రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు దుర్మరణం

Published Thu, Oct 10 2024 12:28 AM | Last Updated on Thu, Oct 10 2024 11:26 AM

-

నర్సాపూర్‌(జి): పండుగపూట ఆ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనుకున్న తరుణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ తండ్రీ కొడుకులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 

వివరాలు ఇలా ఉన్నాయి.. నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం మండలం మన్మథ్‌ గ్రామానికి చెందిన సంగెం సురేష్‌ (28), భార్య ప్రియాంక, కుమారుడు సాయివర్షిక్‌ (6), కుమార్తె తనిష్క మంగళవారం కారులో ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలోని కుచులాపూర్‌లో గల అత్తగారింటికి వెళ్లారు. బుధవారం ఉదయం స్వగ్రామానికి బయలుదేరారు. నర్సాపూర్‌ (జి) మండలంలోని తురాటి గ్రామ సమీపంలో 61వ జాతీయ రహదారిపైకి చేరుకోగానే కారు టైరు పేలడంతో రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొట్టింది.

 బుధవారం ఉదయం కారు ముందు టైరు పేలడంతో రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీకొంది. ఘటనలో సాయి వర్షిక్‌ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రగాయాలైన సురేష్‌, ప్రియాంక, తనిష్కలను 108లో నిర్మల్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి సురేష్‌ మృతి చెందాడు. ప్రియాంకను మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌ తరలించారు. సురేష్‌ అత్త ముచ్చర్ల లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై హన్మాండ్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement