![Congress CM Candidates Lead In Telangana Assembly Elections - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/3/TS-Congress.jpg.webp?itok=SPCbH87J)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల కౌంటింగ్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇక, కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థుల రేసులో ఉన్న నేతలు భారీ మెజార్టీ సంపాదించారు. మరోవైపు, అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి జరే ఆదినారాయణ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై 23వేల ఓట్ల మెజార్టీలో గెలుపొందారు.
మెజార్టీ ఇలా..
రేవంత్రెడ్డి.. 12వేల మెజార్టీ
కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. 25వేల మెజార్టీ
ఉత్తమ్కుమార్ రెడ్డి.. 20వేల మెజార్టీ
భట్టి విక్రమార్క.. 8వేల మెజార్టీ
సీతక్క.. మూడు వేల మెజార్టీ
ఇక, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఎవరు సీఎం అవుతారనే కీలక చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం మా నేత సీఎం అంటే మా నాయకుడు ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ నేతలు మాత్రం అధిష్టానమే సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తుందని చెబుతున్నారు.
కాగా, కాంగ్రెస్ గెలుపు నేపథ్యంలో హస్తం శ్రేణులు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. పలుచోట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పాలాభిషేకం చేస్తున్నారు. బాణాసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | #TelanganaElection2023 | Congress workers pour milk on a poster featuring Congress Parliamentary Party Chairperson Sonia Gandhi, party MP Rahul Gandhi and state party chief Revanth Reddy as the party continues its lead in the state.
— ANI (@ANI) December 3, 2023
As per the official EC trends, the… pic.twitter.com/IWi4QEz4EQ
మరోవైపు.. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ అభ్యర్థులను కర్ణాటకకు తరలించే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తాజ్కృష్ణలో డీకే శివకుమార్ సహా కర్ణాటక నేతలు బస చేశారు. లగ్జరీ బస్సులను కూడా తరలింపునకు రెడీ చేశారు.
#WATCH | Congress cadre burst firecrackers outside the office of the party's state unit in Hyderabad as the party leads on 52 seats in Telangana pic.twitter.com/3Agy3Ha0rt
— ANI (@ANI) December 3, 2023
Comments
Please login to add a commentAdd a comment