ఆర్మీ జవాన్‌ వేధింపులతో యువతి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఆర్మీ జవాన్‌ వేధింపులతో యువతి ఆత్మహత్య

Published Tue, Oct 3 2023 1:00 AM | Last Updated on Tue, Oct 3 2023 12:56 PM

- - Sakshi

బజార్‌హత్నూర్‌: ఆర్మీ జవాన్‌ పెళ్లి చేసుకోవాలని వేధించడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని పిప్రి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై బి.నరేశ్‌ వివరాల ప్రకారం... పిప్రి గ్రామానికి చెందిన కడవేని శ్రీనివాస్‌, సత్యమ్మల చిన్న కూతురు శిరీష (23) డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి ఆర్మీ జవాన్‌ మేకల నరేష్‌ ఏడు నెలలుగా పెళ్లి చేసుకోవాలని ఫోన్‌లో శిరీషను వేధిస్తున్నాడు.

ఇదే విషయం కుటుంబ సభ్యులకు తెలుపడంతో నరేష్‌ను ఆమె సోదరుడు సతీష్‌ మందలించాడు. అయినా వేధింపులు ఎక్కువకావడంతో తన ఫోన్‌ నంబర్‌ మార్చింది. గత వారం సె లువుపై గ్రామానికి వచ్చిన నరేష్‌ ఆమె కొత్త ఫోన్‌ నంబర్‌కు శనివారం రాత్రి మళ్లీ ఫోన్‌ చేసి పెళ్లి చేసుకోవాలని వేధించాడు. ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి పురుగుల మందు తాగింది.

గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆటోలో ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందాడు. తండ్రి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement