Telangana Assembly Elections 2023
-
ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. శుక్రవారం కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో అయిదు మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. హోం, న్యాయ, గిరిజన సంక్షేమ, సామాజిక న్యాయం, సిబ్బంది, శిక్షణ శాఖల కార్యదర్శులకు ఇందులో చోటు కలి్పంచారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలను పరిశీలించి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు, వీలైనంత త్వరగా తమ నివేదికను అందించేందుకు వీలుగా ఈ కమిటీ ఈనెల 23న తొలిసారి భేటీ కానుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో హైదరాబాద్లో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరిగిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు త్వరలో కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని గత నవంబర్ 24న ఆదేశించారు. గౌబా కమిటీ ఏర్పాటుకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. -
అది కరెక్ట్ కాదు.. పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మరోసారి స్పందించారు. శుక్రవారం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక భేటీలో ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిపాలనపై అతి శ్రద్ధతో పార్టీ సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగనందునే ఓడామని.. అందుకు పూర్తి బాధ్యత తనదేనని వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో ఓటమికి పది కారణాలను పార్టీ కేడర్కు ఆయన వివరించారు. ‘‘బీఆర్ఎస్ను ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదు. ప్రజలు తప్పుచేశారడనం సరికాదు. రెండుసార్లు మనల్ని గెలిపించింది కూడా ప్రజలే. మొత్తం స్థానాల్లో 14 చోట్ల వందల్లో, వేలల్లో మాత్రమే మన మెజార్టీ తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణాల్ని సమీక్షించుకోవాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలి’’ అని కేడర్కు పిలుపు ఇచ్చారాయన. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి పది కారణాలను కేటీఆర్ వివరించారు. పరిపాలనపైనే దృష్టిపెట్టి పార్టీని పట్టించుకోలేదు. అందుకు పూర్తి బాధ్యత నాదే. పార్టీలో సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగలేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు సరైన గుర్తింపు ఇవ్వలేకపోయాం. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కేంద్రంగా మారి పార్టీని నడపడం సరికాదు. ఈ పదేళ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితి పట్టించుకోలేదు. ప్రభుత్వానికి పథకాల మద్య కార్యకర్త లేకుండానేరుగా లబ్ధిదారుడికి పథకం చేరడంతో ఓటర్కి.. కార్యకర్తకు లింక్ తెగిపోయింది. రాష్ట్రంలో గత పదేళ్లలో 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినా.. ప్రజల్లోకి ఆ విషయాన్ని తీసుకెళ్లలేకపోయాం. ప్రతీ నియోజకవర్గంలో 15 వేల కొత్త పెన్షన్లు ఇచ్చిన విషయాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లలేకపోయాం. వందలో ఒక్కరికి రాలేదు.. అదే నెగెటివ్గా ప్రచారం అయ్యింది. దళిత బంధు కొందరికే రావడంతో మిగతా వాళ్లు ఓపిక పట్టలేకపోయారు. వాళ్లంతా అసహనంతో మనకు వ్యతిరేకం అయ్యారు. రైతు బంధు తీసుకున్న సామాన్య రైతు కూడా.. ఎక్కువ ఎకరాలున్న భూస్వామికి ఇస్తే ఒప్పుకోలేదు’’ అని ఓటమి కారణాల్ని కేటీఆర్ విశ్లేషించి.. బీఆర్ఎస్ కేడర్కు వివరించారు. బీజేపీతో పొత్తు గతంలో లేదు.. భవిష్యత్తులో ఉండదు. ఇక ఎమ్మెల్యే చుట్టూ తిరిగే విధానం ఉండదు. పార్టీ చుట్టురానే ఎమ్మెల్యే తిరిగే విధానం ఉంటుంది. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించం అని కేడర్ను హెచ్చరించారాయన. -
పార్టీ అభిమానులూ ఓటేయలేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీపట్ల అభిమానం ఉన్నవారు కూడా ఓటేయలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం, రాష్ట్ర కమిటీ మూడు రోజులపాటు హైదరాబాద్లో సమావేశమైంది. ఈ భేటీకి కేంద్ర పరిశీలకులుగా సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఎ.విజయ రాఘవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం తనను కలిసిన విలేకర్లతో తమ్మినేని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ అనుసరించిన ఎత్తుగడలు, ఫలితాలపై సమీక్షించామని చెప్పారు. సీపీఎం కుటుంబాలు మినహా పార్టీ అభిమానులు కూడా ఈసారి తమకు ఓటేయకపోవడంతో గతంతో పోలిస్తే సీపీఎం దారుణంగా దెబ్బతిన్నదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేశామని... ప్రతి ఎన్నికల్లోనూ ఇదే అనుభవం ఎదురైందని చెప్పారు. పార్టీలో లోపాలు జరిగాయని, వాటిని సమీక్షించుకొని భవిష్యత్తులో పార్టీని పటిష్టం చేయడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకున్నామని తమ్మినేని చెప్పారు. పొత్తు సాధ్యం కాక... తాము పోటీ చేసిన 19 స్థానాల్లో గెలుస్తామని భావించకపోయినా ఓట్లు తక్కువ రావడం ప్రధాన లోపంగా పార్టీ గుర్తించిందని తమ్మినేని వివరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు విషయంలో కాలయాపన కావడం, చివరి నిమిషంలో పొత్తు సాధ్యం కాదని తేలాక ఒంటరిగా పోటీ చేయాల్సి రావడం దెబ్బతీసిందని చెప్పారు. ఎన్నికలకు సిద్ధం కావడానికి సమయం సరిపోని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. మరోవైపు బీఆర్ఎస్ అహంభావ, అప్రజాస్వామిక ధోరణులను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారని తమ్మినేని విశ్లేషించారు. రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, రేవంత్రెడ్డి నాయకత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ విజయం వంటి పరిణామాలన్నీ కాంగ్రెస్ గెలుపునకు తోడ్పడ్డాయని వివరించారు. గత ఎన్నికలతో పోల్చితే బీజేపీకి ఓట్లు, సీట్లు రెట్టింపయ్యాయనీ, ఇది ఓ ప్రమాదకర సంకేతమని చెప్పారు. -
కనీసం ఇతరులన్నా పొందారు సంతోషం
కనీసం ఇతరులన్నా పొందారు సంతోషం -
అక్కడి ఓటు... ఇక్కడి గుట్టు!
తెలంగాణ రాజకీయ పరిణామాల్లో ఓ సూపర్ వీక్ గడిచి పోయింది. ఆదివారం ఎన్నికల ఫలితాల వెల్లడితో ప్రారంభమై శనివారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో సూపర్ వీక్ ముగిసింది. ఈ ఏడు రోజుల్లో చాలా పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రి సహా పన్నెండు మంది కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. అందరూ అనుభవం, సామర్థ్యం కలిగినవాళ్లే కనుక ఎటువంటి ఆక్షేపణలూ మంత్రివర్గంపై వెలువడలేదు. ఇంకో ఆరుగురికి మంత్రివర్గంలో అవకాశం ఉన్నది. ఆ ఖాళీలు పూర్తయితే గానీ అలకలు, అసంతృప్తులు బయటపడవు. ఏ ప్రభుత్వానికైనా మొదటి మూడు నెలలను హనీమూన్ పీరియడ్గా పరిగణిస్తారు. విమర్శకులు గానీ, విపక్షాలు గానీ, మీడియా గానీ పెద్దగా తప్పులెన్నకుండా చూసీ చూడనట్లుగా వ్యవహరించడం ఒక సంప్రదాయం. మన యెల్లో మీడియాకు మాత్రం ఈ సంప్రదాయం నుంచి మినహాయింపు ఉంటుంది. అధికారంలో ఉన్నది మనవాళ్లే అనుకుంటే యెల్లో మీడియా ఐదేళ్లపాటు చిడతలు వాయిస్తూనే ఉంటుంది. మనవాళ్లు కాద నుకుంటే మూడోరోజు నుంచే మూతి విరుపులు మొదలు పెడుతుంది. గురువారం నాడు కొత్తమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ (ఇప్పుడు ప్రజాభవన్) ప్రవేశం దగ్గరున్న ఇనుప కంచెను కొత్త ప్రభుత్వం బద్దలు కొట్టించింది. నిజానికి ఇదొక ప్రతీకాత్మక (సింబాలిక్) చర్య. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ‘దొరల ప్రభుత్వం’గా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. తాము గెలిస్తే ‘గడీ’ గోడల్ని కూల్చివేస్తామని, ప్రజాపాలన ఏర్పాటు చేస్తామని చెప్పింది. కంచె తొలగింపు అనేది ఆ ప్రచారానికి అనుగుణంగా జరిగిన ఒక సింబాలిక్ చర్య. కనుక ఈ చర్యపై ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. యెల్లో మీడియా ఈ వ్యవహారాన్ని రిపోర్టు చేయడంలో చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఆ మీడియా ద్వంద్వ ప్రమాణాల గురించి చెప్పడానికే ఈ ప్రస్తావన. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణానది కరకట్ట మీద ఒక అక్రమ భవంతిలో నివాసం ఉన్నారు. పైగా దాని పక్కన ‘ప్రజావేదిక’ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా మరో అక్రమ భవనాన్ని నిర్మించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేశారు. దీని మీద యెల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ ఎంత యాగీ చేశాయో, ఇప్పటికీ ఎలా చేస్తున్నాయో ఆంధ్ర ప్రజలందరికీ తెలిసిన సంగతే. ఈ వారం రోజుల పరిణామాల్లో కొత్త ప్రభుత్వం తీసు కున్న చెప్పుకోదగ్గ నిర్ణయాల్లో రెండు ముఖ్యమైనవి. మొదటిది ప్రజాభవన్లో వారానికి రెండుసార్లు ‘ప్రజాదర్బార్’ను నిర్వ హించి సమస్యలను తెలుసుకోవడం. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని శనివారం నాడు ప్రారంభించడం రెండో కీలక నిర్ణయం. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దురదృష్టవశాత్తు గాయపడి ఆస్పత్రిలో చేరిన విచారకర సంఘటన కూడా ఈ పరిణామాల మధ్యనే చోటుచేసుకున్నది. అధికారం కోల్పోయినప్పటికీ రాష్ట్రంలో నేటికీ అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయ కుడు నిస్సందేహంగా కేసీఆరే! రెండు కోట్ల పాతిక లక్షలమంది మంది ఓటర్లు పాల్గొన్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఓట్ల తేడా నాలుగున్నర లక్షలు మాత్రమే! ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ముందుగా ‘ప్రజా దర్బార్’ గురించి మాట్లాడుకుందాం. దీర్ఘకాలంగా పరిష్కారం కాని తమ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇదొక మార్గంగా తొలుత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. ఆయన తర్వాత ఈ కార్యక్రమం ఆగిపోయింది. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం నాడు పునరుద్ధరించింది. మొదటిరోజే మూడు నాలుగు వేలమంది ప్రజాభవన్లోకి విజ్ఞాపన పత్రాలతో దూసుకొచ్చారు. పేరుకుపోయిన ప్రజల వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం మార్గం చూపించినందుకు సంతోషించాలా? ప్రజా ప్రభుత్వాలు ఏర్పడిన ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా ముఖ్యమంత్రిని దర్శించుకుంటే తప్ప సమస్యకు పరిష్కారం దొరకని పరిస్థితికి విచారించాలా? ఆలోచించవలసి వస్తున్నది. వివిధ రకాల ప్రభుత్వ సేవలు, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారాలు వీలైనంతవరకు దిగువ స్థాయిలోనే పరిష్కారం దొరకాలి. అందుకోసం రాజకీయ జోక్యం లేని ఒక పారదర్శక వ్యవస్థ ఉండాలి. ఈ రకమైన వ్యవస్థకు విజయవంతమైన ఉదాహరణ ఆంధ్రప్రదేశ్. ఎటువంటి రాజకీయ జోక్యం, పక్షపాతం లేకుండా గ్రామస్థాయిలోనే విలేజ్ సెక్రటేరియట్, వలంటీర్ వ్యవస్థలు పారదర్శకంగా సేవలందిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించగలుగుతున్నాయి. సెక్రటేరియట్కు ఒక అర్జీ చేరినట్టయితే ఎన్ని రోజుల్లో దాన్ని పరిష్కరిస్తారో ముందే చెప్పాలి. ఆ గ్రామానికి చెందిన అర్జీల స్టేటస్ రిపోర్టును ఏ రోజుకారోజు అక్కడున్న బోర్డు మీద రాసి పెట్టాలి. ఈ పారదర్శకత సత్ఫలితాలనిచ్చింది. అక్కడ కూడా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలను జల్లెడ పట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ పేరుతో ఒక స్పెషల్ డ్రైవ్ను నిర్వహించింది. ఇందులో ప్రజా ప్రతినిధులు, అధికారులందరూ పాల్గొన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్లో పరి ష్కారం దొరికిన సమస్యలు డెలివరీ అయిన సేవలు ఒక కోటికి పైగా ఉన్నాయి. చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించాలనుకున్నప్పుడు అటువంటి పారదర్శక వ్యవస్థ అవసరం. గడప దగ్గరే ప్రజలకు సేవలందడం ప్రజాస్వామిక లక్షణం. అర్జీలు చేతబట్టుకొని ప్రయాసపడి రాజధానికి వెళ్లి దర్బార్ దర్శనాల కోసం వేచి ఉండడం ఫ్యూడల్ వ్యవస్థ లక్షణం. ఫ్యూడల్ ధోరణులకు స్వభావ రీత్యానే తెలంగాణ ప్రజలు వ్యతిరేకులు. దారుణమైన ఫ్యూడల్ దోపిడీకి గురైన అనుభవం వారినట్లా మార్చింది. మరి ఎందుకని తొలిరోజున జనం వెల్లువెత్తారు? నియోజక వర్గాల స్థాయిలో మితిమీరిన రాజకీయ జోక్యం, ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం పారదర్శకతకు పాతరేశాయి. రెండు మూడుసార్లు ఎన్నికైన కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆడింది ఆటగా పాడింది పాటగా అధికార యంత్రాంగంలో చలామణీ అయింది. తమవాళ్లు కాదనుకున్నవారి పేర్లు లబ్ధిదార్ల జాబితాల్లోకెక్కలేదు. అందుకే వేలాది సమస్యలు పేరుకొని పోయాయి. ఆ సమస్యల పరిష్కారానికి జరిగే ప్రతి ప్రయ త్నాన్ని ఆహ్వానించవలసిందే. ఆ మేరకు ప్రజాదర్బార్ ఉప యోగమే. అయితే ఇది సమస్య మూలాల్లోకి వెళ్లగలిగేది కాదు. ఒక సింబాలిక్ చర్యే! వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమల్లోకి తెస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందులో రెండు గ్యారెంటీల అమ లును రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు ప్రారంభించింది. అందులో ఒకటి ‘ఆరోగ్యశ్రీ’ పరిధిని పది లక్షలకు పెంచడం. ఎన్నికల హామీల్లో భాగంగా పదిహేను లక్షలకు పెంచుతామని బీఆర్ఎస్ చెప్పింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పరి ధిని పాతిక లక్షల రూపాయలకు పెంచింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ స్కీమ్లోకి వచ్చే ప్రొసీజర్స్ను కూడా మూడు రెట్లు పెంచింది. అందువల్ల కాంగ్రెస్ తెలంగాణలో ఇచ్చిన గ్యారెంటీ వారు ఊహించినంత సంచలనం కలిగించ లేకపోయింది. కానీ, ‘మహాలక్ష్మి’ స్కీమ్కు తొలిరోజు మంచి స్పందన వ్యక్తమయింది. అన్ని వయసుల్లోని మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తొలుత ఢిల్లీలోని ‘ఆప్’ ప్రభుత్వం ప్రారంభించింది. ఇది సూపర్ హిట్టవ్వడంతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కూడా తన ఎన్నికల గ్యారెంటీల్లో ప్రకటించి విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన మొదటి పథకం కూడా ఇదే. ఈ పథకం ఆచరణ యోగ్యతపై భిన్నమైన వాదనలుప్పటికీ సూత్ర రీత్యా స్వాగతించవలసిన కార్యక్రమం. ఎందుకంటే ప్రయాణం... పర్యటన, విహారం... పేరు ఏదైనా మొబిలిటీ అనేది అభివృద్ధికి సంకేతం. అభివృద్ధికి మొబిలిటీ అవసరం. ఇప్పటికీ కదలిక లేకుండా ఉన్న మహిళల్ని ఈ కార్యక్రమం కది లించవచ్చు. ఈ కదలిక వారిలో లోకజ్ఞానాన్నీ, నిర్భీతినీ ప్రోది చేస్తుంది. సాధికారతకు తోడ్పడుతుంది. విజయవంతంగా అమలుచేయగలిగితే ఇది ప్రగతికి తోడ్పడే కార్యక్రమం. తెలంగాణ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలుగా మార్చే ప్రయత్నం చేసింది. తెలంగాణలో ఎన్నికల ముందే కనిపించిన ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని అంచనా వేసుకొని అనధికారికంగా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది. ఏపీ సెటిలర్ల తోడ్పాటుతో తాము బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ను గెలిపించబోతున్నామని తెలుగుదేశం అభిమాన సంఘీయులు తొడలు మెడలు చరుచుకుంటూ ప్రక టనలు గుప్పించారు. సెటిలర్లంతా తెలుగుదేశం చెప్పినట్టే వింటారనీ, తెలుగుదేశం పార్టీ చొక్కా జేబులో వాళ్లంతా నివసిస్తున్నారనీ భారీ బిల్డప్లు ఇచ్చుకున్నారు. కానీ, డామిట్... కథ అడ్డం తిరిగింది! ఏపీ సెటిలర్ల ఉనికి పెద్దగా లేని జిల్లాల్లో, నియోజక వర్గాల్లో కాంగ్రెస్ విజయాలు సాధించింది. ఖమ్మం జిల్లా మినహాయింపు. అక్కడ గత మూడు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు చేదు అనుభవమే కలిగింది. ఆ పార్టీకి పునాదులు బలంగా పడలేదు. కాంగ్రెస్ పార్టీ టెన్ బై టెన్ స్కోర్ సాధిస్తుందని భావించిన జిల్లా. కానీ ఒక సీటు (భద్రాచలం)ను కోల్పోయింది.ఇక సెటిలర్లు గణనీయమైన ప్రభావాన్ని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూపాలి. ఇక్కడ 24 అసెంబ్లీ సీట్లు న్నాయి. పాతనగరంలోని ఏడు సీట్లను మినహాయిస్తే మిగతా ప్రాంతంలో దాదాపు 15 లక్షలమంది ఏపీ నుంచి వలస వచ్చిన ఓటర్లు ఉండవచ్చనే అంచనా ఉన్నది. తెలుగుదేశం వారి ఆదేశాల ప్రకారం ఏపీ సెటిలర్లంతా నడుచుకుంటే ఈ పదిహేడు సీట్లను కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండాలి కానీ, ఒక్క సీటు కూడా ఆ పార్టీకి దక్కలేదు. నాంపల్లిలో మజ్లిస్ మినహా మిగిలిన 16 సీట్లను బీఆర్ఎస్ భారీ తేడాతో గెలుచుకున్నది. పాతబస్తీ పరిధిలోని గోషా మహల్ సీటును మాత్రం బీజేపీ దక్కించుకోగలిగింది. సాధారణంగా ఎన్నికల సమయాల్లో ఏపీ సెటిలర్లంతా ఒకరకంగా, తెలంగాణ సెటిలర్లు ఒకరకంగా, ఉత్తర భారతీయులు ఇంకో రకంగా స్పందించడం ఉండదు. అప్పటి పరిస్థితులను బట్టి దాదాపుగా ఒకే రకమైన స్పందన నమోదవుతూ వస్తున్నది. ఎప్పుడైతే తెలుగుదేశం వర్గీయులు కాంగ్రెస్కు అనుకూలంగా ప్రచారం మొదలుపెట్టారో అప్పుడే ఏపీ సెటిలర్లలో నిట్ట నిలువునా చీలిక ఏర్పడింది. తెలుగుదేశం హడావిడి లేకుంటే ఈ చీలిక ఏర్పడేది కాదు. తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న కుల రాజకీయాల కారణంగా దాన్ని అనుసరించవలసి వచ్చిన కమ్మ సామాజిక వర్గం వారు మాత్రం కాంగ్రెస్కు అనుకూలంగా ఓట్లేయడంతోపాటు ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వారు తెలుగుదేశం జెండాలు పట్టుకొని ఊరేగింపుల్లో పాల్గొన్నారు. గాంధీభవన్ దగ్గర జరిగిన ర్యాలీలో పచ్చజెండాలతో డ్యాన్సులు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీని అనుసరించే సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు తిరగ్గానే మిగిలిన సామాజిక వర్గాలు వారికి ఎదురు తిరిగాయి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యక్రమాల పట్ల ఆకర్షితులుగా ఉన్న బలహీనవర్గాల ప్రజలు ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక వైఖరిని తీసుకున్నారు. సెటిలర్లు అధికంగా కలిగిన పోలింగ్ బూత్ల సూక్ష్మ స్థాయి విశ్లేషణలో ఈ సంగతి ప్రస్ఫుటంగా వెల్లడైంది. ఉదాహరణకు కూకట్పల్లి నియోజకవర్గంలోని బూత్ నెంబర్ 24. ఆచార్య వినోభాపురం కాలనీ. ఇక్కడ అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా సెటిలర్లు ఉంటారు. అందులోనూ తూర్పు కాపులు ఎక్కువ. ఈ బూత్లో బీఆర్ఎస్కు 329 ఓట్లు పడ్డాయి.కాంగ్రెస్కు 191, జనసేనకు 120 ఓట్లు వచ్చాయి. ఏపీలో జగన్ ప్రభుత్వ పాలన బాగుందనీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు ప్రచారం చేస్తున్నందువల్లనే తాము బీఆర్ఎస్కు ఓటు వేస్తున్నామనీ సత్తిబాబు అనే వ్యక్తి చెప్పారు. కూకట్పల్లి నియోజకవర్గంలోనే కేపీహెచ్బీ కాలనీ బూత్ నెంబర్ 326. ఇక్కడ ఉన్నదంతా ఏపీ సెటిలర్లే. ఒకే కులంగా చూసినప్పుడు కమ్మవారు ఎక్కువ. ఆ తర్వాత స్థానాల్లో శెట్టిబలిజ, యాదవ, గవర తదితర బీసీ కులాలుంటాయి. కాపులు కూడా గణనీయంగానే ఉన్నారు. అదే నిష్పత్తి ఓటింగ్లో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీకి 214 ఓట్లు వస్తే, బీఆర్ఎస్కు 430 మంది, జనసేనకు 132 మంది ఓటేశారు. స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి కమ్మ సామాజిక వర్గమైనప్పటికీ ఆయనకు 15 నుంచి 20 శాతానికి మించి ఆ కులం ఓట్లు పడలేదని వారే చెప్పారు. ఆ ప్రాంతానికి చెందిన పరుచూరి ప్రసాద్ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ మళ్లీ చంద్ర బాబు గెలిస్తేనే ఏపీలో అభివృద్ధి ఉంటుంది కనుక ఆయన అభీష్టం మేరకు ఇక్కడ తాము కాంగ్రెస్కు ఓటేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం వర్గీయుల అత్యు త్సాహం మొదటికే మోసం తెచ్చింది. తెలుగుదేశం అను కూలురు – వ్యతిరేకులుగా ఏపీ సెటిలర్లు చీలిపోయారు. వ్యతి రేకుల ఆధిక్యత నిర్ద్వంద్వంగా రుజువైంది. ఒకరకంగా రాబోయే ఏపీ ఎన్నికల ప్రీ పోల్ సర్వే ఫలితాలను సెటిలర్ల కాలనీలు ప్రకటించాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమిపై బాబు అనుచిత వ్యాఖ్యలు
-
తొలిసారి మంత్రి పదవి చేపట్టేది వీరే..
హైదరాబాద్: తెలంగాణలో మరికాసేపట్లో ప్రభుత్వం కొలువుదీరనుంది. టీపీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసిన రేవంత్ రెడ్డితో పాటు 11 మంది నాయకులు మంత్రి పదవులు చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం బహిర్గతం చేసింది. తొలిసారి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనుండగా, మల్లు భట్టి విక్రమార్క, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తొలిసారి మంత్రి పదవి చేపట్టినవారవుతారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో కాంగ్రెస్ నెగ్గగా.. సీపీఎం 1 స్థానంలో విజయం సాధించింది. అనంతరం ముఖ్యమంత్రి పదవిపై తర్జనభర్జన చేసిన కాంగ్రెస్ కేంద్ర అధిష్ఠానం ఎట్టకేలకు రేవంత్ను నిర్ణయించింది. ఆయనతో పాటు మరో 11 మందికి మంత్రి పదవులను కూడా ఫైనల్ చేసింది. ఎల్బీ స్టేడియంలో నేడు వీరంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న 11 మంది నాయకుల జాబితాలో భట్టి, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, రాజనర్సింహ, పొంగులేటి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ ఉన్నారు. ఇదీ చదవండి: ఉత్తమ్కుమార్రెడ్డికి ఆర్థిక శాఖ? -
కొత్త ఎమ్మెల్యేల్లో 82 మందిపై కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో 82 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో అందరికంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ 85 మందికి సీట్లు కేటాయించగా వారిలో 51 మంది విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నా రు. బీజేపీ నుంచి బరిలో నిలిచిన 79 మందిలో ఏడుగురు, బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన 57 మందిలో 19 మంది, ఏఐఎంఐఎం కేటాయించిన ఐదుగురిలో నలుగురు గెలిచా రు. కాగా సీపీఐ నుంచి గెలిచిన కూనంనేని సాంబశివరా వుపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), తెలంగాణ ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి. 119 నియోజకవర్గాల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల అఫిడవిట్ల ఆధారంగా ఈ సంస్థలు బుధవారం ఒక నివేదికను విడుదల చేశాయి. ఆస్తుల్లో అగ్రస్థానంలో వివేక్ ప్రధాన రాజకీయ పార్టీల నుంచి గెలిచిన 119 మందిలో 114 (96%) మంది కోటీశ్వరులు ఉన్నారు. అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 60 (94%) మంది, బీఆర్ఎస్ నుంచి 38 (97%) మంది, బీజేపీ నుంచి 8 (100%) మంది, ఏఐఎంఐఎం నుంచి ఏడుగురు (100%), సీపీఐకి చెందిన ఒకరు (100%) తమకు కోటి రూపాయలకు పైగా ఆస్తులు ఉన్న ట్లు వెల్లడించారు. చెన్నూర్ నియోజకవర్గం నుంచి గెలిచిన గడ్డం వివేకానంద్ (కాంగ్రెస్) తన ఆస్తుల విలువ రూ.606+ కోట్లుగా ప్రకటించి ప్రథమ స్థానంలో నిలిచారు. రూ.458+ కోట్లతో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రూ.433+ కోట్లతో పాలే రు కాంగ్రెస్ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రూ.58+ కోట్లు, సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తార క రామారావు రూ.53+ కోట్లు, సీఎల్పీ నాయకుడు, టీపీసీ సీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రూ.30+ కోట్ల ఆస్తులు ప్రకటించారు. రూ.24+ లక్షలతో ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వె డ్మ బొజ్జు అతి తక్కువ ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేగా నిలిచా రు. రూ.28+ లక్షలతో దేవరకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ నెనావత్, రూ.56+లక్షలతో అశ్వారావు పేట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణలు తదుపరి స్థానా ల్లో ఉన్నారు. 2023లో గెలిచిన అభ్యర్థుల సగటు ఆస్తులు రూ. 38.88 కోట్లు కాగా.. 2018లో గెలిచిన ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.15.71 కోట్లు కావడం గమనార్హం. అప్పుల్లో దానం టాప్ మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో 61 మంది తమకు రూ. కోటి కంటే ఎక్కువ అప్పులు ఉన్నాయని ప్రకటించారు. రూ.49+ కోట్ల అప్పుతో ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రథమ స్థానంలో నిలిచారు. పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (రూ.43+ కోట్లు), చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద్ (రూ.41+ కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 96 మంది ఎమ్మెల్యేల వయసు 51 పైనే తాజా ఎన్నికల్లో గెలిచిన వారిలో 23 (19%) మంది ఎమ్మెల్యేల వయస్సు 25 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండగా, 96 మంది (81%) ఎమ్మెల్యేలు 51–80 సంవత్సరాల మధ్య వయస్సుతో ఉన్నారు. అత్యంత ఎక్కువ వయస్సు ఉన్న ఎమ్మెల్యేగా బాన్సువాడ నుంచి గెలుపొందిన పోచారం శ్రీనివాస్రెడ్డి (74) నిలిచారు. అత్యంత పిన్న వయస్కులైన ఎమ్మెల్యేలుగా పాలకుర్తి నుంచి గెలుపొందిన యశస్విని (26), మెదక్ నుంచి గెలిచిన మైనంపల్లి రోహిత్ (26) నిలిచారు. కాగా కొత్త అసెంబ్లీలో 109 మంది పురుషులు, 10 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టనున్నారు. -
దక్షిణాదిలో ఎలా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాదిలో విస్తరించాలన్న బీజేపీ ఆశలపై నీళ్లు చల్లాయి. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్, ఛత్తీస్గఢ్లను బీజేపీ కైవసం చేసుకోగా, మధ్యప్రదేశ్లో ప్రజావ్యతిరేకతను అధిగమించి మళ్లీ అధికారంలోకి రాగలిగింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరగడంతో అధికారంలోకి వస్తామని లేదా అధిక సంఖ్యలో సీట్లు సాధించి కింగ్మేకర్ లేదా ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తామని బీజేపీ నాయకత్వం అంచనా వేసింది. కానీ ఫలితాల్లో డబుల్ డిజిట్ కూడా దాటలేకపోయింది. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న రాష్రాల్లోనూ నిలిచి ఉత్తరాది, ఇతర ప్రాంతాల్లో మరింత బలోపేతమవుతున్న బీజేపీ దక్షిణాదిలో మాత్రం ఎందుకు విస్తరించలేకపోతు న్నది? అందుకు దారితీస్తున్న, ప్రభావం చూపు తున్న అంశాలేమిటి అన్న దానిపై జాతీయనాయకత్వం దృష్టి పెట్టినట్టు పార్టీవర్గాల సమాచారం. వరుస ఓటములతో.. కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోగా, తెలంగాణలో ఓటమితో బీజేపీ శ్రేణులు నిరాశలో ఉన్నాయి. డీలా పడిన పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఈ రెండింటితో సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో సత్తా చాటకపోతే భవిష్యత్లో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రా యం పార్టీలో వ్యక్తమవుతోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లు గెలవ గా, వచ్చే ఎన్నికల్లో కనీసం 8 నుంచి 9 లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తేనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓ టమిని అధిగమించినట్టు అవుతుందనే చర్చ అంతర్గతంగా ముఖ్యనేతల్లో సాగుతున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికల కల్లా దక్షిణాదిలో మరీ ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణల్లో పార్టీ పరిస్థితిని చక్కదిద్దడంపై జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఇక్కడ స్పెషల్ ఫోకస్ ఉత్తరాదిలో బలంగా ఉన్నా దక్షిణాదిలో ఇంకా పూర్తిస్థాయిలో పట్టు దొరక్కపోవడానికి కారణాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే దక్షిణాదికి సంబంధించి ప్రత్యేక ఎ జెండాకు తుది రూపం ఇస్తున్నట్టు సమాచారం. దక్షిణాదిని ఆనుకొని పొరుగున రాష్ట్రాలు కలుపుకుని మొత్తం 11 రాష్ట్రాల్లో 181 ఎంపీ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వాటిలో 53 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ సంఖ్యను దాటి ఎక్కువ మొత్తంలో సీట్లు గెలిచే దిశగా కచ్చితమైన వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికతో బీజేపీ ముందుకెళ్లనుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని రాష్ట్రపార్టీలకు జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. -
రేవంత్రెడ్డి స్వగ్రామంలో సంబరాలు (ఫొటోలు)
-
తెలంగాణ ఫలితాలపై బీజేపీ పోస్టుమార్టం
బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షకు సిద్ధమైంది. పార్టీలో జరిగిన పరిణామాలు.. సీట్ల కేటాయింపు నుంచి ఫలితాల ప్రకటన వరకు అభ్యర్థుల తీరుపై సమగ్ర నివేదికతో ఢిల్లీకి బయలుదేరారు తెలంగాణ కమలసారథి కిషన్ రెడ్డి, అసలు కాషాయ దళపతి హస్తినకు తీసుకెళ్లిన రిపోర్ట్ లో ఏముంది ? ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి బాధ్యత ఎవరు వహిస్తారు? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ 8 అసెంబ్లీ సీట్లు.. 14 శాతం ఓట్లు సాధించి ఉనికి చాటుకుంది. గత మూడేళ్లుగా బీజేపీ చేసిన పోరాటలకు.. వచ్చిన ఫలితాలకు మధ్య పొంతన లేకపోవడంపై పార్టీలో అంతర్గత చర్చ కొనసాగుతోంది. పార్టీ వైఫల్యాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లోతుగా విశ్లేషించి సమగ్ర నివేదికను రూపొందించారు. ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి ఆ నివేదికను పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా, హోం మంత్రి అమిత్ షాకు సమర్పించనున్నారు. కిషన్ రెడ్డి ఇస్తున్న రిపోర్ట్ లో ఏముందనే దానిపై పార్టీ నేతల్లో విస్తృత చర్చ సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు క్షేత్రస్థాయిలో ఎంత వరకు వర్కవుట్ అయ్యాయనే దానిపై నివేదికలో వివరించినట్లు సమాచారం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం, బీసీ సీఎం నినాదం ఎంత వరకు ఉపయోగపడిందనే దానిపై పార్టీలో చర్చ సాగుతోంది. బీజేపీ 36 మంది బీసీలకు టికెట్లు ఇస్తే కేవలం ముగ్గురు మాత్రమే విజయం సాధించారు. 12 మంది మహిళలకు టికెట్లు ఇస్తే ఒక్కరు కూడా విజయం సాధించలేదు. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ డ్ సీట్లపై మిషన్ 31 అని కమిటీలు వేసినా.. ఒక్క స్థానం కూడా గెలవలేదు. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు ఆరు స్థానాలు ఇచ్చి బీజేపీ పరువు నిలబెట్టాయి. గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీకి 48 మంది కార్పోరేటర్లు... టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నా వారిని వినియోగించుకోవడంలో పార్టీ విఫలమైంది. దీంతో జీహెచ్ఎంసీలో కేవలం ఒక్క గోషామహల్ విజయంతో సరిపెట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ భారీగా ఓట్లను చీల్చడంతో బీజేపీ సీట్లకు గండిపడింది. కాంగ్రెస్ ను అంచనా వేయడంలో విఫలం కావడంతో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. కరీంనగర్, హుజురాబాద్, కోరుట్ల, బోధ్ అసెంబ్లీ స్థానాలపై బీజేపీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఆ స్థానాల్లో పార్టీ రాష్ట్ర నాయకులు, ఎంపీలు పోటీ చేసి పరాజయం పాలుకావడం పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం అభ్యర్థులుగా ఫోకస్ చేసినప్పటికీ ఎందుకు గెలవలేదనే దానిపై చర్చ సాగుతోంది. ఎంపీల అతివిశ్వాసం, గ్రేటర్ లో కార్పోరేటర్ల సహాయ నిరాకరణ, నేతల మధ్య ఆధిపత్య పోరులాంటి అంశాలు.. బీజేపీ వైఫల్యానికి కారణంగా జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ వైఫల్యాలకు ఎవరిని బాధ్యులను చేస్తారు ? పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతకు భవిష్యత్ కార్యచరణ ఎలా ఉండబోతుందనే దానిపై పార్టీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. చదవండి: TS: సీఎం ఎవరు..?ఏఐసీసీ చీఫ్ ఖర్గే కీలక వ్యాఖ్యలు -
చెల్లని నాణేలు..చిల్లర రాజకీయాలు...
-
Telangana: కాంగ్రెస్ విజయంపై స్పందించిన దివ్యవాణి
-
తెలంగాణలో కాంగ్రెస్ విజయంపై స్పందించిన దివ్యవాణి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అందుకుంది. ఈ విజయం పట్ల ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు దివ్యవాణి స్పందించారు. ఈ విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంతో శ్రమించారని కొనియాడారు. ఇక గెలిచిన ఎమ్మెల్యేలందరికీ ఆమె అభినందనలు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆమె ఇండియా వచ్చిన వెంటనే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలిపారు. -
సీరియస్ పొలిటికల్ పిక్చర్ లో కమెడియన్లు
-
ఆ లోక్సభ సెగ్మెంట్లలో మిశ్రమ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ సెగ్మెంట్ల వారీగా చూస్తే..అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆయా రాజకీయపార్టీలకు మిశ్రమ స్పందన మిగిల్చాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్కు నాలుగు లోక్సభ సెగ్మెంట్లలో కనీస ప్రాతినిధ్యమే దక్కలేదు. కాంగ్రెస్ పార్టీకి సైతం రాజధాని పరిధిలోని 3 లోక్సభ సెగ్మెంట్లలో గెలవలేకపోయింది. నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ కేవలం ఆదిలాబాద్లోనే నాలుగు అసెంబ్లీ సీట్లతో పూర్తి ఆధిపత్యాన్ని చాటుకుంది. నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్ లోక్సభ స్థానాల పరిధిలో గుడ్డిలో మెల్లగా ఒకటి రెండు సీట్లతో ఉనికిని చాటుకుంది. బీఆర్ఎస్ నాలుగు చోట్ల జీరో... మూడు చోట్ల ఒక్కో స్థానమే 39 అసెంబ్లీ సెగ్మెంట్లలో సీట్లు గెలిచి బలమైన ప్రతిపక్షంగా అవతరించిన బీఆర్ఎస్కు లోక్సభ సెగ్మెంట్ల వారీగా చూస్తే...నాలుగు చోట్ల ప్రాతినిధ్యం దక్కలేదు. పెద్దపల్లి, మహబూబ్నగర్, ఖమ్మంలతోపాటు హైదరాబాద్ లోక్సభ స్థానాల్లోని 28 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. హైదరాబాద్ లోక్సభ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎంఐఎం, గోషామహల్లో బీజేపీ గెలిచింది. ఇక పెద్దపల్లి, మహబూబ్నగర్, ఖమ్మంలోని 21 స్థానాల్లో కాంగ్రెస్కు ఎదురే లేకుండా పోయింది. భువనగిరి ఎంపీ పరిధిలో కేవలం జనగామలో మాత్రమే టీఆర్ఎస్ గెలవగా, మిగతా ఆరు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లాయి. వరంగల్ లోక్సభ పరిధిలోని స్టేషన్ ఘన్పూర్, నల్లగొండలో సూర్యాపేట, మహబూబాబాద్లో భద్రాచలం సీట్లు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకోగా, మిగతా ఆరేసి సీట్లను కాంగ్రెస్ సొంతం చేసుకోవడం గమనార్హం. కాంగ్రెస్ రాజధానిలో హస్తవాసి బాగాలేదు ముఖ్యమంత్రి రేసులో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి దేశంలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గాల్లో ఒకటి. ఈ లోక్సభ స్థానం నుంచి రేవంత్రెడ్డి 2019 ఎన్నికల్లో 13వేల స్వల్ప తేడాతో విజయం సాధించారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పరిధిలోని ఏడు సెగ్మెంట్లలోనూ బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా ఉన్న హైదరాబాద్లో కూడా కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా దక్కలేదు. మెదక్ లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో మెదక్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందగా, మిగతా ఆరుచోట్ల బీఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేసింది. బీజేపీ నలుగురు ఎంపీలున్నా నిరాశే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు లోక్సభసీట్లలోనూ నిరాశే మిగిలింది. కేవలం ఆదిలాబాద్ ఎంపీ పరిధిలోనే బీజేపీ మెరుగైన స్థానాలు సాధించింది. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సోయం బాపూరావు బోథ్ అసెంబ్లీ నుంచి ఓడిపోయినా, ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూరు, ముథోల్లలో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఒకింత ఓదార్పు. మరో ఎంపీ సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లోక్సభ పరిధిలోని ఏడు సీట్లలో నాలుగు కాంగ్రెస్, మూడు బీఆర్ఎస్ గెలుచుకుంది. సంజయ్ పోటీ చేసిన కరీంనగర్, సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్లలో బీఆర్ఎస్ గెలుపొందడం విశేషం. మరో ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్లో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్లలో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. సిట్టింగ్ ఎంపీ అర్వింద్ పోటీ చేసిన కోరుట్లలో ఆయనే ఓడిపోయారు. ఇక కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించగా, నాంపల్లిలో ఎంఐఎం స్వల్ప తేడాతో కాంగ్రెస్పై విజయం సాధించింది. -
కొత్త సర్కారుకు శ్రీకారం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా.. తాజా ఎన్నికల్లో గెలిచినవారి జాబితాతో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్రాజ్ సోమవారం గెజిట్ జారీ చేశారు. ఆ వెంటనే సీఈఓ వికాస్రాజ్ రాజ్భవన్కు చేరుకుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు గెజిట్ నోటిఫికేషన్ ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా సీఈఓ వికాస్రాజ్ నేతృత్వంలోని ఎన్నికల అధికారుల బృందం గవర్నర్ తమిళిసైతో కొంతసేపు మర్యాదపూర్వకంగా సమావేశమైంది. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ శాససభాపక్ష (సీఎల్పి) నేతను ఎన్నుకోవడానికి సోమవారం సమావేశమయ్యారు. సీఎల్పీ నేతగా రేవంత్రెడ్డి ఎన్నికవుతున్నారని, ఆయన రాజ్భవన్కు చేరుకుని సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని, మరో ఒకరిద్దరు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రాజ్భవన్ ఉన్నతాధికారులు సోమవారం ఉదయమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభించారు. రాజ్భవన్ దర్బార్హాల్లో కొత్త సీఎం, మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించడానికి వీలుగా పొడియంను, కార్యక్రమానికి వచ్చే ఆహ్వానితుల కోసం కుర్చిలను సిద్ధం చేశారు. దర్బార్ హాల్ను అలంకరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీర్మానం తీసుకుని సీఎల్పీ నేత రాజ్భవన్కు వచ్చే అవకాశం ఉండటంతో గవర్నర్ తమిళిసై, రాజ్భవన్ అధికారులు సాయంత్రం వరకు వేచిచూశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రాజ్భవన్ వద్దకు చేరుకోవడంతో సందడి నెలకొంది. కాన్వాయ్లనూ సిద్ధం చేసినా.. కొత్త సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రొటోకాల్ ప్రకారం వారికి ప్రత్యేక కాన్వాయ్ల కోసం కూడా ఏర్పాట్లు జరిగాయి. రాజ్భవన్ పక్కనే ఉన్న దిల్కుషా అతిథి గృహం వద్ద ఈ మేరకు వాహనాలను సిద్ధంగా ఉంచారు. అయితే సీఎల్పీ నేత ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం రాలేదని, కొత్త సీఎం ప్రమాణ స్వీకారం సోమవారం ఉండదనే స్పష్టత రావడంతో జీఏడీ అధికారులు రాజ్భవన్ నుంచి వెనుతిరిగారు. కొత్త కొత్తగా సచివాలయం నూతన సీఎం, మంత్రులకు రాష్ట్ర సచివాలయంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. సచివాలయంలో పాత ప్రభుత్వంలోని కీలక ప్రజాప్రతినిధుల నేమ్ ప్లేట్లను అధికారులు సోమ వారం తొలగించారు. కొత్త సీఎం, మంత్రుల కోసం చాంబర్లను సిద్ధం చేస్తున్నారు. కొత్త సీఎం, మంత్రులకు సంబంధించి తమకు ఎలాంటి కబురు అందలేదని, అధికారికంగా సమాచారం అందగానే వారి కి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని సాధారణ పరిపాలన విభాగం అధికారులు తెలిపారు. అసెంబ్లీ కూడా ముస్తాబు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, కొత్తగా ఎన్నికైన వారితో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని కూడా ముస్తాబు చేస్తున్నారు. అసెంబ్లీ భవనానికి రంగులు వేయడంతోపాటు పాత ఫర్నిచర్ను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు, సీఎం చాంబర్లను అందంగా తీర్చిదిద్దే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రెండో శాసనసభ రద్దు కేసీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గం సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రద్దు ఉత్తర్వులు ఆదివారం (డిసెంబర్ 3) మధ్యాహ్నం నుంచే వర్తిస్తాయని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉపసంహరణ సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనానియమావళి అమలును కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అజయ్కుమార్ వర్మ సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)కు లేఖ రాశారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అక్టోబర్ 9న రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనానియమావళి అమల్లోకి వచి్చన విషయం తెలిసిందే. -
హోటల్ ఎల్లాలో సీఎల్పీ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేతలు (ఫొటోలు)
-
బర్రెలక్క.. తగ్గేదేలే!
బర్రెలక్క(శిరీష).. ఆమె ఓ సోషల్ మీడియాలో సంచలనం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రధాన పార్టీ అభ్యర్థులకు సైతం ఆమె ముచ్చెమటలు పట్టించారు. శిరీషకు వచ్చిన ప్రచారాన్ని చూసి ఆమె గెలుస్తుందని కూడా చాలా మంది భావించారు. ఒకవైపు ప్రశంసలు.. మరొకవైపు విమర్శల నడమ ఆమె పోటీకి సై అన్నారు. వెనక్కి తగ్గమని బెదిరింపులు.. బుజ్జగింపుల పర్వం కొనసాగినా చివరి వరకూ పోటీలోనే ఉంటానని చెప్పి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు శిరీష. అయితే ఇక్కడ బర్రెలక్క అనబడే శిరీష ఓడింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నాలుకల్లో ఉండిపోయేంత ఆదరణను చూరగొంది. అదే ఇప్పుడు ఆమెకు కొండంత బలంలా పని చేస్తోంది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి రెడీ అంటోంది. నాల్గో స్థానమే.. కానీ ప్రతీ నోట బర్రెలక్క మాటే..! ఆమె పోటీ చేసిన కొల్లపూర్ నియోజకవర్గంలో నాలుగో స్థానంలో నిలిచారు బర్రెలక్క. నిరుద్యోగుల తరఫున స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసిన శిరీషకు మొత్తం 5,598 ఓట్లు వచ్చాయి. కానీ కౌంటింగ్ జరుగుతున్నంతసేపు బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వచ్చాయి? కొల్లపూర్లో పరిస్థితి ఏంటి అనేది చర్చ కూడా నడిచింది. ప్రధానంగా బర్రెలక్క ఎవరి గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉందనే విషయం కూడా జనం నోళ్లల్లో ఎక్కవగా నానింది. చివరకు పరాజయం చవిచూసినా ఒక సామాన్యురాలు.. ఆ మాత్రం ముందుకు వెళ్లడమే చాలా గొప్ప విషయమంటూ పొగిడిన నోళ్లు ఎన్నో.. నాకు ప్రచారానికి టైమ్ సరిపోలేదు.. ఫలితాల అనంతరం ఆమె మీడియాలో మాట్లాడుతూ.. తాను ప్రచారం ఎక్కువ రోజులు చేయలేకపోయానని, వారం రోజులు మాత్రమే తాను పూర్తి స్థాయిలో ప్రచారం చేసినట్లు చెప్పారు. తాను ఎక్కువ రోజులు ప్రచారం చేసి ఉంటే మరింత ప్రభావం చూపేదానినని ఆమె పేర్కొంది. ప్రజలు ఎవరినీ తొందరగా నమ్మరని, తనది చిన్న వయసు కావున.. ఎలా పాలిస్తుందని అనుకున్నారని తెలిపారు. నిరుద్యోగ సమస్యలపై తన పోరాటాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు. తాను ఓడిపోలేదని ప్రజల మనసు గెలిచానని తెలిపారు. కొందరు తనకు ఓటు వేయకూడదని ఓటర్లను బెదిరించారని చెప్పారు. తాను ఓట్ల కోసం డబ్బులు పంచలేదని.. తనకు వచ్చిన ఓట్లు స్వచ్ఛమైనవని, ఈ రకంగా తాను గెలిచినట్లేని చెప్పారు. తాను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కూడా పోటీ చేస్తానని తెలిపారు. తనకు ఓటు వేసిన ఓటర్లకు, మద్దతుగా నిలిచిన మేధావులకు, సోషల్ మీడియా మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరిలో ఆసక్తి ఓట్లు విషయంలో ఆమె అందరిలో ఆసక్తి రేపిన విషయం తెలిసిందే. గెలవకపోయినా కొల్లాపూర్ నియోజకవర్గంలో తన మార్క్ చూపుతుందని ఆమె మద్దతుదారులు ఆశించారు. ఆమె ప్రచారం కోసం పలు సంఘాల నేతలు, సోషల్ మీడియా ఫాలోవర్లు, న్యాయవాదులు, టీచర్లు, ముఖ్యంగా ఇతర జిల్లాలకు చెందిన నిరుద్యోగులు ఎంతో శ్రమించారు.. ఆమె సైతం ఎవరికీ భయపడకుండా.. ఒక వైపు తన సోదరుడి మీద దాడి జరిగినా ప్రచారంలో ముందుకు వెళ్లింది. ఈ ఎన్నికల్లో ఆమెకు వచ్చిన ఓట్లను పక్కన పెట్టి.. అసలు పోటీ చేయడమే గొప్ప విషయమని, నిరుద్యోగుల పక్షాన పోరాటం అపొద్దని నెటిజన్లు కోరుతున్నారు. పోటీలో గెలవకపోయినా శిరీష తొలి అడుగును, ప్రచారంలో ఆమె చూపిన ధైర్యాన్ని అన్ని వర్గాలు వారు అభినందిస్తున్నారు. బర్రెలక్క బరిలో ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. -
జస్ట్ మిస్.. కొద్దిలో గట్టెక్కింది వీరే.. భారీ మెజార్టీ వీళ్లదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. కాంగ్రెస్ను భారీ మెజార్టీలో ప్రజలు గెలిపించారు. దీంతో, ప్రభుత్వ ఏర్పాట్లకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ప్లాన్ జరుగుతోంది. మరోవైపు, ఎన్నికల్లో కొద్ది ఓట్ల మార్జిన్తో, భారీ మెజార్టీతో కొందరు అభ్యర్థులు విజయం సాధించారు. బొటాబొటీ ఓట్లతో గట్టెక్కింది వీరే.. చేవెళ్లలో కాలె యాదయ్య (బీఆర్ఎస్) కేవలం 268 ఓట్ల అతి తక్కువ మెజార్టీతో గెలిచారు. యాకుత్పురలో జాఫర్ హుస్సేన్ (ఎంఐఎం) 878 ఓట్లు, జుక్కల్లో లక్ష్మీకాంతరావు (కాంగ్రెస్) 1,152, దేవరకద్రలో గవినోళ్ల మధుసూదన్రెడ్డి (కాంగ్రెస్) 1,392, నాంపల్లిలో మాజిద్ హుస్సేన్ (ఎంఐఎం) 2,037, బోధన్లో పి.సుదర్శన్రెడ్డి (కాంగ్రెస్) 3,062, సిర్పూరులో హరీశ్బాబు (బీజేపీ) 3,088, కరీంనగర్లో గంగుల కమలాకర్ (బీఆర్ఎస్) 3,163, బాల్కొండలో వేముల ప్రశాంత్రెడ్డి (బీఆర్ఎస్) 4,533, సూర్యాపేటలో జగదీశ్రెడ్డి (బీఆర్ఎస్) 4,606, ఖానాపూర్లో ఎడ్మ బొజ్జు (కాంగ్రెస్) 4,702 ఓట్లతో తక్కువ మెజార్టీ సాధించారు. 20 మందికి 50వేలకుపైగా మెజారిటీ రాష్ట్రంలో 20 మందికిపైగా ఎమ్మెల్యేలు 50 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అత్యధికంగా కుత్బుల్లాపూర్లో కేపీ వివేకానంద్ (బీఆర్ఎస్) 85,576 ఓట్ల మెజార్టీ సాధించారు. సిద్దిపేటలో హరీశ్రావు (బీఆర్ఎస్) 82,308, చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం) 81,660, కూకట్పల్లిలో మాధవరం కృష్ణారావు (బీఆర్ఎస్) 70,387, నకిరేకల్ నుంచి వేముల వీరేశం (కాంగ్రెస్) 68,839 ఓట్ల మెజార్టీతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. 50 వేలపైన మెజార్టీ సాధించినవారిలో కాంగ్రెస్ నుంచి 13 మంది, బీఆర్ఎస్ నుంచి నలుగురు, ఎంఐఎం నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు. -
ఎట్టకేలకు పోరాడి గెలిచారు
-
రాహుల్, ప్రియాంక పర్యటించిన చోట్ల
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతల ఎన్నికల ప్రచారం ఆ పార్టీ అభ్యర్థులకు మిశ్రమ ఫలితాన్నిచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్థానాల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా, మరికొన్ని చోట్ల పరాజయం పాలయ్యారు. ఈ ఏడాది అక్టోబర్18న తన సోదరి ప్రియాంకతో కలిసి వరంగల్ జిల్లాకు వచ్చిన రాహుల్ ప్రచారం నిర్వహించిన ములుగు, వరంగల్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. రాహుల్ వెళ్లిన భూపాలపల్లి, వరంగల్ ఈస్ట్, కొల్లాపూర్, కల్వకుర్తి, జడ్చర్ల, షాద్నగర్, బోధన్, వేములవాడ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక, ఆయనతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెళ్లినప్పటికీ సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓటమి పాలు కావడం గమనార్హం. ప్రియాంక వెళ్లిన కొడంగల్, ఖానాపూర్, పాలేరు, ఖమ్మం, మధిర స్థానాల్లో గెలవగా, జహీరాబాద్, మల్కాజ్గిరి స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. రాహుల్ వెళ్లిన కామారెడ్డి, ఆదిలాబాద్లోనూ పార్టీ అభ్యర్థి ఓడిపోగా, ఆంధోల్లో విజయం సాధించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాహుల్ ప్రచారం చేసిన జూబ్లీహిల్స్, నాంపల్లి, మల్కాజ్గిరి స్థానాల్లో అభ్యర్థులు ఓడిపోయారు. ఖర్గే హాజరైన నల్లగొండలో కోమటిరెడ్డి భారీ మెజార్టీతో గెలవగా, ఆలంపూర్లో సంపత్కుమార్ పెద్ద తేడాతో ఓటమి పాలయ్యారు. గతంలో సోనియాగాంధీ సభ నిర్వహించిన తుక్కుగూడలో పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం) భారీ మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం -
ప్రజాసేవలో డాక్టర్లు..!
సాక్షి, హైదరాబాద్: తాజా ఎన్నికల్లో సత్తాచాటి ఏకంగా 15 మంది వైద్యులు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. వైద్య వృత్తిలో రాణిస్తూనే రాజకీయ పార్టీలిచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరిలో నలుగురు జనరల్ సర్జన్లు కాగా, ఒకరు జనరల్ ఫిజీషియన్, మరొకరు పీడియాట్రిక్స్ కాగా ఒకరు న్యూరో సర్జన్ ఉన్నారు. ఇక ముగ్గురు ఎంఎస్ ఆర్థో ఉండగా, మరొకరు డెంటల్ సర్జన్. ఇద్దరు ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారున్నారు. వీరిలో దాదాపు అందరూ తొలిసారిగా పోటీ చేసిన వారే కావడం గమనార్హం. తాజాగా గెలిచిన 15 మంది వైద్యుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది విజయం సాధించగా... బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు గెలుపొందారు. -
కమల వికాసం.. విలాపం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మిశ్రమ ఫలితాలిచ్చాయి. గతంతో పోలిస్తే సీట్లు, ఓట్లు పెరిగినా అధికారంలోకి రావాలన్న కల కలగానే మిగిలింది. 2018 ఎన్నికల్లో 118 సీట్లలో పోటీచేసి కేవలం ఒక సీటు గెలిచి 7 శాతం ఓటింగ్కు పరిమితమైన స్థితి నుంచి ఈ ఎన్నికల్లో 8 సీట్లలో గెలిచి 14 శాతం ఓటింగ్ సాధించడం వరకే కమలదళం పరిమితమైంది. పోటీ చేసిన 111 స్థానాలకుగాను కనీసం 35–40 సీట్లలో గట్టి పోటీ ఇచ్చి 18–22 సీట్లలో గెలుస్తామనే అంచనాలకు ఆమడ దూరంలో నిలిచింది. ఉత్తర తెలంగాణలో బీజేపీ గాలి.. బీజేపీ పోటీ చేసిన మొత్తం సీట్లలో దాదాపు 32.20 లక్షల ఓట్లు సాధించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే గెలిచిన 8 సీట్లలో 7 ఉత్తర తెలంగాణ నుంచే రావడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. 2019 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన 4 ఎంపీ సీట్లలో మూడు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లలో ఉండగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ ఉత్తర తెలంగాణనే బీజేపీని ఆదుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్లో 4, నిజామాబాద్లో 3 సీట్లలో బీజేపీ విజయదుందుభి మోగించింది. ఆయా నియోజకవర్గాల పరిధిలో బీజేపీ అగ్రనాయకులైన మోదీ, అమిత్ షా, నడ్డా నిర్వహించిన ప్రచారం కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి దోహదపడిందని నాయకులు అంచనా వేస్తున్నారు. నిజంకాని అంచనాలు.. ఉత్తర తెలంగాణలో మెజారిటీ సీట్లతోపాటు గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, మహబూబ్నగర్లలో కొన్ని సీట్లు కలిపి మొత్తం 18కిపైగానే గెలుస్తామనే బీజేపీ ముఖ్యనేతల అంచనాలు నిజం కాలేదు. హైదరాబాద్ పరిధిలో కేవలం గోషామహల్లో ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి విజయం సాధించడం మాత్రమే ఆ పార్టీకి కాస్త ఓదార్పు మిగిల్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 48 సీట్లు గెలిచినా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఫలితాలేవీ ప్రతిబింబించకపోవడం పార్టీ నేతలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. అలాగే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్ (కరీంనగర్లో), ధర్మపురి అరి్వంద్ (కోరుట్లలో), సోయం బాపూరావు (బోథ్లో)తోపాటు గతంలో ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ (హుజూరాబాద్, గజ్వేల్లలో), ఎం. రఘునందన్రావు (దుబ్బాకలో) ఓడిపోవడం బీజేపీకి అంతుబట్టడంలేదు. పనిచేయని బీసీ నినాదం...ఎస్సీ వర్గీకరణ... బీజేపీ బీసీ నినాదం, అధికారానికి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామనే హామీ, ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిర్ణయం, మేనిఫెస్టోలో రైతులు, యువత, మహిళలు... ఇలా వివిధ వర్గాలను ఆకట్టుకొనేందుకు పొందుపరిచిన అంశాలేవీ ఫలితాల సాధనలో బీజేపీకి కలసి రాలేదు. బీసీ నినాదం తీసుకున్నారే తప్ప ఈ వర్గాలను చేరుకొని వారి మద్దతు సాధించడంలో పార్టీ విఫలమైంది. ఎస్సీ–19, ఎస్టీ–12 స్థానాల్లో ఒక్కటంటే ఒక్క సీటునూ పార్టీ గెలవలేకపోయింది. ఈ సీట్లపై ప్రత్యేక దృష్టిపెట్టి మిషన్–31ను ప్రారంభించినా పెద్దగా ఆ దిశగా కృషి చేయకపోవడం ఫలితాలపై ప్రభావం చూపింది. పార్టీ గెలిచిన 8 సీట్లలో ముగ్గురు బీసీ వర్గానికి చెందిన వారు (36 మందికి సీట్ల కేటాయింపు) కాగా ఐదుగురు జనరల్ కేటగిరీకి చెందినవారు. పార్టీ గెలిచిన 8 సీట్లలో (రాజాసింగ్, మహేశ్వర్రెడ్డి మినహా) ఆరుగురు తొలిసారిగా శాసనసభలోకి అడుగుపెడుతుండటం గమనార్హం. అయితే మహిళలకు 12 టికెట్లు ఇచ్చినా వారిలో ఒక్కరూ విజయం సాధించలేదు. కమలాన్ని దెబ్బతీసిన అంశాలెన్నో... రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పుపై 3–4 నెలలపాటు సందిగ్ధత నెలకొనడం... ఎన్నికలకు ముందు సంజయ్ను హఠాత్తుగా మార్చడం.. బీఆర్ఎస్–బీజేపీ మధ్య అంతర్గత దోస్తీ ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోవడం, అధికార బీఆర్ఎస్ అవినీతిపై ఆరోపణలు గుప్పించి వాటిపై కేంద్ర ప్రభుత్వ స్థాయిలో విచారణ లేదా దర్యాప్తునకు ఆదేశించకపోవడం ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీశాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఈడీ ద్వారా విచారణ జరిపినా చర్యలు తీసుకోకుండా తాత్సారం చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఏటీఎంగా మారిందని స్వయంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి వారు బహిరంగ సభల్లో ఆరోపించినా దర్యాప్తుకు మొగ్గుచూపకపోవడం వంటివి పార్టీపై ప్రతికూల ప్రభావానికి ప్రధాన కారణాలుగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలను ముందుగానే అంచనా వేసిన వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి, ఏనుగు రవీందర్రెడ్డి, విజయశాంతి వంటి అసంతృప్త నేతలు పార్టీని వీడినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్లో చేరిన వివేక్, రాజ్గోపాల్రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు. -
జనసేనకు ఘోర పరాభవం.. అన్నిచోట్లా డిపాజిట్లు గల్లంతు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. బీజేపీతో పొత్తులో భాగంగా 8 సీట్లలో పోటీచేసినా ఆ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్లా ఓడిపోయారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయారు. మొత్తంగా కలిపి కొన్ని వేల ఓట్లు మాత్రమే సాధించగలిగారు. తమ పార్టీకి పట్టు ఉండడంతో పాటు, గెలిచే అవకాశాలున్న స్థానాలను కూడా జనసేన డిమాండ్ చేసి తీసుకుందని సీట్ల సర్దుబాటు సమయంలోనే ఆయా స్థానాల్లోని బీజేపీ నాయకులు విమర్శించారు. ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో సహకరించే పరిస్థితి లేదంటూ కూడా కొందరు స్థానిక నాయకులు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. జనసేన తరఫున కూకట్పల్లిలో ముమ్మారెడ్డి ప్రేమ్కుమార్, తాండూరులో నేమూరి శంకర్గౌడ్, కోదాడ నుంచి మేకల సతీశ్రెడ్డి, నాగర్కర్నూల్లో లక్ష్మణ్గౌడ్, ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెంలో లక్కినేని సురేందర్రావు, వైరాలో డాక్టర్ తేజావత్ సంపత్నాయక్, అశ్వారావుపేట నుంచి ముయబోయిన ఉమాదేవి పోటీచేశారు. కూకట్పల్లిలో ప్రేమ్కుమార్కు అత్యధికంగా 39,830 ఓట్లు రాగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ పోటీచేసిన తాండూరులో మూడువేలకు పైగా మాత్రమే వచ్చాయి. కోదాడలో 1,200 ఓట్లు, నాగర్కర్నూల్లో 1,800 ఓట్లు, ఖమ్మంలో 1,500 ఓట్లు, కొత్తగూడెంలో 1,800, వైరాలో 2,600, అశ్వారావుపేటలో 2,200 ఓట్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులకు వచ్చాయి. తెలంగాణలో అంతగా పట్టు, గుర్తింపు లేని జనసేనకు ఎనిమిది సీట్లు కేటాయించడం వల్ల తమకు రాజకీయంగా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని బీజేపీ నేతలు పెదవి విరుస్తున్నారు. జనసేన రాష్ట్రంలో రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ కాకపోవడంతో ఎన్నికల్లో పోటీకి ‘కామన్స్ సింబల్’దక్కలేదు. ఆ పార్టీకి గతంలో కేటాయించిన గాజు గ్లాస్ సింబల్కూడాను ఈసీ కేటాయించకపోవడంతో, అభ్యర్థులంతా ఇండిపెండెంట్లుగానే బరిలో నిలిచారు. జనసేనకు కేటాయించిన ఎనిమిది సీట్లలో తమ పార్టీ నేతలు పోటీచేసి ఉంటే కనీసం రెండు, మూడు అయినా గెలిచే అవకాశాలుండేవని బీజేపీ నాయకులు వాపోతున్నారు. కూకట్పల్లి, తాండూరు, తదితర సీట్లు జనసేనకు కేటాయించడం పట్ల ఆయా చోట్ల బీజేపీ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఇంత చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. -
ఫలితాలపై విస్మయం..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికల ఫలితాలు బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఆశ్చర్యానికి గురిచేశా యి. పార్టీకి పట్టున్న గ్రేటర్ హైదరాబాద్లో పెద్దగా స్థానాలు కైవసం చేసుకోకపోవడం, అంతగా పట్టులేని గ్రామీణంలో సంతృప్తికరమైన ఫలితాలు రాబట్టడం బీజేపీ అధిష్టానాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. పార్టీలో కీలక నేతల ఓటమిని అధినాయకత్వం జీచుకోలేకపోతుంది. ఫలితాలపై మోదీ, నడ్డా, అమిత్ షా సమీక్ష నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ బీజేపీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మూడు రాష్ట్రాలలో పార్టీ విజయం నేపథ్యంలో ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో అగ్రనేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో పార్టీ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు.. తెలంగాణలో మిశ్రమ ఫలితాలపై ప్రధానంగా చర్చించారు. ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు? అనే దానిపై ఆరా తీశారు. ముగ్గురు ఎంపీలు సహా పార్టీలో కీలక నేతల ఓటమి అగ్రనేతలను నిరాశపరిచినట్లు తెలిసింది. ఓటమిపాలైన వారిలో ముగ్గురు ఎంపీలు సహా కీలక నేతలు ఉన్నారు. కరీంనగర్ ఎంపీ, మాజీ రాష్ట్ర అ«ధ్యక్షుడు బండి సంజయ్, కోరుట్ల నుంచి పోటీచేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బోథ్ నుంచి పోటీచేసిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, హుజూరాబాద్, గజ్వేల్ స్థానాల నుంచి పోటీ చేసిన చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఓటమి పాలవడం బీజేపీ పెద్దలను షాక్కు గురిచేసింది. అలాగే.. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఎమ్మెల్యే స్థానమైన అంబర్పేట్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ఎమ్మెల్యేగా పనిచేసిన ముషీరాబాద్లోనూ ఆ పార్టీ ఓటమిని మూటగట్టుకోవడం అధిష్టానం పెద్దలను అవాక్కయ్యేలా చేసింది. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా 8 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవడం, అందులో సీఎం కేసీఆర్ పోటీచేసిన కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి విజయం, గ్రేటర్ హైదరాబాద్లో బలం పుంజుకోవడంతోపాటు, గ్రామీణ ప్రాంతాలలో సైతం పార్టీకి పెరిగిన ఆదరణపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయి సమీక్ష జరిపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణను సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రజల మద్దతుతో తెలంగాణను సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు. ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలంటూ ఆదివారం ఆయన ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. కార్యకర్తలు, పార్టీ అధ్యక్షుడు కిషన్రెడ్డి అవిశ్రాంత పోరాటానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
జెయింట్ కిల్లర్!
సాక్షి, హైదరాబాద్/ కామారెడ్డి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పెను సంచలనం సృష్టించారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ (బీఆర్ఎస్), రేవంత్రెడ్డి (కాంగ్రెస్)లను ఓడించి చరిత్ర లిఖించారు. ఒకేసారి ప్రస్తుత సీఎం కేసీఆర్ను, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అవుతారని భావిస్తున్న రేవంత్రెడ్డిలను వెంకటరమణారెడ్డి ఓడించడం విశేషం. అయితే ఆయన ప్రత్యర్థులిద్దరూ రెండుచోట్ల నుంచి పోటీచేయడం గమనార్హం. కామారెడ్డితో పాటు పోటీచేసిన గజ్వేల్లో కేసీఆర్ గెలుపొందారు. కామారెడ్డితో పాటు పోటీచేసిన కొడంగల్లో రేవంత్రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల పోలింగ్ ముగిశాక కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో ఆయన మాట్లాడిన సందర్భంగా గెలుపుపై ధీమాను వ్యక్తం చేశారు. భారీ అంచనాల మధ్య కేసీఆర్, రేవంత్రెడ్డిలతో పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో చివరకు అదే విశ్వాసం ఆయనను గెలిపించింది. ప్రజల్లో ఆయనకున్న మంచిపేరే వెంకటరమణారెడ్డిని విజయ తీరానికి చేర్చింది. ప్రజలతో కలిసి ఉద్యమాలు... వెంకటరమణారెడ్డి 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడ్వాయి జెడ్పీటీసీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2008లో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఎన్నికై 2011 వరకు పనిచేశారు. 2018లో బీజేపీలో చేరిన ఆయన, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటినుంచి నియోజక వర్గంలో ప్రజలతో కలిసి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. ప్రజల్లో మంచి పట్టు సాధించడంతో ఈసారి బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలోనే వెంకటరమణారెడ్డి పేరు ప్రకటించారు. అయితే సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని తెలిసినా వెనక్కు తగ్గలేదు. సీఎం కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కూడా పోటీకి సిద్ధపడ్డా ఇద్దరినీ ఓడించి తీరతానని శపథం చేశాడు. అన్నట్టే ఇద్దరూ ఆయన చేతిలో ఓడిపోయారు. వెంకటరమణారెడ్డికి 66,652 ఓట్లు రాగా, కేసీఆర్ కు 59,911 ఓట్లు, రేవంత్రెడ్డికి 54,916 ఓట్లు వచ్చాయి. కేసీఆర్ మీద 6,741 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అవినీతి రహిత పాలన అందించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. అక్రమాలపై ఎక్కుపెట్టిన ఫిరంగి.... వెంకటరమణారెడ్డి జెడ్పీ చైర్మన్గా పనిచేసిన కాలంలో మద్యం, ఇసుక మాఫియాపై యుద్ధం చేసి అప్పట్లో వార్తల్లో నిలిచారు. అధికార పారీ్టకి చెందిన జెడ్పీ చైర్మన్గా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వారించినా వెనక్కు తగ్గలేదు. ఒకసారి రాజీనామా పత్రాన్ని విసిరికొట్టి, గన్మెన్లు, కారును వదిలివెళ్లిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అప్పట్లో ఉపాధ్యాయుల, ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు. 2018లో కామారెడ్డి స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తరువాత నియోజక వర్గంలో ప్రజాసమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ జనం నోట్లో నాలుకయ్యారు. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎంత ఖర్చు చేస్తున్నా, మద్యం ఎంత పంచుతున్నా వెంకటరమణారెడ్డి మాత్రం వాటికి దూరంగా ఉన్నారు. ఒక సందర్భంలో కార్యకర్తల నుంచి కూడా ఆయన ఇబ్బంది పడ్డారు. ఎన్నికలు దగ్గర పడిన సమయంలో మనం డబ్బులు ఇవ్వకుంటే, మద్యం పంచకుంటే ఇబ్బంది అవుతుందని అనుచరులు ఆయనతో గొడవ పడ్డారు. అయినా ఆయన వెనక్కు తగ్గలేదు. మద్యం పంచడం తనతో కాదని వారికి స్పష్టం చేశారు. దీంతో కార్యకర్తలు కొంత నిరాశ చెందినా, ఊళ్లకు వెళ్లి జనం కాళ్లు మొక్కుతూ ఓట్లు అభ్యర్థించడం విశేషం. -
ఉమెన్.. డబుల్ డిజిట్..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. తాజాగా జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా పది మంది గెలుపొందారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇప్పటికి మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. ఈ దఫా అత్యధికంగా గెలుపొంది తమ సంఖ్యాబలాన్ని డబుల్ డిజిట్కు చేర్చారు. ప్రస్తుతం గెలుపొందిన పది మందిలో ఆరుగురు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించగా.. నలుగురు బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందగా.. 2018లో జరిగిన ఎన్నికల్లో మహిళల గెలుపు ఆరుకు పరిమితమైంది. తాజాగా వారి సంఖ్య 10కి చేరుకోవడం శుభపరిణామని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం గెలుపొందిన మహిళల్లో ఐదుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, ఇద్దరు ఎస్సీ, మరో ఇద్దరు ఎస్టీ, ఒకరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. -
నూతన ప్రభుత్వానికో ప్రేమలేఖ!
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గెలుస్తాయా? లేదా ప్రజలు గెలుస్తారా? ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే రాబోయే ఐదేళ్ళు రాజకీయం, పౌరసమాజం మధ్య వైరుద్ధ్యాలు తలెత్తకుండా మరిన్ని విజయాలు సాధించవచ్చు. రాబోయే లోక్సభ, స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకోకపోతే దేశవ్యాప్త అపజయానికి దారి తీసినట్టే! ఓట్లు వేయించుకునేది రాజకీయ నాయకులు. వేసేది ప్రజలు. ఒక్కోసారి ఒక్క ఓటు కూడా ప్రభావం చూపుతుంది. అంతటి ప్రాధాన్యం ఓటుకు ఉంది. అందుకే ప్రజల పాత్రకు విలువ. పార్టీల జయాపజయాలను నిర్ణయించేది ప్రజలే! అటువంటి ప్రజలను విస్మరించిన పార్టీలకు అపజయం తప్పదు. తప్పటడుగులు వేస్తే, అధికారం హక్కుభుక్తమని విర్రవీగితే... ఇవాళ గెలిచిన పార్టీకి కూడా రేపు ఇదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే విజయానంతర పరిస్థితి రాబోయే విజయానికో, అపజయానికో భూమిక అవుతుంది. గతం నాస్తి కాదు. అది దారి దీపం. ఈ దీపం వెలుగుతూనే ఉండాలంటే సుపరిపాలన, ప్రజా దృక్పథం, జన సంక్షేమం అనే చమురు నిరంతరం పడుతుండాలి. తెలంగాణ ప్రజాకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలతో పాటు నడిచిన నాయకత్వానికి ప్రజలు అండదండలు అందించారు. 1200 మంది బలిదానాల పునాది మీద అధికారం చేజిక్కించుకుని వారి పాత్రను, ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ లాంటి అనేకమంది పాత్రను కావాలని విస్మరించి తామే తమ కుటుంబం త్యాగాలతో రాష్ట్రాన్ని సాధించామని విర్రవీగుతూ ప్రజలనూ, పౌర సమాజాన్నీ అవమానించినందుకు నిశ్శబ్ద నిరసనే తాజా తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల సరళిగా భావించాలి. గమనిస్తే... ఏక కుటుంబ పాలన తెలంగాణ ప్రజలను అసహ్యించుకునేలా చేసింది. అంతేకాదు. తాము చేసిన ప్రతి తప్పునూ ఆ నలుగురు మైకుల ముందు, పత్రికా ప్రకటనల రూపంలో ఊదరగొట్టడం అసహ్యించుకున్నారు. అలాంటి ధోరణికి దూరంగా ఉండాలి. తాము చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టుగా విర్రవీగే తత్వం ప్రజలను దాదాపుగా ప్రతిఘటించేట్లుగా చేసింది. అయితే ఊరిలో దొర మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే తమను వ్యతిరేకించే వారు పుట్టి ఉండరు అని అనుకుంటారు. ప్రజలు కట్టిన డబ్బును పట్టుకొని... తమ సొంత డబ్బు ఇస్తున్నట్టుగా సంక్షేమ పథకాల పంపిణీలో ప్రతిబింబించింది. ఆ పథకాల గురించి వేల కోట్ల రూపాయల ప్రకటనలు గుప్పించడంలో కూడా తమ ఫోటోలు, వ్యక్తిగత ప్రచారాలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిసి కూడా వ్యక్తిగత అహంభావం వల్ల సవరించుకోలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో, తదనంతర పాలనలో... దళితుల, ఆదివాసీల, వెనకబడిన వర్గాల ప్రయోజనాలను నెరవేర్చాలి. ఎందుకంటే ఈ పదేళ్ళ పాలనలో వారు వంచించబడ్డారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్న దగ్గర నుండి, ‘దళిత బంధు’ స్కీమ్ వరకు అడుగడుగునా మోసగింపునకు గురయ్యారు. వోటు బ్యాంక్గా వారిని వాడుకున్నారు. దళితులలో గల రెండు ప్రధాన కుల సమాజాలను విడదీసి ఒక వర్గాన్నే చేరదీసిన ఫలితమే... ఎస్టీ నియోజకవర్గాలలో ఫలితాలు! అలాగే ఆదివాసుల బతుకులు ఆగమాగం చేయబడ్డాయి. ఆదివాసీ తెగల మధ్య వైషమ్యాలు తలెత్తినప్పుడు ఒక తెగ వైపే మద్దతునిచ్చి మిగతా 17 తెగ, ఉప తెగలను వంచించారు. పోలీసు, అటవీ శాఖల వంటివి వారిని అగౌరవపరిచాయి. వారి భూములను లాక్కున్నాయి. బతికే స్వేచ్ఛను హరించింది ప్రభుత్వం. నాలుగేళ్ల క్రితం అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ నుండి అడవులకు వెళ్లి ప్రత్యక్ష పరిశీలన జరిపి పోడు సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన అధినాయకుడు తీరా వారి గురించి మాట్లాడడం మరిచాడు. మేడారంలో జరిగే ‘సమ్మక్క – సారక్క’ జాతరకు వెళ్ళి మొక్కులు చెల్లించలేదు. అలాగే గోండుల ఆరాధ్య దైవం ‘నాగోబా’ జాతరకు కూడా వెళ్ళలేదు. తెలంగాణ వచ్చాక, అంతకు ముందు కన్నా వారి జీవితంలో ఎలాంటి మార్పూ లేదు. పైగా అవమానాలు పెరిగాయి. అందుకే ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో గులాబీ జెండా అవనతం అయింది. ఇతర ఆదివాసుల పేరుతో ఎన్నికల్లోనూ, సంక్షేమ పథకాల్లోనూ అన్యాయం జరిగింది. తెలంగాణ అస్తిత్వ చైతన్యం భావన మరింత పెరుగుతుంటే దాన్ని త్రుంచివేయడం జరిగింది. ప్రపంచ మహాసభల్లో వంద పైగా కోట్ల డబ్బు పంచుకున్నారే తప్ప భాషకూ, సంస్కృతికీ, సాహిత్యానికీ ఒరిగిందేమీ లేదు. భాషా సాంస్కృతిక శాఖ రాజకీయ నేతలకు ఊడిగం చేసింది. కోట్ల రూపాయలతో నిర్వహించిన కార్యక్రమాలు రాజకీయ నాయకుల ప్రాబల్యం పెంచుకోవడానికి పనికొచ్చాయి. ఏ ఒక్క ప్రజా కళారూపాన్నీ బతికించి దేశవ్యాప్త కీర్తినీ, వైభవాన్నీ చాటలేదు. పనికిరాని పుస్తకాలను అచ్చువేసి రాజకీయ నేతలకు ఉచితంగా పంచిపెట్టారే తప్ప ప్రజలలోకి తీసుకెళ్ళలేదు. వాటికోసం చేసిన ఖర్చు దుబారా చేశారు. ఎన్నో ప్రతులు పంచిపెట్టి ప్రజల సొమ్ముని పట్టపగలు దుర్వినియోగం చేశారు. ఈ దుర్వినియోగంపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. కొత్త ప్రభుత్వం ఇలాంటి విషయాల పట్ల జాగరూకత వహించాల్సి ఉంది. ప్రతి మూడేండ్లకో, ఎక్కువలో ఎక్కువ ఐదేండ్లకో అధికారుల, ఉద్యోగుల బదిలీలు జరగాల్సిందే! అలా జరపకపోవడం వల్ల ప్రజలకు న్యాయం జరగదు. ఒకేచోట తిష్ఠ వేసుకునే ఉద్యోగుల వల్ల ప్రజలు ఎనలేని కష్టాలు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రే కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో ఒకరోజు ప్రజా దర్బారు ఏర్పాటు చేయాల్సిందే! ముఖ్యంగా కలెక్టర్లు కూడా! పౌర సమాజాన్ని సంప్రదిస్తూ పోవాలె తప్ప మేమే గొప్ప అనే భావనను దూరం చేయకపోతే వ్యక్తిగత అహంభావం పెరిగి ప్రభుత్వానికి ప్రజలు దూరం అవుతారు. ‘ధరణి’ వంటి పాపాల పుట్ట పనిపట్టకపోతే చిన్న రైతు, చిన్న ఇళ్ళు కట్టుకునే వారికి న్యాయం జరగదు. ప్రగతి భవన్ను ప్రభుత్వాసుపత్రిగానో, ప్రజా కళల మ్యూజియంగానో మార్చాలి. నీటి ప్రాజెక్టులలో ఆర్థిక దుర్వినియోగాన్నీ, అలసత్వాన్నీ వెలికి తీయాలి. తెలంగాణ ప్రాధికార సంస్థను ఏర్పాటుచేసి ప్రొఫెసర్ కోదండరావ్ు వంటి వారి సలహా సూచనలనూ, రికమెండేషన్స్నూ అమల య్యేలా చూడాలి. ‘తెలంగాణ ఇచ్చింది మేమే’ అని చెప్పుకోవడం కాదు. ‘మాకు అధికారం వచ్చాక చూడండి... ఇంతలా అభివృద్ధి చేశాం’ అని చెప్పుకునే రీతిలో అభివృద్ధి జరగాలి. ఓట్లు ఏ ఒక్క కులం వారు వేస్తే ప్రభుత్వం గద్దెనెక్కలేదు. అన్ని కులాలకూ ప్రాతినిధ్యం కల్పించాలి. దొరల రాజ్యం పోయి పటేళ్ళ రాజ్యం వచ్చిందని అనుకోకుండా చూడాలి. పెనం మీంచి పొయ్యిలో పడ్డామని ప్రజలు అనుకొనే పరిస్థితి రాకూడదు. కర్నాటక, తెలంగాణల్లో లాగా కాంగ్రెస్ వస్తే ఇలా బాగుపడతాం అని అన్ని రాష్ట్రాల ప్రజలూ చెప్పుకోవాలి. తెలంగాణను దేశ ప్రజలు గర్వించే రీతిలో అభివృద్ధిపరచాలి. ప్రొ‘‘ జయధీర్ తిరుమలరావు – వ్యాసకర్త జానపద పరిశోధకుడు, సామాజికవేత్త, మొబైల్ – 9951942242 -
సీపీఎంకు ఎక్కడా డిపాజిట్లు దక్కలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంకు ఘోర పరాభవం మిగిలింది. ఒంటరిగా పోటీచేసిన 19 స్థానాల్లోనూ దాదాపు అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయింది. ఖమ్మం జిల్లా పాలేరులో పోటీచేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా గౌరవప్రదమైన ఓట్లు పొందలేకపోయారు. ఆయనకు 16వ రౌండ్ వచ్చేసరికి కేవలం 4,354 ఓట్లు వచ్చాయి. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డికి 3,234 ఓట్లు మాత్రమే వచ్చాయి. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థురాలిగా బరిలోకి దిగిన శిరీష (బర్రెలక్క)కు 5,598 ఓట్లు వచ్చాయి. ఆ స్థాయి ఓట్లు కూడా సీపీఎం అభ్యర్థులకు రాకపోవడం గమనార్హం. కాంగ్రెస్తో పొత్తు విషయంలో ప్రతిష్టకు పోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సీపీఎం తాను పోటీచేసిన మొత్తం 16 స్థానాల్లోనూ కలిపి 49,604 ఓట్లు మాత్రమే సాధించింది. కాంగ్రెస్కే పడ్డ సీపీఎం ఓట్లు! పార్టీ కార్యకర్తలు అనేకచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేశారన్న చర్చ జరుగుతోంది. తాము పోటీచేయని చోట కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొనగా, రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాత్రం ప్రజాతంత్ర లౌకిక శక్తులకు ఓటు వేయాలని మాత్రమే చెప్పారు. ఈ విషయంలో కేంద్ర కమిటీకి, రాష్ట్ర కమిటీకి మధ్య వైరుధ్యం నెలకొందన్న విమర్శలు వచ్చాయి. కాగా, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 26,568 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీకి దక్కనున్నాయి. సీపీఎం మాత్రం పరాజయం పాలవడమే కాకుండా, తన ఓటు బ్యాంకును కూడా నిలబెట్టుకోలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. -
రేవంత్.. భట్టి.. ఉత్తమ్?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు సీఎం అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు పోటీపడుతున్న వారి సంఖ్య సహజంగానే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందన్నది హాట్టాపిక్గా మారింది. రాజకీయ వర్గాల విశ్లేషణల ప్రకారం.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (మహబూబ్నగర్), సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క (ఖమ్మం), ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి (నల్లగొండ) పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరిని చాయిస్గా ఎంచుకోవాలన్న దానిపై అధిష్టానం ఇప్పటికే సమాలోచనలు ప్రారంభించగా, తెలంగాణకు పరిశీలకుడిగా వచ్చిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ కూడా ఢిల్లీ పెద్దలతో టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రులుంటారా? కర్ణాటక తరహాలో ఉప ముఖ్యమంత్రి పదవులు తెలంగాణలోనూ లభించే అవకాశాలు కనిపిస్తున్నా యి. సీఎంగా ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేస్తారన్న దాన్నిబట్టి మరో రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. సీఎం హోదా రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే ఎస్సీ, బీసీలకు చెరో ఉప ముఖ్యమంత్రి, దళితులకు సీఎం హోదా ఇస్తే రెడ్డి, బీసీలకు చెరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈ క్రమంలో మైనార్టీలకూ ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో మైనార్టీల పక్షాన ఎవరూ విజయం సాధించకపోవడంతో ఉప ముఖ్యమంత్రి హోదా మైనార్టీలకు ఇవ్వాలంటే నామినేటెడ్ ఎమ్మెల్సీ హోదా ఇవ్వాల్సి ఉండడం గమనార్హం. అమాత్యులెవరంటే...! మంత్రివర్గ కూర్పులో కూడా సామాజిక వర్గాలు, జిల్లాల వారీ లెక్కలు కట్టుకుంటూ తమ నాయకుడికి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే చర్చ కీలక నేతల అనుచరుల్లో జరుగుతోంది. కొండా సురేఖ, సీతక్కకు కేబినెట్లో చోటు లాంఛనప్రాయమేనని గాందీభవన్ వర్గాలంటున్నాయి. ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఉత్తమ్ ఒకవేళ తనకు అవకాశం ఇవ్వని పక్షంలో ఇతరుల కేబినెట్లో ఉండేందుకు అంగీకరించకపోతే ఆయన సతీమణి పద్మావతికి మంత్రి పదవి అవకాశం లేకపోలేదు. ఇక, ఆదిలాబాద్ నుంచి ప్రేంసాగర్రావు, మహబూబ్నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కరీంనగర్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, మెదక్ నుంచి ఆంథోల్ రాజనర్సింహ, రంగారెడ్డి నుంచి రామ్మోహన్రెడ్డి, గడ్డం ప్రసాద్కుమార్, ఆదివాసీతో పాటు ఎస్టీల్లో లంబాడాలకు కూడా ఇవ్వాలనుకుంటే నేనావత్ బాలూనాయక్, ఆదిలాబాద్ నుంచి వివేక్ బ్రదర్స్లో ఒకరికి మంత్రివర్గంలో అవకాశమిస్తారని చర్చ జరుగుతోంది. ఎంపికలో ఇవే కీలకం సీఎం అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం నాలుగైదు కీలకాంశాలను పరిగణనలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీపై విధేయత, ప్రభుత్వాన్ని నడిపించగల సామర్థ్యం, సామాజిక న్యాయంతో పాటు రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోనున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రమంతా ప్రచారం నిర్వహించి, సీఎం కేసీఆర్పై పోటీచేసి, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో రేవంత్రెడ్డి పేరును అభిప్రాయ సేకరణలో కాంగ్రెస్ పెద్దలు ప్రతిపాదించనున్నారు. ఇక, శాసనసభాపక్షం (సీఎల్పి) నాయకుడిగా పనిచేసి, పాదయాత్ర నిర్వహించడం ద్వారా కేడర్లో కదలిక తెచ్చి, పార్టీకి విధేయుడిగా ఉంటున్న భట్టి విక్రమార్క పేరునూ సీఎం అభ్యర్థిత్వానికి ప్రతిపాదించనున్నారు. అలాగే, పార్టీలో వివిధ పదవులు నిర్వహించడంతో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ పేరునూ ఈ జాబితాలో ప్రతిపాదించనున్నారు. వీరిలో ఒకరిని సీఎంగా ఎంపిక చేసే అవకాశాలున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
బహుజనవాదం .. బహుదూరం
సాక్షి, హైదరాబాద్/ ఆసిఫాబాద్: బహుజన సమాజ్ పార్టీకి మరోసారి చుక్కెదురైంది. బహుజనవాదం నినాదంతో రాష్ట్రంలో కొన్ని సీట్లతో పాటు మెరుగైన ఓట్ల శాతం సాధించాలని కలలుగన్న బీఎస్పీ ఆశలు నీరుగారి పోయాయి. ఐపీఎస్ అధికారిగా స్వచ్చంద పదవీ విరమణ పొంది బీఎస్పీ సారథ్య బాధ్యతలు తీసుకొన్న ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ సారథ్యంలో 108 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీకి రెండు చోట్ల మాత్రమే డిపాజిట్ దక్కింది. అందులో ఒకటి ప్రవీణ్కుమార్ పోటీ చేసిన సిర్పూరు కాగా, రెండోస్థానం పటాన్చెరు. సిర్పూరులో గెలుపుపై ఆశలు రేకెత్తించిన ప్రవీణ్కుమార్కు లభించిన ఓట్లు 44,646. ఇక్కడ అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్బాబు విజయం సాధించగా, ప్రవీణ్ కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. దళిత, గిరిజన బహుజనుల ఓట్లపై గంపెడాశెలు పెట్టుకున్న ప్రవీణ్కుమార్ స్థానికేతరుడు కావడం కూడా ఇక్కడ ఆయన విజయావకాశాలను దెబ్బతీసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్పను తెలంగాణేతరుడుగా ప్రచారం చేయడంలో ప్రవీణ్కుమార్ విజయం సాధించినప్పటికీ, హరీశ్బాబు స్థానికుడు కావడంతో ఓట్లన్నీ గంపగుత్తగా పోలయినట్లు తెలుస్తోంది. కాగా పటాన్చెరులో చివరి నిమిషంలో బీఎస్పీ టికెట్టుపై పోటీ చేసిన కాంగ్రెస్ రెబల్ నీలం మధుకు 46,162 ఓట్లు మాత్రమే లభించి మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి 7వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ రెండోస్థానంలో నిలిచారు. ఇక ప్రవీణ్కుమార్ సోదరుడు ప్రసన్న కుమార్ స్వచ్చంద విరమణ చేసి ఆలంపూర్ నుంచి పోటీ చేయగా, కేవలం 4,711 ఓట్లు మాత్రమే లభించాయి. వీరు కాకుండా పెద్దపల్లి నుంచి పోటీ చేసిన దాసరి ఉష 10,315 ఓట్లు సాధించగా, సూర్యా పేటలో వట్టి జానయ్యకు 13,907 ఓట్లు దక్కా యి. చొప్పదండి నుంచి పోటీ చేసిన శేఖర్కు 5,153 ఓట్లు లభించాయి. ఇలా మరికొన్ని స్థానాల్లో స్వ ల్పంగా ఓట్లు మాత్రమే సాధించి బహుజనవాదం వినిపించడంలో ఆ పార్టీ విఫలమైంది. ప్రవీణ్కుమార్కు నిరాశ బహుజన వాదం నినా దంతో కుమురంభీంజిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో పాగా వేయా లని ఆశపడిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమా ర్కు నిరాశ తప్పలేదు. దళితులు, గిరిజనులు, బుద్ధిస్టుల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఆర్ఎస్పీ పోటీకి మొగ్గు చూపారు. పోలింగ్ సరళిని బట్టి ఆ పార్టీకి అధిక సంఖ్యలో ఓట్లు పడ్డాయని విశ్లేషకులు భావించారు. అయితే ఆ పార్టీ నాయకులు వేసిన అంచనాలు తారుమారయ్యాయి. -
నేడు సీఎల్పీ భేటీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సోమవారం పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్లోని ఎల్లా హోటల్ వేదికగా ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో సీఎం ఎంపికపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పర్యవేక్షణలో, ఇతర ఏఐసీసీ ముఖ్యుల సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. దీనికోసం కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలంతా ఆదివారం రాత్రే హైదరాబాద్కు చేరుకున్నారు. భేటీ తర్వాత అధిష్టానం పరిధిలోకి.. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించాక సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పు అంశం అధిష్టానం పెద్దల చేతికి వెళ్లనుంది. డీకే బృందం ఎమ్మెల్యేలతో భేటీ పూర్తికాగానే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్గాందీలతో సమాలోచనలు జరిపి సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తర్వాత సీఎం రేసులో ఉన్న ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించి, ఏకాభిప్రాయం సాధించే అవకాశం ఉందని తెలిసింది. తర్వాత మరోమారు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి లాంఛనంగా సీఎల్పీ నాయకుడి ఎంపికను పూర్తి చేయనున్నారు. ఈ నెల 9వ తేదీకల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసి ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనే ప్రమాణ స్వీకారం? ఎక్కువ రోజులు పొడిగించకుండా సోమవారం లేదా మంగళవారమే సీఎంతోపాటు ఒకరిద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం సీఎల్పీ భేటీ తర్వాత డీకే శివకుమార్, ఇతర పెద్దలు ఇక్కడి నుంచే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి, నేరుగా గవర్నర్ను కలసి రాజ్భవన్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఈనెల 9 నాటికి మంత్రివర్గాన్ని కూర్చి పరేడ్ గ్రౌండ్స్లో భారీ సభలో మంత్రుల ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసుల పేరిట లేఖ ఫేక్ సీఎంగా రేవంత్రెడ్డి సోమవారం ప్రమాణస్వీకారం చేస్తారని, ఆ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం తగిన భద్రత ఏర్పాటు చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారుల పేరిట ఓ లేఖ వైరల్గా మారింది. అయితే అది ఫేక్ అని టీపీసీసీ వర్గాలు ప్రకటించాయి. గవర్నర్ను కలసిన కాంగ్రెస్ నేతలు ఫలితాల అనంతరం హైదరాబాద్లోని ఎల్లా హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు.. రాత్రి 9 గంటల సమయంలో రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ తమిళిసైను కలిశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, ఏఐసీసీ పరిశీలకులు దీపాదాస్మున్షీ, కేజీ జార్జ్ తదితరులు రాజ్భవన్కు వెళ్లిన బృందంలో ఉన్నారు. తమకు 65 మంది సభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ వారు గవర్నర్కు లేఖ అందజేశారు. తర్వాత రాజ్భవన్ ఎదుట డీకే శివకుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. సీఎంపై సోమవారమే స్పష్టత: ఉత్తమ్ గవర్నర్ను కలవడానికి ముందు ఎల్లా హోటల్ వద్ద ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి మీడియాతో మా ట్లాడారు. సోమవారం సీఎల్పీ సమావేశం జరగనుందని, సీఎం ఎవరన్నదానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని సమావేశంలోనే వెల్లడిస్తానని, బయ ట చెప్పనని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం ప్రజల విజయమని అభివర్ణించారు. -
పార్టీ మారినా.. ఓటమి తప్పలే..!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ 2018 ఎన్నికల్లో గెలుపొందిన విపక్ష ఎమ్మెల్యేల్లో 16 మంది బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. వీరిలో ఇద్దరికి ప్రస్తుత ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ నిరాకరించడంతో 14 మంది బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేశారు. 2018లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఆత్రం సక్కు (ఆసిఫాబాద్ –ఎస్టీ), స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లావ్యుడా రాములు నాయక్ (వైరా ఎస్టీ) బీఆర్ఎస్లో చేరినా ప్రస్తుత ఎన్నికలో టికెట్ దక్కలేదు. గత ఎన్నికలో టీడీపీ నుంచి గెలుపొందిన మెచ్చా నాగేశ్వర్రావు (అశ్వారావుపేట ఎస్టీ), సండ్ర వెంకట వీర య్య (సత్తుపల్లి ఎస్సీ)తో పాటు కాంగ్రెస్ నుంచి 12 మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్ (ఎల్లారెడ్డి), సుదీర్రెడ్డి (ఎల్బీ నగర్), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), పైలట్ రోహిత్రెడ్డి (తాండూరు), బీరం హర్షవర్దన్రెడ్డి (కొల్లాపూర్), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్ ఎస్సీ), గండ్ర వెంకట రమణారెడ్డి (భూపాలపల్లి), రేగా కాంతారావు (పినపాక ఎస్టీ), హరిప్రియ భానోత్ (ఇల్లందు ఎస్టీ), కందాల ఉపేందర్ రెడ్డి (పాలేరు), వనమా వెంకటేశ్వర్రావు (కొత్తగూడెం), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్ ఎస్టీ) బీఆర్ఎస్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. వీరిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), దేవిరెడ్డి సు«దీర్రెడ్డి (ఎల్బీనగర్) మాత్రమే తిరిగి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ వీడి.. గెలుపుతీరానికి చేరి.. బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరి టికెట్లు దక్కించుకున్న పలువురు నేతలు గెలుపు తీరాలకు చేరారు. బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా నిరాకరించి కాంగ్రెస్లోకి వెళ్లి తనతో పాటు తన కుమారుడికి టికెట్ సాధించుకున్న మైనంపల్లి హన్మంతరావు మాత్రం ఓటమి చెందారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి), వేముల వీరేశం (నకిరేకల్), మందుల సామేలు (తుంగతుర్తి), తుమ్మల నాగేశ్వర్రావు (ఖమ్మం), పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (పాలేరు), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), కోరం కనకయ్య (ఇల్లందు), మనోహర్రెడ్డి (తాండూరు), గండ్ర సత్యనారాయణ (భూపాలపల్లి), కుంభం అనిల్కుమార్రెడ్డి (భువనగిరి), కూచుకుళ్ల రాకేశ్ రెడ్డి (ఎమ్మెల్సీ కె.దామోదర్రెడ్డి కుమారుడు), వీర్లపల్లి శంకర్ (షాద్నగర్) గెలుపొందారు. సరితా తిరుపతయ్య (గద్వాల), శ్యామ్ నాయక్ (ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త – ఆసిఫాబాద్), జగదీశ్వర్ గౌడ్ (శేరిలింగంపల్లి) తదితరులు కాంగ్రెస్లో చేరి టికెట్ దక్కించుకున్నా గెలుపు తీరాలకు చేరలేక పోయారు. బోగా శ్రావణి (జగిత్యాల), ఆరేపల్లి మోహన్ (మానకొండూరు), కందుల సంధ్యారాణి (రామగుండం), పులిమామిడి రాజు (సంగారెడ్డి), కేసీఆర్ రత్నం (చేవెళ్ల) బీజేపీలో, నీలం మధు (పటాన్చెరు) బీఎస్పీలో చేరి టికెట్లు దక్కించుకున్నా ఫలితం లేకపోయింది. -
ఓడిపోయిన అనుభవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు రాజకీయ దిగ్గజాలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. పలుమార్లు విజేతలైన సీనియర్లకూ పరాభవం తప్పలేదు. తిరుగులేదనుకున్న మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు. ఆఖరుకు సీఎం కేసీఆర్ కూడా కామారెడ్డి ప్రజలు చేదు అనుభవాన్ని మిగిల్చారు. మరోవైపు సర్వశక్తులూ ఒడ్డి పోరాడిన నేతలు కూడా పరాజయం పాలయ్యారు. ఇలాంటి కొన్ని ఆసక్తికర ఫలితాలను పరిశీలిస్తే... ♦ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా జీవితంతో పెనవేసుకున్న నేత. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వరుసగా రెండుసార్లు సీఎంగా పనిచేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా అపారమైన అనుభవం ఉంది. ఈసారి ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసిన ఆయన గజ్వేల్లో గెలిచినా కామారెడ్డిలో మాత్రం ఓడిపోయారు. ♦ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు టీడీపీ హయాంలోనే సీనియర్ నేత. ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట, పాలకుర్తి నుంచి ఆరు పర్యాయాలు గెలిచిన నాయకుడు. ఈసారి మాత్రం పిన్న వయస్కురాలు, కొత్తగా రాజకీయ అరంగ్రేటం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని ఆయన్ను ఖంగు తినిపించారు. ♦ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కి తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు రాజకీయ వారసత్వం ఉంది. 2014లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి, 2018లో అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్ మంత్రి వర్గంలో కీలక మంత్రి. కానీ ఈసారి తుమ్మల నాగేశ్వరరావు చేతుల్లో ఓటమి ఎదురైంది. ♦ బండి సంజయ్ పరిచయం అక్కర్లేని బీజేపీ నేత. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీకి ఊపు తెచ్చిన వ్యక్తి. కరీనంగర్ ఎంపీగా విజయం సాధించిన నేపథ్యం ఆయనది. కానీ ఈసారి కరీంనగర్ స్థానంలో పరాజయం చవిచూశారు. ఆ పార్టీ మరో ఎంపీ ధర్మపురి అరవింద్దీ ఇదే పరిస్థితి. ♦ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్తో కలిసి పోరాడిన చరిత్ర ఈటల రాజేందర్ది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక, వైద్యశాఖ మంత్రిగా పనిచేశారు. బీఆర్ఎస్తో వివాదం రావడంతో బీజేపీలో చేరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఈసారి మాత్రం ఓటమి తప్పలేదు. ♦ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ స్థానానికి 2014 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున 2014లో గెలిచారు. 2018లోనూ విజయం సాధించారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ గాలికి పరాజయం తప్పలేదు. మరో సీనియర్ నేత జోగు రామన్నదీ ఇదే అనుభవం. ఆదిలాబాద్ స్థానంలో 2009 నుంచి విజయాలను నమోదు చేశారు. 2023 ఎన్నిక ఆయనకు ఓటమిని అందించింది. ♦ ఉమ్మడి నిజామాబాద్లోని బాన్సువాడ, ఆర్మూర్, నిజామాబాద్ స్థానాల నుంచి మూడుసార్లు విజయం సాధించిన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా అనుభవం ఈ ఎన్నికల్లో పనిచేయలేదు. -
24 ఏళ్లుగా కూచుకుళ్ల దామోదర్రెడ్డి కల.. నెరవేర్చిన తనయుడు!
సాక్షి, మహబూబ్నగర్: అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఐదుసార్లు ఓటమి చవిచూసిన కూచుకుళ్ల దామోదర్రెడ్డి కలను ఆయన కొడుకు కూచుకుళ్ల రాజేష్రెడ్డి నెరవేర్చారు. పోటీ చేసిన మొదటిసారే గెలుపొందడం మరో విశేషం. కూచుకుళ్ల దామోదర్రెడ్డి 1999లో మొదటిసారి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేకు పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 2004లో అప్పటి టీఆర్ఎస్ తరపున పోటీ చేసినా 1,449 స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యారు. తర్వాత 2009, 2012 ఎన్నికల్లో సైతం నాగం జనార్దన్రెడ్డి చేతిలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి.. టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2005లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జెడ్పీ చైర్మన్గా, 2016, 2022లో ఎమ్మెల్సీ పదవులు దక్కినా ఎమ్మెల్యే పదవి మాత్రం అందని ద్రాక్షగా మారింది. అయితే తన కోరికను తన కొడుకు నెరవేర్చడంతో కూచుకుళ్ల దామోదర్రెడ్డి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇవి చదవండి: 20 ఏళ్లలో ఏనాడూ చూడని 'హస్తం' హవా..! మళ్లీ ఇప్పుడు -
20 ఏళ్లలో ఏనాడూ చూడని 'హస్తం' హవా..! మళ్లీ ఇప్పుడు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా అసెంబ్లీ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోశాయి. 20 ఏళ్లలో ఏనాడూ చూడని స్పష్టమైన సీట్లు రావడం గమనార్హం. 2004లో వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో టీఆర్ఎస్–సీపీఐ పొత్తులతో కాంగ్రెస్ కూటమి 10 సీట్లు(కాంగ్రెస్ 5, టీఆర్ఎస్ 4, సీపీఐ 1) సాధించింది. ఇప్పుడు 8 స్థానాల్లో విజయకేతనం ఎగరేసి కాంగ్రెస్–సీపీఐ కూటమి సత్తాచాటుకుంది. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలను గెలుచుకుని క్లీన్స్వీప్ చేసింది. పొరుగునే ఉన్న ధర్మపురి, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు, హుస్నాబాద్నూ కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. 2018 ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్, హుజూరాబాద్తో కలిపి ఐదో స్థానాలకు పరిమితమైంది. ఇక హుజూరాబాద్, కరీంనగర్, కోరుట్లలో బీజేపీ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. బండి.. గంగుల నువ్వా–నేనా.. కరీంనగర్లో విజయం చివరి వరకూ దోబూచులాడింది. చివరి రౌండ్ వరకు సాగిన ఉత్కంఠ పోరులో తొలుత స్వల్ప ఓట్లతో గంగుల కమలాకర్ విజయం సాధించారు. దీనిపై బండి సంజయ్ అభ్యంతరం తెలుపుతూ కౌంటింగ్ కేంద్రానికొచ్చా రు. పోలింగ్ బూత్ 43,289లో ఓట్ల లెక్కింపు చేపట్టలేదని ఆరోపించారు. సంజయ్ వినతిని పరిగణనలోకి తీసుకుని రేకుర్తిలోని లయోల బీఈడీ కాలేజీ రూమ్నంబర్ 3లోని 594 ఓట్లు, రాంపూర్లోని విద్యార్థి హైస్కూల్లోని పోలింగ్ బూత్లలోని 697 ఓట్లను లెక్కించారు. చివరికి 3,169 ఓట్ల మెజార్టీతో గంగుల విజయం సాధించడంతో ఉత్కంఠకు తెరపడింది. ► మానకొండూరు నుంచి కవ్వంపల్లి సత్యనారా యణ విజయం సాధించారు. బీఆర్ఎస్ ఎమ్మె ల్యే రసమయిపై ఏ దశలోనూ వెనకబడలేదు. ► చొప్పదండి– మేడిపల్లి సత్యం కూడా ప్రతీ రౌండ్లోనూ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్పై ఆధిపత్యం చూపించారు. ► హుజూరాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి తమ ప్రత్యర్థులపై ఆది నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల కాంగ్రెస్ అభ్యర్థి ఒడితల ప్రణవ్పై స్పష్టమైన ఆధిపత్యంతో గెలిచారు. ► పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మంథని– శ్రీధర్బాబు, రామగుండం– మక్కాన్ సింగ్, పెద్దపల్లి– విజయరమణారావు నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో క్లీన్స్వీప్ చేసింది. మక్కాన్సింగ్ మూడోసారి పోటీ చేయడం, రామగుండంలో కాంగ్రెస్కు వచ్చిన అనూహ్య ఆదరణ, స్థానికంగా సానుభూతి పనిచేశాయి. ► సిరిసిల్లలో కేటీఆర్(బీఆర్ఎస్) సునాయస విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తన చిరకాల ప్రత్యర్థి కేకే మహేందర్రెడ్డిని ఐదోసారి ఓడించారు. 2009 నుంచి వీరిద్దరూ పోటీ పడటం ఐదోసారి కావడం విశేషం. కాంగ్రెస్ హవా, సానుభూతి పనిచేయలేదు. ► వేములవాడలో ఊహించినట్లుగానే ఆది శ్రీనివాస్(కాంగ్రెస్) విజయం సాధించారు. ఆయన అసెంబ్లీకి పోటీ పడటం వరుసగా ఐదోసారి. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్బాబు పౌరసత్వం విషయంలో న్యాయపరంగా పోరాడినా ఫలించలేదు. ఎట్టకేలకు ప్రజల దీవెనతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వేములవాడ ఆలయ చైర్మన్గా పనిచేసిన వారు ఎమ్మెల్యేగా గెలవరంటూ దశాబ్దాలుగా సాగుతున్న సంప్రదాయానికి తెరదించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చెలిమెడ లక్ష్మీనరసింహారావు, బీజేపీ అభ్యర్థి వికాస్రావులపై స్పష్టమైన మెజారిటీ సాధించారు. ► జగిత్యాలలో తొలుత జీవన్రెడ్డి పది రౌండ్ల వరకు ఆధిపత్యం కనిపించినా.. తర్వాత పుంజుకున్న సంజయ్ విజయం సాధించారు. కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కె.సంజయ్ అనూహ్యంగా గెలిచారు. సమీప ప్రత్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్ను ఢీకొట్టగలరా? అన్న ప్రచారం జరిగింది. ఎగ్జిట్పోల్స్ కూడా అరవింద్కే మొగ్గుచూపాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్రావుకు ఉన్న పేరు, అనుభవం సంజయ్ గెలుపులో కీలకపాత్ర పోషించాయి. ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తన చిరకాల ప్రత్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్పై విజయం సాధించారు. 2009 నుంచి వీరిద్దరూ తలపడటం ఇది ఐదోసారి కావడం గమనార్హం. కాంగ్రెస్ హవా, లక్ష్మణ్పై సానుభూతి, అధికార పార్టీపై వ్యతిరేకత కలిసివచ్చాయి. విశేషాలు.. ► కరీంనగర్ నుంచి ఎంపీ బండి సంజయ్, కోరుట్ల నుంచి ఎంపీ అరవింద్ బీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు. వీరిద్దరూ బీజేపీ అగ్రనేతలుగా వెలుగొంది, పార్టీ ఆదేశాలతో అసెంబ్లీ బరిలో దిగారు. ► హుజూరాబాద్ నుంచి పోటీచేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ విజయం సాధించగా, జగిత్యాల నుంచి పోటీ చేసిన ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఓడిపోయారు. ► రాష్ట్రంలో వరుసగా ఏడుసార్లు గెలిచి సరికొత్త రికార్డు సృష్టించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎనిమిదోసారి పోటీలో ఓడారు. ఈసారి గెలిస్తే అత్యధికసార్లు శాసనసభకు ఎన్నికై న ఎమ్మెల్యేగా మరో కొత్త రికార్డు సృష్టించేవారు. ఆయన పోటీచేసిన హుజూరాబాద్, గజ్వేల్లో రెండుచోట్ల ఓటమి పాలయ్యారు. ► ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు గెలిచిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరో దఫా పోటీలో తొలిసారి ఓడిపోయారు. ఈయన గెలిచి ఉంటే ఈటల రాజేందర్ ఏడుసార్లు ఎమ్మెల్యే రికార్డు సమం అయ్యేది. ఉమ్మడి జిల్లాలో ఫలితాలు ఇలా.. 8 కాంగ్రెస్.. 5 బీఆర్ఎస్ కైవసం! కరీంనగర్: గంగుల కమలాకర్ (బీఆర్ఎస్), ఓట్లు: 92,174, మెజారిటీ 3,169, రెండోస్థానం: బండి సంజయ్ కుమార్ (బీజేపీ), ఓట్లు: 89,005, మూడో స్థానం: పురమల్ల శ్రీనివాస్ (కాంగ్రెస్) ఓట్లు: 40,052 పెద్దపల్లి: విజయరమణరావు (కాంగ్రెస్), ఓట్లు: 1,18, 888, మెజారిటీ: 55,108, రెండో స్థానం: దాసరి మనోహర్రెడ్డి(బీఆర్ఎస్) ఓట్లు: 63,780, మూడో స్థానం:దాసరి ఉష(బీఎస్పీ), ఓట్లు 10,315 రామగుండం: రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ (కాంగ్రెస్) , ఓట్లు: 92,227 , మెజారిటీ: 56,794, రెండో స్థానం: కోరుకంటి చందర్(బీఆర్ఎస్), ఓట్లు: 35,433, మూడో స్థానం: కందుల సంధ్యారాణి(బీజేపీ), ఓట్లు: 12,966 మంథని: దుద్దిళ్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్), ఓట్లు: 1,03,822 మెజారిటీ: 31,380, రెండో స్థానం: పుట్ట మధు (బీఆర్ఎస్), ఓట్లు: 72,442, మూడో స్థానం: సునీల్ రెడ్డి (బీజేపీ), ఓట్లు: 5,779 మానకొండూరు: సత్యనారాయణ (కాంగ్రెస్ ) పొందిన ఓట్లు: 96,773 మెజారిటీ : 32,365, రెండో స్థానం: రసమయి బాలకిషన్ (బీఆర్ఎస్), ఓట్లు: 64,408, మూడో స్థానం : ఆరెపల్లి మోహన్ (బీజేపీ) ఓట్లు: 14,879 చొప్పదండి: మేడిపల్లి సత్యం, పార్టీ: కాంగ్రెస్ ఓట్లు : 90,395, మెజారిటీ: 37,439, రెండో స్థానం: సుంకే రవిశంకర్ పార్టీ: (బీఆర్ఎస్) ఓట్లు : 52,956, మూడో స్థానం : బొడిగె శోభ గాలన్న, (బీజేపీ) ఓట్లు : 26,669 హుజూరాబాద్: పాడి కౌశిక్ రెడ్డి (బీఆర్ఎస్) ఓట్లు : 80,333 , మెజార్టీ: 16,873, రెండోస్థానం: ఈటల రాజేందర్ (బీజేపీ), ఓట్లు : 63,460, మూడో స్థానం : ఒడితల ప్రణవ్ (కాంగ్రెస్) ఓట్లు :53,164 హుస్నాబాద్: పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్), ఓట్లు: 1,00,955 , మెజార్టీ:19,344, రెండో స్థానం: ఒడితల సతీశ్ కుమార్, ఓట్లు: 81,611, మూడో స్థానం: బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఓట్లు: 8338 సిరిసిల్ల: తారక రామారావు, (బీఆర్ఎస్), ఓట్లు: 89,244, మెజారిటీ: 29,687, రెండో స్థానం: కేకే మహేందర్ రెడ్డి (కాంగ్రెస్), ఓట్లు: 59,557, మూడో స్థానం: రాణిరుద్రమారెడ్డి(బీజేపీ) 18, 328 వేములవాడ: ఆది శ్రీనివాస్ (కాంగ్రెస్) ఓట్లు: 71451.మెజారిటీ: 14,581, రెండో స్థానం: చెలిమెడ లక్ష్మీనర్సింహారావు (బీఆర్ఎస్). ఓట్లు: 56,870, మూడో స్థానం: చెన్నమనేని వికాస్రావు (బీజేపీ), ఓట్లు: 29,710. జగిత్యాల: సంజయ్కుమార్ (బీఆర్ఎస్), ఓట్లు: 70,243, మెజారిటీ: 15822, రెండోస్థానం : టి.జీవన్రెడ్డి (కాంగ్రెస్), ఓట్లు : 54,421, మూడోస్థానం : బోగ శ్రావణి (బీజేపీ), ఓట్లు : 42,138 కోరుట్ల: సంజయ్ (బీఆర్ఎస్), ఓట్లు : 72,115, మెజారిటీ: 10,305, రెండోస్థానం: ధర్మపురి అర్వింద్ (బీజేపీ), ఓట్లు : 61,810, మూడో స్థానం : జువ్వాడి నర్సింగారావు (కాంగ్రెస్), ఓట్లు : 39,647 ధర్మపురి: అడ్లూరి లక్ష్మణ్కుమార్ (కాంగ్రెస్), ఓట్లు: 91,393, మెజారిటీ: 22,039, రెండోస్థానం: కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్), ఓట్లు: 69,354, మూడో స్థానం : ఎస్.కుమార్ (బీజేపీ), ఓట్లు: 7,345 ఇవి చదవండి: కాంగ్రెస్ గెలుపుకి యువతే 'కీ'లకం..! -
కాంగ్రెస్ గెలుపుకి యువతే 'కీ'లకం..!
సాక్షి, వరంగల్: కాంగ్రెస్ గెలుపులో యువత కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కొత్త ఓటర్లు, నిరుద్యోగ యువకులు దాదాపు హస్తానికి అండగా నిలిచినట్లు అవగతమవుతోంది. వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల ఓటర్లలో సగం మంది వరకు యువకులు ఉండడం విశేషం. మూడు నియోజకవర్గాల్లో మొత్తం 7,33,454 ఓటర్లుండగా.. వారిలో 18 ఏళ్ల నుంచి 39 ఏళ్ల ఓటర్లు 3,56,964 మంది ఉండడం గమనార్హం. నర్సంపేట నియోజకవర్గంలో మొత్తం 2,26,617 ఓటర్లుండగా.. వారిలో 1,11,446 మంది యువ ఓటర్లు, వరంగల్ తూర్పులో 2,46,282 ఓటర్లుండగా వారిలో 1,17,870 మంది యువ ఓటర్లు, వర్ధన్నపేట నియోజకవర్గంలో 2,60,55 ఓటర్లుండగా వారిలో 1,27,648 యువ ఓటర్లు ఉన్నారు. ఆ మూడు స్థానాల్లో కాంగ్రెస్కు చెందిన దొంతి మాధవరెడ్డి, కొండా సురేఖ, కేఆర్.నాగరాజు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వెంటాడిన నిరుద్యోగ సమస్య.. అధికార బీఆర్ఎస్ పార్టీని నిరుద్యోగ సమస్య వెంటాడినట్లు తెలుస్తోంది. పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ప్రకటించడం, పేపర్ లీకులు, తర్వాత రద్దు చేయడం వంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఓటర్లు, నిరుద్యోగ యువకులు ఈ సారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్థుల విజయంలో యువత ఓట్లు కీలకంగా మారాయనే భావన వ్యక్తమవుతోంది. ఇవి చదవండి: పోస్టల్ బ్యాలెట్లోనూ వీడని 'నోటా' ఓట్లు! -
‘విక్రమార్కుడి’ విజయ పరంపర
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షనేత మల్లు భట్టి విక్రమార్క విజయపరంపర మరోసారి కొనసాగింది. భారీ మెజార్టీతో ఆయన మధిర ఎమ్మెల్యేగా నాలుగోసారి గెలిచారు. 2009, 2014, 2018లో వరుసగా విజయం సాధించిన భట్టి ఈ ఎన్నికల్లోనూ అదే ఒరవడి కొనసాగించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భట్టి భారీ మెజార్టీ కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజ్పై 35,452 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో భట్టికి 1,08,970 ఓట్లు రాగా.. కమల్రాజ్కు 73,518 ఓట్లు వచ్చాయి. ఈ నాలుగు ఎన్నికల్లోనూ లింగాల కమల్రాజ్పైనే ఆయన విజయం సాధించడం మరో విశేషం. 2009లో ఆయన 1,417 ఓట్లతో, 2014లో 12,329 మెజార్టీతో, 2018లో 3,567 ఓట్లతో విజయం సాధించగా.. ప్రస్తుతం 35,452 ఓట్ల భారీ మెజార్టీతో పొందారు. ప్రస్తుతం సీఎల్పీ నేతగా ఉన్న భట్టికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నత పదవి దక్కుతుందని మధిర నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. ఏ పదవినిచ్చినా బాధ్యతగా నిర్వర్తిస్తా.. ‘సీఎంగా ఎవరనేది సీఎల్పీ అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం తీసుకుంటుంది. ఆ తర్వాత సీఎం ఎవరనేది పార్టీ అధిస్టానం ప్రకటిస్తుంది. నాకు ఏ పద వి ఇచ్చినా బాధ్యతగా నిర్వర్తిస్తాను’అని భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. పదేళ్లుగా ప్రజలకు దూరంగా ఉన్న ప్రగతిభవన్ను ప్రజాపాలన భవన్గా మారుస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను పాలనలో భాగస్వాములను చేస్తుందని తెలిపారు. ఖమ్మంలో ఆదివారం ఆయన కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణను సాధించుకున్నామని, ఇప్పుడు ఆ లక్ష్యాలను నిజం చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని భట్టి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ అధికారి, ఉద్యోగి సమాజం కోసం, ప్రజల కోసం పనిచేయాలని భట్టి కోరారు. గెలుపొందిన అభ్యర్థులకు అభినందనలు తెలిపిన ఆయన, యావత్ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. -
స్వతంత్రుల కన్నా ఎక్కువగా 'నోటా'కు ఓట్లు!
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో నోటాకు ఓటేసిన వారి సంఖ్య ఈ ఎన్నికల్లో కాస్త తగ్గింది. చట్టసభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు హక్కు కీలకమైనది. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటింది. కానీ.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో అభ్యర్థులందరూ అందరికీ ఆమోదయోగ్యులై ఉండాలని ఏమీ లేదు. గతంలో నచ్చని అభ్యర్థులు బరిలో ఉన్న చోట్ల ఓటర్లు ఎవరికో ఒకరికి ఓటు వేయడం, మరికొందరు ఓటింగ్కు దూరంగా ఉండడం జరిగేది. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈవీఎం బ్యాలెట్లలో నోటా(నన్ ఆఫ్ ద ఎబోవ్) బటన్ తీసుకొచ్చారు. ఇది కేవలం ఓటరుకు ఐచ్ఛికం మాత్రమే. అభ్యర్థులు ఎవరూ సరైన వారు లేరని భావించిన పక్షంలో నోటాకు ఓటు వేయవచ్చు. అత్యధికంగా నోటాను వినియోగించుకున్నా పోలైన ఓట్లలో మెజార్టీ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. 2014అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 17,095 మంది ఓటర్లు నోటా బటన్ నొక్కారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 20,254 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో 17,327 మంది నోటాకు ఓటేశారు. బోథ్ నియోజకవర్గంలో అత్యధికంగా నోటాకు వేశారు. ఇలా ఈవీఎంల్లోకి.. 2013లో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా నోటాను ప్రవేశపెట్టారు. దీన్ని భావ వ్యక్తీకరణలో అంతర్భాగంగానే పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తొలిసారిగా ఢిల్లీ, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 2013 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో నోటా ఐచ్ఛికాన్ని ప్రవేశపెట్టారు. అన్ని గుర్తులకంటే చివరలో నోటా గుర్తు ఉంటుంది. ఈ గుర్తును అహ్మదాబాద్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థ రూపొందించింది. బోథ్: బోథ్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్ల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. నోటాకు 2565 మంది నోటాను వినియోగించుకున్నారు. బీఎస్పీ అభ్యర్థి జంగుబాపుకు 2044 ఓట్లు, బీసీపీ పార్టీ అభ్యర్థి ఆడె సునీల్ నాయక్కు 677, ఆర్జేపీ అభ్యర్థి హీరాజీకి 1388, డీఎస్పీ అభ్యర్థి ఉమేష్కు 1011, జీజీపీ అభ్యర్థి బాదు నైతంకు 596, స్వతంత్ర అభ్యర్థులు భోజ్యా నాయక్కు 878, ధనలక్ష్మికి 1231 ఓట్లు పోల్ అయ్యాయి. ఇవి చదవండి: తూర్పున కాంగ్రెస్, పశ్చిమాన కమలం, మధ్యలో బీఆర్ఎస్.. -
పోస్టల్ బ్యాలెట్లోనూ వీడని 'నోటా' ఓట్లు!
సాక్షి, ఆదిలాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీస్ ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లోనూ నోటాకు ఓట్లు పోలయ్యాయి. ఆదివారం వెల్లడించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విద్యావంతులు సైతం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను కాదని నోటాకు ఓటేశారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3073 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ స్పష్టమైన అధిక్యతను కనబర్చారు. ఆయనకు 1140 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నకు 595 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస రెడ్డికి 961 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో నిలువడం గమనార్హం. కాగా నోటాకు 10మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. బోథ్ నియోజకవర్గంలో మొత్తం 1700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుకు అత్యధికంగా 718 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యేగా గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్కు 495 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి అడే గజేందర్కు 371 ఓట్లు పోలయ్యాయి. తొమ్మిది మంది నోటాకు ఓటేయడం గమనార్హం. ఇవి కూడా చదవండి: స్వతంత్రుల కన్నా ఎక్కువగా 'నోటా'కు ఓట్లు! -
తెలంగాణ గడ్డపై తొలిసారి కాంగ్రెస్..
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దాదాపు ముగిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమైంది. కాంగ్రెస్తో పొత్తుపెట్టుకని ఒక సీటులో మాత్రమే పోటి చేసిన సీపీఐ విజయాన్ని అందుకుంది. దాంతో కాంగ్రెస్ 65 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ రోజు(ఆదివారం) జరిగిన ఎన్నికల కౌంటింగ్లో ఆది నుంచి ఆధిక్యం కనబరిచిన కాంగ్రెస్.. అదే ఊపును కడవరకూ కొనసాగించింది. ఫలితంగా తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ తొలిసారి జెండా ఎగురవేయనుంది. మొత్తం 119 సీట్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐలు కలిసి 65 సీట్లను గెలవగా, బీఆర్ఎస్ 39 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించగా, ఎంఐఎం 7 స్థానాల్లో గెలుపును అందుకుంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం కౌంటింగ్ మొదలైనప్పట్నుంచీ చూస్తే వెనుకబడే ఉంది. ఎక్కడ కూడా లీడ్లోకి రాలేదు. కాంగ్రెస్ ఆది నుంచి 50 స్థానాల్లో ఆధిక్యం దక్కకుండా ముందుకు దూసుకుపోయింది. అదే సమయంలో బీఆర్ఎస్ వెనుకంజలో పయనించింది. కాగా, బీఆర్ఎస్ ఓటమిలో బీజేపీ పాత్ర ఉందనేది కాదనలేని వాస్తవం. ఈ ఎన్నికలు పోరు ప్రారంభమైన నాటి నుంచి బీఆర్ఎస్-బీజేపీలు మిత్రులు అంటూ కాంగ్రెస్ ప్రచారం సాగించింది. ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాకపోయినా బీఆర్ఎస్కు ఎన్నికల తర్వాత మద్దతు ఇస్తుందనే ప్రచారం కూడా కాంగ్రెస్ చేసింది. వీరిద్దరూ మిత్రపక్షాలేనని, బీఆర్ఎస్ ‘ఏ’ టీమ్ అయితే బీజేపీ ‘బీ’ అంటూ ప్రచారం సాగించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో బీజేపీ సుమారు 14 శాతం ఓట్ల షేర్ను సాధించినట్లే కనబడుతోంది. అదే సమయంలో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోవడంతో తెలంగాణలో బీజేపీ తన ఉనికిని కాపాడుకుంది. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అభ్యర్థుల్లు ఎవరూ గెలవలేదు. చాలా చోట్ల జనసేన డిపాజిట్లు కోల్పోయింది. సీఎం ఎవరు.. ఎప్పటిలోగా..? -
కేసీఆర్ చేసిన ఆ ఒక్క తప్పు భారీ ఓటమికి కారణం
-
బీఆర్ఎస్ ఓటమిపై హరీష్రావు, కవిత రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. బీఆర్ఎస్కు పరాభవం ఎదురైంది. ఈ ఎన్నికల్లో గెలిచే హ్యాట్రిక్ సాధిస్తామని ఆశించిన కేసీఆర్కు గట్టి షాకే తగిలింది. రెండు చోట్ల పోటీ చేసిన ఆయన కామారెడ్డిలో ఓటమి చెందారు. బీఆర్ఎస్ ఓటమిపై హరీష్రావు స్పందిస్తూ ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. రెండు సార్లు బీఆర్ఎస్కు అవకాశమిచ్చారని, ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించారని హరీష్రావు అన్నారు. బీఆర్ఎస్ ఓటమిపై కవిత కూడా స్పందించారు. అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల సేవకులమేనని, మనమంతా మన మాతృభూమి కోసం మనస్ఫూర్తిగా కృషి చేద్దామంటూ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు. చదవండి: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి Jai KCR !! Jai BRS !! Dear BRS family, thank you for all the hardwork !! Special thanks to all the social media warriors for the fight you put up !! Let us not forget.. with or without power we are servants of Telangana People. Let us all spiritedly work for our MotherLand.… — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 3, 2023 -
కాంగ్రెస్కు తాత్కాలిక ఓటమే.. లోక్సభకు సిద్ధమవుతాం: ఖర్గే
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్లో తెలంగాణ మినహా.. మూడు రాష్ట్రాల్లో గెలుపును బీజేపీ సుస్థిరం చేసుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్, తెలంగాణలో.. రాజస్థాన్, చత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్, చత్తీస్గఢ్లో అధికారం నిలబెట్టుకొని.. తెలంగాణలో గెలిచి.. మధ్యప్రదేశ్లో గట్టి పోటీ ఇస్తామనుకున్న కాంగ్రెస్ గట్టి షాక్ తగిలింది. తెలంగాణ మినహా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది. మూడు రాష్ట్రాల ఓటమిపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ మళ్లికార్జున ఖర్గే స్పందించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఓటమిని తాత్కాలిక పరాజయంగా భావిస్తామని తెలిపారు. ఈ ఓటమిని నుంచి బయటపడి.. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో గెలపే లక్ష్యంగా సన్నద్ధం అవుతుందని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో(రాజస్తాన్, చత్తీస్గఢ్) అధికారం కోల్పోయింది. అదే విధంగా మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమిని మూటకట్టుకుంది. అయితే ముందు నుంచి ఊహించినట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జెండా ఎగరేసింది. మొత్తగా చూసుకుంటే.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ గెలుపు కొంత ఉపశమనం కలిగించింది. -
శ్రీకాంతాచారికి ఈ విజయం అంకితం: రేవంత్
-
సీఎం ఎవరు.. ఎప్పటిలోగా..?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక తొలి రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లలో విజయంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. అయితే, కాంగ్రెస్ నుంచి సీఎం ఎవరు అనే దానిపై చర్చ మొదలైంది. కాంగ్రెస్లో ఎంతోమంది సీనియర్ లీడర్లు ఉండగా, ప్రస్తుతం ఇద్దరి నాయకుల పేర్లే వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కాగా, ఇంకొకరు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. కొడంగల్ నుంచి రేవంత్రెడ్డి గెలుపొందగా, మధిర(ఎస్సీ) నియోజకవర్గం నుంచి మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారు. వీరిద్దరిలో ఎవరో ఒకరకి సీఎం పదవిని కేటాయించే అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న స్వల్ప సమయంలోనే టీపీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్రెడ్డి.. తన మార్కు రాజకీయాలతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ వచ్చారు. అవకాశం చిక్కినప్పుడల్లా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్లో జోష్ నింపే యత్నం చేశారు. మరోవైపు మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రతో కాంగ్రెస్కు మరింత ఊపు తెచ్చిన నాయకుడు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు అత్యంత వీర విధేయుడుగా ఉన్న నేత మల్లు. సీఎం పదవిపై తన మనసులోని మాటను కూడా బయటపెట్టారు మల్లు. సీఎం పదవి ఇస్తే గౌరవంగా స్వీకరిస్తానని ఎన్నికల ఫలితాల తర్వాత మల్లు వ్యాఖ్యానించారు. అంటే తాను కూడా సీఎం రేసులో ఉన్నాననే మనసులో మాటను ఎట్టకేలకు వెల్లడించారు. మరొకవైపు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్కు రేవంత్రెడ్డికి మంచి సాన్నిహిత్యమే ఉంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కీలక బాధ్యతలను డీకే శివకుమార్కు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించి ఆయనపై ఎంతో విశ్వాసం ఉంచింది. ఈ తరుణంలో రేవంత్రెడ్డికి సీఎం పదవి రావాలంటే డీకే శివకుమార్ తప్పకుండా అనివార్యం కావొచ్చు. ఎప్పటిలోగా..? కర్ణాటకలో సీఎం పదవి ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దగా సమయం తీసుకోలేదు. కేవలం మూడు రోజుల్లోనే సిద్ధరామయ్యను ఎంపిక చేసింది. అక్కడ కూడా డీకే శివకుమార్ నుంచి సిద్ధరామయ్య పోటీ ఎదురైంది. అయితే చివరి నిమిషంలో సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసి, డీకేకు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు. దీనికి డీకే శివకుమార్ను ఒప్పించడంలో కాంగ్రెస్ అధిష్టానం చాలా స్వల్ప వ్యవధిలోనే సక్సెస్ అయ్యింది. మరి తెలంగాణ సీఎం పోస్ట్ విషయంలో కాంగ్రెస్ ఎంత సమయం తీసుకుంటుదంనేదే ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నమాట. కర్ణాటక తరహాలో అతి తొందరగా నిర్ణయం తీసుకుంటుందా.. లేక నాన్చుడు ధోరణి అవలంభిస్తుందా? అనేది చూడాలి. లిస్టు చాలానే ఉంది.. వారిని బుజ్జగించేది ఎలా? తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ లీడర్లకు కొదువలేదు. వీరిలో చాలా మంది సీఎం పదవి కోసం చూస్తున్న ఆశావహులు చాలా మందే ఉన్నారు. రేవంత్రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలతో పాటు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, శ్రీధర్బాబు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. వీరంతా సీఎం పదవి కోసం వాళ్ల ప్రయత్నాలు కచ్చితంగా చేస్తారు. దీని కోసం గళాన్ని గట్టిగా వినిపించడానికి సిద్ధమవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వీరిని ఎలా డీల్ చేస్తుందనేది ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ముందున్న సమస్య. కర్ణాటక తరహాలో నిర్ణయాన్ని డైరెక్ట్గా తీసుకుని వారికి భరోసా ఇస్తే సరిపోతుందా.. లేక వారిని బుజ్జగించడానికి సమయం పడుతుందా అనేది ఇప్పుడు చర్చకు తెరతీసింది. ఒకవేళ సీఎం పదవి కోసం ఏమైనా వివాదం ఏర్పడితే మాత్రం కాంగ్రెస్ అధిష్టానం దీనిపై సీరియస్గా ఫోకస్ పెట్టక తప్పదు..! -
తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు (ఫొటోలు)
-
Telangana Congress Celebrations: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం దూకుడు.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సంబురాలు (ఫోటోలు)
-
సీఎం పదవి ఇస్తే..: భట్టి కీలక వ్యాఖ్య
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో దొరల పాలన పోయిందని, ప్రజల తెలంగాణ వచ్చిందని కాంగ్రెస్ కీలక నేత, సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఫలితాల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతున్న వేళ.. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజల విజయం. తెలంగాణలో దొరల పాలన పోయింది. ప్రజా తెలంగాణ వచ్చింది. గెలిచిన అభ్యర్థులందరికీ అభినందనలు. కాంగ్రెస్ తరఫున ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తాం. సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తా అని అన్నారాయన. -
కేవలం ఐదు స్థానాల్లో బిఆర్ఎస్ విజయం
-
గజ్వేల్లో కేసీఆర్ గెలుపు.. హుజూరాబాద్లో ఈటల ఓటమి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల ఫలితాలు కీలక నేతలకు షాక్ ఇస్తున్నాయి. అధికార పార్టీలోని మంత్రులకు, ఎమ్మెల్యేలకు మాత్రమే కాదు.. ఇతర పార్టీల్లోని నేతలకు చేదు అనుభవం మిగల్చబోతున్నాయి ఈ ఎన్నికలు. బీజేపీ తురుపుముక్కగా భావించిన ఈటల.. రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. హుజూరాబాద్లో ఈటల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్రెడ్డి చేతిలో ఓడారు. ఏకంగా 17వేల ఓట్ల(17,158 ఓట్లు) మెజారిటీతో ఈటలపై కౌశిక్రెడ్డి నెగ్గారు. హుజూరాబాద్లో ఈటల రెండో స్థానానికే పరిమితం అయ్యారు. మరోవైపు కేసీఆర్ను ఓడిస్తానని చాలెంజ్ చేసి మరీ గజ్వేల్ బరిలోనూ ఈటల నిల్చున్నారు. అయితే.. ఇక్కడా కేసీఆర్ చేతిలో ఈటలకు పరాభవం తప్పలేదు. కాకుంటే ఈటల లాంటి బలమైన నేత పోటీ చేయడంతో గత ఎన్నికల కంటే ఈసారి కేసీఆర్ మెజారిటీ తగ్గింది. అయితే గజ్వేల్లో కేసీఆర్ హ్యాట్రిక్ విక్టరీ రికార్డు మాత్రం నెలకొల్పారు. కరీంనగర్ ఈసారి కచ్చితంగా నెగ్గుతారనే అంచనాలున్న బండి సంజయ్.. గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. స్వల్ప మెజార్టీతోనే ఆయన బండి చేతిలో ఓడారు. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన రఘునందన్రావు.. ఇప్పుడు ఎన్నికలో ఓటమి పాలయ్యారు. కొత్త ప్రభాకర్(మెదక్ ఎంపీ) భారీ మెజార్టీతో ఇక్కడి నుంచి నెగ్గారు. -
కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సంచలన విజయం సాధించారు. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి, కేసీఆర్ మూడో స్థానానికి పడిపోయారు. రాష్ట్రంలోనే వీవీఐపీ సెగ్మెంట్గా అందరి దృష్టిని ఆకర్షించిన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. కామారెడ్డి కింగ్ ఎవరవుతారన్న దానిపై తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలో నిలబడటంతో సీఎంను ఓడిస్తానంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోటీకి దిగిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని ఓడించి బీజేపీ అభ్యర్థి తన సత్తా చాటారు. -
తెలంగాణ కాంగ్రెస్ విజయ సారథి అనుముల రేవంత్రెడ్డి (ఫొటోలు)
-
తెలంగాణ ఫలితాలు: ఫిరాయింపుదారులకు దెబ్బ
సాక్షి,హైదరాబాద్: రాజకీయాల్లో ఫిరాయింపులు సర్వసాధారణమే. ఒక పార్టీలో నెగ్గి.. మరో పార్టీ కండువా కప్పేసుకోవడం ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా జరుగుతుంటుంది. అలా.. పోటీ చేసిన ఫిరాయింపుదారులకు తెలంగాణ ఓటర్లు ఈ ఎన్నికల్లో గట్టి షాకే ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీ మీద పోటీ చేసి నెగ్గి.. మరో పార్టీలోకి వెళ్లి.. ఇప్పుడు మారిన పార్టీ మీద పోటీ చేసిన అభ్యర్థులు బొక్కబోర్లాపడ్డారు. పలు నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లో గెలిచిన అభ్యర్థులు.. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించి తమ పార్టీలోకి వచ్చిన వాళ్లకు బీఆర్ఎస్ అధిష్టానం మళ్లీ 2023 ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చింది. కానీ, ఆ ఫిరాయింపుదారుల్ని ఓటర్లు నిర్మోహమాటంగా తిరస్కరించారు. మెచ్చా నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా ఆశ్వారావుపేటలో గతంలో మెచ్చా నాగేశ్వరరావు (టీడీపీ) తరఫున గెలుపొందారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్లో చేరారు. ఈసారి ఆయన బీఆర్ఎస్ తరఫునే పోటీకి దిగారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థి ఆది నారాయణకు ఓటర్లు పట్టం కట్టారు. ఫిరాయింపుదారి నాగేశ్వరరావుపై ఆది నారాయణ ఏకంగా 28,358 ఓట్లతో గెలుపొందారు. కోరుకంటి చందర్ రామగుండం నియోజకవర్గంలో 2018లో కోరుకంటి చందర్(ఫార్వర్డ్ బ్లాక్) నుంచి గెలుపొందారు. తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. ఈసారి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా చందర్ పోటీ చేయగా.. రామగుండం ప్రజలు ఆయన్ని ఓడించారు. ఫిరాయింపుదారి కోరుకంటి చందర్పై కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ ఠాకూర్ 40 వేల ఓట్ల బంపర్ మెజార్టీతో గెలుపొందారు. పైలెట్ రోహిత్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూర్ నియోజకవర్గంలో గెలుపొందిన పైలెట్ రోహిత్రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి తార్వత బీఆర్ఎస్లో చేరారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన రోహిత్రెడ్డిని ఆ నియోజకవర్గం ప్రజలు ఓటర్లు తిరస్కరించారు. గండ్ర వెంకట రమణారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన గండ్ర వెంకట రమణారెడ్డి గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేశారు. ఈసారి ఫిరాయించిన పార్టీ టిక్కెట్పై పోటీ చేసి గండ్ర ఓటమిపాలయ్యారు. చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకర్గలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల విరేశం చేతిలో చిరుమర్తి లింగయ్య ఓటమిపాలయ్యారు. ఆయితే లింగయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్లో చేరారు. ఫిరాయించిన బీఆర్ఎస్ నుంచి ఈసారి పోటీ చేశారు. నకిరేకల్ నియోజకవర్గ ఓటర్లు లింగయ్యను తిరస్కరించారు. వనమా వెంకటేశ్వర్ రావు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గత అసెంబ్లీ ఎన్నికల్లో వనమా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి.. బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేశారు. 2023 ఎన్నికల్లో ఆయన ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ నుంచే మళ్లీ పోటి చేయగా ఈసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి వనమా కొత్తగూడెంలో ఓడిపోయారు. సండ్ర వెంకటవీరయ్య గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన సండ్ర అనంతరం బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు. 2023లో ఫిరాయించిన బీఆర్ఎస్ నుంచి మళ్లీ పోటీ చేయగా.. సత్తుపల్లి ఓటర్లు తిర్కరించారు. రేగా కాంతారావు గత ఎన్నికల్లో పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి రేగా కాంతారావు విజయం సాధించారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంతారావు మళ్లీ బరిలో దిగారు. అయితే ఈసారి పినపాక సెగ్మెంట్ ఓటర్లు కాంతారావును తిరస్కరించారు. హరిప్రియ నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో విజయం సాధించారు హరిప్రియా నాయక్. అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి.. బీఆర్ఎస్లో చేరారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పికపాక నుంచి పోటీ చేసిన హరిప్రియ ఓటమిపాలయ్యారు. ఉపేందర్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేసి ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి.. బీఆర్ఎస్లోకి జంప్ చేశారు. అయితే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేశారు. ఆయన్ని పాలేరు నియోజకవర్గ ఓటర్లు తిర్కరించారు. సురేందర్ ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి 2018లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేందర్ గెలుపొందారు. ఆయన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మళ్లీ ఎల్లారెడ్డి నుంచి పోటీ చేశారు. ఈసారి ఆయన్ని ఎల్లారెడ్డి ఓటర్లు సురేందర్రెడ్డిని తిరస్కరించారు. హర్షవర్ధన్రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్రెడ్డి విజయం సాధించారు. అనంతరం ఆయన పార్టీ ఫిరాయించి.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ఈసారి ఆయన ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్లీ పోటీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ ఓటర్లు హర్షవర్ధన్రెడ్డి తిరస్కరించారు. -
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కారు జోరు
సాక్షి, ఉమ్మడి రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కారు జోరు సాగుతోంది. నగర శివారు ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ హవా సాగుతోంది. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, చేవెళ్ల, మహేశ్వరం, ఉప్పల్, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ విజయతీరాలకు చేరువలో ఉంది. రాజేంద్రనగర్, తాండూరు, వికారాబాద్లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఎల్బీనగర్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మరోవైపు, ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన కొందరు నేతలు భారీ వెనుకంజలో ఉన్నారు. కేసీఆర్ కేబినెట్ కీలకంగా పనిచేసిన నేతలు ఓటమికి చేరువలో ఉండటంతో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, ఖమ్మంలో పువ్వాడ అజయ్కుమార్, నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్, కరీంనగర్లో గంగుల కమలాకర్, మహబూబ్నగర్లో శ్రీనివాస్ గౌడ్ (స్వల్ప ఆధిక్యం, 60 ఓట్లు) వెనుకంజలో ఉన్నారు. -
ఫుల్ జోరులో కాంగ్రెస్.. సీఎం అభ్యర్థుల లీడింగ్ ఎలా ఉందంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల కౌంటింగ్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇక, కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థుల రేసులో ఉన్న నేతలు భారీ మెజార్టీ సంపాదించారు. మరోవైపు, అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి జరే ఆదినారాయణ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై 23వేల ఓట్ల మెజార్టీలో గెలుపొందారు. మెజార్టీ ఇలా.. రేవంత్రెడ్డి.. 12వేల మెజార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. 25వేల మెజార్టీ ఉత్తమ్కుమార్ రెడ్డి.. 20వేల మెజార్టీ భట్టి విక్రమార్క.. 8వేల మెజార్టీ సీతక్క.. మూడు వేల మెజార్టీ ఇక, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఎవరు సీఎం అవుతారనే కీలక చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం మా నేత సీఎం అంటే మా నాయకుడు ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ నేతలు మాత్రం అధిష్టానమే సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తుందని చెబుతున్నారు. కాగా, కాంగ్రెస్ గెలుపు నేపథ్యంలో హస్తం శ్రేణులు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. పలుచోట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పాలాభిషేకం చేస్తున్నారు. బాణాసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. #WATCH | #TelanganaElection2023 | Congress workers pour milk on a poster featuring Congress Parliamentary Party Chairperson Sonia Gandhi, party MP Rahul Gandhi and state party chief Revanth Reddy as the party continues its lead in the state. As per the official EC trends, the… pic.twitter.com/IWi4QEz4EQ — ANI (@ANI) December 3, 2023 మరోవైపు.. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ అభ్యర్థులను కర్ణాటకకు తరలించే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తాజ్కృష్ణలో డీకే శివకుమార్ సహా కర్ణాటక నేతలు బస చేశారు. లగ్జరీ బస్సులను కూడా తరలింపునకు రెడీ చేశారు. #WATCH | Congress cadre burst firecrackers outside the office of the party's state unit in Hyderabad as the party leads on 52 seats in Telangana pic.twitter.com/3Agy3Ha0rt — ANI (@ANI) December 3, 2023 -
తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ కౌంట్డౌన్.. రౌండ్రౌండ్కు ఉత్కంఠ (ఫొటోలు)
-
రిజల్ట్స్ టెన్షన్ అందరిలో..!
-
నల్లగొండ జిల్లా దేవరకొండ మొదటి రౌండ్ ఫలితాలు
-
గజ్వేల్లో కేసీఆర్ ముందంజ
-
క్షణం క్షణం ఉత్కంఠగా..తెలంగాణ ఎన్నికల కౌంటింగ్.. (ఫొటోలు)
-
TS: పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజ..
సాక్షి, హైదరాబాద్: పోస్టల్ బ్యాలెట్ ఫలితాలలో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీఆర్ఎస్పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్ ముందంజలో ఉంది. కామారెడ్డి పోస్టల్ కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డి అనూహ్యంగా ముందంజలోకి వచ్చారు. తొలి రౌండ్లో కాంగ్రెస్ సత్తా చూపుతోంది. తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మహబూబాబాద్లో కాంగ్రెస్ ముందంజ ఉండగా, గజ్వేల్ తొలిరౌండ్లో కేసీఆర్ ఆధిక్యంలో ఉన్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి వెనుకంజలో ఉన్నారు. ఉమ్మడి కరీనగర్లో ఎనిమిది చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీజేపీ ముందంజలో ఉంది. మిర్యాలగూడలో 1500 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ ఉండగా, నల్గొండలో కోమటిరెడ్డి 6వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో సాగుతున్నారు. అశ్వారావుపేట తొలిరౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, కామారెడ్డి, కొడంగల్లో రేవంత్రెడ్డి ముందంజలో ఉన్నారు. మునుగోడులో రాజగోపాల్రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. చదవండి: ‘ఎగ్జిట్ పోల్స్’ కంటే మిన్నగా.. -
తెలంగాణ రిజల్ట్..ప్రత్యక్షప్రసారం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం కైవసం చేసుకుంటుందోనన్న అంశంపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అప్డేట్స్ను ప్రత్యేక ప్రసారం ద్వారా చూడండి. -
Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. అప్డేట్స్
జంగ్ తెలంగాణ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్డేట్స్ గవర్నర్తో ముగిసిన కాంగ్రెస్ నేతల భేటీ గవర్నర్తో ముగిసిన కాంగ్రెస్ నేతల భేటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు సిద్ధమని తెలిపిన నేతలు గెలిచిన అభ్యర్థుల జాబితాను గవర్నర్కు అందించిన పార్టీ బృందం రేపు ఉదయం 9:30కి సీఎల్పీ సమావేశం రేపు ఉదయం 9:30కి సీఎల్పీ సమావేశం సీఎల్పీ భేటీలోనే సీఎం అభ్యర్థి ఎన్నిక ఉంటుంది. గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కోరతాం: డీకే శివకుమార్ రాజ్భవన్కు కాంగ్రెస్ నేతల బృందం రాజ్భవన్కు కాంగ్రెస్ నేతల బృందం గవర్నర్ను కలవనున్న కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని గవర్నర్కు చెప్పనున్న కాంగ్రెస్ నేతలు కాసేపట్లో సీఎల్పీ సమావేశం హైదరాబాద్ గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాకు చేరుకుంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే హోటల్లో డీకే శివకుమార్ సహా నలుగురు ఏఐసీసీ నలుగురు పరిశీలకులు తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119.. మ్యాజిక్ ఫిగర్ 60 తెలంగాణ కొత్త డీజీపీగా రవిగుప్తా నియామకం సీఎం కేసీఆర్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తమిళిసై ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సీఎం కేసీఆర్ను కోరిన గవర్నర్ తమిళిసై పటాన్ చెరువు ఎన్నికల రిజల్ట్స్ కి బ్రేక్ పటాన్ చెరువు ఎన్నికల రిజల్ట్స్ కి బ్రేక్ 23వ రౌండ్ కౌంటింగ్ ని నిలిపివేసిన అధికారులు రీ కౌంటింగ్ చేయాలని పట్టుబడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అధికారులు, RO తో మాట్లాడుతున్న కాట శ్రీనివాస్ కౌంటింగ్ కేంద్రం ముందు భారీగా చేరుకున్న మహిపాల్ రెడ్డి, కాట శ్రీనివాస్ వర్గీయులు భారీగా కార్యకర్తలు రావడంతో కార్యకర్తలను కంట్రోల్ చేయలేక పోలీసుల తంటాలు వీహెచ్ హన్మంతరావు కీలక వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి మా సీఎం అభ్యర్థి పార్టీ కోసం కష్టపడ్డాడు.. గెలిపించాడు.. మా హైకమాండ్ కూడా రేవంత్ కు మద్దతు ఇస్తుందని నేను అనుకుంటుంన్నా.. ఈ రోజు రాత్రికే సీఎల్పీ భేటీ ఈ రోజు రాత్రికే సీఎల్పీ భేటీ తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఊహాగానాలు గజ్వేల్లో హ్యాట్రిక్ సాధించిన కేసీఆర్ గజ్వేల్లో హ్యాట్రిక్ సాధించిన కేసీఆర్ గత ఎన్నికల కంటే తగ్గిన మెజార్టీ హోటల్ ఎల్లాకు చేరుకున్న రేవంత్ రెడ్డి, విజయశాంతి.. హోటల్ ఎల్లాకు చేరుకున్న రేవంత్ రెడ్డి, విజయశాంతి.. మరి కొద్దిసేపట్లో హోటల్ కు చేరుకోనున్న 27 మంది గెలిచిన ఎమ్మెల్యే లు రాత్రి 9 గంటలకు సీఏల్పీ మీటింగ్.. ఆలోపే గెలిచిన ఎమ్మెల్యేలు హోటల్ కు రావాలని పిలుపు రీకౌంటింగ్ను కోరిన బండి సంజయ్. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల గెలుపుపై రీకౌంటింగ్ కు కోరిన బండి సంజయ్.. ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అప్పీల్ చేసిన సంజయ్.. నిజామాబాద్ జిల్లాలో గెలుపొందిన ఎమ్మెల్యేలు 1.బాన్సువాడ లో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి విజయం. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి పై 23,464 ఓట్ల మెజారిటీతో విజయం. 2.బాల్కొండ లో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత రెడ్డి విజయం సమీప కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ రెడ్డి పై 4,533 ఓట్ల మెజారిటీతో గెలుపు. 3.నిజామాబాద్ అర్బన్ లో బీజేపి అభ్యర్థి ధన్ పాల్ సూర్య నారాయణ విజయం సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ పై 15,387 మెజార్టీ గెలుపు 4.ఆర్మూర్ లో బీజేపి అభ్యర్థి రాకేష్ రెడ్డి ఘన విజయం. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి పై 29,669 ఓట్ల మెజారిటీతో గెలుపు. 5.నిజామాబాద్ రూరల్ లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతిరెడ్డి విజయం సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పై 21,963 ఓట్ల మెజారిటీతో విజయం. 6.బోధన్లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి విజయం. సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ అమీర్ పై 3,062 ఓట్ల మెజారిటీతో విజయం. సిద్ధిపేటలో హరీష్ రావు విజయం సిద్ధిపేటలో హరీష్ రావు విజయం 2018 కంటే తగ్గిన మెజారిటీ కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమి 6789 ఓట్ల మెజారిటీతో కేసీఆర్ పై గెలుపొందిన బీజేపీ అభ్యర్థి వెంకట రమణా రెడ్డి మూడో స్థానంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్లిన 9 మంది ఎమ్మెల్యేలు ఓటమి డీజీపీ అంజనీకుమార్ సస్పెండ్ డీజీపీ అంజనీకుమార్ను సస్పెండ్ చేసిన ఈసీ: పీటీఐ వర్గాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన నేపథ్యంలో రేవంత్ రెడ్డిని కలవడంపై ఈసీ ఆగ్రహం అదనపు డీజీలు మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ కు ఈసీ నోటీసులు వివరణ ఇవ్వాలని ఇద్దరికీ ఆదేశాలు ఎన్నికల ప్రవర్తన నియమావళి గుల్లంగన కింద అధికారులపై ఈసీ చర్యలు హుజూరాబాద్లో ఈటల ఓటమి హుజూరాబాద్లో ఈటల ఓటమి బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌషిక్ రెడ్డి ఈటలపై విజయం కరీంనగర్లో స్వల్ప మెజార్టీతో గంగుల కమలాకర్ గెలుపు కేవలం 326 ఓట్ల మెజార్టీతో గెలుపు రీకౌంటింగ్ కోరిన బండి సంజయ్ రేపు(సోమవారం) ఉదయం సీఎల్పీ సమావేశం జరిగే అవకాశం సీఎం ఎవరు అనే దానిపై కసరత్తు సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ రాజీనామా లేఖను గవర్నర్కు ఇచ్చిన కేసీఆర్ ఎల్బీనగర్లో బీఆర్ఎస్ విజయం బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి గెలుపు. బోధ్లో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ విజయం కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి ముందంజ రెండో స్థానంలో కేసీఆర్, మూడో స్థానంలో రేవంత్ 15వ రౌండ్ ముగిసే సరికి 3వేల మెజార్టీతో బీజేపీ ఇంకా నాలుగు రౌండ్స్ మిగిలి ఉన్నాయి. వర్ధన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు గెలుపు నాగర్కర్నూల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ రెడ్డి విజయం ఖానాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎడ్మా బుజ్జు విజయం చెవెళ్లలో బీఆర్ఎస్ విజయం స్వల్ప మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య గెలుపు. రీకౌంటింగ్ చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి భీం భరత్ డిమాండ్ ఆదిలాబాద్లో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ విజయం భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్కుమార్రెడ్డి విజయం సిరిసిల్లలో కేటీఆర్ గెలుపు 29వేల మెజార్టీతో కేటీఆర్ విజయం పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావు గెలుపు. మహబూబాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి డా. మురళీనాయక్ విజయం ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావు గెలుపు. నర్సాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి గెలుపు. వనపర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి మేఘా రెడ్డి విజయం నర్సంపేటంలో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి విజయం సూర్యాపేటలో బీఆర్ఎస్ లీడ్ సూర్యాపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి జగదీష్ రెడ్డి ముందంజ ఐదువేల ఓట్లతో లీడ్లో జగదీష్ రెడ్డి ఇది తెలంగాణ ప్రజల విజయం: భట్టి మధిరలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలుచేస్తాం. సీఎం పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తాను. దొరల తెలంగాణ పాలన పోయింది, ప్రజల తెలంగాణ పాలన వచ్చింది. ఇది తెలంగాణ ప్రజల విజయం దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థి బాలు నాయక్ విజయం తాండూరులో పైలట్ రోహిత్ రెడ్డి ఓటమి కొల్లాపూర్లో కాంగ్రెస్ గెలుపు కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుపు బర్రెలక్క(శిరీష) ఓటమి మధిరలో కాంగ్రెస్ అభ్యర్థి భట్ట విక్రమార్క గెలుపు మధిరలో 35వేల మెజార్టీతో భట్టి విజయం హుస్నాబాద్లో ముందంజలో పొన్నం ప్రభాకర్ 11వేలకుపైగా ముందంజలో కొనసాగుతున్న పొన్నం గోషామహల్లో రాజాసింగ్ గెలుపు ఆర్మూర్లో బీఆర్ఎస్కు షాక్ సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఓటమి బోధన్లో కాంగ్రెస్ సుదర్శన్ రెడ్డి గెలుపు కామారెడ్డిలో కేసీఆర్ వెనుకంజ మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి గెలుపు తుంగుత్తురిలో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ ఓటమి కాంగ్రెస్ అభ్యర్థి శ్యామూల్ గెలుపు. మంథనిలో శ్రీధర్బాబు గెలుపు 30వేలకు పైగా మెజార్టీతో గెలుపు సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్ గెలుపు. మునుగోడులో 21వేల మెజార్టీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు. సనత్నగర్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలుపు. చరిత్రను తిరగరాసిన స్పీకర్ పోచారం తెలంగాణ చరిత్రలో స్పీకర్గా ఓడిపోవడం అనవాయితీ కానీ, ఈ ఎన్నికల్లో పోచారం విజయం సాధించి చరిత్ర తిరగరాశారు. కాంగ్రెస్ అభ్యర్థులు గడ్డం బ్రదర్స్(వినోద్), కోమటిరెడ్డి బ్రదర్స్ గెలుపు. నారాయణఖేడ్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం పటోళ్ల సంజీవ రెడ్డి భారీ గెలుపు. బాన్సువాడలో పోచారం గెలుపు బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం విజయం మేడ్చల్లో మల్లారెడ్డి గెలుపు. ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ గెలుపు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవెందర్ రెడ్డి ఓటమి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ గెలుపు నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్తి వేముల వీరేశం గెలుపు ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు చేవెళ్ల, స్టేషన్ఘన్పూర్ మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవెందర్ రెడ్డి ఓటమి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ గెలుపు నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్తి వేముల వీరేశం గెలుపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని ఓటమి నారాయణ్ఖేడ్ కాంగ్రెస్ విజయం హుజుర్నగర్లో ఉత్తమ్ కుమార్ విజయం 46వేల మెజార్టీతో ఉత్తమ్ గెలుపు కొడంగల్లో రేవంత్ విజయం 32వేల మెజార్టీతో రేవంత్ గెలుపు భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సిరిసిల్లలో కేటీఆర్ 25వేల ఆధిక్యం. వేములవాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ విజయం నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి విజయం హుజురాబాద్లో 10వేల మెజార్టీలో పాడి కౌశిక్ రెడ్డి. హుస్నాబాద్లో 14వ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ 11,515 ఆధిక్యత దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం రఘునందన్ రావు ఓటమి. జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర్ గెలుపు 14వేల మెజార్టీతో తుమ్మల విజయం జుక్కల్లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతరావు విజయం మధిరలో భట్టి విక్రమార్కకు 22వేలకుపైగా ఓట్ల ఆధిక్యం నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీ విజయం 54వేలకు పైగా భారీ మెజార్టీలో కోమటిరెడ్డి గెలుపు. ఆందోల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామెదర రాజనర్సింహ గెలుపు 24వేల భారీ మెజార్టీతో భారీ విజయం బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి విజయం బెల్లంపల్లిలో భారీ ఆధిక్యంలో వివేక్ సూర్యాపేటలో ముందంజలో మంత్రి జగదీష్ రెడ్డి. ఓటమి దిశగా ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్కు బిగ్ షాక్ పోటీ చేసిన గజ్వేల్, హుజురాబాద్లో ఓటమి దిశగా ఈటల సికింద్రాబాద్ నియోజకవర్గం రౌండ్ నెంబర్: 11 BRS: 4460 BJP: 2315 NC: 2093 11వ రౌండ్ మెజారిటీ: BRS ఆధిక్యం 2145 11వ రౌండ్ ముగిసే సరికి BRS అభ్యర్థి పద్మారావు 32883 ఓట్లతో ఆధిక్యం.. గాంధీ భవన్కు భారీ ర్యాలీతో బయలుదేరిన రేవంత్ రెడ్డి. గాంధీభవన్కు బయలుదేరిన రేవంత్ రెడ్డి. గాంధీభవన్కు చేరుకున్న డీకే శివకుమార్ నల్గొండలో 44 వేల ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంబర్పేటలో బీఆర్ఎస్ విజయం కాలేరు వెంకటేశ్ గెలుపు. నాగర్కర్నూల్లో వెయ్యి ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ బహదూర్పురలో విజయం దిశగా ఎంఐఎం షాద్ నగర్లో 12వ రౌండ్ ముగిశాక కాంగ్రెస్ అభ్యర్ధి 1407 లీడ్ కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థులు తెలంగాణలో జనసేన పరిస్థితి ఇది.. డిపాజిట్లు కూడా రాని స్థితిలో జనసేన అభ్యర్థులు పోటీ చేసిన ఎనిమిది చోట్ల అదే పరిస్థితి ప్రధాన పార్టీలకు ఏమాత్రం దరిదాపుల్లో ఓట్లు దక్కించుకోని జనసేన అభ్యర్థులు 80కి పైగా స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కుత్బుల్లాపూర్లో 60,000 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో 11 రౌండ్లు ముగిసే సరికి 19798ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగా రెడ్డి ముందంజ అలంపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థికి 9వ రౌండ్ లో 14,624 ఓట్ల ఆధిక్యం టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి భద్రత పెంపు రేవంత్రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్ డీజీపీ వెంట సీనియర్ ఐపీఎస్లు కూడా పూల బొకేలు ఇచ్చి రేవంత్కు శుభాకాంక్షలు చెప్పిన అధికారులు తాండూరులో 800 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ 8వ రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు 16,136 లీడ్ రంగారెడ్డి జిల్లా 14 స్థానాల్లో 11లో బీఆర్ఎస్కు ఆధిక్యం, 3 కాంగ్రెస్ ఆధిక్యం కామారెడ్డిలో ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి 2 వేల ఓట్ల ఆధిక్యంలో రేవంత్రెడ్డి రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్కుమార్ ఠాకూర్ విజయం చార్మినార్లో ఎంఐఎం అభ్యర్థి మీర్ జుల్ఫికర్ విజయం ఆంధోల్ నియోజకవర్గంలో 14 రౌండ్ ముగిసేసరికి 20 వేల పై చిలుకు ఆదిత్యంలో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ. ఫలితాల్లో కాంగ్రెస్ జోరు.. ఉత్తమ్ స్పందన తెలంగాణ ప్రజల్లో హృదయాల్లో సోనియా ఉన్నారు: ఉత్తమ్ 2014, 2018 ఎన్నికల్లో మేము కొన్ని తప్పులు చేశాం బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది తెలంగాణ ప్రజలు సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తున్నారు మేడ్చల్లో మల్లారెడ్డికి 23 వేల ఆధిక్యం కామారెడ్డిలో ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి రేవంత్రెడ్డి లీడ్ చొప్పదండిలో కాంగ్రెస్ అభ్యర్థికి 14 వేల లీడ్ కొడంగల్లో 23 వేల లీడ్లో రేవంత్రెడ్డి పాలకుర్తిలో ఎర్రబెల్లి వెనుకంజ ఆరు వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థిని యశస్వినిరెడ్డి సిరిసిల్లలో 13 వేల ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్ బర్రెలక్కకు కొల్లాపూర్లో ఆరో రౌండ్ పూర్తయ్యాక 1923 ఓట్లు గద్వాలలో 8వేల ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి దుబ్బాకలో పదవ రౌండ్ మూసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి 32,349 ఓట్ల ఆదిక్యత కూకట్పల్లిలో ఏడవ రౌండ్ ముగిశాక.. 29,805 లీడ్లో కృష్ణారావు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు దిశగా కాంగ్రెస్ కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహం.. బాణసంచా కాలుస్తూ సంబురాలు మరొకొందరు హస్తం కార్యకర్తలు సోనియా గాంధీ ఫొటోకు పాలభిషేకం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కారు జోరు... నగర శివారు ప్రాంతాల్లో BRS హవా కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, చేవెళ్ల, మహేశ్వరం, ఉప్పల్, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో విజయతీరాల్లో BRS రాజేంద్రనగర్, తాండూరు, వికారాబాద్ లో స్వల్ప ఆధిక్యంలో కాంగ్రెస్ ఎల్బీనగర్ లో BRS బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఆరో రౌండ్ ముగిసినా.. ఈటల వెనుకంజ హుజురాబాద్లో ముగిసిన ఆరో రౌండ్ పాడి కౌశిక్రెడ్డి ముందంజ ఆరువేల ఓట్లకు పైగా ఆధిక్యం రెండోస్థానంలో కాంగ్రెస్ తొలి రౌండ్నుంచి.. మూడో స్థానంలోనే కొనసాగుతున్న ఈటల ఏడో రౌండ్ లో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సుమారు 13,000 లీడ్ ఖానాపూర్లో ఆరువేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు హుజూరాబాద్లో ఆరో రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్రెడ్డి లీడ్ మానుకొండూరులో సత్యనారాయణ(కాంగ్రెస్) 15 వేల ఆధిక్యం పెద్దపల్లిలో 17వేల లీడ్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావు భద్రాచలంలో గెలుపు దిశగా బీఆర్ఎస్? పదో రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి లీడ్ 5,155 ఇంకా మిగిలి ఉన్న మూడు రౌండ్స్ శేరిలింగంపల్లిలో 13 వేల ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ మధిరలో 15వేల ఓట్ల ఆధిక్యంలో విక్రమార్క కామారెడ్డిలో 1200 ఓట్ల ఆధిక్యంలో రేవంత్రెడ్డి కొడంగల్లో 12 వేల ఓట్ల ఆధిక్యంలో యూకత్పురలో ఆధిక్యంలో బీజేపీ బహదూర్పురలో ఆధిక్యంలో ఎంఐఎం దేవరకద్రలో 600 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ సంగారెడ్డిలో ఆధిక్యంలో బీఆర్ఎస్ బర్రెలక్కకు 1200 ఓట్లు నాంపల్లి 100 ఓట్ల ఆధిక్యంలో ఎంఐఎం ములుగు నియోజకవర్గంలో 9 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క(అనసూయ) 12,673 ఓట్ల ఆధిక్యం ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి 21,349 మెజార్టీలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి. జహీరాబాద్ ఆరో రెండు ముగిసే సరికి 906 ఓట్ల స్వల్ఫ ఆదిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావు. మధిరలో ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి మల్లు భట్టి విక్రమార్కకు 15819 ఓట్ల మెజార్టీ ఇప్పటివరకు 65 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం బోణీ కొట్టిన కాంగ్రెస్ తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి ఖమ్మం ఆశ్వారావుపేటలో కాంగ్రెస్ విజయం 28,358 ఓట్లతో ఆది నారాయణ గెలుపు ఇల్లందులోనూ కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం పినపాక 7వ రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ లీడ్ 14,307 భద్రాచలం 8వ BRS లీడ్ 2853 అశ్వారావుపేట 12వ కాంగ్రెస్ 26306 ఇల్లండు 12th కాంగ్రెస్ 35 241 కొత్తగూడెం 6వ CPI లీడ్ 13,820 మంచిర్యాల్లో నాల్గవ రౌండు ముగిసే సరికి.. కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్సాగర్కు 10,107 మెజార్టీ హుస్నాబాద్ లో 8 వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కు 6235 లీడ్ ఖానాపూర్లో ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి.. బీజేపీ 700 ఓట్ల లీడ్ సనత్ నగర్ లో ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 11658 ఓట్ల ఆధిక్యం భువనగిరిలోని కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత కంటోన్మెంట్లో ఐదు రౌండ్లు ముగిసేసరికి.. 21 వేల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థిని లాస్య నందిత సాయన్న ఈసీ ట్రెండ్స్ ప్రకారం ఆధిక్యంలో.. కాంగ్రెస్ 59 బీఆర్ఎస్ 37 బీజేపీ 9 ఎంఐఎం 1 తుమ్మలకు 8 వేల లీడ్ మహబూబ్నగర్లో 65 ఓట్ల ఆధిక్యంలో శ్రీనివాస్గౌడ్ ఆరుగురు మంత్రులు ఓటమి బాటలో? ఆధిక్యంలో ఘోరంగా వెనుకబడిన ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి, కొప్పుల ముషీరాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థికి ఐదు వేల ఓట్ల ఆధిక్యం కొడంగల్లో తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి.. రేవంత్రెడ్డికి 12,060 ఓట్ల ఆధిక్యం భూపాలపల్లి నాలుగవ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యo 9285 మేడ్చల్లో 11వ రౌండ్ ముగిసేసరికి 17,856 ఆధిక్యంలో మల్లారెడ్డి లీడ్ దుబ్బాకలో ఆరో రౌండు ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి 20,799 ఓట్ల ఆధిక్యం పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు ఆధిక్యం 11,791 లీడ్ హుజురాబాద్లో ఈటల మూడో ప్లేస్ మూడు రౌండ్లు ముగిసేసరికి కౌశిక్రెడ్డి లీడ్ రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ మూడోస్థానంలో కొనసాగుతున్న ఈటల జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ లీడ్ మానకొండూరులో కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణకి 10590 ఆధిక్యం ఖమ్మం అశ్వారావుపేట 8 రౌండ్లకు కాంగ్రెస్16125 ఆధిక్యత సంగారెడ్డిలో జగ్గారెడ్డి వెనుకంజ బోథ్ నియోజకవర్గం లో 4వ రౌండ్ లో బీ అర్ ఎస్ అభ్యర్థి అనిల్ 3,353 లీడ్ పాలేరు లో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి 2164 ఓట్ల ఆధిక్యం కరీంనగర్లో బండి సంజయ్ ముందంజ ఐదో రౌండ్ ముగిసేసరికి ఆధిక్యంలోకి వచ్చిన బండి సంజయ్ కరీంనగర్లో 943 ఓట్లతో బండి లీడ్ నిజామాబాద్ రూరల్లో ఏడో రౌండ్ ముగిసే సరికి.. కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి 8521 ఓట్ల ఆధిక్యం రాజేంద్ర నగర్ నియోజకవర్గం పోలింగ్ బూత్ 68 లోని ఈవీఎం మొరాయిo చడంతో నిలిచిన కౌంటింగ్ పటాన్చెరులో మూడో రౌండ్ ముగిసేసరికి 369 ఓట్ల తో లీడ్ మూడు రౌండ్లు ముగిసే సరికి గజ్వేల్లో కేసీఆర్ లీడ్.. 3020 నల్గొండలో ఎనిమిది రౌండ్స్ ముగిసేసరికి.. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 25వేల ఓట్ల అధిక్యం ఆసిఫాబాద్లో ఐదో రౌండ్ ముగిసేసరికి 7 వేల ఆధిక్యంలో బీఆర్ఎస్ కోవ లక్ష్మి మెదక్ జిల్లా నర్సాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి రాజిరెడ్డి 2440ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు సూర్యాపేటలో నాలుగో రౌండ్ ముగిసేసరికి.. 2657 బీఆర్ఎస్ జగదీశ్వర్రెడ్డి లీడ్ పటాన్చెరులో 264 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ బహదూర్పూర్లో700 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఆర్మూర్లో బీజేపీకి 2 వేల ఓట్ల ఆధిక్యం గద్వాల్లో 5,700 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ శేరిలింగంపల్లిలో 7 వేల ఆధిక్యంలో బీఆర్ఎస్ ఖమ్మంలో తుమ్మలకు 4 వేల ఓట్ల ఆధిక్యం ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. కాంగ్రెస్-53 బీఆర్ఎస్-31 బీజేపీ-6 సీపీఐ-1 ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. భూపాలపల్లిలో మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు మొత్తం 6511 ఓట్ల మెజారిటీ పటాన్ చెరు రెండో రౌండ్ ఆధిక్యంలో కాంగ్రెస్.. 264 ఓట్ల ఆధిక్యం కామారెడ్డిలో ఆధిక్యంలోకి వచ్చిన కేసీఆర్ 600 ఓట్ల ఆధిక్యంలో కేసీఆర్ సిరిసిల్లలో 3,749 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్ భూపాలపల్లిలో 6 వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ కార్వాన్, బహదూర్పురాలో బీజేపీ లీడ్ మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ మైనంపల్లి వెనుకంజ మెదక్లో మైనంపల్లి కొడుకు రోహిత్ ముందంజ జూబ్లీహిల్స్లో 900 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి నకిరేకల్లో కాంగ్రెస్కు 7 వేల ఓట్ల ఆధిక్యం కొడంగల్లో నాలుగో రౌండ్ ముగిసేసరికి 4 వేల ఓట్ల లీడ్లో రేవంత్రెడ్డి వనపర్తిలో మంత్రి నిరంజన్రెడ్డి ముందంజ గజ్వేల్లో రెండో రౌండ్ ముగిసేసరికి 920 ఓట్ల ఆధిక్యంలో కేసీఆర్ కొల్లాపూర్లో బర్రెలక్కకు కేవలం 400 ఓట్లు మాత్రమే! చేవెళ్లలో బీఆర్ఎస్ ఆధిక్యం భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థికి 4 వేల ఓట్ల ఆధిక్యం సికింద్రాబాద్లో పద్మారావు ఆధిక్యం సిరిసిల్ల మూడో రౌండ్లో 2,621 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్ మంత్రి ప్రశాంత్రెడ్డి వెనుకంజ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా.. ఆసిఫాబాద్ సెగ్మెంట్ మూడవ రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి 2,420 ఓట్ల ఆదిక్యం మంథని నియోజకవర్గంలో 3వ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు 3425 లీడ్ ఆందోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ నాలుగో రౌండు మూసేసరికి 6245 కోట్ల ఆధిక్యం ములుగు నియోజకవర్గంలో ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క 7461 ఓట్ల ఆదిక్యం నిజామాబాద్ అర్బన్లో 4 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. కాంగ్రెస్ 47 బీఆర్ఎస్ 26 బీజేపీ 3 హుస్నాబాద్ మూడో రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ 74 4 ఆధిక్యత. .. మొత్తం ఆధిక్యత 2250 ఖమ్మం పాలేరులో 3 వ రౌండ్ అయిపోయే సరికి పొంగులేటి సుమారు 7000 లీడ్ మూడో రౌండ్లు ముగిసేసరికి.. కొడంగల్, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఆధిక్యం కల్వకుర్తిలో 3 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రంగారెడ్డిలో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 4 తాండూరులో 139 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ బెల్లంపల్లిలో మూడో రౌండ్ ముగిసేసరికి 10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో వినోద్ సత్తుపల్లిలో మూడో రౌండ్ ముగిసేసరికి 2 వేల ఓట్లకు పైగా లీడ్ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బీఆర్ఎస్ ఆధిక్యం కొరుట్లలో బీఆర్ఎస్ సంజయ్కి ఆధిక్యం నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ లీడ్ పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ ఉప్పల్లో బీఆర్ఎస్ ముందంజ మేడ్చల్లో మల్లారెడ్డికి 2 వేలకు పైగా లీడ్ నల్గొండలో ఐదో రౌండ్ ముగిసేసరికి 17 వేల ఆధిక్యంలో కోమటిరెడ్డి హుజూర్ నగర్లో 12 వేల ఆధిక్యంలో ఉత్తమ్ కుమార్ హుజూరాబాద్లో ఈటల వెనుకంజ రెండో రౌండ్లోనూ కౌశిక్ మందంజ కామారెడ్డిలో మూడో స్థానంలో కేసీఆర్ గజ్వేల్లో కేసీఆర్ వెయ్యి ఓట్లకు పైగా ఆధిక్యం గోషామహల్లో రాజాసింగ్ వెనుకంజ నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ ఆధిక్యం నర్సంపేటలో మూడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ ఆధిక్యం ఖమ్మం నియోజకవర్గంలో మూడో రౌండ్ ముగిసే నాటికి తుమ్మల 796 ఆధిక్యం పినపాకలో రెండో రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యం డోర్నకల్లో మూడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ ముందంజ కామారెడ్డిలో 1162 ఓట్ల ఆధిక్యంలో రేవంత్రెడ్డి మెదక్లో 7 బీఆర్ఎస్, 2 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం నిర్మల్లో బీజేపీ ఆధిక్యం ఆలంపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు లీడ్ ఆశ్వారావుపేటలో ఐదో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ సూర్యాపేటలో రెండో రౌండ్లో బీఆర్ఎస్ ఆధిక్యం.. లీడ్ కొచ్చిన జగదీశ్రెడ్డి పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావు ఆధిక్యం ఖైరతాబాద్లో దానం ముందంజ రామగుండంలో మూడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ 12 వేలకు పైగా లీడ్ కూకట్పల్లిలో మాధవరం లీడ్ 7 వేలకు ఓట్లకు పైనే కొత్తగూడెంలో కూనంనేనికి 3వేలకు పైగా(3,350) ఓట్ల ఆధిక్యం కొడంగల్లో మూడో రౌండ్ ముగిసేసరికి 4 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో రేవంత్ సిరిసిల్లలో కేటీఆర్కు 1500 వందల ఓట్లకు పైగా లీడ్ అంబర్పేట రెండో రౌండ్లో బీఆర్ఎస్కు ఆధిక్యం సత్తుపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ కుత్బుల్లాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి లీడ్ సంబరాల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వరంగల్ కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 3 స్థానాల్లో ముందంజలో.. రంగారెడ్డి కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 4, బీజేపీ 2 నిజామాబాద్ కాంగ్రెస్ ఐదు, బీఆర్ఎస్ 3, బీఆజేపీ 3 ఆదిలాబాద్ కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 3, బీజేపీ 2 ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్కు అనూహ్య ఫలితాలు మహేశ్వరంలో రెండో రౌండ్లో సబితా ఇంద్రారెడ్డి మందంజ నారాయణపేటలో కాంగ్రెస్ అభ్యర్థి మందంజ ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్కు ఆధిక్యం కరీంనగర్లో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 3 స్థానాల్లో ముందంజ భువనగిరి రెండో రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 12, బీజేపీ 1 స్థానాల్లో ముందంజ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పది స్థానాల్లో బీఆర్ఎస్ వెనుకంజ తొమ్మిది కాంగ్రెస్, ఒకటి సీపీఐ నిజామాబాద్లో కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2 స్థానాల్లో ఆధిక్యం రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి.. సీతక్కకు 3 వేల ఓట్లకు పైగా లీడ్ మహబూబ్నగర్లో బీఆర్ఎస్ ముందంజ జనగామలో బీఆర్ఎస్ లీడ్ రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ నల్గొండ నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి.. 12 వేల ఓట్ల ఆధిక్యంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కొడంగల్లో మూడో రౌండ్లో రేవంత్రెడ్డికి ఆధిక్యం 4,389 ఓట్ల ఆధిక్యంలో రేవంత్ హుజూరాబాద్ తొలి రౌండ్లో కౌశిక్రెడ్డి ముందంజ వెనుకబడిన ఈటల వికారాబాద్లో మూడో రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం కరీంనగర్లో గంగుల ముందంజ 1145 ఓట్ల ఆధిక్యంలో గంగుల బాల్కొండలో బీఆర్ఎస్ ముందంజ బెల్లంపల్లిలో కాంగ్రెస్ ముందంజ రెండో రౌండ్లో ఆధిక్యంలోకి వచ్చిన కేటీఆర్ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ముందంజ గజ్వేల్లో ఈటల వెనుకంజ పటాన్చెరులో బీఆర్ఎస్ ఆధిక్యం సత్తుపల్లిలో 2,240 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ సిరిసిల్లలో కాంగ్రెస్ ఆధిక్యం తొలి రౌండ్లో కేటీఆర్ వెనుకంజ 265 ఓట్లతో వెనుకబడిన కేటీఆర్ సిర్పూర్లో బీజేపీ ముందంజ ఎంఐఎం నాలుగు స్థానాల్లో ముందంజ రెండో రౌండ్లో.. రెండో రౌండ్లోనూ కామారెడ్డిలో రేవంత్రెడ్డి ముందంజ 1962 ఓట్లతో ముందంజలో రేవంత్ దుబ్బాకలో తొలి రౌండ్లో బీఆర్ఎస్ ఆధిక్యం తొలి రౌండ్లో వెనుకబడ్డ పలువురు మంత్రులు, బీఆర్ఎస్ ప్రముఖులు వెనుకంజ వీళ్లే.. మానుకొండూరులో రసమయి పాలకుర్తిలో ఎర్రబెల్లి తుంగతుర్తిలో గాదరి వెనుకంజ ఆదిలాబాద్ జోగురామన్న కేటీఆర్ చార్మినార్లో తొలిరౌండ్లో బీజేపీ ఆధిక్యం జడ్చర్ల, మక్తల్లో కాంగ్రెస్ ఆధిక్యం కొత్తగూడెంలో సీపీఐ ముందంజ పాలేరులో పొంగులేటి ముందంజ కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ ముందంజ సనత్ నగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని ముందంజ బాన్సువాడలో బీఆర్ఎస్ ఆధిక్యం ములుగులో కాంగ్రెస్ సీతక్క ముందంజ మెదక్లో 5 వేలపై ఆధిక్యంలో మైనంపల్లి రోహిత్ పొంగులేటికి 2 వేలకు పైగా ఓట్ల ఆధిక్యం ఉత్తర, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యం ఉమ్మడి ఖమ్మం, నల్గొండలో మెజార్టీ స్థానాల్లో ఆధిక్యం హైదరాబాద్లో ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ స్టేషన్ ఘన్పూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ముందంజ సత్తుపల్లిలో కాంగ్రెస్ ఆధిక్యం మానుకొండూరులో కాంగ్రెస్ ముందంజ నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ ముందంజ నాగర్కర్నూల్లో బీఆర్ఎస్ ముందంజ తాండూర్లో బీఆర్ఎస్ ముందంజ బెల్లంపల్లిలో గడ్డం వినోద్ ముందంజ బీజేపీ తొలి రౌండ్ ఇలా.. మహేశ్వరంలో బీజేపీ ఆధిక్యం నిర్మల్లోనూ బీజేపీ లీడ్ కరీంనగర్లో బండి సంజయ్ లీడ్ ఆర్మూర్లో కాంగ్రెస్ ముందంజ ఖైరతాబాద్లో బీఆర్ఎస్ దానం నాగేందర్ ముందంజ వరంగల్ తూర్పులో కొండా సురేఖ ముందంజ మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో కాంగ్రెస్ ముందంజ బీఆర్ఎస్ తొలి రౌండ్లో.. నర్సంపేటలో బీఆర్ఎస్ ఆధిక్యం సనత్ నగర్లో తలసాని జుక్కల్లో ముందంజ గజ్వేల్ తొలిరౌండ్లో కేసీఆర్కు 300 ఓట్ల ఆధిక్యం పాలకుర్తిలో ఎర్రబెల్లి వెనుకంజ సిరిసిల్లలో కేటీఆర్ లీడ్ శేరిలింగంపల్లిలో గాంధీ సిద్ధిపేటలో 6,305 ఓట్ల లీడ్లో.. ముషీరాబాద్లో భూపాలపల్లిలో తొలి రౌండ్లో కాంగ్రెస్ సత్తా ఈవీఎం లెక్కింపు తొలి రౌండ్లో.. తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజ మహబూబాబాద్లో కాంగ్రెస్ ముందంజ ఉమ్మడి కరీనగర్లో ఎనిమిది చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీజేపీ ముందంజ మిర్యాలగూడలో 1500 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ నల్గొండలో కోమటిరెడ్డి 6వేల ఓట్లకు పైగా ఆధిక్యం అశ్వారావుపేట తొలిరౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యం కామారెడ్డి, కొడంగల్లో రేవంత్రెడ్డి ముందంజ మునుగోడులో రాజగోపాల్రెడ్డి ముందంజ ఈవీఎం ఓట్ల లెక్కింపు.. తొలి రౌండ్లో.. భువనగిరి లో మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్ధి కుంభం అనీల్ కుమార్ రెడ్డి ముందంజ నల్లగొండ నియోజకవర్గం లో తొలి రౌండ్ లో 4 వేల ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్ మిర్యాలగూడ నియోజకవర్గం లో తొలి రౌండ్ లో 1500 ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్ భట్టి విక్రమార్క మొదటి రౌండ్లో 2022 ఓట్ల మెజార్టీ ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య ఆధిక్యం ఉత్తమ్కుమార్రెడ్డికి 2 వేల ఓట్ల ఆధిక్యం ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ 800 ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్లో ఇండిపెండెంట్ బర్రెలక్క ముందంజ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు.. ఉమ్మడి వరంగల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో కాంగ్రెస్ ముందంజ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో.. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్ ముందంజ హుజురాబాద్ పోస్టల్ కౌంటింగ్లో ఈటల ముందంజ మంచిర్యాల, బెల్లంపల్లి కౌంటింగ్లో బీజేపీ ముందంజ కామారెడ్డి పోస్టల్ కౌంటింగ్లో అనూహ్యంగా ముందంజలోకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డి కౌంటింగ్పై సీఈవో స్పందన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ నడుస్తోంది 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కౌంటింగ్ జరుగుతోంది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగిసింది ఈవీఎం లెక్కింపు ప్రారంభం అయ్యింది ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ లేదు...ప్రశాంతంగా కౌంటింగ్ నడుస్తోంది ఇబ్రహంపట్నం ఘటనలో ఫిర్యాదులు వచ్చాయి డీఈవో వెళ్లి పరిస్థితిని సమీక్షించి సమస్యను పరిష్కరించారు ఇబ్రహీంపట్నం ఘటన సమసిపోయింది... అభ్యర్థులకు పోస్టల్ బ్యాలెట్ చూపించాం ఇబ్రహీంపట్నంలోనూ కౌంటింగ్ ప్రారంభం అయింది పోస్టల్ బ్యాలెట్ కామారెడ్డి, కరీంనగర్లో బీజేపీ ముందంజ నల్గొండలో కాంగ్రెస్ ముందంజ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో అక్బరుద్దీన్(ఎంఐఎం) ముందంజ ఖమ్మం, మధిరలో కాంగ్రెస్ అభ్యర్థులు తుమ్మల, భట్టి ముందంజ హుజూరాబాద్లో ఈటల ముందంజ కొడంగల్లో రేవంత్ రెడ్డి ముందంజ పరిగి, వికారాబాద్, తాండూరులో ముందంజలో కాంగ్రెస్ అభ్యర్థులు వేములవాడలో కాంగ్రెస్ ముందంజ సిరిసిల్లలో కేటీఆర్ ముందంజ పాలేరు లో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తిలో.. ఇంకా మొదలుకాని పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు #WATCH | Counting of votes gets underway in Telangana's Karimnagar pic.twitter.com/35Fw96EglQ — ANI (@ANI) December 3, 2023 ప్రగతి భవన్ బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత అధికారం మాదే: మాణిక్రావ్ ఠాక్రే తెలంగాణలో 70 సీట్లు కచ్చితంగా గెలుస్తాం ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజం కాబోతున్నాయి మీడియాతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్రావ్ ఠాక్రే నేతల్లోనే కాదు.. అందరిలో ఉత్కంఠ తెలంగాణలోని అన్ని పార్టీల నాయకుల నిరీక్షణకు నేటితో తెర రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం హోరాహోరీ రాజకీయపోరులో తలపడుతున్న 2,290 మంది అసెంబ్లీలో అడుగుపెట్టబోయే ఆ 119 మంది ఎవరో అనే ఉత్కంఠకు మరికాసేపట్లో తెర మొత్తం 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు అధికార కైవసానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 60. ఎగ్జిట్ పోల్ అంచనాలతో గెలుపుపై హస్తం పార్టీ ధీమా మళ్లీ అధికారం మాదేనని బీఆర్ఎస్ కచ్చితంగా కింగ్ మేకర్ అవుతామంటున్న బీజేపీ ఇండిపెండెంట్ల ప్రభావం ఎంత? పది గంటల నుంచి ఫలితాల సరళి వెలువడే అవకాశం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు తెలంగాణలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు మొత్తం 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల 12వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1లక్ష 80వేల ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అరగంట నుంచి గంటలోపు ముగియనున్న కౌంటింగ్ ఉదయం 8.30గం.కి ప్రారంభం కానున్న ఈవీఎంల కౌంటింగ్ సంగారెడ్డి జిల్లా అందోల్ (36) స్ట్రాంగ్ రూమ్ తలుపులు ఓపెన్ చేసిన ఎన్నికల అధికారులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం 131 టేబుళ్ల ఏర్పాటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 2.20 లక్షల ఓట్లు ఉదయం 8గం. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అరగంట నుంచి గంట లోపు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ముగింపు ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం ఖమ్మంలో.. మొత్తం 14,378 పోలైన పోస్టల్ బ్యాలెట్లు ఆన్ లైన్ ద్వారా 150 మంది దరఖాస్తు చేసుకుని బ్యాలెట్ పంపించారు వయో వృద్ధులు, దివ్యాంగులు 2290 మంది ఇంటి వద్ద ఓటు వేశారు విధులలో పాల్గొన్న సిబ్బంది ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాలవారీగా పోలైనపోస్టల్ బ్యాలెట్లు ఖమ్మం 5,567 పాలేరు 2,163 మధిర 1,790 వైరా 2,074 సత్తుపల్లి 2,779 మొత్తం 14,373 క్యాంపు రాజకీయాల ప్రచారం అవాస్తం: భట్టి కాంగ్రెస్ క్యాంపు రాజకీయా ప్రచారం అవాస్తవం. మేము 70 నుంచి 80 సీట్లు గెలుస్తాం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తాం. సీఎంగా ఎవరిని చేయాలన్నది అధిష్టానం చూసుకుంటుంది. మాకు సైలెంట్ ఓటింగ్ జరిగింది: జోగు రామన్న తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది. మాకు సైలెంట్ ఓటింగ్ జరిగింది. సంక్షేమ పథకాలే మా పార్టీని గెలిపిస్తాయి. నా విజయాన్ని ఎవరూ ఆపలేరు. పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. వరంగల్లో పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ సెంటర్కు తరలిస్తున్న అధికారులు. పోటాపోటీ ధీమా హ్యాట్రిక్ లోడింగ్ 3.0 అంటూ కేటీఆర్ ట్వీట్ ఎగ్జిట్పోల్స్తో అయోమయానికి గురికావొద్దని భరోసా రాబోయే ప్రభుత్వం మనదేనంటూ కాంగ్రెస్ పోస్టర్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న పార్టీల ఏజెంట్లు(అభ్యర్థులు) తొలుత పోస్టల్ బ్యాలెట్, ఆపై ఈవీఎంల ఫలితాలు ఉదయం తొమ్మిది గంటలకే ఈవీఎం తొలి ఫలితం? పోస్టల్బ్యాలెట్ ఓటింగ్లో.. అత్యధికంగా కుత్బుల్లాపూర్, తర్వాత మేడ్చల్ పెద్దపెల్లి జిల్లాలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య మొత్తం 4164.. పెద్దపెల్లిలో 1356 మంథనిలో 993 రామగుండంలో 1815 ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాలవారీగా పోలైనపోస్టల్ బ్యాలెట్లు ఖమ్మం 5,567 పాలేరు 2,163 మధిర 1,790 వైరా 2,074 సత్తుపల్లి 2,779 మొత్తం 14,373 ఆదిలాబాద్ కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఏజెంట్లు అభ్యర్థితో పాటు పదహారు మందికి అనుమతి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి.. ఎమ్మెల్యే జోగురామన్న, స్వతంత్ర అభ్యర్థి సంజీవరెడ్డి ప్రధాన నేతలు గజ్వేల్, కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ కొడంగల్, కామారెడ్డి నుంచి రేవంత్రెడ్డి పోటీ గజ్వేల్, హూజురాబాద్ నుంచి ఈటల పోటీ గజ్వేల్లో కేసీఆర్పై ఈటల, కామారెడ్డిలో కేసీఆర్పై రేవంత్రెడ్డి పోటీ సిర్పూర్లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధిరలో భట్టి విక్రమార్క హుజూర్నగర్లో ఉత్తమ్కుమార్రెడ్డి కరీంనగర్లో బండి సంజయ్ కొరుట్లలో ధర్మపురి అర్వింద్ దుబ్బాకలో రఘునందన్ నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడులో రాజగోపాల్రెడ్డి మల్కాజ్గిరిలో మైనంపల్లి, మెదక్లో మైనంపల్లి తనయుడు రోహిత్ కంటోన్మెంట్లో గద్దర్ కూతురు వెన్నెల చంద్రాయగుట్టలో అక్బరుద్దీన్ పోటీ సిరిసిల్ల కేటీఆర్ సిద్ధిపేట హరీష్రావు బరిలో కొల్లాపూర్ బర్రెలక్క(కర్నె శిరీష), రామగుండం సోమారపు సత్యనారాయణ, కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావ్ తదితరులు కూడా.. లెక్కింపు కేంద్రంలో.. ఓట్ల లెక్కింపునకు.. 14 టేబుళ్లు (పోలింగ్ కేంద్రాలు 350కి మించిన చోట 28 టేబుళ్లు) ఒక్కో టేబుల్ వద్ద.. సూపర్వైజరు, ఇద్దరు సహాయకులు, ఓ మైక్రో అబ్జర్వర్, పోటీలోని అభ్యర్థి తరఫున ఒక్కో ఏజెంటు సెల్ఫోను.. ఆర్వో, పరిశీలకులు, ప్రత్యేక అధికారుల ఫోన్లకే అనుమతి తొలి ఫలితం భద్రాచలం, చార్మినార్ చివరిగా శేరిలింగంపల్లి ఫలితం ఎక్కువ మంది పోటీ చేయడంతో.. సిద్ధిపేట గజ్వేల్ ఆలస్యమయ్యే అవకాశం కౌంటింగ్ ఇలా.. ఉదయం 5: 00 లెక్కింపు కేంద్రాలకు చేరుకున్న అధికారులు, సిబ్బంది ఉదయం 7: 00 టేబుళ్ల వద్ద పని మొదలు ఉదయం 8: 00 తపాలా ఓట్ల లెక్కింపు ప్రారంభం ఉదయం 8: 30 మొదటి రౌండు తపాలా ఓట్ల ఫలితం ఉదయం 9:00 ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు, కొన్ని చోట్ల ఉదయం 8.30 నుంచి ఉదయం 9: 30 మొదటి రౌండు ఈవీఎం ఓట్ల ఫలితం ప్రతి 15-20నిమిషాల నుంచి అరగంటకోసారి ఒక్కో రౌండు ఈవీఎం ఓట్ల ఫలితం కౌంటింగ్.. టిక్ టిక్ కాసేపట్లో తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8గం. ప్రారంభం కానున్న కౌంటింగ్ మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ కోసం 500 ఓట్ల కోసం ఒక టేబుల్ పోస్టల్ బ్యాలెట్ కోసం 131 టేబుల్స్ అరగంట తర్వాత ఈవీఎంల లెక్కింపు తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలు 1,798 టేబుల్స్, మొత్తం 2417 రౌండ్లలో లెక్కింపు పూర్తి ఒక్కో నియోజకవర్గానికి 14 నుంచి 28 టేబుల్స్ 11 గంటల వరకు ఫలితాల సరళిపై రానున్న స్పష్టత ప్రతీ కౌంటింగ్ టేబుల్ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ తెలంగాణ అసెంబ్లీ స్థానాల సంఖ్య 119, మ్యాజిక్ ఫిగర్ 60 ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ప్రతీ 15-20 నిమిషాలకు రౌండ్ ఫలితం కీలకంగా ఫలితాలు ఇవాళ తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్సభ ఎన్నికలకు ముందు వెలువడనున్న ప్రజా తీర్పు కావడంతో కీలకంగా భావిస్తున్న పార్టీలు బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ స్వయంగా 93 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం కాంగ్రెస్ తరఫున అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు బీజేపీ తరఫున ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ప్రచారం బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం అన్ని పార్టీలు ప్రత్యేకంగా మ్యానిఫెస్టోల విడుదల నేతలకు కీలకం.. పార్టీలకు ప్రతిష్ఠాత్మకం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని సీపీఐకి ఇచ్చి.. మిగిలిన 118 నియోజకవర్గాల్లో పోటీ భాజపా అభ్యర్థులు 111, ఆ పార్టీతో పొత్తులో భాగంగా జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ బీఎస్పీ 107, సీపీఎం 19 స్థానాల్లో పోటీ మొత్తం 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు, అయిదుగురు ఎమ్మెల్సీలు పార్టీల టికెట్లు దక్కని కొందరు అభ్యర్థులు ఇతర పార్టీల్లో చేరి బరిలో దిగగా.. పలువురు స్వతంత్రులూ.. బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, కేటీఆర్, హరీష్రావు, కాంగ్రెస్ నుంచి రేవంత్రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్ రెడ్డి బీజేపీ నుంచి బండి సంజయ్, ఈటల రాజేందర్, సీపీఐ, సీపీఎంల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ సహా పలువురు కీలక నేతలు నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ అంచనాలతో గెలుపుపై ధీమాగా హస్తం పార్టీ మళ్లీ అధికారం మాదేనంటున్న బీఆర్ఎస్ కింగ్ మేకర్ అవుతామంటున్న బీజేపీ వీడనున్న శాసనసభ ఎన్నికల ఉత్కంఠ 2.36 కోట్ల మంది తెలంగాణ ఓటర్ల తీర్పు వెలువడేది నేడే నేతలకు కీలకం.. పార్టీలకు ప్రతిష్ఠాత్మకం -
ఊరూవాడా.. రిజల్ట్పై అటెన్షన్!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో జనం దృష్టి అంతా ఫలితాలపైనే పడింది. ఊరూవాడా పల్లెపట్నం ఎక్కడ చూసినా.. చిన్నాపెద్దా ఎవరిని కదిలించినా ఉత్కంఠ కనిపిస్తోంది. ఎవరెవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? ప్రభుత్వం ఏర్పాటు చేసేదెవరు? కేసీఆర్, కేటీఆర్, రేవంత్, ఈటల వంటి ప్రముఖ నేతల్లో ఎవరెవరికి ఎలాంటి ఫలితం ఎదురవుతుందన్న చర్చ కూడా సాగుతోంది. పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, కూలీల నుంచి హోటళ్లలో, బస్టాండ్లలో పిచ్చాపాటీ దాకా ఎక్కడ నలుగురు కలసినా ఇదే తీరు. చివరికి ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాల్లో పరిచయస్తులు కనిపించినా ఎలక్షన్ల ప్రస్తావన రాకుండా ఉండటం లేదు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టులపై విస్తృత విశ్లేషణలు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫలితాల హీట్ కనిపిస్తోంది. పందెం కాస్తావా? పల్లె, పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా ఫలితాలపై చర్చలు సాగుతుంటే.. వివిధ పార్టీల అభిమానుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కనిపిస్తున్నాయి. మేం గెలుస్తామంటే, మేం గెలుస్తామంటూ అభ్యర్థులు, పార్టీల తరఫున సరదా పందేలూ జరుగుతున్నాయి. మరోవైపు అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయని, ఇప్పటికే రంగ ప్రవేశం చేసిన బుకీలు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, సోషల్మీడియా గ్రూపుల్లో హడావుడి చేస్తున్నారని తెలిసింది. సీఎం ఎవరవుతారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై రూ.లక్షల్లోనే బెట్టింగులు సాగుతున్నాయి. కర్ణాటక, ఏపీ వంటి పొరుగు రాష్ట్రాల్లోనూ తెలంగాణ ఫలితాలపై ఆసక్తి కనిపిస్తోంది. అక్కడి వారూ బెట్టింగ్లు కడుతున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో జోరుజోరుగా.. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఎన్నికల ఫలితాల అంచనాలు, విశ్లేషణలు పోటెత్తుతున్నాయి. ఎక్కడ ఫలితాలు ఎలా ఉంటాయనే అంచనాలు, ఊహాగానాలు క్షణం తీరిక లేకుండా పోస్టు అవుతున్నాయి. ఫోన్లో నోటిఫికేషన్ సౌండ్ వచ్చిందంటే చాలు చేతిలోకి తీసుకుని చెక్చేసుకుంటున్నారు. రాజకీయ పోస్టులను చదవడమే కాదు.. వాటిపై తమ అభిప్రాయాలు, అంచనాలనూ రిప్లైలో ఇస్తున్నారు. తమకు నచ్చినవాటిని ఆయా ప్లాట్ఫామ్లపై, గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. దీంతో ఎవరు గెలుస్తారన్నది, ఎవరు ఓడుతారన్నది గందరగోళంగా మారిపోయింది. -
కౌంటింగ్ కేంద్రాల వద్ద అగ్నిమాపకశాఖ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అగ్నిప్రమాదం సంభవించినా వెంటనే అప్రమత్తం అయ్యేలా అగ్నిమాపక శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. 119 నియోజకవర్గాల పరిధిలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఫైర్ టెండర్లు, మిస్ట్ బుల్లెట్లు, మంటలు ఆర్పే పరికరాలతో ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచినట్టు అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి తెలిపారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఉండే సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే అగ్నిమాపక శాఖ అధికారులు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రాంతాలను తనిఖీ చేసుకున్నారని, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారని తెలిపారు. -
కామారెడ్డి కింగ్ ఎవరో.?!
సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలోనే వీవీఐపీ సెగ్మెంట్గా అందరి దృష్టిని ఆకర్షించిన కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. కామారెడ్డి కింగ్ ఎవరవుతారన్న దానిపై తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలో నిలబడటంతో సీఎంను ఓడిస్తానంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోటీకి దిగారు. వీళ్లిద్దరికీ స్థానికుడైన జడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గట్టిపోటీ ఇచ్చారు. కేసీఆర్ గెలుపు ఖాయమని బీఆర్ఎస్ నేతలు, రేవంత్రెడ్డి గెలుస్తాడంటూ కాంగ్రెస్ నేతలు నమ్మకంతో ఉన్నారు. ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. కేసీఆర్ తరఫున కేటీఆర్ ఎన్నికల బాధ్యతలు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గత నెల 9 న కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసి అదే రోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. కేసీఆర్ తరపున ఎన్నికల బాధ్యతలను మంత్రి కేటీఆర్ నిర్వహించారు. ఎన్నికల ప్రచార బాధ్యతలను ఎమ్మెల్సీ షేరి సుభాష్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేపట్టారు. అలాగే మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, నాయకులు కర్నె ప్రభాకర్, మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, బాలమల్లు, బాల్క సుమన్, అయాచితం శ్రీధర్ తదితరులు ప్రచారంలో ఉధృతంగా పాల్గొన్నారు. రేవంత్కి అండగా వచ్చిన రాహుల్, కర్ణాటక సీఎం గత నెల 10న పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అదే రోజు ఇందిరాగాంధీ స్టేడియంలో బీసీ డిక్లరేషన్ సభ ఏర్పాటు చేశారు. రేవంత్రెడ్డితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సభలో పాల్గొన్నారు. 26న కామారెడ్డిలో నిర్వహించి బహిరంగ సభలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. కేవీఆర్ కోసం వచ్చిన ప్రధాని మోదీ ఇద్దరు వీఐపీల మధ్య స్థానిక నేతగా బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల హాజరయ్యారు. గత నెల 25న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. గత నెల 4న జిల్లా కేంద్రంలో జరిగిన బైక్ర్యాలీ, సభల్లో బీజేపీ రా్రష్్టర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్రెడ్డి పాల్గొన్నారు. ఫలితంపై ఉత్కంఠ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొద్ది గంటల్లో షురూ అయి, మధ్యాహ్నంలోపు ఫలితాలు వెలువడనున్నాయి. మూడు పార్టీల నేతల్లోనూ గెలుపు ధీమా కనిపిస్తోంది. పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఎవరిలెక్కలు వారు వేసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా తమ పార్టీకి వచ్చే ఓట్లపై కూడికలు, తీసివేతలు చేసి గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయం ఎవరిని వరిస్తుందన్నది కాసేపట్లో తేలిపోనుంది. -
మొత్తం రూ.241.52 కోట్ల నగదు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. రాష్ట్రంలో అక్టోబర్ 9న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ 1 వరకు పోలీసు బృందాల తనిఖీల్లో మొత్తం రూ.241.52 కోట్ల నగదు స్వాదీనం చేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.103 కోట్ల నగదు పట్టుబడగా ఈసారి ఎన్నికల నగదు స్వాదీనంలో 248 శాతం పెరుగుదల నమోదైంది. ఈ మేరకు శనివారం డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై మొత్తం 11,859 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
జడ్జిమెంట్ డే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏమిటో మరికొన్ని గంటల్లో వెల్లడికానుంది. దాదాపు రెండు నెలల ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీపడిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతాయా? అందుకు భిన్నంగా ఫలితాలు వస్తాయా? ఎవరెవరు గెలుస్తారు? ఎవరికి దెబ్బపడుతుంది? అధికారంలోకి వచ్చేది ఎవరన్న దానిపై రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్రాజ్ శనివారం ప్రకటించారు. 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు రాష్ట్రంలో 31 జిల్లా కేంద్రాల్లోని 31 ప్రాంతాల్లో, హైదరాబాద్లో 14, రంగారెడ్డి జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో కలిపి మొత్తం 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 కౌంటింగ్ సెంటర్లలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు, పోలైన ఓట్ల సంఖ్య ఆధారంగా ఒక్కో సెంటర్లో కౌంటింగ్ టేబుళ్లను సిద్ధం చేశారు. దీని ప్రకారం అతి తక్కువగా షాద్నగర్ స్థానానికి సంబంధించి 12 టేబుళ్లనే ఏర్పాటు చేశారు. 99 స్థానాలకు 14 టేబుళ్లు చొప్పున, 4 స్థానాలకు 16 టేబుళ్ల చొప్పున, 6 స్థానాలకు 18 టేబుళ్ల చొప్పున, మూడు స్థానాలకు 30 టేబుళ్ల చొప్పున.. 500కిపైగా పోలింగ్ కేంద్రాలున్న 6 నియోజకవర్గాలకు సంబంధించి 28 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి టేబుళ్లకు అదనంగా.. రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కోసం మరో టేబుల్ ఉంటుంది. మొత్తం 1,798 టేబుల్స్ ఏర్పాటు కాగా.. వాటిలో ఆర్వో, పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుల్స్ వినియోగిస్తారు. తొలి ఫలితం.. భద్రాచలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా 26 రౌండ్లలో, భద్రాచలం నియోజకవర్గంలో అతి తక్కువగా 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అంటే భద్రాచలం నియోజకవర్గం ఫలితాలు తొలుత వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా 119 స్థానాల్లో కలిపి 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రతి రౌండ్ కౌంటింగ్ ముగిశాక.. ఆ రౌండ్లో ప్రతి అభ్యర్థికి పడిన ఓట్లను నోట్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. అధిక పోలింగ్ జరిగిన నియోజకవర్గాలు, ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్న స్థానాల్లో ఓట్ల లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కౌంటింగ్ సమయంలో ఈవీఎంలకు ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే పరిష్కరించడం కోసం 119 మంది ఇంజనీర్లను నియమించారు. మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో.. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక సూక్ష్మ పరిశీలకుడు (మైక్రో అబ్జర్వర్), సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపును మైక్రో అబ్జర్వర్ పర్యవేక్షిస్తారు. ఒక నియోజకవర్గానికి సంబంధించిన టేబుళ్లపై ఏక కాలంలో జరిపే లెక్కింపును ఒక రౌండ్గా లెక్కిస్తారు. ఆ రౌండ్లో అభ్యర్థులకు పోలైన ఓట్ల సంఖ్యను నమోదు చేస్తారు. ఓట్ల సంఖ్యను మరోసారి పరిశీలించి నిర్ధారించుకుంటారు. తర్వాత మైక్రో అబ్జర్వర్ పరిశీలనకు పంపుతారు. మైక్రో అబ్జర్వర్ ఆమోదించాక.. తదుపరి రౌండ్ లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక్కో రౌండ్ పూర్తయిన కొద్దీ స్థానిక ఆర్వో/ఏఆర్వో మీడియా రూమ్ వద్దకు వచ్చి ఆ ఫలితాన్ని ప్రకటిస్తూ ఉంటారు. మూడంచెల భద్రత లెక్కింపు కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, రాష్ట్ర పోలీసులతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, పరిశీలకులు, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, పాసులు కలిగిన మీడియా ప్రతినిధులను మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తారు. కాలిక్యులేటర్లు, సెల్ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ పరికరాలను కౌంటింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లడానికి వీలుండదు. అధికారంపై ఎవరి ధీమా వారిదే.. శాసనసభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ సాధించి అధికారంలోకి వస్తామని అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచి హాట్రిక్ కొడతామని బీఆర్ఎస్.. తెలంగాణలో తొలిసారి అధికారం చేపడతామని కాంగ్రెస్ అంటున్నాయి. హంగ్ ఏర్పడితే ప్రభుత్వంలో భాగస్వామ్యం లభిస్తుందని బీజేపీ, ఎంఐఎం ఆశలు పెట్టుకున్నాయి. తుది ఫలితాలు ఎలా ఉన్నా తొలి రెండు స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్లే ఉంటాయని.. మూడో స్థానం కోసం ఎంఐఎం, బీజేపీ తలపడనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేయగా.. కాంగ్రెస్ 118 చోట్ల, పొత్తులో సీపీఐ ఒక స్థానంలో బరిలో ఉన్నాయి. మరో కూటమిలో బీజేపీ 111, జనసేన 8 స్థానాల్లో పోటీచేశాయి. బీఎస్పీ 107, ఎంఐఎం 9, సీపీఎం 19, సీపీఐఎల్ (న్యూడెమోక్రసీ) ఒక స్థానంలో బరిలో ఉన్నాయి. ఆ స్థానాలపైనే అందరి దృష్టి! సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్, కామారెడ్డి స్థానాల నుంచి పోటీలో ఉండగా.. ఆయనపై గజ్వేల్లో బీజేపీ తరఫున ఈటల రాజేందర్, కామారెడ్డిలో కాంగ్రెస్ తరఫున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బరిలోకి దిగి సవాల్ విసిరారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండు నియోజకవర్గాల ఫలితం ఎలా ఉంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు మంత్రులు కేటీఆర్ (సిరిసిల్ల), హరీశ్రావు (సిద్దిపేట), ఎర్రబెల్లి దయాకర్రావు (పాలకుర్తి), సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(వనపర్తి), ఇంద్రకరణ్రెడ్డి (నిర్మల్), స్పీకర్ పోచారంశ్రీనివాస్రెడ్డి (బాన్సువాడ)ల ఎంపికపైనా అంతటా ఆసక్తి నెలకొంది. ► కాంగ్రెస్ తరఫున సీఎం ఆశావాహులు/సీనియర్లు అయిన టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి (కొడంగల్), భట్టి విక్రమార్క (మధిర), ఉత్తకుమార్రెడ్డి(హుజూర్నగర్), దామోదర రాజనర్సింహ (ఆందోల్), కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (నల్లగొండ), టి.జీవన్రెడ్డి (జగిత్యాల), దుద్దిళ్ల శ్రీధర్బాబు (మంథని), సీతక్క (ములుగు), తుమ్మల నాగేశ్వర్రావు (ఖమ్మం)ల జయాపజయాలపై చర్చ నడుస్తోంది. ► బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ (కరీంనగర్), ఈటల రాజేందర్ (హుజూరాబాద్), బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్(సిర్పూర్) తదితరులు సాధించనున్న ఫలితాలపైనా ఆసక్తి కనిపిస్తోంది. ► నిరుద్యోగుల ప్రతినిధిగా కొల్లాపూర్ నుంచి పోటీచేస్తున్న శిరీష (బర్రెలక్క) ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పెద్దగా లేవని, అయినా ఆమెకు ఎన్ని ఓట్లు పడతాయి, అక్కడ ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై చర్చ జరుగుతోందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ఉదయం 10.30కల్లా ఆధిక్యతపై స్పష్టత ఆదివారం ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అరగంట తర్వాత అంటే 8.30 గంటలకు ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఎక్కువ సమయం కొనసాగినా, ఈవీఎం ఓట్ల లెక్కింపును సమయానికే ప్రారంభిస్తారు. చాలా నియోజకవర్గాల్లో ఉదయం 10.30 గంటలకల్లా ఏ అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నదీ దాదాపుగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకల్లా పోలింగ్ సరళి ద్వారా పార్టీల గెలుపోటములపై స్పష్టత రావొచ్చని పేర్కొంటున్నారు. ఎక్కడైనా పోటీ ఎక్కువగా ఉండి, రౌండ్ రౌండ్కు ఆధిక్యతలు మారిపోతూ ఉంటే.. లెక్కింపు పూర్తయ్యేదాకా ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతుందని అంటున్నారు. ఓట్ల లెక్కింపు సరళిని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ https:// results.eci.gov.in ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. -
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌంటింగ్కు సర్వం సిద్ధం
-
TS Election 2023: పట్టుబడిన నగదు, గోల్డ్, డ్రగ్స్ విలువ ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత భారీగా నగుదు, మద్యం, గోల్డ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వందల కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో స్వాధీనం చేసుకున్న నగదు, తదితర వివరాలను అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి రూ.469.63 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకోగా దీనికి సంబంధించి 11,859 ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అదే, 2018 ఎన్నికల సందర్భంగా రెండు వేలకుపైగా కేసులు నమోదు కాగా.. రూ.103 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇక, 2018తో పోలిస్తే 2023లో భారీగా కేసులు పెరగగా.. భారీ మొత్తంలో నగదును పట్టుకున్నారు. 2023కు సంబంధించిన వివరాలు ఇవే.. నగదు.. 241.52 కోట్లు.. 241 ఎఫ్ఐఆర్లు నమోదు గోల్డ్/సిల్వర్.. 175.95 కోట్లు.. 5 ఎఫ్ఐఆర్లు నమోదు మద్యం.. 13.36 కోట్లు.. 11,195 ఎఫ్ఐఆర్లు నమోదు డ్రగ్స్.. 22.17 కోట్లు.. 323 ఎఫ్ఐఆర్లు నమోదు ఉచితాలు.. 16.63 కోట్లు.. 95 ఎఫ్ఐఆర్లు నమోదు. -
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
-
రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేలా కృషి చేస్తాను: సీతక్క
-
రాహుల్ వ్యాఖ్యల మర్మమేంటి?.. సీఎంగా సీతక్క?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రేపు(ఆదివారం) నాలుగు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవునున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎగ్జిట్పోల్స్ ఆసక్తికర వివరాలను వెల్లడించాయి. ఇక, అందరి దృష్టి ముఖ్యంగా తెలంగాణ ఫలితాలపైనే ఉంది. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారా? లేక, కర్ణాటకలో మాదిరిగా కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందా? అనే చర్చ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ రాహుల్ ఏమన్నాడంటే.. కాగా, శుక్రవారం కేరళలోని కొచ్చిలో మహిళా కాంగ్రెస్ నేతల సదస్సు ‘ఉత్సాహ్’ను రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వారిని మరింత ప్రోత్సహించాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పార్టీలో ఇంకా చాలా మంది మహిళా నాయకులను తయారు చేయాలని, దేశంలో వచ్చే పదేళ్లలో 50 శాతం మంది మహిళా ముఖ్యమంత్రులు ఉండాలన్నదే తమ కాంగ్రెస్ లక్ష్యమన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి మహిళా ముఖ్యమంత్రి ఎవరూ లేరని అన్నారు. ముఖ్యమంత్రులు కావడానికి అవసరమైన అన్ని అర్హతలు కలిగిన మహిళా నాయకులు కాంగ్రెస్లో ఎంతోమంది ఉన్నారని చెప్పారు. ప్రయత్నించాలి, లక్ష్యం సాధించాలి అని సూచించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రేవంత్ వ్యాఖ్యల వెనుక.. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళను ముఖ్యమంత్రిని చేస్తారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సపోర్టుగా ఒకానొక సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే.. ములుగు ఎమ్మెల్యే సీతక్కను సీఎంను చేస్తామని కామెంట్స్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. దీంతో, సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తారా? అనే అంశం తెరపైకి వచ్చింది. ఇక, సీతక్క విషయానికి వస్తే.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ములుగు ఏజెన్సీ నుంచి గెలిచి.. అసెంబ్లీ వేదికగా పలుమార్లు బీఆర్ఎస్పై ప్రశ్నల వర్షం కురిపించారు. పలు సందర్బాల్లో సీతక్కను బీఆర్ఎస్ సభ్యులు సైతం అభినందించిన ఘటనలు ఉన్నాయి. మరోవైపు.. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును మద్దుతిస్తున్న సమయంలో కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. రాజకీయంగా మహిళలకు మద్దతివ్వాలన్నారు. కానీ, ఎన్నికల విషయం వచ్చే సరికి.. తెలంగాణలో కేవలం 11 మంది మహిళా అభ్యర్థులకు మాత్రమే సీట్లు ఇచ్చారు. దీంతో, కాంగ్రెస్ తీరును కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎంతమంది మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారని ఘాటు విమర్శలు చేస్తున్నారు. Congress is ruling Rajasthan, Himachal, Chhattisgarh, Karnataka. How many women Chief Ministers? Even deputy CM? Himachal Congress doesn't even have a woman minister. Telangana their CM candidate is not woman. Check how many woman ministers in Rajasthan and Karnataka. https://t.co/bnCXCf5TaF — Ankur Singh (@iAnkurSingh) December 1, 2023 కాంగ్రెస్ మహిళా అభ్యర్థులు వీరే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొత్తం 11 మంది మహిళలకు అవకాశమిచ్చింది. అందులో నలుగురు హైదరాబాద్లోని నియోజకవర్గాల నుంచి పోటీలో ఉన్నారు. మూడు ఎస్సీ నియోజకవర్గాలు, ఒక ఎస్టీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అవకాశం ఇచ్చింది. హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో విజయారెడ్డి, సనత్ నగర్ నుంచి కోట నీలిమ, గోషా మహల్లో మొగిలి సునీత, సికింద్రాబాద్ కంటోన్మెంట్(ఎస్సీ) స్థానంలో జీవీ వెన్నెలను పోటీలో నిలిపింది. వీరు కాకుండా గద్వాలలో సరిత తిరుపతయ్య, కోదాలలో నలమాడ పద్మావతి రెడ్డి, స్టేషన్ ఘన్పూర్(ఎస్సీ) స్థానంలో సింగపురం ఇందిర, పాలకుర్తిలో మామిడాల యశస్విని రెడ్డి, వరంగల్ ఈస్ట్లో కొండా సురేఖ, ములుగు(ఎస్టీ)లో సీతక్క, సత్తుపల్లి(ఎస్సీ) స్థానంలో మట్టా రాగమయి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. -
నయా పాలి‘ట్రిక్స్’.. గెలిచేది సారే.. వచ్చేది కారే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నిలక ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. అయితే, ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్పోల్స్పై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని ఎక్కువ సంఖ్యలో ఎగ్జిట్పోల్స్ సంస్థలు వెల్లడించాయి. అయితే, రాష్ట్రంలో సైలెంట్ వేవ్తో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో బెంగాల్కు చెందిన ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తాజాగా మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో మాదిరిగానే సెలైంట్ వేవ్తో తెలంగాణలో కూడా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు. బీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న ఆదరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తిరిగి పార్టీని గెలిపించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. Silent wave is mostly favorable to BRS just like the same happened in West Bengal - Prof. Sanjay Kumar pic.twitter.com/eii3WZ7Kqc — చార్వాక (@Charwaka99) December 1, 2023 మరోవైపు.. కొందరు సోషల్ మీడియాలో వేదికగా కూడా కేసీఆర్కు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఎన్నిలకల్లో ‘చేయి’ ఎత్తి ‘కారు’ను ఆపడం సాధ్యమేనా అని సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, ఎవరి విశ్లేషణలో వారు బిజీగా ఉన్నారు. మరోవైపు, గెలుపు ఓటములు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడిస్తూ పంచ్లు విసురుతున్నారు. నాకెందుకో ఈసారి కూడా తెలంగాణ లో "కార్" తిరుగుతుందని అనిపిస్తుంది,.. "చెయ్యి" ఎత్తి "కార్" ని ఆపగలం అనుకుంటున్నారు కానీ, అది సాధ్యం కాదని రేపు తెలుస్తుంది...😄 #TelanganaElections #KTR #BRSParty #KCRHattrick #KCROnceAgain — పంచభట్ల సారంగపాణి (@Siddart9Praveen) December 2, 2023 ఇక, థర్డ్ విజన్ నాగన్న సర్వే ఎగ్జిట్పోల్స్ కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా సమీకరణాలను వెల్లడించింది. బీఆర్ఎస్ దాదాపు 60-68 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో కాంగ్రెస్కు 33-40 సీట్లు వస్తామయని తెలిపింది. Now Third Eye Vision Naganna Survey has also been released and the Prediction is clear BRS party led by #KCR garu is forming Government once again in #TelanganaAssemblyElections2023 థర్డ్ ఐ విజన్ నాగన్న సర్వే కూడా ఎన్నికల్లో కేసిఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి… pic.twitter.com/0F0H8VFeYI — Dinesh Chowdary (@dcstunner999) November 29, 2023 -
కేసీఆర్ గజ్వేల్లో హ్యాట్రిక్ కొడతారా?
కేసీఆర్ గజ్వేల్లో హ్యాట్రిక్ కొడతాడు!.. నా పందెం ఇంత లే.. గజ్వేల్లో ఈటలనే గెలుస్తాడు! అంతకంటే డబుల్ నా పందెం హరీష్రావు లాస్ట్ ఎలక్షన్ల వచ్చిన మెజారిటీ ఈసారి క్రాస్ చేస్తాడని నా బెట్ దాటడని నా బెట్ ఖమ్మంలో పువ్వాడ-తుమ్మల పోటీలో గెలుపు ఆయనదే.. బర్రెలక్క ఈ ఎలక్షన్స్లో కచ్చితంగా గెలుస్తుందని ఇంత సొమ్ము వేస్తున్నా.. మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అంతటా నెలకొంది. ఈ సమయంలోనే పందెం రాయుళ్ల జోరు పెంచారు. గత నెల రోజుల నుంచి ఎలక్షన్ బెట్టింగ్ ఈ తంతు నడుస్తున్నప్పటికీ.. ఎగ్జిట్పోల్స్ ఫలితాలు, కౌంటింగ్కు సమయం దగ్గరపడడంతో ఇప్పుడు పందెం కాసే సొమ్ము అమాంతం పెరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా పెద్ద లీడర్ సాబ్ల మీద, తెలంగాణలో ఏ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందన్న దానిపై బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం. కాయ్ రాజా కాయ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. నేతల మీద జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. మొత్తం 33 జిల్లాల్లో.. ఎంపిక చేసిన నేతలపైనే పందేలు వేస్తున్నారు. బెట్టింగ్స్ కోసమే సర్వేలు చేయించుకున్న కొందరు.. లక్షల నుంచి కోట్లలో కాస్తున్నారు. ముఖ్య నేతల మీద, మంత్రుల గెలుపోటముల మీద ఓ లెక్క లేకుండా వేస్తున్నారు. హైదరాబాద్, తెలంగాణలో బెట్టింగ్ నిర్వహిస్తే పట్టుబడే అవకాశం ఉందని గుర్తించిన బుకీలు.. ఇతర ప్రాంతాల నుంచి దందా సాగిస్తున్నారు. హైదరాబాద్ సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, ఏపీకి సమీపంలో ఉన్న ప్రాంతాలపై బెట్టింగ్స్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. షాకింగ్ బెట్. ఇంట్రెస్టింగ్ రేటు దుబ్బాకలో రఘునందన్రావు గెలుస్తాడా? ఓడిపోతాడా?.. సంగారెడ్డిలో రఘునందన్రావు మళ్లీ నెగ్గుతాడా?ఇలా.. ఆప్షన్లతో బెట్టింగులు నడుస్తున్నాయి. కామారెడ్డి, గజ్వేల్ మీద బెట్టింగ్ ముఠాల స్పెషల్ ఫోకస్ ఉంది. ఈ రెండు సెగ్మెంట్లలో కేసీఆర్ పోటీ చేస్తుండడమే ప్రధాన కారణమని చెపనక్కర్లేదు. కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారు అనేదానికంటే.. గజ్వేల్లో ఈటల నెగ్గుతారనే ఇంకా ఎక్కువ సొమ్ముతో పందెం వేస్తున్నారు. అంతెందుకు విదేశాల నుంచి కూడా యాప్స్ బెట్టింగ్ వ్యవహారం నడుస్తోందని టాక్. సిద్ధిపేట నియోజకవర్గంలో హరీష్రావు గత ఎన్నికల్లో 1 లక్షా 19 వేల మెజారిటీ సాధించారు. ఈసారి ఆ మెజారిటీ రికార్డును దాటేస్తారా? అని పందెం వేస్తున్నారు. పలువురు తెలంగాణ మంత్రులు పోటీ చేస్తున్న స్థానాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు పందెం రాయుళ్లు. ఖమ్మంలో తుమ్మల-పువ్వాడ ఫైట్ మీద, పాలకుర్తిలో ఎర్రబెల్లి ఓడిపోతారని, కేటీఆర్ మెజార్టీ ఎలా ఉండబోతుందని, ఆదిలాబాద్-కరీంనగర్లో బీఆర్ఎస్కు జీరో సీట్లు అని.. ఇలా రకరకాల ఆఫ్షన్లతో పందెలు వేస్తున్నట్లు తెలుస్తోంది. పైసలే కాదు.. పొలిటికల్ బెట్టింగ్లో.. డబ్బులే కాదు భూములను కూడా పందెంలో పెడుతున్నారు కొందరు. సిర్పూర్ నియోజకవర్గం పరిధిలో గెలుపోటములపై లక్షల్లో సొమ్ముతో పాటు పొలాలను కూడా కొందరు తాకట్టు పెడుతున్నట్లు సమాచారం. మొత్తంగా తెలంగాణ ఎన్నికల ఫలితాల బెట్టింగ్ విలువ రూ.10 వేల కోట్ల రూపాయల దాకా ఉండొచ్చనేది ఒక అంచనా. -
Telangana Elections 2023: ఫలితాలపై టాలీవుడ్లో టెన్షన్..టెన్షన్!
అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సా..కాంగ్రెస్సా..?.. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే చర్చ జరుగుతోంది. సామాన్య ప్రజానీకంతో పాటు సీనీ ప్రముఖులు సైతం ఈ ఫలితాల కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఫలితాలతో సినిమా వాళ్లకు సంబంధం ఏంటనే డౌట్ రావడం సహజం. అయితే చిత్ర పరిశ్రమకు రాజకీయాలతో ప్రత్యేక్షంగా సబంధం లేకున్నా.. పరోక్షంగా మాత్రం చాలా ఉంది. షూటింగ్ల అనుమతి మొదలు.. టికెట్ల రేట్ల పెంపు వరకు ప్రతీది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతల్లో టెన్షన్ మొదలైంది. ఒకవేళ ప్రభుత్వం మారితే ఇండస్ట్రీపై ఎలాంటి వైఖరితో వ్యవహరిస్తుంది? టికెట్ల రేట్ల విషయంలో సహకరిస్తుందా లేదా అనే భయం నిర్మాతల్లో మొదలైంది. ఎవరు వస్తే నో టెన్షన్.? మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుందా? వస్తే ఎలాంటి పరిణామాలుంటాయన్నదానిపై టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంతో టాలీవుడ్కు సత్సంబంధాలున్నాయి. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఎలాంటి మార్పులు జరుగుతాయి? అన్నది కూడా చర్చగా మారింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సినిమా అవార్డులు లేవు. నంది అవార్డులు కూడా ఆంధ్రప్రదేశ్కే పరిమితమయ్యాయి. ఇక షూటింగ్ల పరంగా ప్రస్తుతాని అయితే హైదరాబాదే సినిమా క్యాపిటల్. బోలెడన్ని స్టూడియోలతో పాటు 24 క్రాఫ్ట్స్ నిపుణులందరూ హైదరాబాద్లో అందుబాటులో ఉన్నారు. ఎలాంటి కెమెరాలయినా ఇక్కడ రెడీగా ఉన్నాయి. దేశం మొత్తమ్మీద ముంబై తర్వాత హైదరాబాద్లోనే సినిమా ఎక్విప్మెంట్, మ్యాన్పవర్ ఉంది. అందుకే కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంమీద ఇక్కడ ఆసక్తి ఎక్కువగా నెలకొంది. ‘సలార్’తో మొదలు.. డిసెంబర్ చివరి వారం నుంచి వరుసగా పెద్ద సినిమాలు విడుదల కాబోతుంది. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రమిది. టికెట్ల రేట్లను పెంచి కలెక్షన్స్ని పెంచుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే..ఎలాగో అనుమతులు ఇస్తారు. ఒకవేళ కాంగ్రెస్ వస్తే మాత్రం అంత త్వరగా పర్మిషన్స్ ఇవ్వకపోవచ్చు. ఏదైనా రెండు వారాల్లోనే తెలియాలి. ఇక సలార్ తర్వాత సంక్రాంతికి హనుమాన్, గుంటూరుకారం లాంటి పెద్ద సినిమాలు వస్తున్నాయి. వీటికి కూడా టికెట్ల రేట్లు పెంచాల్సి వస్తుంది. సలార్ విషయంలో క్లారిటీ వస్తే.. సంక్రాంతి సినిమాలకు పెంపు ఉంటుందో లేదో తెలిసిపోతుంది. రేవంత్తో భేటీ? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చాయి. దీంతో తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని భావించి..ఇప్పటికే పలువురు నిర్మాతలు రేవంత్ రెడ్డిని కలిసినట్లు సమాచారం. టాలీవుడ్కి చెందిన ఓ బడా నిర్మాత తాజాగా రేవంత్తో భేటీ అయ్యాడు. ఆయన మర్యాదపూర్వకంగానే రేవంత్ని కలిసినట్లు తెలుస్తోంది. అలాగే పలువురు సినీ ప్రముఖులు సైతం రహస్యంగా రేవంత్ని కలిసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ..ఇండస్ట్రీకి అనుకూలంగానే వ్యవహరిస్తుందని సినీ పెద్దలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.మరి అధికారంలోకి వచ్చేది ఎవరనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టీ కాంగ్రెస్ బిగ్ప్లాన్.. అంతా ఆయన చేతుల్లోనే!
సాక్షి, హైదరాబాద్: డీకే శివకుమార్.. కర్ణాటక ఎన్నికల ఫలితాల సమయాల్లో, అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడల్లా ఎక్కువగా వినిపించే పేరు. నెగ్గిన అభ్యర్థుల్ని జంప్ కాకుండా.. సంక్షోభ సమయాల్లో పార్టీ ఎమ్మెల్యేలను ఏకతాటిపై ఉంచడంలో ఈయన ఎక్స్పర్ట్. అందుకే పాలిటిక్స్లో ట్రబుల్ షూటర్ అనే పేరొచ్చింది ఆయనకి. క్లిష్టపరిస్థితుల్లో పార్టీని ఆదుకునే డీకేఎస్.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కట్టబెట్టిన విజయం కాంగ్రెస్కు మరువలేనిది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ.. కాంగ్రెస్ అధిష్టానం ఆయన సేవల్ని మళ్లీ వినియోగించుకుంటోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డీకేఎస్ను నమ్ముకుంది. తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలోనూ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసి ప్రచారంలో పాల్గొన్నారాయన. కర్ణాటక సంక్షేమ రిఫరెన్స్తో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారాయన. ఇప్పుడు.. రేపు ఫలితాల సమయంలో ఆయన ఇక్కడే మకాం వేసి చక్రం తిప్పబోతున్నారు. మ్యాజిక్ ఫిగర్కు అటు ఇటుగా ఫలితాలు ఉంటే.. పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా బాధ్యత ఆయన చేతుల్లోకి వెళ్లింది. తెలంగాణ ఫలితాలు వెలువడ్డాక.. ఆ నెగ్గిన వాళ్లను బెంగళూరుకు తరలిస్తారనే ప్రచారం ఒకటి తొలుత నడిచింది. అయితే ఆ ఊహాగానాల్ని స్వయంగా డీకేఎస్ కొట్టిపారేశారు. ఎమ్మెల్యేలను ఎక్కడికి తరలించబోమని.. ఆ అవసరం లేదని అన్నారాయన. అలాగే.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతుండగా.. అంతకు ఒక్కరోజు ముందే ఆయన హైదరాబాద్లో ల్యాండ్ కానున్నారు. కాంగ్రెస్ బిగ్ప్లాన్ ఫలితాల రోజున తెలంగాణ కాంగ్రెస్ బిగ్ప్లాన్ అమలు చేయబోతోంది. ఏఐసీసీ ప్రతీ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడ్ని నియమించింది. సదరు అభ్యర్థి నెగ్గాక.. ఎమ్మెల్యే సర్టిఫికెట్తో ఆ పరిశీలకుడు నేరుగా హైదరాబాద్లోని తాజ్ కృష్ణా హోటల్కు తీసుకొస్తారు. అక్కడ డీకేఎస్ సమక్షంలోనే వాళ్లు ఉండనున్నారు. ఒకవేళ సంపూర్ణ మెజారిటీ వచ్చినా కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని డీకేఎస్ భావిస్తున్నారట. ఎమ్మెల్యేలను ఎట్టిపరిస్థితుల్లో ప్రలోభాలకు గురి కాకుండా చూసుకునే బాధ్యత ఇప్పుడే ఆయన స్వయంగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మాకు పూర్తి మెజారిటీ వస్తుంది. మేం ఎలాంటి క్యాంపు రాజకీయాలు పెట్టడం లేదు. కొంత మంది మా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మాకు సమాచారం ఉంది. కానీ, మా వాళ్లు పార్టీకి విధేయులు. లొంగరు..’’ డీకేఎస్ తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇదీ చదవండి: ఆగమెందుకు.. మళ్లీ మనమే -
ఏపీ రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఎంత?
తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ రాజకీయాలపై ఎంతవరకు ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధ, బాంధవ్యాలు, రాజకీయ అనుబంధాల నేపథ్యంలో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. నిజానికి తెలంగాణలో ఎలాంటి ఫలితం వచ్చినా ఏపీ రాజకీయాలపై పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏపీ రాజకీయ పరిస్థితులకు తెలంగాణ రాజకీయాలు భిన్నంగా ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన ప్రత్యర్ధులుగా ఉన్నాయి. ఏపీలో అందుకు భిన్నమైన వాతావరణం ఉంది. ఏపీలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క శాతం లోపే ఓట్లు ఉన్నాయని ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. ✍️వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ రాజకీయాలలో జోక్యం చేసుకోవడం లేదు. ఎవరైనా ఆ పార్టీ నేతలు ఒకరిద్దరు అక్కడ ఏదైనా చేస్తున్నా అది వారి వ్యక్తిగతం అని చెప్పాలి. బీఆర్ ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తుంటే, సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ అనధికారికంగా కాంగ్రెస్కు మద్దతు ఇస్తోంది. ఆ పార్టీకి సంబంధించి కొందరు కాంగ్రెస్ ర్యాలీలలో టీడీపీ జెండాలతో తిరుగుతున్నారు. అయినా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడా ఖండించలేదు. తమ మద్దతు ఎవరికి లేదని చెప్పలేదు. దాంతో కాంగ్రెస్కు ఆయన అనుకూలంగా ఉన్నారన్న సంకేతాలు వెళ్లాయి. ✍️తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తన పదవికి రాజీనామా చేస్తూ కాంగ్రెస్కు ఉపయోగపడాలని, అందుకే టీడీపీ శాసనసభ ఎన్నికలలో పోటీ చేయడం లేదని చంద్రబాబు చెప్పారని వెల్లడించారు. ఇక ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న పార్టీగా ఉన్న జనసేన మాత్రం తెలంగాణలో బీజేపీతో కలిసి ఎనిమిది చోట్ల పోటీ చేస్తోంది. బీజేపీ సభలలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగాలు చేశారు. బీజేపీతో పొత్తులో ఉంటూనే, హైదరాబాద్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడుతో భేటీ అవడం విశేషం. అయినా చంద్రబాబును తెలంగాణలో జనసేనకు మద్దతు ఇవ్వాలని కోరలేదు. చంద్రబాబు కూడా జనసేనను బలపరచండని టీడీపీ అభిమానులకు పిలుపు ఇవ్వలేదు. ఆ రకంగా సొంత పార్టీ అభ్యర్ధులకు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచారన్న అభిప్రాయం వస్తుంది. ✍️బీజేపీతో జనసేన తెలంగాణలో కలిసి ఏపీలో మాత్రం ఆ పార్టీతో కాపురం చేయకుండా టీడీపీతో సహజీవనం చేయడం రాజకీయాలలో వింతగా మారింది. దీనిని వావివరసలు లేని రాజకీయంగా వైసీపీ నేత పేర్ని నాని ఇప్పటికే విమర్శించారు. ఈ విధంగా చూస్తే తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం టీడీపీ, జనసేనలపైనే ఎక్కువగా ఉంటుంది. టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే టీడీపీ, జనసేనలకు షాక్ అవుతుంది. వారు కోరుకున్నట్లు కాంగ్రెస్ కాని, బీజేపీ కాని గెలవకపోతే వారికి నిరుత్సాహం అవుతుంది. చంద్రబాబు అరెస్టును బీఆర్ఎస్కు చెందిన కొందరు నేతలు కూడా ఖండించినా, టీడీపీ శ్రేణులు కాని, టీడీపీని ఓన్ చేసే ఒక సామాజికవర్గం వారు కాని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారన్న భావన ఉంది. ✍️బీఆర్ఎస్ గెలిస్తే ఏపీలో ఆటోమాటిక్గా వైసిపికి అడ్వాంటేజ్గా ఉండవచ్చన్నది వారి భయం అని చెబుతున్నారు. టీడీపీకి మద్దతు ఇచ్చే సామాజికవర్గం ఇలా వ్యవహరిస్తుండేసరికి కొందరు టీఆర్ఎస్ అభ్యర్ధులు ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానుల పేరుతో సమావేశాలు నిర్వహించి వారి మద్దతు అభ్యర్ధించడం విశేషం. టీఆర్ఎస్ గెలిస్తే సహజంగానే టీడీపీని వ్యతిరేకించే శక్తులకు సంతోషంగా ఉంటుంది. దీనివల్ల ఏపీలో వైసీపీకి పెద్ద ప్రయోజనం ఉండకపోయినా, తెలంగాణలో ఆ పార్టీ అభిమానులుగా ఉన్నవారిలో సంతృప్తి కలిగిస్తుంది. ఇప్పటికే పలు సర్వేలు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావచ్చని సూచిస్తున్నాయి. ఇది చంద్రబాబు అరెస్టు వల్ల వచ్చిన సానుభూతి అని టీడీపీ మద్దతు మీడియా ప్రచారం చేస్తుంది. ఆ వర్గం టివీ చానల్లో ఇప్పటికే దీనిపై చర్చ జరిగింది. ✍️కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఒక సర్వే సంస్థ ప్రతినిధి అదే చర్చలో తమకు చంద్రబాబు అరెస్టు సానుభూతి ప్రభావం ఎక్కడా కనిపించలేదని చెప్పడంతో ఆ టీవీవారు అవక్కాయ్యారు. అలాగే చంద్రబాబు బహిరంగంగా ఏ సంగతి చెప్పలేని నిస్సహాయస్థితి. ఆయన ఎప్పుడూ చేసే తెరచాటు రాజకీయం నెరపవచ్చు. సోషల్ మీడియాలో ఇదేదో తమ గొప్పగా కూడా ప్రచారం చేసుకున్నా ఆశ్చర్యం లేదు. అయినా ఏపీలో ఈ కారణంగా ఓట్లు వేస్తారని అనుకుంటే భ్రమే. అక్కడి పరిస్థితుల ఆధారంగానే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. జనసేన అభ్యర్ధులు ఎవరైనా ఒకరు గెలిస్తే అదే తమకు గొప్ప విజయంగా ఆ పార్టీవారు ప్రచారం చేసుకుంటారు. ✍️ఎవరూ గెలవకపోతే మాత్రం జనసేన నీరుకారిపోతుంది. దీంతో ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ బలం పై పూర్తి సంశయాలు వస్తాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారు పవన్ను చులకనగా తీసుకుని బాగా తక్కువ సీట్లు కేటాయించడానికి ప్రయత్నిస్తారు. కాగా టీడీపీ అభిమానులకు, కమ్మ సామాజికవర్గం వారికి కాపునాడు ఒక విజ్ఞప్తి చేసింది. దీని ప్రకారం కుకట్పల్లి వంటి నియోజకవర్గాలలో కమ్మ వారంతా జనసేనకు ఓట్లు వేయాలని కోరింది. కాని అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి కమ్మ వర్గం అయినందున వారిలో ఎక్కువమంది అటువైపే మొగ్గు చూపారని అంటున్నారు. తత్ఫలితంగా జనసేన అభ్యర్ధి అక్కడ ఓడిపోతే, ఈ రెండు పార్టీల మధ్య, ముఖ్యంగా కమ్మ, కాపు వర్గాల మధ్య అంతరం ఏర్పడుతుంది. ✍️జనసేనకు కమ్మ సామాజికవర్గం మద్దతు ఇవ్వనప్పుడు తాము ఏపీలో ఎందుకు టీడీపీకి మద్దతు ఇవ్వాలని కాపు సామాజికవర్గ నేతలు, జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తారు. దీనికి సమాధానం ఇవ్వడం పవన్కు కష్టం అవుతుంది. దాంతో ఈ రెండు పార్టీల పొత్తు మీద అనుమానాలు ఏర్పడతాయి. పవన్ కోరుకున్నట్లు టీడీపీకి ఎందుకు సరెండర్ అవ్వాలని అడుగుతారు. ఈ నేపథ్యంలో పవన్ ముందస్తుగా ఏపీలో పార్టీ సమావేశం జరిపి టీడీపీతో పొత్తు గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేయవద్దని కార్యకర్తలను హెచ్చరించారని భావించవచ్చు. కాంగ్రెస్ కనుక తెలంగాణలో గెలిస్తే టీడీపీలో కొంత ఆశ ఏర్పడుతుంది. ✍️తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రదానంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే దానిని చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకునే యత్నం చేస్తారు. దీనివల్ల ఏపీలో టీడీపీకి ఎంత ప్రయోజనం ఉంటుందో తెలియదు కాని, కొంత నష్టం కూడా ఉండవచ్చు. రేవంత్ మాత్రం తెలివిగా రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం ఉండదని,ప్రభుత్వాల మధ్య సంబంధాలు మామూలుగానే ఉంటాయని అంటున్నారు. పైగా చంద్రబాబు తనకు రాజకీయ గురువు కాదని, సహచరులమేనని ఇప్పటికే ఒక ఇంటర్వ్యులో ప్రకటించారు. ఆయన కూడా అనవసరంగా ఏపీతో కయ్యానికి వెళ్లడానికి వెనుకాడవచ్చు. ✍️బీజేపీ తెలంగాణలో గెలిచే అవకాశం కనబడడం లేదు. అయినా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన టీడీపీపై వారికి కోపం రావచ్చు. ఏపీలో బీజేపీతో కూడా కలవాలన్న టీడీపీ యోచనకు బ్రేక్ పడవచ్చు. కాని జనసేన వారు బీజేపీ నుంచి విడిపోయిన తర్వాతే టీడీపీతో పొత్తు పెట్టుకోవల్సి ఉంటుంది. దాని ప్రభావం కూడా ఆ రెండు పార్టీల సంబంధాలపై పడవచ్చు. ఏపీలో మాత్రం టీడీపీ, జనసేనలు ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్తో కలిసే అవకాశం లేదు. మరో విశ్లేషణ కూడా ఉంటుంది. ఒక వేళ తెలంగాణలో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ పార్టీల హామీలు వెంటనే అమలు చేయడం అసాధ్యమైన విషయం. ✍️ప్రత్యేకించి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అయితే మరీ కష్టం. ముందుగా రైతు బంధు కింద ఎకరాకు పదిహేనువేల చొప్పున ఇవ్వవలసి ఉంటుంది. అలాగే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయలేకపోయినా, వారిచ్చిన గ్యారంటీలను అమలు చేయకపోయినా ఆ పార్టీకి జనంలో వ్యతిరేకత వస్తుంది. ఏపీలో చంద్రబాబు కూడా అలాంటి వాగ్దానాలనే చేసినందున వాటిని జనం నమ్మని పరిస్థితి మరింత గట్టిగా ఏర్పడుతుంది. అందువల్ల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, రాకపోయినా ఇబ్బంది తెలుగుదేశం పార్టీకే అవుతుంది తప్ప వైసీపీపై పెద్ద ప్రభావం ఉండదు. ఎందుకంటే ఆ పార్టీ ఇప్పటికే తన వాగ్దానాలను దాదాపు పూర్తిగా అమలు చేసి జనంలో తిరుగుతోంది కనుక. ✍️ఏపీలో బీజేపీ ఎలాంటి వైఖరి అవలంభిస్తుందన్నది తేలవలసి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన టీడీపీతో ఏపీలో పొత్తుపెట్టుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వంటివారు కోరుకుంటుండవచ్చు. ఆ ప్రతిపాదనను పార్టీ హైకమాండ్ ఆమోదిస్తుందా? లేదా? అన్నది కూడా చూడవలసి ఉంటుంది. తెలంగాణలో బీజేపీకి మంచి ఓట్ షేర్ వస్తే ఏపీలో కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయవచ్చు. కాని అది అంత తేలికకాదు. కాకపోతే తెలుగుదేశం పార్టీకి బీజేపీతో ఎలా ఉండాలో తెలియక గందరగోళం అవుతుంది. ✍️బీజేపీని అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ద్వారా జగన్ ప్రభుత్వానికి ఇక్కట్లు సృష్టించాలన్న ప్లాన్ టీడీపీలో ఉంది. అది సాధ్యం కాకపోవచ్చు. ఇక వైసీపీ ఇప్పటికే టీడీపీ, జనసేనల కూటమిని, ఆ పార్టీకి బాకాలు ఊదే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలను ఎదుర్కోవడానికి సిద్దమైనందున తెలంగాణ ఫలితాలు ఎలా ఉన్నా పెద్ద సమస్య కాదు. మొదటినుంచి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. అంతేకాదు. టీఆర్ఎస్ రెండు టరమ్లు పాలన చేసింది కనుక సహజంగానే వైసీపీకి ఆ పాయింట్ కలిసి వస్తుంది. దీనిని బట్టి జాగ్రత్తగా పరిశీలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా దాని ప్రభావం తెలుగుదేశం, జనసేనలపైనే అధికంగా ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
స్ట్రాంగ్ రూమ్లో అభ్యర్థుల భవితవ్యం.. మూడంచెల భద్రత (ఫొటోలు)
-
తెలంగాణ లీడర్లు.. రిలాక్స్.. రిలాక్స్ (ఫొటోలు)
-
తెలంగాణ ఎన్నికలు.. నేటి అప్డేట్స్
జంగ్ తెలంగాణ.. అసెంబ్లీ ఎన్నికలు 2023 లైవ్ అప్డేట్స్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ రేపటి కౌంటింగ్ నేపథ్యంలో కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ హ్యట్రిక్ లోడింగ్ 3.0... వేడుకలకు సిద్ధంగా ఉండండి.. గెలుపుపై ధీమా Hattrick Loading 3.0 👍 Get ready to celebrate guys 🎉 pic.twitter.com/4wJRJujU4w — KTR (@KTRBRS) December 2, 2023 రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం లోని ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత 29 వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్ కిపంపించని అధికారులు.. విషయం తెలిసి ఆర్డీఓ కార్యాలయానికి భారీగా చేరుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ నాయకుల ఆందోళనతో కొద్ది సేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ లను స్ట్రాంగ్ రూమ్ కు తరలించిన అధికారులు పోస్టల్ బ్యాలెట్ తరలించిన తరువాతే ఇప్పుడు సీల్ వేసిన అధికారులు పోలింగ్ జరిగి రెండు రోజులు దాటినా స్ట్రాంగ్ రూమ్ కు తాళం లేకపోవడం కాంగ్రెస్ నాయకుల తీవ్ర అభ్యంతరం ఆర్డీఓ ను నిలదీస్తున్న కాంగ్రెస్ శ్రేణులు, ఉద్రిక్తత కర్ణాటక నుండి ఎమ్మెల్యేలను పిలిచిన కాంగ్రెస్ ఒక్కో నియోకవర్గానికి ఒక్కో ఎమ్మెల్యేను పంపనున్న కాంగ్రెస్ గెలిచిన అభ్యర్థులను హైదరాబాద్ తీసుకొని వచ్చే బాధ్యత గజ్వేల్ ఫలితాలు ఆలస్యం!: కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ రేపు తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 10గం. తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం గజ్వేల్ నియోజకవర్గం ఫలితం ఆలస్యంగా వెల్లడి పోటీ అభ్యర్థులు ఎక్కువగా(44 మంది) ఉండడమే కారణమన్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ రాత్రి 8గం. తర్వాతే గజ్వేల్ ఫలితం రావొచ్చనే అంచనా 23 రౌండ్లలో కౌంటింగ్ ఇప్పటికే మాక్ కౌంటింగ్ పూర్తైందన్న కలెక్టర్ చాలా ఇబ్బంది పెట్టారు: సీతక్క ములుగు జిల్లాలో క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యలు బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు, కుట్ర రాజకీయాలతో చాలా ఇబ్బంది పెట్టారు నన్ను ఆడబిడ్డల ములుగు ప్రజలు ఆదరించారు చిన్న పిల్లలు కూడా నాకే మద్దతు ఇచ్చి అక్కున చేర్చుకున్నారు నా జీవితానికి ఇంకేం కావాలి నా గెలుపుకోసం కష్టపడ్డ అందరికీ ధన్యవాదాలు నేనెప్పుడూ మీ సేవకు రాలినే నేను ములుగు ప్రజల వెంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమంతో అభివృద్ధి చేస్తాను నన్ను రీల్ అన్నారు. నేను కష్టకాలంలో ప్రజల వెంటే ఉన్నా వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పారు ఆడబిడ్డ ఉసురు తగులుతుంది మార్ఫింగ్ వీడియో, ఫోటోలతో దుష్ప్రచారం చేశారు నా కార్యకర్తలను పైసలతో కొనుగోలు చేసి తప్పుడు ప్రకటనలు ఇప్పించారు ఏ కష్టం వచ్చినా జనం వెంటే ఉంటా పార్లమెంట్ ఎన్నికల్లో రాహూల్ ప్రధాని అయ్యేలా కృషి చేస్తా ఎన్నికల్లో కష్ట పడ్డ అందరికీ కృతజ్ఞతలు వచ్చేది ఇందిరమ్మ రాజ్యం. వెలుగులే ప్రతి ఇంటా.. కేసీఆర్కు బైబై చెప్తున్నారు: షర్మిల ఫలితాల ముందర.. వైఎస్సార్టీపీ నేత షర్మిల స్పందన తెలంగాణ ప్రజలు కేసీఆర్కు బైబై చెప్పారని కామెంట్ బైబై కేసీఆర్ సూట్కేసును ప్రదర్శించిన షర్మిల కాంగ్రెస్లో సీఎం అభ్యర్థులుగా సమర్థులైనవాళ్లు ఉన్నారు ఉత్తమ్, భట్టిలాంటి వాళ్లు ఉన్నారు బ్లాక్మెయిలర్స్ మాత్రం ముఖ్యమంత్రి కాకూడదు సీఎం అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ వాళ్లు నిర్ణయించుకుంటారు సీఈవోను కలిసిన తర్వాత మీడియాతో కాంగ్రెస్ నేత ఉత్తమ్.. బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయిస్తున్నారు రూ.6 వేల కోట్లను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు బీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నిస్తోంది రైతు బంధు నిధుల్ని కాంట్రాక్టర్ల బిల్లులకు మళ్లిస్తున్నారు భూరికార్డులు మారుస్తున్నట్లు కూడా మాకు సమాచారం ఉంది రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని భూముల్ని ధరణి పోర్టల్లోకి మారుస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదు అసైన్డ్ భూముల రికార్డుల్ని మార్చకుండా చూడాలని సీఈవోను కోరాం ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని కోరాం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరాం మొత్తం నాలుగు అంశాలపై ఫిర్యాదు చేశాం రంగారెడ్డి జిల్లాలో ఆ మూడు నియోజకవర్గాల లెక్కింపు కోసం.. ఇబ్రహీంపట్నం సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ లో రేపు ఉదయం ప్రారంభంకానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇబ్రహీంపట్నం,మహేశ్వరం,కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు కౌంటింగ్ కేంద్రాల చుట్టూ మూడు అంచల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇబ్రహీం పట్నం నియోజకవర్గం 14 టేబుల్ 25 రౌండ్లు లెక్కింపు కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు విజయావకాశాలపై వీహెచ్ స్పందన తెలంగాణలో కాంగ్రెస్ విజయావకాశాలపై సీనియర్ నేత వీహెచ్ స్పందన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది దళితబంధు, డబుల్ బెడ్రూంల విషయంలో ప్రజలు విసిగిపోయారు మై హీరో: కవిత ట్వీట్ మై హీరో అంటూ తండ్రి కేసీఆర్ వీడియోను షేర్ చేసిన కవిత My hero❤️#KCR#JaiTelangana pic.twitter.com/LU5AEuOCi7 — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 2, 2023 ఈసీ కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఎన్నికల కమిషనర్తో కాంగ్రెస్ నేతల భేటీ ఈసీ కార్యాలయానికి వెళ్లిన రేవంత్రెడ్డి, మధు యాష్కీ, ఉత్తమ్, పొంగులేటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫిర్యాదు డిసెంబర్ 4న ఏర్పాటు చేయనున్న కేబినెట్ భేటీపైనా ఫిర్యాదు ప్రభుత్వ లావాదేవీలపై నిఘా ఉంచాలని ఫిర్యాదు చేయనున్న టీ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కీలక భేటీ హైదరాబాద్ హైదర్ గూడ ఎమ్మెల్యే. క్వార్టర్స్ లో భేటీ అయిన టీ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఇంఛార్జి మాణిక్రావ్ ఠాక్రే అధ్యకతన భేటీ అయిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పలువురు ముఖ్య నేతలు.. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ఫలితాల తర్వాత ఎలాంటి వ్యూహం అమలు చేయాలనేదాని పై చర్చ కౌటింగ్ నేపథ్యంలో రేపు తెలంగాణ అంతటా మద్యం దుకాణాలు బంద్ ఎల్బీ నగర్ ఏర్పాట్లు ఇలా.. రేపు జరగబోయే ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి ఎల్బీనగర్ నియోజకవర్గంకి సంబంధించి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలను, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన రాచకొండ సీపీ చౌహాన్, ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ మూడంచెల భద్రత నడుమ ఇండోర్ స్టేడియం ఎలాంటి ర్యాలీలు, విజయోస్తవ సంబురాలు చేయయూడదని ఇప్పటికే నేతలకు ఆదేశాలు కౌటింగ్ కేంద్రం చుట్టూ అరకిలోమీటరు దూరం వరకు 144 సెక్షన్ అమలు కౌంటింగ్.. కౌంట్డౌన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి రాష్ట్రవ్యాప్తంగా.. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 49 కేంద్రాల్లో కౌంటింగ్ ఉదయం 8గంటలకే తెరుచుకోనున్న బాక్స్లు తొలి అరగంట బ్యాలెట్.. ఆ తర్వాతే ఈవీఎంల్లో పోలైన ఓట్ల లెక్కింపు కౌంటింగ్ పై సీఈఓ వికాస్ రాజ్ టెలీ కాన్ఫరెన్స్ పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు కౌంటింగ్ ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించిన ఎన్నికల సంఘం ప్రధాన అధికారులు అప్రమత్తంగా ఉండండి: డీజీపీ రేపు జరుగనున్న ఓట్ల కౌంటింగ్ అప్రమత్తంగా ఉండాలని ఉన్నతస్థాయి అధికారులకు డీజీపీ అంజనీకుమార్ ఆదేశం కౌంటింగ్ ఏర్పాట్లపై సీపీలు, ఎస్పీలతో ఇవాళ డీజీపీ టెలీ కాన్ఫరెన్స్ అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు ఇలా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి పాల్వంచ అనుబోస్ ఇంజనీర్ కళాశాల లో స్ట్రాంగ్ రూం.. కౌంటింగ్ కేంద్రం అనుబోస్ కళాశాల వద్ద కేంద్ర బలగాలతో భద్రత నియోజకవర్గాల వారీగా కౌంటింగ్కు ఏర్పాట్లు.. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ళు పోలింగ్ బూత్ ల వారీగా రౌండ్స్ కేటాయింపు మొత్తం 80 రౌండ్లలో.. జిల్లా లోని 5 నియోజకవర్గాలలో కౌంటింగ్ పూర్తి చేయనున్న అధికారులు కొత్తగూడెం నియోజకవర్గంలోని 253 బూత్లలకు సంబంధించి 18 రౌండ్స్ లో కౌంటింగ్ ఇల్లందు నియోజకవర్గం లోని 241 బూత్ లలో 17 రౌండ్స్ లో కౌంటింగ్ పినపాక నియోజకవర్గం లోని 244 బూత్ లలో 17 రౌండ్స్ లో కౌంటింగ్ అశ్వారావుపేట నియోజకవర్గం లోని 184 బూత్ లలో 13 రౌండ్స్ లో కౌంటింగ్ భద్రాచలం నియోజకవర్గం లోని 176 బూత్ లలో 12 రౌండ్స్ లో కౌంటింగ్ జిల్లా లో భాగానే నమోదైన పోలింగ్ జిల్లా వ్యాప్తంగా 78.67 శాతం పోలింగ్ నమోదు జిల్లాలో అత్యధికంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో 80.13 శాతం పోలింగ్ నమోదు కౌంటింగ్ విధుల్లో.. 5,250 మంది సిబ్బంది క్లాస్ ఓటు బీఆర్ఎస్కే: పోచారం బీఆర్ఎస్ విజయావకాశాలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ స్పందన బీఆర్ఎస్కు 70-75 సీట్లు పక్కా మాస్-క్లాస్ ఓటర్ల పల్స్ వేరు క్లాస్ ఓటర్లంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారు సైలెంట్ ఓటు KCRకు అనుకూలంగా ఉంది కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు ఇలా.. కరీంనగర్ జిల్లా నాలుగు నియోజకవర్గాలు కరీంనగర్, చొప్పదండి, హుజురాబాద్, మానకొండూర్.. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ఒక్కో గదిలో 14 టేబుల్స్ ఏర్పాటు కరీంనగర్ ఓట్ల లెక్కింపు 28 రౌండ్లు మానకొండూరు ఓట్ల లెక్కింపు 23 రౌండ్లు చొప్పదండి ఓట్ల లెక్కింపు 24 రౌండ్లు హుజురాబాద్ ఓట్ల లెక్కింపు 22 రౌండ్లు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాలు... బద్దెనపల్లి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు.. వేములవాడ ఓట్ల లెక్కింపు 19 రౌండ్లు....పొస్టల్ బ్యాలెట్ కొసం 3 టేబుల్స్ సిరిసిల్ల ఓట్ల లెక్కింపు కొరకు 21 రౌండ్లు , పోస్టల్ బ్యాలెట్ కోసం 4 టేబుల్స్ ఏర్పాటు. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని మూడు నియోజకవర్గాలు.. మంథని జేఎన్టీయూ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు రామగుండం ఓట్ల లెక్కింపు కొరకు 14 టేబుల్స్, 11 రౌండ్లు పొస్టల్ బ్యాలెట్ కొసం 4 టేబుల్స్. పెద్దపల్లి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కొరకు 14 టేబుల్స్,15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ 4 టేబుల్స్ ఏర్పాటు మంథని ఓట్ల లెక్కింపు కొరకు 14 టేబుల్స్, 14 రౌండ్లలో లెక్కింపు పొస్టల్ బ్యాలెట్ కోసం 4 టేబుల్స్ ఏర్పాటు జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కొరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల కోసం వీఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు జగిత్యాల నియోజకవర్గం కోసం 14 టేబుల్స్ 13 రౌండ్లలొ ఓట్ల లెక్కింపు పొస్టల్ బ్యాలెట్ కోసం 4 టేబుల్స్ ఏర్పాటు కోరుట్ల నియోజకవర్గం కోసం14 టేబుల్స్ పై 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పొస్టల్ బ్యాలెట్ కోసం నాలుగు టెబుల్స్ ధర్మపురి నియోజకవర్గం కోసం 14 టేబుల్స్ 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పొస్టల్ బ్యాలెట్ కొసం నాలుగు టేబుల్స్ ఏర్పాటు బెట్టింగ్లో పొలం కూడా..? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోరుగా పందేలు అభ్యర్థుల గెలుపోటములు.. మెజార్టీ ఎంత సాధిస్తారనేదానిపై బెట్ యాప్ల సాయంతో నెలరోజులుగా బెట్టింగులు వేస్తున్న ముఠా సిర్పూర్లో లక్షల్లో బెట్టింగ్ డబ్బులతో పాటు పొలంపైనా పందేలు వేస్తున్న కొందరు తన రెండు ఎకరాల భూమిని పందేంలో ఉంచిన ఓ వ్యక్తి! బీజేపీ ధీమా ఏంటంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విచిత్ర పరిస్థితి పోలింగ్ ముందుదాకా ప్రభుత్వం రాబోతోందంటూ ప్రకటనలు ఆ స్టేట్మెంట్తోనే అగ్రనేతల హడావిడి ఎగ్జిట్పోల్స్తో ఢీలా పడ్డ పార్టీ కేడర్ తాజాగా బీజేపీ మరో ధీమా 2018 కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామంటూ లీడర్ల స్టేట్మెంట్లు ఓట్లు-సీట్లు పెరుగుతాయని అంచనా 2018లో కేవలం 14 లక్షల ఓట్లు ఈసారి మాత్రం పోలైన ఓట్లలో.. 20 శాతం ఓట్లు వస్తాయని బీజేపీ అంచనా ..అయినా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళనే! తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ భవితవ్యంపై టెన్షన్ పడుతున్న అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తామని.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ధీమా నిన్న ప్రగతి భవన్లో నేతలతో సమావేశం వార్ రూమ్ నివేదికపైనా సుదీర్ఘమైన చర్చ బయటకు వచ్చిన విక్టరీ సింబల్ చూపించిన కొందరు నేతలు హైదరాబాద్ దాటిన తర్వాత మళ్లీ గెలుస్తామా? లేదా? అని చర్చలు నేతల అధైర్యంతో.. కేడర్లోనూ ఆందోళన సీనియర్లలోనూ కొందరికి ఓటమి భయం? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కాంగ్రెస్లో జోష్ 10:06AM రేపు కాంగ్రెస్ బిగ్ ప్లాన్ రేపు డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి అభ్యర్థులు చేజారకుండా అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ రేపు కాంగ్రెస్ అభ్యర్థుల వెంట ఏఐసీసీ పరిశీలకులు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలను నేరుగా హైదరాబాద్ తాజ్కృష్ణకు తీసుకురానున్న పరిశీలకులు మంచి మెజారిటీ వస్తే నో క్యాంప్ ఇవాళే హైదరాబాద్కు కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ ఈ మొత్తం వ్యవహారాలను డీకే శివకుమార్కే అప్పగించిన అధిష్టానం హమ్మయ్యా.. ఇక రిలాక్స్ తెలంగాణలో రిలాక్స్ అవుతున్న పొలిటీషియన్స్ ఇంతకాలం ప్రచారంతో బిజీబిజీ రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలు.. ఇంటింటికి తిరిగి ప్రచారం అలసిపోయిన లీడర్లు పోలింగ్ ముగియడంతో ఇళ్లకు చేరుకున్న వైనం కుటుంబ సభ్యులతో గడుపుతూ కూల్ అవుతున్న నేతలు రేపు ఎలాగూ కౌంటింగ్ టెన్షన్ గ్యాలరీ కోసం క్లిక్ చేయండి ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు ఇలా.. ఖమ్మం జిల్లా లో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి తల్లంపాడు శ్రీ చైతన్య ఇంజనీర్ కళాశాల లో స్ట్రాంగ్ రూం.. అక్కడే కౌంటింగ్ కేంద్రం శ్రీ చైతన్య కళాశాల వద్ద కేంద్ర బలగాలతో భద్రత నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ కు ఏర్పట్లు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ళు పోలింగ్ బూత్ ల వారీగా రౌండ్స్ కేటాయింపు 104 రౌండ్లలో ఖమ్మం జిల్లా లోని 5 నియోజకవర్గాలలో కౌంటింగ్ పూర్తి చేయనున్న అధికారులు ఖమ్మం నియోజకవర్గం లోని 355 బూత్ లకు సంబంధించి 25 రౌండ్స్ లో కౌంటింగ్ పాలేరు నియోజకవర్గం లోని 289 బూత్ లలో 20 రౌండ్స్ లో కౌంటింగ్ మధిర నియోజకవర్గం లోని 268 బూత్ లలో 19 రౌండ్స్ లో కౌంటింగ్ వైరా నియోజకవర్గం లోని 252 బూత్ లలో 18 రౌండ్స్ లో కౌంటింగ్ సత్తుపల్లి నియోజకవర్గం లోని 292 బూత్ లలో 20 రౌండ్స్ లో కౌంటింగ్ జిల్లా లో భారీగా నమోదైన పోలింగ్ 5250 మంది సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్నారు జిల్లా వ్యాప్తంగా 83.83 శాతం పోలింగ్ నమోదు జిల్లా లో అత్యధికంగా పాలేరు నియోజకవర్గంలో 90.91 శాతం పోలింగ్ నమోదు కేసీఆర్పై నమ్మకం ఉంది సోషల్ మీడియాలో బీఆర్ఎస్కు అనుకూలంగా పలువురి పోస్టులు కేసీఆర్పై నమ్మకం ఉందంటూ వ్యాఖ్యలు ఎగ్జిట్పోల్స్ ఫలితాల నేపథ్యంతో ఢీలా పడిన బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే ప్రగతి భవన్ మీటింగ్ ధైర్యం నూరిపోసిన కేసీఆర్ అండ్ కేటీఆర్ ప్రజల కారువైపే ఉన్నారంటూ.. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామంటూ నేతలకు భరోసా ఎగ్జిట్ పోల్స్ చెత్త అంటూ ఖండన ఎగ్జాక్ట్(కచ్చితమైన) పోల్స్ తమకు అనుకూలంగా ఉంటాయంటూ ప్రకటనలు అదే సమయంలో కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విశ్వాసం 09:40 AM 20 రౌండ్లలో మహబూబాబాద్ కౌంటింగ్ మహబూబాబాద్ లోని సోషల్ వెల్ఫేర్ మహిళ గురుకులంలో రేపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయము 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం.మొదట పోస్టల్ బ్యాలెట్,మరియు హోం ఓటింగ్ ఓట్ల లెక్కింపు ఉదయం 8:30 నిమిషాలకు ఈవీయము ఓట్ల లెక్కింపు ప్రారంభం మహబూబాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో కలిపి 283 పోలింగ్ బూతులు కలవు,మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 53 వేల 342 పోలింగ్ శాతము 82.34.పోలైన ఓట్లు మొత్తం 2 లక్షల 8 వేల 958 ఓట్లు మొత్తం కౌంటింగ్ కి 14 టేబుల్స్ ఏర్పాటు,ఒక్కో టేబుల్ కి ఒక్కో ఈవీఎం లెక్కింపు, ప్రతి రౌండ్ కి 14 ఈవీఎం లెక్కింపు మొత్తం 20 రౌండ్లలో మహబూబాబాద్ కౌంటింగ్ ప్రతి రౌండ్ కౌంటింగ్ కి 20 నిమిషాల సమయము పట్టే అవకాశం మొదటి రౌండ్ పలితము కొద్దిగా ఆలస్యము అయ్యే అవకాశం 9:30 నిమిషాలకు మొదటి ఈవీఎం రిజల్ట్! మధ్యాహ్నాం 2 గంటల వరకు చివరి ఫలితం తేలే ఛాన్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు స్ట్రాంగ్ రూంలు ఉదయము 6 గంటలకే ఓపెన్ చేసే అవకాశం 09:23 AM జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి రేపు ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో కౌంటింగ్ కు ఏర్పాట్లు ఉదయం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్ తో ఓట్ల లెక్కింపు ప్రారంభం 14 టేబుల్స్ ఏర్పాటు చేసి 23 రౌండ్లలో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడి 14 టేబుళ్లలో ఒక్కో టేబుల్కు నలుగురు సిబ్బంది చొప్పున మొత్తం 56 మంది సిబ్బంది కౌంటింగ్లో పాల్గొంటారు. ముగ్గురు నోడల్ ఆఫీసర్లు, ఆరుగురు కౌంటింగ్ సూపర్వైజ ర్లు, 12మంది కౌంటింగ్ అసిస్టెంట్లు కౌంటింగ్ విధుల్లో పాల్గొంటారు. ఈవీఎంలను అంబేద్కర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు 09:15 AM కుట్ర జరుగుతోందంటూ కాంగ్రెస్ ఫిర్యాదు తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్(సీఈవో) వికాస్ రాజ్ను కలవనున్న టీ కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతోపాటు ముఖ్య నాయకులు కూడా ప్రస్తుత ప్రభుత్వం రైతు బంధు నిధులను కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపునకు మళ్లిస్తున్నారని ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ మెంట్ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే కుట్ర జరుగుతోందని ఫిర్యాదు ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని ఇటు హైదరాబాద్ లో అటు ఢిల్లీ లో ఎన్నికల సంఘం, ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామంటున్న కాంగ్రెస్ 07:59 AM తెలంగాణ ఫలితాలు.. కాయ్రాజా కాయ్! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోరుగా సాగుతున్న బెట్టింగులు? ఏపీలోనూ యాప్ల ద్వారా బెట్టింగ్లు సాగుతున్నట్లు సమాచారం గెలుపుపై అన్ని పార్టీల ధీమా ఎగ్జిట్పోల్స్ వచ్చాక.. రెట్టింపు అవుతున్న బెట్టింగ్ సొమ్ము ఫలానా పార్టీకి ఇన్ని సీట్లు అంటేనే బెట్ వేయాలంటూ జోరుగా పందేలు సామాజికవర్గాలు, అనుకూల,ప్రతికూల అంశాలపై లెక్కలేసుకుని మరీ.. కీలక నేతల గెలుపోటములపైనా భారీగా.. కీలక నేతల మెజార్టీ ఫిగర్పైనా బెట్టింగులు బెట్టింగ్ ముఠాలపై పోలీసుల నజర్ 07:31 AM ఆ అంచనాలు నిజం అవుతాయా? తప్పుతాయా? ఆసక్తికరంగా తెలంగాణ ఎగ్జిట్పోల్స్ ఫలితాలు కాంగ్రెస్కే ఎక్కువ అవకాశాలున్నాయంటూ మెజార్టీ సర్వే సంస్థల వెల్లడి పోలింగ్ ముగిసిన సాయంత్రం 5గం. వరకే అభిప్రాయ సేకరణ కానీ.. ఆ తర్వాత జరిగిన ఓటింగ్ తమకు కలిసొస్తుందంటున్న బీఆర్ఎస్ ఎగ్జిట్పోల్స్ ఫలితాలతో.. కాంగ్రెస్ సంబురాలు అధైర్య పడొద్దంటూ బీఆర్ఎస్ కేడర్కు కేసీఆర్ ధైర్యం ఎగ్జిట్పోల్స్ను రబ్బిష్ అంటూ కొట్టిపారేసిన కేటీఆర్ ఎగ్జిట్ పోల్స్ను తామూ తారుమారు చేస్తామంటూ బీజేపీ ప్రకటన ఫలితాలు షాకింగ్గా ఉంటాయంటూ బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలు 07:22 AM ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేపటి కౌంటింగ్ ఇలా.. ఉమ్మడి ఆదిలాబాద్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారుల ఏర్పాట్లు నాలుగు జిల్లాలో కౌంటింగ్ కేంద్రాలు ఇలా.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో టీటీడీసీ కేంద్రంలో ఆదిలాబాద్ , బోథ్ నియోజకవర్గాల ఓట్లను లెక్కించనున్న అధికారులు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లో పీవీటీజీ బాలికల పాఠశాలలో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మంచిర్యాల జిల్లా ముల్కల ఇంజనీరింగ్ కళశాలలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు ఓట్ల లెక్కింపు నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్మల్ , ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కౌంటింగ్ సందర్భంగా.. ఆయా కేంద్రాల వద్ద ఆంక్షల అమలు.. 144 సెక్షన్ విధింపు ఉదయం 6గం. నుంచి సాయంత్రం 6గం. ఆంక్షలు అమలు కౌంటింగ్ కేంద్రాల వద్ద సంబురాలు నిషేధం 7:16 AM కాంగ్రెస్ గెలవబోతోంది: రేవంత్రెడ్డి ఎగ్జిట్పోల్స్ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ వస్తుందనే ధీమా విజయం తమదేనంటూ నేతల సంబురాలు.. టీపీసీసీ రేవంత్రెడ్డి ఇంటికి క్యూ ఓట్ల లెక్కింపు వరకూ ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని రేవంత్ సూచన 9న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం.. అదే రోజు గ్యారంటీ హామీలపై మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంటుందంటూ నేతల ప్రకటనలు నేడు సీఈవో వికాస్రాజ్ను కలవనున్న టీ కాంగ్రెస్ నేతల బృందం ఓటమి భయంతో కేసీఆర్ రైతు బంధు నిధుల్ని దారి మళ్లిస్తున్నారనే ఆరోపణతో ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్ నేతలు 07:09 AM పటిష్ట భద్రత.. పక్కా ఏర్పాట్లతో కౌంటింగ్: సీఈవో వికాజ్రాజ్ స్ట్రాంగ్రూంలలో ఈవీఎంలు మొత్తం 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల బందోబస్తులో రేపు తేలనున్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం అభ్యర్థుల్లో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్జెండర్ పోలింగ్ అనంతరం అన్నింటినీ పార్టీ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్రూంలకు ఈవీఎంల తరలింపు స్ట్రాంగ్రూంలకు అన్ని రకాలుగా భద్రత చర్యలు సీసీ కెమెరాలు ఏర్పాటు 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు కౌంటింగ్ కోసం మొత్తం 1,766 టేబుల్స్ ఏర్పాటు ఒక్కొక్క నియోజకవర్గానికి ఉండే టేబుల్స్14 కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది జీహెచ్ఎంసీ పరిధిలో 500 పోలింగ్ కేంద్రాల కంటే ఎక్కువగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్స్, మిగిలిన నియోజకవర్గాల్లో 14 చొప్పున పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 500 ఓట్లకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా సమాంతరంగా కొనసాగింపు.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.80 లక్షల మంది ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగం ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం పోస్టల్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అరగంట తర్వాత.. 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు 07:00 AM మళ్లీ హైదరాబాద్కు డీకేఎస్ మళ్లీ తెలంగాణకు రానున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కౌంటింగ్.. ఫలితాల నేపథ్యంలో రేపు సాయంత్రం హైదరాబాద్కు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడిగా డీకేఎస్ను నియమించిన ఏఐసీసీ రిసార్ట్ రాజకీయాల అవసరం ఉండబోదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డీకేఎస్ 06:57 AM ఆగం కావొద్దు.. మనమే వస్తాం: కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎవరికి వారిలోనే ధీమా పార్టీ కేడర్ను ధైర్యం నూరిపోసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, నేతలతో నిన్న భేటీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి గాబరా పడొద్దు.. మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నామంటూ భరోసా ఫలితాలు వెల్లడయ్యే వరకూ ప్రశాంతంగా ఉండండి.. 3న అందరం కలిసి సంబరాలు చేసుకుందాం చివరి గంటలో జరిగిన పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఉండొచ్చని కేసీఆర్ అభిప్రాయం ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తూ విక్టరీ సింబల్ చూపించిన పలువురు నేతలు డిసెంబర్ 4వ తేదీన సచివాలయంలో కేబినెట్ భేటీకి సీఎం కేసీఆర్ నిర్ణయం 06:54 AM నగరంలో రేపు అక్కడ ఆంక్షలు ఆదివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా లెక్కింపు కేంద్రాల వద్ద ఆంక్షలు ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్లు ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో ఆంక్షలు కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు మైక్లు, మ్యూజిక్ సిస్టమ్, ప్రసంగాలు చేయడం, నిషేధిత ఫోటోలు, సింబల్స్, ప్లకార్డులు ప్రదర్శించకూడదు విధి నిర్వహణలో ఉన్న పోలీసు, మిలటరీ, ఎలక్షన్ అధికారులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు రోడ్లు, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై నిషేధం ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం మద్యం దుకాణాల బంద్ 06:40 AM రేపే కౌంటింగ్.. తెలంగాణలో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8గం. నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్ మధ్యాహ్నాం కల్లా ఫలితాలపై రానున్న క్లారిటీ తేలనున్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ వన్ సైడెడ్గా ఎగ్జిట్ పోల్స్ అయినా గెలుపుపై ఎవరికి వారే ధీమా 06:38 AM అత్యల్పంగా రాజధానిలోనే.. పోలింగ్ కేంద్రాలకు మోహం చాటేసిన రాజధాని వాసులు జిల్లా వారీగా.. హైదరాబాద్లో అత్యల్పంగా నమోదు అయిన పోలింగ్ కేవలం 47.88 శాతం మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గం వారీగా.. అత్యల్పంగా యాకుత్ పురాలో కేవలం 39.64 శాతం ఓటింగ్ మలక్పేట్లో 41.32 శాతం, చార్మినార్లో 43.27 శాతం, చాంద్రాయణగుట్టలో 45.26 శాతం బహదూర్ పురాలో 45.50 శాతం, జూబ్లీహిల్స్ లో 47.49 శాతం, అతిపెద్ద నియోజకవర్గం శేరిలింగంపల్లిలో 48.75 శాతం, ఎల్బీనగర్లో 49.07శాతం, కంటోన్మెంట్లో 49.36 శాతం పోలింగ్ మేడ్చల్ - మల్కాజ్ గిరిలో 56.17 శాతం, రంగారెడ్డిలో 59.94 శాతం, హన్మకొండలో 68.81 శాతం ఓటింగ్ 06:36 AM పోలింగ్ ఇలా.. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,02,793 మంది పోలింగ్ పాల్గొన్న 2,32,59,256 మంది ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్లలో.. .. 1,15,84,728 మంది పురుషులు, మహిళలు 1,16,73,722 మంది, ఇతరులు 806 మంది జిల్లాల వారీగా చూస్తే.. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 90.36 శాతం పోలింగ్ నియోజకవర్గాల వారీగా చూస్తే.. నల్గొండ మునుగోడులో 91.89 శాతం ఓటింగ్ ఖమ్మం పాలేరులో 90.89, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో 90.77 శాతం పోలింగ్ 06:32 AM ఫైనల్ ఓటింగ్ పర్సంటేజ్ ఇలా.. నవంబర్ 30వ తేదీ గురువారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7గం. నుంచి సాయంత్రం 5.గం దాకా.. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4గం. కే ముగింపు అప్పటికే లైన్లో ఉన్నవాళ్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రాత్రి 10:30గం. దాకా కూడా క్యూలో ఓటర్లు ఆలస్యంగా శుక్రవారం సాయంత్రం అధికారిక పోలింగ్ శాతం విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నమోదైన తుది పోలింగ్ శాతం 71.34 శాతం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ 73.37 శాతం నమోదు గతంలో కంటే రెండు శాతం పోలింగ్ తగ్గింది -
ప్లస్సా.. మైనస్సా..? ఫలితాలపై అభ్యర్థుల బెంగ!
సాక్షి, ఆదిలాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసింది. ఆదివారం ఫలితాలు రానున్నాయి. పోలింగ్ ముగిసిన సాయంత్రం నుంచే ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు గెలుపోటములపై బేరీజు వేసుకుంటున్నారు. ఏ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు వస్తాయి.. మిగతా పార్టీలకు ఎన్ని ఓట్లు పడతాయి.. స్వతంత్రులు ఏమైనా ఓట్లు చీలుస్తారా.. అక్కడ మనకు ప్లస్సా.. మైనస్సా.. ఇలాంటి లెక్కలు వేస్తున్నారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ అభ్యర్థులు ఎన్నికల సంగ్రామం నుంచి కొంత సేద తీరినట్టే తీరి.. మరో పక్క ఇంటికి వచ్చే నాయకులు, కార్యకర్తల నుంచి పోలింగ్ బూత్ల వారీగా పరిస్థితిపై విశ్లేషణ చేసుకుంటున్నారు. మండలం, గ్రామం, పట్టణం, వార్డు ఇలా అన్నీ స్థాయిల్లో ఆయా పోలింగ్ బూత్ల వారీగా క్షేత్రస్థాయిలో మన పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి.. ఇతర పార్టీలకు ఎన్ని ఓట్లు పడవచ్చు.. మన పరిస్థితి బాగుందా.. లేదా.. ఇలా లెక్కల్లో మునిగితేలారు. మహిళల ఓట్లే అధికంగా పోల్.. పురుషుల ఓట్ల కంటే మహిళల ఓట్లే అధికంగా పోలయ్యాయి. ఈ లెక్కన అభ్యర్థుల గెలుపోటముల్లో మహిళల ఓట్ల శాతం కీలకం కానుంది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో మహిళా ఓట్లే అధికంగా పోలయ్యాయి. కాగా, జిల్లాలో బోథ్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నంబర్ 177 బాబ్జీపేట్లో వంద శాతం ఓటింగ్ జరిగింది. జిల్లాలో వందశాతం ఓటింగ్ జరిగిన బూత్ ఇది ఒక్కటే కావడం విశేషం. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ ప్రభుత్వ బీసీ (బాలుర) కళాశాల వసతి గృహంలోని పోలింగ్ కేంద్రంలో అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. ఇక్కడ 47.86 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. జిల్లాలో ఇదీ పరిస్థితి.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో 1,85,862 ఓట్లు పోలయ్యాయి. 2018 ఎన్నికల్లో 1,65,793 ఓట్లు పోల్ కాగా బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న 44.56 శాతం ఓట్లు సాధించి గెలుపొందారు. ఈసారి ఈ నియోజకవర్గంలో ఫలితాలు ఎలా ఉండనున్నాయో.. ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో వేచి చూడాల్సిందే. బోథ్ నియోజకవర్గంలో 1,72,397 ఓట్లు ఈ ఎన్నికల్లో పోలయ్యాయి. 2018 ఎన్నికల్లో 1,54,487 ఓట్లు పోల్ కాగా, అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావు 38.19 శాతం ఓట్లు సాధించి గెలుపొందారు. ఈసారి ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సిందే. మొత్తంగా రిజల్ట్స్ డేకు ఒకరోజు మాత్రమే వ్యవధి ఉండగా అందరు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో పోలైన ఓట్లు: -మొత్తం ఓటర్లు: 4,48,374, -పోలైన ఓట్లు: 3,58,259, -శాతం: 79.86% పురుషులు, మహిళల ఓట్ల వివరాలు: ► పురుషుల ఓట్లు: 2,19,291 పోలైన ఓట్లు: 1,77,597 శాతం: 80.96% ► మహిళల ఓట్లు: 2,29,074 పోలైన ఓట్లు: 1,80,661 శాతం: 78.86% ఇవి చదవండి: కేసీఆర్ గజ్వేల్లో హ్యాట్రిక్ కొడతారా? -
ప్రశాంతంగా నిద్రపోయా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా. ఎగ్జిట్ పోల్స్లో ఏదో జరుగుతున్నట్లు చూపొచ్చు. కానీ ఎగ్జాక్ట్ పోల్స్ మాకు శుభవార్తను అందజేస్తాయి’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. శుక్రవారం ప్రగతిభవన్లోనే ఉన్న కేటీఆర్.. సీఎం కేసీఆర్తో జరిగిన భేటీలో పాల్గొన్నారు. అనంతరం అక్కడే ఉన్న మంత్రి హరీశ్రావు కూడా మాట్లాడుతూ..శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వంద రోజుల పాటు శ్రమించిన కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. -
కాంగ్రెస్కే పూర్తి మెజారిటీ.. ఇండియా టుడే సర్వే
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను సాధిస్తుందని ఇండియా టుడే– యాక్సిస్ మైఇండియా ఎగ్జిట్పోల్ సర్వే పేర్కొంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను.. అధికార బీఆర్ఎస్కు 36 శాతం ఓట్లతో 34–44 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ 42 శాతం ఓట్లతో 63–73 సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. బీజేపీకి 14శాతం ఓట్లతో 4 నుంచి 8 సీట్లు రావొచ్చని.. ఎంఐఎం 8శాతం ఓట్లతో 5–7 సీట్లు సాధించవచ్చని తెలిపింది. రాష్ట్రంలో గురువారం పోలింగ్ ముగియగానే.. జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ సర్వేలను విడుదల చేశాయి. చాలా వరకు కాంగ్రెస్ వైపు మొగ్గు ఉన్నట్టు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఇండియా టుడే– యాక్సిస్ మైఇండియా శుక్రవారం తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించింది. బీఆర్ఎస్ సర్కారుపై వివిధ వర్గాల ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత ఎగ్జిట్పోల్ సర్వేలో కనిపించిందని పేర్కొంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి మళ్లీ టికెట్ ఇవ్వడం, వారిపై స్థానికంగా నెలకొన్న తీవ్ర వ్యతిరేకత ప్రభావం చూపిందని విశ్లేషించింది. ప్రాంతాల వారీగా పరిశీలన జరిపి రాష్ట్రంలో ఉత్తర, మధ్య (సెంట్రల్), దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల వారీగా ఇండియాటుడే–యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేసింది. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగిందని.. హైదరాబాద్లో బీఆర్ఎస్దే పైచేయిగా ఉందని వివరించింది. దక్షిణ, మధ్య తెలంగాణలలో కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచిందని, ఈ ప్రాంతాల నుంచే ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ► ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్కు 13, కాంగ్రెస్కు 15, బీజేపీకి 5 సీట్లు రావొచ్చని పేర్కొంది. ► దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్కు 6, కాంగ్రెస్కు 27, బీజేపీకి ఒక స్థానం వస్తాయని అంచనా వేసింది. ► మధ్య తెలంగాణలో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 22 సీట్లు సాధించవచ్చని తెలిపింది. ► హైదరాబాద్లో బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 3, బీజేపీ 1, ఎంఐఎం 6 చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ► తెలంగాణ తదుపరి సీఎంగా కేసీఆర్ ఉంటే బాగుంటుందని 32శాతం మంది, రేవంత్రెడ్డి కావాలని 21 శాతం మంది, ఇతర కాంగ్రెస్ నాయకుడు సీఎం కావాలని 22 శాతం మంది, బీజేపీ నాయకుడు ఉంటే బాగుంటుందని 12 శాతం మంది తమ సర్వేలో పేర్కొన్నట్టు వెల్లడించింది. ఇండియా టుడే– యాక్సిస్ మైఇండియా ఎగ్జిట్పోల్ అంచనాలివీ పార్టీ-- సీట్లు-- ఓట్ల శాతం బీఆర్ఎస్ 34–44 32 శాతం కాంగ్రెస్ 63–73 42 శాతం బీజేపీ 4–8 14 శాతం ఇతరులు (ఎంఐఎం సహా) 5–8 (ఎంఐఎం–8%, ఇతరులు–4%) -
జిల్లాలో 6 నియోజక వర్గాలు.. తొలి ఫలితం మిర్యాలగూడదే!
నల్లగొండ: జిల్లాలో ఆరు నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అంతా సిద్ధమైంది. జిల్లా కేంద్రం సమీపంలోని మిర్యాలగూడ రోడ్డులో దుప్పలిపల్లి గ్రామ శివారులోని గోదాముల్లో జరగనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్లను లెక్కించనున్నారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్ల ఆధారంగా.. రౌండ్లు వారీగా కౌంటింగ్ జరగనుంది. మిర్యాలగూడ నియోజకవర్గం లెక్కింపు ప్రకియ 19 రౌండ్లలోనే పూర్తికానుండడంతో.. అక్కడి ఫలితమే మొదట వెలువడనుంది. లెక్కింపు ఇలా.. 3వ తేదీన ఉదయం 7 గంటలకు పోటీ చేసే అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్రూమ్లను తెరుస్తారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అవి పూర్తయిన తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పోస్టల్ ఓట్లు లెక్కింపు కోసం 4 టేబుళ్లను, సర్వీస్ ఓట్ల లెక్కింపునకు మరో టేబుళ్ల ఏర్పాటు చేశారు. రౌండ్ పూర్తయిన తర్వాత జనరల్ అబ్జర్వర్ అన్నీ పరిశీలించిన తర్వాతనే ఆ రౌండ్ ఫలితాలను వెల్లడించనున్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ర్యాండమైజ్గా ప్రతి నియోజకర్గంలో రెండు పోలింగ్ బూత్లలో వచ్చిన ఓట్లకు సంబంధించి ఈవీఎంల ఓట్లను. వీవీ ప్యాట్ల ఓట్లను సరి చూస్తారు. రెండు సమానంగా వస్తేనే.. తుది ఫలితాన్ని వెల్లడిస్తారు. దేవరకొండ ఫలితం 23 రౌండ్లలో.. జిల్లాలోని ఆరు నియోజక వర్గాల్లో దేవరకొండ నియోజక వర్గం మినహా మిగతా నియోజక వర్గాల్లో 22 రౌండ్లలోపే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. మునుగోడు, నకిరేకల్, నాగార్జునసాగర్ నియోజక వర్గాల్లో 22 రౌండ్లు, మిర్యాలగూడ 19, నల్లగొండ 21 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. దేవరకొండ నియోజకవర్గంలో 23వ రౌండ్లో కౌంటింగ్ పూర్తవుతుంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపునకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఒక రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేందుకు 20 నుంచి 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. అభ్యర్థులు తక్కువగా ఉన్న చోట 20 నిమిషాల్లోపే ప్రక్రియ పూర్తి కానుంది. మునుగోడులో అభ్యర్థులు అధికంగా ఉండటంతో లెక్కింపు ఆలస్యం కానుంది. భద్రతను పరిశీలించే అవకాశం.. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొదట స్టేట్ పోలీస్, రెండో విడతలో స్టేట్ ఆర్ముడు పోలీస్, స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీఏపీఎఫ్ బలగాలు భద్రత నిర్వహిస్తున్నాయి. స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏజెంట్లు, అభ్యర్థులు వాటిని పరిశీలించుకునేందుకు అవకాశం ఉంది. స్ట్రాంగ్ రూమ్ల బయట ఏర్పాటు చేసిన సెంటర్లోకి వెళ్లి అక్కడ సీసీ కెమెరాల ద్వారా భద్రతను చూసుకోవచ్చు. పకడ్బందీగా ఓట్ల లెక్కింపు.. కలెక్టర్ ఆర్వి.కర్ణన్ నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వి.కర్ణన్ తెలిపారు. శుక్రవారం ఆయన తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆదివారం ఉదయం 8 గంటలకు నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, మునుగోడు, నకిరేకల్, నాగార్జునసాగర్ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నట్లు తెలిపారు. ఒక్కో నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు ఒక్కో హాల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్నవారికే స్ట్రాంగ్ రూమ్స్లోకి అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇది చదవండి: పెరగని పోలింగ్.. ఈసారి 41,631 మంది ఓటుకు దూరం -
మ్యాజిక్ ఫిగర్.. ఎంతెంత దూరం?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి, ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో గెలుపోటములపై తీవ్ర చర్చ సాగుతోంది. ఈసారైనా అధికారంలోకి వస్తున్నామా, లేదా అన్నదానిపై అభ్యర్థులు, ముఖ్య నేతలు, పార్టీ కేడర్లో ఉత్కంఠ కనిపిస్తోంది. పోలింగ్ సరళి అనుకూలమనే లెక్కలు, ‘చేతి’కి మొగ్గు ఉందన్న ఎగ్జిట్పోల్స్ అంచనాలు నిజమవుతాయా, మ్యాజిక్ ఫిగర్ దాటి పవర్లోకి వస్తామా అన్న దానిపైనే శుక్రవారం పొద్దంతా కాంగ్రెస్ శ్రేణులు చర్చలతో గడిపాయి. కౌంటింగ్కు మరోరోజు ఉన్న నేపథ్యంలో.. ఎన్ని స్థానాల్లో గెలుస్తాం? ఎక్కడెక్కడ గట్టి పోటీ అవకాశముంది? ఎక్కడెక్కడ ఓడిపోవచ్చు? దక్షిణ తెలంగాణను నిజంగానే స్వీప్ చేస్తున్నామా? ఉత్తర తెలంగాణలో బలం పెరిగిందా? హైదరాబాద్, శివారు నియోజకవర్గాల పరిస్థితేంటి? అన్న అంశాలపై నేతలు లెక్కలు వేసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడి నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు ఇదే తీరు కావడం గమనార్హం. ఉత్కంఠలో అభ్యర్థులు ఎన్నికల్లో పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠలో ఉన్నారు. తాము గెలుస్తామా లేదా అన్నదానిపై లెక్కలు వేసుకుంటున్నారు. గ్రామ, మండల స్థాయి నేతలతో భేటీ అవుతూ.. ఏ గ్రా మంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి? అందులో తమ కు పడిన ఓట్లెన్ని? ఏ మండలంలో ఎంత మెజార్టీ వస్తుంది? ఎంత తక్కువ వస్తాయనే అంశాలతో క్షేత్రస్థాయిలో పోలింగ్ సరళిపై అంచనాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఆదివారం జరగనున్న కౌంటింగ్ కోసం ఏజెంట్లు, వారికి కావాల్సిన పత్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పోలింగ్ రోజున ఎంత జాగ్రత్తగా ఉన్నామో, కౌంటింగ్ కేంద్రాల్లోనూ అంతే జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడా తేడా రాకుండా కౌంటింగ్ను పరిశీలించాలని ఏజెంట్లకు సూచనలిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏఐసీసీతో సంప్రదింపులు తెలంగాణ ఫలితం సానుకూలంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో.. టీపీసీసీ నాయకత్వం ఎప్పటికప్పుడు ఏఐసీసీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తదితరులు తమ నియోజకవర్గాల నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. ఢిల్లీ పెద్దలతో టచ్లో ఉన్నారు. రాష్ట్రంలోని పరిస్థితిని వారికి వివరిస్తూ, ఏయే పరిణామాలు తలెత్తితే ఎలా ఎలా వ్యవహరించాలన్న దానిపై హైకమాండ్ నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. మరోవైపు వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా పోలింగ్ సరళిపై ఇచ్చిన నివేదికలో పార్టీకి అధికారం వస్తుందని పేర్కొన్నట్టు తెలిసింది. దీనికి అనుగుణంగా టీపీసీసీ నాయకత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. హైదరాబాద్లోని రేవంత్, భట్టి నివాసాలకు పలువురు పార్టీ నేతలు వెళ్లి చర్చలు జరిపారు. పోలింగ్ సరళి ఎలా జరిగింది? ఏ జిల్లాలో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయన్న దానిపై చర్చించారు. పూర్తి మెజార్టీ రాకుంటే ఏం చేద్దాం? ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా.. ఆదివారం వెలువడే ఫలితాల్లో పార్టీకి వచ్చే సీట్లను బట్టి పావులు ఏఐసీసీ, టీపీసీసీ ప్రణాళికలు రచిస్తున్నాయి. అధికారం చేపట్టేందుకు అవసరమైన దానికంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే ఎలాంటి సమస్యా ఉండదని నేతలు పేర్కొంటున్నారు. కానీ ఎక్కువ సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినా పూర్తి మెజార్టీ రాకుంటే.. గెలిచిన నాయకులందరినీ తక్షణమే కర్ణాటకకు తరలించి క్యాంపు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టిందని.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను హైదరాబాద్కు పంపాలని నిర్ణయించిందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. డీకే శివకుమార్ శనివారం మధ్యాహ్నం కల్లా హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. ఇక కొన్నిసీట్లు తక్కువపడితే ఎంఐఎం మద్దతు తీసుకోవాలా, వద్దా? అన్న అంశంపైనా ఏఐసీసీతో టీపీసీసీ నేతల సంప్రదింపుల సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. -
ఆగమెందుకు.. మళ్లీ మనమే: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘ఆగమాగం, పరేశాన్ ఎందుకు అయితున్నరు. మళ్లా మనమే గెలుస్తున్నం. ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందించబోతున్నాం. రెండు రోజులు నిమ్మళంగా ఉండండి. 3వ తేదీన అందరం కలసి సంబురాలు చేసుకుందాం..’’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పార్టీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం పొద్దంతా ఓటింగ్ సరళి, ఇతర అంశాలపై సమీక్షించిన సందర్భంగా నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఈ నెల 4న (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుందని సీఎంవో నుంచి ప్రకటన వెలువడింది. ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుండటంతో.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు, కేబినెట్ భేటీ నిర్వహణకు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రగతిభవన్కు బారులు తీరిన నేతలు సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ప్రగతిభవన్కు చేరుకోగా.. శుక్రవారం ఉదయం నుంచే బీఆర్ఎస్ నేతలు ప్రగతిభవన్కు బారులు తీరారు. పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, మంత్రి నిరంజన్రెడ్డి, మధుసూదనాచారి, బాల్క సుమన్తోపాటు నల్గొండ, హైదరాబాద్ తదితర జిల్లాలకు చెందిన నేతలు వచ్చి సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా ఆదివారం వెలువడే ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్కే సానుకూలంగా ఉంటాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్టు తెలిసింది. కేసీఆర్తో భేటీ తర్వాత ప్రగతిభవన్ నుంచి బయటకు వచ్చిన నేతలంతా.. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని పేర్కొనడం గమనార్హం. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత నివాసంలో భేటీ అయ్యారు. కేటీఆర్, హరీశ్రావులతో సమీక్ష పార్టీ అధినేత కేసీఆర్తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్రావు ఇద్దరూ ప్రగతిభవన్లో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. జిల్లాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా వార్రూమ్ల నుంచి, వివిధ వర్గాల నుంచి అందిన గణాంకాలు, నివేదికలతోపాటు నియోజకవర్గ ఇన్చార్జులు, అభ్యర్థుల నుంచి అందిన వివరాలను విశ్లేంచారు. కీలక నియోజకవర్గాలు గజ్వేల్, కామారెడ్డి, కొడంగల్లో ఓటింగ్ సరళిపైనా పోస్టుమార్టం చేశారు. పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకుతోపాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు బీఆర్ఎస్కు అనుకూలంగానే ఓటింగ్లో పాల్గొన్నారని ఈ సందర్భంగా కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. హంగ్ ఫలితాలకు అవకాశం లేదని, స్పష్టమైన మెజారిటీతోనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ కాదు.. ఎగ్జాక్ట్ పోల్స్ లెక్క! అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ తనను కలసిన నేతలతో పేర్కొన్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ పకడ్బందీగా చేసిన పోల్ మేనేజ్మెంట్తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో బీజేపీ చీల్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే బీఆర్ఎస్కే సానుకూలత ఉందని చెప్పినట్టు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ కాకుండా ఎగ్జాక్ట్ పోల్నే లెక్క అని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా పాటించాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారని.. ఏజెంట్ల నియామకం మొదలు ప్రక్రియ పూర్తయ్యేదాకా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారని సమాచారం. ఎన్నికల ఫలితాలు వెలువడే క్రమంలో పార్టీ అభ్యర్థులతో టచ్లో ఉండాలని కేటీఆర్, హరీశ్రావులకు సూచించారని తెలిసింది. -
పెరగని పోలింగ్.. ఈసారి 41,631 మంది ఓటుకు దూరం
అలంపూర్: అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. ప్రతి సారి ఓటర్లు పెరుగుతున్నారు. అందుకు అనువుగా పోలింగ్ శాతం పెరుగుతోంది. పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం జోరు ప్రచారాలతో ఓటర్లలలో అవగాహన కల్పిస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు చైతన్యంతో ముందుకు వస్తున్నారు. కానీ పోలింగ్ మాత్రం వంద శాతానికి దూరంగా ఉంటుంది. దీంతో గెలుపోటములపై తీవ్ర ప్రభా వం చూపే అవకాశం ఉంటుంది. 2009 సార్వత్రిక ఎన్నికల 1,88,678 మంది ఓటర్లు ఉండగా 1,29282 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 2,10,047 మంది ఓటర్లు ఉండగా 1,58,069 మంది ఓటు హక్కు వినియోగించకోవడం జరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,17, 157 మంది ఓటర్లు ఉండగా 1,79,683 మంది, 2023 ఎన్నికల్లో 2,37,938 మంది ఓటర్లు ఉండగా 1,96,307 మంది తమ ఓటు హక్కును వి నియోగించుకున్నారు. ఇదిలాఉండగా, 2009లో 59,396 మంది ఓటర్లు పోలింగ్కు దూరంగా ఉన్నారు. అలాగే, 2014లో 51,978 మంది, 2018లో 37,474 మంది, 2023 ఎన్నికల్లో 41,631 మంది ఓటర్లు పోలింగ్కు దూరంగా ఉన్నారు. ప్రతి సారి జరిగే ఎన్నికల్లో దాదాపు 15 నుంచి 20 శా తం మంది ఓటర్లు పోలింగ్కు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల సంఘం ప్రచారం మరింత విస్తృత పర్చాల్సిన అవసరం ఉంది. ఇది చదవండి: జిల్లాలో 06 నియోజక వర్గాలు.. తొలి ఫలితం మిర్యాలగూడదే! -
ఎన్నికల గ్యారంటీలు ‘జుమ్లా’లేనా?
దేశంలోని దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు తరచుగా చెప్పే మాట తమకు అధికారం ఇస్తే ప్రజలను సాధికారులుగా చేస్తాం అన్నది. అసలు సాధికారత (ఎంప వర్మెంట్) అంటే అర్థం ఏమిటి? దీనికి విస్తృతమైన అర్థాలు ఉన్నాయి. ముందుగా శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి లేదా అతని కుటుంబాన్ని బలోపేతం చేయడం, ఆ తర్వాత ఆ కుటుంబాన్ని సామాజికంగా బలోపేతం చేయడం అన్నది సాధికారతలో ఓ భాగం. కుటుంబాన్ని బలోపేతం చేయడ మనే ప్రక్రియ ఎలా జరుగుతుంది? ప్రతిరోజూ బలవర్ధకమైన ఆహారాన్ని వ్యక్తికి లేదా అతని కుటుంబానికి అందించాలి. వారు ఆరోగ్యంగా ఉండేటట్లు చూడాలి. అలా ఎంతకాలం చేయాలి? జీవితకాలంపాటు ఈ ప్రక్రియ కొనసాగాలి. కానీ, ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉండేది ఐదేళ్లపాటు మాత్రమే. ఐదేళ్లు ఉండే ప్రభుత్వం ఏ వ్యక్తినైనా, కుటుంబా న్నైనా, వర్గాన్నైనా జీవితకాలం పాటు పోషించలేదు కదా? అటువంటప్పుడు వారు సాధికారులు ఎలా అవుతారు?! ఆధునిక చైనా పితామహుడిగా చెప్పుకొనే డెంగ్ జియావో పింగ్ దీనినే ఓ ఉదాహరణ ద్వారా వివరించారు. ఆకలి గొన్న వ్యక్తికి రోజూ ఓ చేప చొప్పున ఇస్తూపోతే... అది ఇచ్చినంత కాలమే అతని ఆకలి తీరుతుంది. అదే అతనికి చేపలు పట్టే విద్య నేర్పించి, ఓ వలను ఇవ్వగలిగితే అతడు తన జీవితకాలం తన పొట్టను తానే పోషించుకొంటాడు. పైగా తన కుటుంబాన్ని సైతం ఆదుకోగలుగుతాడు. ప్రభు త్వాలు ప్రజలకు సంక్షేమం ఎలా ఇవ్వాలో సూక్ష్మంగా చెప్పాడు డెంగ్ ఈ ఉదాహరణ ద్వారా. ఇదే సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలో పెట్టడం ద్వారానే డెంగ్ తన పాలనలో చైనాను ప్రపంచంలో ఓ బలమైన ఆర్థిక శక్తిగా రూపొందించగలిగాడు. ప్రజల సమస్త వ్యక్తిగత, సామాజిక అవసరాలన్నింటినీ తామే తీర్చగలమన్న భ్రమల్ని వారిలో కల్పిస్తూ కొన్ని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకొంటున్నాయి. ఓట్ల కోసం హామీలు గుప్పించడం రాజకీయ పార్టీలకు రివాజుగా మారింది. అది ఇటీవలి కాలంలో మరింత వెర్రితలలు వేస్తోంది. వ్యవసాయరంగం మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణ; విద్య, వైద్యం వంటివి సామాన్యులకు అందుబాటులోకి తేవడం, శాంతి భద్రత లను పటిష్టపర్చి పారిశ్రామిక పెట్టుబడుల్ని ఆకర్షించడం ద్వారా నిరుద్యోగాన్ని పారద్రోలడం వంటి చర్యలు ఏ ప్రభుత్వానికైనా ప్రాధాన్యం కావాలి. మహిళలు, బాలలు, వృద్ధులకు తగిన సామాజిక సంరక్షణ కల్పించడం ప్రభు త్వాల బాధ్యత. వీటిపైన దృష్టి పెట్టగలిగితే ప్రజలను సాధికారుల్ని చేసినట్లే. భారతదేశం నిద్రపోతున్న ఓ ఆర్థిక దిగ్గజం (స్లీపింగ్ జెయింట్) అని 70వ దశకంలోనే నాటి సింగపూర్ అధ్యక్షుడు ‘లీ కువాన్ యు’ అన్నారు. 1991లో పీవీ నర సింహారావు దేశ ప్రధాని అయిన తర్వాత గానీ దేశానికి పట్టిన స్తబ్ధత వదలలేదు. దశాబ్దాలపాటు పట్టి పీడించిన కొన్ని జాడ్యాలను వదిలించుకొని ఆర్థిక వ్యవస్థ వడి వడిగా అడుగులు వేస్తూ... పీవీ – డా‘‘ మన్మోహన్ సింగ్ల ద్వయం చూపిన సంస్కరణల బాటలో ముందుకు సాగిన ప్రస్థానానికి దాదాపు 3 దశాబ్దాల వయస్సు. ఈ కాలంలో దేశం చాలా రంగాలలో అభివృద్ధి చెందిన మాట నిజం. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నది అన్నది కూడా ఓ వాస్తవం. అయితే, ఈ ప్రస్థానం ఏ దిశగా సాగుతోంది? దేశంలోని సహజ వనరులన్నీ ప్రజలందరికీ సమానంగా చెందాలన్న రాజ్యాంగ లక్ష్యాలకు, రాజ్యాంగ నిర్మాత డా‘‘ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు భిన్నంగా దేశ సంపద కొంత మంది పారిశ్రామిక వేత్తలకు దఖలు పడింది. ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్కు చెందిన ఇద్దరు లేదా ముగ్గురు మొదటి వరుసలో ఉండగా, మరో 10 మంది రెండో వరుసలో కనిపిస్తారు. అదే సమయంలో... ప్రపంచ ఆకలి సూచీలో 180 దేశాల జాబితాలో ఇండియా 165 –170 స్థానాల మధ్య ఊగిసలాడుతోంది. మనకంటే పొరుగునున్న ఆసియా దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్ ఆకలి సూచీలో మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఆర్థిక దిగ్గజమైన భారత్కు ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా? ఈ 3 దశాబ్దాలలో దేశ సంపద బాగా పెరిగింది. దేశ స్థూల ఉత్పత్తి 40 లక్షల కోట్లు దాటింది. అదే సమయంలో దేశంలో ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోయినట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. దేశంలో పేదలు మరింత పేదలయ్యారు. సంపన్నులు పైపైకి ఎగబాకుతున్నారు. ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన సోషలిజం స్థానంలో చాలాకాలంగా ‘పాపులిజం’ వచ్చి చేరింది. ‘అన్ని వర్గాలకూ అన్నీ’ అన్నదే పాపులిజం మూల సూత్రం. ఓట్లు రాల్చే ఈ ‘ఇజం’ చుట్టూనే నేటి రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. ఈ పాపులిజం ఇటీవలి కాలంలో వెర్రితలలు వేయడమే నేటి విషాదం! దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు ‘జాకబ్ జుమా’ పాపులిస్ట్గా మారి దేశాన్ని అప్పుల ఊబిలో నెట్టివేశారు. ఆ దేశ జీడిపీలో అప్పుల నిష్పత్తి 50 శాతం దాటిన నేపథ్యంలో... సొంత పార్టీ వారే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పదవి నుంచి దించి వేశారు. ‘జాకబ్ జుమా’ ఉదంతం ప్రపంచంలో అనేక దేశాలకు గుణపాఠం నేర్పింది. మొత్తం జీడీపీలో అప్పుల శాతం 24 శాతం మించరాదనీ, అదికూడా వృద్ధిరేటు 7 శాతం దాటినప్పుడే అది ఆమోదయోగ్యం కాగలదనీ ప్రముఖ ఆర్థికవేత్తలు నిగ్గు తేల్చారు. అయితే, భారత్లో కొన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి లెక్కల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అధికారం కోసం మొదట కర్ణాటకలో, ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలు, ఇతర హామీల విలువ కనీసం రెండు రాష్ట్రాల బడ్జెట్తో సమానం. ఇవి నెరవేర్చాలంటే ప్రజలపై అధికంగా పన్నులు వేయాలి, ఎఫ్.ఆర్.బి.ఎం.ను మించి అప్పులు తేవాలి. అవీ చాలక పోతే ప్రభుత్వ భూములు అమ్మాలి. ఇప్పటికే విలువైన ప్రభుత్వ భూములు చాలావరకు వేలంలో పోయాయి. భవి ష్యత్ అవసరాలకోసం తిరిగి భూములు కొనాల్సిన దుఃస్థితి ఇకపై రావొచ్చు. ఇక ఎటొచ్చీ, కొన్ని పథకాలను అమలు చేయకుండా మంగళం పాడొచ్చు. అలాగే ఎన్నికల ముందు ప్రకటించిన గ్యారంటీలను సైతం ఎత్తివేయవచ్చు. రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోకు ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడమే ఎడాపెడా హామీలు ప్రకటించడానికి కారణం అవుతోంది. మన దేశంలో రాజకీయ పార్టీల హామీల అంశంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకో వడానికి నిరాకరిస్తున్నాయి. అందువల్ల ఆకాశమే హద్దుగా కొన్ని రాజకీయ పార్టీలు హామీల సునామీ సృష్టిస్తున్నాయి. 2014లో బీజేపీ తన మేనిఫెస్టోలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అందిస్తామని చెప్పింది. విదేశాల్లో పోగుపడిన నల్ల ధనాన్ని వెనక్కి రప్పించి అందరి ఖాతాల్లో 15 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తామని బీజేపీ అగ్రనేతలు నమ్మకంగా చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ హామీల సంగతేమిటని కేంద్రమంతి ‘అమిత్ షా’ను నిలదీస్తే, అవన్నీ ‘ఎన్నికల జుమ్లా’ అని ఆయన ఒక్క మాటతో తేల్చేశారు. అంటే, ఎన్నికల సందర్భంలో ఎన్నో గాలి వాగ్దానాలు చేస్తుంటాం. వాటిని మీరు సీరియస్గా తీసుకొంటే ఎలా? అనే అర్థంలో కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. ప్రజలు ఈ ‘జుమ్లా’ మాటలు నమ్మడం లేదనే కారణంగానే ఇపుడు గ్యారెంటీలు ఇస్తున్నారు. సదరు గ్యారెంటీలు అమలు జరుగుతాయన్న గ్యారెంటీ కూడా లేదు. ఇదొక చేదు వాస్తవం. వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
తెలంగాణ ఫలితాలపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు!
బెంగళూరు : తెలంగాణ,మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఈ విషయమై ఆయన మాట్లాడారు. తెలంగాణ, మధ్యప్రదేశ్లో గెలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్టులకు తరలించే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవరూ కొనలేరని వారంతా పార్టీకి విధేయులని తెలిపారు. సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ను తాను నమ్మనని, తాను సొంత పోస్ట్ పోల్ సర్వేలు చేయిస్తానని డీకే చెప్పారు. తన సొంత సర్వే ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్కు పెద్ద వేవ్ ఉందన్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పవర్లోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలకు టచ్లోకి వచ్చారని చెప్పారు. అయితే కాంగ్రెస్ నేతలను కేసీఆర్ లాక్కోవడం ఈసారి కుదరదని తేల్చిచెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి డీకే శివకుమార్ ముఖ్య కారణమన్న విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ హై కమాండ్ డీకేకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను కూడా పరోక్షంగా అప్పగించింది. దీంతో ఆయన ఇటీవలే ముగిసిన తెలంగాణ ఎన్నికలపై ఎక్కువే ఫోకస్ చేశారు. తెలంగాణకు వచ్చి చాలా చోట్ల ప్రచారం కూడా చేశారు. తెలంగాణలో గెలిచే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు బెంగళూరు తరలిస్తారన్న ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. ఇదీచదవండి..హాట్ వింటర్పై ఐఎండీ కీలక అప్డేట్ ! -
ముచ్చటగా మూడోసారి ఖాయం..!
-
కాంగ్రెస్ ధీమాకి కారణం ఏంటి? జరగబోయేది అదేనా..?
-
ఇండియా టుడే ఎగ్జిట్పోల్స్.. తెలంగాణలో అధికారం ఎవరిదంటే?
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే పలు సర్వేలు ఆసక్తికర వివరాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా తెలంగాణ ఎన్నికలపై ఇండియా టుడే-మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ సర్వే కీలక నెంబర్లను వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు ఇండియా టుడే ఎగ్జిట్పోల్స్ పేర్కొంది. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. BRS.. 34-44 Congress.. 63-73 BJP.. 4-8 Others.. 5-8 ఇక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రానున్నట్టు స్పష్టం పేర్కొంది ఇండియా టుడే. బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు దాదాపు లేనట్టేనని ఇండియా టుడే తెలిపింది. ఇక, గురువారం ఎగ్జిట్పోల్స్లో పలు సర్వేలు కాంగ్రెస్, బీజేపీకి రెండింటికి ఛాన్స్ ఉందని తెలిపిన విషయం తెలిసిందే. According INDIA Today - Axis my India Congress winning 68 seats I. Telangana!#ExitPolls #ExitPolls2023 #ExitPoll pic.twitter.com/WoeSqLf8t1 — Ashish Singh (@AshishSinghKiJi) December 1, 2023 -
ఎగ్జిట్పోల్స్ ఎఫెక్ట్.. ‘వేల కోట్ల చెల్లింపులకు బీఆర్ఎస్ ప్లాన్!’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్పోల్స్ ఆసక్తికర ఫలితాలను వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రానున్నట్టు ఎక్కువ సంఖ్యలో పోల్స్ సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, తాజాగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్పోల్స్ తేల్చాయి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను దీవించారు. డిసెంబర్ మూడు తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం. పదేళ్లుగా బీఆర్ఎస్ నేతలు భూదోపిడీలకు పాల్పడ్డారు. లక్షల కోట్ల విలువైన భూములు ప్రజలకు, ప్రభుత్వానికి చెందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ధరణిని అడ్డుపెట్టుకుని హైదరాబాద్ పరిధిలో వేలాది ఎకరాలు దోచుకున్నారు. అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి అడ్డగోలు పనులు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. రెవెన్యూ వ్యవస్థను అప్రమత్తం చేస్తున్నాం. కాంట్రాక్టర్లకు వేల కోట్ల చెల్లింపులు ఈ రెండు, మూడు రోజుల్లో చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక ప్రభుత్వం నుండి మరొక ప్రభుత్వం మారుతున్న క్రమంలో ఇష్టరాజ్యoగా వ్యవహరించకుండా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం. రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అప్రమతంగా ఉండాలి. తెలంగాణలో గత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ధర్మపురి, హుజూర్ నగర్, మంచిర్యాల, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తిలో ఇబ్బందులు నెలకొన్నాయి. ప్రస్తుతం కోర్టులలో కేసులు కూడా ఇంకా నడుస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు కౌంటింగ్ పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు మార్పు కోసం తీసుకున్న నిర్ణయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఓటమి భయంతో రైతుబంధు నిధులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారు. కమీషన్ల కోసం రైతుబంధు నిధులు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ మెంట్ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే పక్రియ జరుగుతోంది. ప్రభుత్వ అన్ని ట్రాన్సాక్షన్స్పై నిఘా పెట్టాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం. ప్రభుత్వ ట్రాన్సాక్షన్పై విజిలెన్స్ నిఘా పెట్టాలని ఇటు హైదరాబాద్లో అటు ఢిల్లీలో ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ షాకింగ్ ట్విస్ట్.. డిసెంబర్ నాలుగున బీఆర్ఎస్ కేబినెట్ భేటీ -
కేసీఆర్ గెలుస్తారు.. లేదు వాళ్లదే విజయం.. కోట్లలో బెట్టింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఇక, ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్పోల్స్ సైతం ఆసక్తికర ఫలితాలను వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారం ఎవరిది అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. కొందరు నేతలు మాత్రమ ఎగ్జిట్పోల్స్ ఫైనల్ కాదు.. విజయం తమదంటే తమదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలపై ఏపీలో జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడుతుందని కొందరు.. లేదు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మరికొందరు జోరుగా పందాలు కాస్తున్నారు. వందల కోట్లతో తెలంగాణ ఫలితాలపై పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కోట్ల రూపాయల నగదు చేతులు మారుతున్నట్టు సమాచారం.. మరోవైపు.. రెండు సెగ్మెంట్లలో పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్కు ముఖ్యంగా గజ్వేల్లో ఎంత మెజార్టీ వస్తుందని కూడా బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగ్ ఖాస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా సిద్దిపేటలో ఈసారి మంత్రికి హారీశ్ రావుకి గతం కంటే ఎక్కువ వస్తుందా? లేదా తగ్గుతుందా అంటూ బెట్టింగ్ జరుగుతోంది. మరోవైపు కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతారా? లేదా గెలుస్తారా? అని కూడా తెలంగాణ, ఏపీలో భారీగా బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా ఖమ్మంలో కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేస్తుందంటూ మరో బెట్టింగ్ నడుస్తోంది. అలాగే, బీజేపీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది. ఏయే స్థానాల్లో గెలుస్తుందని కోట్లలో బెట్టింగ్ నడుస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
కౌంటింగ్కు సర్వం సిద్ధం.. ఈసారి ఉల్లంఘన కేసులు ఎన్నంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇక, ఓట్ల లెక్కింపు ఈనెల మూడో తేదీన(ఆదివారం) జరుగనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. దీంతో, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నలభై కంపెనీల బలగాలతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. అలాగే, స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో 1,766 లెక్కింపు టేబుళ్లు ప్లాన్ చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లను ఏర్పాటు చేయగా.. ఆరు నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అలాగే, ఉదయం 10 గంటలకు మొదటి ఫలితం వెల్లడవుతుందన్న ఈసీ పేర్కొంది. ప్రతీ టేబుల్పై మైక్రో అబ్జర్వర్.. కౌంటింగ్ సూపర్ వైజర్.. ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ఇక, ఎన్నికల నిబంధనలపై 2023లో 13 వేల కేసులు నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక, 2018 ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘనలపై 2,400 కేసులు అయినట్టు స్పష్టం చేశారు. -
Elections 2023: రిజల్ట్ చూద్దాం.. మజా చేద్దాం!
సినిమా కాదు.. క్రికెట్ మ్యాచ్ అంతకంటే కాదు కానీ, ఈ ఆదివారం సిసలైన మజాను కోట్ల మంది ఆస్వాదించబోతున్నారు ఎలాగంటారా?.. డిసెంబర్ 3.. రాజకీయ పార్టీలకు బిగ్డే చార్ పటాకా బద్ధలయ్యే రోజది మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్.. మూడు రాష్ట్రాల్లో రెండు ప్రధాన పార్టీల హోరాహోరీ పోరుపై నెలకొన్న ఆసక్తి ఇక ఇటు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, ప్రధాన పార్టీల నడుమ విజయధీమాలతో తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన వేళ.. ఓడేదెవరు? నెగ్గేదెవరనేది పక్కనపెడితే.. ఈ సూపర్ సండే మాంచి కిక్కు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.. రాజస్థాన్ చెరో దఫా ప్రభుత్వాల్ని ఇక్కడ కాంగ్రెస్-బీజేపీలు గత మూడు దశాబ్దాలుగా ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. అయితే.. గత మూడేళ్లుగా నడుస్తున్న గ్రూప్ రాజకీయాల నేపథ్యంలో ఈసారి రాజస్థాన్లో ఎవరు సర్కార్ను నెలకొల్పుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇప్పుడున్న రాజస్థాన్ అసెంబ్లీ గడువు జనవరి 14, 2024తో ముగియనుంది. ఈలోపు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసి అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. 200 స్థానాలు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీకి.. 199 స్థానాలకు(ఒక దగ్గర అభ్యర్థి మరణంతో ఎన్నిక నిలిపివేశారు) నవంబర్ 25వ తేదీన పోలింగ్ జరిగింది. మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 75.45% పోలింగ్ నమోదైంది. ప్రభుత్వ ఏర్పాటుకు 101 స్థానాలు రావాల్సి ఉంటుంది. ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాల ప్రభావం తమను మళ్లీ గెలిపిస్తుందని కాంగ్రెస్.. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో పేరుకుపోవడంతో పాటు తాము ఇచ్చిన ఎన్నికల హామీలకు ప్రజలు పట్టం కడతారని బీజేపీ గెలుపుపై ధీమాతో ఉన్నాయి. ఎగ్జిట్పోల్ ఫలితాలు హోరాహోరీ పోటీనే చూపిస్తున్నాయి ఇక్కడ. మధ్యప్రదేశ్ కిందటి ఎన్నికల్లో నెగ్గి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేశామనే సంతోషం కాంగ్రెస్కు రెండేళ్లే ఉంది. తిరుగుబావుటా నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిణామాలు.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో ఇప్పుడున్న అసెంబ్లీ గడువు జనవరి 6, 2024తో ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. నవంబర్ 17వ తేదీన పోలింగ్ జరిగింది. మొత్తంగా 5.6 కోట్ల ఓటర్లకుగానూ.. 77.15 శాతం నమోదు అయ్యింది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి.. ప్రభుత్వ ఏర్పాటుకు 116 సీట్లు రావాల్సి ఉంటుంది. మధ్యప్రదేశ్లో ఈ ఐదేళ్లలో రెండు ప్రభుత్వాలు వచ్చాయి. గత ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. రెండేళ్లు తిరగకముందే 22 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో కుప్పకూలింది. సరిపడా బలం కమల్నాథ్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ వెంటనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, కాంగ్రెస్లు ధీమాతో ఉన్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో సగం బీజేపీకి అనుకూలంగా.. సగం హంగ్ చూపిస్తుండగా.. ఓటర్ పల్స్ ఎలా ఉండనుందా? అనే ఆసక్తి నెలకొంది. ఛత్తీస్గఢ్ వరుసగా మూడు పర్యాయాలు(2003 నుంచి 2018 దాకా) సంపూర్ణ పాలన కొనసాగించిన బీజేపీకి చెక్ పెడుతూ కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ధీమా కాంగ్రెస్లో కనిపిస్తుంటే.. కంచుకోటను చేజిక్కించుకుని తీరతామంటూ బీజేపీ ధీమా కనబరుస్తోంది. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ గడువు జనవరి 3, 2024తో ముగియనుంది. ఈలోపు ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. రెండు ఫేజ్ల్లో నవంబర్ 7న, నవంబర్ 17న పోలింగ్ నిర్వహించింది ఈసీ. మొత్తం కోటి 63 లక్షల ఓటర్లు ఉండగా.. 76 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్గఢ్లో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 46 రావాలి. రూరల్ డెవలప్మెంట్ అనేది ప్రధాన అస్త్రంగా.. సంక్షేమ పథకాలను కాంగ్రెస్ నమ్ముకుంది. మరో వైపు అవినీతి ఆరోపణలు, మత మార్పిడులు, హామీలు నెరవేర్చకపోవడం వంటి అస్త్రాలను బీజేపీ సంధించింది. మరోవైపు.. అద్భుతం జరిగితేనే బీజేపీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ ఈ సారి అధికారం నిలబెట్టుకున్నా సీట్లు తగ్గే అవకాశముందని, ఇవేవీకావు.. బీజేపీ ఏకపక్షంగా నెగ్గుతుందని ఇలా రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి అక్కడ. ఈ తరుణంలో.ఎగ్జిట్ పోల్స్ సైతం ఛత్తీస్గఢ్లో హోరాహోరీ అంచనా వేస్తుండడంతో ఆసక్తి నెలకొంది. తెలంగాణ గత రెండు దఫాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. హ్యాట్రిక్ కొడతామంటోంది. ఈ పదేళ్లలో ఘోరంగా అవినీతి జరిగిందని.. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో తారాస్థాయికి వెళ్లిందని.. అది తమకు అధికారం కట్టబెడుతుందని ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలు చెప్పుకుంటున్నాయి. సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు.. ఈలోపే ఏకపక్షంగా వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. గెలుపుపై ఎవరికి వాళ్లే వ్యక్తం చేస్తున్న ధీమా పరిణామాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ సస్పెన్స్ థ్రిల్లర్ను మరిపించడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మూడో అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఇప్పుడున్న అసెంబ్లీ కాలపరిమితి జనవరి 16, 2024తో ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 30 తేదీన పోలింగ్ జరిగింది. మొత్తం 3.26 కోట్ల ఓటర్లు ఉండగా.. 70 శాతం పైనే ఓటింగ్ నమోదు అయ్యిందని అంచనా. అంటే.. దాదాపు కోటి మంది దాకా పోలింగ్కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీకి 119 స్థానాలు ఉండగా.. అధికారం ఏర్పాటు చేయాలంటే 60 సీట్ల మెజారిటీ అవసరం. పదేళ్ల పాలన ప్రచార అస్త్రంగా బీఆర్ఎస్.. అత్యధిక సీట్లతో, మూడోసారి విజయంతో రికార్డు నెలకొల్పుతామని అంటోంది. ఇక ఈ పాలనలోనే జరగని అవినీతి లేదంటూ బీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారంతో కాంగ్రెస్, బీజేపీలు ప్రజల్లోకి వెళ్లాయి. సర్వేలు ఒకలా.. ఎగ్జిట్పోల్స్ మరోలా రావడంతో ఓటర్ పల్స్పై గందరగోళమే నెలకొంది. పైగా సాయంత్రం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడంతో.. తెలంగాణలో ఈసారి ఓటింగ్ గెలుపోటములను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇస్తారనే తెలంగాణ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఆ బెట్టింగ్స్ తారాస్థాయికి చేరాయంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఏమేర ఉత్కంఠ నెలకొందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద.. ఈ ఆదివారం డిసెంబర్ 3న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ.. ఫలితాల వెల్లడి.. నాయకుల గెలుపొటములతో.. పార్టల సంబురాలు-నిరుత్సాహాలతో కోట్ల మందికి(ప్రత్యేకించి ఓటర్లకు..) ఇత్యాది పరిణామాలు మస్త్ మజాను అందించబోతున్నాయి! -
ఖమ్మంలో ఎవరిదో పైచేయి?
ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థులు ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారింది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో ఉండగా.. బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో ఇక్కడ లోకల్ గా పొలిటికల్ వార్ రంజుగా మారింది. ఒకరికొకరు సై అంటే సయ్యంటూ ప్రచారం సాగించారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3,15, 801 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుష ఓటర్లు 1,51, 673 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,64, 006 మంది ఉండగా, ట్రాన్స్ జెండర్లు 47 మంది ఉన్నారు. ఇందులో సుమార 48 వేల ఓట్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినవే ఉన్నాయి. మొత్తం ఓట్లలో కమ్మ ఓట్ల సంఖ్య తక్కువే అయినా... ఆ సామాజికవర్గం ఇతరులను ప్రభావితం చేయగలుగుతుందనే అంచనాతోనే ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి మద్దతు కోసం ఆరాటపడుతున్నారు. అందుకే వారి ఓట్లు, వారు ప్రభావితం చేయగలిగే ఓట్లే ఖమ్మం సీటులో గెలుపు ఓటముల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. అటు గులాబీ పార్టీ.. ఇటు హస్తం పార్టీల అభ్యర్థులు కమ్మ సామాజిక వర్గం వారే కావడంతో ఆ వర్గం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే చర్చ ఖమ్మంలో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే నువ్వా నేనా అన్న రీతిలో ముఖాముఖీ తలపడ్డాయి. 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పువ్వాడ అజయ్కుమార్...టీడీపీ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావును సుమారు 6 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఆ తర్వాత ఇద్దరూ గులాబీ పార్టీలో చేరిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 సాధారణ ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల మళ్ళీ ఓటమి చెందారు. పువ్వాడ అజయ్ 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి విజయం సాధించి కేసీఆర్ రెండో మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. ప్రస్తుతం కాంగ్రెస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ తన పాత ప్రత్యర్థితోనే ఖమ్మంలో తలపడ్డారు. ఇక బీజేపీ-జనసేనల పొత్తులో భాగంగా ఇక్కడ జనసేనకు టికెట్ కేటాయించారు. జనసేన తరఫున మిర్యాల రామకృష్ణ బరిలో నిలిచారు. ఇక సీపీఎం నుంచి యర్ర శ్రీకాంత్ పోరుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్తో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం నేరుగా పోరుకు దిగింది. -
Election Results: ప్చ్.. ఎగ్జిట్ ఎవరికో?
అది 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల టైం. దశలవారీగా పోలింగ్ జరుగుతూ వస్తోంది. ఫలితాలకు కొన్నిరోజుల ముందు దాదాపుగా ఓ 20 సర్వే సంస్థలు ఎగేసుకుని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేశాయి. అందులో సగానికిపైనే బీజేపీ 90కిపైనే స్థానాలు సాధిస్తుందని.. మరికొన్నేమో ఏకంగా బంపర్ విక్టరీ సాధిస్తుందని చాటింపేసుకున్నాయి. తీరా ఫలితాలు చూస్తే ఒకటి, రెండు సర్వేలు మాత్రమే ఆ అంచనాల్ని అందుకోగా.. మిగతావన్నీ బొక్కాబోర్లా పడ్డాయి. బీజేపీ 77 సీట్లు మాత్రమే సాధించి ప్రతిపక్షంలో కూర్చుంది. ఎగ్జిట్పోల్స్ వచ్చేశాయోచ్.. అని అవి పట్టుకుని అటు బిజీబిజీ చర్చావేదికల్లో పాల్గొనే నేతలు, ఇటు గుంపుగా గుమిగూడి ఓ తెగ మాట్లాడేసుకునే జనాలు.. ఎవరు గెలుస్తారనేది చెప్పేశాం, మా బాధ్యత తీరింది అని చేతులు దులిపేసుకునే సర్వే సంస్థలు.. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో కనిపిస్తున్న దృశ్యాలివే. మరి తీరా ఫలితం వచ్చాక ఆ అంచనాలు సరిపోలుతాయా? అంటే.. తలకిందులే అయిన సందర్భాలు అనేకం ఉన్నాయని గతం గుర్తు చేస్తోంది. 2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో వెలువడిన ఎగ్జిట్పోల్స్ను, అసలు ఫలితాలను గమనిస్తే... చాలా సంస్థలు ఓటరు నాడిని పసిగట్టడంలో బోల్తా పడ్డాయని అర్థమైపోతుంది. ఆ టైంలో ప్రముఖ ఛాన్సెల్స్ ఎగ్జిట్ పోల్స్ సగటుకు, అసలు ఫలితాలకు భారీతేడా కనిపించింది. అప్పట్లో ఈ సంస్థలన్నీ ఎన్డీయే కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేస్తే.. యూపీఏకు అధికంగా సీట్లు వచ్చాయి. అప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో.. ఎగ్జిట్పోల్స్ ఎక్కువసార్లు అంచనాల్ని అందుకోలేకపోతూ వస్తున్నాయి. పక్కా ఫలితం.. అంత వీజీ కాదు ఎగ్జిట్పోల్స్కు కచ్చితత్వం.. శాస్త్రీయతలు ఉన్నాయా?.. ఆ సంగతిని పక్కనపెడితే.. మీడియా సంస్థలపై ఎగ్జిట్ పోల్స్ ఒత్తిడి మాత్రం నానాటికీ పెరుగుతోంది. ఓటర్ పల్స్ ఏంటన్నది టీవీ ఛానళ్లకు కచ్చితంగా దొరకడం లేదు. పైగా ఎన్నికల సంఘం ఆంక్షల నుంచి అభిప్రాయ సేకరణకు సవాళ్లు ఎదురవుతున్నాయి. అంతా అయ్యాక చూస్తే.. ఓటర్ ఏకంగా ‘అంతరిక్ష పల్టీ’ కొడుతున్నాడు. ఓటు వేసేది ఒకరికని అభిప్రాయ సేకరణలో చెప్పి.. పోలింగ్ టైంలో మరొకరి వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్లో జరిగేది ఏంటంటే.. ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం రెండున్నర లక్షలకు పైగా ఓటర్లు ఉంటారు. కానీ, ఓటర్ సర్వే సంస్థలు మాత్రం కేవలం ఒక్క శాతం, రెండు శాతమో అభిప్రాయం మాత్రమే తీసుకుంటాయి. అలాంటప్పుడు.. ఫలితం పక్కాగా వస్తుందా? సారీ తప్పైంది! ఎగ్జిట్ పోల్స్ అనేవి అంచనాలు. ఒక్కోసారి ఆ అంచనాలు అందుకోవచ్చు.. లేదంటే దరిదాపుల్లో ఉండొచ్చు. కానీ, ఓటర్ నాడి పసిగట్టలేక ఎగ్జిట్ పోల్స్ తప్పైన సందర్భాలే ఎక్కువున్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే ఆ ఎగ్జిట్పోల్స్ తీవ్ర విమర్శలకు దారి తీశాయి కూడా. ఉదాహరణకు 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎగ్జిట్పోల్స్ అంచనాలన్నీ తప్పాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో ఎన్డీటీవీ ఒక అడుగు ముందుకేసింది. ‘‘క్షేత్రస్థాయిలో జరిగిన సమాచార సేకరణ మొత్తం తప్పైంది. తప్పు ఎక్కడ జరిగిందో పరిశీలిస్తున్నాం. పూర్తి బాధ్యత మాదే.. క్షమించండి..’’ అంటూ ఎన్డీటీవీ కో చైర్పరసన్ ప్రణోయ్ రాయ్ బహిరంగ ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఆ మీడియా సంస్థ ఎగ్జిట్పోల్స్కు దూరంగా ఉంటూ వస్తోంది. #BiharResults Final party wise breakdown: RJD 80, JDU 71, BJP 53, INC 27, LJP 2, RLSP 2, HAM 1, CPI 3, Independent 4 — ANI (@ANI) November 8, 2015 సర్వే సంస్థల్లో లోపిస్తోన్న అంశాలు వయస్సు పరంగా ఓటర్లను కలవాలి (యువత, వృద్ధులు, మధ్య వయస్సు) వృత్తి పరంగా ఓటర్లను కలవాలి (రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు) మతం ప్రాతిపదిక తీసుకోవాలి (హిందూ, ముస్లిం, క్రిస్టియన్) కులం ప్రాతిపదిక ఉండాలి (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ) జెండర్ ప్రాతిపదిక ఉండాలి (పురుషులు వేరు, మహిళల ఓటు తీరు వేరు) ప్రాంతం అత్యంత కీలకం (నగరం, పట్టణం, గ్రామం, కొండ ప్రాంతం, అటవీ సమీప ప్రాంతం) ఓటర్లకు విసుగెత్తి.. ప్రస్తుతం మార్కెట్లో సర్వే చేస్తోన్న సంస్థలో శాస్త్రీయత లోపించడం ప్రధానంగా కనిపిస్తోంది. అలాగే.. సర్వే చేపడుతున్న సెఫాలజిస్టుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. ప్రశ్నల్లో స్పష్టత లేకపోవడంతో.. ఓటర్లు ఆ సమయానికి ఏదో ఒకటి చెప్పేస్తున్నారు. ఈ విషయంలో చాలా సార్లు లోపం కనిపిస్తోంది. పైగా ఓటరు కచ్చితంగా ఎటు ఓటు వేస్తాడనే దానిపై పక్కా అభిప్రాయం రాబట్టాలని.. చాలా ఎక్సర్ సైజ్ చేస్తున్నారు. మరోవైపు ఫోన్ల ద్వారా జరిగే సర్వేల సంగతి సరేసరి. పదే పదే ఓటర్లకు ఫోన్లు చేసి విసిగిస్తున్నాయి సర్వే సంస్థలు. దీంతో సాధారణంగానే చికాకులో ఉండే ఓటర్లు ఏదో ఒక సమాధానం చెప్తున్నారు. విద్యార్థుల్ని ఇలాంటి వ్యవహారాల్లో భాగస్వామ్యం చేస్తున్నాయి సర్వే సంస్థలు. దీంతో అసలు ఫలితం చాలా సార్లు తేడా కొడుతోంది. ఈసీ ఏమందంటే.. ఎగ్జిట్ పోల్స్పై కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనూ స్పందించింది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఎస్వై ఖురేషీ స్పందిస్తూ.. ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అనేవి తెర వెనుక వ్యవహారాలు. వాటిని అసలు అనుమతించకూడదని అన్నారు. ‘‘స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలకు ఇవి కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. రాజకీయ పార్టీలు కూడా వీటిని వ్యతిరేకించారనే విషయాన్ని ఆ సందర్భంలో ఆయన గుర్తు చేశారు కూడా. నేతలది అలాంటి మాటే.. తమకు అనుకూలంగా వస్తే మంచిది. లేకుంటే చెడ్డది. ఎక్కడైనా ఇది కనిపించే తంతే. అయితే.. ఎగ్జిట్పోల్స్ విషయంలో రాజకీయ పార్టీలు ప్రతికూల వ్యాఖ్యలు చేసిన సందర్భాలే అనేకం. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్పోల్స్ను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రబ్బిష్.. న్యూసెన్స్ అంటూనే ఎగ్జిట్ పోల్స్కు అంత శాస్త్రీయత ఉందని తాము అనుకోవట్లేదని, పోలింగ్ జరుగుతుండగానే ఎగ్జిట్ పోల్స్ సర్వే జరుగుతుందనే విషయాన్ని ప్రస్తావించారు. వాస్తవానికి ఆ వాదనలోనూ వాస్తవం లేకపోలేదు. పోలింగ్ సమయం అధికారికంగా ముగిసింది సాయంత్రం ఐదు గంటలకు. అర గంట తర్వాత ఎగ్జిట్పోల్స్ బయటకు వచ్చాయి. కానీ, తెలంగాణలో పోలింగ్ కోసం ఓటర్లు సాయంత్రమే ఎక్కువగా వచ్చారని.. రాత్రి 10 గంటలదాకా ఓటింగ్ జరిగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ లెక్కన ఎగ్జిట్ పోల్స్ను నమ్మొచ్చా?.. పోనీ ఆ అంచనాలే ఫలిస్తాయా?.. తెలియాలంటే డిసెంబర్ 3 దాకా వేచి చూడాల్సిందే. -
గ్రేటర్ హైదరాబాద్లో గెలిచిన పార్టీదే అధికారం? ఏ పార్టీదంటే..!
-
దుమ్ము రేపేదెవరు... దమ్ము చాటేదెవరు
-
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొనసాగుతున్న ఉత్కంఠ
-
కేటీఆర్పై సీపీఐ నారాయణ విమర్శలు
-
తెలంగాణలో రీపోలింగ్కు అవకాశమే లేదు: సీఈవో వికాస్రాజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ మూడో తేదీన విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల విధానంపై సీఈవో వికాస్రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ స్క్రూటినీ ముగిసిన తర్వాత సీఈవో వికాస్రాజ్ వివరాలు వెల్లడించారు. ‘తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 18-19 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్లు 3.06 శాతం ఉన్నారు. తెలంగాణలో 71.01 శాతం పోలింగ్ జరిగింది. లక్షా 80వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 పోలింగ్ జరిగింది. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 46.68 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. 2018లో పోలింగ్ 73.37 శాతం పోలింగ్ నమోదు అయ్యినట్టు తెలిపారు. గతంలో కంటే ఈ ఎన్నికల్లో రెండు శాతం పోలింగ్ తగ్గింది. తెలంగాణలో రిపోలింగ్కు ఎక్కడా అవకాశం లేదు. మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం, యాకత్పురలో అత్యల్పంగా 39.6 శాతం పోలింగ్ నమోదు అయినట్టు వెల్లడించారు. 80 ఏళ్లు పైబడిన వారికి హోమ్ ఓటింగ్ కల్పించాం. ఎల్లుండి 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది’ దేవరకద్రలో పది మంది ఉన్నా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశాం. పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల మార్పిడి జరిగింది. ఆయా పార్టీ ఏజెంట్ల మధ్యనే స్ట్రాంగ్ రూమ్కి తరలింపు జరిగింది. పోలింగ్పై స్క్రూటినీ ఇవ్వాళ ఉదయం నుంచి జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలు భద్రతలో ఉన్నాయి. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువ పోలింగ్ శాతం నమోదు అయింది. లెక్కింపు జరిగినా కూడా మళ్ళీ రెండు సార్లు ఈవీఎంలు లెక్కిస్తారు. ప్రతీ రౌండ్కు సమయం పడుతుంది. ఈసీఐ నిబంధనల ప్రకారం జరుగుతుంది. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 8.30 నిమిషాల నుంచి ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలు. హైదరాబాద్లో 14 ఉన్నాయి. ప్రతీ టేబుల్కు ఐదుగురు ఉంటారు. కౌంటింగ్కు సిద్ధం అవుతున్నాము’ అని అన్నారు. -
కేసీఆర్ ప్రకటనలోని మర్మం ఇదేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఫిరాయింపులపై చేసిన ఒక ప్రకటన అందరిని ఆకర్షించింది. మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్ధి తనను గెలిపించితే, ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో చేరతానని ప్రచారం చేస్తున్నారని కేసీఆర్కు తన పార్టీ వారు ఎవరో చెప్పారట.దానిని కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రస్తావించి ఆ కాంగ్రెస్ అభ్యర్ధి మాటలను నమ్మి ఆ పార్టీకి ఓటు వేయవద్దని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకోనని అన్నారు. ఒరిజినల్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఉన్న దివాకరరావునే ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ✍️ఎన్నికలలో గెలవడానికి రకరకాల వ్యూహాలు పన్నుతుంటారు. మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్ధి మాత్రం రివర్స్ వ్యూహంలోకి వెళ్లినట్లు అనుకోవాలి. కేసీఆర్ చేసిన ప్రకటనను ఆయన ఖండించి ఉండవచ్చు. కాని కేసీఆర్ ప్రకటనలోని మర్మం గురించి ఆలోచించాలి. ఒకవేళ హంగ్ వస్తే పెద్ద ఎత్తున ఫిరాయింపులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏదో ఒక పార్టీకి వేవ్ వస్తే గొడవ లేదు. తాజా సర్వేలలో ఎక్కువ భాగం కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ రావచ్చని చెబుతున్నాయి. అయినా హంగ్ వస్తుందని నమ్మేవారు కూడా లేకపోలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ తన గెలిచిన అభ్యర్దులను బెంగుళూరు తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ✍️బొటాబొటి మెజార్టీతో కాని, ఎవరికి మెజార్టీ రాని పక్షంలో కాని ఫలితాలు వస్తే మాత్రం పార్టీ మార్పిడులు పెద్ద ఎత్తునే ఉండవచ్చు. కాంగ్రెస్ బొటాబొటిగా అధికారంలోకి వచ్చినా అదే పద్దతి అవలంభించే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ రాకపోతే మాత్రం ఆ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్లోకి జంప్ చేసే అవకాశం ఉందన్నది ఎక్కువ మంది నమ్మకం. అందుకు భిన్నంగా జరిగితేనే ఆశ్చర్యపోవాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం బీఆర్ఎస్ నుంచి ఎంత మందిని వీలైతే అంతమందిని ఆకర్షించడానికి ప్లాన్ చేయవచ్చు. ✍️ఎందుకంటే గత రెండు టరమ్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అదే వ్యూహం అవలంభించి కాంగ్రెస్ను బాగా బలహీనపరచడానికి యత్నించారు. మొదట 2014లో కేసీఆర్ ఈ ఆలోచన చేయకపోయినా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటూ, తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేయడం, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి రేవంత్రెడ్డికి డబ్బులు ఇచ్చి పంపించడం, తదుపరి ఏసీబీ అధికారులు రెడ్ హాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ✍️ఆ తర్వాత కేసీఆర్ మొత్తం వ్యూహం మార్చి అప్పట్లో టీడీపీకి ఉన్న పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మందిని, కాంగ్రెస్లో ఉన్న 21 మందిలో పది మంది వరకు బీఆర్ఎస్లోకి లాగేశారు. ఆ వ్యూహం ఫలించి 2018 ఎన్నికలలో కాంగ్రెస్, టీడీపీలు పూర్తిగా బలహీనపడ్డాయి. ఆ రెండు పార్టీలు కలిసినా ప్రజలు కేసీఆర్కు 88 సీట్లతో భారీ ఎత్తున పట్టం కట్టారు. అయినా కేసీఆర్ ఈసారీ వదలిపెట్టలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరిని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19 మందికి గాను పన్నెండు మందిని బీఆర్ఎస్లో చేర్చేసుకున్నారు. ఈ రెండు పార్టీలను విలీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ✍️దాంతో క్యాబినెట్ హోదాలో ఉన్న సీఎల్పి నేత మల్లు భట్టి కి ప్రతిపక్ష నేతగా కూడా ఉండలేకపోయారు. టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎం.ఐ.ఎం. నేత అక్బరుద్దీన్ ఒవైసీకి ఆ హోదా దక్కింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దపడుతుంది. బీఆర్ఎస్ను ఎంత వీలైతే అంత బలహీన పర్చడానికి యత్నిస్తుంది. అదే విధంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు పార్టీ ఫిరాయిస్తారని ప్రజలు కూడా భావిస్తున్నారు. బీజేపీ నేతలు అదే విషయాన్ని పదే, పదే ప్రచారం చేస్తుంటారు. అలాంటి సందర్భంలో కేసీఆర్ తాను ఈసారి కాంగ్రెస్ నుంచి గెలిచినవారిని చేర్చుకోనని చెప్పడం ఆసక్తికరంగా ఉంది. ✍️ఆయన నిజంగా అలా చేస్తారా?. లేక కాకతాళీయంగా మంచిర్యాలలో రాజకీయంగా నష్టం జరగకుండా ఉండడానికి, కాంగ్రెస్ అభ్యర్ధి ప్రచారం చేస్తుంటే దానిని తిప్పి కొట్టడానికి ఇలా మాట్లాడారా అన్నది తెలియదు. ఎన్నికల తర్వాత జరిగే పరిణామాలపై ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకోవచ్చు కాని, ఫిరాయింపులు ఉండవంటే మాత్రం ఆశ్చర్యమే కలిగిస్తుంది. నిజానికి పార్టీ ఫిరాయింపులు అంత అడ్డగోలుగా జరుగుతుంటే చర్య తీసుకోవలసిన వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో బీజేపీ సైతం ఇదే తరహాలో ఉంటోంది.గతంలో కాంగ్రెస్ పార్టీ ఇదే పద్దతి అవలంభించి, ఆ తర్వాత కాలంలో బాగా నష్టపోయింది. ✍️ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. అది పెద్ద వివాదం అయింది. అయినా వైసిపి అధినేత జగన్మోహన్రెడ్డి ఎక్కడా భయపడకుండా ముందుకు వెళ్లి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఆయన టీడీపీని ఖతం చేయాలనే లక్ష్యంతో పనిచేయలేదు. తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్కు అసెంబ్లీలో నామమాత్రపు బలాన్ని మిగిల్చినా, ఇప్పుడు ప్రధాన పోటీని ఎదుర్కోక తప్పలేదు. అందువల్ల ఫిరాయింపులు జరిగినంత మాత్రాన అన్నిసార్లు అనుకూల ఫలితం వస్తుందని అనుకోలేం. గతంలో కూడా ఇలాంటివి జరగక పోలేదు. ✍️1978 శాసనసభ ఎన్నికలలో 180 సీట్లతో కాంగ్రెస్ ఐ అధికారంలోకి రాగా, జనతా పార్టీకి 60, కాంగ్రెస్ ఆర్ కు 30 సీట్లు వచ్చాయి. కాని 1983 వచ్చేసరికి జనతా, కాంగ్రెస్ ఆర్ పార్టీలకు చెందిన తొంభై మందిలో ఐదారుగురు తప్ప అందరూ అధికార కాంగ్రెస్ ఐ లో చేరిపోయారు. అయినా 1983లో ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. అప్పట్లో కొత్తగా వచ్చిన టిడిపి అధికారాన్ని కైవసం చేసుకుంది. 1984లో కాంగ్రెస్ సహకారంతో నాదెండ్ల భాస్కరరావు టీడీపీలో చీలిక తీసుకు వచ్చినా అది నిలబడలేదు. నెల రోజుల వ్యవధిలో ప్రజాందోళన, మెజార్టీ టిడిపి ఎమ్మెల్యేలు ఎన్.టి.ఆర్.వెంట ఉండడంతో తిరిగి ఆయన ప్రభుత్వం ఏర్పడింది. ✍️1991లో పివి నరసింహారావు కేంద్రంలో మైనార్టీ ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికిగాన టీడీపీ పార్లమెంటరీ పార్టీని చీల్చారు. అయినా 1994లో తిరిగి ఎన్.టి.రామారావు భారీ మెజార్టీతో ఎపిలో అధికారంలోకి వచ్చారు. కేంద్రంలో సైతం కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. కాని 1995లో ఎన్.టి.ఆర్. అల్లుడు చంద్రబాబు నాయుడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఎన్.టి.ఆర్. ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఎన్.టి.ఆర్. వెంట సుమారు ముప్పైఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఆయన ఆకస్మిక మరణంతో టీడీపీని పూర్తి స్థాయిలో చంద్రబాబు కైవసం చేసుకున్నారు. ✍️1999లో వివిధ పరిణామాలతో తిరిగి టీడీపీ అధికారంలోకి రాగలిగింది. 2004 లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఇరవై ఆరుగురిలో పది మంది పార్టీపై తిరుగుబాటు చేసి అనర్హత వేటుకు కూడా గురయ్యారు. దీనివల్ల పార్టీకి పెద్ద సానుభూతి రాలేదు. 2009లో జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ పది సీట్లకే పరిమితం అయింది. టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంల కూటమిని ఓడించి కాంగ్రెస్ బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి రాగలిగింది. ✍️2014లో పవర్ లోకి వచ్చిన చంద్రబాబు వైసీపీని దెబ్బతీయాలని ఫిరాయింపులను ప్రోత్సహించినా 2019 ఎన్నికలలో బొక్కబోర్లా పడ్డారు. కేవలం ఫిరాయింపుల వల్లే పార్టీలు బలపడతాయనో, బలహీనపడతాయనో అనుకోవడానికి లేదని ఈ అనుభవాలు చెబుతున్నాయి. పరిస్థితులు, నాయకత్వం తదితర అంశాలే ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ అనుభవాల నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ఫిరాయింపుల పర్వాలు ఎలా ఉంటాయో తెరపై చూడాల్సిందే. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఖానాపూర్లో నువ్వా-నేనా-ఆయనా?
హీటెక్కించిన విమర్శలు.. హోరెత్తించేలా ప్రచారాలు.. ఎవరికి వారే ఓటర్లను ప్రసన్నం తంటాలు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమా. అభివృద్ధి తామే చేశామని.. మరో అవకాశం ఇస్తే ఇంకా చేస్తామని, చేసిందేమీలేదని.. తమకు అధికారం ఇస్తే సిసలైన అభివృద్ధి చూపిస్తామని.. ఇలా హామీల మీద హామీలతో ‘సై’ అంటూ ఎన్నికల సమరంలో దూకారు. మరి ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో.. ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో చూడాలి.. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని నిర్మల్ జిల్లాలో ఉంది ఖానాపూర్ నియోజకవర్గం. ఇక్కడ ఈసారి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమెల్యేను కాదని.. కేటీఆర్ సన్నిహితుడు, ఫారిన్ రిటర్నీ అయినా భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్కు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం. ఇక ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి వెడ్మ బొజ్జు, బీజేపీ నుంచి ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ బరిలో ఉన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,06,985.. మహిళా ఓటర్లు 1,10,667.. ట్రాన్స్జెండర్ ఓటర్లు 13 మంది.. సర్వీస్ ఎలక్టోర్లు 416.. మొత్తంగా 2,18,081 ఓటర్లు ఉన్నారు. ఖానాపూర్లో 2018 ఎన్నికల్లో 80.87 శాతం పోలింగ్ రికార్డ్ కాగా.. ఈసారి మాత్రం 77.46 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో.. ‘అభివృద్ధి’తో పాటు మారిన రాజకీయ సమీకరణాలు ఇక్కడి ఓటర్లపై ప్రభావం చూపించి.. అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపించేలా ఉన్నాయి. -
TS Elections Result: చెన్నూర్లో నువ్వా? నేనా?
సాక్షి, మంచిర్యాల: హీటెక్కించిన విమర్శలు.. హోరెత్తించేలా ప్రచారాలు.. ఎవరికి వారే ఓటర్లను ప్రసన్నం తంటాలు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమా. అభివృద్ధి తామే చేశామని.. మరో అవకాశం ఇస్తే ఇంకా చేస్తామని, చేసిందేమీలేదని.. తమకు అధికారం ఇస్తే సిసలైన అభివృద్ధి చూపిస్తామని.. ఇలా హామీల మీద హామీలతో ‘సై’ అంటూ ఎన్నికల సమరంలో దూకారు. మరి చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో.. ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో.. ఉమ్మడి ఆదిలాబాద్లోని మంచిర్యాల జిల్లా పరిధిలోని నియోజకవర్గం. బీఆర్ఎస్ నుంచి యువనేతగా గుర్తింపు ఉన్న బాల్క సుమన్ మరోసారి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత గడ్డం వివేక్ వెంకటస్వామి బరిలో నిలవడం ఇక్కడ తీవ్ర చర్చకు దారి తీసింది. పెద్దపల్లి మాజీ ఎంపీలుగా.. స్థానికతను చూపిస్తూ ప్రచారం చేసుకున్నారు ఇద్దరూ. ఇక బీజేపీ తరఫున దుర్గం అశోక్ పోటీలో నిలిచారు. చెన్నూరులో పురుష ఓటర్లు 91,969.. మహిళా ఓటర్లు 92,141.. ట్రాన్స్జెండర్ ఓటర్లు ఏడు.. సర్వీస్ ఎలక్టోర్లు 133.. మొత్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య 1,84,250. చెన్నూర్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 82.57 శాతం ఓటింగ్ రికార్డ్ కాగా.. ఈసారి ఎన్నికల్లో 79.97 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో కోల్బెల్ట్ ఏరియా ఓట్లు ఇక్కడ కీలకం కానున్నాయి. -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
Telangana Assembly Elections Today Minute To Minute Update.. ఎల్లుండి(డిసెంబర్ 3, ఆదివారం) తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు తెలంగాణ : లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత నలభై కంపెనీల బలగాలతో పటిష్ట భద్రత స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు కౌంటింగ్ కేంద్రాల్లో 1,766 లెక్కింపు టేబుళ్లు కౌంటింగ్ కేంద్రాల్లో 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు 6 నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఎల్లుండి ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉదయం 10 గంటలకు మొదటి ఫలితం వెల్లడవుతుందన్న ఈసీ ప్రతి టేబుల్ పై మైక్రో అబ్జర్వర్ కౌంటింగ్ సూపర్ వైజర్....ఇద్దరు అసిస్టెంట్లు ఎన్నికల నిబంధనలపై 2023లో 13 వేల కేసులు 2018 ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘనల పై 2,400 కేసులు తెలంగాణ ఎన్నికలపై మీడియాతో సీఈవో వికాస్రాజ్ తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది తెలంగాణలో 71.01శాతం పోలింగ్ లక్షా 80 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 పోలింగ్ హైదరాబాద్ జిల్లాలో 46.68 శాతం పోలింగ్ నమోదు గతంలో కంటే ఈ ఎన్నికల్లో రెండు శాతం పోలింగ్ తగ్గింది తెలంగాణలో రిపోలింగ్కు ఎక్కడా అవకాశం లేదు మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం, యాకత్పురలో అత్యల్పంగా 39.6 శాతం పోలింగ్ నమోదు 80 ఏళ్లు పైబడిన వారికి హోమ్ ఓటింగ్ కల్పించాం ఎల్లుండి(ఆదివారం, డిసెంబర్ 3వ తేదీ) 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ దేవరకద్రలో పది మంది ఉన్నా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశాం పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల మార్పిడి జరిగింది. ఆయా పార్టీ ఏజెంట్ల మధ్యనే స్ట్రాంగ్ రూమ్కి తరలింపు జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలు. హైదరాబాద్లో 14 మీ పాత్ర మరువలేనిది: రేవంత్ ట్వీట్ తెలంగాణ కాంగ్రెస్ కేడర్కు రేవంత్రెడ్డి ధన్యవాదాలు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు గడచిన పదేళ్లుగా పార్టీకి అండగా.. ప్రజల తరఫున నిలబడ్డారంటూ భావోద్వేగం మీ కష్టం, మీ శ్రమ వృథా కాలేదంటే ఎక్స్లో పోస్ట్ ప్రజాస్వామ్య పునరుద్ధరణలో పాత్ర మరువలేనిదంటూ.. ప్రతి ఒక్కరికి అభినందనలు ఇలాంటి ఎన్నికలు చూడడం నా అదృష్టం: ప్రొ. కోదండరామ్ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యలు 1970 ఎమర్జెన్సీ లో జరిగిన ఎన్నికలకు 2023 నిన్న జరిగిన ఎన్నికలకు సారుప్యత ఉంది ప్రజలు ఈ ఎన్నికల్లో పాలకులపై పూర్తిగా వ్యతిరేకత కనబర్చారు తెలంగాణ ఉద్యమ పౌరుషం ఎక్కడా తగ్గలేదు.. ఈ ఎన్నికల్లో స్పష్టంగా ప్రజల్లో కనినిపించింది ఇలాంటి ఎన్నికలను చూడటం అదృష్టం సంపూర్ణ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది నిరంకుశ పాలన రాకుండా చూసుకుంటామని, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కట్టుబడి ఉంటామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.. మేము దాన్ని స్వాగతిస్తున్నాం ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాం ఇప్పటికైనా ప్రజల తీర్పును గుర్తించి పాలకులు పార్టీ ఫిరాయింపులపై పునరాలోచించుకోవాలి పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే ప్రజలు సహించరు నాగార్జున సాగర్ నీటి వాటా అంశంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమైనది చట్టపరమైన విధానాలతో వెళ్లాలి తమ నీటి వాటాను తాము వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి హక్కు ఉంది..కానీ దానికి కొన్ని విధానాలు ఉన్నాయి ఏపీ ప్రభుత్వం దుందుడుకు ఆలోచనలు సరైనవి కావు ఇలాంటి చర్యలు మానుకొని చట్టపరంగా ముందుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నా నాగార్జున సాగర్ వాటర్ అంశాల్లో కేంద్ర ప్రభుత్వం స్పందించాలి ఈ అంశంపై కేంద్ర జల సంఘానికి లేఖ రాస్తాం ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఒక వినూత్నమైన తీర్పు ఇవ్వబోతున్నారు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం నేను మాట్లాడటం లేదు గ్రౌండ్ లెవల్లో తిరిగాను కాబట్టి చెబుతున్నా కేసీఆర్ ఓటమి ఒప్పుకున్నట్లే..: షబ్బీర్ అలీ మీడియాతో నిజామాబాద్ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఎన్నికల్లో బాగా పనిచేసిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అన్ని మతాలు కులాల సంఘాలు ఎన్జీవో ఉద్యోగులు అందరికీ ధన్యవాదాలు ఎగ్జి ట్ పోల్స్ లో కాంగ్రెస్ కు మెజార్టీ వస్తుందని వస్తున్నాయి రాహుల్ గాంధీ రేవంత్ లు చాలా రోజుల నుంచి ఇదే విషయాలు చెబుతూ వచ్చారు దీపం ఆరిపోయే ముందు వెలుగు ఎక్కువ కొడుకు కేటీఆర్ తో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించారు అంటేనే కేసీఆర్ ఓటమి ఒప్పుకున్నట్లు అర్థం అయిపోయింది మెజారిటీ మైనారిటీ అనేవి ఉండవు నేను అందరి వాడిని అందరితో ఉంటాను ఫలితాల కోసం చూస్తున్న వేళ.. ఆసక్తికర పరిణామం తెలంగాణలో హైకోర్టులో ధర్మపురి ఎమ్మెల్యే ఎన్నిక పిటిషన్పై తీర్పు మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఊరట కొప్పుల 2018 అసెంబ్లీ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ పిటిషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ఎన్నికలో కొప్పుల ఈశ్వర్ స్వల్ప మెజారిటీతో గెలుపు ఎన్నికల ఫలితాలపై లక్ష్మణ్ రీకౌంటింగ్ దరఖాస్తు రీకౌంటింగ్ తర్వాత కొప్పుల గెలిచినట్లు ఎన్నికల అధికారుల ప్రకటన అయితే, రీకౌంటింగ్ లో గందరగోళం జరిగిందని, కొప్పుల అక్రమ పద్ధతులతో గెలిచారని.. ఎన్నికల కౌంటింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ ఆరోపణ హైకోర్టులో పిటిషన్.. శుక్రవారం(డిసెంబర్ 1) పిటిషన్ కొట్టేసిన హైకోర్టు After a long time had a peaceful sleep 😴 Exit polls can take a hike Exact polls will give us good news. 👍#TelanganaWithKCR — KTR (@KTRBRS) December 1, 2023 ఎగ్జిట్పోల్స్పై మళ్లీ కేటీఆర్ స్పందన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్పోల్స్ అంచనాలపై స్పందించిన మళ్లీ కేటీఆర్ రబ్బిష్.. న్యూసెన్స్ అంటూ పోలింగ్ ముగిసిన అనంతరం స్పందన తాజాగా మళ్లీ ట్విటర్లో మళ్లీ.. చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా ఎగ్జిట్ పోల్స్ ఎంతదాకా అయినా వెళ్లొచ్చు, కానీ.. కచ్చితమైన ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయనే అర్థం వచ్చేలా ఎక్స్లో పోస్ట్ గట్టి కాపలా మధ్య.. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రత అనుమతి ఉన్నవాళ్లకు మాత్రమే స్ట్రాంగ్ రూమ్లోకి ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలతో పర్యవేక్షణ డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్.. అదే రోజు వెల్లడికానున్న ఫలితాలు తెలంగాణ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్ ప్రధాన అభ్యర్ధులు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపై బెట్టింగ్ రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు ఇచ్చేలా బెట్టింగ్ ఎగ్జిట్ పోల్స్ తర్వాత పెరిగిన బెట్టింగ్స్ నెల క్రితం నుంచే ఏపీలోని పలు ప్రాంతాల్లో బెట్టింగ్ ల నిర్వహణ హైదరాబాద్, తెలంగాణలో బెట్టింగ్ నిర్వహిస్తే పట్టుబడే అవకాశం ఉందని ఏపీలో మకాం వేసిన బుకీలు యాప్ ల ద్వారా ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి బెట్టింగ్ కేసీఆర్, రేవంత్, ఈటల, బండి సంజయ్, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్, మల్లారెడ్డి సహా పలువురు పోటీ చేస్తున్న స్థానాలపై ఎక్కువ బెట్టింగ్ ఊహించని ఫలితాలు రాబోతున్నాయి: బండి సంజయ్ ఎన్నోసార్లు సర్వేలు తారుమారయ్యాయి రాష్ట్రంలో మెజారిటీ సీట్లను బీజేపీ సాధించబోతోంది నాగార్జునసాగర్ ఇష్యూను బీఆర్ఎస్ రాజకీయాల కోసం వాడుకోవాలని చూసింది రాష్ట్రంలో హంగ్ చర్చ.. బీఆర్ఎస్, ఎంఐఎంతో కలిసి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు అనేవి ప్రతిపక్షాలు, కొన్ని వర్గాలు చేసే కుట్ర ప్రచారం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీకి మంచి మెజారిటీ రాబోతోంది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్లో కూడా బీజేపీదే అధికారం గంగుల కమలాకర్ అవినీతి చరిత్రను, కరీంనగర్లో జరిగిన అక్రమాలను బీజేపీ అధికారంలోకి రాగానే తవ్వి తీస్తాం వదిలే ప్రసక్తే లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు పార్టీ కండువా వేసుకుని పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించినట్లు ఫిర్యాదు స్ట్రాంగ్ రూమ్స్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూముల వద్ద ఐదంచెల పటిష్టమైన భద్రత నిఘా నీడలో స్ట్రాంగ్ రూమ్స్ డిసెంబర్ 3న వెలువడనున్న అభ్యర్థుల భవితవ్యం నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 85.49శాతం పోలింగ్ నమోదు రాష్ట్రంలోనే అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03 శాతం పోలింగ్ నమోదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం ఆదిలాబాద్-77.2 శాతం బోథ్-82.93శాతం చెన్నూరు- 79.97శాతం బెల్లంపల్లి-81.19శాతం మంచిర్యాల-69.06 శాతం సిర్పూర్ టి- 71.8 శాతం అసిపాబాద్- 72.08 శాతం ఖానాపూర్-77.46 శాతం నిర్మల్-76.56 శాతం ముథోల్- 80.54 శాతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం-83.28 ఖమ్మం -71.53 పాలేరు-90.28 మధిర -87.83 వైరా -86.66 సత్తుపల్లి-85.27 ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం వివరాలు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 76.61 శాతం పోలింగ్ నమోదు మెదక్ జిల్లా వ్యాప్తంగా 86.69 శాతం పోలింగ్ నమోదు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 79.84 శాతం పోలింగ్ నమోదు ఓటెత్తని హైదరాబాద్! అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లా పరిధిలో రాష్ట్రంలోనే తక్కువగా పో లింగ్ నమోదు అధికారులు ఎంతగా అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా..ఎప్పటిలాగే ఓటు వేసేందుకు వెళ్లని హైదరాబాద్ జనం పోలింగ్ కేంద్రాల్లో ఎంత క్యూ ఉందో, ఎంత సమయంలో ఓటేయవచ్చో ఆన్లైన్లో ముందే తెలుసుకునే సదుపాయం అయినా ఫలితం రాలేదు. చాలా వరకు సెలవురోజుగానే భావించి విశ్రాంతి తీసుకునేందుకు, వినోద కార్యక్రమాల్లో మునిగిపోయి ఉండటమే దీనికి కారణమని అధికారవర్గాలు చెప్తున్నాయి. అంతేగాకుండా ఒకటి కంటే ఎక్కువచోట్లా ఓట్లున్నవారూ ఇక్కడ గణనీయంగా ఉండటం వారంతా స్వస్థలాలకు తరలడం కూడా పోలింగ్ తగ్గడానికి మరో కారణం జిల్లాలో కడపటి వార్తలు అందేసరికి 46.65 శాతమే పోలింగ్ నమోదు గత అసెంబ్లీ ఎన్నికల (50.51 శాతం)తో పోలిస్తే ఐదు శాతం తగ్గడం గమనార్హం. హస్తం గాలి ‘వీచినట్టేనా’! కాంగ్రెస్ శిబిరంలో ధీమా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ అనుకూలంగాజరిగిందని అంచనా.. 70 స్థానాలకు పైగా గెలుస్తామని లెక్కలు... నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్,వరంగల్ జిల్లాలపై భారీ ఆశలు సింగరేణి సహకరించిందంటున్నహస్తం పార్టీ.. హైదరాబాద్ శివారుఓటర్లూ తమవైపేనని ధీమా వార్ రూం నుంచి పోలింగ్ సరళి సమీక్షించిన ఠాక్రే, దీపాదాస్ మున్షీ, కుసుమ కుమార్ తెలంగాణ అంచనాలు కాంగ్రెస్వైపే! మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ది అదే మాట రాజస్తాన్లో కమల వికాసమన్న సర్వేలు మధ్యప్రదేశ్నూ నిలుపుకోనున్న బీజేపీ! ఛత్తీస్లో మళ్లీ కాంగ్రెసే, మిజోరంలో హంగ్! ఐదు రాష్ట్రాల్లోనూ ఈనెల 3న ఫలితాల వెల్లడి ప్రశాంతంగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్.. పోలింగ్ 70.66 శాతం! ఈ నెల 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం ఉదయం వడివడిగా పోలింగ్.. మధ్యలో మందకొడిగా ఈవీఎంల మొరాయింపుతో పలుచోట్ల ఆలస్యంగా ప్రారంభం ఓటేసేందుకు మళ్లీ బద్ధకించిన జంట నగరాల జనం స్వల్ప ఉద్రిక్తతలు.. గతంతో పోల్చితే తగ్గిన ఓట్ల గల్లంతు ఘటనలు సజావుగా ముగియడంతో ఊపిరిపీల్చుకున్న ఎన్నికల సంఘం అత్యధిక పోలింగ్ జరిగిన సెగ్మెంట్: మునుగోడు 91.51 శాతం అత్యల్పంగా పోలింగ్ జరిగిన సెగ్మెంట్: యాకుత్పుర 39.69 శాతం అత్యధిక పోలింగ్ జరిగిన జిల్లా: యాదాద్రి భువనగిరి 90.03 శాతం అత్యల్పంగా పోలింగ్ జరిగిన జిల్లా: హైదరాబాద్లో 46.65 శాతం (కడపటి వార్తలు అందే సరికి లెక్క ఇది. పోలింగ్ శాతాలు మారే అవకాశం ఉంది.) -
కాంగ్రెస్ –2, బీజేపీ–2, హంగ్–1!
న్యూఢిల్లీ: నెలన్నరకు పైగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు ముగింపునకు వచి్చంది. గురువారంతో అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మిజోరంలో నవంబర్ 7న, ఛత్తీస్గఢ్లో నవంబర్ 7, 19 తేదీల్లో రెండు దశల్లో, మధ్యప్రదేశ్లో 19న, రాజస్థాన్లో 25న పోలింగ్ జరగడం తెలిసిందే. తెలంగాణలో కూడా గురువారం ఒకే దశలో పోలింగ్ ముగిసింది. ఐదు రాష్ట్రాల్లోనూ డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలో పోలింగ్ ముగియగానే ఐదు రాష్టాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఓడించనుందని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఛత్తీస్గఢ్లో అధికారం నిలబెట్టుకుంటుందని పలు పోల్స్ పేర్కొన్నాయి. ఇక కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో బీజేపీ గెలుస్తుందని చాలావరకు తేల్చాయి. మధ్యప్రదేశ్ను కూడా బీజేపీ నిలబెట్టుకోవచ్చని, మిజోరంలో హంగ్ రావచ్చని తెలిపాయి... మధ్యప్రదేశ్... బీజేపీకే మొగ్గు! మధ్యప్రదేశ్లో బీజేపీ ఘనవిజయం సాధించనుందని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య, ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ వంటి పలు సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ సీట్లు 230. మెజారిటీ మార్కు 116 కాగా బీజేపీకి ఏకంగా 140 నుంచి 162 సీట్లు వస్తాయని ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. కాంగ్రెస్ 68 నుంచి 90 సీట్లకు పరిమితం కానుందని చెప్పింది. టుడేస్ చాణక్య కూడా బీజేపీకి 151, కాంగ్రెస్కు 74 స్థానాలిచ్చింది. ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్లోనూ బీజేపీకి 140 నుంచి 159 సీట్లు రాగా కాంగ్రెస్ 70 నుంచి 89 సీట్లకు పరిమితమైంది. రిపబ్లిక్ టీవీ కూడా బీజేపీకి 118 నుంచి 130 సీట్లిచ్చింది. కాంగ్రెస్కు 97 నుంచి 107 రావచ్చని పేర్కొంది. టైమ్స్ నౌ–ఈటీజీ మాత్రం కాంగ్రెస్కు 109–125 సీట్లివ్వగా బీజేపీకి 105–117 వస్తాయని పేర్కొంది. ఏబీపీ–సీవోటర్ కూడా కాంగ్రెస్కు 113 నుంచి 137 స్థానాలొస్తాయని, బీజేపీ 88 నుంచి 112కు పరిమితమవుతుందని చెప్పింది. జన్ కీ బాత్ మాత్రం రెండు పారీ్టలూ 100 నుంచి 125 సీట్ల మధ్య గెలుచుకుంటాయని జోస్యం చెప్పింది. రాజస్థాన్లో కమల వికాసమే రాజస్థాన్లో బీజేపీ విజయం ఖాయమని చాలా ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మూడు మాత్రం కాంగ్రెస్ బహుశా రాజస్థాన్లో నెగ్గే అవకాశముందని అంచనా వేశాయి. రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ సీట్లు కాగా మెజారిటీకి 101 స్థానాలు రావాలి. టైమ్స్ నౌ సర్వేలో బీజేపీకి 108 నుంచి 128, కాంగ్రెస్కు 56 నుంచి 72 సీట్లొచ్చాయి. ఇక బీజేపీ 105 నుంచి 125 స్థానాలు సాధిస్తుందని రిపబ్లిక్ టీవీ పేర్కొంది. కాంగ్రెస్ 69 నుంచి 81కి పరిమితమవుతుందని చెప్పింది. ఏబీపీ–సీవోటర్ బీజేపీకి 94–114, కాంగ్రెస్కు 71–91 సీట్లిచ్చింది. జన్ కీ బాత్ సర్వే కూడా బీజేపీ 100 నుంచి 122 సీట్లు గెలుస్తుందని, కాంగ్రెస్ 62 నుంచి 85కు పరిమితమవుతుందని పేర్కొంది. టుడేస్ చాణక్య బీజేపీకి 101, కాంగ్రెస్ 89 సీట్లిచి్చంది. ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా బీజేపీకి 86 నుంచి 106, కాంగ్రెస్కు80 నుంచి 100 సీట్లొస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ 94 నుంచి 104 సీట్లతో అధికారం నిలుపుకుంటుందని, బీజేపీకి 80 నుంచి 90 స్థానాలొస్తాయని ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ పేర్కొంది. తెలంగాణలో కాంగ్రెస్ పాగా తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు తెర దించి తొలిసారిగా కాంగ్రెస్ అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 119 స్థానాల అసెంబ్లీలో మెజారిటీకి 60 స్థానాలు కావాల్సి ఉండగా కాంగ్రెస్కు 60 నుంచి 70 దాకా వస్తాయని టైమ్స్ నౌ–ఈటీజీ అంచనా వేసింది. బీఆర్ఎస్ 37 నుంచి 45 సీట్లకు పరిమితమవుతుందని చెప్పింది. బీజేపీకి 6 నుంచి 8, మజ్లిస్కు5 నుంచి 7 రావచ్చని పేర్కొంది. రిపబ్లిక్ టీవీ కూడా కాంగ్రెస్కు 58 నుంకచి 68 సీట్లిచి్చంది. బీఆర్ఎస్కు 46 56, బీజేపీకి 4 నుంచి 9 వస్తాయని, ఇతరులు 5 నుంచి 9 సీట్లు నెగ్గుతారని పేర్కొంది. ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ అయితే కాంగ్రెస్కు ఏకంగా 63 నుంచి 79 సీట్లిచి్చంది. బీఆర్ఎస్ 31 నుంచి 47తో సరిపెట్టుకుంటుందని చెప్పింది. బీజేపీకి 2 నుంచి 4, మజ్లిస్కు5 నుంచి 7 వస్తాయని తెలిపింది. టుడేస్ చాణక్య కూడా కాంగ్రెస్కు 71 సీట్లు, బీఆర్ఎస్కు 33, బీజేపీకి 7, ఇతరులకు 8 స్థానాలిచి్చంది. కాంగ్రెస్ 49 నుంచి 65 సీట్లొస్తాయని ఏబీపీ–సీవోటర్ సర్వే పేర్కొంది. బీఆర్ఎస్కు 38 నుంచి 54, బీజేపీకి 5 నుంచి 13 వస్తాయని, ఇతరులు 5 నుంచి 9 సీట్లు నెగ్గుతారని చెప్పుకొచ్చింది. జన్ కీ బాత్ కూడా కాంగ్రెస్కు 48 నుంచి 64, బీఆర్ఎస్కు 40 నుంచి 55 సీట్లిచి్చంది. బీజేపీ 7 నుంచి 13, మజ్లిస్ 4 నుంచి 7 సీట్లు నెగ్గుతాయని చెప్పింది. మిజోరంలో హంగ్ ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) ఈసారి ఎదురీదుతోందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఎంఎన్ఎఫ్కు ఈసారి జోరాం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) గట్టి పోటీ ఇచి్చనట్టు పేర్కొన్నాయి. బహుశా హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని జోస్యం చెప్పాయి. కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమవుతుందని, బీజేపీకి ఒకట్రెండు స్థానాలు దాటకపోవచ్చని తెలిపాయి. మొత్తం 40 స్థానాలకు గాను రిపబ్లిక్ టీవీ మాత్రం ఎంఎన్ఎఫ్కు 17 నుంచి 22 దాకా ఇచ్చింది. ఏబీపీ సీవోటర్ కూడా దానికి 15 నుంచి 21 స్థానాలు రావచ్చని పేర్కొంది. మిగతా సర్వేలన్నీ అది మెజారిటీకి కొద్ది దూరంలోనే నిలిచిపోతుందని తేల్చాయి. జెడ్పీఎం ఏకంగా 28 నుంచి 35 సీట్లతో ఘనవిజయం సాధిస్తుందని ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా పేర్కొనడం విశేషం! ఎంఎన్ఎఫ్ కేవలం 3 నుంచి 7 సీట్లకు, కాంగ్రెస్ 2 నుంచి 4 స్థానాలకు పరిమితమవుతాయని అది తేల్చింది. మిగతా సర్వేలన్నీ ఎంఎన్ఎఫ్కు 14 నుంచి 18 సీట్లు, జెడ్పీఎంకు 10 నుంచి 16 సీట్ల చొప్పున ఇచ్చాయి. ఛత్తీస్గఢ్ ‘హస్త’గతం! ఛత్తీస్గఢ్లో భూపేశ్ బఘెల్ సర్కారు పనితీరుకు ప్రజలు మరోసారి పట్టం కడుతున్నట్టు పలు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్కు 40 50 దాకా వస్తాయని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. బీజేపీ 36 నుంచి 46 దాకా గెలుచుకుంటుందని అంచనా వేసింది. టైమ్స్ నౌ–ఈటీజీ కాంగ్రెస్కు 48 నుంచి 56, బీజేపీకి 32 నుంచి 40 సీట్లిచ్చింది. కాంగ్రెస్కు 57, బీజేపీకి 33 సీట్లొస్తాయని టుడేస్ చాణక్య పేర్కొంది. ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ సర్వే కాంగ్రెస్కు 46–56, బీజేపీకి 30–40 సీట్లిచి్చంది. రిపబ్లిక్ టీవీ కూడా కాంగ్రెస్44 నుంచి 52 సీట్లు గెలుస్తుందని, బీజేపీ 35 నుంచి 42 సీట్లకు పరిమితమవుతుందని అభిప్రాయపడింది. ఇక రెండు పారీ్టలూ హోరాహోరీగా తలపడ్డట్టు ఏబీపీ–సీవోటర్, జన్ కీ బాత్ తేల్చాయి. కాంగ్రెస్కు 41 నుంచి 53, బీజేపీకి 36 నుంచి 48 సీట్లు రావచ్చని ఏబీపీ చెప్పింది. ఇక జన్ కీ బాత్ సర్వే బీజేపీకి 34 నుంచి 45, కాంగ్రెస్కు 42 నుంచి 53 స్థానాలిచ్చింది. -
తెలంగాణ అంచనాలు కాంగ్రెస్వైపే!
లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డట్టు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. తెలంగాణలో మాత్రం అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలూ కాంగ్రెస్ వైపే మొగ్గడం విశేషం. రాష్ట్రంలో హస్తం పార్టీ తొలిసారి అధికారంలోకి రానుందని అవి పేర్కొన్నాయి. అయితే వీటిలో చాలా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గురువారం సాయంత్రం ఒకవైపు ఇంకా పోలింగ్ కొనసాగుతుండగానే వెలువడటం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణపై తన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను శుక్రవారం ప్రకటించనున్నట్టు ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. ఇక ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారం నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్లో చాలావరకు పేర్కొన్నాయి. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియాతో పాటు టైమ్స్ నౌ–ఈటీజీ, ఇండియా టీవీ–సీఎన్ఎక్స్, టుడేస్ చాణక్య కాంగ్రెస్కు మెజారిటీ సీట్లు కట్టబెట్టాయి. బీజేపీ, కాంగ్రెస్ల్లో ఎవరిదైనా పై చేయి కావచ్చని ఏబీపీ–సీవోటర్, జన్ కీ బాత్ పేర్కొన్నాయి. ఇక రాజస్తాన్లో అధికార కాంగ్రెస్ను బీజేపీ ఓడించనుందని టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ, ఏబీపీ, జన్ కీ బాత్, టుడేస్ చాణక్యతో సహా అత్యధిక ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా మాత్రం బీజేపీకి 86 నుంచి 106, కాంగ్రెస్కు 80 నుంచి 100 సీట్లొస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ 94 నుంచి 104 సీట్లతో అధికారం నిలుపుకుంటుందని ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ పేర్కొంది. ఇక మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చినా బీజేపీ అధికారం నిలబెట్టుకోనుందని పలు సర్వేలు తెలిపాయి. 230 సీట్లకు గాను దానికి బీజేపీకి 162 సీట్ల దాకా వస్తాయని ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా పేర్కొనగా టుడేస్ చాణక్య 151, ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ 159 దాకా రిపబ్లిక్ టీవీ 130 దాకా ఇచ్చాయి. ఏబీపీ–సీవోటర్ మాత్రం కాంగ్రెస్కు 113 నుంచి 137 స్థానాలొస్తాయని, బీజేపీ 88 నుంచి 112కు పరిమితమవుతుందని చెప్పింది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో అధికార ఎంఎన్ఎఫ్, జెడ్పీఎం హోరాహోరీగా తలపడ్డట్టు సర్వేలు స్పష్టం చేశాయి. అక్కడ హంగ్ రావచ్చని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3న వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంచనాలకందని తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నా తెలంగాణలో పోలింగ్ సరళి ఎవరికీ కచ్చితంగా అంతుబట్టడం లేదు. ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా సంస్థ తెలంగాణలో పోలింగ్ తీరుతెన్నులను అంచనా వేయలేకపోయింది. రాష్ట్రంలో అధిక ధన ప్రభావం, పైగా గురువారం సాయంత్రం గడువు దాటాక కూడా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుండడమే ఇందుకు ప్రధాన కారణమని సంస్థ అధినేత ప్రదీప్ గుప్తా స్పష్టం చేశారు. దాంతో కచ్చితమైన ఎగ్జిట్ పోల్ అంచనాలకు రాలేకపోతున్నామన్నారు. తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్పై శుక్రవారం స్పష్టత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట దాకా 36.68 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఐదింటికల్లా 63.94 శాతానికి పెరిగింది. సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లున్నారు. -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 'పోలింగ్ 70.66 శాతం'!
గడప దాటని సిటీ చెంతనే పోలింగ్ కేంద్రం.. అయినా సిటీ ఓటరు గడప దాటలేదు. సెలవును సరదాగా గడిపేశారు. ఓటేసేందుకు కదల్లేదు. క్రితంసారితో పోలిస్తే 5% పోలింగ్ తగ్గింది. పట్నమిలా..హైదరాబాద్ భరత్నగర్లోని పోలింగ్ కేంద్రం 16 కి.మీ. నడిచొచ్చి.. ఓటేసి వీరంతా ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల పంచాయతీ పరిధిలోని పెనుగోలు ఆదివాసీలు. మూడు గుట్టలు ఎక్కి దిగి, మధ్యలో మూడు వాగులు దాటి 16 కిలోమీటర్లు నడిచి వచ్చి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ గోడు పట్టించుకోవడం లేదని వారు గోడు వెళ్లబోసుకున్నారు. ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలనుకున్నా.. రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకోవాలనే ఇంతదూరం నడిచి వచ్చామని చెప్పారు. – వాజేడు పల్లె ఇలా.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం) నిక్షిప్తమైంది. గురువారం రాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 70.66 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది. కచ్చితమైన గణాంకాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్రాజ్ శుక్రవారం ప్రకటిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. రాష్ట్ర శాసనసభకు 2014లో జరిగిన ఎన్నికల్లో 69.5 శాతం, 2018 ఎన్నికల్లో 73.2 శాతం పోలింగ్ నమోదైంది. తాజా పోలింగ్లో కడపటి వార్తలు అందేసరికి 70.66 శాతంగా నమోదైంది. ఇది మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 3న (ఆదివారం) ఓట్ల లెక్కింపు నిర్వహించి, ఫలితాలను ప్రకటించనున్నారు. అత్యధికంగా జనగామలో.. గురువారం సాయంత్రానికల్లా అత్యధికంగా.. మునుగోడు 91.51, ఆలేరు 90.16, భువనగిరి 89.9 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా యాకూత్పురలో 39.69 శాతం, మలక్పేట 41, నాంపల్లిలో 42.76, చార్మినార్లో 43.26 శాతం పోలింగ్ నమోదైంది. ► జిల్లాల వారీగా పోలింగ్ శాతాలను పరిశీలిస్తే.. అత్యధికంగా యాదాద్రి భువనగిరిలో 90.03 శాతం, మెదక్లో 86.69శాతం జనగామలో 85.74, నల్లగొండలో 85.49శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్లో 46.65 శాతం, రంగారెడ్డిలో 59.94 శాతమే ఓట్లు వేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గిపోయినట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ►మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 13 వామ పక్ష తీవ్రవాద ప్రభావిత స్థానాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా 106 చోట్ల సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్ ముగిసే సమ యానికల్లా.. పోలింగ్ కేంద్రాలకు చేరుకుని, క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. కొన్నిచోట్ల ఇలా రాత్రి వరకు పో లింగ్ సాగింది. ఈ క్రమంలోనే పోలింగ్ శాతాలపై శుక్రవారం ఉదయమే స్పష్ట త వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. పలుచోట్ల ఆలస్యంగా.. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలుకావాలి. అ యితే పలుచోట్ల ఈవీఎంలు, ఓటర్ వెరిఫయబుల్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్) యంత్రాలు మొరాయించడంతో గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని పోలింగ్ కేందాల్లో ఈవీఎంలు మొరాయించాయి? ఎన్నింటిని రిప్లేస్ చేశారన్న అంశంపై సీఈఓ కార్యాలయం ప్రకటన జారీ చేయలేదు. ఉదయమే బారులు తీరిన ఓటర్లు రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీనితో వడివడిగా ఓటింగ్ సాగింది. మధ్యాహ్నం కొంత మందగించినా తర్వాత పుంజుకుంది. ఉదయం 9 గంటల వరకు 7.78 శాతం, 11 గంటల వరకు 20.64 శాతం, మధ్యాహ్నం 3 గంటల సమయానికి 51.89 శాతం, సాయంత్రం 5 గంటలకు 64.42 శాతం పోలింగ్ నమోదైంది. కడపటి వార్తలు అందేసరికి 70.66 శాతంగా నమోదైంది. రాత్రి వరకు పలుచోట్ల ఓటింగ్ కొనసాగిన నేపథ్యంలో ఆ లెక్క లన్నీ క్రోడీకరించాల్సి ఉంది. దీనితో ఓటింగ్ శాతం పెరగనుందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. తగ్గిన ఓట్ల గల్లంతు ఫిర్యాదులు గత శాసనసభ ఎన్నికల సందర్భంగా భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతైనట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా హైదరాబాద్ జంట నగరాల్లో లక్షల ఓట్లు తొలగించినట్టు విమర్శలు వచ్చాయి. అయితే ఈసారి ఎన్నికల్లో ఓట్ల గల్లంతుపై ఫిర్యాదులు నామమాత్రంగానే వచ్చాయి. వివరాలు వెల్లడించని ఎన్నికల ప్రధానాధికారి శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధిగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) విలేకరుల సమావేశం నిర్వహించి.. వివరాలను వెల్లడించడం ఆనవాయితీ. అంతేకాదు.. పోలింగ్ కొనసాగుతున్న సమయంలోనూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేవారు. అయితే సీఈఓ వికాస్రాజ్ గురువారం శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిశాక ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు సీఈఓ కార్యాలయం ప్రజాసంబంధాల విభాగం అధికారులను సంప్రదించారు. పోలింగ్ తీరుపై విలేకరుల సమావేశం నిర్వహించాలని కోరారు. కానీ సీఈఓ వికాస్రాజ్ అంగీకరించలేదని అధికారులు బదులిచ్చారు. కేవలం పోలింగ్ శాతంపై ప్రాథమిక అంచనాలు మినహా ఎలాంటి ఎలాంటి సమాచారాన్ని సీఈఓ కార్యాలయం వెల్లడించలేదు. ఈవీఎంల తరలింపుపై ఉద్రిక్తత సూర్యాపేట జిల్లా నాగారం మండలం పేరబోయినగూడెంలో అధికారులు ఎస్కార్ట్ లేకుండా ఈవీఎంలను తరలిస్తున్నారని, ఈవీఎంలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో గ్రామస్తులు వెనక్కి తగ్గారు. అయితే ఖాళీ ఈవీఎంలను కారులో తరలిస్తున్న సెక్టోరియల్ అధికారిని అడ్డుకుని అద్దాలను ధ్వంసం చేశారు. ఇంటింటికీ ఓటింగ్కు భారీ స్పందన: సీఈసీ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 80ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు కలిపి 25,400 మంది తొలిసారిగా ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలిసారి కల్పించిన ఈ అవకాశాన్ని ఓటర్లు సది్వనియోగం చేసుకున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. బందోబస్తుతో ప్రశాంతం రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, అనుక్షణం పర్యవేక్షించడంతో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాల్లో పలుచోట్ల చెదురుమదురు ఘటనలు జరిగి, ఉద్రిక్తత నెలకొన్నా అక్కడి పోలీసు సిబ్బంది వేగంగా స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు. రాష్ట్ర పోలీస్శాఖ నుంచి 45వేల మంది పోలీసు సిబ్బంది, 375 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, కర్నాటక, ఏపీ, మహారాష్ట్రల నుంచి 23,500 మంది హోంగార్డులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో.. ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. కూంబింగ్, ఏరియా డామినేషన్ సెర్చ్ చేపట్టారు. ఓటెత్తని హైదరాబాద్! సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లా పరిధిలో రాష్ట్రంలోనే తక్కువగా పో లింగ్ నమోదైంది. అధికారులు ఎంతగా అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా.. ఎప్పటిలాగే హైదరాబాద్ జనం ఓటు వేసేందుకు తరలివెళ్లలేదు. పోలింగ్ కేంద్రాల్లో ఎంత క్యూ ఉందో, ఎంత సమయంలో ఓటేయవచ్చో ఆన్లైన్లో ముందే తెలుసుకునే సదుపాయం కల్పించినా ఫలితం రాలేదు. చాలా వరకు సెలవురోజుగానే భావించి విశ్రాంతి తీసుకునేందుకు, వినోద కార్యక్రమాల్లో మునిగిపోయి ఉండటమే దీనికి కారణమని అధికారవర్గాలు చెప్తున్నాయి. అంతేగాకుండా ఒకటి కంటే ఎక్కువచోట్లా ఓట్లున్నవారూ ఇక్కడ గణనీయంగా ఉండటం, వారంతా స్వస్థలాలకు తరలడం కూడా పోలింగ్ తగ్గడానికి మరో కారణమని పేర్కొంటున్నాయి. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించిన సమాచారం మేరకు.. జిల్లాలో కడపటి వార్తలు అందేసరికి 46.65 శాతమే పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల (50.51 శాతం)తో పోలిస్తే ఐదు శాతం తగ్గడం గమనార్హం. జిల్లాల్లో ఓటింగ్ తీరు ఇదీ.. ఉమ్మడి ఆదిలాబాద్.. గిరిజన ప్రాంతాల్లో ధాటిగా ఓటింగ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మారుమూల, గిరిజన ప్రాంతాల్లో అధికంగా పోలింగ్ నమోదైంది. ఆసిఫాబాద్, సిర్పూర్, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి తదితర స్థానాల్లో పలుచోట్ల రాత్రిదాకా ఓటింగ్ జరిగింది. కాగజ్నగర్ పట్టణంలోని 90వ పోలింగ్ కేంద్రం వద్ద బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, సిర్పూర్ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్బాబు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీఎస్పీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వారిని అదుపు చేసే క్రమంలో డీఎస్పీ శ్రీనివాస్రావు, ఎస్సై గంగన్న, కానిస్టేబుల్ రత్నాకర్, మరికొందరికి గాయాలయ్యాయి. ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలని ప్రవీణ్కుమార్ రిటరి్నంగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా వరిపేట, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం కొత్తపల్లిలలో ప్రజలు తమ సమస్యలు తీర్చలేదంటూ నిరసన వ్యక్తం చేయగా.. అధికారులు నచ్చజెప్పడంతో ఓటేశారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ గ్రామస్తులు.. తమ ఊరిగి రోడ్డు, మంచినీటి సౌకర్యం కల్పించాలంటూ ఓటు వేయలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో నిలబడి ఇద్దరు మృతి చెందారు. ఉమ్మడి ఖమ్మం.. గ్రామాల్లో పోలింగ్ బహిష్కరణ ఖమ్మం ఉమ్మడి నియోజకవర్గాల్లో పలుచోట్ల రాత్రి 8వరకు కూడా పోలింగ్ జరిగింది. కొత్తగూడెం రూరల్, ఏన్కూరు, సత్తుపల్లి మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదంటూ పోలింగ్ను బహిష్కరించారు. అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి సర్దిచెప్పడంతో మధ్యాహ్నం ఓట్లు వేశారు. కూసుమంచి, ఎర్రుపాలెం, తల్లాడ, బోనకల్, కొనిజర్ల, తిరుమలాయపాలెం, అశ్వారావుపేట, మణుగూరు, పినపాక మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఖమ్మం రూ రల్ మండలంలోని గోళ్లపాడులో ఏనుగు సీతారాంరెడ్డి(75) ఓటు వేసి పోలింగ్ బూత్ నుంచి బయటికి వస్తూ కుప్పకూలి కన్నుమూశాడు. ఉమ్మడి రంగారెడ్డి.. బాగా తగ్గిన పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గత ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్శాతం తగ్గింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఖానాపూర్లో, రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండలో, మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లిలో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి నల్లగొండ.. పలుచోట్ల లాఠీచార్జి నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల లాఠీచార్జిలు, చెదురుమదురు ఘటనలు జరిగాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఆలేరు మండలం కొలనుపాకలో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్రెడ్డి గులాబీ కండువాతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పారు. ఈసమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు రాళ్లు రువ్వడంతో మహేందర్రెడ్డి కారు అద్దాలు పగిలాయి. పోలీసులు లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టారు. హుజూర్నగర్లోనూ గులాబీ కండువా వేసుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డిని పోలీసులు ఆపడంతో వాగ్వాదం జరిగింది. నారాయణపురం మండల కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు టెండర్ ఓట్లు వేశారు. ఉమ్మడి కరీంనగర్.. డబ్బుల కోసం నిరసనలతో.. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో పెద్దగా అవాంఛనీయ ఘటన లు జరగలేదు. కరీంనగర్ జిల్లాలో రేకుర్తిలో కాంగ్రెస్ ఎన్నికల ఏజెంట్ వాహనాన్ని బీఆర్ఎస్ నాయకులు అడ్డగించారని పోలీసులకు ఫిర్యా దు అందింది. మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ గులాబీ చొక్కా ధరించి పోలింగ్ కేంద్రాలకు వచ్చారంటూ మొగిలిపాలెం, గన్నేరువరం గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెప్పడంతో వాగ్వాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండ లం గంగారంలో అధికార పార్టీ అభ్యర్థి పంచిన డబ్బులు తమకు అందలేదంటూ కొందరు ఓటర్లు రోడ్డుపై బైఠాయించారు. రాజన్న సిరిసి ల్ల జిల్లా లింగంపేటలో తమకు డబ్బులు ఇవ్వలేదంటూ బీజేపీ నాయకుడి ఇంటి వద్ద మహిళా గ్రూపు సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్.. ప్రశాంతంగా పోలింగ్.. పాలమూరు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రి 9 గంటల వరకు పోలింగ్ జరిగింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం వంకేశ్వరంలో డబ్బులు పంచుతున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య, మరికొన్నిచోట్ల బీఆర్ఎస్–బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వర్కూర్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డికి, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య గొడవ చోటు చేసుకుంది. ఉమ్మడి నిజామాబాద్.. మందకొడిగా మొదలై.. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పోలింగ్ మందకొడిగా ప్రారంభమై మధ్యాహ్నానికి పుంజుకుంది. పలుచోట్ల రాత్రిదాకా ఓటర్లు క్యూలలో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని పలుచోట్ల గుమిగూడిన పార్టీల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. పలువురికి గాయాలయ్యాయి. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డిని నాన్లోకల్ అంటూ బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఉమ్మడి వరంగల్.. బీఆర్ఎస్–కాంగ్రెస్ జగడం వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, మరికొన్ని చోట్ల తమ గ్రామాలను అభివృద్ధి చేయలేదంటూ జనం రాకపోవడంతో ఓటింగ్ జరగలేదు. దంతాలపల్లి బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. మంగపేటలో బీఆర్ఎస్ నేత మాజీ జెడ్పీటీసీ వైకుంఠం ఓట్లకు డబ్బులిస్తానని మోసం చేశారంటూ పలువురు ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. జనగామ నియోజకవర్గ కేంద్రంలోని ఓ పోలింగ్ స్టేషన్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి సతీమణి నీలిమ, కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి కుమారుడు ప్రశాంత్రెడ్డి, కోడలు దివ్యల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు గొడవకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. జనగామ మండలం శామీర్పేట పోలింగ్ కేంద్రంలో ఎదురుపడిన పల్లా రాజేశ్వర్రెడ్డి, కొమ్మూరి ప్రతాప్రెడ్డి పరుష పదజాలంతో దూషించుకున్నారు. ఇక్కడా బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పరస్పర దాడులకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఉమ్మడి మెదక్.. స్వల్ప ఘర్షణల మధ్య.. మెదక్ ఉమ్మడి జిల్లాలో పోలింగ్ సందర్భంగా పలుచోట్ల స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాటలు జరగడంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. మునిపల్లి మండలం పెద్దగోకులారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య, సదాశివపేట ఎంపీడీఓ కార్యాలయం వద్ద, పటాన్చెరులో మూడుచోట్ల బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఎన్నికల విధుల్లో గుండెపోటుతో ఉద్యోగి మృతి పటాన్చెరుటౌన్/కైలాస్నగర్: ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన ఈ సంఘటనపై ఎస్ఐ సురేందర్ రెడ్డి కథనం ప్రకారం.. కొండాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన నీరడి సుధాకర్ (43) కొండాపూర్లో వెటర్నరీ విభాగంలో సహాయకునిగా పని చే స్తున్నారు. బుధవారం పటాన్చెరు మండలం ఇస్నా పూర్ గ్రామం (248) పోలింగ్ బూత్లో ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చారు. ఈ క్రమంలో అర్ధరాత్రి గుండెపోటు రావడంతో సీపీఆర్ చేసి ప టాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే చెందినట్లు వెల్లడించారు. ఓటు వేయడానికి వచ్చి మృతి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ కాలనీకి చెందిన చంద్రగిరి రాజన్న (65) ఓటు వేసేందుకు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. క్యూలో నిల్చున్న సమయంలో కళ్లు తిరిగి కింద పడ్డాడు. వెంటనే స్థానికులు హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. -
రాష్ట్రంలో కాంగ్రెస్దే విజయం: భట్టి
మధిర: రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం ఏర్పాటు కావాలని, ప్రజాస్వామ్యయుత సామాజిక నిర్మాణం జరగాలనే ఆకాంక్షతో ఓటర్లు కాంగ్రెస్కు ఓటు వేశారని సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మధిరలో ఓటు హక్కు వినియోగించుకోవడంతోపాటు నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సంపద ప్రజలకు పంచాలని.. సక్రమంగా అన్ని వర్గాలకు అందాలని బలంగా కోరుకుంటున్నానని చెప్పారు. పదేళ్ల కాలంలో వనరులు, సంపద రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా దోపిడీకి గురైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు బాటలు వేశారని భట్టి వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలతోపాటు మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్నీ తూ.చ. తప్పక అమలు చేస్తామని చెప్పారు. -
ఆ రెండు నియోజకవర్గాల గెలుపోటములపై లక్షల్లో బెట్టింగ్లు.. మరి గెలిచేది ఎవరు?
సిరిసిల్లక్రైం: జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు, ప్రజల నుంచి అత్యంత స్పందన అచిరకాలంలో గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపోటములపై కార్యకర్తలు, అభిమానులు జోరుగా బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ను భారత్ పాకిస్థాన్ క్రికెట్ పోటీని వీక్షించిన విధానంలో ఓట్ల లెక్కింపును చూసే అవకాశాలున్నాయని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే లక్షల రూపాయల్లో బెట్టింగ్కు ఆజ్యం పలికిన నాయకులు ఉన్నారని, ఇలా బెట్టింగ్ చేసిన వారందరూ ఓట్ల లెక్కింపు జరిగే ఆదివారం ఒకే వేదికగా ఉండి పండుగ చేసుకునేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో అభివృద్ధిని ప్రచారం చేసిన కేటీఆర్కు విజయం కాస్త అటు.. ఇటుగా ఉంటుందనుకుంటున్న వాళ్లు లేకపోలేదు. కానీ వేములవాడలోని త్రిముఖ పోరులు అందరూ ఉద్దండులేనని ఇక్కడి ఫలితాలపై నియోజకవర్గప్రజలు అత్యంత ఆసక్తిగా ఉన్నారని సమాచారం. ఏది ఏమైనా గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో నేతలు హోరాహోరీగా ప్రచారాలు, పార్టీల బడా నేతలు రావడం వంటి వాటితో గెలుపు ఆయా పార్టీ బాధ్యులు ఆసక్తిగా ఎదరుచూస్తూ బెట్టింగ్లకు దిగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇలాంటి విధానాలను పోలీసు అధికారులు ఎలా నియంత్రిస్తారో వేచిచూడాల్సిందే. ఇది చదవండి: ఎస్కార్ట్ లేకుండానే ఈవీఎంల తరలింపు.. అడ్డుకున్న గ్రామస్తులు -
రైతుపై ఎస్ఐ దాడి.. తర్వాత తొందరపాటు అంటూ క్షమాపనలు!
మునగాల(కోదాడ): మండలంలోని నర్సింహాపురంలో గురువారం ఓ రైతుపై చిలుకూరు ఎస్ఐ దాడి చేసి గాయపర్చాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సింహాపురం గ్రాామానికి చెందిన రైతు పుల్లూరు కృష్ణ (ఐదవ వార్డు సభ్యుడు) తన వరిపొలం కోసి ధాన్యాన్ని గ్రామంలో ఉన్న పుల్లూరి వెంకటనారాయణ –అరుణ కళావేదిక ఆవరణలో ఆరబోసి కాపలగా ఉన్నాడు. ఎన్నికల విధుల్లో ఉన్న చిలుకూరు ఎస్ఐ చల్లా శ్రీనివాస్యాదవ్ గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టాడు. అనంతరం ధాన్యానికి కాపలాగా ఉన్న రైతు కృష్ణ వద్దకు వచ్చి ఇక్కడి నుంచి దూరంగా వెళ్లాలని ఆదేశించాడు. దీంతో సదరు రైతు ధాన్యం వద్ద కాపాలా ఉన్నాను అని సమాధానం ఇవ్వడంతో ఎస్ఐ దౌర్జన్యంగా దూరంగా పో అంటూ కాలర్ పాటి కొద్ది దూరం లాక్కొని వెళ్లాడు. తనపై ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారని ప్రశ్నించిన రైతుపై ఎస్ఐ మరోసారి దాడి చేయడంతో మోకాళ్లకు గాయాలయ్యాయి. దీంతో గ్రామస్తులు సదరు ఎస్ఐని చుట్టుముట్టి అకారణంగా ఓ రైతుపై ఎందుకు దౌర్జన్యం చేశావని ఎదురుతిరిగారు. దీంతో ఎస్ఐ నేను తొందరపడ్డాను క్షమించండి అంటూ అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు. అకారణంగా రైతుపై దాడిచేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోదాడ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. విషయాన్నికాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్.పద్మావతి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె రైతును ఫోన్లో పరామర్శించి సదరు ఎస్ఐపై చర్యలు తీసుకునే విధంగా పోలీసు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. -
ఎస్కార్ట్ లేకుండానే ఈవీఎంల తరలింపు.. అడ్డుకున్న గ్రామస్తులు
నాగారం: నాగారం మండలం పేరబోయినగూడెంలో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు ఎస్కార్ట్ లేకుండా ఈవీఎంలను తరలిస్తుండటంతో గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.పేరబోయినగూడెం గ్రామంలో సాయంత్రం 5:10గంటలకు పోలింగ్ ముగిసింది. అధికారులు ఎస్కార్ట్ లేకుండానే ఈవీఎం బాక్సులను మినీ బస్సులో ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న నరసింహులగూడెం వరకు తరలించారు. అదే మాదిరిగా నరసింహులగూడెంలో ఉన్న ఈవీఎంను కూడా మినీ బస్సులో తరలించేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో సెక్టోరియల్ అధికారి అదనపు ఈవీఎంలను తన కారులో వేసుకుని నర్సింహులగూడేనికి చేరుకున్నాడు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు కారులో ఉన్న ఖాళీ ఈవీఎంలను గమనించి ఎక్కడివి అని ప్రశ్నించారు. ఈ క్రమంలో సెక్టోరియల్ అధికారి అదనపు ఖాళీ ఈవీఎంలు అని చెప్పే ప్రయత్నం చేస్తుండగానే ఎస్కార్ట్ లేకుండా ఈవీఎం బాక్సులను తరలించవద్దని ఆందోళనకు దిగారు. కారులో ఉన్న ఖాళీ ఈవీఎంలు పోలింగ్ అయిన ఈవీఎంల స్థానంలో మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. దీంతో సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సెక్టోరియల్ అధికారి వెంట అదనపు ఏవీఎంలు ఉంటాయని గ్రామస్తులకు వివరించే ప్రయత్నిం చేశారు. అయినా ఆందోళన విరమించకుండా బాక్సులు తారుమారు చేసే కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు అక్కడి నుంచి ఎస్కార్ట్ వాహనం ఇచ్చి ఈవీఎంలను తరలించారు. గ్రామస్తులు అనుమానంతో ఈవీఎంలు తరలిస్తున్న వాహనాన్ని భద్రపరిచే స్థలం తుంగతుర్తి వరకు వెంబడించారు. సెక్టోరియల్ అధికారి కారు అద్దాలు ధ్వంసం తుంగతుర్తి గోదాం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు అధికసంఖ్యలో గుమిగూడి ఈవీఎంలు తరలిస్తున్న సెక్టోరియల్ అధికారి కారును అడ్డగించారు. అనంతరం కారు అద్దాలను ధ్వంసం చేశారు. తమ ఎదుట ఖాళీ ఈవీఎంలను ఓపెన్ చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అదుపుచేసి ఈవీఎంలను గోదాముకు తరలించారు. ఈ విషయంపై తమకు వివరణ ఇవ్వాలని కార్యకర్తలు ఆర్వో వెంకట్రెడ్డి, డీఎస్పీ రవిలను కోరారు. దీంతో వారు కాంగ్రెస్ నాయకులకు, ఏజెంట్ల ఎదుట ఖాళీ ఈవీఎంలను తెరిచి వారి అనుమానాన్ని నివృత్తి చేశారు. -
హస్తం గాలి ‘వీచినట్టేనా’!
సాక్షి, హైదరాబాద్: ఈసారి అధికారం కచ్చితంగా దక్కుతుందనే ధీమా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. గురువారం జరిగిన పోలింగ్ సరళిని బట్టి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా తమకు అనుకూల పరిస్థితులు కనిపించాయని, 70కి పైగా స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇప్పటికి ప్రజలు తమను ఆదరించారని, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పాలన పట్ల వ్యతిరేకతతో ఉన్న అన్ని వర్గాలూ తమవైపు మొగ్గుచూపాయనే అభిప్రాయం రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఊహించని విజయం దక్కుతుందని, మిగిలిన జిల్లాల్లో కూడా ఓ మోస్తరు నుంచి అధిక శాతం సీట్లలో గెలుపు తమదేనని వారు లెక్కలు వేస్తున్నారు. సింగరేణి ప్రాంత ఓటర్లు కూడా తమవైపే నిలిచారని, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ఎక్కువ స్థానాలు తమ ఖాతాలోనే పడతాయని చెబుతున్నారు. ఇక, హైదరాబాద్ శివార్లలో కూడా తమకు భారీగా పోలింగ్ జరిగిందని అంచనా వేస్తున్నారు. మెజార్టీ ఎగ్జిట్పోల్స్ కూడా తమదే అధికారం అని చెపుతున్న నేపథ్యంలో ఈనెల 3న∙ఫలితాల కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు ఆత్రుతతో ఎదురుచూస్తుండడం గమనార్హం. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన సమయం నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలంతా పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ఠాక్రే, ఏఐసీసీ పరిశీలకురాలు దీపాదాస్మున్షీ, టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ గాం«దీభవన్లోని వార్రూంలో కూర్చుని పరిస్థితిని సమీక్షించారు. నియో జకవర్గాల వారీగా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తూ, క్షేత్రస్థాయిలోని నాయకత్వానికి అవసరమైన సూచనలు చేస్తూ వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్ల నాడి అనుకూలంగానే ఉన్నా పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తమ ఓట్లన్నీ కచ్చితంగా పోలయ్యేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వార్ రూం కోఆర్డినేటర్ విజయభాస్కర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్కౌశిక్యాదవ్ వార్రూం సిబ్బందితో కలిసి ఎప్పటికప్పుడు అభ్యర్థులు, స్థానిక పార్టీ నేతలతో మాట్లాడుతూ పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టి పనిచేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటిస్తూనే ఎప్పటికప్పుడు వార్రూంతో టచ్లో ఉంటూ పోలింగ్ సరళిపై ఆరా తీశారు. సీఎల్పీ నేత భట్టితో పాటు ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ తీరును పరిశీలించారు. ఈ ఎన్నికల్లో వ్యూహకర్తగా కీలకపాత్ర పోషించిన సునీల్ కనుగోలు ఆయన బృందం కూడా పోలింగ్ సరళిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్ని స్థానాల్లో సానుకూలత ఉందన్న లెక్కలు కట్టింది. ఆ నాలుగు.. మావే జిల్లాల వారీగా విశ్లేషిస్తే పోలింగ్ తీరును బట్టి నాలుగు జిల్లాల్లో చెప్పుకోదగిన స్థానాలు సాధిస్తామనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్తో పాటు వరంగల్ జిల్లాల్లో ఉన్న 46 స్థానాల్లోనే 35 తమకు ఖాయమని లెక్కలు వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో కూడా బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కొంచెం అటూ ఇటుగా ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. హైదరాబాద్ పరిధిలోనికి వచ్చే స్థానాల్లో కూడా 4–5 చోట్ల గెలుపునకు అవకాశాలున్నాయని, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి 10 స్థానాల వరకు చేరుకుంటామని అంటున్నారు. అన్ని జిల్లాల్లో కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే ఓ 10 సీట్లు ఎక్కువే వస్తాయన్న నమ్మకాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. -
కాంగ్రెస్ సునామీ సృష్టించింది!
సాక్షి, కామారెడ్డి: ‘తెలంగాణలో కాంగ్రెస్ సునామీ సృష్టించింది. బీఆర్ఎస్కు 25కు మించి సీట్లు రానేరావు. గెలిచే అవకాశమే ఉంటే సీఎం మీడియా ముందుకు వచ్చి గొప్పలు చెప్పేవారు. కానీ కేటీఆర్ వచ్చి అదే బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నాడు. అయితే తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని మరోసారి రుజువైంది. పదేళ్లుగా తెలంగాణను పట్టి పీడిస్తున్న కేసీఆర్ను కామారెడ్డిలో ఓడిస్తున్నందుకు సంతోషంగా ఉంది..’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం కామారెడ్డిలో మాజీమంత్రి షబ్బీర్ అలీ నివాసంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాంతాచారి త్యాగానికి, ఎన్నికలకు సంబంధం ‘మలి తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి త్యాగానికి, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు సంబంధం ఉంది. 2009 నవంబర్ 29న ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయాడు. మృత్యువుతో పోరాడి డిసెంబర్ 3న తనువు చాలించాడు. ఇప్పుడు నవంబర్ 29న ఎన్నికల ప్రక్రియ మొదలై, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. అప్పుడు డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు సోనియాగాంధీ ఆదేశాలతో నాటి హోంమంత్రి చిదంబరం ప్రకటన చేశారు. ఇప్పుడు డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడుతుంది. ఈ విధంగా యాదృచ్చికమో, దేవుని ఆదేశమో తెలియదు కానీ, శ్రీకాంతాచారి త్యాగానికి, ఇప్పటి ప్రజాతీర్పుకు సంబంధం ఉన్నట్టు అర్థమైంది. శ్రీకాంతాచారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం..’అని రేవంత్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ నిజమైతే క్షమాపణ చెబుతారా? ‘ఓటమి ఎదురవుతుందన్నపుడల్లా నియోజకవర్గం మారడం కేసీఆర్కు అలవాటు. అయితే చైతన్యవంతులైన కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పారు. ప్రజల్లో చైతన్యం వచ్చింది. అధికారం శాశ్వతమనే కేసీఆర్ నమ్మకం వమ్మయ్యింది. ఎగ్జిట్పోల్స్ అన్నీ కాంగ్రెస్కు మెజారిటీని కట్టబెడుతున్నాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ రబ్బిష్ అని కేటీఆర్ అన్నారు. మరి అవే నిజమైతే క్షమాపణలు చెబుతారా? ఎగ్జిట్ పోల్స్ మీద కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ రోజు రాత్రి నుంచే కార్యకర్తలు సంబరాలు చేసుకోవాలి..’అని టీపీసీసీ చీఫ్ అన్నారు. వెంటనే ఆరు గ్యారంటీల అమలు ‘కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మరుక్షణమే ఆరు గ్యారంటీల అమలుకు తొలి మంత్రివర్గంలో తీర్మానం చేస్తాం. ప్రొఫెసర్ కోదండరాంకు అమరుల కుటుంబాలు, ఉద్యమకారుల సంక్షేమానికి సబంధించిన బాధ్యతలు అప్పగిస్తాం. మేము పాలకులుగా ఉండబోము.. సేవకులుగా ఉంటాం. వెంటనే ప్రజాస్వామిక విలువల్ని పునరుద్ధరిస్తాం. అన్ని వర్గాలకు స్వేచ్ఛ ఉంటుంది. ఎక్కడా అజమాయిషీ చెలాయించబోము. ఎవరినీ ఇబ్బందులకు గురిచేయడం జరగదు. తెలంగాణ ప్రజలకు ఐదేళ్లు సేవ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది..’అని రేవంత్ చెప్పారు. పదవి పార్టీ నిర్ణయిస్తుంది తాను ఏ పదవిలో ఉండాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని రేవంత్రెడ్డి అన్నారు. రెండుచోట్లా గెలిస్తే ఏ నియోజక వర్గంలో ఉంటారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. తనకు ఇవి రెండే కాదని, ఎంపీ పదవి కూడా ఉందని, ఇందులో దేనిలో కొనసాగాలన్న దానిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, దాన్ని ఆచరిస్తానని చెప్పారు. సమావేంలో మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మానాల మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొడంగల్లో ఓటేసిన రేవంత్రెడ్డి కొడంగల్: పీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్రెడ్డి గురువారం కొడంగల్లో ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకున్న ఆయన ఓటుహక్కును వినియోగించుకున్నారు. -
అంతా బీఆర్ఎస్ కనుసన్నల్లోనే పనిచేశారు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంఘం అజమాయిషిలోనే పోలీసులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పనిచేయాల్సి ఉన్నా... బీఆర్ఎస్ సర్కార్ కనుసన్నల్లోనే వారంతా పనిచేశారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఆరోపించారు. పోలింగ్ సందర్భంగా అనేక ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి డబ్బులు, మద్యం పంపిణీ చేశాయని విమర్శించారు. ముఖ్యంగా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. పలు ప్రాంతాల్లో వారి కళ్లముందే వేల రూపాయలు ఓటర్లకు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పంపిణీ చేసినా చూస్తుండిపోయారని మండిపడ్డారు. గురువారం పోలింగ్ ముగిశాక పార్టీ నేతలు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, డా. కాసం వెంకటేశ్వర్లు యాదవ్, డా.బూర నర్సయ్యగౌడ్, మాజీ డీజీపీ కృష్ణప్రసాద్తో కలిసి కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇలాంటి వ్యవహారాలపై ఈసీ మరింత కఠినంగా వ్యవహరించి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటర్లను భయపెట్టాయి కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీపడి డబ్బు, ఇతరరూపాల్లో ప్రలోభాలకు దిగినట్లు, అనేక ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినట్టు తమకు నివేదికలు అందాయని కిషన్రెడ్డి చెప్పారు. ఇంత ఒత్తిడి ఉన్నా, యువత, ఇతరవర్గాల ప్రజలు ధైర్యంగా బీజేపీ పక్షాన నిలిచి పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేశారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ల గూండాయిజానికి వెరవకుంగా రాష్ట్రవ్యాప్తంగా మొక్కవోని ధైర్యంతో పోరాడిన బీజేపీ కార్యకర్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. గత వారం రోజులుగా చూస్తే కొన్ని చోట్ల బీఆర్ఎస్ నేతలు బీజేపీ అభ్యర్థులు, కా ర్యకర్తలపై భౌతికదాడులకు సైతం దిగారని, పోలింగ్ సందర్భంగా కూడా బీజేపీ కార్యకర్తలపై దాడి చేసి దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీక్షాదివస్ పేరిట బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా, కాంగ్రెస్ పార్టీ పోలింగ్ రోజు కూడా పత్రికా ప్రకటనలతో బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు. మంచి ఫలితాలు సాధిస్తామన్న నమ్మకముంది బీజేపీ శక్తి మేరకు సమర్థవంతంగా పోరాడిందని, ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిస్తుందనే ధీమా, విశ్వాసం తమకు ఉందని కిషన్రెడ్డి చెప్పారు. కాగా, పోలింగ్ నాడే నాగార్జునసాగర్ వద్ద రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీయడంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని లేఖ రాస్తానని కిషన్రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్తో ఒప్పందం ఉండదు తెలంగాణలో బీజేపీ అధిక సీట్లు గెలుస్తుందని, అధికారాన్ని సొంతం చేసుకునేంత స్థాయిలో ఫలితాలు వస్తాయనే ఆశాభావాన్ని కిషన్రెడ్డి వ్యక్తం చేశారు. గురువారం ఆయన టీవీ చానళ్ల ప్రతినిధులతో మాట్లాడారు. బీఆర్ఎస్తో ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పందం కుదుర్చుకునే పరిస్థితి ఉండదని తేల్చిచెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 సీట్లలో ముఖ్యంగా విద్యావంతులు ఎక్కువగా ఉన్న చోట్ల పోలింగ్ శాతం తక్కువగా ఉండడం మంచి పరిణామం కాదన్నారు. తక్కువ ఓటింగ్ శాతం (50 శాతం కంటే తక్కువ ఉన్నచోట్ల) కారణంగా పట్టణ ప్రాంతాల్లో కొద్దిమేర బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉండొచ్చని అంచనా వేశారు. -
ఓట్లు, సీట్లు పెరుగుతాయ్!
సాక్షి, హైదరాబాద్:అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి అంచనాలకు అందని విధంగా ఉండటంతో బీజేపీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కచ్చితంగా ఎక్కువ సీట్లు గెలుపొందడంతోపాటు, గణనీయంగా ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటామనే ధీమా పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. కొన్ని నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్లలో సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ఓటర్లు పెద్దసంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్న పరిస్థితులనూ పార్టీ బేరీజు వేస్తోంది. వివిధ వర్గాల ప్రజలు పోలింగ్కు హాజరైన తీరు తదితర అంశాలను బట్టి ఓటర్ల నాడిని పసిగట్టడం సాధ్యం కాకపోవడంతో నమోదైన తుది పోలింగ్ శాతాన్ని బట్టి పరిస్థితి అంచనా వేయొచ్చనే అభిప్రాయంతో పార్టీ నేతలున్నారు. యువత ఎక్కువ శాతం ఓటింగ్లో పాల్గొన్నదనే అంచనాల మధ్య ఈసారి ఎక్కువ చోట్ల పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావొచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. 45–50 చోట్ల పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తారని (బీఆర్ఎస్, కాంగ్రెస్లతో ముఖాముఖి, త్రిముఖ పోటీలు కలుపుకుని), వాటిలో అధిక స్థానాల్లో రెండోస్థానంలో నిలుస్తామని, కనీసం 12–15 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో కంటే ఓట్ల శాతంతోపాటు సీట్లు కూడా పెరుగుతాయనే ధీమా పార్టీ నాయకుల్లో వ్యక్తమౌతోంది. పుంజుకున్న బలం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 7 శాతం ఓట్లతో ఒకేఒక సీటు సాధించగా, 2019 లోక్సభ ఎన్నికల్లో 18 శాతానికి ఓటింగ్ శాతం పెరిగి, 4 ఎంపీ సీట్లను గెలుచుకుంది. దీన్నిబట్టి చూస్తే గత లోక్సభ ఎన్నికల నుంచి రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకుందని అంటున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు సాధించడం, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలవడం వంటి సానుకూల పరిణామాలను ఉదహరిస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 20కి చేరుకోవడంతోపాటు 12–15 స్థానాలు సాధిస్తామనే ధీమా వ్యక్తమవుతోంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రచారం పార్టీకి కలిసి వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ బీసీ నినాదం, అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామనే ప్రకటన, ఎస్సీ వర్గీకరణపై అనుకూల నిర్ణయం వంటివి పార్టీకి అనుకూలంగా పనిచేస్తాయంటున్నారు. బిజీబిజీగా ముఖ్యనేతలు గురువారం పోలింగ్ సందర్భంగా... క్షేత్రస్థాయిలోని నాయకులు, కార్యకర్తల నుంచి పోలింగ్ తీరు, ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ పార్టీ ముఖ్యనేతలు బిజీబిజీగా గడిపారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి ఓటింగ్ సరళి, పార్టీ పరిస్థితి, ఇతర అంశాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ పరిశీలించారు. ఫోన్ ద్వారా పార్టీ నాయకుల నుంచి కిషన్రెడ్డి సమాచారాన్ని క్రోడీకరించే ప్రయత్నం చేశారు. పలుచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల అక్రమాలకు పాల్పడినా పోలీసులు, అధికారులు ప్రేక్షకపాత్ర పోషించారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కు కిషన్రెడ్డి ఫిర్యాదు చేశారు. పోలింగ్ సరళిపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీశారు. మధ్యాహ్నం 3 గంటలకు వారు కిషన్రెడ్డికి ఫోన్ చేసి ఓటింగ్ ప్రక్రియ ఎలా సాగుతోంది, ఎన్ని సీట్లలో గెలుస్తామనే విషయాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. -
హ్యాట్రిక్పై బీఆర్ఎస్ ధీమా!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో పార్టీ సాధించబోయే ఫలితంపై బీఆర్ఎస్ పోస్టుమార్టం ప్రారంభించింది. 70కిపైగా అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. పార్టీ సొంత బలంతోనే వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పోలింగ్ ముగిశాక తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు భిన్నంగా ఆదివారం వెలువడే ఫలితాలు ఉంటాయని బీఆర్ఎస్ గట్టిగా విశ్వసిస్తోంది. సీఎం కేసీఆర్ దంపతులు గురువారం ఉదయం ఎర్రవల్లి ఫామ్హౌజ్ నుంచి హెలికాప్టర్లో వెళ్లి సిద్దిపేట నియోజకవర్గం చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరిగి ఫామ్హౌజ్కు చేరుకున్న కేసీఆర్.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళిని పరిశీలిస్తూ పార్టీ అభ్యర్థులు, నేతలకు ఫోన్ ద్వారా దిశానిర్దేశం చేశారు. మరోవైపు కేటీఆర్, హరీశ్రావు తాము ప్రాతినిధ్యం వహి స్తున్న సిరిసిల్ల, సిద్దిపేట సెగ్మెంట్లలో పోలింగ్ సరళిని పరిశీలిస్తూనే, తమకు బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. అధికారం ఖాయమంటూ వార్రూమ్ నివేదిక అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక నియోజకవర్గాల్లో, హైదరాబాద్లో బీఆర్ఎస్ వార్రూమ్లను ప్రారంభించింది. ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ సహా అనేక అంశాలను అవి సమన్వయం చేస్తూ వచ్చాయి. క్షేత్రస్థాయి పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలను అందజేశాయి. ఆ నివేదికల ఆధారంగా నియోజకవర్గాల వారీగా ఫలితాలను బీఆర్ఎస్ అంచనా వేసుకుంది. ఈ క్రమంలో పోల్ మేనేజ్మెంట్లో ప్రతిపక్షాల కంటే ముందంజలో ఉన్నామని, అది కలసి వస్తుందని ధీమా గా ఉంది. పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకు, ప్ర భుత్వ పథకాల లబ్దిదారులు, విద్యావంతులైన యు వత, క్షేత్రస్థాయిలో పోల్ మేనేజ్మెంట్ అనుకూలించినట్టు భావిస్తోంది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా లబ్దిదారుల్లో 90శాతం మంది ఓటర్లు బీఆర్ఎస్కే ఓటేశారని.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా గంపగుత్తగా కాంగ్రెస్కు పడలేదని వార్రూమ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్తోపాటు రంగారెడ్డి జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు కలిపి మొత్తంగా 40కిపైగా సీట్లలో బీజేపీ గణనీయంగా ఓట్లు సాధించే పరిస్థితి ఉందని, ఇది కాంగ్రెస్కు పగ్గాలు వేసిందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. హైదరాబాద్తోపాటు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో మెజారిటీ సీట్లు తమకే దక్కుతాయని లెక్కలు వేసుకుంటోంది. కేవలం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ తమపై పైచేయి సాధించే అవకాశం ఉన్నట్టు పోలింగ్ సరళిని బట్టి అంచనాకు వస్తోంది. వర్గాల వారీగా లెక్కలు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో గ్రామీణ ప్రాంత యువత ఓట్లు చాలా వరకు కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువ పడ్డాయని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. తొలిసారి ఓటు హక్కు పొందిన వారిలో మెజారిటీ ఓటర్లు బీఆర్ఎస్కే వేశారని అంటోంది. క్షేత్రస్థాయిలో చాలాచోట్ల కాంగ్రెస్కు పటిష్ట యంత్రాంగం లేకపోవడాన్ని బీఆర్ఎస్ అభ్యర్థులు అనువుగా మల్చుకోవడంలో సఫలమయ్యారని క్షేత్రస్థాయిలో పనిచేసిన ఏజెన్సీలు పేర్కొన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక క్షేత్రస్థాయిలో సామాజికవర్గాల వారీగా ఓటింగ్ తీరునూ బీఆర్ఎస్ మదింపు చేస్తోంది. దళితబంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ యువత అంశాలతోపాటు పార్టీ అభ్యర్థులపై, వారి అనుచరులపై వ్యతిరేకత వంటివి కొంత మేర ప్రతికూలత చూపినట్టు భావిస్తోంది. -
బీఆర్ఎస్కు ఎగ్జిట్ పోల్స్ షాక్ !
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగిసింది. పోలింగ్ ముగిసిన వెంటనే ప్రముఖ మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. 90 శాతం ఎగ్జిట్ పోల్స్ గులాబీ పార్టీకి ఈ ఎన్నికల్లో నెగెటివ్ ఫలితాలే రానున్నాయని ప్రెడిక్ట్ చేశాయి. ఇదే సమయంలో ఒకటి రెండు సీట్లు అటుఇటుగా కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా రానుందని చాలా వరకు సర్వేలు తెలిపాయి. బీజేపీకి 10 దాకా, ఎంఐఎంకు మళ్లీ 6 లేదా 7 సీట్లు రానున్నాయని వెల్లడించాయి. బీఆర్ఎస్కు 48 సీట్లే: సీఎన్ఎన్ న్యూస్ 18 ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్లో బీఆర్ఎస్కు 48 సీట్లే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్కు 56, బీజేపీకి 10 సీట్లు రానున్నాయని వెల్లడించింది. కాంగ్రెస్కు మ్యాజిక్ ఫిగర్ : ఆరా మస్తాన్ సర్వే తెలంగాణ ఎన్నికలపై ఇప్పటివరకు పక్కాగా సర్వేలు విడుదల చేసిన ఆరా మస్తాన్ ప్రీ పోల్ సర్వే కూడా బీఆర్ఎస్కు 41-49 సీట్లే రానున్నాయని తెలిపింది. కాంగ్రెస్కు ఏకంగా 58-67 సీట్లు రానున్నాయని వెల్లడించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆరా మస్తాన్ సర్వే బీఆర్ఎస్దే విజయం అని చెప్పింది. ఆరా చెప్పినట్లుగానే బీఆర్ఎ్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చాణక్య స్ట్రాటజీస్లో బీఆర్ఎస్కు 30 సీట్లే.. చాణక్యస్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలవనుందని వెల్లడించింది. ఈ సర్వే బీఆర్ఎస్కు 22 నుంచి 30 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్కు సీట్లు 78 వరకు వెల్లవచ్చని పేర్కొంది. బీఆర్ఎస్దే హ్యాట్రిక్ : పల్స్ టుడే పల్స్ టుడే ఎగ్జిట్ పోల్ బీఆర్ఎస్కు 71 సీట్ల దాకా రావచ్చని తెలిపింది. ఈ సర్వేలో కాంగ్రెస్ 38 సీట్ల దగ్గరే ఆగిపోవచ్చని పేర్కొంది. ఈ సర్వేతో పాటు పొలిటికల్ గ్రాఫ్, థర్డ్ విజన్లాంటి సంస్థలు బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ ఈజీగా చేరుకుంటుందని తెలిపింది. మెజారిటీ పోల్స్లో వెనుకబడ్డ కారు సుమారు ఇరవై దాకా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయగా వాటిలో 15కుపైగా సర్వేలు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ది వెనుకంజేనని వెల్లడించాయి. కొన్ని సంస్థలు మాత్రమే మళ్లీ బీఆర్ఎస్దే అధికారం అని తెలిపాయి. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే వెనుకబడిందని చెప్పడంతో తుది ఫలితాల్లో ఇదే నిజమయ్యే ఛాన్స్ లేకపోలేదని రాజకీయ పండితులు అభిప్రాయడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ను తారుమారు చేసిన చరిత్ర బీఆర్ఎస్ది : కేటీఆర్ కాగా, ఎగ్జిట్పోల్స్ రిలీజ్ అయిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ రబ్బిష్ అని కొట్టి పారేయడం విశేషం. తమ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజువు చేసే చరిత్ర ఉందన్నారు. ఎగ్జిట్ పోల్స్ తప్పయితే క్షమాపణ చెప్తారా అని ఎదురు ప్రశ్నించారు. 3వ తేదీన బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ పూర్తి పట్టిక కోసం.. -
బర్రెలక్క(శిరీష)కు అన్ని ఓట్లా..?
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మెజార్టీ సర్వేలు తమ ఎగ్జిట్ పోల్స్లో స్పష్టం చేయగా, ఒకటి రెండు సర్వేలు మాత్రం బీఆర్ఎస్కు గెలిచే అవకాశాలున్నాయి పేర్కొన్నాయి. ఆరా మస్తాన్ సర్వే(ప్రీపోల్ సర్వే) కాంగ్రెస్ 58 నుంచి 67 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక బీఆర్ఎస్ 41-49 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని, అదే సమయంలో బీజేపీ 5 నుంచి 7, ఎంఐఎం, ఇతరులు కలుపుకుని 7 నుంచి 9 స్థానాల్లో విజయం సాధిస్తారని ఆరా మస్తాన్ తన ప్రీపోల్ సర్వేను బయటపెట్టింది. ఇక ఆరా మస్తాన్ సర్వేలోని కొన్ని హైలెట్స్ను చూస్తే తెలంగాణలో ఐదుగురు మంత్రులు తీవ్రమైన పోటీ ఎదుర్కోబోతున్నట్లు పేర్కొంది. ఇక రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ట్రెండింగ్లో నిలిచిన బర్రెలక్క(అలియాస్ శిరీష) కూడా తన ఖాతాలో భారీ ఓట్లను వేసుకోబోతున్నట్లు సదరు సర్వే తెలిపింది. కొల్లాపూర్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలక్క 10 వేలకు పైగా ఓట్లు సాధించే అవకాశం ఉందని తెలిపింది. ఆరా మస్తాన్ సర్వే హైలెట్స్ ఇలా.. 5 గురు మంత్రులు తీవ్రమైన పోటీ ఎదుర్కుంటున్నారు నిర్మల్లో మంత్రి అవుట్ అయ్యి ఛాన్స్ ముధోల్, కామారెడ్డిలలో బీజేపీ గెలిచే ఛాన్స్ బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి గెలిచే అవకాశం కరీంనగర్ లో మంత్రి గంగుల గెలిచే ఛాన్స్ సిరిసిల్లలో కేటీఆర్ మంచి మెజారిటీతో గెలిచే ఛాన్స్ సిద్దిపేటలో అత్యధిక మెజారిటీతో(70 వేలు) హరీష్ గెలిచే ఛాన్స్ దామోదర రాజ నర్సింహ గెలిచే ఛాన్స్ తక్కువ మెజారిటీ తో కేసీఆర్ గెలిచే ఛాన్స్ మహేశ్వరంలో స్వల్ప ఆధిక్యంతో సబిత గెలిచే ఛాన్స్ అంబర్ పేటలో కారుకే ఛాన్స్ తలసాని మంచి మెజారిటీతో గెలుస్తారు వనపర్తిలో మంత్రి నిరంజన్ ఓడిపోయే ఛాన్స్ కొడంగల్ లో రేవంత్ గెలిచే ఛాన్స్ బర్రెలక్క కి 10 వేల ఓట్లు ఉత్తమ్, పద్మావతి గెలుస్తారు కోమటి రెడ్డి బ్రదర్స్ గెలుస్తారు హుజూరాబాద్ లో 50 50 ఛాన్స్ మంత్రి దయాకర్ రావు ఓడిపోయే ఛాన్స్ ఖమ్మలో పువ్వాడ ఓడిపోయే ఛాన్స్ పాలేరు, మధిర కాంగ్రెస్ గెలుస్తుంది కొత్తగూడెంలో సీపీఐ గెలుస్తుంది -
అధికారం శాశ్వతమని కేసీఆర్ నమ్మారు: రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ఓటు వేశారని స్పష్టం చేశారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ను కామారెడ్డిలో ఓడగొడుతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల్లో చైతన్యం వచ్చిందని తేలిపోయిందని అన్నారు. అధికారం శాశ్వతమని కేసీఆర్ నమ్మారని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో డిసెంబర్ 3నే శ్రీకాంతాచారి తుదిశ్వాస విడిచారు.. అదే రోజున ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని రేవంత్ పేర్కొన్నారు. శ్రీకాంతాచారి ప్రాణత్యాగానికి ఎన్నికల ఫలితాలకు ఓ లింక్ ఉందని చెప్పారు. నేడు తెలంగాణ ఎన్నికల పోలింగ్ పూర్తైంది. ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కు మెజారిటీని కట్టబెట్టాయి. ఎగ్జిట్ పోల్స్ రబ్బిస్ అని కేటీఆర్ పేర్కొన్న వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. అవి నిజమైతే కేటీఆర్ క్షమాపణలు చెబుతారా? అని రేవంత్ ప్రశ్నించారు. -
తెలంగాణ ఎన్నికలు ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే
-
మళ్లీ మాదే అధికారం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్ చూడి కార్యకర్తలు కంగారు పడొవద్దని.. మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం(నవంబర్ 30) సాయంత్రం పోలింగ్ ముగిసి.. ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ చూసి నేతలు, కార్యకర్తలు కంగారు పడొద్దు. ఈ తరహా ఎగ్జిట్ పోల్స్ను గతంలోనూ చూశాం. ఎగ్జిట్పోల్స్ పేరిట న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. క్యూ లైన్లో చాలామందే ఉన్నారు. ఓటింగ్ కచ్చితంగా ప్రభావితం అవుతుంది. అసలైన ఫలితం డిసెంబర్ 3వ తేదీన రాబోతోంది. 70కిపైగా స్థానాలు దక్కించుకుంటాం. బీఆర్ఎస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. హ్యాట్రిక్ కొట్టి.. కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేస్తారు అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
ఎన్నికల నిబంధనలను కాంగ్రెస్,బీఆర్ఎస్ ఉల్లంఘించారు: కిషన్ రెడ్డి
-
పోలింగ్ ముగిసింది.. కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్
-
ఓటేసిన ఈటల..క్రమంగా ఊపందుకుంటున్న పోలింగ్
-
Telangana Assembly Exit Polls 2023: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్! ఆసక్తికరంగా..
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 2023 పోలింగ్ ముగియడంతో.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ రకాల ఏజెన్సీలు ఫలితాల్ని విశ్లేషిస్తే.. ఆసక్తికరంగా ఉన్నాయి. మెజార్టీ కంటే అధిక స్థానాల్లో గెలుపు సాధిస్తామని, సర్వేలు తమకు అనుకూలంగా ఉంటాయని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, తమకు కలిసొస్తుందని కాంగ్రెస్.. బీజేపీలు భావిస్తున్నాయి. తెలంగాణలో ఇలా పోలింగ్ ముగియగానే.. ఇలా ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్. తెలంగాణతో పాటు ఇప్పటికే ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం ఎగ్జిట్ పోల్స్ సైతం వెలువడ్డాయి. ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది..? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని చెప్పే ఎగ్జిట్ పోల్స్ కోసం జనాలు టీవీలకు.. ఫోన్లకు అతుక్కుపోయారు. తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ :- సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్-56 బీఆర్ఎస్-48 బీజేపీ-10 ఎంఐఎం-5 సీ-ప్యాక్ కాంగ్రెస్ : 65 బీఆర్ఎస్ : 41 బీజేపీ : 04 ఇతరులు : 09 ఆరా మస్తాన్ సర్వే (ఇది ప్రీపోల్ సర్వే) కాంగ్రెస్ 58-67 బీఆర్ఎస్ 41-49 బీజేపీ 5-7 ఎంఐఎం, ఇతరులు 7-9 పల్స్ టుడే బీఆర్ఎస్ : 69-71 కాంగ్రెస్ : 37-38 బీజేపీ : 03-05 ఎంఐఎం : 06 ఇతరులు : 01 చాణక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్ : 67-78 బీఆర్ఎస్ : 22-30 బీజేపీ : 06-09 ఎంఐఎం : 06-07 ఇతరులు : 00 న్యూస్18 సర్వే బీఆర్ఎస్: 48 కాంగ్రెస్: 56 బీజేపీ: 0 ఎంఐఎం: 5 ఇతరులు: 0 థర్డ్ విజన్ సర్వే బీఆర్ఎస్ 60-68 కాంగ్రెస్ 33-40 బీజేపీ 1-4 ఎంఐఎం 5-7 ఇతరులు- 0-1 పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్(PTS) కాంగ్రెస్: 65-68 బీఆర్ఎస్: 35-40 బీజేపీ: 7-10 ఇతరులు: 6-9 పొలిటికల్ గ్రాఫ్ బీఆర్ఎస్: 68 కాంగ్రెస్: 38 బీజేపీ: 5 ఎంఐఎం-7 ఇతరులు-1 జనంసాక్షి బీఆర్ఎస్: 26-37 కాంగ్రెస్ : 66-77 బీజేపీ: 4-9 ఎంఐఎం: 6-7 ఇతరులు: 0-1 పార్థదాస్ సర్వే బీఆర్ఎస్: 40 కాంగ్రెస్: 68 బీజేపీ: 4 ఎంఐఎం: 6 ఇతరులు: 1 ఆత్మసాక్షి బీఆర్ఎస్:58-63 కాంగ్రెస్:48-51 బీజేపీ: 7-8 ఎంఐఎం: 6-7 ఇతరులు: 1-2 పోల్స్ట్రాట్ బీఆర్ఎస్:48-58 కాంగ్రెస్:49-59 బీజేపీ:5-10 ఎంఐఎం:6-8 రాష్ట్ర బీఆర్ఎస్: 45 కాంగ్రెస్:56 బీజేపీ:10 ఎంఐఎం, ఇతరులు:8 రేస్ బీఆర్ఎస్: 45-51 కాంగ్రెస్:57-67 బీజేపీ:1-5 ఎంఐఎం, ఇతరులు: 6-7 పీపుల్స్ పల్స్ బీఆర్ఎస్: 35-46 కాంగ్రెస్:62-72 బీజేపీ:3-8 ఎంఐఎం, ఇతరులు:7-9 మాట్రిజ్ బీఆర్ఎస్: 46-56 కాంగ్రెస్: 58-58 బీజేపీ: 4-9 ఎంఐఎం: 5-7 సీఎన్ఎక్స్ బీఆర్ఎస్: 31-47 కాంగ్రెస్: 63-79 బీజేపీ: 2-4 ఎంఐఎం: 5-7 స్మార్ట్ పోల్ బీఆర్ఎస్: 24-36 కాంగ్రెస్:70-82 బీజేపీ:3-8 ఎంఐఎం, ఇతరులు: 6-8 రిపబ్లిక్ టీవీ బీఆర్ఎస్: 46-56 కాంగ్రెస్:58-68 బీజేపీ: 4-9 ఎంఐఎం, ఇతరులు: 5-7 ఎగ్జిట్పోల్స్ పూర్తి పట్టిక కోసం.. -
మధ్యాహ్నం తర్వాత క్రమంగా ఊపందుకుంటున్న పోలింగ్ అని అంటున్న పోలీస్
-
తెలంగాణలో ముగిసిన పోలింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. కానీ, పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. ఇక, ఎన్నికల ఫలితాలు డిసెంబర్ మూడో తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక, ఎన్నికల ప్రారంభమైన సమయం నుంచే ఈవీఎంల మొరాయింపు కారణంగా ఓటింగ్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. ఎన్నికల సిబ్బంది రంగంలోకి దిగి కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేసినప్పటికీ అవి కూడా కొన్ని కోట్ల మొరాయించడంతో గంటల పాటు ఓటర్లు క్యూలైన్లలో నిలబడ్డారు. మరోవైపు, పలుచోట్ల పొలిటికల్ నేతల మధ్య ఫైటింగ్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో, పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేశారు. వివరాలు ఇలా.. ►రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు పోటీ ►బీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ►119లో 118లో కాంగ్రెస్.. పొత్తులో ఒక చోట సీపీఐ ►119లో 111 చోట్ల బీజేపీ.. పొత్తులో భాగంగా 8 స్థానాల్లో జనసేన ►119లో 19 నియోజకవర్గాల్లో సీపీఎం ►119లో 107 స్థానాల్లో బీఎస్పీ పోటీ ►రాష్ట్రంలో ఏడుగురు ఎంపీలు, 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అయిదుగురు ఎమ్మెల్సీలు సహా బరిలో.. ►ఎల్బీనగర్లో అత్యధికంగా 48 మంది అభ్యర్థులు పోటీలో.. ►అతి తక్కువగా బాన్సువాడ, నారాయణపేట నియోజకవర్గాల్లో ఏడుగురు చొప్పున పోటీ ►పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా 55 నియోజకవర్గాల్లో ఒక్కో బ్యాలెట్ యూనిట్, 54 స్థానాల్లో రెండు, పది నియోజకవర్గాల్లో మూడు చొప్పున వినియోగం. -
గ్రేటర్ హైదరాబాద్ లో 20శాతం కూడా నమోదు కాని పోలింగ్
-
ఓటేయడానికి వెళ్లిన బ్రహ్మానందం.. అక్కడ కూడా కామెడీయే
తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష.. అసెంబ్లీ ఎన్నికలు. ఈరోజు(నవంబర్ 30న) తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం నాలుగు గంటల వరకు అంతటా 50 శాతానికి పైగా పోలింగ్ జరగ్గా హైదరాబాద్, రంగారెడ్డి మాత్రం పోలింగ్లో వెనకబడ్డాయి. హైదరాబాద్లో ఇప్పటివరకు కేవలం 31% మాత్రమే పోలింగ్ జరగడం గమనార్హం. మరోవైపు సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకోండని చెప్తూ లైన్లలో నిలబడి మరీ ఓటేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, మహేశ్బాబు, వెంకటేశ్, రానా, అల్లుఅర్జున్, నాని.. ఇలా పలువురు సినీతారలు కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా కామెడీ కింగ్ బ్రహ్మానందం తన కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి.. ఓటు హక్కు ఉండి వినియోగించుకోలేనివాళ్లను ఏమంటారు? అని అడిగాడు. దీనికి బ్రహ్మానందం స్పందిస్తూ... 'ఏమంటామండీ.. ఓటు హక్కు ఉపయోగించుకోలేనివాళ్లు అంటాం' అని తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కామెడీ బ్రహ్మ అని ఊరికే అనలేదు.. పోలింగ్ బూత్ వద్ద కూడా కామెడీ పండిస్తున్నాడు మహానుభావుడు అని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. Legend 🔥😂 #brahmanandam #TelenganaElections2023 pic.twitter.com/aN5SbQO6Sw — Narasimha (@_narasimha___) November 30, 2023 చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు- పోలింగ్.. తదితర కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇబ్రహీంపట్నంలో బారులు తీరిన ఓటర్లు
-
ఇరు వర్గాలను సముదాయిస్తున్న పోలీసులు
-
పోలింగ్ డే హాలీడే.. హైదరాబాద్లో పెరగని పోలింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 52 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక, హైదరాబాద్లో మాత్రం పోలింగ్ శాతం 32గా ఉంది. సిటీలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇదిలా ఉండగా.. గ్రేటర్ హైదరాబాద్లో పోలింగ్ డేను సెలవు రోజుగానే చదువుకున్న ఓటర్లు చూస్తున్నారు. గతంలానే ఓటేసేందుకు హైదరాబాదీలు ముఖం చాటేశారు. సెలబ్రేటీలు ఉదయాన్నే ఓటు వేసి బాధ్యతను గుర్తు చేసినా, ఎన్నికల సంఘం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటింగ్ శాతం మాత్రం పెరగలేదు. ఇక, మెదక్లో అత్యధికంగా 70 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మరోవైపు.. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గంలో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగియనుంది. ఇల్లందు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజక వర్గాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది. ఒకటి, రెండు ప్రాంతాల్లో తప్ప మిగతా అన్నిచోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. మిగతా స్థానాల్లో ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. -
మధిరలో ఓటు హక్కును వినియోగించుకున్న భట్టి విక్రమార్క
-
హైదరాబాద్ లో ఇళ్లకే పరిమితమైన ఓటర్లు
-
అంకాపూర్ జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు
-
ఓటు వేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్న ఓటరు
-
హైదరాబాద్ లో ప్రశాంతంగా పోలింగ్
-
మెదక్ లో అధ్యధికంగా పోలింగ్
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వల్ల నల్గొండ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
-
Telangana Elections 2023: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేశాం (ఫొటోలు)
-
జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు
-
ప్రస్తుతానికి ఓటర్ల నుంచి మంచి స్పందన ఉంది: CEO
-
ఈవీఎంలలో సమస్యలు.. సీఈవోకు లేఖ రాసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఒక్కోచోట ఓటు వేయడానికి కనీసం 10 సెకన్ల సమయం పడుతోందని ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా ఎన్నికల అధికారులకు, స్టేట్ ఎన్నికల కమిషన్కు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే, ఈవీఎంల విషయమై సీఈవో వికాస్రాజ్.. డీఈవోలతో కోఆర్డీనేట్ అయ్యారు. మరోవైపు.. ఈవీఎంల మొరాయింపుపై సీఈవో వికాస్రాజ్కు కాంగ్రెస్ లేఖ రాసింది. ఈ క్రమంలో ఈవీఎంలలో ఉన్న సమస్యలను పరిష్కరించేలా చూడాలని కోరారు. లేనిపక్షంలో పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సమయాన్ని పెంచాలని కాంగ్రెస్ నేతలు సీఈవోను కోరారు. ఇదిఆల ఉండగా.. హైదరాబాద్లో మందకోడిగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేవలం 21 శాతం పోలింగ్ నమోదు.. అత్యధికంగా మెదక్లో 51 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, తెలంగాణవ్యాప్తంగా 37 శాతం పోలింగ్ జరిగినట్టు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాగా, సాయంత్రం పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. -
హైదరాబాద్లో మందకొడిగా పోలింగ్.. సీఈవో వికాస్రాజ్ ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల స్పల్ప ఘటనలు మినహా తెలంగాణ వ్యాప్యంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సాధారణ ప్రజలతోపాటు రాజకీయ నాయకులు, సినీతారలు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివస్తున్నారు. ఓటేసేందుకు ఉదయం నుంచే ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు ఇక గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రాష్ట్రవ్యాప్తంగా 36.68 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.80 శాతం నమోదు అయ్యింది. మహబూబ్నగర్లో 45 శాతం, కరీంనగర్ 40.73, ఆదిలాబాద్ 41.88, గద్వాల్ 49.29, ఖమ్మం 42 శాతం, మంచిర్యాల 42.74 శాతం, మహబూబాబాద్ 48 శాతం, కామారెడ్డి 41 శాతం పోలింగ్ నమోదైంది. ఇక హైదరాబాద్లో అత్యల్పంగా కేవలం 20.79 శాతం పోలింగ్ నమోదవడం ఓటింగ్పై నగర ఓటర్ నిరాసక్తతను వెల్లడిస్తోంది. ఓటింగ్పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో)వికాస్రాజ్ మాట్లాడుతూ.. ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తిన కొన్ని చోట్ల ఈవీఎంలు మార్చినట్లు చెప్పారు. అర్బన్ ఏరియాల్లో పోలింగ్ నెమ్మదిగా కొనసాగుతోందని తెలిపారు. నగర ఓటరు ఇండ్లను వీడి పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని సూచించారు. మధ్యాహ్నం నుంచి వేగం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కొన్నిచోట్ల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు వచ్చాయని వాటిపై విచారణ చేపట్టి కేసులు నమోదు చేస్తామన్నారు. చదవండి: తెలంగాణ ఎన్నికల పోలింగ్.. లైవ్ అప్డేట్స్