నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ

Published Wed, Mar 5 2025 2:33 AM | Last Updated on Wed, Mar 5 2025 2:31 AM

నృసిం

నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ

మంగళగిరిటౌన్‌: మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎగువ సన్నిధిలోని పానకాలస్వామి వారి ముఖ మండపంలో మంగళవారం భక్తులు నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ మహోత్సవం జరిగింది. దేవస్థానం ప్రధాన అర్చకులు, గురుస్వామి మాల్యవంతం శ్రీనివాసదీక్షితులు భక్తులకు మాలవేసి దీక్ష ఇచ్చారు. స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్‌ అధ్యక్షులు తోట శ్రీనివాసరావు మాలధారణ దీక్ష స్వీకరించే భక్తులకు దీక్షా వస్త్రాలను ఉచితంగా అందజేశారు. అనంతరం రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మంగళగిరి అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు, న్యాయవాది రంగిశెట్టి లక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో శివారెడ్డి గురుస్వామి, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులు గోగినేని వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్‌ ప్రతినిధి సైదా నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

జాతీయ సమావేశాలకు ఐదుగురికి ఆహ్వానం

సత్తెనపల్లి: అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో ప్రత్యేకత చాటుకున్న ఎంపీడీవో, గ్రామ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులకు ఈనెల 4, 5 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న జాతీయ సమావేశానికి ఆహ్వానం అందింది. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఎంపీడీవో జీ లక్ష్మీదేవి, గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెం గ్రామ సర్పంచ్‌ ఎం.లలితకుమారి, వెంగళాయపాలెం గ్రామ కార్యదర్శి వి.రవి, కొల్లిపర మండలం వల్లభాపురం సర్పంచ్‌ బి. భ్రమరాంబ, పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామ సర్పంచ్‌ షేక్‌ గౌసియా బేగం స్నేహపూర్వక పంచాయతీల (ఉమెన్‌ ఫ్రెండ్లీ పంచాయతీ) పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను పంచాయతీలో అమలు చేస్తున్నారు. ఇందుకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి సమావేశాలకు వీరికి ఆహ్వానం అందడంతో సోమవారం పయనమై వెళ్లారు.

హాల్‌టికెట్ల కలర్‌ ప్రింటవుట్‌ను అనుమతించం

డీఐఈఓ నీలావతిదేవి

నరసరావుపేట ఈస్ట్‌: ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌టికెట్లను వైట్‌ పేపర్‌పై ప్రింటవుట్‌ తీసుకొని పరీక్ష కేంద్రాలకు రావాలని జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి సోమవారం తెలిపారు. కొందరు విద్యార్థులు హాల్‌టికెట్లను కలర్‌ ప్రింట్‌లో తీసుకువస్తున్నారని, వాటిని అనుమతించటం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ విద్యామండలి నుంచి ప్రత్యేక ఉత్తర్వులు అందినట్టు వివరించారు. విద్యార్థులు గమనించి తమ వెంట తెల్లకాగితంపై ప్రింట్‌ చేసిన హాల్‌టికెట్లతో హాజరు కావాలని సూచించారు.

జలపాలేశ్వరుడిపై సూర్యకిరణాలు

ఫిరంగిపురం: మండలంలోని వేములూరిపాడు గ్రామంలోని జలపాలేశ్వర ఆలయంలో స్వామిపై మంగళవారం సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ సమయంలో అనేకమంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామికి అభిషేకాలు చేయించుకున్నారు. గ్రామంలో చోళుల కాలంనాటి జలపాలేశ్వర ఆలయం ఉంది. 16వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలోని జలపాలేశ్వరుడిపై ఏటా పాల్గుణ మాసంలో కొద్దిరోజులపాటు సూర్యోదయ కాలంలో సరాసరి స్వామివారి లింగాకృతి కింది భాగం నుంచి పూర్తిగా స్వామి పైవరకు సూర్యకిరణాలు ప్రసరిస్తాయని ఆలయ అర్చకులు ఉమాపతి శాస్త్రి తెలిపారు. మళ్లీ అవి తగ్గుముఖం పట్టి పూర్తిగా సూర్యకిరణాలు ప్రసరించడం ఆగుతుందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ 
1
1/1

నృసింహుని ఏకాదశ మాలధారణ దీక్ష స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement