బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు | KCR Responds to MLA Defections | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

Published Tue, Feb 11 2025 7:35 PM | Last Updated on Tue, Feb 11 2025 8:33 PM

KCR Responds to MLA Defections

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌లోనూ ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓడి పోతారు. రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజ‌య్య‌తో పాటు ప‌లువురు నాయ‌కులు ఎర్ర‌వ‌ల్లిలో కేసీఆర్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ పై విధంగా మాట్లాడారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement