కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్రెడ్డి, బీజేపీ మద్దతుతో అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరిక్రిష్ణతో సహా మొత్తం 56మంది బరిలో ఉన్నారు. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సీఎం రేవంత్రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానిక నాయకులు చెమటోడుస్తున్నారు. బీజేపీ నుంచి కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్తో సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ప్రచారం చేశారు. బీఎస్పీ నుంచి పోటీలో ఉన్న ప్రసన్న హరిక్రిష్ణ బీసీ నినాదంతో ముందుకు వస్తున్నారు. వీరితోపాటు బక్క జడ్సన్ పలువురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే బహిరంగ సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. అంతేకాక ఎవరికివారు సామాజిక మాధ్యమాలు, ఫోన్లు, మేసేజ్లు, వాట్సాప్ల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా ముగ్గురి మధ్యే పోటీ నెలకొనడంతో పట్టభద్రులు తమ ప్రాధాన్యతను ఎలా వ్యక్తపరుస్తారనేది ఆసక్తిగా మారింది. పట్టభద్రుల ప్రసన్నం కోసం చివరి అస్త్రంగా నగదు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment