స్‌ కంపెనీ సుమారు రూ. 76 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది.

 

‘ఈ వంతెన  ఇవాళ సాయంత్రం 4.15 గంటలకు కూలిపోయింది. అయితే పునాది గట్టినాగే ఉన్నప్పటికీ వంతెన టవర్ కుప్పకూలింది.  ఈ ఘటనపై టెక్నికల్‌ కమిటి దర్యాప్తు చేస్తోంది. కూలిపోవడానికి గల కారణాలను కనుగొంటున్నారు’ అని అధికారులు తెలిపారు. సాధారణంగా రోజు 40 మంది కార్మికులు వంతెన నిర్మాణంలో పనిచేస్తున్నారు. ఈ రోజు ఎవ్వరు లేకపోవటంతో  ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధకారులు తెలిపారు. 

ఈ ఘటనపై స్థానికులు మీడియాతో  మాట్లాడారు. ‘ఈ వంతెన నిర్మాణ  పనులు చాలా నిర్లక్ష్యంగా జరుగుతున్నాయి. ఈ వంతెన నిర్మాణాన్ని హైవే  అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఈ ప్రాజెక్టును మరో కంపెనీ ఎందుకు  ఇవ్వకుడదు?’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement