bypoll
-
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. స్టేషన్ ఘన్పూర్లోనూ ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓడి పోతారు. రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు పలువురు నాయకులు ఎర్రవల్లిలో కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై విధంగా మాట్లాడారు. -
ఆపరేషన్ మిల్కీపూర్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్లోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. మిల్కీపూర్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ఎస్పీ, బీజేపీ రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో తమ పూర్తి బలాన్ని చాటుతున్నాయి. మిల్కీపూర్లో విజయం సాధించడం ద్వారా ఫైజాబాద్ లోక్సభ స్థానం ఓటమి నుంచి కోలుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకోగా, 2022లో తాను దక్కించుకున్న అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఎస్పీ కృతనిశ్చయంతో ఉంది. ఇటీవల యూపీలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఏడు స్థానాల్లో గెలవగా... ఎస్పీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కాయి. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మిల్కీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. 2024 జనవరిలో రామమందిరాన్ని ప్రారంభించిన తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఫైజాబాద్ (అయోధ్య) సీటును బీజేపీ కోల్పోయింది. ఇది లౌకికవాద విజయమని ఎస్పీ అప్పట్లో చాలా ప్రచారం చేసింది. ఇక్కడి నుంచి లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా అవధేష్ ప్రసాద్ ఎన్నిక కావడంతో మిల్కీపూర్ సీటు ఖాళీ అయింది. అయితే ఇప్పుడు మిల్కీపూర్ సీటును కైవసం చేసుకోవడం ద్వారా యావత్ దేశానికి అయోధ్యలో తమ బలం ఏమాత్రం తగ్గలేదన్న సందేశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. కాగా మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో ఇప్పుడు ఉప ఎన్నిక బీజేపీ, సమాజ్వాదీ పార్టీల మ«ధ్య ప్రత్యక్ష పోటీగా మారింది. కాగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షణలో ఉన్న మిల్కీపూర్లో ఓటర్లను సమీకరించేందుకు ఐదారుగురు మంత్రులను బీజేపీ మొహరించింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో కుందర్కిలో మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ గెలుపునకు కారణమైన మంత్రి జేపీఎస్ రాథోడ్, ఎమ్మెల్సీ ధర్మేంద్ర సింగ్లకు కమలదళం మిల్కీపూర్ ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు అయోద్య జిల్లా ఇంఛార్జ్గా ఉన్న మంత్రి సూర్యప్రతాప్ షాహితో పాటు స్వతంత్ర దేవ్ సింగ్, సతీష్ శర్మ, గిరీష్ యాదవ్, మయాంకేశ్వర్ సింగ్లతో సహా నేతల బృందం కూడా మిల్కీపూర్లో విజయం సాధించే బాధ్యతను తీసుకుంది. నియోజకవర్గంలో చిన్న చిన్న సమావేశాలను నిర్వహించి ఓటర్లను ఆకట్టుకొనే పనిలో ఉన్నారు. అదనంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల మిల్కీపూర్ను మూడుసార్లు సందర్శించి వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అంతేగాక మిల్కీపూర్లో 5,500 మంది యువతకు అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేయడంతోపాటు 3,415 మంది యువకులకు ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ పంపిణీ చేశారు. మరోవైపు, బీజేపీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించకపోగా, సమాజ్వాదీ పార్టీ మాత్రం తమ పార్టీ ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్ను రంగంలోకి దింపింది. కాగా ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత రాజకీయ యుద్ధం ఊపందుకుంది. అక్రమాలకు కారణమయ్యే యూపీ డీజీపీని వెంటనే తొలగించాలని సమాజ్వాదీ పార్టీ డిమాండ్ చేస్తోంది. యూపీ డీజీపీని పదవిలో కొనసాగిస్తే, అది ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించడమే కాకుండా ఎన్నికల్లో అక్రమాలకు దారితీయవచ్చని ఎస్పీ ఆరోపిస్తోంది. డీజీపీని తొలగించి ఎన్నికలు నిర్వహిస్తే మిల్కీపూర్లో సమాజ్వాదీ పార్టీని ఏ శక్తీ ఓడించలేదని సమాజ్వాదీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
మూడు లక్షల ఆధిక్యం.. వయనాడ్లో భారీ లీడ్లో ప్రియాంక గాంధీ
ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి ఎన్నికలోనే.. ప్రియాంకా గాంధీ సత్తా చాటుతున్నారు. వయనాడ్ లోక్సభ ఉప ఎన్నిక కౌంటింగ్లక్షకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతున్నారామె. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 48 స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ పోటీకి దిగడంతో.. ఫలితంపైనే యావత్ దేశం దృష్టి కేంద్రీకృతమైంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి.. ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి మూడు లక్షల ఓట్ల భారీ ఆధిక్యంలో ప్రియాంక దూసుకుపోతున్నారు. సీపీఐ నుంచి సత్యన్ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు. మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయి ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ, వయనాడ్ నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ.. తరువాత వయనాడ్ ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రియాంక గాంధీ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. తొలిసారి ఆమె ప్రత్యక్ష ఎన్నికల పోటీలో ఉండటం విశేషం. వయనాడ్లో ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ప్రియాంక గాంధీకి సీపీఐ సీనియర్ నేత సత్యన్ మొకేరి, బీజేపీ కౌన్సిలర్ నవ్య హరిదాస్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. -
యూపీ ఉప ఎన్నికలు.. ఈసీ వార్నింగ్, ఏడుగురి పోలీసుల సస్పెండ్
మహారాష్ట్ర, ఝార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వీటితోపాటు దేశ వ్యాప్తంగా పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నేడు జరుగుతున్నాయి.అయితే ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్లో పోలీసులు బురఖా ధరించిన ఓటర్లను తనిఖీ చేయడంపై వివాదం చేలరేగింది. దీనిపై తాజాగా ఎన్నికల సంఘం స్పందించింది. నిష్పక్షపాతంగా ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని భారత ఎన్నికల సంఘం బుధవారం అధికారులను కోరింది. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడానికి మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోలీసు సిబ్బందిని కూడా ఈసీ సస్పెండ్ చేసింది.అర్హత ఉన్న ఓటరు ఓటు వేయకుండా అడ్డుకోరాదని తెలిపింది. ఓటింగ్ సమయంలో ఎలాంటి పక్షపాత వైఖరిని సహించబోమని స్పష్టం చేసింది. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ జరుపుతామని, ఎవరైనా దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపింది.కాగా ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక కొనసాగుతుండగా.. బురఖా ధరించిన ఓటర్ల గుర్తింపును సరిగ్గా తనిఖీ చేయాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు బీజేపీ నేత అఖిలేష్ కుమార్ అవస్తీ లేఖ రాసింది. ముసుగులు ధరించిన మహిళలు చాలాసార్లు ఓటు వేయడానికి ప్రయత్నించిన కేసులు గతంలో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. అంతేకగాక కొంతమంది పురుషులు కూడా బురఖా ధరించి ఓటు వేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అయితే వీరిని ఈసీ అధికారులు అడ్డుకున్నారని చెప్పారు. బురఖా ధరించిన మహిళల గుర్తింపును తనిఖీ చేయకపోతే, నకిలీ ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. సరైన తనిఖీ మాత్రమే న్యాయమైన, పారదర్శకమైన ఓటింగ్కు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బురఖా ధరించిన మహిళలను తనిఖీ చేసేందుకు తగిన సంఖ్యలో మహిళా పోలీసులను పోలింగ్ కేంద్రాల వద్ద తప్పనిసరిగా మోహరించాలని ఆయన అన్నారు. ఓటరు ఐడీ కార్డులను తనిఖీ చేస్తున్న పోలీసులపై ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ ధ్వజమెత్తింది. పార్టీ చీఫ్, లోక్సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఇద్దరు పోలీసులు ఓటర్ల గుర్తింపు కార్డులు అడిగే వీడియోను షేర్ చేస్తూ.. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ జోక్యాన్ని కోరారు."ఎన్నికల సంఘం యాక్టివ్గా ఉంటే.. పోలీసులు ఓటర్ల ఐడీలను తనిఖీ చేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. రోడ్లు మూసివేయకుండా, ఐడీలను స్వాధీనం చేసుకోకుండా, ఓటర్లను బెదిరించకుండా, ఓటింగ్ వేగం మందగించకుండా, సమయం వృధా కాకుండా చూసుకోవాలని అన్నారు. అధికార పార్టీకి ప్రతినిధిగా ఉండకుండా పరిపాలనను చూసుకోవాలని తెలిపారు. అయితే అఖిలేష్ యాదవ్ పోస్టుపై కాన్పూర్ పోలీసులు సైతం స్పందించారు. ఓటర్లను తనిఖీ చేసిన సంబంధిత అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.. ఎన్నికల సమయంలో రాష్ట్ర పోలీసులు ఎన్నికల సంఘం ఆధీనంలోకి వస్తారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడానికి మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోలీసు సిబ్బందిని కూడా ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
యూపీ ప్రచారానికి అగ్రనేతలు అనుమానమే?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారంపై సందిగ్ధత నెలకొంది. వయనాడ్ ఉప ఎన్నికకు పోలింగ్ ఈ నెల 13న ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాందీ, ప్రియాంకగాందీలు యూపీలో ఈ నెల 20న 9 స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని భావించినా ఇంతవరకు పార్టీ తరఫున ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా రాహుల్, ప్రియాంకలు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో వారు ప్రచారం చేయడం కష్టమేనని తెలుస్తోంది. నిజానికి యూపీలో జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని భావించింది. 9 స్థానాలకు గానూ కనీసంగా 4 స్థానాలకు తమకు వదిలేయాలని భాగస్వామ్య పార్టీ అయిన సమాజ్వాదీ పార్టీని కోరినప్పటికీ ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నుంచి సానుకూల స్పందన రాలేదు. చివరి 2 స్థానాలు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకరించినా, గెలుపు అవకాశాలు లేకపోవడంతో వాటిల్లో పోటీకి కాంగ్రెస్ నిరాకరించింది. తొమ్మిది స్థానాల్లోనూ ఇండియా కూటమి తరఫున ఎస్పీ అభ్యర్థులే పోటీ చేస్తారని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో అఖిలేశ్ యాదవ్ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. అధికార బీజేపీని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేతలు మాత్రం ఇంతవరకు ప్రచారంలో పాల్గొనలేదు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అజయ్రాయ్ సహా మాజీ ఎంపీ పీఎల్ పునియాలు ఎస్పీతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రచారం కోసం కాంగ్రెస్, ఎస్పీలు నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర సీఎల్పీ నేత ఆరాధన మిశ్రా, కాంగ్రెస్ ఎంపీ తనూజ్ పునియాలు ఎస్పీతో కలిసి సంయుక్త ర్యాలీలు నిర్వహిస్తున్నా, అంతంతమాత్రం స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రనేతలతో ఉమ్మడి ప్రచార ప్రణాళికను రూపొందించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఉమ్మడి ఎన్నికల ప్రచారాలు, బహిరంగ సభల కోసం సత్వరమే షెడ్యూల్ ఖరారు చేసి, అధికార బీజేపీ విభజన రాజకీయాలను బట్టబయలు చేసే కార్యాచరణ తీసుకోవాలని ఇరు పారీ్టల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా.. అగ్రనేతల ప్రచారంపై ఇంతవరకు ఏఐసీసీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. -
వయనాడ్ ఉప ఎన్నికకు ముగిసిన పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే!
Updates వాయనాడ్లో సాయంత్రం 6 గంటల వరకు 64.27% ఓటింగ్ నమోదైంది. వాయనాడ్ లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. వాయనాడ్ నియోజకవర్గంలో 64.27% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గడిచిన ఎన్నికల్లో ఇది 72.92 శాతంగా ఉంది.కలపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 65.01%, సుల్తాన్ బతేరిలో 62.10%, మనంతవాడిలో 63.48%, తిరువంబాడిలో 66.05%, ఎర్నాడులో 68.97%, నిలంబూరులో 61.46%, వండూరులో 64.01% పోలింగ్ నమోదైంది. వయనాడ్లో పార్లమెంట్ స్థానం ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.వాయనాడ్ ఉప ఎన్నిక: మధ్యాహ్నం 1 గంటల వరకు 40% పైగా ఓటింగ్ నమోదైందివాయనాడ్లో మధ్యాహ్నం 12.30 గంటల వరకు 34.38 శాతం పోలింగ్ నమోదైంది#WayanadElection | Chanda, an 80-year-old woman of the Kallumala tribal settlement, after casting her vote at a booth at Meppadi in #Wayanad #Byelections2024 📸E.M. Manoj pic.twitter.com/PPDIf8unGL— The Hindu - Kerala (@THKerala) November 13, 2024 ఉదయం 11 గంటల వరకు వయనాడ్లో 27.04 శాతం పోలింగ్ నమోదైంది. #JharkhandAssemblyElection2024 | Jharkhand (Phase-1)recorded 29.31% voter turnout till 11 am, as per the Election Commission of India. #WayanadByElection2024 | Wayanad recorded 27.04% voter turnout till 11 am, as per the Election Commission of India. pic.twitter.com/ohjDBHolK3— ANI (@ANI) November 13, 2024 కేరళ: వయనాడ్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.ఉదయం 9 గంటల వరకు వాయనాడ్లో 13.04 శాతం ఓటింగ్ నమోదైంది.#JharkhandAssemblyElection2024 | Jharkhand (Phase-1)recorded 13.04% voter turnout till 9 am, as per the Election Commission of India.#WayanadByElection2024 | Wayanad recorded 13.04% voter turnout till 9 am, as per the Election Commission of India. pic.twitter.com/5OI9p3Adtk— ANI (@ANI) November 13, 2024 కర్ణాటక:బీజేపీ నేత, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై షిగ్గావ్లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారుషిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.బొమ్మై కుమారుడు భరత్ బొమ్మై షిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు#WATCH | | Karnataka | BJP leader and Former CM Basavaraj Bommai casts his vote at a polling booth in Shiggaon, as voting in bypoll to the assembly constituency is underwayHis son Bharath Bommai is the BJP candidate for bypoll to the Shiggaon assembly constituency pic.twitter.com/x2ta1ZaFDw— ANI (@ANI) November 13, 2024 కేరళ:వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రా మీడియాతో మాట్లాడారు.వయనాడ్ ప్రజలు చూపిన ప్రేమను తిరిగి చెల్లించడానికి, వారి కోసం పని చేయడానికి తమ ప్రతినిధిగా ఉండటానికి నాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని ఓటు వేస్తారని ఆశిస్తున్నా #WATCH | Kerala: Congress candidate for Wayanad Lok Sabha by-elections Priyanka Gandhi Vadra says, "My expectation is that the people of Wayanad will give me the chance to repay the love and affection they have shown and to work for them and to be their representative. I hope… pic.twitter.com/LYg9Sgg4OE— ANI (@ANI) November 13, 2024 రాజస్థాన్: దౌసా అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎంపీ మురారీ లాల్ మీనా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.దౌసా అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నుంచి దీనదయాళ్ బైర్వా, బీజేపీ నుంచి జగ్మోహన్ మీనాను బరిలోకి దిగారు.#WATCH | Dausa, Rajasthan: Congress MP from Dausa Murari Lal Meena casts his vote for the Dausa Assembly by-election.Congress has filled Deendayal Bairwa from the Dausa assembaly seat. BJP has fielded Jagmohan Meena from this seat. pic.twitter.com/0qtmoLyimy— ANI (@ANI) November 13, 2024 కేరళవయనాడ్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మీడియాతో మాట్లాడారు.వయనాడ్ ప్రజలకు అట్టడుగు స్థాయిలో పని చేయగల, పార్లమెంటులో తమ సమస్యలను పరిష్కరించగల నేత కావాలి. కిట్లు, డబ్బు, మద్యం, అన్నీ అందించి ఈసారి ఓటర్లను ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.ఈ ఎన్నికల్లో తాము ఓడిపోతామన్న భయం కాంగ్రెస్కు ఉంది#WATCH | Kerala: BJP candidate from Kerala's Wayanad Lok Sabha constituency, Navya Haridas says, "... People of Wayanad need a person who can work with them at the grassroots level and who can address their issues in Parliament and find solutions. Congress is trying to influence… pic.twitter.com/2TjyrKKiVx— ANI (@ANI) November 13, 2024 మధ్యప్రదేశ్:బుద్ని ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.సెహోర్లోని పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికే చౌహాన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | Sehore: Kartikey Chouhan, son of Union Minister Shivraj Singh Chouhan shows his inked finger after casting his vote at a polling station in Sehore for Budhni by-elections. Kartikey Chouhan says "I would like to request everyone to come out and cast their votes. There… pic.twitter.com/FUrPIsYGur— ANI (@ANI) November 13, 2024 కర్ణాటక:చన్నపట్న అసెంబ్లీ ఉపఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది.ఓటు వేయడానికి కర్ణాటకలోని చన్నపట్నాలోని పోలింగ్ స్టేషన్ వద్ద ప్రజలు క్యూ కట్టారు.ఎన్డీయే తరఫున ఈ స్థానం నుంచి జేడీఎస్ పార్టీ నేత నిఖిల్ కుమారస్వామి, కాంగ్రెస్ తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీపీ యోగేశ్వర్ పోటీలో ఉన్నారు. #WATCH | Karnataka: People queue up at a polling station in Channapatna, Karnataka to vote for Channapatna Assembly by-electionsNDA has fielded JDS leader Nikhil Kumaraswamy from this seat; five-time MLA CP Yogeshwar is contesting against him on a Congress ticket pic.twitter.com/YO5DLC32Cp— ANI (@ANI) November 13, 2024 కేరళపాలక్కాడ్ అసెంబ్లీ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. పశ్చిమ బెంగాల్: పశ్చిమ్ మేదినీపూర్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. శ్రీతికోన అరబింద హైస్కూల్ పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి ప్రజలు క్యూలైన్లో ఉన్నారు. కేరళ:వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయడానికి ప్రజలు క్యూలైన్లలో నిల్చున్నారు. ఛత్తీస్గఢ్:రాయ్పూర్ సిటీ సౌత్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.బీజేపీ మాజీ ఎంపీ, మేయర్ సునీల్కుమార్ సోనీని, కాంగ్రెస్ తరఫున యూత్ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆకాశ్ శర్మను పోటీలో ఉన్నారు. #WATCH | Chhattisgarh: Voting underway for Raipur City South Assembly by-elections BJP has fielded Sunil Kumar Soni, a former MP and mayor, while Congress has fielded Akash Sharma, the president of the Youth Congress state unit. pic.twitter.com/KEDX8M4but— ANI (@ANI) November 13, 2024 అస్సాం:సమగురి అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఓటు వేయడానికి ప్రజలు నాగాన్లోని పోలింగ్ స్టేషన్ వద్ద క్యూ కట్టారు.#WATCH | Assam: People queue up at a polling station in Nagaon to vote for the Samaguri Assembly by-polls. pic.twitter.com/XH1fLEZPPu— ANI (@ANI) November 13, 2024 కేరళవాయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలకు ఓటు వేయడానికి ప్రజలు వాయనాడ్లోని పోలింగ్ స్టేషన్ వద్ద క్యూ కట్టారు.#WATCH | Kerala: People queue up at a polling station in Wayanad to vote for the Wayanad Lok Sabha by-polls pic.twitter.com/lBF0ykyJNn— ANI (@ANI) November 13, 2024 మధ్యప్రదేశ్: షియోపూర్ జిల్లాలోని బుద్ని అసెంబ్లీలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది.పోలింగ్ స్టేషన్ నంబర్ 170 ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల కొత్త భవనం (విజయపూర్) వద్ద పోలింగ్ ప్రారంభమైంది.#WATCH | Madhya Pradesh: Voting for the by-election to be held today in the Budhni assembly of Sheopur district. Preparations underway at polling station number 170 Government Higher Secondary School New Building Vijaypur. pic.twitter.com/SopzxUBWBH— ANI (@ANI) November 13, 2024 కేరళలో వయనాడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. Voting begins for the first phase of Jharkhand assembly elections; In this phase, voting is taking place on 43 out of 81 seats.Voting has also begun in the by-elections for 31 assembly seats spread across 10 states, as well as for the Wayanad Lok Sabha constituency in Kerala. pic.twitter.com/muTcQsr2nx— ANI (@ANI) November 13, 2024 రెండుచోట్ల పోటీచేసి గెలిచిన రాహుల్గాంధీ వయనాడ్లో రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.ఆమెపై ఎల్డీఎఫ్ నుంచి సథ్యాన్ మోకేరీ, బీజేపీ తరఫున నవ్య హరిదాస్ నిలబడ్డారుఇక్కడ 14 లక్షల మంది ఓటర్ల ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్లతో సహా మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.వయనాడ్ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉననా మనంతవాడి (ST), సుల్తాన్ బతేరి (ST), వయనాడ్ జిల్లాలోని కల్పెట్ట, కోజికోడ్ జిల్లాలోని తిరువంబాడి, మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలంబూర్, వండూర్. ఈ రోజు(బుధవారం) 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి.ఇక 31 ఎమ్మెల్యే స్థానాల్లో రాజస్తాన్లో 7, పశ్చిమబెంగాల్లో 6, అస్సాంలో 5, బిహార్లో 4, కర్నాటకలో 3 మధ్యప్రదేశ్లో 2, ఛత్తీస్గఢ్, గుజరాత్, కేరళ, మేఘాలయాల్లో ఒక్కో స్థానం ఉన్నాయి. -
బాబుకు టీడీపీ నేతల వార్నింగ్..
-
‘బీజేపీ ఆఫర్ చేస్తే.. కేంద్రంలో మంత్రి పదవి స్వీకరిస్తా’
ముంబై: కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి అవకాశం ఇస్తే తప్పకుండా స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ అన్నారు. ఆమె ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీ కంచుకోట స్థానమైన బారామతిలో పోటీ చేసి ఆ పార్టీ నేత సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు. అయితే తాజాగా సునేత్రా పవార్ రాజ్య సభ ఉప ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ ఆమెకు ప్రత్యర్థి లేకపోవటంతో సునేత్రా గెలుపు ఖాయమని తెలుస్తోంది. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు సునేత్ర మాట్లాడుతూ.. ‘కేంద్ర మంత్రిగా అవకాశం వస్తే కచ్చితంగా స్వీకరిస్తాను. ఆ ఆవకాశాన్ని వినియోగించుకుంటా. బారామతిలో మేం హోరంగా ఓడిపోయాం. ఓటమికిగల కారణాలుపై విశ్లేషణ చేస్తాం, తగిన క్షేత్రస్థాయి చర్యలు తీసుకుంటాం’’ అని ఆమె అన్నారు.మహారాష్ట్రలో ఎన్సీపీ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిలో భాగంగా ఒక్కసీటు కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఈ పార్టీకి కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కలేదు. అయితే ఈ పార్టీకి చెందిన సీనియర్ నేత ప్రఫూల్ పటేల్కు కేంద్ర సహాయమంత్రి (స్వతంత్ర హోదా) ఇస్తామని బీజేపీ ప్రతిపాదించింది. కాగా.. ఆయన గతంలోనే కేంద్ర కేబినెట్ మినిస్టర్గా పనిచేసి ఉండటంతో బీజేపీ ఇచ్చిన సహాయ మంత్రి పదవి ఆఫర్ను తిరస్కరించారు. -
పుణే ఉప ఎన్నికపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: పుణే ఎంపీ గిరీశ్ బాపత్ మృతితో తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న ఆ ఎంపీ స్థానానికి వెంటనే ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ ఈసీని ఆదేశిస్తూ బాంబే హైకోర్టు ఇచి్చన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. ప్రస్తుత లోక్సభ కాలపరిమితి జూన్ 16వ తేదీతో ముగుస్తున్న కారణంగా ఆ ఒక్క స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణ వృథా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది. ‘‘ ఈ స్థానం ఖాళీగా ఉంటే ఈసీ ఇన్ని రోజులు ఈసీ ఏం చేస్తున్నట్లు?. ఇలాంటి సందర్భాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే పాటించాల్సిన విధివిధానాలపై మార్గదర్శకాలను త్వరలో వెలువరిస్తాం’ అని బెంచ్ పేర్కొంది. గత ఏడాది మార్చి 29వ తేదీన ఇక్కడి బీజేపీ ఎంపీ గిరీశ్ బాపత్ కన్నుమూశారు. ఈ స్థానానికి ఉపఎన్నికలు ఉండవని ఈసీ చెప్పడంతో పుణేకు చెందినన సుఘోష్ జోషి గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పుణే స్థానం ఖాళీ అయినప్పటి నుంచీ పలు అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఈసీ ఉప ఎన్నికలు నిర్వహించింది. పుణే విషయంలో ఈసీ గతంలో ఇచ్చిన వివరణ హేతుబద్ధంగా లేదు. అందుకే అక్కడ తక్షణం ఉప ఎన్నిక నిర్వహించండి’’ అంటూ ఈసీని బాంబే హైకోర్టు ఆదేశించింది. వాటిని ఈసీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. -
ఇక నమ్మలేం! ఒంటరిగానే పోటీ చేస్తాం: మమత శపథం
పశ్చిమ బెంగాల్లో ముర్షిదాబాద్ జిల్లాలోని సాగర్డిఘి ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్, సీపీఎంలపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మహా ప్రతి పక్ష కూటమి ఆశకు ఎదురు దెబ్బతగలడంతో ఒక్కసారి మమతా ఆయా పార్టీలపై ధ్వజమెత్తారు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ), కాంగ్రెస్, సీపీఎంల అపవిత్ర పొత్తులను మరోసారి బహిర్గతం చేసిందంటూ మండిపడ్డారు. తమ పార్టీ మూడు ప్రత్యర్థి రాజకీయ శక్తులతో ఒంటరిగానే పోటీ చేస్తుందంటూ శపథం చేశారు. అయినా బీజేపీతో ఉన్న కాంగ్రెస్, సీపీఎంలతో చేరితే మమ్మల్ని బీజేపి వ్యతిరేకి అని ఎలా పిలుచుకుంటారని ప్రశ్నించారు. వారంతా కమ్యూనల్ కార్డ్ ఆడుతున్నారు. సాగర్దిఘిలో ఓటమే మాకు గుణపాఠం ఇకపై కాంగ్రెస్ని సీపీఎంని నమ్మేదే లేదని తేల్చి చెప్పారు.అయినా బీజేపీతో ఉన్న పార్టీలతో వెళ్లలేం అన్నారు. మా పొత్తు ప్రజలతోనేనని కరాఖండీగా చెప్పారు. సాగర్దిఘి ఉప ఎన్నికల్లో టీఎంసీ ఓటమి గురించి మాట్లాడుతూ.."మేము ఎన్నికల్లో ఓడిపోయాం. ఎవరినీ నిందించను ఎందుకంటే ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఐతే ఇందులో ఇద్దరి మద్ద జరిగిన అనైతిక పొత్తు కారణంగా ఓట్లన్నీ కాంగ్రెస్కి పడ్డాయి. అదీగాక మేఘాలయ ఎన్నికల్లో కొంత గందరగోళం కూడా నెలకొంది. రెండు పార్టీలకు కాంగ్రెస్ అనే పదం కామన్గా ఉండటంతో తాను కాంగ్రెస్తోనే ఉన్నానని ఓటర్లు భావించారు. నేను కాంగ్రెస్లో ఉన్నందున, కాంగ్రెస్ రోజలు నుంచి నా చిత్రాన్ని వారితో చూడటంతో ఓటర్లు కాస్త గందరగోళానికి గురయ్యారు. అయినప్పటికీ మేఘాలయలో టీఎంసీ ఐదు సీట్లు గెలిచేందుకు సాయం చేశారు. అందుకు అభినందనలు. టీఎంసీ ఆరు నెలల క్రితమే మేఘాలయలో ప్రచారం ప్రారంభించినప్పటికీ పోలైన మొత్తం ఓట్లలో 15శాతం సాధించాం. వచ్చే ఎన్నికల్లో మరింత రాణిస్తాం." అని మమత ధీమాగా చెప్పారు. కాగా, ఎన్నికల సంఘం విడుదల చేసిన లెక్కల ప్రకారం..త్రిపురలో.. బీజేపీ మెజారిటీ మార్కును దాటి 32 సీట్లు గెలుచుకోగా.. కలిసి పోటీ చేసిన సీపీఎం, కాంగ్రెస్లు ఏకంగా 14 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) ఒక్క సీటును గెలుచుకుంది. అయితే, త్రిపురలో టీఎంసీ ఖాతా తెరవలేకపోయింది. (చదవండి: తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ) -
బాబాయ్ కాళ్లు మొక్కిన అబ్బాయ్.. కలిసి ప్రచారం..
లక్నో: దివంగత ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, తన బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ కాళ్లు మొక్కారు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్. మైన్పురి లోక్ సభ ఉపఎన్నికల ప్రచారంలో ఈ దృష్యం ఆవిష్కృతమైంది. ములాయం సింగ్ యాదవ్ మృతితో మైన్పురి ఎంపీ సీటు ఖాళీ అయింది. ఈ ఉపఎన్నికలో అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తమ కుటుంబానికి కంచుకోట అయిన మైన్పురిలో ప్రజలు తమకే అండగా ఉన్నారని చాటిచెప్పేలా చారిత్రక విజయం అందించాలని అఖిలేశ్ యాదవ్ ప్రజలను కోరారు. అఖిలేశ్ బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ 2017లో ఎస్పీ నుంచి బయటకు వెళ్లారు. అనంతరం 2018లో ప్రగతిశీల్ సమాజ్వాదీ పార్టీని స్థాపించారు. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి అఖిలేశ్తో జతకట్టారు. కానీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత బాబాయ్, అబ్బాయ్ మధ్య దూరం పెరిగిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తమ మధ్య విభేదాలు లేవని చెప్పేందుకు ఇద్దరు కలిసి పచారంలో పాల్గొన్నారు. ఈ ఉపఎన్నిక డిసెంబర్ 5న జరగనుంది. #WATCH | Samajwadi Party chief Akhilesh Yadav meets PSP chief Shivpal Yadav, touches his feet atop the stage while campaigning for the byelections in Mainpuri, UP pic.twitter.com/c82LOivUqb — ANI UP/Uttarakhand (@ANINewsUP) November 20, 2022 -
ఉప ఎన్నికలో నోటాకి సెకండ్ ప్లేస్
ముంబై: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో దెబ్బ పడింది కాంగ్రెస్కే. హర్యానా, తెలంగాణల్లో రెండు స్థానాలను పొగొట్టుకుంది. అందులో ఒకటి బీజేపీ, మరొకటి టీఆర్ఎస్(బీఆర్ఎస్) వశం అయ్యాయి. ఇక మహారాష్ట్ర అంధేరీ(తూర్పు) నియోజకవర్గం నుంచి శివసేన ఉద్దవ్ థాక్రే వర్గం నుంచి రుతుజా రమేష్ లాట్కే.. 66వేల ఓట్ల మార్జిన్తో ఘన విజయం సాధించారు. శివసేన ఎమ్మెల్యే రమేష్ లాట్కే ఈ మే నెలలో మరణించారు. దీంతో అంధేరీ(తూర్పు) స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతు మాత్రమే కాదు.. బీజేపీ సైతం ఇక్కడ తమ అభ్యర్థిని దింపకపోవడంతో.. రుతుజాకి బాగా కలిసొచ్చింది. ఈ క్రమంలో..ఈ ఉప ఎన్నికలో అంధేరీ ఓటర్లు భలే సర్ప్రైజ్ ఇచ్చారు. రుతుజాతో పాటు ఈ ఉప ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు. ఆ ఆరుగురు అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఇప్పటివరకు దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఇలా.. అభ్యర్థుల(ప్రధాన పార్టీ అభ్యర్థులు కాదు) కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పోల్ కావడం గమనార్హం. అంటే రుతుజా తర్వాత నోటా ఓట్లే రెండు స్థానంలో నిలిచాయన్నమాట. రుతుజా లాట్కే.. గతంలో బృహణ్ముంబై మున్సిపల కార్పొరేషన్లో క్లర్క్గా పని చేశారు. రాజీనామా అనంతరం ఆమె ఉప ఎన్నికల బరిలో దిగారు. త్వరలో ముంబై స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండడంతో.. థాక్రే వర్గంలో ఈ విజయం జోష్ను నింపింది. మరోవైపు ప్రజలు తమవైపే ఉన్నారనడానికి ఈ ఫలితమే నిదర్శనమని మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రకటించుకున్నారు. ఇదీ చదవండి: ప్చ్.. కారు హవాను తక్కువగా అంచనా వేశాం! -
7 అసెంబ్లీ స్థానాల ఫలితాలు.. నాలుగు సీట్లలో బీజేపీ విజయం
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మిగిలిన వాటిల్లో మహారాష్ట్రలో శివసేన, తెలంగాణలో టీఆర్ఎస్, బిహార్లో రెండింటిలో ఒక స్థానాన్ని ఆర్జేడీ దక్కించుకున్నాయి. ► మునుగోడు(తెలంగాణ).. టీఆర్ఎస్ ► అంధేరీ(మహారాష్ట్ర)... శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) ► మొకామా(బిహార్).. ఆర్జేడీ ► ధామ్నగర్(ఒరిశా).. బీజేపీ ► గోపాల్గంజ్(బిహార్)... బీజేపీ ► అదమ్పుర్(హరియాణా).. బీజేపీ ► గోలా గోక్రానాథ్(ఉత్తర్ప్రదేశ్).. బిజేపీ TIME: 3:45PM ► ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఫలితాలు తెలిపోయాయి. ఇప్పటి వరకు బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందింది. ఆర్జేడీ, శివసేన ఒక్కోస్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఒక స్థానంలో బీజేపీ ముందంజలో ఉండగా.. ఒక స్థానంలో టీఆర్ఎస్ లీడ్లో కొనసాగుతున్నాయి. బిహార్లోని గోపాల్గంజ్, హరియాణాలోని అదమ్పుర్, గోలా గోక్రానాథ్లో బీజేపీ విజయం సాధించింది. అంధేరీలో శివసేన అభ్యర్థి రుతుజా లాట్కే విజయం సాధించారు. TIME: 1:00PM ► అంధేరి తూర్పులో శివసేనకు చెందిన రుతుజా లట్కే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. పది రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత 37,469 ఓట్లతో లీడ్లో ఉన్నారు. రుతుజా లట్కే విజయం దాదాపు ఖరారు కావడంతో శివసేన కార్యకర్తలు సంబరాలు మొదలెట్టారు. ►బిహార్లోని గోపాల్గంజ్లో కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. 22వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి 607 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►యూపీలోని గోల గోకరనాథ్ ఉప ఎన్నిక కౌంటింగ్లో 29 రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ దాదాపు 33,000 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ► మునుగోడు కౌంటింగ్ ఆరో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆరో రౌండ్ ముగిసే సరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. చౌటుప్పల్, సంస్థాన్ నారాయపురం ఓట్లు లెక్కింపు ముగిసింది. ►ఒడిశాలోని ధామ్నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీకి చెందిన సూర్యవంశీ సూరజ్ 4,392 ఓట్లతో ముందంజలో ఉన్నారు. 6వ రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 22,495 ఓట్లు పోలయ్యాయి. Odisha | Counting underway for Dhamnagar by-elections. BJP candidate Suryabanshi Suraj continues his lead on the assembly seat after five rounds of counting, with a total of 22,495 votes so far. pic.twitter.com/TNe4j2UtLC — ANI (@ANI) November 6, 2022 ► హర్యానాలోని ఆదంపూర్ అసెంబ్లీ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. 6 రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీకి చెందిన భవ్య బిష్ణోయ్ 13,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►మొకమలో 20 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి ఆర్జేడీ 16,000 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తుంది. TIME: 12:00PM ► అంధేరి తూర్పులో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ అభ్యర్థి రుతుజా తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ పూర్తయే సరికి 4,078 ఓట్లతో మెజార్టీ సాధించారు. ఇప్పటివరకు మొత్తం 29,033 ఓట్లు పోలయ్యాయి. ► ఒడిశాలోని ధమ్నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి సూర్యవంశీ సూరజ్ 18,181 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేడీ అభ్యర్థి అబంతి దాస్ 14,920 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ► మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. 5వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 1,631 ఓట్లతో ముందంజలో ఉంది. In Pics | Counting of votes in Andheri East bypoll elections underway Follow for live updates:https://t.co/069cEQIUP9 pic.twitter.com/XMyjNa7fu1 — Express Mumbai (@ie_mumbai) November 6, 2022 TIME: 11:00AM అంధేరి తూర్పులో ఐదో రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి రుతుజా లత్కే 2,630 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు ఆమెకు 17,278 ఓట్లు పోలయ్యాయి. ► బిహార్ మోకమలో తొమ్మిదో రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఆర్జేడీకి చెందిన నీలమ్ దేవి 35,036 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవి 24,299 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. TIME: 10:00AM బిహార్లోని రెండు( మోకమ, గోపాల్గంజ్) స్థానాల్లో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి ఆర్జేడీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►అంధేరి (తూర్పు)లో రెండు రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన రుతుజా లట్కే 7,817 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. Patna, Bihar | Counting underway for Mokama By-poll, visuals from counting center Counting started at 8 am & is happening peacefully. 3-tier security deployed. No complaint so far, patrolling is being done in nearby areas: Manavjeet Singh Dhillon, SSP pic.twitter.com/9WtVmW3qfh — ANI (@ANI) November 6, 2022 ► ఒడిశాలోని ధామ్నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీకి చెందిన సూర్యవంశీ సూరజ్ 4,749 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. బిజూ జనతాదళ్ పార్టీకి చెందిన అభ్యర్థి అబంతి దాస్కు 3,980 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. Haryana | Counting of #AdampurByElection underway. Outside visuals from counting center 3-layer security provided as EVMs have reached. CAPF & district police deployed. Law & order company with anti-riot equipment present in case of any eventuality. Checking is being done: SSP pic.twitter.com/KeJJYj7TNI — ANI (@ANI) November 6, 2022 ► యూపీలోని గోల గోకరానాథ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అమన్ గిరి నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి 15,866 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన వినయ్ తివారీ 10,853 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ►మునుగోడులో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ 1,100 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతుంది. సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరుగుతోంది. మహారాష్ట్రలోని అంధేరి(తూర్పు), బిహార్లోని మొకామా, గోపాల్గంజ్, హరియాణాలోని ఆదంపూర్, యూపీలోని గోలా గోరఖ్నాథ్లో, ఒడిశాలోని ధామ్నగర్తోపాటు తెలంగాణలోని మునుగోడు ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ పోరులో ప్రధానంగా బీజేపీకి, ప్రాంతీయ పార్టీలకు మధ్యే పోటీ నడుస్తోంది. మధ్యాహ్నం వరకు ఫలితాలు తేలనున్నాయి. కాగా ఈ ఏడు నియోజవర్గాలకు ఈ నెల 3న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలు జరిగిన స్థానాలు (7) ►మహారాష్ట్ర-తూర్పు అంధేరి ►బిహార్-మోకమ ►బిహార్- గోపాల్గంజ్ ►హరియాణ-అదంపూర్ ►తెలంగాణ-మునుగోడు ►ఉత్తర్ప్రదేశ్- గోల గోకరన్నాథ్ ►ఒడిశా- ధామ్నగర్ హరియాణలో మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారడంతో ఆదంపూర్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. శివసేన ఎమ్మెల్యే రమేష్ లత్కే అకాల మరణంతో అంధేరీ ఈస్ట్లో ఎన్నికలు వచ్చాయి. బిహార్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో మొకమ స్థానం ఖాళీ అయింది. బిహార్లోని గోపాల్గంజ్లో కూడా సిట్టింగ్ బిజెపి ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మరణం కారణంగా పోటీ అనివార్యమైంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆగస్టు 2న రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక జరిగింది. యూపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే అరవింద్ గిరి మృతి చెందడంతో లఖింపూర్ ఖేరీ జిల్లా గోల గోకరనాథ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మ్మెల్యే బిష్ణు చరణ్ దాస్ అకాల మరణంతో ధామ్నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. చదవండి: Munugode Bypoll 2022: మునుగోడు ఉపఎన్నిక రౌండ్ల వారీగా ఫలితాలు -
ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. యూపీ, ఒడిశా, రాజస్తాన్, బిహార్, ఛత్తీస్ఘడ్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ములాయం సింగ్ మరణంతో మెయిన్పురీ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 10 నుంచి 17వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబర్ 5న పోలింగ్ నిర్వహించి, 8న కౌంటింగ్ ఫలితాలను ప్రకటిస్తారు. చదవండి: (117 ఏళ్ల దేశ తొలి ఓటరు ఇక లేరు.. బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 3 రోజులకే..) -
మునుగోడు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి : హరీష్ రావు
-
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయ్ పై దాడి
-
కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే : బండి సంజయ్
-
ఆలోచించండి.. ఆగం కాకండి : కేటీఆర్
-
ఎన్నికలు వస్తే చాలు గాయ్.. గాయ్.. గత్తర్.. గత్తర్ లొల్లి నడుస్తోంది : కేసీఆర్
-
బీజేపీ పై కేసీఆర్ ఫైర్
-
సీఎం కాన్వాయ్ లో డబ్బులు తీసుకురాబోతున్నారు : బండి సంజయ్
-
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఓ కట్టుకథ : తరుణ్ చుగ్
-
మునుగోడులో కేఏ పాల్ వినూత్న ప్రచారం
-
పొలిటికల్ కారిడార్ : మూడు పార్టీల నేతల్లో మునుగోడు టెన్షన్
-
అవన్నీ ఫేక్ వీడియోలే : బండి సంజయ్
-
మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది : ఉత్తమ్ కుమార్ రెడ్డి
-
బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ప్రచారాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు
-
రాజగోపాల్ రెడ్డి స్వార్థం వల్లే మునుగోడు ఉపఎన్నిక : మంత్రి జగదీష్ రెడ్డి
-
మునుగోడు ఓటర్లకు పెద్ద ఎత్తున దావత్ లు
-
మునుగోడు ఉపఎన్నిక పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
కెఎస్ఆర్ లైవ్ షో : వలసలపై కేసీఆర్ రివర్స్ అటాక్
-
మునుగోడు బరిలో కామారెడ్డి మహిళ
-
పొలిటికల్ కారిడార్ : మునుగోడు స్థాయే వేరు..
-
మునుగోడు లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం
-
పొలిటికల్ కారిడార్ : గ్రేటర్ లో మునుగోడు ప్రచారం
-
మునుగోడులో గుర్తుల గోల...
-
మునుగోడులో పట్టుబడుతున్న నోట్ల కట్టలు...
-
సొంత బలంతోనే బరిలోకి.. అక్కడ మాత్రం పోటీ చేయం
సాక్షి, ముంబై: స్ధానిక సంస్ధల ఎన్నికల్లో సొంత బలంపై పోటీ చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న స్ధానిక సంస్ధల ఎన్నికలపై చర్చించేందుకు బాంద్రాలోని రంగ్శారద సభా గృహంలో ఎమ్మెన్నెస్ పదాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ ఠాక్రే పదాధికారులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తనకు పూర్తి నమ్మకం ఉంది. అధికారం అంచుల వరకు వెళతాం, కానీ మీ ఆలోచన, విధి విధానాలు దృఢంగా ఉంచుకోవాలని సూచించారు. ఒకవేళ అధికారం మనకే దక్కినా పదవి కోసం కక్కుర్తిపడి కుర్చీలో మాత్రం తను కూర్చోనని ఉద్ధవ్ ఠాక్రే పేరు ఉచ్చరించకుండా పరోక్షంగా చురకలంటించారు. ప్రత్యామ్నాయంగా ఎమ్మెన్నెస్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు కింది స్ధాయికి దిగజారి పోతున్నాయి. సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని ఎమ్మెన్నెస్పై తప్పుడు సందేశాలు అప్లోడ్ చేస్తున్నారు. ఎమ్మెన్నెస్ నుంచి అనేక మంది పదాధికారులు బయటపడతారని, పార్టీకి ఇక నూకలు చెల్లాయని ఇలా రకరకాల సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిని నమ్మవద్దని, సాధ్యమైనంత వరకు వాటికి దూరంగానే ఉండాలని సూచించారు. రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న తాజా పరిస్ధితిపై ప్రజలు విసిగెత్తిపోయారు. ఇక ఎమ్మెన్నెస్ను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటారని ఉద్ఘాటించారు. మైండ్ను సెట్ చేసుకోవాలి పార్టీని పటిష్టం చేయడానికి మీ మైండ్ను సెట్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. అందుకు పార్టీ కార్యకర్తలందరూ ఏకతాటిపైకి వచ్చి పనులు వేగవంతం చేయాలని సూచించారు. బీఎంసీ ఎన్నికల్లో కచ్చితంగా భారీ మెజారిటీతో విజయం సాధించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇక్కడ సఫలీకృతమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసనంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుపించుకోవచ్చని అన్నారు. ఆ తరువాత లోక్సభ ఎన్నికల్లో కూడా సత్తాచాటవచ్చని దీమా వ్యక్తం చేశారు. అందుకు ఇప్పటి నుంచే ప్రజల దగ్గరకు వెళ్లాలి, దీపావళికి ఇంటి గుమ్మాల ముందు ఎమ్మెన్నెస్ కందిళ్లు (చుక్కలు) వెలగాలని పిలుపునిచ్చారు. వాడివేడిగా రాజకీయ వాతావరణం ప్రస్తుతం రాజకీయ వాతావరణం వాడివేడిగా ఉంది. శివసేన పేరు, విల్లు–బాణం గుర్తుపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన తరువాత సభలు, సమావేశాల్లో, సోషల్ మీడియాలో ఎవరు, ఎలాంటి కామెంట్లు చేయవద్దన్నారు. రమేశ్ లట్కే మృతితో ఖాళీ అయిన తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎమ్మెన్నెస్ నుంచి ఎవరూ పోటీ చేయడం లేదన్నారు. ఎవరైనా కార్పొరేటర్గానీ, ఎమ్మెల్యేగానీ దురదృష్టవశాత్తు చనిపోతే అక్కడ జరిగే ఉప ఎన్నికలో ఎమ్మెన్నెస్ పోటీ చేయదని స్పష్టం చేశారు. (క్లిక్: అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె!) -
ఉద్ధవ్ థాక్రే వర్గానికి బిగ్ రిలీఫ్.. ఉపఎన్నికల్లో ఆమె పోటీకి లైన్ క్లియర్
ముంబై: శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. నవంబర్ 3న జరగే అంధేరీ ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది. థాక్రేవర్గం తరఫున పోటీ చేయనున్న రుతుజా లాట్కే రాజీనామాను బృహన్ముంబై పురపాలక కమిషనర్ శుక్రవారం ఉదయం 11గంటల్లోగా ఆమోదించాలని కోర్టు స్పష్టం చేసింది. ఒక ఉద్యోగి రాజీనామా చేస్తే ఆమోదించడానికి ఇంత సమయం ఎందుకుపట్టిందని, ఇది కోర్టుకు రావాల్సిన విషయం కూడా కాదని ముంబై పురపాలక కమిషనర్ ఇక్బాల్ చాహల్ను ఉన్నత న్యాయస్థానం మందలించింది. అంధేరీ ఎమ్మెల్యే రమేశ్ లాట్కే మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది. ఉద్దవ్ థాక్రే వర్గం తరఫున రమేశ్ లాట్కే సతీమణి రుతుజా లాట్కే పోటీ చేస్తున్నారు. అయితే ఆమె బృహన్ ముంబై కార్పొరేషన్లో క్లర్క్గా పనిచేస్తున్నారు. ఉపఎన్నికకు నామినేషన్ వేయాలంటే ఆమె పదవికి రాజీనామా చేయాలి. సెప్టెంబర్ 2నే రాజీనామా సమర్పించినప్పటికీ దాన్ని కమిషనర్ ఆమోదించలేదు. నామినేషన్లకు శుక్రవారం(అక్టోబర్ 14) చివరి తేదీ కావడంతో రితిజా హైకోర్టును ఆశ్రయించారు. తనను ఎన్నికల్లో పోటీ చేయకుండా కావాలనే రాజీనామా ఆమోదించడం లేదని కోర్టుకు తెలిపారు. షిండే ప్రభుత్వం ఒత్తిడి వల్లే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. వాదనలు విన్న న్యాయస్థానం రుతుజాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అనంతరం ఆమె నేరుగా వెళ్లి ఉద్ధవ్ థాక్రేను కలిశారు. చివరిరోజైన శుక్రవారం నామినేషన్ సమర్పించనున్నారు. అంధేరీ ఉపఎన్నికలో థాక్రేవర్గం అభ్యర్థికి కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుగా ఉన్నాయి. మరోవైపు షిండే వర్గం మద్దతుతో బీజేపీ తమ అభ్యర్థిని నిలబెడుతోంది. చదవండి: అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె! -
అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె!
సాక్షి, ముంబై: తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఉద్ధవ్ ఠాక్రే వర్గం అభ్యర్ధి రుతుజా లట్కేను తమవైపు లాక్కునేందుకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపినట్లయింది. మొన్నటివరకు అసలైన శివసేన పార్టీ తమదేనంటూ, విల్లు–బాణం (ధనుశ్య–బాణ్) గుర్తు తమకే దక్కాలని ఇటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం, అటు ఏక్నాథ్ శిందే వర్గం పోటీ పడ్డాయి. చివరకు ఎన్నికల సంఘం తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు శివసేన పేరు, విల్లు–బాణం వినియోగించరాదని ఉద్ధవ్కు, శిందేను ఈసీ ఆదేశించింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. కానీ రుతుజా లట్కేను తమవైపు లాక్కుని బీజేపీ టికెట్టుపై పోటీ చేయించాలనే ప్రయత్నాలు శిందే చేస్తున్నారు. భర్త మృతి.. అభ్యర్థిగా భార్య ఈ ఏడాది మార్చిలో కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటనకు వెళ్లిన తూర్పు అంధేరీ నియోజక వర్గం శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే అక్కడే గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగానే ఉంది. నవంబర్ మూడో తేదీన ఉప ఎన్నిక, ఆరో తేదీన ఓట్ల లెక్కింపు ఉంది. కాని మృతి చెందిన రమేశ్ లట్కే సతీమణి రుతుజా లట్కేకు తమ పార్టీ తరఫున పోటీచేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే అభ్యర్ధిత్వం ఇచ్చారు. సానుభూతి ఓట్లతో రుతుజా సునాయాసంగా గెలుస్తుందనే ధీమాతో ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు. రుతుజా గెలవడంవల్ల తమ పార్టీ ఎమ్మెల్యే సంఖ్య యథాతధంగా ఉంటుంది. ఏక్నాథ్ శిందే ఎత్తుగడలు రమేశ్ లట్కే కుటుంబంతో ఏక్నాథ్ శిందేకు సంత్సంబంధాలున్నాయి. దీంతో రుతుజాకు తమ పార్టీ తరఫున అభ్యర్ధిత్వం ఇవ్వాలని శిందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే శివసేన వాటాలో ఒక ఎమ్మెల్యే సంఖ్య తగ్గిపోయి, తమ వాటాలో ఒక ఎమ్మెల్యే సంఖ్య పెరుగుతుందని శిందే భావిస్తున్నారు. ప్రస్తుతం శివసేన పార్టీ ఎవరిది..? విల్లు–బాణం ఎవరికి ఇవ్వాలో నిర్ణయం తీసుకునే అధికారం సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే సమయంలో ఎమ్మెల్యేల సంఖ్య ఏ వర్గానికి ఎక్కువ ఉందో ఆ వర్గానికి శివసేన పేరు, విల్లు–బాణం గుర్తు కేటాయించే అవకాశాలున్నాయి. దీంతో ఏక్నాథ్ శిందే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. నలిగి పోతున్న బీఎంసీ కమిషనర్ కాగా ఉద్ధవ్ ఠాక్రే వర్గం తరపున రుతుజా లట్కే గురువారం భారీ బలప్రదర్శన చేస్తూ నామినేషన్ వేస్తారని ఇదివరకే పార్టీ వర్గాలు ప్రకటించాయి. రుతుజా లట్కేకు మహావికాస్ ఆఘాడి మద్దతు ఉంటుందని కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా ప్రకటించాయి. కానీ ఆమె ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందు ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆమె బీఎంసీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెల మూడో తేదీన ఆమె బీఎంసీ కమిషనర్కు రాజీనామా సమర్పించారు. కానీ కమిషనర్ ఇంతవరకు ఆమె రాజీనామాను ఆమోదించలేదు. ఫలితంగా గురువారం ఆమె నామినేషన్ వేయలేకపోయారు. దీంతో రాజీనామా ఆమోదించాలని ఇటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి, ఆమోదించవద్దని అటు ఏక్నాథ్ శిందే వర్గం నుంచి బీఎంసీ కమిషనర్పై ఒత్తిడి వస్తోంది. దీంతో ఇరు వర్గాల మధ్యలో బీఎంసీ కమిషనర్ నలిగి పోతున్నారు. నియమాలు ఏమంటున్నాయి.. బీఎంసీ 1989 నియమాల ప్రకారం స్వచ్చందంగా పదవీ విరమణ పొందేవారు మూడు నెలల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. రాజీనామా చేసే వారు నెల రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. ఒకవేళ నెల రోజుల ముందు నోటీసు ఇవ్వని పక్షంలో ఒక నెల వేతనం బీఎంసీకి చెల్లించాల్సి ఉంటుంది. కాని ఆమె ఈ నెల మూడో తేదీన నోటీసు ఇచ్చారు. నియమాల ప్రకారం రుతుజా లట్కే నెల రోజుల ముందు నోటీసు ఇవ్వకపోవడంతో నెల రోజుల వేతనం రూ.67,590 నగదు బీఎంసీకి చెల్లించారు. సంబంధిత డిపార్టుమెంట్ నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) కూడా పొందారు. అయినప్పటికీ బీఎంసీ కమిషనర్ ఇంతవరకు ఆమె రాజీనామాను ఆమోదించలేదు. ఇటు ఉద్ధవ్ వర్గం, అటు శిందే వర్గం ఒత్తిళ్ల మధ్య బీఎంసీ కమిషనర్ ఏం నిర్ణయం తీసుకుంటారో ఉత్కంఠ నెలకొంది. రాజీనామ ఆమోదించే వరకు రుతుజాకు నామినేషన్ వేయడానికి వీలులేదు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గం బాంబే కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం ఉదయం 11 గంటలలోపు రుతుజా రాజీనామాను ఆమోదించాలని ఉన్నత న్యాయస్థానం గురువారం ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ నుంచి మూర్జీ పటేల్ ? ఇదిలాఉండగా బీజేపీ నుంచి మూర్జీ పటేల్ పేరును దాదాపు ఖరారు చేసినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. నామినేషన్ వేయడానికి శుక్రవారం వరకు గడువుంది. ఆలోపు ఏదైన అద్భుతం జరగవచ్చు. గతంలో తనతో ఉన్న సత్సంబంధాలను దృష్టిలో ఉంచుకుని రుతుజా లట్కేను తమవైపు లాక్కుని బీజేపీ తరఫున నామినేషన్ వేయించాలనే ప్రయత్నంలో శిందే ఉన్నారు. ఒకవేళ రుతుజా బీజేపీ తరఫున నామినేషన్ దాఖలుచేస్తే రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి దుమారం లేపడం ఖాయమని చెప్పకనే చెబుతోంది. దీంతో రుతుజా తుది నిర్ణయం తీసుకోవాలంటే ఆచి, తూచి ఆడుగేయాల్సి ఉంటుంది. ఒకవేళ శిందే ఒత్తిళ్లకు యపడి బీజేపీ తరఫున రుతుజా నామినేషన్ వేస్తే మూర్జీ పటేల్ పరిస్ధితి ఏంటనే అంశం తెరమీదకు రానుంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూర్జీ పటేల్కు అభ్యర్ధిత్వం ఇవ్వకపోవడంతో బీజేపీపై తిరుగుబాటుచేసి స్వతంత్రంగా బరిలో దిగారు. ఆ సమయంలో రమేశ్ లట్కే గెలుపొందగా మూర్జీ పటేల్ రెండో స్ధానంలో నిలిచారు. రుతుజా బీజేపీ తరఫున నామినేషన్ వేస్తే ఇప్పుడు అదే పరిస్ధితి పునరావృతమయ్యే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కొంత అయోమయ పరిస్ధితిలో ఉన్నట్లు తెలుస్తోంది. (క్లిక్: ‘అమ్మా.. తప్పకుండా తిరిగొస్తాను’ తల్లికి సంజయ్ రౌత్ భావోద్వేగ లేఖ) -
ఈసీ నిర్ణయంతో అయోమయం.. థాక్రే కొత్త పార్టీ పేరు, గుర్తు ఇవే!
ముంబై: శివసేన పార్టీ, ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ 3న జరిగే తూర్పు అంధేరీ ఉపఎన్నికల్లో ఈ పార్టీ పేరు, గుర్తును ఉపయోగించడానికి ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వార్గాలకు వీల్లేకుండా పోయింది. రెండు వర్గాలు పార్టీ తమదంటే తమదని చెప్పినా ఈసీ ఎవరికీ కేటాయించలేదు. దీంతో థాక్రే వర్గం కొన్ని ప్రతిపాదనలను ఈసీ ముందుకు తీసుకెళ్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. తూర్పు అంధేరీ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు తమకు 'శివసేన బాలా సాహెబ్ థాక్రే', లేదా 'శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే' పార్టీ పేర్లలో ఏదో ఒకదాన్ని కేటాయించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల గుర్తుగా త్రిశూలం, లేదా ఉదయించే సూర్యుడి చిత్రాన్ని కేటాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. తమ మొదటి ఎంపిక శివసేన బాలా సాహెబ్ థాక్రే, త్రిశూలం గుర్తు అని, అవి కుదరకపోతే రెండో ఆప్షన్కు ఈసీ ఓకే చేయాలని థాక్రే వర్గం కోరుతోంది. అసలైన శివసేన తమదంటే తమదని థాక్రే, షిండే వర్గాలు వాదించడంతో ఆ పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును ఈసీ శనివారం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసింది. వచ్చే ఉపఎన్నికల్లో వీటిని ఉపయోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. రెండు వర్గాలు పార్టీ పేరు, ఎన్నికల గుర్తుకు సంబంధించి మూడు ఆప్షన్లతో తమ ముందుకు రావాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే థాక్రే వర్గం కాస్త ముందుగా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. శివసేన బాలాసాహెబ్ థాక్రే పార్టీ పేరు, త్రిశూలం గుర్తు తమకు వస్తుందని ఆశిస్తోంది. చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి.. సీఎం దిగ్భ్రాంతి -
షిండే, ఠాక్రే వర్గాలకు ఈసీ షాక్!
న్యూఢిల్లీ:అంథేరీ ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో శివసేన పేరు, ఎన్నికల గుర్తు ‘విల్లు, బాణం’ను ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేవర్గాలు ఉపయోగించుకోకుండా ఎన్నికల సంఘం(ఈసీ) నిషేధం విధించింది. పార్టీ పేరు, ఎన్నికల గుర్తు వాడుకోవద్దని రెండు వర్గాలను ఆదేశించింది. ఈ మేరకు శనివారం మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉప ఎన్నిక కోసం ఏవైనా మూడు నచ్చిన పేర్లను, అందుబాటులో ఉన్న గుర్తుల్లో కొన్నింటిని ఎంపిక చేసుకొని, సోమవారంలోగా తమకు తెలియజేయాలని సూచించింది. వాటిని రెండు వర్గాల అభ్యర్థులకు కేటాయిస్తామని పేర్కొంది. పార్టీ ఎన్నికల గుర్తును తమ అభ్యర్థికే కేటాయించాలని షిండే వర్గం కోరగా ఈసీ తిరస్కరించింది. శివసేన ఈ ఏడాది జూన్లో రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. అసలు శివసేన తమనంటూ షిండే, ఠాక్రే వర్గాలు వాదిస్తున్నాయి. దీనిపై ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పార్టీపై హక్కును నిరూపించుకోవడానికి అక్టోబర్ 7లోగా ఆధారాలు సమర్పించాలని ఇరువర్గాలకు ఈసీ ఆదేశించింది. చదవండి: థరూర్.. ఓ విఫల ప్రయత్నం.! -
6 మండలాలు, 2 మున్సిపాలిటీలకు ఇన్చార్జిల నియామకం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో విజయమే లక్ష్యంగా కార్యాచరణకు బీజేపీ స్టీరింగ్ కమిటీ నడుం బిగించింది. దసరా తర్వాత అక్కడ గడపగడపకూ బీజేపీ పేరిట కార్యక్రమాన్ని చేపట్టాలని, ఈ నియోజకవర్గం పరిధిలో కేంద్రమంత్రులతో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్రమంత్రులు, ముఖ్యనేతలతో ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహిస్తే మంచిదనే దానిపై చర్చించింది. మునుగోడులోని ఆరు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు ఇన్చార్జి, ఇద్దరు సహ ఇన్చార్జిల చొప్పున 24 మందిని నియమించింది. ఎమ్మెల్యే, మాజీ ఎంపీలకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించింది. సంస్థాన్ నారాయణపూర్కు ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు, మునుగోడుకు చాడ సురేశ్రెడ్డి, మర్రిగుడెంకు కొండా విశ్వేశ్వర్రెడ్డి, చౌటుప్పల్కు కూన శ్రీశైలంగౌడ్, నాంపల్లికి ఏనుగు రవీందర్రెడ్డి, చండూర్కు నందీశ్వర్గౌడ్, చౌటుప్పల్ మున్సిపాలిటీకి రేవూరి ప్రకాశ్రెడ్డి, చండూర్ మున్సిపాలిటీకి ఎం.ధర్మారావులను నియమించింది. శనివారం ఆ పార్టీ కార్యాలయంలో కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ తొలిసారిగా సమావేశమైంది. ఈ భేటీ అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల్లో సర్కార్పై ఉన్న వ్యతిరేకత గురించి పార్టీపరంగా చార్జ్షీట్ సిద్ధం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నెల 27న చౌటుప్పల్ మండలంలో మండల ఇన్చార్జీల సమావేశం ఉంటుందన్నారు. మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజ్గోపాల్రెడ్డి, స్టీరింగ్ కమిటీ సమన్వయకర్త డా.గంగిడి మనోహర్రెడ్డి, సభ్యులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్రెడ్డి, కె.స్వామిగౌడ్, యెండెల లక్ష్మీనారాయణ, గరికపాటి మోహన్రావు, డా.దాసోజు శ్రవణ్ హాజరయ్యారు. హెచ్సీఏలో గందరగోళం ఇలా.. కల్వకుంట్ల కుటుంబం కారణంగానే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో గందరగోళ పరిస్థితి నెలకొందని హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్ ఆరోపించారు. కవితను హెచ్సీఏ అధ్యక్షురాలిని చేయాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారన్నారు. గతంలో హెచ్సీఏ అధ్యక్షుడిగా పోటీ చేయొద్దని తనకు కేసీఆర్ సూచించారన్నారు. -
పల్లెల్లో భేటీలతో ఏకతాటిపైకి.. ‘మునుగోడు’పై ప్రత్యేక వ్యూహం!
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. గ్రామాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలా లను అంచనా వేస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితు ల్లోనూ విజయం సాధించేలా ఒక వైపు పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపేందుకు కసరత్తు చేస్తూనే, మరోవైపు ఇతర పార్టీల నుంచి చేరికలను ముమ్మరం చేసింది. ఇప్పటికే నియోజకవర్గంలోని మండలాల వారీగా ఇన్చార్జీలను నియమించిన అధికార పార్టీ, త్వరలో రెండు గ్రామాలకు ఒకరు చొప్పున ముఖ్య నేతలకు బాధ్యతలు అప్ప గించనుంది. ఉప ఎన్నిక షెడ్యూలు వెలువ డిన తర్వాత చండూరు కేంద్రంగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. రాజగోపాల్ రాజీనామా వార్తలతోనే అప్రమత్తం వాస్తవానికి మునుగోడు అసెంబ్లీ స్థానానికి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా చేస్తా రనే సంకేతాలు వెలువడిన సమయంలోనే అధికార పార్టీ అప్రమత్తమై చేరికలపై దృష్టి పెట్టింది. రాజ్గోపాల్ రాజీనామా మొదలు కుని ఇప్పటివరకు, కాంగ్రెస్ సహా వివిధ పా ర్టీల నుంచి 30మందికి పైగా ఎంపీటీసీ స భ్యులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు టీఆర్ ఎస్లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థిగా స్రవంతి పేరు ఖరారు కావడంతో ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు పార్టీలో చేరే అవకా శముందని టీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. ఇప్పటికే రంగంలో మండల ఇన్చార్జీలు ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి ఇద్దరేసి చొప్పున ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు ఇన్చార్జీలుగా బాధ్య తలు అప్పగించారు. ఎమ్మెల్సీ, ఉమ్మడి నల్ల గొండ జిల్లా టీఆర్ఎస్ ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్రావు పార్టీ యంత్రాంగాన్ని సమ న్వయం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తు న్నారు. ఇన్చార్జీలు గ్రామాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల బలాబలాలు, సామాజికవర్గాల వారీ గా ఓటర్ల వివరాలు, గ్రామ రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తులు తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తున్నారు. క్షేత్ర స్థాయి నుంచి అందుతున్న నివేదికల ఆధారంగా పార్టీ నేతల నడుమ విభేదాలు సరిదిద్దడం, ఇతర పార్టీల నుంచి చేరికలకు ప్రయత్నించడం వంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. త్వరలో 90 యూనిట్లు.. ముఖ్య నేతలందరికీ బాధ్యతలు తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలు ముగిసిన తర్వాత మునుగోడును 90 యూని ట్లుగా విభజించి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కీలక నేతలను ఇన్చార్జీలుగా రంగంలోకి దించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్ప టికే ఏ యూనిట్కు ఎవరు ఇన్చార్జిగా వ్యవ హరిస్తారో పేర్కొంటూ జాబితాను రూపొందించారు. 70 మంది ఎమ్మెల్యేలు, మరో 20 మంది ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు యూనిట్ ఇన్చార్జీలుగా వ్యవహ రిస్తారు. ఇలావుండగా గత నెల 20న మును గోడు నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్ బహి రంగ సభ నిర్వహించిన టీఆర్ఎస్.. ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడిన తర్వాత చండూ రులో సభ నిర్వహించాలని నిర్ణయించింది. అభ్యర్థిగా కూసుకుంట్ల ఖాయం? బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని పలువురు నేతలు వ్యతిరేకిస్తుండటంతో.. అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించడంలో ఆలస్యం జరుగుతోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వంటి నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయగా, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్తో పాటు స్థానికంగా మరికొందరు నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే కూసుకుంట్ల అభ్యర్థిత్వం ఖాయమైనట్టేనని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదీ చదవండి: ‘గులాబీ’ బాస్కు తలనొప్పిగా మారిన ‘డాక్టర్’! -
గటు దిక్కు బోవద్దు గన్పతీ!
కైలాసం. శంకరుడు కండ్లు మూస్కోని తపస్సు జేస్తున్నడు. పార్వతి వొంట జేస్తున్నది. అదువరదాక ఎల్కలతోని దాగుడు మూతలాడుకొన్న గన్పతి గామె తాన్కి వొచ్చిండు. ‘‘అమ్మా’’ అని బిల్సిండు. ‘‘ఏంది బిడ్డా! ఆకలైతున్నదా? ఏమన్న బెట్టాల్నా?’’ అని పార్వతి అడిగింది. ‘‘ఏమొద్దమ్మా! చవ్తి పండ్గ దినాలు గదా. ఒకసారి పట్నం బోయొస్తనే.’’ ‘‘యాడికి బోవొద్దురా కొడ్కా! వొద్దు వొద్దంటె పోయిన యాడాది పట్నం బోయినవు. ఇగొస్తడు, అగొస్తడనుకుంట ఎంతగనం ఎందురుజూసినా నువ్వు రాలేదు. మేమంత పరేశానైతిమి. లెంకంగ లెంకంగ ఆకర్కి మూతదెర్సిన మ్యాన్హోల్ల బడ్డ నువ్వు గండ్లబడ్డవు.’’ ‘‘గీపారి గట్లగాదమ్మా.’’ ‘‘గిప్పుడు వానకాలం నడుస్తున్నది. వాన బడ్డదా అంటె పట్నం తొవ్వలల్ల యాడ ఏమున్నదో ఎర్కగాదు.’’ ‘‘వాన కాలం నడుస్తున్నా దినాం వానగొట్టదమ్మా!’’ ‘‘ఎంత జెప్పినా ఇనవైతివి. పోయిరా! జెర పైలం.’’ గన్పతి కైలాసంలకెల్లి ఎల్లిండు. మెల్లగ మబ్బుల పంటి నడ్సుకుంట పట్నం దిక్కు రాబట్టిండు. నడ్మల పట్నంకెల్లి వైకుంటం బోతున్న నారదుడు గాయినకు ఎదురొచ్చిండు. ‘‘నారాయణ, నారాయణ, యాడ్కి బోతున్నవు గన్పతీ’’ అని నారదుడడిగిండు. ‘‘పట్నం బోతున్న. గాడ పతొక్క వాడ కట్టుల నా బొమ్మలు బెడ్తరు. గవన్ని ఒక్క తీర్గనే ఉండయి. తీరు తీర్లుంటయి. గంతేగాకుంట ఉండ్రాల్లు, పండ్లు, బచ్చాలు, పాసెం, పులిగొర అసుంటియి నాకు బెడ్తరు.’’ ‘‘తప్పి జారి గవి దినేవు!’’ ‘‘ఎందుకు దినొద్దు?’’ ‘‘ఎవలు జేసినయి ఎట్లుంటయో! మొన్న బాసర ఐఐటీ పోరగాల్లు హాస్టల్ల తిన్నంక కడ్పునొస్తున్నదని మొత్తుకున్నరు. కొంతమంది దవకాన్ల షరీకయ్యిండ్రు. పదేండ్ల కిందట రౌతుల్లెక్క ఉన్న ఉండ్రాల్లు దింటుంటె నీ రొండు దంతాలల్ల ఒకటిర్గలేదా? గదంత యాదిమర్సినవా? గింత జెప్పినా తినకుంటె బేచైనైత దనుకుంటే నీ ఇష్టం.’’ ‘‘నువ్వు గింతగనం జెప్పినంక ఎందుకు తింట నారదా?’’ ‘‘పట్నం బోతె బోయినవు గని తప్పి జారి మునుగోడు బోకు గన్పతీ.’’ ‘‘ఎందుకు బోవద్దు నారదా!’’ ‘‘గాడ్కి బోతివా అంటె కాంగ్రెస్ వినాయకునివా అని ఒకడు అడ్గుతడు. బీజేపీ వినాకునివా అని ఒకడు అడ్గితె, టీఆర్ఎస్ వినాయకునివా అని ఇంకొకడు అడ్గుతడు.’’ ‘‘చాక్ పీస్ల గన్పతి, గవ్వల గన్పతి, ముత్యాల గన్పతి అసువంటి తీరు తీర్ల గన్పతులను జూసిన. నువ్వు జెప్పిన గన్పతులేంది నారదా?’’ ‘‘మునుగోడుల బైఎలచ్చన్లొచ్చినై. మూడు పార్టీలు పైసలిచ్చి గన్పతులు బెట్టిపిచ్చినయి. కాంగ్రెస్ వినాయకుడు చెయ్యి సూబెడ్తడు. టీఆర్ఎస్ వినాయకుడు మోటర్ల గూసుంటె, బీజేపీ వినాయకుడు తామరపువ్వులుంటడు.’’ ‘‘మునుగోడుల బై ఎలచ్చన్లు ఎందుకొచ్చినయి నారదా?’’ ‘‘రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కుర్సికి రాజినామ జేసిండు. కాంగ్రెస్లకెల్లి బీజేపీలకు దుంకిండు.’’ ‘‘గాయిన రాజినామ ఎందుకు జేసిండు.’’ ‘‘అడిగితె నియోజక వర్గం అభివృద్ధి కోసమన్నడు.’’ ‘‘గాయిన జెప్పిన దాంట్ల నిజమేమన్న ఉన్నదా?’’ ‘‘ఉన్నది. ఎట్లంటవా ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే కుర్సికి రాజినామ జేస్తే హుజూర్నగర్ల బై ఎలచ్చన్లు అయినయి. గప్పుడు టీఆర్ఎస్ సర్కార్ ఒక్క గా నియోజక వర్గంలనే గొర్లను పంచింది. కొత్తగ దలిత బందు పద్కం బెట్టి ఒకొక్క దలిత కుటుంబానికి పది లచ్చల రూపాయల వొంతున ఇచ్చింది.’’ ‘‘మునుగోడుల గుడ్క గట్లే జేస్తదా?’’ ‘‘చేస్తది. మా వూరుకు తొవ్వ లేదు. తొవ్వ ఏపిచ్చినోల్లకే ఓట్లేస్తం అని ఏ వూరోల్లన్న అంటే టీఆర్ఎస్ సర్కార్ తొవ్వ ఏపిస్తది. సూసిండ్రా నేను ఎమ్మెల్యే కుర్సికి రాజినామ జెయ్యబట్కె మీ వూరికి తొవ్వ వొచ్చిందని రాజగోపాల్ రెడ్డి అంటడు.’’ ‘‘బై ఎలచ్చన్ల కర్సంత జెనం నెత్తిమీదనే బడ్తది గదా.’’ ‘‘అవ్. కొత్త పన్నులేస్తరు. మునుగోడుల కొత్త దుక్నాలు బడ్డయి. గవ్విట్ల సర్పంచులను, గల్లి లీడర్లను అమ్ముతున్నరు. పది వేల రూపాయల వొంతున ఓట్లు గొనెతందుకు పార్టీలు రడీగున్నయి.’’ ‘‘వామ్మో!’’ ‘‘యాడాది కొక్కపారి చవ్తి పండ్గొస్తది. గదే తీర్గ అయిదేండ్ల కొక్కపారి, ఒక్కోపారి అంతకన్న ముందుగాలే ఓట్ల పండ్గొస్తది. ‘జై గణేశ, జై గణేశ, జై గణేశ దేవా’ అన్కుంట జెనం నీకు పూజలు జేస్తరు. ఉండ్రాల్లు బెడ్తరు. మీరే మా దేవుల్లనుకుంట లీడర్లు జెనాలకు బిర్యాని బెడ్తరు. మందు తాపిస్తరు. తొమ్మిది దినాలైనంక నిన్ను నీల్లల్ల ముంచుతరు. ఎమ్మెల్యే కుర్సిలు దొర్కినంక లీడర్లు దినాం జెనాలను నిండ ముంచుతరు’’ అని నారదుడు అన్నడు. ‘‘నువ్వు గిదంత జెప్పినంక నాకు పట్నం పోబుద్ది అయితలేదు నారదా!’’ అన్కుంట గన్పతి కైలాసం దిక్కు బోయిండు. ‘‘నారాయణ, నారాయణ’’ అన్కుంట నారదుడు వైకుంటం బోయిండు. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
మునుగోడు ధర్మయుద్ధంలో విజయం నాదే: రాజగోపాల్రెడ్డి
సంస్థాన్ నారాయణపురం: మునుగోడులో జరిగే ధర్మ యుద్ధంలో తన విజయం తథ్యం అని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ప్రజాసేవకు తాను ఆస్తులు అమ్ముకుంటే.. మంత్రి జగదీశ్రెడ్డి పద విని అడ్డంపెట్టుకుని రూ.వేల కోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. బుధవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో తన అనుచరులు, అభిమానులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. జగదీశ్ రెడ్డికి విద్యుత్ శాఖకు బదులుగా కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ శాఖను కేటాయిస్తే బాగుంటుందని రాజగోపాల్రెడ్డి ఎద్దేవా చేశారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కు నిధులు తీసుకెళ్తుంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి పనులకు నిధులు తీసుకురాలేని దద్దమ్మ జగదీశ్రెడ్డి అని దుయ్య బట్టారు. ఈనెల 21న మునుగోడులో జరిగే అమిత్షా సభలో తనతోపాటు భారీ సంఖ్యలో వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరనున్నట్లు రాజగోపాల్రెడ్డి చెప్పారు. అనంతరం తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పేద కుటుంబాలకు రూ.8 లక్షల ఆర్థికసాయం చేశారు. చదవండి: చిచ్చుపెట్టే వారితో జాగ్రత్త! మోసపోతే గోసే.. -
Munugode Bypoll: పోటీయా? మద్దతా?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్ని కలో బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యంగా సీపీఐ, సీపీఎం పార్టీలు ముందుకు సాగనున్నాయి. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించాలని నిర్ణయించాయి. ఇప్పటికే వేర్వేరుగా పార్టీ కార్యకర్తలతో స్థానికంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అయితే గతంలో అనేకసార్లు సీపీఐ అభ్యర్థులు మునుగోడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అక్కడ ఆ పార్టీకి క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది. సీపీఎం కూడా కొంతమేరకు ఓటు బ్యాంకు కలిగి ఉంది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థిని పోటీకి దింపే విషయం కూడా సీపీఐ సమాలోచనలు చేస్తోంది. పోటీ చేస్తే గెలవగలమా? ఒకవేళ గెలవ లేని పరిస్థితి ఉంటే ఓట్ల చీలిక వల్ల బీజేపీకి ప్రయోజనం కలుగుతుందా? అనే కోణంలో మల్లగుల్లాలు పడుతోంది. పార్టీ క్యాడర్తో జరుగుతున్న సమావేశాల్లో మాత్రం చాలామంది పోటీ చేయాలనే సూచిస్తున్నట్లు తెలిసింది. అయితే గతంలో అనేకసార్లు గెలిచినా అది పొత్తుల వల్లే సాధ్యమైందని, పూర్తిగా సొంత బలమే కారణం కాదని సీపీఐ నాయకులు కొందరు చెబుతున్నారు. అంతేకాదు నియోజకవర్గ పునర్విభజన వల్ల గతంలో ఉన్న ఓటు బ్యాంకు కొంత మేరకు తగ్గింది. ఈ పరిస్థితుల్లో పోటీ చేయడం వల్ల పరోక్షంగా బీజేపీకి లాభం కలిగే అవకాశం ఉంటుందని, అదే ఖాయమైతే బరిలో ఉండకూడదని సీపీఐ భావిస్తున్నట్టు తెలిసింది. అన్ని కోణాల్లో విశ్లేషించుకున్న తర్వాతే ముందుకు సాగాలనే ఆలోచనలో ఉంది. ఒకవేళ సీపీఐ తన అభ్యర్థిని బరిలోకి దింపితే మద్దతు ఇచ్చేందుకు సీపీఎం సిద్ధంగా ఉంది. రెండు పార్టీలు ఈ నెల 15 తర్వాత సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోనున్నాయి. (క్లిక్: మునుగోడులో పెరిగిపోతున్న పొలిటికల్ హీట్) టీఆర్ఎస్కా? కాంగ్రెస్కా? సీపీఐ పోటీ చేయని పక్షంలో బీజేపీకి అడ్డుకట్ట వేసే పార్టీకి మద్దతు ఇవ్వాలని వామపక్షాలు భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీని ఓడించగలిగేది టీఆర్ఎస్సా? కాంగ్రెస్సా? అన్నది ఇప్పుడు కీలకమని సీపీఐ, సీపీఎం నేతలంటున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీకి వలసలు ఉంటాయా? అలా వెళ్లడం వల్ల కాంగ్రెస్ బలహీన పడుతుందా? లేక కాంగ్రెస్ తన బలాన్ని చాటుకుంటుందా? టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? ఈ రెండు పార్టీల్లో ఎన్నికల నాటికి బీజేపీని ఓడించే సత్తా ఎవరికి ఉంటుందన్న దానిపై ఆధారపడి మద్దతు విషయంలో నిర్ణయం తీసుకుంటామని పార్టీ కీలక నేత ఒకరు చెప్పారు. (క్లిక్: మంచి బట్టలు తొడిగినా ఓర్వలేడు!.. ఆయనకు టికెట్ ఇస్తే..) -
మునుగోడు ఉప ఎన్నిక; కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
సాక్షి, హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటనతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు రాజగోపాల్ రెడ్డి మంళగవారం రాత్రి ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి ప్రెస్మీట్ ముగిసిన వెంటనే మీడియా ముందుకు వచ్చిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నికకు పిలుపునిచ్చారు. బై ఎలక్షన్లో రాజగోపాల్ రెడ్డికి భంగపాటు తప్పదని అన్నారు. అభ్యర్థి ఎవరు? కేసీ వేణుగోపాల్తో జరిగిన పార్టీ రాష్ట్ర ముఖ్యనేతల సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలన్న దానిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్రెడ్డి కుమార్తె స్రవంతితోపాటు గౌడ, పద్మశాలి సామాజిక వర్గాలకు చెందిన నాయకుల పేర్లను పరిశీలించినట్టు సమాచారం. సంస్థాన్ నారాయణపురం మండలానికి చెందిన రియల్టర్ కృష్ణారెడ్డిని బరిలో దింపే అంశంపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. ఎవరు పోటీచేసినా గెలిపించే బాధ్యతను నల్లగొండ జిల్లా నాయకత్వమే చూసుకోవాలని పార్టీ పెద్దలు చెప్పినట్లు తెలిసింది. ఉప ఎన్నిక కోసం కమిటీ రాజగోపాల్ రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమయ్యే నేపథ్యంలో.. ప్రత్యేక వ్యూహ, ప్రచార కమిటీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ కన్వీనర్గా ఉండే ఈ కమిటీలో.. నేతలు రాంరెడ్డి దామోదర్రెడ్డి, బలరాం నాయక్, సీతక్క, అంజన్కుమార్ యాదవ్, సంపత్కుమార్, ఈరవత్రి అనిల్లను సభ్యులుగా నియమిస్తున్నట్టు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ చెప్పారు. (క్లిక్: రేవంత్ రెడ్డిని ఉతికి ఆరేసిన కోమటిరెడ్డి) సస్పెండ్ చేస్తారనే..! రాజగోపాల్ రాజీనామా ప్రకటనపై కాంగ్రెస్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. పార్టీకి విధేయుడైన నాయకుడిని కోల్పోయామని కొందరు అంటున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే ఉద్దేశంతోనే రాజీనామా ప్రకటన చేశారని మరికొందరు పేర్కొంటున్నారు. సోమవారం రాత్రి కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన సమావేశం సందర్భంగా.. మంగళవారం నిర్ణయం తీసుకోవాలని, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని అధిష్టానం నుంచి సమాచారం అందిందని, ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేశారని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. (క్లిక్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి సంతోషంగా ఉన్నారా?) -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాలు
-
ఆత్మకూరు ఉపఎన్నిక.. పోటెత్తిన ఓటర్లు (ఫొటోలు)
-
ఆత్మకూరులో పోలింగ్ ప్రశాంతం
-
ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీచేసే అభ్యర్థులకు ‘ఆన్లైన్ అవకాశం’
సాక్షి, అమరావతి: ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులకు భారత ఎన్నికల సంఘం కొత్త అవకాశాన్ని కల్పించింది. ఆన్లైన్ ద్వారా నామినేషన్ ఫామ్, అఫిడవిట్లో వ్యక్తిగత సమాచారాన్ని పొందుపర్చేందుకు, నామినేషన్లు దాఖలు చేయడానికి అపాయింట్మెంట్, ప్రచార కార్యక్రమాల నిర్వహణకు అనుమతులను పొందే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు suvidha.eci.gov.in పోర్టల్ ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. నామినేషన్లను జూన్ 6వ తేదీలోగా దాఖలు చేసుకోవాలని, నామినేషన్ల పరిశీలన 7వ తేదీన జరుగుతుందని, ఉపసంహరణకు 9 చివరి తేదీ అని మీనా తెలిపారు. -
ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, బిహార్, మహారాష్ట్రలలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈమేరకు శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. లోక్సభ నియోజకవర్గంతో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. బెంగాల్లోని అసన్సోల్ లోక్సభ నియోజకవర్గం, బాలీగుంగె అసెంబ్లీ స్థానాలకు ఉప నిర్వహించనున్నారు. కైరాగఢ్(ఛత్తీస్గఢ్), బొచ్చహాన్(బిహార్), కొల్హాపూర్ నార్త్(మహారాష్ట్ర) శాసనసభా స్థానాలకూ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలకు ఏప్రిల్ 18లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజా షెడ్యూల్ ప్రకటించింది. (క్లిక్: ఆమె బీజేపీ ఏజెంట్.. మమ్మల్ని ఓడించారు) ► ఎన్నికల నోటిఫికేషన్ విడుదల: మార్చి 17 ► నామినేషన్లకు దాఖలుకు చివరి తేదీ: మార్చి 24 ► నామినేషన్ల పరిశీలన: మార్చి 25 ► నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 28 ► ఎన్నికల పోలింగ్ : ఏప్రిల్ 12 ► ఎన్నికల ఫలితాల వెల్లడి: ఏప్రిల్ 16 -
దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్
పోలింగ్ అప్డేట్స్: ► దాద్రానగర్ హావేలీలో సాయంత్రం 5 గంటల సమయానికి 66. 99శాతం పోలింగ్ నమోదు. ► బీహార్లో సాయంత్రం 5 గంటల సమయానికి 49.85 శాతం పోలింగ్ నమోదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బీహార్లో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. ► మధ్యప్రదేశ్లోని మూడు అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 5 గంటల సమయానికి 63.02 శాతం పోలింగ్ నమోదు. మరోవైపు ఖాండ్వా లోక్ సభ నియోజకవర్గంలో 59.02 శాతం పోలింగ్ నమోదు. ► రాజస్థాన్లోని ధరియావాడ్, వల్లభనగర్లో సాయంత్రం 5 గంటల సమయానికి సరాసరిగా 65 శాతం పోలింగ్ నమోదు. ► హిమాచల్ ప్రదేశ్ ఉపఎన్నికలో జుబ్బల్-కోట్ఖాయ్లో సాయంత్రం 4 గంటల వరకు 65.88 శాతం, మండిలో 47.17 శాతం పోలింగ్ నమోదైంది. ►మేఘాలయాలో 78 శాతం మేర పోలింగ్ నమోదు. ► బెంగాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 60 శాతానికి పైగా పోలింగ్ ►రాజస్తాన్ మధ్యాహ్నం 3 గంటల వరకు 53.69 శాతం పోలింగ్ ►దాద్రానగర్ హవేలీ మధ్యాహ్నం 3 గంటల వరకు 53.71 శాతం పోలింగ్ ►మేఘాలయ బైపోల్స్లో రికార్డుస్థాయిలో పోలింగ్ జరుగుతోంది. 3 గంటల సమయానికి 64 శాతం మేర ఓట్లు పోలయ్యాయి. ►భారత మొదటి ఓటరు..104 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగి, శనివారం హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలోని కల్పా మోడల్ పోలింగ్ స్టేషన్లో మండి పార్లమెంటరీ ఉప ఎన్నికలో ఓటు వేశారు. ►హర్యానాలో మధ్యాహ్నం 2 గంటల వరకు 45 శాతం పోలింగ్ ► బెంగాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 46 శాతం పోలింగ్ ►రాజస్తాన్ మధ్యాహ్నం 1 గంట వరకు 40.64 శాతం పోలింగ్ ►అస్సాంలో ఉదయం 1 గంట వరకు 51 శాతం పోలింగ్ ►బిహార్లో 1 గంటకు 38 శాతం పోలింగ్ ► మధ్యప్రదేశ్లో అసెంబ్లీ స్ధానాలకు 45.67 శాతం పోలింగ్ ( మధ్యాహ్నం 3 గంటల వరకు), లోక్సభ స్థానాలకు 39.08 శాతం పోలింగ్( మధ్యాహ్నం 1 గంట వరకు) ►దాద్రానగర్ హవేలీ ఉదయం 11 గంటల వరకు 23 శాతం పోలింగ్ ►రాజస్తాన్ 11 గంటల వరకు 25 శాతం పోలింగ్ ►కర్ణాటక 10.30 గంటల వరకు 9.77 శాతం పోలింగ్ ►బిహార్లో ఉదయం 11 గంటలకు 21.79 శాతం ►హర్యానాలో ఉదయం 10 గంటల వరకు 10 శాతం ►అస్సాంలో ఉదయం 10 గంటల వరకు 12 శాతం ►మిజోరాంలో ఉదయం 10 గంటల వరకు 17 శాతం ►కర్ణాటకలో ఉదయం 9 గంటల వరకు 8 శాతం ► బెంగాల్లో ఉదయం 9 గంటలకు 10 శాతానికి పైగా న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేళి, డామన్ డయ్యూలో ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో 3 లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ రాత్రి 7 గంటలకు కొనసాగుతుంది. ఎన్నికలు జరుగుతున్న స్థానాలు దాద్రానగర్ హవేలీ, హిమాచల్ప్రదేశ్లోని మండి, మధ్యప్రదేశ్లోని ఖాండ్వా లోక్సభ స్థానానికి ఉపఎన్నికలు జరగుతుండగా.. అసోంలో 5, బెంగాల్లో 4, మధ్యప్రదేశ్లో 3, మేఘాలయలో 3, హిమాచల్ప్రదేశ్లో 3, బీహార్లో2, కర్ణాటకలో2, రాజస్థాన్లో 2, మహారాష్ట్ర, హర్యానా, మిజోరంలోని ఒక్కో స్థానానికి, తెలంగాణలోని హుజురాబాద్, ఆంధ్రప్రదేశ్లోని బద్వేల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. చదవండి: విశ్వాసం అంటే ఇదేరా ! -
భవానీపూర్ ఉపఎన్నికలో మమతాబెనర్జీ విజయం
కోల్కతా: భవానీపూర్ ఉపఎన్నికలో మమతా బెనర్జీ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రీవాల్పై 58,389 ఓట్ల మెజార్టీతో దీదీ ఘనవిజయం సాధించారు. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్ను వదిలేసి, నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉండగా, భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్దేవ్ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
ఉప ఎన్నికకు ఏర్పాట్లు కట్టుదిట్టం
సాక్షి, అమరావతి: పటిష్టమైన నిఘాతో వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నికను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. ప్రచారంలో రాజకీయ పార్టీలతో పాటు అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళితో పాటు కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. బద్వేలు ఉప ఎన్నిక నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను శుక్రవారం ఆయన సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయడంతో శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే.. కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలి ► కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రచారం, ర్యాలీలు నిర్వహించుకోవాలి. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులకు మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ సమయంలో ఎటు వంటి ర్యాలీలు, ఉత్సవాలు నిర్వహించకూడదు. నామినేషన్లకు అభ్యర్థితోపాటు మరొకరికి మాత్రమే అనుమతి ఉంటుంది. ► ఎన్నికల ప్రచార సమయంలో ఇండోర్ సమావేశాలకు 200 మంది, బహిరంగ సమావేశాలకు స్టార్ క్యాంపైనర్లకు 1,000 మంది, ఇతరులకు 500 మంది, వీధుల్లో సమావేశాలకు 50 మంది, ఇంటింటి ప్రచారానికి ఐదుగురికే అనుమతి. ► బహిరంగ సమావేశాల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. ఆ వ్యయాన్ని అభ్యర్థి ఖాతాలో వేస్తారు. ఆ సమయంలో ఒక్కో అభ్యర్థికి 20 వాహనాలను 50 శాతం సీటింగ్ కెపాసిటీతో అనుమతిస్తారు. ► రెండు డోసుల కోవిడ్ టీకా వేయించుకున్న వారినే ఎన్నికల ఏజంట్లుగా పెట్టుకోవాలి. ఇదే నిబంధన పోలింగ్ సిబ్బందికీ వర్తిస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్ద హెల్త్ అసిస్టెంట్లు ఉంటారు. శానిటైజ్ చేయడంతో పాటు థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ సౌకర్యం ఉంటుంది. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 7 గంటలలోపు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలి. నిరంతర పర్యవేక్షణ ► వైఎస్సార్ జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక పోలీస్ పోస్టు, చెక్ పోస్టుల ద్వారా నిశిత తనిఖీలు ఉంటాయి. ► ఎన్నికల వ్యయంపై ప్రత్యేక నిఘాకు 8 టాస్కు ఫోర్సు బృందాలు, 21 ప్లైయింగ్ స్క్వాడ్లు, 3 వీడియో వ్యూయింగ్ బృందాలు, 4 ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేశాం. ► మొత్తం 281 పోలింగ్ స్టేషన్లలో 140 చోట్లకు పైగా లైవ్ టెలికాస్టు ద్వారా ఎన్నిక నిశిత పరిశీలనకు ఏర్పాట్లు చేస్తున్నాం. ► ఫిర్యాదుల స్వీకరణ, తక్షణ పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్, వెబ్సైట్, మొబైల్ యాప్ ఏర్పాటు చేశాం. 1950కు ఫోన్ లేదా వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. వికలాంగులు, వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ► 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, కోవిడ్ పాజిటివ్ ఓటర్లు కోరితే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తాం. ఇందుకు నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుండి ఐదు రోజుల్లోపు 12–ఈ ఫార్ములాలో దరఖాస్తు చేసుకోవాలి. బద్వేలు నియోజకవర్గంలో 80 ఏళ్లుపై బడిన వృద్ధులు 3,837 మంది, వికలాంగులు 3,902 మంది ఓటర్లుగా ఉన్నారు. ► 2,16,164 మంది జనరల్, సర్వీసు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే అక్టోబర్ 8 లోపు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న వారు కూడా ఓటు వేయొచ్చు. మొత్తం 281 పోలింగ్ స్టేషన్లలో 30 సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను వినియోగిస్తున్నాం. -
బద్వేల్ ఉప ఎన్నికపై సీఎం జగన్ ప్రత్యేక సమావేశం
-
West Bengal Bypolls: నామినేషన్ దాఖలు చేసిన దీదీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికల జోరు మొదలయ్యింది. ఈ నెల 30న జరగనున్న భవానీపూర్ ఉప ఎన్నిక బరిలో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీదీకి ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికల బరిలో బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించినప్పటికి.. మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దాంతో మమత తప్పనిసరిగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. ఈ క్రమంలో మమత కోసం భవానీపూర్ స్థానంలో గెలిచిన శోవన్దేబ్ చటర్జీ రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ స్థానం నుంచి దీదీ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భవానీపూర్ మమతకు కంచుకోట. (చదవండి: మమతా బెనర్జీకి తాడోపేడో: భవానీపూర్ నుంచే పోటీ) పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్తో పాటు శంశేర్గంజ్, జాంగిపూర్ నియోజకవర్గాలకు సెప్టెంబర్ 30వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తుండగా.. 16వ తేదీ ఉపసంహరణ. అక్టోబర్ 3న ఫలితాలు ప్రకటించనున్నారు. చదవండి: మమతా బెనర్జీపై పోటీకి ప్రియాంకా -
Huzurabad Bypoll: ఉప ఎన్నికపై ఈసీకి నివేదిక పంపాలి
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికను వెంటనే నిర్వహించేందుకు వీలుగా వాస్తవ నివేదికను ఈసీకి డీజీపీ, సీఎస్ల ద్వారా పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ డిమాండ్ చేశారు. ఇప్పుడు వాయిదా వేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఉప ఎన్నికల్లో గెలిచేది ఈటల రాజేందరేనని సీనియర్ నేత ఏపీ జితేందర్రెడ్డి పేర్కొన్నారు. ఓటమి భయంతోనే రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎస్, డీజీపీలతో వాస్తవ విరుద్ధ నివేదికలను ప్రభుత్వం ఈసీకి పంపిందని వారు ముగ్గురు వేర్వేరు ప్రకటనల్లో ఆరోపించారు. అక్కడ టీఆర్ఎస్ ఓడిపోతోందని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన నివేదికలతోనే కేసీఆర్ కుట్రకు దిగారని జితేందర్రెడ్డి ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ప్రభుత్వం తప్పుడు నివేదికలతో ఎన్నికలను వాయిదా వేయించిందన్నారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గిపోయిందని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిం దని, ఉపఎన్నికలకు మాత్రం కరోనా అడ్డుగా మారిందా అని ఎస్.కుమార్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలు, బార్లు, రెస్టారెంట్లకు మినహాయింపులు ఇచి్చన కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు ఉపఎన్నికలకు భయపడి కొత్త నాటకానికి తెరతీసిందని ఆరోపించారు. -
బెంగాల్ ఉప ఎన్నికలకు రంగం సిద్ధం!
కోల్కతా: టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. మమతా బెనర్జీ పోటీ చేయనున్న బెంగాల్లోని భవానీపూర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బీజేపీ, టీఎంసీ మధ్య కీలక పోరుకు తెరలేచింది. ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను సెప్టెంబర్ 6న జారీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. సెప్టెంబరు 30న పోలింగ్, అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. బెంగాల్ రాష్ట్ర ప్రత్యేక అభ్యర్థన, రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ వెల్లడించింది. బెంగాల్లో మమతాబెనర్జి బరిలో దిగాలని భావిస్తున్న భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి సెప్టెంబర్ 30న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా బెంగాల్లోని షంషేర్గంజ్, జాంగీర్పూర్ అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలోని పిప్లీ అసెంబ్లీ స్థానానికి కూడా అదే తేదీన ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపింది. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మిగిలిన నియోజకవర్గాల ఉప ఎన్నికలు వాయిదా వేసింది. సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత 31 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నటు వెల్లడించింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్-మే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 294 సీట్లలో 213 స్థానాలను కైవం చేసుకొని మమత నేతృత్వంలోని టీఎంసీ ఘన విజయం సాధించింది. అయితే నందీగ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై సుమారు 2వేల ఓట్ల తేడాతో దీదీ ఓడిపోయినా, బెంగాల్ సీఎంగా మమత ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోరుకు సిద్ధమయ్యారు. చదవండి: యూపీలో మళ్లీ యోగి.. పంజాబ్లో ‘ఆప్’ Huzurabad Bypoll: ఇప్పట్లో హుజురాబాద్ ఉప ఎన్నిక లేనట్టే! -
Huzurabad Bypoll: ఇప్పట్లో హుజురాబాద్ ఉప ఎన్నిక లేనట్టే!
-
దమ్ముంటే హుజూరాబాద్లో డిపాజిట్ తెచ్చుకో
సాక్షి, హుజూరాబాద్(కరీంనగర్): టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్రెడ్డి కొత్త బిచ్చగాడిలా రాష్ట్రంలో తిరుగుతున్నాడని, దమ్ముంటే యుద్ధానికి అనువుగా ఉన్న హుజూరాబాద్ వచ్చి డిపాజిట్ తెచ్చుకోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సవాల్ విసిరారు. బుధవారం పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పోరాటంతో రాష్ట్రాన్ని సాధించామన్నారు. రేవంత్రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్లో పోటీలో నిలవాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు రేవంత్రెడ్డి సమావేశాలకు హాజరుకావడం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న దళితబంధుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు. హుజూరాబాద్లో నిజమైన పొలిటికల్ యుద్ధం జరుగుతోందని, ఓ పక్క దళితులు, బడుగు బలహీన వర్గాల భూములను దోచుకుని ఈటల రాజేందర్ పువ్వుపార్టీ చాటున దాక్కున్నారని అన్నారు. ఇప్పటికి కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్ అభ్యర్థి దొరకడం లేదని, భవిష్యత్లో ప్రజాప్రతినిధిగా రేవంత్రెడ్డిని ప్రజలు విశ్వసించరని, ప్రజా నాయకుడిగా కొనసాగాలంటే నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ మాజీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్పీటీసీ బక్కారెడ్డి, మన్సిపల్ వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల–శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ప్రగతి భవన్ను అంబేడ్కర్ బహుజన్ భవన్గా మారుస్తాం -
Huzurabad : కాంగ్రెస్ నుంచి బరిలోకి మాజీమంత్రి కొండా సురేఖ..?
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికపై పార్టీలన్నీ పట్టు బిగిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ– టీఆర్ఎస్ నువ్వానేనా అన్న స్థాయిలో వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఇటీవల శాలపల్లిలో జరిగిన సీఎం సభతో గులాబీ నేతల్లో జోష్ పెరగగా.. కమలనాథుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు బీజేపీ నేతలు యాత్రలు షురూ చేశారు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిపై ఇంకా కసరత్తులు చేస్తూనే ఉంది. నోటిఫికేషన్కు ఇంకా సమయం ఉండటంతో ధీటైన స్థానిక అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచనలో ఉంది. ఈ ఉప ఎన్నిక టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ప్రచారంలో ఎక్కడా తగ్గవద్దని, మరింత పట్టుబిగించాలని అధిష్టానాలు ఆదేశించాయి. అభివృద్ధి నినాదంతో గులాబీనేతలు.. ► దళితబంధు అమలు చేస్తోన్న నేపథ్యంలో కారుపార్టీ నేతలు జోష్లో ఉన్నారు. దీనికితోడు నోటిఫికేషన్ వచ్చేలోగా నియోజకవర్గంలోని పెండింగ్ పనులను పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ► హుజూరాబాద్ మండలం మొత్తం మంత్రి గంగుల కమలాకర్ పర్యవేక్షిస్తున్నారు. వీణవంక మండల బాధ్యతలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు భుజాలకెత్తుకున్నారు. జమ్మికుంట టౌన్ ప్రచారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తలమునకలయ్యారు. జమ్మికుంట రూరల్ పనులు ఆరూరి రమేశ్ చూస్తున్నారు. ► కీలకమైన ఇల్లందకుంట మండలంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పర్యవేక్షిస్తున్నారు. కమలాపూర్ మండలంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రచారం చేస్తున్నారు. ► సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ఇంటింటికీ తిరిగి వివరించాలని శుక్రవారం రాత్రి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ నేతలందరికీ దిశానిర్దేశం చేశారు. ప్రత్యర్థి పార్టీల పేర్లను పెద్దగా ప్రస్తావించకుండానే.. నేతలు ప్రసంగిస్తుండటం గమనార్హం. యాత్రలతో కమలనాథుల ఉత్సాహం.. ► హుజూరాబాద్లో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో చేసిన పర్యటన ఆ పార్టీ కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ► గతంలో ఈటల రాజేందర్ జన ఆశీర్వాద యాత్రకు మంచి స్పందనే వచ్చింది. ఇక త్వరలోనే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, స్థానిక ఎంపీ బండి సంజయ్ తలపెట్టిన ‘ప్రజాసంగ్రామ యాత్ర’ కూడా హుజూరాబాద్ ఉపఎన్నికకు బాగా కలిసి వస్తుందని పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నారు. ► జమ్మికుంట పట్టణానికి ఫైర్బ్రాండ్ ఎంపీ అరవింద్ను నియమించారు. జమ్మికుంట మండలం బాధ్యతలు మాజీ బీజేపీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావుకు అప్పగించారు. హుజూరాబాద్ పట్టణానికి ఎమ్మెల్యే రఘునందన్రావు, హుజూరాబాద్ మండలానికి మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని కేటాయించారు. ► ఇల్లందకుంట మండలానికి మాజీ ఎంపీ చాడ సురేశ్రెడ్డిని, కమలాపూర్ మండలానికి ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ను, వీణవంక మండలానికి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డిని ఇన్చార్జీలుగా నియమించారు. వీరు చేస్తోన్న ప్రచారాలు, రోడ్షోలతోపాటు నాయకుల యాత్రలు తమకు కలిసి వస్తాయని ధీమాగా ఉన్నారు. కొండా సురేఖ పేరు లాంఛనమే..! ► ఇక ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్కు స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. అందుకే ఇక్కడ బలమైన నాయకులను బరిలోకి దింపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పట్టుదలగా ఉన్నారు. స్థానికనేతలైన పత్తి క్రిష్ణారెడ్డిని, ఎన్ఆర్ఐ పాడి ఉదయానంద్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పెద్దలు సంప్రదించారని తెలిసింది. ► ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాకు చెందిన బలమైన నేత, మాజీమంత్రి కొండా పేరును కొందరు ప్రతిపాదించారు. హుజూరా బాద్ నియోజకవర్గం ఉమ్మడి వరంగల్కు భౌగోళికంగా, రాజకీయంగా అత్యంత సన్నిహితంగా ఉండటంతో కొండా సురేఖ సైతం పోటీకి సై అన్నారని తెలిసింది. ► అయితే, ఇక్కడ పోటీ చేయాలంటే ఆమె కొన్ని షరతులు విధించారని సమాచారం. 2023 ఎన్నికల సందర్భంగా తనకు ఉన్న డిమాండ్లు అధిష్టానం ముందు ఉంచినట్లు తెలిసింది. ఈ షరతులకు అంగీకరిస్తే పోటీకి ఎలాంటి అభ్యంతరం లేదన్న కొండా వర్గీయుల ప్రతిపాదనకు అధిష్టానం కూడా అంగీకరించిందని సమాచారం. ► వాస్తవానికి ఇటీవల రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభలోనే కొండా పేరును ప్రకటిస్తారని అంతా ఎదురుచూశారు. అయితే, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రాఖీపౌర్ణమి అనంతరం సురేఖ పేరును పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. చదవండి: మల్లన్న సాగర్లోకి గోదారి ట్రయల్రన్ విజయవంతం -
Etela Rajender: పదవుల కోసం పెదవులు మూసుకుంటున్నారు!
ఇల్లందకుంట (హుజూరాబాద్): పదవుల కోసం టీఆర్ఎస్ నాయకులు పెదవులు మూసుకుంటున్నారని, ఆత్మవంచన చేసుకుని బతకడం తనకు ఇష్టం లేకే పార్టీ నుంచి బయటకు వచ్చానని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృష్ణకాలనీకి చెందిన పలువురు నాయకులు మంగళవారం ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు. సీఎం కేసీఆర్తో అనేక అంశాలపై పెనుగులాడానని ఈటల పేర్కొన్నారు. తాను పేద ప్రజల కోసం కొట్లాడే బిడ్డనని, ఎవరికి ఆపద వచ్చినా తక్షణ సాయం అందిస్తానని చెప్పారు. పట్టణంలో ఇటీవల కాలంలో మరణించిన మృతుల కుటుంబాలను ఈటల పరామర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కాగా, ఈటలకు బీసీ కులాల ఐక్య వేదిక మద్దతు తెలిపింది. -
హుజూరాబాద్లో వేయి మందితో నామినేషన్
హుజూరాబాద్: హుజూరాబాద్లో జరగబోయే ఉపఎన్నికలో వెయ్యి మందితో నామినేషన్ వేస్తామని ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ జిల్లా అధ్యక్షుడు పత్యం యాదగిరి, ప్రధాన కార్యదర్శి బోయిని తిరుపతి తెలిపారు. రాష్ట్రంలోని 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఇక్కడే మకాం వేసి అధికార పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఆదివారం హుజూరాబాద్లోని హైస్కూల్ క్రీడా మైదానంలో ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2019 డిసెంబర్లో సర్క్యులర్ నెంబర్ 4779ని ప్రభుత్వం జారీ చేసిందని, ఆ జీవోను రద్దు చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యమిస్తే 2020 మార్చిలో విధుల నుంచి తొలగించారని తెలిపారు. 16 నెలలుగా ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే విధుల్లోకి తీసుకోకపోతే పోటీకి దిగుతామని చెప్పారు. కార్యక్రమంలో హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల ఫీల్డ్ అసిస్టెంట్ల జేఏసీ అధ్యక్షులు రమేశ్, శ్రీనివాస్, రవి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
Huzurabad Bypoll: అలా చేస్తే మోదీకి పాలాభిషేకం చేస్తాం: హరీశ్రావు
-
అలా చేస్తే మోదీకి పాలాభిషేకం చేస్తాం: హరీశ్రావు
సాక్షి, హుజూరాబాద్: హుజూరాబాద్లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక.. యావత్ తెలంగాణ ఎన్నికగా మారింది. ఈ క్రమంలో అధికార, విపక్షాలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మతకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి పార్టీలు. హుజూరాబాద్ ఎన్నిక టీఆర్ఎస్, బీజేపీ ఎలక్షన్గా మారింది. ఇప్పటికే టీఆర్ఎస్ తరఫున రంగంలోకి దిగిన హరీశ్రావు.. బీజేపీపై భారీ ఎత్తున విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరఫున రంగంలోకి దిగిన మంత్రి హరీశ్రావు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలకు భారీ సవాల్ విసిరారు హరీశ్రావు. దళితబంధుకు కేంద్రం నుంచి నిధులు తెస్తే.. మోదీ ఫోటోకు పాలాభిషేకం చేస్తానన్నారు హరీశ్రావు. శనివారం ఎన్నికల ప్రచారంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘‘ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు ఇస్తాం. రైతుబంధుపై దుష్ప్రచారం చేసినట్లే.. దళితబంధుపై కూడా చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా.. దళితబంధు ఇచ్చి తీరుతాం. నిజంగా దళితులపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇవ్వాలి.. దళితబంధుకు కేంద్రం నిధులు ఇస్తే మోదీకి పాలాభిషేకం చేస్తాం’’ అన్నారు మంత్రి హరీశ్రావు -
Huzurabad: కొత్త నేతలు తెరపైకి..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపపోరులో ఆసక్తికర పరిణామం నెలకొంది. దేశంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేసే ప్రక్రియలో ఈసీ తీసుకున్న కీలక నిర్ణయమే ఇందుకు కారణం. కరోనా ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాజా మార్గదర్శకాలు విడుదల చేసి వాటిపై ఈనెల 30లోగా అభిప్రాయాలు పంపాలని ఈసీ అన్ని పార్టీలను కోరింది. ఆయా పార్టీల నుంచి వచ్చిన అభిప్రాయాలను సమీక్షించాక, ఈసీ తన నిర్ణయాన్ని వెలువరించడానికి మరో మూడు, నాలుగు వారాలు పట్టే అవకాశాలున్నాయి. ఈ లెక్కన సెప్టెంబరు ఆఖరువారంలో లేదా అక్టోబరు వరకు నోటిఫికేషన్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. దీంతో రేపోమాపో హుజూరాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ వస్తుందనుకున్న పార్టీలంతా కాస్త నిరాశకు గురయ్యాయి. నిబంధనల ప్రకారం.. డిసెంబరులోపు హుజూరాబాద్ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే ప్రచారంలో ఐపీఎల్ లెవల్లో వేడి పెంచిన రాజకీయ పార్టీలు అనూహ్యంగా వచ్చిన ఆరేడు వారాల సమయాన్ని ఎవరికి వారు తమకు దక్కిన ‘సూపర్ ఓవర్’గానే భావిస్తున్నాయి. కొత్త నేతలు తెరపైకి..! హుజూరాబాద్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమను గెలిపిస్తారన్న ధీమా గులాబీ నేతల్లో ఇప్పటికే కనిపిస్తోంది. రైతుబంధు, రైతుబీమా, వృద్ధాప్య పింఛన్లు, కల్యాణలక్ష్మికి తోడుగా దళితబంధుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తాజాగా.. దళితుల అభ్యున్నతికి దళితబంధు పేరుతో రూ.ఐదు వందల కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నిధులను 16వ తేదీన శాలపల్లి వేదికగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా అందజేయనున్నారు. ఈ పథకంతో నియోజకవర్గంలో దాదాపు 40 వేలకుపైగా దళితులను ఆకట్టుకునేందుకు అధికార పార్టీ సిద్ధమైంది. వీటికితోడు నియోజకవర్గంలో పెండింగ్ పనులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణాలను చేపడతామని, ప్రతీ గ్రామానికి మహిళా భవన్లు నిర్మిస్తామని హామీ ఇస్తోంది. ముగ్గురు కొత్త నేతలను ముందుపెట్టి.. ఈ ఉపపోరులో గెలిచే పావులు వేగంగా కదుపుతున్న టీఆర్ఎస్ పార్టీ పథకాలతోపాటు స్థానిక నేతలకు పదవుల పరంగా ఇచ్చిన అవకాశాలను కూడా ప్రచారం చేసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బండా శ్రీనివాస్, ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్న పాడి కౌశిక్రెడ్డి, అనూహ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా తెరపైకి వచ్చిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఈ విరామ సమయంలో ముమ్మరంగా ప్రచారంలో పాల్గొనేలా గులాబీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి ఇన్ని విస్తృత అవకాశాలు కల్పించామని, గెలిస్తే మరింత చేస్తామన్న సంకేతాలు పంపేలా చర్యలు చేపడుతున్నారు. ఆత్మగౌరవంతో ఈటల.. అన్నీ తానై! రాజీనామా చేసిన సమయం నుంచి బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. తాజాగా.. లభించిన విరామ సమయం తనకు కలిసి వస్తుందని ఆయన వర్గం ఆశాభావం వ్యక్తంచేస్తోంది. ఆత్మగౌరవ నినాదం, నియోజకవర్గంలో గతంలో చేసిన అభివృద్ధి, రెండు దశాబ్దాలుగా తనకు స్థానికులతో ఉన్న అనుబంధం గెలిపిస్తాయని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఈసీ నోటిఫికేషన్ వెలువరించే వరకు తన ప్రచారానికి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల ఈటల చేపట్టిన ప్రజాదీవెన పాదయాత్రకు బండి సంజయ్ వచ్చారు. అలాగే.. మాజీ ఎంపీ జితేందర్రెడ్డి ఇన్చార్జి కావడంతో ఇక్కడే ఉంటున్నారు. ఇక దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ ఎంపీ వివేక్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ కూడా ఈటలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఇంకా స్పీడ్ పెంచాలని ఆ శిబిరం భావిస్తోంది. గులాబీ పార్టీ నుంచి ముగ్గురు మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, బాల్కసుమన్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నోటిఫికేషన్ అనంతరం బీజేపీ రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు సైతం హుజూరాబాద్లో విస్తృతంగా పర్యటిస్తారని కమలనాథులు చెబుతున్నారు. రెండుపార్టీల గుట్టు బయటపెడతాం.. ఇంతవరకూ అభ్యర్థిని ఖరారు చేయని కాంగ్రెస్కు ఈ విరామ సమయం బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. బీజేపీ–టీఆర్ఎస్ల ప్రజా వ్యతిరేక విధానాలను, ఆ పార్టీల అసలు గుట్టును ప్రజలకు వివరించేందుకు ఇదే చక్కటి అవకాశమని భావిస్తోంది. ఇప్పటికే అభ్యర్థి కూర్పుపై కసరత్తు ప్రారంభించిన హస్తం పార్టీ పలువురు సీనియర్ నాయకులతో సంప్రదింపులు ముమ్మరం చేసింది. హుజూరాబాద్లో పోటీ చేసేందుకు ఇతర నియోజకవర్గాల నేతలు ఆసక్తి చూపిస్తున్నా.. స్థానికులైతేనే మేలన్న ఆలోచనలో టీపీసీసీ ఉందని సమాచారం. గెలిచినా, ఓడినా.. కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉంటుంది. ఆ వెంటనే శాసన సభ ఎన్నికలు వస్తాయి. రెండుసార్లు పోటీ అంటే సీనియర్లు ఖర్చు భరించే స్థితిలో లేరు. దీంతో పొరుగునే ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా లేదా హుజూరాబాద్కే చెందిన ఓ కాంగ్రెస్ నేతతోపాటు, మరో ఎన్నారైతో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఈసీ తీసుకున్న నిర్ణయం ఒక విధంగా కాంగ్రెస్ నెత్తిన పాలు పోసిందనే చెప్పాలి. అభ్యర్థిని ఖరారు చేసుకోవడంతోపాటు, బీజేపీ–టీఆర్ఎస్లు ప్రజల్ని మభ్యపెడుతున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టేందుకు చిక్కిన అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. ముఖ్యంగా దళిత సంక్షేమం విషయంలో ఇరు పార్టీల కపట ప్రేమను బయటపెడతామని చెబుతున్నారు. -
హుజూరాబాద్ హీట్: గెలుపు కోసం ఎవ్వరూ తగ్గట్లే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన అంశం కావడంతో అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అభ్యర్థిని ప్రకటించిన టీఆర్ఎస్ తన దూకుడు పెంచింది. మరోవైపు ఉపఎన్నికకు ముందు ఈసీ తాజాగా ఇచ్చిన సంకేతాలతో మిగిలిన పార్టీలు కూడా కదనరంగంలోకి దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణపై తమతమ అభిప్రాయాలు చెప్పాలంటూ అన్ని పార్టీలను ఎన్నికల కమిషన్ గురువారం కోరింది. దీంతో ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థిని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఈటల అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారు అయినట్లుగానే ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థిని ప్రకటించేందుకు సన్నాహాలు ముమ్మరం చేసిందని సమాచారం. కాంగ్రెస్ కసరత్తు ►అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించడం టీఆర్ఎస్కు కలిసొచ్చింది. గెలిస్తే తామేం చేస్తామో వివరిస్తూ, నియోజవకవర్గంపై వరాల జల్లు ప్రకటిస్తూ.. ప్రత్యర్థి వర్గాలు కూడా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ►రాజేందర్ కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి దిగుతున్నారు. తాను సీఎంకు, ప్రగతి భవన్కు బానిసను కాదంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు. అయితే.. తన అభ్యర్థిత్వంపై బీజేపీ నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ►అదే సమయంలో కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో అసలు ఆ పార్టీ పోటీలోనే లేదని కారు పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. హుజూరాబాద్లో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కసరత్తు మొదలుపెట్టారని సమాచారం. ఈ స్థానం నుంచి స్థానికంగా గట్టి నేతలు అందుబాటులో లేకపోవడంతో బలమైన మహిళ లేదా దళిత నేతలను బరిలో నిలిపే యోచనలో రేవంత్ ఉన్నారు.ఇప్పటికే దీనిపై ఆయన పలువురు నేతలను సంప్రదిస్తున్నారు. ►మరో రెండున్నరేళ్లు మాత్రమే ఎమ్మెల్యే పదవీకాలం ఉండటం, ఒకవేళ ఇక్కడ పరాజయం పాలైతే సొంత నియోజకవర్గంలోనూ ఆ ప్రభా వం ఉంటుందన్న ఆందోళనలో కొందరు పోటీ కి సంశయిస్తున్నారని తెలిసింది. అయితే.. ఈ వారాంతానికి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చే అవకాశముందని సమాచారం. ఈసీ అభిప్రాయాలు కోరడంతో..! కోవిడ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలుచోట్ల నిర్వహించాల్సిన ఉప ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎన్నికల్లో పాటించాల్సిన కోవిడ్ నిబంధనలకు సంబంధించి పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిపై ఆగస్టు 30లోగా పార్టీలు అభిప్రాయాలు తెలపాలని కోరింది. దీంతో ఉప ఎన్నికలు జరగాలి్సన చోట వేడి పెరిగింది. ఈసీ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించిన నేపథ్యంలో హుజూరాబాద్లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిత్వాలపై త్వరలోనే ఉత్కంఠ వీడనుంది. పేలుతున్న మాటల తూటాలు.. ఇంకా నోటిఫికేషన్ వెలువడకుండానే.. నియోజకవర్గంలో ఎన్నికల వేడి మాత్రం రాజుకుంది. అందరి కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన టీఆర్ఎస్ దూకుడే ఆయుధంగా ముందుకు వెళ్తోంది. బీజేపీ తరఫున ఈటల రాజేందర్ సైతం అదే తరహాలో ఎదురుదాడికి దిగుతున్నారు. ఆత్మగౌరవం నినాదంతో ఈటల మాటల తూటాలు పేలుస్తుంటే.. అభివృద్ధి బావుటాతో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. బుధవారం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమనాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేసి పోటీలో ముందే ఉన్నామని ప్రతిపక్షాలకు సంకేతాలు పంపారు. ఈ ఉప ఎన్నికకు ఇన్చార్జీ బాధ్యతలను హరీశ్రావు తీసుకున్నారు. తమకు ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలను, తమ పార్టీ అమలు చేస్తున్న రైతుబంధు, దళితబంధు, కల్యాణలక్ష్మీ, వృద్ధాప్య పింఛన్లు తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఆకట్టుకునేలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రసంగిస్తున్నారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాల ఫలాలు లబ్ధిదారులకు అందేలా వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. -
తెలంగాణ లో హుజురాబాద్ రాజాకీయ వేడి
-
తెలంగాణ లో హుజురాబాద్ రాజాకీయ వేడి
-
Huzurabad Bypoll: వేడెక్కిన రాజకీయం.. సై అంటే సై
-
ఈటలను 6సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. కేసీఆర్ను ‘రా’ అంటుండు
సాక్షి, కరీంనగర్: ‘‘ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన కేసీఆర్ను ఈటల రాజేందర్ ..‘రా’ అంటున్నాడు.. బీజేపీలో చేరాక ఆయన మాట మారింది.. ఓటమి భయంతోనే ఈటల మాట తూలుతున్నాడు’’ అంటూ మంత్రి హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచి పెద్ద చేసిన కొడుకు గుండెల మీద తంతే ఎలా ఉంటుందో.. ఈటల వ్యవహారం అలానే ఉందని హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తరపున హరీశ్రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘హుజురాబాద్లో స్వాగతం చూస్తా ఉంటే.. శ్రీనివాస్ భారీ మెజారిటీతో గెలవబోతున్నాడని అర్థమవుతుంది. బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసే ఈటెల రాజేందర్.. తనను చూసి ఓటు వేయమంటున్నడు. బీజేపీలో ఉంటు ఆత్మ వంచన చేసుకొని ఆత్మగౌరవం అంటున్నాడు. మంత్రిగా ఉన్నప్పుడు చేయలేని పనులు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తాడు. హుజూరాబాద్లో కాంగ్రెస్కు డిపాజిట్ రాదు. పోటీ ఉన్నది టీఆర్ఎస్ పార్టీకి.. బీజేపీకే’’ అని తెలిపారు. ‘‘సిద్దిపేట నియోజక వర్గంలో ప్రతి గ్రామంలో మహిళా భవనం ఉంది. హుజూరాబాద్ నియోజక వర్గంలో ఎందుకు లేదు. గేల్లు శ్రీనివాస్ గెలిస్తే ప్రతి గ్రామంలో మహిళ భవనాలు కట్టిస్తం. ఈటల ఆత్మగౌరవం అంటూ.. గడియారాలు, కుట్టు మిషనులు, సెల్ ఫోన్లు, టీషర్ట్లు పంచుతున్నాడు. అందుకే గడియారాలు నేలకేసి కొడుతున్నారు. ఎకరం అమ్ముత.. ఎలక్షన్ గెలుస్త అన్నాడు.. అమ్మిండు పంచూతా ఉన్నాడు. హుజూరాబాద్లో రెండు గుంటల భూమికి.. రెండు వందల ఎకరాలకు మధ్య పోటీ. గేల్లు శ్రీనివాస్కు రాష్ట్ర కేబినెట్ ఆశీర్వాదం ఉంది. మీ ఆశీర్వాదం కూడా కావాలి’’ అని ప్రజలను అభ్యర్థించారు హరీశ్రావు. -
ఎమ్మెల్యే పదవికి గంగుల రాజీనామా చేయాలి
సాక్షి, కరీంనగర్టౌన్: కరీంనగర్ ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, వెంటనే గంగుల కమలాకర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఇందిరా చౌక్ వద్ద పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే రాజీనామా చేస్తే నగర అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు విడుదల అవుతాయని, 10 వేల దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున దళిత బంధు సాయం అందుతుందని పేర్కొన్నారు. గొర్రెలు, బర్రెలు, దళిత బంధు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, నిధులు రావాలంటే ఉప ఎన్నిక రావాలన్నారు. హుజురాబాద్లో ఉప ఎన్నిక ఉంది కాబట్టే అక్కడ ఇవన్నీ వస్తున్నాయని తెలిపారు. ఉపఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి స్థానిక ప్రజాప్రతినిధులకు ఫోన్ చేస్తారని, టీఆర్ఎస్ నాయకులకు విలువ పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు వైద్యుల అంజన్కుమార్, ఎస్ఏ.మోసిన్, గుండాటి శ్రీనివాస్రెడ్డి, ఉప్పరి రవి, చర్ల పద్మ, అబ్దుల్ రెహమాన్, మామిడి సత్యనారాయణరెడ్డి, కొమ్ము సునీల్, కమ్రుద్దీన్, కొరవి అరుణ్ కుమార్, కొలిపాక సందీప్, బోనాల శ్రీనివాస్, సయ్యద్ అఖిల్, లింగంపల్లి బాబు, కుర్ర పోచయ్య, ఇర్ఫాన్, సలీమొద్దీన్, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, దండి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘దళితబంధు’ చట్టవిరుద్ధం.. హైకోర్టులో పిల్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దళితబంధు పథకాన్ని అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. జనవాహినీ పార్టీ, జైస్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీల కార్యదర్శులు బి.సంగీత, కాసాని రత్నమాల, ఎ.ఆనంద్లు ఈ పిల్ దాఖలు చేశారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు టీఆర్ఎస్ పార్టీ ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఈ వ్యవహారాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ పిల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, సీఎం కేసీఆర్, కేంద్ర ఎన్నికల కమిషన్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్తోపాటు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. ఆ నియోజకవర్గాల్లో మాత్రమే అమలు చేయాలి... రాష్ట్ర వ్యాప్తంగా 16 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయని, అక్కడ దళిత బంధు అమలు చేయకుండా జనరల్ నియోజకవర్గం హుజూరాబాద్లో అమలు చేయడం చట్టవిరుద్ధమని సామాజిక కార్యకర్త అక్కల సురేష్కుమార్ మరో పిల్ దాఖలు చేశారు. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 లక్షలు బదిలీ చేస్తామని చెబుతున్న నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ నియోజకవర్గాల్లో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసేలా ఆదేశించాలని కోరారు. ఈ రెండు పిల్లు వచ్చేవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
కేసీఆర్ ఎన్ని వేషాలు వేసినా తుది విజయం ఈటలదే..
సాక్షి, హుజూరాబాద్ (కరీంనగర్): హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ప్రజలే బుద్ధి చెబుతారని మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనే ప్రకాశ్రావు అన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల ఉన్న సమయంలో కరోనా కట్టడికి అలుపెరగని కృషి చేశారన్నారు. బీసీ నాయకుడిగా ఈటల ఆరుసార్లు గెలిచారంటే ప్రజాధరణ ఎంత ఉందో అర్థం చేసుకోవాలన్నారు. హుజూరాబాద్ ఓటర్లు నైతికవంతులని, అనూహ్యరీతిలో ఇంటలిజెన్స్కి అంతుపట్టకుండా ఉపఎన్నికల్లో తీర్పునిస్తారన్నారు. కేసీఆర్ ఎన్ని వేషాలు వేసినా తుది విజయం ఈటలదేనని అన్నారు. -
హుజురాబాద్: ఉప ఎన్నిక బరిలో ప్రవీణ్కుమార్?!
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ పదవికి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ తరఫున ఆయన బరిలో దిగుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్కు కంచుకోటగా ఉన్న హుజురాబాద్లో గెలుపునకై టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ముద్దసాని పురుషోత్తంరెడ్డి, కడియం శ్రీహరి తదితర పేర్లు తెరమీదకు వచ్చినా ఎటువంటి ముందడుగు పడలేదు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్రెడ్డి టీఆర్ఎస్లో చేరతారన్న వార్తలు వినిపిస్తున్నా.. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ ప్రవీణ్కుమార్ ప్రభుత్వానికి సోమవారం లేఖ రాయడం, ఉప ఎన్నిక బాధ్యతలు భుజాన వేసుకున్న మంత్రి గంగుల కమలాకర్ నేడు మాట్లాడుతూ.. ఉప ఎన్నిక అభ్యర్థి అంశం ఖరారైందన్నట్లు సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. కాగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అలంపూర్కు చెందిన ప్రవీణ్కుమార్.. అడిషనల్ డీజీపీ హోదాలో సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కరీంనగర్లో ఎస్పీగా పనిచేసిన ఆయనకు జిల్లాతో మంచి అనుబంధం ఉంది. ఇందుకుతోడు ప్రవీణ్కుమార్కు రాజకీయాలు అంటే ఆసక్తి అనే ప్రచారం కూడా సాగుతోంది. ఇక నేడు రాజీనామా సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘కుట్రపూరితంగా నన్ను ఒక వర్గానికి పరిమితం చేసే ప్రయత్నం జరిగింది. వ్యక్తిగత కారణాల వల్ల ఆరేళ్లకు ముందే తప్పుకుంటున్నా. ఎక్కువ మందికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేశా. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తానో? లేదో? ఇప్పుడే చెప్పలేను’’ అని వ్యాఖ్యానించడం ఈ ఊహాగానాలకు మరింత ఊతం ఇస్తోంది. మరోవైపు.. ఇప్పటికే హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఇప్పటికే ఉద్యోగాల భర్తీ, దళిత బంధు పథకం(హుజురాబాద్ పైలట్ ప్రాజెక్టు) ప్రకటన వంటి అంశాలతో అధికార పార్టీ ఓటర్లకు గాలం వేస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోటీలో దింపేందుకే ప్రవీణ్కుమార్తో రాజీనామా చేయించారనే ప్రచారం సాగుతోంది. ఏదేమైనా సోమవారం నాటి పరిణామాలు హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో హాట్టాపిక్గా మారాయి. -
హుజురాబాద్: కాంగ్రెస్ దూకుడు.. ఇన్చార్జిల నియామకం
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. నియోజకవర్గంలో బలమైన నేతగా పేరున్న పాడి కౌశిక్రెడ్డి రాజీనామా చేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఉప ఎన్నికకు సమాయత్తమయ్యే క్రమంలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పీసీసీ ఇన్చార్జిగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల సమన్వయకర్తలుగా జీవన్రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లను నియమించింది. అదే విధంగా... వివిధ మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్చార్జీలను నియమించింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్రెడ్డి ప్రకటన విడుదల చేశారు. మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇన్చార్జీలు ►వీణవంక - ఆది శ్రీనివాస్, సంగీతం శ్రీనివాస్ ►జమ్మికుంట - విజయరమణారావు, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ►జమ్మికుంట మున్సిపాలిటి - సిరిసిల్ల రాజయ్య, ఈర్ల కొమరయ్య ►హుజురాబాద్ - తూముకుంట నర్సారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ►హుజురాబాద్ మున్సిపాలిటీ - బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జువ్వాడి నర్సింగరావు ►ఇల్లందకుంట - నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ►కమలాపూర్ - కొండా సురేఖ, దొమ్మాటి సాంబయ్య -
బచ్చాగాళ్లు పెద్దనాయకులు కాలేరు: కాంగ్రెస్ నేతల ఫైర్
కరీంనగర్టౌన్: కాంగ్రెస్ పార్టీని వీడిన కౌశిక్రెడ్డికి మాణికం ఠాకూర్, రేవంత్రెడ్డి, పొన్నం ప్రభాకర్ను విమర్శించేస్థాయి లేదని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో మాట్లాడారు. ప్రగతిభవన్ నుంచి వచ్చే స్కిప్ట్ను చదివి, కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తే బచ్చాగాళ్లు పెద్దనాయకులు కాలేరని ఎద్దేవా చేశారు. ఉత్తమ్కుమార్రెడ్డి పేరు వాడుకుని ఎమ్మెల్యే టిక్కెట్లు, జీహెచ్ఎంసీ టిక్కెట్లు, పీసీసీ పదవులు ఇప్పిస్తానని, హుజూరాబాద్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అనేక మంది దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసిన చరిత్ర కౌశిక్ది అని అన్నారు. దమ్ముంటే రాబోయే ఉప ఎన్నికల్లో స్వతంత్రగా పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి బొమ్మ శ్రీరాం చక్రవర్తి, తదితరులు ఉన్నారు.రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీపై స్వలాభం కోసమే కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడని టీపీసీసీ అధికార ప్రతినిధి, చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మేడిపల్లి సత్యం ఒక ప్రకటనలో తెలిపారు. రేవంత్ రెడ్డి, పొన్నంలకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
హుజురాబాద్.. సై అంటే సై: ఎంట్రీ ఇవ్వనున్న రేవంత్రెడ్డి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రధాన పార్టీల అభ్యర్థులపై స్పష్టత లేదు. కానీ.. ముందస్తుగానే ఎన్ని కల వాతావరణం వచ్చేసింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రధాన పక్షాలు బలగాలను మోహరించాయి. అధికార పార్టీ తరఫున మంత్రులు మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, స్థానిక ప్రజాప్రతినిధులు మండలాల వారీగా మకాం వేశారు. అటు ఈటలకు మద్దతుగా కాషా యదళం క్షేత్రస్థాయిలో ప్రచారం సాగిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీల తరఫున ఇన్చార్జిలు, నాయకులు కార్యక్షేత్రంలో కూర్చొని వ్యూహాలు రచిస్తున్నారు. స్థూలంగా ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి ఇది. ఈటలను టార్గెట్ చేసిన టీఆర్ఎస్ టీఆర్ఎస్,ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలో నిలిచి చరిత్ర సృష్టించాలని భా విస్తున్న ఈటల రాజేందర్ను అష్టదిక్కుల దిగ్బంధం చేసే పనిలో అధికార పార్టీ ఉంది. కొన్నేళ్లుగా ఈటల వెంట ఉన్న టీఆర్ఎస్ నాయకులను, స్థా నిక ప్రజాప్రతినిధులను దూరం చేసే క్రతువును ఇప్పటికే విజయవంతంగా ఆ పార్టీ నాయకులు పూర్తి చేశారు.మంత్రి గంగుల కమలాకర్ టీఆర్ఎస్ క్యాడర్ను పూర్తిస్థాయిలో ఈటల నుంచి లా క్కోవడంలో విజయం సాధించారు. తాజాగా.. జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తు మ్మేటి సమ్మిరెడ్డి కూడా ఈటలకు గుడ్బై చెప్పారు.వార్డు మెంబర్ల నుంచి మొదలు కొని సర్పంచుల వరకు, ఎంపీటీసీల నుంచి ఎంపీపీలు, జె డ్పీటీసీల వరకు పార్టీతోనే ఉండేలా చక్రం తిప్పారు. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని ఈటలతో పాటు బీజేపీ నాయకులు గగ్గోలు పెడుతున్నా, టీఆర్ఎస్ నాయకులు బీజేపీలోకి వెళితే కొనుగోలు చేసినట్లు తప్ప సొంతపార్టీలో ఉంటే కొనుగోలు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ టలను క్షేత్రస్థాయిలో దెబ్బకొట్టేందుకు మంత్రులు హరీశ్రావు,కమలాకర్,ఈశ్వర్ ప్రణాళికలు చేస్తున్నారు. వీరికి వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, సోషల్ మీడియా ప్రచారానికి బాల్క సుమన్ తోడయ్యారు. ఈటలతోపాటు గడపగడపకూ కమలదళం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన తన వెంట క్లిష్ట సమయంలో కలిసి రావాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈటల సతీమణి జమున గ్రామాల్లో పర్యటిస్తూ సానుభూతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.బీజేపీ శ్రేణులు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగుతున్నారు. బీజేపీ ఇన్చార్జిగా నియమితులైన మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, ఇతర నాయకులు పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ మండలాల వారీగా ఈటలకు మద్దతును పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈటలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టే పనిలో ఉన్నారు. రైతుబంధును వద్దన్నారని, కొన్ని కులాల ఓట్లు తనకు అక్కర్లేదన్నట్లుగా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారాన్ని ఈటల మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి బుధవారం ఖండించారు. మరోవైపు కరీంనగర్, వరంగల్ నుంచి దిగిన బీజేపీ శ్రేణులు, ఆర్ఎస్ఎస్, ఏబీవీ పీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో జనంలోకి చొచ్చుకొని పోతున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయిన నేపథ్యంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జి.కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావ్ వంటి నేతలు పూర్తిస్థాయిలో హుజూరాబాద్లో మకాం వేసే పనిలో ఉన్నారు. త్వరలో రంగంలోకి రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డికి ఈ ఎన్నిక అత్యంత కీలకం కానుంది. తనను తాను రుజువు చేసుకునేందుకు హుజూరాబాద్ను వేదికగా మలచుకుంటారని అని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ మేరకు ఆయన స్వయంగా హుజూరాబాద్కు వచ్చి పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉంది. అదే సమయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పార్టీ ఇన్చార్జి పాడి కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎంతవరకు కొనసాగిస్తారనే అంశం చర్చనీయాంశమైంది. రేవంత్రెడ్డికి మద్దతు ప్రకటించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఆయన అనుయాయులు పాడి కౌశిక్రెడ్డి అభ్యర్థిత్వం పట్ల సుముఖంగా లేరు. కౌశిక్ ముఖ్య అనుచరులు ఇప్పటికే టీఆర్ఎస్లోకి వెళ్లారని, ఆయన కూడా కారెక్కడం ఖాయమని కాంగ్రెస్లోని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఈటలకు వ్యతిరేకంగా ప్రగతిభవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్నే కౌశిక్ రెడ్డి చదివారని, కేటీఆర్ను కలిసి రహస్యంగా మాట్లాడడమే అందుకు నిదర్శనమని చెపుతున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డికి కజిన్ అయిన కౌశిక్ రెడ్డిని రేవంత్రెడ్డి ఎంత మేర పరిగణనలోకి తీసుకుంటారనేది ప్రశ్నగా మిగిలింది. ఒకవేళ కౌశిక్ను కాదంటే ఎవరిని బరిలోకి దింపుతారనేది కూడా కాంగ్రెస్ ముందున్న సవాల్. రెండేళ్ల క్రితం పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ తరువాత రెండోస్థానంలో నిలిచిన పార్టీ కాంగ్రెస్ కావడంతో ఆచితూచి వ్యవహరించాలని రేవంత్ భావిస్తున్నారు. -
Huzurabad: టీఆర్ఎస్.. ఈసారి ఎస్సీ అభ్యర్థికి ఛాన్స్?
సాక్షి, కరీంనగర్: ఉప ఎన్నికను ఎదుర్కొనే వనరులు పుష్కలంగా ఉండి కూడా.. అభ్యర్థి కోసం అన్వేషించే విచిత్ర పరిస్థితిని అధికార టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటోంది. 17 ఏళ్లుగా టీఆర్ఎస్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది. ఈ ఎన్నికను ప్రస్తుతం అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్కు గుడ్బై చెప్పి బీజేపీలో చేరిన ఈటల కమలం గుర్తు మీద పోటీ చేయనుండగా, గత ఎన్నికల్లో ఈటలపై ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ టికెట్టు ఆశించినట్లు ప్రచారం జరిగినా.. ఇటీవల పీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కలవడంతో కాంగ్రెస్ నుంచే పోటీ చేయనున్నట్లు సంకేతాలు వెళ్లాయి. అంటే ప్రధాన పార్టీల్లో రెండింటి నుంచి అభ్యర్థులు ఎవరో తేలింది. ఎటొచ్చీ.. అధికార టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి ఎవరనే విషయంలో స్పష్టత రావడం లేదు. వివిధ కోణాల్లో పరిశీలన ఈటల రాజేందర్ 15 ఏళ్లుగా టీఆర్ఎస్ నుంచి గెలుస్తూ రావడం, టీఆర్ఎస్లో కీలక వ్యక్తిగా వ్యవహరించడంతో ఆయన తరువాత ఆ స్థాయిలో లీడర్షిప్ పెరగలేదు. ఒక మండలానికి జెడ్పీటీసీ స్థాయిలో పోటీ ఇవ్వగల నాయకులే టీఆర్ఎస్లో మిగిలారు తప్ప నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించేలా లేరు. ఈ పరిస్థితుల్లో బలమైన ఈటలను ఎదుర్కొనేందుకు గల అన్ని వనరులను టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకుల్లో ఈటలను ఎదుర్కొనే స్థాయిలో బలమైన నాయకుడు కనిపించలేదని సమాచారం. ఒకరిద్దరు ఉన్నా, ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికలో పోటీ ఇవ్వలేరని నిఘావర్గాలు ఇప్పటికే అధిష్టానానికి సమాచారం చేరవేశాయి. ప్రత్యామ్నాయంగా వేరే పార్టీల నుంచి అభ్యర్థిని తీసుకొచ్చి పోటీలో నిలిపితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రయోగం చేసినట్టుగా రాజకీయ వర్గాలే ఆశ్చర్య పడేలా అభ్యర్థిని నిలపాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ, సామాజిక సమీకరణాలను కూడా ఈ విషయంలో నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎంపిక? రాబోయే ఉప ఎన్నికలో బీజేపీ తరఫున ఈటల రాజేందర్ బరిలో నిలుస్తున్నారు. ఆయన బీసీల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు. రాజేందర్ సతీమణి జమున ‘రెడ్డి’ వర్గానికి చెందిన వారు. బీజేపీకి సహజంగానే అగ్రవర్ణాల పార్టీగా పేరుంది. ఈ నేపథ్యంలో సామాజిక కోణంలో ఈటలకు బీసీ, రెడ్డితోపాటు బీజేపీని ఇష్టపడే వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్ పార్టీ నుంచి కౌశిక్ రెడ్డి మినహా మరో అభ్యర్థి పేరు పరిశీలనలో లేదు. హుజూరాబాద్లో ఉన్న బలమైన “రెడ్డి’ వర్గంపై ఆయనకు కూడా నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సామాజిక కోణంలో ఎస్సీ వర్గానికి ప్రాతినిథ్యం కల్పించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈటల రాజీనామా తరువాత చోటు చేసుకున్న పరిణామాల్లో ప్రభుత్వం దళిత సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. దళితులకు ప్రత్యేక నిధుల కేటాయింపు మొదలుకొని ఇటీవల దళిత మహిళ మరియమ్మ లాకప్డెత్ విషయంలో సీఎం స్పందన, ఇతర పరిణామాలు హుజూరాబాద్లో కొత్త రాజకీయ సమీకరణాలపై ఆసక్తిని రేపుతోంది. జనరల్ సీటులో దళిత వర్గానికి చెందిన వారిని నిలబెట్టి గెలిపించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తద్వారా బీజేపీ, కాంగ్రెస్లకు కౌంటర్ ఇచ్చినట్లవడమే గాక దళిత వర్గాల సంపూర్ణ మద్దతు లభిస్తుందనేది కేసీఆర్ ఆలోచనగా చెపుతున్నారు. ఎస్సీ నుంచి అభ్యర్థిని నిలపాల్సి వస్తే ఎవరికి టికెట్టు ఇవ్వాలో కేసీఆర్కు ఓ క్లారిటీ ఉండి ఉంటుందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ముద్దసాని మాలతికి అవకాశం..? తెలుగుదేశం సీనియర్ నేత, దివంగత మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి సతీమణి ముద్దసాని మాలతి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. బ్యాంక్ మేనేజర్గా పదవీ విరమణ పొందిన ఆమె క్రిస్టియన్ మైనారిటీగా పేరున్నారు. దామోదర్ రెడ్డి మరణం తరువాత ఆమె రాజకీయాలకు దూరంగానే ఉన్నా.. హుజూరాబాద్ నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి ద్వారా ఆమెకు కూడా సంబంధాలున్నాయి. 2014 శాసనసభ ఎన్నికల్లో మానకొండూరు నియోజకవర్గం నుంచి ముద్దసాని మాలతి బరిలో నిలపాలని టీడీపీ భావించినప్పటికీ, తనయుడు కశ్యప్ రెడ్డి బరిలో నిలిచారు. మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ముద్దసాని మాలతికి సీటివ్వడం వల్ల ఎస్సీ, రెడ్డి వర్గాల మద్దతుతో పాటు మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డిపై ఉన్న సానుభూతి కూడా కలిసొస్తుందని కేసీఆర్ ఆలోచనగా చెపుతున్నారు. మాలతి పోటీ చేయడానికి అంగీకరించని పక్షంలో కశ్వప్ రెడ్డి బరిలో నిలవాలని యోచిస్తున్నట్లు సమాచారం. బీసీ, అగ్రవర్ణాల్లో నుంచి అన్వేషణ.. ► ఒకవేళ బీసీని అభ్యర్థిగా నిలబెట్టాలని భావిస్తే తానే బలమైన క్యాండిడేట్నని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ రావు భావిస్తున్నారు. ఈటల రాజీనామా తరువాతే ఆయన హుజూరాబాద్లో కనిపిస్తున్నారనే అపవాదు ఉంది. గతంలో 2009, 2010లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఈటలపైనే ఓడిపోవడం గమనార్హం. ► రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతారావు కుటుంబం నుంచి ఎవరినైనా అభ్యర్థిగా నిలబెట్టాలనుకున్నా.. బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి కెప్టెన్ తనయుడు సతీష్ హుస్నాబాద్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ► మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు వాణిదేవి ఇటీవలే హైదరాబాద్ ఎమ్మెల్సీగా గెలిచారు. ► రెడ్డి వర్గం నుంచి మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి సోదరుడు రిటైర్డ్ ఐఏఎస్ ఎం.పురుషోత్తం రెడ్డి పేరు సైతం పరిశీలనలో ఉంది. ఇటీవలే దామోదర్ రెడ్డి తనయుడు కశ్యప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరినప్పటికీ, పురుషోత్తం రెడ్డి అభ్యర్థిత్వంపై స్పష్టత లేదు. ► పురుషోత్తం రెడ్డి కన్నా ముద్దసాని మాలతి బలమైన అభ్యర్థిగా భావిస్తే హుజూరాబాద్లో రాజకీయం మారే అవకాశం ఉంది. ► ఈటల బీజేపీలో చేరడంతో అసంతృప్తికి గురైన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కూడా గులాబీ కండువా కప్పుకొని పోటీ చేయాలని భావిస్తున్నా, అధిష్టానం నుంచి గ్రీన్సిగ్నల్ రాలేదు. ► మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ పేరు తొలుత వినిపించినా, ఆయన వేములవాడపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చదవండి: వాటర్ లీకేజీ ప్రాబ్లమ్స్ .. వాటర్ ప్రూఫ్ సొల్యూషన్స్ -
హుజూరాబాద్లో ‘సోషల్’ వార్కు రెడీ..
సాక్షి, హైదరాబాద్: గతేడాది దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎదురైన ప్రతికూలతలు హుజూరాబాద్ ఉప ఎన్నికలో పునరావృతం కాకుండా టీఆర్ఎస్ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా పార్టీపై సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రతికూల ప్రచారం నష్టం చేసినట్లు టీఆర్ఎస్ గుర్తించింది. సామాజిక మాధ్యమాల్లో బీజేపీ చురుగ్గా ఉంటూ చేసిన ప్రచారంతో పార్టీ అభ్యర్థి ఓటమి పాలైనట్లు టీఆర్ఎస్ అంచనా వేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఈ ప్రభావం కొనసాగిందని భావించిన టీఆర్ఎస్... ఆ తర్వాత జరిగిన మండలి పట్టభద్రుల కోటా ఎన్నికలు, సాగర్ ఉప ఎన్నికలో తమ ‘సోషల్ మీడియా వింగ్’ను అప్రమత్తం చేసి విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీఆర్ఎస్... సోషల్ మీడియా వేదికగా మరోసారి బీజేపీపై పోరుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలను స్థానిక ఓటర్లకు చేరవేస్తూనే విపక్షాలు ప్రత్యేకించి బీజేపీ సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేసే ప్రతికూల అంశాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు సిద్ధమవుతోంది. చాప కింద నీరులా సోషల్ మీడియా కమిటీలు సామాజిక మాధ్యమ వేదికలు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ తదితరాల్లో చురుగ్గా ఉండే యువతను లక్ష్యంగా చేసుకొని హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ‘సోషల్ మీడియా అవగాహన సదస్సు’ల నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా గతంలో టీఆర్ఎస్పై బీజేపీ చేసిన ప్రతికూల ప్రచారం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ సదస్సుల్లో వివరిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ వచ్చే వారం రోజుల్లో పార్టీ కార్యకర్తలు, యువతను భాగస్వాములుగా చేస్తూ గ్రామ, మండల స్థాయిల్లో వాట్సాప్ గ్రూప్లు, ఇతర సోషల్ మీడియా ఖాతాలు తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. మండల, గ్రామస్థాయిలో సోషల్ మీడియా కమిటీలు ఏర్పాటు చేసి సమన్వయం చేసేందుకు ఇన్చార్జీల నియామకం కూడా ఒకట్రెండు రోజుల్లో పూర్తికానుంది. సోషల్ మీడియాతోపాటు యువత, విద్యార్థుల మద్దతును కూడగట్టేందుకు ఇప్పటికే పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం నాయకులు మండలాలవారీగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. రంగంలోకి సోషల్ మీడియా వింగ్, టెక్ సెల్ పార్టీ సభ్యులు, కమిటీల డేటా బేస్, పార్టీ వెబ్సైట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తదితరాల నిర్వహణతోపాటు ప్రతిపక్షాలు చేసే ప్రచారాన్ని తిప్పికొట్టడం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం తదితర లక్ష్యాలతో గతేడాది టీఆర్ఎస్ టెక్ సెల్ ఏర్పాటు చేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రంగంలోకి దిగిన టెక్ సెల్... బీజేపీ ఎత్తుగడలు, ప్రతికూల ప్రచారాన్ని తిప్పికొట్టేలా వీడియోలు, కార్టూన్లు, స్లైడ్స్ తయారు చేయడంపై దృష్టి సారించింది. సామాజిక మాధ్యమాల్లో బీజేపీ అనుకూల ఖాతాల నుంచి వచ్చే పోస్టులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటిని తిప్పికొట్టేందుకు, బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపడం లక్ష్యంగా సమాచారాన్ని సిద్ధం చేసుకుంటోంది. చదవండి: Huzurabad: బిగ్ఫైట్కు టీఆర్ఎస్, బీజేపీ సై.. కానీ కాంగ్రెస్ ఎందుకిలా! -
నా సోదరుడు గురుమూర్తికి అభినందనలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గురుమూర్తి ఘన విజయం సాధించిన సాంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురు మూర్తికి అభినందనలు తెలిపారు. ఇది ప్రజల విజయం అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘23 నెలల పాలన తర్వాత తిరుపతి పార్లమెంట్కు జరిగిన ఉపఎన్నికలో ప్రజలు మన ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. తిరుపతి పార్లమెంట్ ఓటర్లు 2019 ఎన్నికల్లో 2.28 లక్షల మెజార్టీతో దీవించారు. మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మనసారా దీవించి.. నన్ను, మన ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ.. ఈ రోజు 2.71 లక్షల మెజార్టీతో ఆశీర్వదించారు. వారు మనపై చూపించిన అభిమానం, గౌరవం ఎంతో గొప్పది. ఈ విజయం నా బాధ్యతను మరింతగా పెంచుతుంది. దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలతోనే ..ఈ విజయం సాధ్యమైంది అని సీఎం జగన్ తెలిపారు. చదవండి: తిరుపతి ఉప ఎన్నిక: ఓట్ల సునామీ.. సామాన్యుడిదే గెలుపు -
జానాకు షాక్.. ఒక్కరౌండ్లో మాత్రమే...!
సాక్షి, నల్గొండ: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో వరుస రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇప్పటి వరకు కేవలం ఒక్క 14వ రౌండ్లో మాత్రమే ఆధిక్యంలోకి వచ్చారు. జానాకు కంచుకోటగా ఉన్న సాగర్లో టీఆర్ఎస్ మరోసారి సత్తాచాటింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరపున ఇక్కడి నుంచి పోటీచేసిన జానారెడ్డి దివంగత నోముల నర్సింహయ్య చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిదే. ఇక ప్రస్తుత కౌంటింగ్ సరళి చూస్తుంటే కారు పార్టీకి షాకిస్తామని ప్రచారంతో హోరెత్తించిన కాంగ్రెస్ చతికిలపడ్డట్టు స్పష్టమవుతోంది. ఎగ్జిట్పోల్స్ అంచనాలన నిజం చేస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ మంచి మెజారీటీతో దూసుపోతున్నారు. నోముల భగత్ను వ్యూహాత్మంగా సాగర్ బరిలో దించిన టీఆర్ఎస్ ఓటర్ల దృష్టిని తమవైపునకు తిప్పుకోవడంలో సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. తండ్రి నోముల నర్సింహయ్యపై ఉన్న అభిమానాన్ని ప్రజలు భగత్పైనా చూపించారు. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు గట్టిపోటీచ్చిన బీజేపీ సాగర్లో గెలవాలని చాలా ప్రయత్నాలే చేసింది. అయితే, క్షేత్రస్థాయిలో అధికార టీఆర్ఎస్ బలం ముందు కాషాయదళం తేలిపోయింది. ఇప్పటివరకు 19 రౌండ్ల కౌంటింగ్ జరగ్గా ఒక్క రౌండ్లో కూడా బీజేపీ చెప్పుకోదగ్గ ఓట్లు సాధించలేదు. టీఆర్ఎస్ 14వేల ఓట్ల మెజారీతో తొలి స్థానంలో ఉండగా.. కాంగ్రెస్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన అధికార టీఆర్ఎస్ సాగర్ ఉప ఎన్నికలో వ్యూహాత్మంగా వ్యవహరించింది. చివరివరకు అభ్యర్థిని ప్రకటించడకుండా ఆఖరి క్షణంలో నరసింహయ్య కొడుకునే బరిలోకి దించింది. తద్వారా ప్రత్యర్థి పార్టీల అంచనాలకు అందకుండా జాగ్రత్త పడింది. జానా కోటలో పాగా వేసేందుకు మరోసారి సిద్ధమైంది! -
ఎస్.. మేమంటే.. మేమే!
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ముగియగా, ఓట్లపరంగా కూడికలు, తీసివేతలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఉత్కంఠను రేకెత్తించిన ఈ ఉపఎన్నికలో గెలుపుపై ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నేతలు ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మే 2న ఫలితం తేలేదాకా ‘సాగర’మథనం సశేషమే. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్ సరళిని పరిశీలించిన ఆయాపార్టీల నేతలు ఓట్ల లెక్కల్లో బీజీగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకుతోడు దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడిని బరిలో నిలపడం, రెండుసార్లు సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి రావడం, పార్టీ అభ్యర్థి ప్రకటనకు ముందు నుంచే నేతలందరూ సమన్వయంతో ఎన్నికల ప్రచారం నిర్వహించడం లాంటి అంశాల ప్రాతిపదికన తమ అభ్యర్థి భగత్ విజయం సాధిస్తారని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇచ్చి చివరిక్షణం వరకు అంచనాలు అందలేని స్థాయిలో తన రాజకీయ చాతుర్యాన్ని ఉపయోగించిన సీనియర్ నేత, పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి చరిష్మాపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గంలో జానా మార్కుకు తోడు పార్టీకి బలమైన కేడర్ ఉండటం, సంప్రదాయ ఓటుబ్యాంకు చెక్కుచెదరకపోవడం, పెద్దాయన అనే సానుభూతి, గత ఎన్నికల్లో టీఆర్ఎస్కు అండగా నిలిచిన కొన్ని సామాజిక వర్గాల ఓట్లలో చీలిక లాంటి లెక్కలతో ఈసారి గెలిచి గట్టెక్కుతామనే అభిప్రాయం టీపీసీసీ నేతల్లో కనిపిస్తోంది. ఇక, జనరల్ స్థానంలో ఎస్టీ అభ్యర్థి డాక్టర్ రవికుమార్ను నిలిపిన కమలనాథులు కూడా చెప్పుకోదగిన స్థాయిలోనే ఓట్లు సాధిస్తామని, ఆ రెండు పార్టీలకు ముచ్చెమటలు పోయించామని భావిస్తోంది. పోలింగ్ శాతం పెరగడంపై ఆశలు 2018 అసెంబ్లీ ఎన్నిక తరహాలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోలింగ్ 85శాతంకు పైగా నమోదు కావడం తమకు అనుకూలిస్తుందనే అంచనాలో ఉంది. గత ఎన్నికల్లో 7771 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన టీఆర్ఎస్ ప్రస్తుతం మూడింతలు మెజారిటీ సాధిస్తామనే ధీమాతో ఉంది. దివంగత ఎమ్మెల్యే నర్సింహయ్య మరణం తర్వాత ఆలస్యం చేయకుండా బరిలోకి దిగి పార్టీ యంత్రాంగాన్ని సన్నద్దం చేయడం, అభ్యర్థి ఎంపికతో సంబంధం లే కుండానే పార్టీ ఇన్చార్జీల నేతృత్వంలో ముందస్తు ప్రచారం చేపట్టడం తమకు అనుకూలిస్తుందని టీఆర్ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో తమకు అండగాలేని సామాజికవర్గాల్లో చీలిక రావడంతోపాటు ఆయా సామాజికవర్గాలు గతం కన్నా ఈసారి తమవైపు మొగ్గు చూపారని కాంగ్రెస్ భావిస్తోంది. భారీ మొత్తంలో కాకపోయినా కనీసం5–7 వేల ఓట్ల తేడాతో విజయం సాధించి రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకుంటామని కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. టీఆర్ఎస్, కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతతో ఉన్న ఓటర్లు తమను ఆదరిస్తారని బీజేపీ భావి స్తోంది. స్వతంత్ర అభ్యర్థులెవరూ చెప్పుకోదగినస్థాయిలో ఓట్లు దక్కించుకునే అవకాశం లేదని పోలింగ్ సరళి వెల్లడిస్తోంది.మొత్తంమీద సాగర్ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలకు దిక్సూచిగా మారుతుందనడంలో సందేహం లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చదవండి: ‘సాగర్’లో భారీగా పోలింగ్...ఎవరిదో గెలుపు! -
నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్
-
ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి
-
ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రవికుమార్ నాయక్
-
Nagarjuna Sagar By Election 2021: ముగిసిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్
TIME: 07: 00 PM ముగిసిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ 84.32 శాతం మంది ఓటర్లు ఓటు వేశారని అధికారులు అంచనా వేస్తున్నారు. క్యూలైన్లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రజలంతా ఓట్లు వేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. TIME: 05: 00 PM సాయంత్రం 5 గంటల వరకు 81.5 శాతం పోలింగ్ నాగార్జునసాగర్ ఉపఎన్నికలో సాయంత్రం 5 గంటల వరకు 81.5 శాతం నమోదైన పోలింగ్. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పర్యటించారు. పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. TIME: 03: 10 PM ఓటు వేసిన ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి పెద్దవుర మండలం పిన్నవుర గ్రామంలో పోలింగ్ బూత్ నెంబర్66 లో ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి. TIME: 03: 00 PM మధ్యాహ్నం 3 గంటల వరకు 69 శాతం పోలింగ్ నాగార్జునసాగర్ ఉపఎన్నికలో మధ్యాహ్నం మూడు గంటల వరకు 69 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. TIME: 02: 50 PM ఒంటి గంట వరకు 53.3 శాతం పోలింగ్ నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 53.3 శాతం పోలింగ్ నమోదు అయ్యినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. TIME: 12:57 PM పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నాగార్జున సాగర్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పర్యటించారు. సాగర్ పైలాన్ కాలనీలో పోలింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. పెద్దవుర మండలం పిన్నవుర గ్రామంలో పోలింగ్ బూత్లో ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. TIME: 12:37 PM ఉదయం 11 గంటల వరకు 31 శాతం పోలింగ్ నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఉదయం 11 గంటల వరకు 31 శాతం పోలింగ్ నమోదైంది. 2లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఉన్న సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. రాత్రి 7 గంటల వరకు జరగనుంది. TIME: 11:25 AM ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. TIME: 10:19 AM ఉదయం 9 గంటల వరకు 12.9 శాతం పోలింగ్ నమోదు... నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఉదయం 9 గంటల వరకు 12.9 శాతం పోలింగ్ నమోదైంది. 2లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఉన్న సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. రాత్రి 7 గంటల వరకు జరగనుంది. TIME: 10:10 AM ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రవికుమార్ నాయక్ నల్గొండ: త్రిపురారం మండలం పలుగు తండా ప్రాథమిక పాఠశాలలో కుటుంబసభ్యులతో పాటు బీజేపీ అభ్యర్థి రవికుమార్ నాయక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయాన్నే ఓటర్లంత పోలింగ్ కేంద్రాల కు బారులు తీరారు. TIME: 8:19 AM ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి... నల్గొండ: అనుముల మండలం ఇబ్రహీంపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుర్రంపోడ్ మండలం వట్టికోడ్ బూత్ నంబర్-13లో ఈవీఎం మొరాయించడంతో ఓటింగ్ ఇంకా మొదలు కాలేదు. TIME: 7:00 AM నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయాన్నే ఓటర్లంత పోలింగ్ కేంద్రాల కు బారులు తీరారు. 2లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఉన్న సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఓటు వేసేందుకు మాస్క్ తప్పనిసరి నిబంధన చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాగర్ నియోజకవర్గంలో 2లక్షల 20 వేల300 మంది ఓటర్లు ఉండగా లక్ష 9వేల 228 మంది పురుషులు, లక్షా11 వేల72 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి నాగార్జునసాగర్ ఉప ఎన్నికపైనే ఉంది. ఇక్కడ పోటీ పడుతున్న మూడు ప్రధాన పార్టీలకూ సాగర్లో విజయం అత్యంత కీలకం కావడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని, విజేత గేమ్ చేంజర్ అవుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార టీఆర్ఎస్ గెలిస్తే ఆ పార్టీకి కొత్త ఊపు రావడంతోపాటు.. తెలంగాణ చాంపియన్లం తామేనని నిరూపించుకున్నట్టవుతుందని అంటున్నారు. జానారెడ్డి గెలిస్తే ఇటీవలి ఎన్నికల్లో పేలవ ప్రదర్శనతో దాదాపు నిస్తేజంగా మారిన కాంగ్రెస్ పార్టీ ఆశలు 2023 వరకు సజీవంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు దుబ్బాక విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు గాలివాటం కాదని రుజువు చేయాలంటే.. ఇక్కడ గెలిచి తీరాల్సిన అనివార్యత బీజేపీకి ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గంలో 2.20 లక్షల మంది ఓటర్లు ఉండగా.. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా పోలింగ్ జరగనుంది. మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), కాంగ్రెస్, బీజేపీలే తొలి మూడు స్థానాల్లో ఉండనున్నాయి. ‘మండలి’ ఆక్సిజన్తో ధీమాగా టీఆర్ఎస్ దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రతికూల ఫలితం, జీహెచ్ఎంసీ ఫలితా లతో కొంత అసంతృప్తిలో ఉన్న టీఆర్ఎస్కు శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. రెండు నియోజకవర్గాల్లో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోగా, మరో స్థానాన్ని బీజేపీ నుంచి చేజిక్కించుకుంది. ఇప్పుడు తమ సిట్టింగ్ స్థానమైన నాగార్జునసాగర్ను నిలబెట్టుకోవడం ద్వారా.. దుబ్బాక ప్రతికూల ఫలితం కేవలం తమ ఆదమరుపుతో వచ్చిందేనని, తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా తుది ఛాంపియన్లు తామేనని రుజువు చేయాలన్న పట్టుదలతో ఉంది. నోముల నర్సింహయ్య తనయుడిని బరిలోకి దింపడంతో అటు సానుభూతి, మరోవైపు చేసిన అభివృద్ధి.. గెలుపు బాటలో నడిపిస్తాయనే ఆత్మవిశ్వాసంతో ఉంది. జానారెడ్డి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శిస్తూనే.. ఈ నియోజకవర్గం తమ చేతికి వచ్చిన రెండేళ్లలోనే చేసిన, చేపట్టిన అభివృద్ధి పనులను అధికార పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. పార్టీని గెలిపిస్తే నియోజకవర్గంలో పరుగులు పెట్టించనున్న అభివృద్ధి పనుల గురించి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు దఫాలుగా జరిపిన పర్యటనల్లో హామీలు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా.. ఇక కాంగ్రెస్ పనైపోయిందని రుజువు చేయడం, కొత్త శక్తిగా దూసుకు వస్తున్నామంటున్న బీజేపీ నోరు మూయించడం వంటి బహుళ ప్రయోజనాలను టీఆర్ఎస్ ఆశిస్తోంది. కాంగ్రెస్కు జీవన్మరణ సమస్య! తెలంగాణ కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో విజయం జీవన్మరణ సమస్య లాంటిందన్న అభిప్రాయం విన్పిస్తోంది. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం మూడు స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది. కొన్నాళ్లకే జరిగిన లోక్సభ ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాలను గెలుచుకున్నా.. ఆ తర్వాత జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో బోల్తా కొట్టింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఆయా ఎన్నికల్లో కాంగ్రెస్ది పేలవమైన ప్రదర్శనే. గత ఏడాది జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం అయ్యింది. ఆ వెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సంతృప్తికరమైన ఫలితాలను సాధించలేక పోయింది. నాగార్జునసాగర్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు, రెండు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్లో మాజీ మంత్రి చిన్నారెడ్డి, నల్లగొండ–ఖమ్మం–వరంగల్లో రాములు నాయక్ కనీస ప్రభావం చూపించలేకపోయారు. ఇలా వరుస ఓటములతో నిస్తేజంలోకి జారిపోయిన కాంగ్రెస్ కేడర్కు కొత్త ఉత్సాహాన్ని, 2023 ఎన్నికలకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలంటే.. సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఈ నియోజకవర్గం నుంచి ఏడు పర్యాయాలు గెలిచి, పధ్నాలుగు ఏళ్ల పాటు మంత్రిగా కూడా పనిచేసిన జానారెడ్డికి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్, నియోజకవర్గంపై పట్టు ఆ పార్టీకి ఉపకరిస్తాయని చెబుతున్నారు. జానారెడ్డికి వ్యక్తిగతంగా కూడా ఇక్కడ గెలుపు అనివార్యమని పేర్కొంటున్నారు. ఈ కారణంగానే ఈ ఎన్నికల్లో జానారెడ్డి గత శైలికి భిన్నంగా విస్తృతంగా ప్రచారంలో పాల్గొనడంతో పాటు, ఇన్నేళ్లలో తాను నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి గురించి వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. బీజేపీ ప్రయోగం ఫలించేనా..? మరోవైపు రాష్ట్రంలో బలపడాలని భావిస్తున్న బీజేపీ ఇక్కడ చేసిన ప్రయోగం ఫలిస్తుందా..? అనే ఆసక్తి నెలకొంది. బీజేపీ వ్యూహాత్మకంగా జనరల్ స్థానమైన నాగార్జున సాగర్లో ఎస్టీ వర్గానికి చెందిన డాక్టర్ రవికుమార్ నాయక్ను బరిలోకి దింపింది. అయితే ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకమునుపు ఉన్న ఊపు అభ్యర్థి ప్రకటన వచ్చే వరకు కొనసాగించలేకపోయింది. టికెట్ ఆశావాహుల పోటీతో గుంపు రాజకీయాలు మొదలు కావడం, టికెట్ రాకపోవడంతో కడారి అంజయ్య యాదవ్ గులాబీ గూటికి చేరడం కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం ముగిశాక పరిస్థితిని బట్టి అంచనా వేస్తే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్యే ముఖాముఖి పోటీ నెలకొందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మొత్తంగా ఈ ఎన్నికలో ఎవరు గెలిస్తే.. వారు రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ చేంజర్గా మారనున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదవండి: ‘సాగర్’ ప్రచారానికి తెర.. పోలింగ్పై పార్టీల దృష్టి -
‘సాగర్’ ప్రచారానికి తెర.. పోలింగ్పై పార్టీల దృష్టి
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారానికి గురువారం సాయంత్రం 5 గంటలకు తెరపడింది. శనివారం పోలింగ్ జరగనుండటంతో అభ్యర్థులు, స్థానిక నేతలు బూత్ స్థాయిలో ఏజెంట్ల నియామకం, సమన్వయంపై దృష్టి సారించారు. సామాజికవర్గాల ఓట్లను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేశాయి. గత 17న సాగర్ ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడిన నాటి నుంచే నియోజకవర్గంలో రాజకీయ సందడి మొదలవగా, సుమారు 20 రోజులుగా అన్ని పార్టీలు ప్రచారంతో హోరెత్తించాయి. ప్రధాన రాజకీయ పక్షాల్లో కాంగ్రెస్ మాజీ మంత్రి జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ముందస్తుగా ప్రకటించగా, టీఆర్ఎస్, బీజేపీ చివరి నిమిషం వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఉత్కంఠకు దారితీసింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్కు అవకాశం దక్కగా, బీజేపీ నుంచి డాక్టర్ రవినాయక్ బరిలోకి దిగారు. గతేడాది డిసెంబర్ మొదటి వారంలో నోముల నర్సింహయ్య మరణించగా, టీఆర్ఎస్ ఎన్నికల సన్నాహాలను ముందుగానే ప్రారంభించింది. అభ్యర్థి ఎంపికతో సంబంధం లేకుండానే నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, కొందరు ముఖ్య నేతలకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించింది. మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో పార్టీ కేడర్తో సమావేశాలు నిర్వహించిన టీఆర్ఎస్, ప్రచార గడువు దగ్గరపడే కొద్దీ గ్రామ స్థాయి మీటింగ్లకు ప్రాధాన్యతనిచ్చింది. వివిధ సామాజికవర్గాల మద్దతు కూడగట్టేందుకు టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 14న హాలియాలో జరిగిన బహిరంగ సభకు హాజరై పార్టీ ఎన్నికల ప్రచారానికి మరింత ఊపుతెచ్చారు. సర్వశక్తులూ కూడగట్టుకున్న కాంగ్రెస్ ఇదే నియోజకవర్గం నుంచి గతంలో రెండు పర్యాయాలు ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి జానారెడ్డి మరోమారు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల షెడ్యూలు వెలువడక ముందే గ్రామాలను చుట్టివచ్చిన జానారెడ్డికి మద్దతుగా నామినేషన్ల తర్వాత పార్టీ రాష్ట్ర నేతలు, కేడర్ కూడా ప్రచారంలో కలసి వచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి, శాసనసభా పక్షం నేత భట్టి విక్రమార్కతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు మండలాలు, మున్సిపాలిటీల వారీగా ప్రచార బాధ్యతలు స్వీకరించారు. బహిరంగ సభల జోలికి వెళ్లకుండా గ్రామ స్థాయి ప్రచారానికి కాంగ్రెస్ నేతలు పరిమితమయ్యారు. గతంలో జానారెడ్డి చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో జానారెడ్డి అసెంబ్లీలో ఉండాల్సిన అవసరాన్ని పదే పదే ప్రస్తావించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం కూడా సాగర్ చేరుకుని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. చాపకింద నీరులా బీజేపీ ప్రచారం చివరి నిమిషం వరకు అభ్యర్థి ఎంపికపై గోప్యత పాటించిన బీజేపీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ రవి నాయక్ను బరిలోకి దించింది. కాగా, పార్టీ టికెట్ ఆశించిన కడారి అంజయ్య యాదవ్.. టీఆర్ఎస్లో చేరగా, 2018లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నివేదిత రెడ్డి కొంతకాలం ప్రచారానికి దూరంగా ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణ, విజయశాంతితో పాటు ఎమ్మెల్యే రఘునందన్రావు, ఇతర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ఛుగ్తో పాటు కేంద్ర మంత్రి అర్జున్రామ్ మేఘవాల్ కూడా ప్రచారానికి వచ్చారు. అయితే బీజేపీ బహిరంగ సభల జోలికి వెళ్లకుండా రోడ్షోలు, గ్రామ స్థాయి ప్రచారానికి పరిమితమైంది. చదవండి: తెలుగు యువకుడికి రూ.కోటిన్నర వేతనం -
ప్రచారంలో కరోనా.. అభ్యర్థి మృతి.. ఉప ఎన్నిక వాయిదా!
భువనేశ్వర్: పిప్పిలి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అజిత్ మంగరాజ్ (52) బుధవారం మృతి చెందడంతో రాష్ట్ర రాజకీయాల్లో విషాదకర వాతావరణం అలుముకుంది. నామినేషన్ దాఖలు తర్వాత విస్తృత ప్రచారం చేస్తూ ఈ నెల 7 వ తేదీన ఆయన అనారోగ్యానికి గురయ్యారు. తక్షణమే ఆస్పత్రిలో చేరిన ఆయనకు ఈ నెల 10వ తేదీన కోవిడ్ పాజిటివ్ నమోదు కావడంతో చికిత్స పొందుతూ స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, తోటి రాజకీయ నాయకులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. అదే విధంగా, అజిత్ మంగరాజ్ అకాల మరణం పట్ల గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్ సంతాప సందేశం జారీ చేశారు. అజిత్ కుటుంబీకులకు సానుభూతి ప్రకటించారు. ఉత్సాహవంతుడైన నాయకుడ్ని కరోనా మహమ్మారి పొట్టన పెట్టుకుందని అజిత్ మంగరాజ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ హరిచందన్ సంతాపం ప్రకటించారు. ఉప ఎన్నిక పోటీలో ఉన్న అజిత్ మంగరాజ్ అకాల మరణం అత్యంత విచారకరమని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సానుభూతి ప్రకటించారు. అజిత్ మంగరాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. బీజేపీ సంతాపం అజిత్ మంగరాజ్ మరణంపట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ప్రగాఢ సంతాపం ప్రకటించింది. పిప్పిలి నియోజక వర్గ కేంద్రంలోని పార్టీ శిబిరంలో బుధవారం సాయంత్రం సంతాప సభ ఏర్పాటు చేశారు. పట్టుదల కలిగిన నాయకుడిని రాష్ట్ర రాజకీయ రంగం కోల్పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీర్ మహంతి, ప్రతిపక్ష నాయకుడు ప్రదీప్త నాయక్ శ్రద్ధాంజలి ఘటించారు. పార్టీ ఏర్పాటు చేసిన సంతాప సభలో బీజేపీ రాష్ట్ర శాఖ ప్రముఖులు కనక వర్ధన సింగ్దేవ్, మన్మోహన్ సామల్, పార్టీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి మానస మహంతి, ఉపాధ్యక్షుడు భృగు బక్షిపాత్రో, ప్రభాత్ ఫరిడా, ఎమ్మెల్యే కుసుమ్ టెట్టె తదితరులు పాల్గొన్నారు. పార్టీ సిపాయిని కోల్పోయింది: ఏఐసీసీ కార్యదర్శి రాష్ట్ర కాంగ్రెస్ అంకిత భావంతో నిరంతరం కృషి చేసిన సిపాయిని కోల్పోయిందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి జి. రుద్ర రాజు విచారం వ్యక్తం చేశారు. లోగడ 2019వ సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పిప్పిలి నియోజక వర్గం నుంచి ఆయన పోటీచేశారు. గత ఎన్నికల్లో ఓటమిని లెక్క చేయకుండా ఈసారి ఉప ఎన్నికలో పోటీకి మరోసారి పార్టీ అధిష్టానం ఆయనకే టికెట్ కేటాయించడం అజిత్ మంగరాజ్ పోరాట పటిమకు తార్కాణమన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పిప్పిలి నియోజకవర్గం ఉపఎన్నికలో కాంగ్రెస్ కార్యాచరణ ఖరారవుతుందని తెలిపారు. ఉప ఎన్నిక వాయిదా! భువనేశ్వర్: పూరీ జిల్లా పిప్పిలి అసెంబ్లీ నియోజక వర్గం ఉపఎన్నిక వాయిదా పడనుంది. ఎందుకంటే ఈ ఉప ఎన్నికలో పోటీకి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి అజిత్ మంగరాజ్ బుధ వారం కన్ను మూశారు. పోలింగుకు ముందుగా ఆయన మృతి చెందడంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనల మేరకు ఉపఎన్నిక వాయిదా పడే అవకాశాలున్నాయి. గతంలో పటకురా అసెంబ్లీ నియోజక వర్గం ఎన్నికలో బీజేడీ అభ్యర్థిగా వేద్ ప్రకాష్ అగర్వాల్ నామినేషన్ దాఖలు చేసి పోలింగుకు ముందు మరణించడంతో ఈ నియోజక వర్గంలో ఎన్నిక వాయిదా వేశారు. పిప్పిలి నియోజక వర్గంలో పోలింగ్ ఈ నెల 17వ తేదీన జరగాల్సి ఉంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1952 సెక్షన్ 1(సి) ప్రకారం పోలింగుకు ముందు పోటీకి ఖరారైన అభ్యర్థి మరణిస్తే సంబంధిత రిటర్నింగ్ అధికారి ప్రకటన మేరకు పోలింగ్ వాయిదా వేస్తారు. రిటర్నింగ్ అధికారి సమాచారం మేరకు ఎన్నికల కమిషన్ పోలింగు వాయిదా ప్రకటించి తదుపరి పోలింగ్ తేదీని ఖరారు చేస్తుంది. వారం రోజుల్లో కొత్త అభ్యర్థి మృతిచెందిన అభ్యర్థి స్థానంలో కొత్త అభ్యర్థిని ప్రకటించేందుకు రిటర్నింగ్ అధికారి నివేదిక జారీ అయ్యాక ఎన్నికల కమిషన్ వారం రోజులు గడువు మంజూరు చేస్తుంది. ఈ మేరకు సంబంధిత పార్టీకి నోటీసు జారీ అవుతుంది. ఇతర పార్టీ ల స్థితిగతులు యథాతథంగా కొనసాగుతాయి. ఈ లెక్కన పిప్పిలి నియోజక వర్గం ఉపఎన్నిక వాయిదా పడి మే నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య పోలింగ్ నిర్వహణ జరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు, పరిశీలకులు భావిస్తున్నారు. చదవండి: ఉప ఎన్నిక: నాన్న కల నిజం చేస్తా! INC Candidate For #PipiliBypoll & Puri DCC President Ajit Mangaraj passes away. Our deepest condolences to his family and followers. pic.twitter.com/ziI7sOMUIU — Odisha Congress (@INCOdisha) April 14, 2021 -
ఉప ఎన్నిక: చాప కింద నీరులా వెళ్లాలనేది బీజేపీ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్పైనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆశలు పెట్టుకుంది. ఆ పార్టీ ప్రచారం కూడా ఇందుకు అనుగుణంగానే సాగుతోంది. పార్టీ అభ్యర్థి డాక్టర్ రవినాయక్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎక్కడా ఆర్భాటాలకు పోకుండా, పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించకుండానే స్థానిక నేతలతో కలసి ప్రతి గ్రామమూ, ప్రతి ఓటరునూ కలిసేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నెల 9 తర్వాత పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిన రాష్ట్ర నేతలు, కేంద్రమంత్రులు కూడా కేవలం రోడ్షోలకే పరిమితమయ్యారు. ఇప్పటికే మండలాలు, గ్రామాలవారీగా ఇన్చార్జీలను నియమించింది. ఆర్భాటం వద్దు... ఓటరన్న ముద్దు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి మంచి ఊపు మీదికొచ్చిన బీజేపీ ఆ తర్వాత జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చతికిలబడింది. ఈ ఎన్నికల తర్వాత సాగర్ ఉప ఎన్నిక రావడంతో ఇక్కడ వచ్చే ఫలితం పార్టీ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతుందనే భావన కమలనాథుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం ఈ ఎన్నికలను సీరియస్గానే తీసుకుంది. అందులో భాగంగానే జనరల్ స్థానంలో ఎస్టీ అభ్యర్థిని నిలబెట్టి సామాజిక అస్త్రాన్ని ప్రయోగించింది. ఎక్కువ సంఖ్యలో ఉన్న ఎస్టీ ఓట్లు తమ బ్యాలెట్ బాక్సులను నింపుతాయని భావిస్తోంది. అభ్యర్థిని ప్రకటించకముందే ప్రచారాన్ని ప్రారంభించింది. టికెట్ను ఆశిస్తున్న నేతలంతా పోటాపోటీగా గ్రామాలకు వెళ్లి ప్రచారం చేశారు. అభ్యర్థిగా డాక్టర్ రవికుమార్ను ఖరారు చేసిన తర్వాత పార్టీ నియమించిన ఇన్చార్జీలు రంగంలోకి దిగారు. సహాయకులుగా వెళ్లిన ఐదుగురు నేతలతో కలసి వీరు గ్రామాల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నెల 9 తర్వాత... ఈ నెల 9 తర్వాత పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రచారపర్వంలోకి దిగింది. కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, అర్జున్రామ్ మేఘావాలేలు 10, 11 తేదీల్లో గ్రామాలకు వెళ్లారు. పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్ సోమవారం నుంచి ప్రచారం ముగిసే వరకు సాగర్లోనే ఉండనున్నారు. పార్టీ నేత డి.కె.అరుణ ఇప్పటికే నియోజకవర్గంలోనే మకాం వేశారు. ప్రచారం ముగి సే వరకు ఆమె అక్కడే ఉండనున్నారు. ఆమెతోపాటు మాజీ ఎంపీ విజయశాంతి ప్రచార షెడ్యూల్ కూడా ఖరారైంది. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కూడా సాగర్లో ప్రచారానికి వెళ్లనున్నారు. ఇప్పటికే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వమంతా నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీ రాష్ట్ర నేతల ప్రచారానికి అనుగుణంగా కేడర్ను సిద్ధం చేస్తోంది. మొత్తం మీద హంగూ, ఆర్భాటాలకు పోకుండానే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో చాపకింద నీరులా వెళ్లి సైలెంట్ ఓటింగ్ చేయించుకుని సత్తా చాటాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. చదవండి: సాగర్ ఉపఎన్నిక: ఏడ్చుకుంటూ ప్రచారం చేసిన బీజేపీ అభ్యర్థి -
మమ్మల్ని బండబూతులు తిట్టడం సరికాదు: తలసాని
హాలియా : సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు తమను బండ బూతులు తిట్టడం సరికాదని పశుసంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీలోని బాధ్యతగల వ్యక్తులు నీచమైన భాష మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. గురువారం హాలియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్లో ఉప ఎన్నికలు ఉన్నందున ప్రచారం ఎవ్వరైనా చేసుకోవచ్చు, చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించడంలో తప్పులేదన్నారు. ఎప్పుడూ నీతి సూత్రాల గురించి మాట్లాడే జానారెడ్డికి ఎలా మాట్లాడాలో తెలియాదా అని ప్రశ్నించారు. సాగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పే ధైర్యం లేక, ఓటమి తప్పదనే భయంతో జానారెడ్డి ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యల నివారణకు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే ఉపయోగం లేదని, ఎవరు ఆ పార్టీని నమ్మడం లేదని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన యువకుడు, విద్యావంతుడు భగత్కు ఓటేసి గెలిపిస్తే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్రెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, యడవెల్లి మహేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. టీఆర్ఎస్తో సబ్బండ వర్గాలకు న్యాయం మాడుగులపల్లి : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సబ్బండ వర్గాలకు న్యాయం జరిగిందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ధర్మాపురం, గోపాలపురం గ్రామాల్లో ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జానారెడ్డి 40ఏళ్లుగా చేయలేని అభివృద్ధి ఈ సారి చేస్తాననడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో నాయకులు చింతరెడ్డి యాదగిరి రెడ్డి,మాజీ ఎంపీపీ దాసరి నరసింహ్మ,పగిళ్ల సైదులు,రాములు పాల్గొన్నారు. -
ఒక్క పింఛన్ తీసేసినా.. ప్రభుత్వాన్నే ఊడదీస్తా..!
పెద్దవూర: ‘‘టీఆర్ఎస్కు ఓటు వేయకుంటే పింఛన్ తీసేస్తామని ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తున్నారంట.. ఒక్కరి పింఛన్ తీసేసినా ఈ ప్రభుత్వాన్నే ఊడదీస్తా’’ అని సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి హెచ్చరించారు. గురువారం మండలంలోని బట్టుగూడెం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శాసనమండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్రెడ్డికి రాజకీయాలు మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా ఉన్న భూమిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టలేని చేతగాని ప్రభుత్వం టీఆర్ఎస్ అని అన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ ప్రజలందరినీఅరాచకవాదులుగా తయారుచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉప ఎన్నికలో తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దళితులకు మూడెకరాల భూమి, రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూం ఇళ్లు వంటి హామీల అమలు ఏమయ్యాయని ప్రశ్నించా రు. రాష్ట్రంలో ఒక కొత్త చరిత్రను సృష్టించటానికి, ఆదర్శవంతమైన రాజకీయం, ఇచ్చిన హామీలు నెరవేర్చటానికి జానారెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్రెడ్డి, స్థానిక ఎంపీటీసీ కత్తి మహాలక్ష్మీముత్యాల్రెడ్డి, కూన్రెడ్డి వెంకట్రెడ్డి, ముస్కు నారాయణ, సువర్ణ, కూతాటి అర్జున్, నక్కల రామాంజిరెడ్డి, కత్తి కనకాల్రెడ్డి, శంకర్రెడ్డి, కృష్ణారెడ్డి, పాల్గొన్నారు. కాంగ్రెస్లో చేరిక తిరుమలగిరి : మండలంలోని గోడుమడకలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు గురువారం జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బూడిద కొండలు, గుడాల వెంకటయ్య, బాలు, సోమయ్య, రంగయ్య, వెంకటయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవడం చారిత్రక అవసరం పెద్దవూర: సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి గెలవడం రాష్ట్రానికి చారిత్రక అవసరమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గురువారం మండలంలోని బసిరెడ్డిపల్లి, వెల్మగూడెం, బట్టుగూడెం, కొత్తగూడెం, కటికర్లగూడెం గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు పబ్బు యాదగిరిగౌడ్, ఎంపీటీసీ కత్తి మహాలక్ష్మీముత్యాల్రెడ్డి, కూన్రెడ్డి వెంకట్రెడ్డి, చంద్రారెడ్డి, బక్కయ్య, శంకర్ పాల్గొన్నారు. -
డ్రక్స్ కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు మీవారే!
మల్కాజిగిరి: తెలంగాణలో బీసీ వ్యతిరేక పాలన సాగుతోందని బీజేపీ ఓబీసీ జాతీయ విభాగం అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం మల్కాజిగిరి పద్మావతి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ఓబీసీ విభాగం కార్యవర్గ భేటీ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ, దశాబ్దాలపాటు పరిపాలించిన కాంగ్రెస్ కూడా బీసీలకు ద్రోహమే చేసిందని, మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాతనే బీసీలకు ప్రాధాన్యత కల్పించారన్నారు. రాష్ట్రంలో పెత్తందార్ల, కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటే బీసీలు ఐక్యం కావాల్సిన అవసరముందన్నారు. గడీల రాజ్యాన్ని బద్దలుకొట్టాలి.. రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా గడీల రాజ్యం నడుస్తున్నదని దానిని బద్దలు కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కర్ణాటక డ్రగ్స్ కేసులో నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారని, కేసీఆర్ వారి పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. వారిలో ఇద్దరు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారన్నారు. 50 శాతం పైగా బీసీ జనాభా ఉన్న రాష్ట్రంలో ఇద్దరే మంత్రులు ఉన్నారని ఆయన విమర్శించారు. కులవృత్తులకు ద్రోహం చేస్తున్న పార్టీ ఎంఐఎం పార్టీయేనని, ఎక్కడ చూసినా వారే దుకాణాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. జాతీయ ఓబీసీ కమిషన్ సభ్యుడు ఆచార్య మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరిగితే వారి పక్షాన కమిషన్ నిలబడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, కార్పొరేటర్లు శ్రవణ్, రాజ్యలక్ష్మి, సునీతాయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల సిత్రాలు చూడరో: నిన్న ఏడుపులు.. నేడు చిందులు
-
ఎన్నికల సిత్రాలు: నిన్న ఏడుపులు.. నేడు చిందులు
సాక్షి, నల్గొండ: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి రవినాయక్ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మొన్న భావోద్వేగంతో కంటతడి పెట్టిన రవినాయక్.. ఇవాళ గ్రామాల్లో కోలాటం, బతుకమ్మ ఆడుతూ ఓట్లడుగుతున్నారు. గిరిజన బిడ్డను ఆశీర్వదించాలని రవినాయక్ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నిర్వహణలో మరో అంకం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు శనివారంతో గడువు ముగిసింది. మొత్తం 19 మంది తమ నామినేషన్లు వెనక్కితీసుకోవడంతో 41 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. ప్రధాన రాజకీయ పార్టీలు, ఇతర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, స్వతంత్రులు అంతా కలిపి 77 మంది నామినేషన్లు దాఖలు చేశారు. గత నెల 31వ తేదీన జరిగిన నామినేషన్ల పరిశీలనలో 17 తిరస్కరణకు గురికాగా, శనివారం 19 మంది విత్డ్రా చేసుకున్నారు. చదవండి: లెక్కతేలిన సాగర్ అభ్యర్థులు సాగర్కు ఈశాన్య దిక్కు..చివరి గ్రామం -
సాగర్ ఉపఎన్నిక: ఇక దూకుడే..
హైదరాబాద్: చావోరేవో తేల్చుకోవాల్సిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు మంత్రం జపించనుంది. ఇప్పటికే పార్టీ అభ్యర్థి కె.జానారెడ్డి విజయం కోసం నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ నేతలు శనివారం నుంచి దాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డితోపాటు మిగిలిన నాయకులు శనివారం నుంచి నియోజకవర్గంలోనే మకాం వేయనున్నారని, పోలింగ్ ముగిసే వరకు ప్రచారంలో అధికార టీఆర్ఎస్కు తీసిపోకుండా ముందుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. గత నెల 27న హాలియాలో జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రచారంలో ఊపు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రచార గడువు ముగిసేలోపు మరోమారు నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తోంది. చివరి వారం రోజుల్లో నియోజకవర్గాన్ని చుట్టుముట్టి పోలింగ్కు ఉత్సాహంగా సిద్ధం కావాలని నేతలు భావిస్తున్నారు. మండలాలవారీగా ఇన్చార్జీలు ఇతర పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అంతకు రెండు నెలల ముందు నుంచే జానారెడ్డితోపాటు ఆయన తనయులు రఘువీర్, జైవీర్లు నియోజకవర్గంలో రెండు దఫాలుగా పర్యటించారు. స్థానిక నాయకులతో సమావేశాలు నిర్వహించడం, వారిని ఎన్నికలకు సిద్ధం చేయడంతోపాటు దూరమైన కొందరు నేతలను కలుపుకుని పోయే ప్రయత్నం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత జానా అండ్ కో గత నెల 27న హాలియాలో నిర్వహించిన జనగర్జన బహిరంగ సభకు ఆశించిన మేర జనం హాజరు కావడం, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ సభకు రావడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. జానా, ఆయన తనయులకు ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా తోడు కానుంది. ఇప్పటికే టీపీసీసీ పక్షాన మండలాలవారీ ఇన్చార్జీలను నియమించిన ఉత్తమ్ శనివారం నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్రెడ్డి, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ప్రచారానికి హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆదివారం నుంచి ముఖ్యులంతా నియోజకవర్గంలోనే ఉండి టీఆర్ఎస్ను తలదన్నేలా ప్రచారం చేయాలని టీపీసీసీ నాయకత్వం నిర్ణయించింది. సాగర్ ఎన్నికల ప్రచారంపై టీపీసీసీ అ«ధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘టీఆర్ఎస్ డబ్బులు వెదజల్లి, మద్యం పారించి గ్రామాల్లో హల్చల్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ ఎన్ని డబ్బులిచ్చినా, ఎంత మద్యం పోసినా జానారెడ్డి గెలుపు ఖాయం. కాంగ్రెస్ కేడర్ విజయంపట్ల పూర్తిస్థాయి విశ్వాసంతో ప్రచారంలో ముందుకెళుతోంది. ఈ ఎన్నికల్లో జానా గెలుపే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్లోని ముఖ్య నాయకులంతా ఐక్యంగా, ప్రణాళిక ప్రకారం ప్రచారంలో పాల్గొంటారు’అని వ్యాఖ్యానించారు. చివరి వారమే కీలకం ఎన్నికల ప్రచారంలో చివరి వారంరోజులు చాలా కీలకమని, ఆ సమయంలో విస్తృత ప్రచారానికి ఏర్పాట్లు చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ మరోమారు ఇక్కడ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉండటం, ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న నేపథ్యంలో తాము ఎక్కడా తగ్గలేదనే విధంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లేలా రూట్మ్యాప్ తయారు చేసుకున్నారు. కోవిడ్తో ఇంటికే పరిమితమైన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి ఈ నెల 5 తర్వాత ప్రచారంలో పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. సీఎం బహిరంగసభ నిర్వహించే తేదీని బట్టి మరోమారు తాము కూడా బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్తోపాటు జానాతో సన్నిహిత సంబంధాలున్న జాతీయ నేతలను కూడా ఆహ్వానించాలని యోచిస్తున్నారు. చివరి వారంపాటు నియోజకవర్గంలోని గడప గడపనూ తొక్కి జానా గెలుపు కోసం ఓటర్లను అభ్యర్థించే వ్యూహంతో టీపీసీసీ సిద్ధమవుతోంది. -
Nagarjuna Sagar Bypoll: గులాబీ ‘సాగర’ వ్యూహం
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక, నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని పూర్తి చేసిన అధికార టీఆర్ఎస్ ఇక ‘ఆపరేషన్ నాగార్జున సాగర్’ ప్రారంభించింది. పార్టీ అభ్యర్థి నోముల భగత్ను గెలిపించడమే లక్ష్యంగా గులాబీదళం వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే ప్రచారం ముగియడానికి ముందురోజు నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 14న బహిరంగ సభ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపాయి. అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా రెండ్రోజులపాటు రోడ్ షోలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే రోడ్ షోలు ఎక్కడెక్కడ, ఎప్పుడు నిర్వహించాలన్నది ఖరారు కానుంది. ఇక భగత్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఎన్నికలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని పార్టీ ఆదేశించింది. సోమవారం రాత్రే హాలియా చేరుకున్న తలసాని... స్థానిక నేతలతో చర్చలు జరిపారు. సీఎం కేసీఆర్ ఇటీవల ఫోన్ చేయడంతో సాగర్ అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్న గురవయ్య యాదవ్, రంజిత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్లను బుజ్జగించారు. భగత్కు టికెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న విషయాన్ని వారికి వివరించారు. రెండ్రోజుల్లో వారిని కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి భరోసా ఇప్పించే ప్రయత్నాల్లో తలసాని ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, పార్టీ ప్రజాప్రతినిధులంతా నియోజకవర్గంలో పర్యటించాలని, భగత్ గెలుపు కోసం పనిచేయాలని తెలంగాణ భవన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ చదవండి: మంత్రిగా పనిచేశాడు.. సొంత వాహనం కూడా లేదు! సాగర్ ఉప ఎన్నిక.. చివరి రోజు నామినేషన్లు వేసిందేవరంటే.. -
మంత్రిగా పనిచేశాడు.. సొంత వాహనం కూడా లేదు!
నల్లగొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కె.జానారెడ్డికి ఒక కుంట వ్యవసాయ భూమి కూడా లేదు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంటున్న, అత్యధిక మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహించి, ఎక్కువకాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డి పేరున సొంత వాహనం కూడా లేదు. నివాస భవనాలూ లేకపోగా హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలో 600 గజాల స్థలం (విలువ రూ.2,73,80,000) ఉంది. అలాగే ఆయన వద్ద రెండు లైసెన్స్డ్ తుపాకులు.. 32 బోర్ రివాల్వర్, 0.25 పిస్టల్ ఉన్నాయి. జానాకు రూ.36,21,930 విలువైన చరాస్తి, రూ.33,46,000 విలువైన స్థిరాస్తి ఉంది. ఆయన భార్య సుమతికి ఏకంగా రూ. 5,13,16,724 విలువైన చరాస్తి ఉండగా, రూ.9,88,96,260 విలువైన స్థిరాస్తి ఉంది. జానా చేతిలో రూ.3,45,000 నగదు ఉండగా ఆయన భార్య చేతిలో రూ.2,75,000 నగదు ఉంది. జానాకు ఎస్బీఐ సెక్రటేరియట్ బ్రాంచ్లో రూ.4,89,626, యూకో బ్యాంక్, హైదరాబాద్లో రూ.1,67,776 నగదు ఉన్నాయి. భార్య పేరున యూకో బ్యాంక్, హైదరాబాద్లో రూ.6,81,012, ఎస్బీఐ సెక్రటేరియట్ శాఖలో రూ.8,83,336 నగదు ఉన్నాయి. భారీ మొత్తంలో షేర్లు జానారెడ్డి పేరిట ఆరతి ఎనర్జీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో రూ.21,70,000 విలువైన ఈక్విటీ షేర్లు ఉండగా భార్య పేరున ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో రూ.3,85,74,560 విలువైన షేర్లు, ఆరతి ఎనర్జీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో రూ.34,26,640 విలువైన షేర్లు, తరండా హైడ్రో పవర్ ప్రైవేట్లిమిటెడ్లో రూ.35,90,000 విలువైన షేర్లు ఉన్నట్లు జానా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. నోముల భగత్ ఆస్తుల వివరాలివీ.. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, ఆయన భార్య భవాని పేరిట పేరిట రూ.84.52 లక్షల అప్పులు ఉన్నాయి. భగత్ పేరిట రూ.55,33,719 విలువైన చరాస్తి, రూ.30,32,000 విలువైన స్థిరాస్తి ఉండగా, ఆయన భార్య పేరిట రూ.71,84,650 విలువైన చరాస్తి, రూ.1,75,000 విలువైన స్థిరాస్తి ఉంది. భగత్ చేతిలో రూ.19,000 నగదు ఉండగా ఆయన భార్య వద్ద రూ. 15,000 నగదు ఉంది. భగత్ పేరిట ఎస్బీఐ నకిరేకల్లో రూ.1,85,307, యాక్సిస్ బ్యాంక్, ఎల్బీ నగర్లో రూ.1,63,217 ఉన్నాయి. ఆయన భార్య పేరిట ఎస్బీఐ చౌటుప్పల్లో రూ.15,97,221, యాక్సిక్ బ్యాంక్, ఎల్బీ నగర్లో రూ.72,420 ఉన్నాయి. భగత్ పేరిట రెండు వాహనాలు, భార్య పేరిట ఒక వాహనం ఉన్నాయి. భగత్ పేరిట 16.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ఆయన భార్యకు అర ఎకరం ఉంది. భగత్కు వ్యవసాయేతర భూములు, నివాస భవనాలు కూడా ఉన్నాయి. -
సాగర్ బీజేపీ అభ్యర్థిగా ‘పానుగోతు రవికుమార్’
నల్లగొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పానుగోతు రవికుమార్ పేరు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సోమవారం రాత్రి అధికారిక ప్రకటన జారీ చేశారు. అంతకుముందు అభ్యర్థి ఖరారు ప్రక్రియపై పార్టీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకులతో హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. కె.నివేదితారెడ్డి, అంజయ్య యాదవ్, ఇంద్రసేనారెడ్డి టికెట్ ఆశించినప్పటికీ ఎక్కువమంది రాజకీయ, సామాజిక కోణాల ఆధారంగా ఎస్టీ వర్గానికి చెందిన రవి కుమార్ వైపే మొగ్గు చూపారు. ఆయనను పోటీలో నిలిపితే బీజేపీ ఎస్టీలకు ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పుకోవడానికి వీలవుతుందని భావించారు. మనం ఎస్టీ వర్గానికి కేటాయిస్తే ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు వీలవుతుందని, పైగా నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే ఎక్కువగా ఉన్నారని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. అధిష్టానం కూడా రాష్ట్ర నేతల అభిప్రాయంతో ఏకీభవించి రవికుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. నామినేషన్ల దాఖలుకు మంగళవారంతో గడువు ముగియనున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోయింది, అప్పుడు పోటీ చేసిన నివేదితారెడ్డికి 2,675 ఓట్లు మాత్రమే వచ్చాయి, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి, ప్రస్తుతం బీజేపీ నుంచి టికెట్ ఆశించిన అంజయ్య యాదవ్ 27,858 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. పూర్తి పేరు : పానుగోతు రవికుమార్ స్వగ్రామం: పలుగు తండా, త్రిపురారం మండలం, నల్లగొండ జిల్లా పుట్టిన తేదీ: 09–06–1985 భార్య: పానుగోతు సంతోషి తల్లిదండ్రులు: పానుగోతు హరి, పానుగోతు దస్సి పిల్లలు: మనస్విత్, వీనస్ విద్యార్హతలు: ఎంబీబీఎస్ ఉద్యోగం: పలు ప్రభుత్వ ఆస్పత్రులలో (ప్రస్తుతం రాజీనామా) సివిల్ సర్జన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. నిర్మల ఫౌండేషన్ చైర్మన్గా ఉన్నారు. -
టీఆర్ఎస్ అభ్యర్థిగా ‘నోముల భగత్’
హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ను ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. భగత్కు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సోమవారం బీ ఫామ్ను అందజేయడంతో పాటు ఎన్నికల ప్రచారం కోసం రూ.28 లక్షల చెక్కును కూడా కేసీఆర్ అందజేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు భగత్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మంగళవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనున్న నేపథ్యంలో దివంగత శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య కుమారుడైన భగత్ను పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ ఎంపిక చేశారు. తెలంగాణ భవన్కు సోమవారం మధ్యాహ్నం చేరుకున్న ముఖ్యమంత్రి.. మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రావణ్కుమార్ రెడ్డి తదితరుల సమక్షంలో భగత్కు బీ ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా భగత్ తల్లి, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య భార్య లక్ష్మి, కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో కేసీఆర్ సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. ‘నోముల నర్సింహయ్యతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కుమారుడికి అవకాశం ఇస్తున్నాం. గతంలో మాదిరిగా కాకుండా పార్టీ నేతలందరూ కలసికట్టుగా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలి. నేను కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా’అని చెప్పారు. కోటిరెడ్డి, చిన్నపరెడ్డితో భేటీ సాగర్ టికెట్ ఆశించిన పార్టీ నేతలు ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్రెడ్డితో కలసి ప్రగతిభవన్కు వెళ్లారు. కోటిరెడ్డి, చిన్నపరెడ్డితో వేర్వేరుగా సమావేశమైన కేసీఆర్ వారిద్దరినీ బుజ్జగించినట్లు సమాచారం. ‘నాగార్జునసాగర్లో పార్టీ గెలిచేందుకు బాధ్యత తీసుకోండి. మీరు స్థానికంగా కష్టపడి పనిచేస్తున్నా కొన్ని పరిస్థితుల్లో అవకాశం ఇవ్వలేక పోతున్నా. భవిష్యత్తులో రాజకీయంగా అనేక అవకాశాలు ఉంటాయి. ఈ ఏడాది మేలో జరిగే ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో మీకు శాసనమండలి సభ్యుడిగా అవకాశం ఇస్తా..’అని కోటిరెడ్డికి సీఎం హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా కింద మరోసారి అవకాశం ఇస్తానని చిన్నప రెడ్డికి నచ్చజెప్పారు. వారితో కలసి భోజనం చేసిన అనంతరం కేసీఆర్ తెలంగాణ భవన్కు వెళ్లారు. భగత్కు బీ ఫామ్ అందజేసిన తర్వాత పార్టీ నేతలందరూ కలసికట్టుగా పని చేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి నొక్కిచెప్పారు. ‘టికెట్ ఆశించిన నేతలను కూడా కలుపుకొని పార్టీ అభ్యర్థి ప్రచారానికి వెళ్లాలి. అలాగే ఈ టికెట్ ఆశించినవారు కూడా మనసులో ఇతర అభిప్రాయాలకు తావులేకుండా పనిచేయాలి..’ అని సూచించారు. బీజేపీకి అక్కడ సొంత బలం లేనందునే టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన వచ్చేవరకు వేచి చూస్తోందన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ పరంగా సర్వేలు చేయించామని, సాగర్లో మంచి మెజారిటీతో గెలుస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించడం లేదన్నారు. ఈ సందర్భంగా నోముల నర్సింహయ్య భార్య లక్ష్మిని వారి కుటుంబ బాగోగులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. సామాజికవర్గ సమీకరణాలతోనే భగత్కు సాగర్ నియోజకవర్గం పరిధిలో 2.17 లక్షల ఓటర్లు ఉండగా, వీరిలో 34 వేల మందికి పైగా బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 2014, 2018 ఎన్నికల్లో ఇదే సామాజిక వర్గానికి చెందిన నోముల నర్సింహయ్యకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. నర్సింహయ్య హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరుగుతుండగా.. ఆయన స్థానంలో దుబ్బాక తరహాలోనే ఆయన కుమారుడు భగత్కు అవకాశం ఇచ్చారు. నర్సింహయ్య పట్ల ఉన్న సానుభూతి కూడా కలసి వస్తుందని టీఆర్ఎస్ అంచనా వేసింది. ఓటర్ల సంఖ్యా పరంగా లంబాడాలు 38 వేలు, రెడ్డి 23 వేలు, మాదిగ 26 వేలు, ముదిరాజ్ 12 వేలకు పైగా ఉండటంతో పార్టీ ఇన్చార్జీలుగా అదే సామాజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ మోహరించి ప్రచారం నిర్వహిస్తోంది. ఇక జోరుగా ప్రచారం ఉప ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 17న జరగనుండగా వచ్చే పక్షం రోజులు ప్రచారాన్ని హోరెత్తించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. గత నెల 10న హాలియాలో జరిగిన సభలో పాల్గొన్న కేసీఆర్.. ఈసారి త్రిపురారం లేదా నాగార్జునసాగర్ మున్సిపాలిటీలో నిర్వహించే బహిరంగ సభకు హజరవుతారని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రోడ్ షోల్లో పాల్గొంటారని సమాచారం. వీరిద్దరి ప్రచార సభలు, రోడ్ షోల షెడ్యూలు ఖరారు కావాల్సి ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, జాజుల సురేందర్ (తిరుమలగిరి మండలం), కోరుకంటి చందర్ (హాలియా), బాల్క సుమన్ (పెద్దవూర), కంచర్ల భూపాల్రెడ్డి (గుర్రంపోడ్), నల్లమోతు భాస్కర్రావు (నిడమనూరు), భానోత్ శంకర్ నాయక్ (త్రిపురారం) కోనేరు కోణప్ప (అనుముల), జీవన్రెడ్డి (మాడ్గుపల్లి) ఇన్చార్జీలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ మేయర్ సునీల్రావు, సుడా (కరీంనగర్) చైర్మన్ జీవీ రామకృష్ణారావు ప్రచారాన్ని సమన్వయం చేస్తున్నారు. నాన్న ఆశయాలు నెరవేరుస్తా: భగత్ ‘నాన్న నోముల నర్సింహయ్య 2014లో టీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆయనకు సముచిత స్థానం కల్పించారు. కేసీఆర్ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలే నర్సింహయ్యను గెలిపించాయి. ఆయన వారసుడిగా ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉంది. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తా..’అని భగత్ అన్నారు. బీ ఫామ్ అందుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండేళ్ల లోపే మా నాన్నను కోల్పోయి ఉప ఎన్నిక రావడం దురదృష్టకరం. అయితే నా మీద నమ్మకముంచి టికెట్ కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటా’ అని భగత్ అన్నారు. నర్సింహయ్య వారసుడిగా ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. పేరు : నోముల భగత్ తండ్రి : దివంగత నోముల నర్సింహయ్య తల్లి : నోముల లక్ష్మి ప్రస్తుత నివాసం: హాలియా పుట్టిన తేదీ: 10–10–1984 భార్య : నోముల భవానీ పిల్లలు: రానాజయ్, రేయాశ్రీ విద్యార్హతలు: బీఈ, ఎంబీఏ, ఎల్ఎల్ఎం చేసిన ఉద్యోగాలు: సత్యం టెక్నాలజీస్ లిమిటెడ్లో జూనియర్ ఇంజనీర్, (2010–2012), విస్టా ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్లో మేనేజర్ ప్రస్తుతం : హైకోర్టు న్యాయవాది, నోముల ఎన్ఎల్ ఫౌండేషన్ చైర్మన్ -
సాగర్ ఉప ఎన్నిక.. నామినేషన్లు వేసేది వీరే!
హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు గాను మూడు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు మంగళవారం తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు మంగళవారమే తుది గడువు కావడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున నోముల భగత్, కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత కె. జానారెడ్డి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పానుగోతు రవికుమార్ నాయక్ నామినేషన్లు వేస్తారని ఆయా పార్టీల వర్గాలు వెల్లడించాయి. జానా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు హాజరుకానున్నారు. భగత్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, మండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావులతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. నామినేషన్ దాఖలు చేశాక భగత్ మాడ్గుపల్లి మండలం అభంగాపురంనుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కె. జానారెడ్డి ఇక బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లనున్నట్టు సమాచారం. మనసు మార్చుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ ఉప ఎన్నికలో భారీ సంఖ్యలో నామినేషన్లు వేసి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకున్న ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారని సమాచారం. ఫీల్డ్ అసిస్టెంట్ల బృందంతో టీఆర్ఎస్ పెద్దలు చర్చలు జరిపారని, వారిని మళ్లీ విధుల్లో నియమించుకునే హామీ ఇవ్వడంతో వారు మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి డాక్టర్ పానుగోతు రవికుమార్ నాయక్ ఇప్పటివరకు సాగర్లో చిన్నా చితకా పార్టీలు, స్వతంత్రులు కలిపి 23 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అమల్లో ఉన్న నేపథ్యంలో భారీ ర్యాలీలు, అట్టహాసాలకు తావు లేకుండా సాదాసీదాగానే నామినేషన్ల కార్యక్రమాన్ని ముగించేందుకు ప్రధాన పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
11 సార్లు ఓటమి.. గెలిపించే వరకు పోటీ చేస్తా
నిడమనూరు : గజినీ మహ్మద్ ఈ పేరు అందరికీ సుపరిచితమే.. భారతదేశంపై పలుమార్లు దండయాత్ర చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయినా, ఆయన మరోమారు యుద్ధభేరి మోగించి విజయం సాధించారని పాఠ్యాంశాల్లో చదువుకున్నాం. అదే కోవలోకి వస్తారు.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన మర్రి నెహెమ్యా. ఎన్నికలు ఏవైనా నేనున్నాంటూ బరిలో నిలిచేందుకు ముందుకొస్తారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన ఇప్పటికి కౌన్సిలర్ నుంచి శాసనసభ, లోక్సభ స్థానాలకు 11సార్లు పోటీచేసి ఓటమిపాలయ్యారు. 72ఏళ్ల వయసులో కూడా ఆయన మరో మారు సాగర్ ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. బుధవారం ఆయన నిడమనూరు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు తీసుకునేందుకు వచ్చి ‘సాక్షి’తో ముచ్చటించారు. 1984నుంచి తుంగతుర్తి, సూర్యాపేట, చలకుర్తి, నాగార్జునసాగర్, హుజూర్నగర్ శాసన సభ, మిర్యాలగూడ, నల్లగొండ లోక్ సభ స్థానాలకు పోటీచేసి ఓడిపోయినట్లు తెలిపారు. 2014లో నిర్వహించిన నల్లగొండ లోక్సభ స్థానానికి పోటీ చేసి 56వేల ఓట్లు సాధించానని తెలిపారు. తనను గెలిపించే వరకు ఎన్నికల బరిలో నిలుస్తూనే ఉంటానని నెహెమ్యా పేర్కొనడం కొసమెరుపు. చదవండి: ‘ఎమ్మెల్యే పదవి నాకు చిన్నది.. అయినా పోటీ చేస్తా’ -
కాలుదువ్వుతున్న బీజేపీ.. జనసేన
‘ఇక బీజేపీ, జనసేన కలిసి ముందుకు సాగుతాయి.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థే బరిలోకి దిగుతారు..’ అంటూ ఆయా పార్టీల నేతలు ఆర్భాటంగా ప్రకటించేశారు. ఇప్పుడు అభ్యర్థి విషయంలో మిత్రభేదాన్ని పాటిస్తున్నారు. ‘నువ్వా..నేనా’ అంటూ కాలుదువ్వుతున్నారు. ఎవరికివారే ప్రణాళికలు రచించుకుంటున్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నట్టు నటిస్తున్నారు. లోలోపల ఒకరిపై ఒకరు కారాలుమిరియా లు నూరుతూ బయట చిరునవ్వులు చిందిస్తున్నా రు. రాజకీయ ‘పవనం’ ఎప్పుడు రూటు మార్చు తుందో.. కమల వికాసం ఏ మాయ చేస్తుందో తెలియక కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. సాక్షి, తిరుపతి : అభ్యర్థి ఎంపిక విషయంలో మిత్రపక్షాల మధ్య రచ్చ రాజుకుంటోంది. బయటకు ఒకటిగా ఉన్నా లోలోపల కత్తులు నూరేలా చేస్తోంది. తిరుపతి ఉపఎన్నికలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు జనసేన శ్రేణులు రగిలిపోయేలా మార్చింది. ఇన్నాళ్లూ ఉపఎన్నికలో ఎవరు నిలవాలనే విషయమై ఓ కమిటీ తేలుస్తుందని చెప్పుకుంటూ వచ్చిన జనసేన నేతలు ఇప్పుడు బీజేపీ నేతల తీరుపై ఒంటికాలుతో లేసేలా చేసింది. రెండు రోజుల క్రితం దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో నిర్వహించిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో మిత్రపక్షాన్ని దూరంగా పెట్టాలని నిర్ణయించింది. విషయం తెలుసుకున్న జనసేన నేతలు మిత్రభేదం తప్పద ని మండిపడుతున్నారు. ఇక సఖ్యత కుదరదని, సొంతంగా బరిలోకి దిగడమే మంచిదని యోచిస్తున్నారు. ఈనెల 21న తిరుపతిలో జరిగే జనసేన కీలక సమావేశంలో ఆ విషయా న్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఉప ఎన్నికలే లక్ష్యంగా రథయాత్ర తిరుపతి ఉప ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ నేతలు రథయాత్ర చేపట్టాలని కోర్ కమిటీలో నిర్ణయించారు. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ శ్రేణులు కలిసి ఆలయాలపై చేస్తున్న కుట్రల విషయాన్ని పోలీసుశాఖ ఆధారాలతో బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే కమలనాథులు అవేవీ పట్టించుకోకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గ్ట్గా చేసుకుని కపిలతీర్థం నుంచి రథయాత్ర ప్రారంభించి రామతీర్థం వరకు చేపట్టాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 4న తిరుపతి కపిలతీర్థం నుంచి ప్రారంభించి ఎనిమిది రోజులపాటు సాగే ఈ యాత్రలో పీఠాపురం, అంతర్వేది, విజయవాడ, నెల్లూరు, శ్రీశైలం ప్రాంతాల్లో సభలను నిర్వహించాలని నిశ్చయించారు. ఈ రథయాత్రలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, దాని ద్వారా సెంటిమెంట్ను రాజేసి తిరుపతి ఉప ఎన్నికన్నలో ప్రయోజనం పొందాలన్నదే లక్ష్యంగా కమలనాథులు ముందుకు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే జనసేన శ్రేణులు తిరుపతి ఉప ఎన్నిక విషయంలో తమను అవమానిస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే కమలనాథులు అవేవీ పట్టించుకోకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గ్ట్గా చేసుకుని కపిలతీర్థం నుంచి రథయాత్ర ప్రారంభించి రామతీర్థం వరకు చేపట్టాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 4న తిరుపతి కపిలతీర్థం నుంచి ప్రారంభించి ఎనిమిది రోజులపాటు సాగే ఈ యాత్రలో పీఠాపురం, అంతర్వేది, విజయవాడ, నెల్లూరు, శ్రీశైలం ప్రాంతాల్లో సభలను నిర్వహించాలని నిశ్చయించారు. ఈ రథయాత్ర లో మత విద్వేషాలు రెచ్చగొట్టి, దాని ద్వారా సెంటిమెంట్ను రాజేసి తిరుపతి ఉప ఎన్నికన్నలో ప్రయోజనం పొందాలన్నదే లక్ష్యంగా కమలనాథులు ముందుకు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే జనసేన శ్రేణులు తిరుపతి ఉప ఎన్నిక విషయంలో తమను అవమానిస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోటీ చేసేది బీజేపీ అభ్యర్థే! తిరుపతిలో జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పోటీలో ఉంటారని బీజేపీ నేతలు పైకి చెబుతున్నా లోపల మాత్రం అధికారికంగా అభ్యర్థిని ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోసం పార్టీ శ్రేణులంతా పనిచేయాలని ఆ పార్టీ కోర్ కమిటీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ప్రతి మండలానికి ఒక బృందాన్ని పంపాలని, ముఖ్యమైన వారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఎన్నికలు పూర్తయ్యేవరకు అంతా తిరుపతిలోనే ఉండాలని హుకుం జారీ చేసింది. బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే పార్టీ అభ్యర్థిని ప్రకటించడమే తరువాయిగా తెలుస్తోంది. నోటిఫికేషన్ వచ్చి క్షేత్రస్థాయిలో దిగేవరకు అభ్యర్థి ప్రకటన విషయాన్ని బయటపెట్టే అవకాశం లేదని విశ్వసనీయ సమాచారం. కాకపోతే జనసేన అధినేత పవన్కల్యాణ్ నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక బీజేపీ నేతలు పూటకోమాట మాట్లాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తిరుపతి ఉపఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో కూడా జనసేనకు పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని ఇప్పటికే బీజేపీ నేతలు గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. బీజే పీ అభ్యర్థిగా రావెల కిషోర్బాబు పోటీచేసే అవకాశాలు న్నట్లు పార్టీలో అంతర్లీనంగా చర్చ కూడా జరుగుతోంది. -
టీఆర్ఎస్, బీజేపీకి డిపాజిట్లు కూడా రావు
తిరుమలగిరి: నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం నాగార్జునసాగర్లోని జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్, బీజేపీలు డిపాజిట్ల కోసం పోరాడాల్సిందేనన్నారు.(చదవండి: గోల్కొండపై జెండా ఎగరేద్దాం: బండి) ఎప్పటిలాగే ప్రజలను మాయమాటలతో మరోసారి మోసం చేసి ఓట్లు దండుకోవాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని, ఈసారి ప్రజలు ఆయన మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. తన హయాంలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందే తప్ప ఈ ఆరేళ్ల కాలంలో అణువంత కూడా అభివృద్ధి జరగలేదని తెలిపారు. ఎన్నికలప్పుడు మాత్రమే అధికార పార్టీకి హామీలు గుర్తుకువస్తాయని ఆయన విమర్శించారు. -
అభ్యర్థి ఎంపికే... అసలు సవాల్
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ శాస నసభ నియోజకవర్గం ఉపఎన్నిక ఫిబ్రవ రి లేదా మార్చిలో జరుగుతుందనే అంచనాతో పార్టీ అభ్యర్థి ఎంపిక, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం మధ్య సమన్వయం తదితర అంశాలపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. అన్నికోణాల్లోనూ లెక్కలు కడుతూ కసరత్తును ముమ్మరం చేసింది. దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను గుణపాఠంగా తీసుకుని పొరపాట్లకు తావులేకుండా సాగర్ ఉపఎన్నికకు సన్నద్ధం కా వాలని భావిస్తోంది. ఎన్నికల షెడ్యూలు వెలువడే లోగా నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల అమలును దృష్టిలో పెట్టుకుని పనిచేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని... బలమైన అభ్యర్థి ఎంపికకు ప్రాధాన్యమిస్తోంది. పార్టీ టికెట్ కోసం స్థానికంగా పోటీ పడుతున్న నేతలు, కాంగ్రెస్, బీజేపీ తరపున పోటీ చేసే అవకాశమున్న అభ్యర్థులు, వారి బలాబలాలు, నియోజకవర్గంలో సామాజికవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యా బలం తదితరాలను ప్రాతిపదికగా తీసుకుని అభ్యరి్థని ఎంపిక చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగం నివేదికలు, అంతర్గత సర్వేలతో పాటు పార్టీ ఇన్చార్జీలు, కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతల నివేదికల ఆధారంగా సాగర్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి, టికెట్ ఆశిస్తున్న నేతల బలాబలాలపై లోతుగా మదింపు జరుగుతోంది. సామాజిక వర్గాల లెక్కలు.. పార్టీ బలం పార్టీ సంస్థాగత బలం, సామాజిక వర్గాల ఓట్ల సంఖ్య తదితరాల ఆధారంగా అభ్య రి్థని ఎంపిక చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. మరో వైపు అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఇటీవల నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతల అభిప్రాయాలను కూడా ప్రభుత్వ మాజీ విప్, పార్టీ ఇన్చార్జి నేతృత్వంలోని బృందాలు వేర్వేరుగా సేకరించినట్లు తెలిసింది. నియోజకవర్గంలో 2.16 లక్షల ఓట్లకుగాను బీసీ సామాజిక వర్గం నుంచి ప్రధానంగా యాదవులు పెద్ద సంఖ్యలో ఉండగా, రెడ్డి, ఎస్టీ సామాజిక వర్గాల ఓటర్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలు (మాడ్గులపల్లి మండలం పాక్షికం), రెండు మున్సిపాలిటీల్లో (హాలియా, సాగర్) టీఆర్ఎస్ సంస్థాగతంగా బలంగా కనిపిస్తోంది. 179 గ్రామ పంచాయతీల్లో 153 మంది సర్పంచ్లు, ఐదుగురు ఎంపీపీలు, నలుగురు జెడ్పీటీసీ సభ్యులు, ఎనిమిదింటిలో ఏడుగురు సహకార సంఘాల చైర్మన్లు టీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు. దీంతో పారీ్టలో అంతర్గత సమన్వయం సాధించి నాయకులు, కార్యకర్తలను ఏకతాటిపైకి తేవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అభ్యర్థి ఎవరైనా కేడర్ మద్దతు అతనికి పూర్తిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోనుంది. ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఒకటి రెండు రోజుల్లో పార్టీ ఇన్చార్జీలను నియమించే అవకాశం ఉంది. దుబ్బాక అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం కేసీఆర్ పాల్గొనాలని అంతర్గత నివేదికల్లో పార్టీ నేతలు పేర్కొన్నట్లు సమాచారం. నలుగురిలో ఎవరికో చాన్స్! స్థానికులకే టికెట్, సానుభూతి వంటి నినాదాల నేపథ్యంలో పార్టీ అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఔత్సాహికుల వడపోతను టీఆర్ఎస్ పూర్తి చేసింది. ప్రధానంగా నలుగురి పేర్లు పరిశీలనలో ఉండటంతో క్షేత్రస్థాయిలో వారికి ఉండే బలాబలాలపైనా వివిధ కోణాల్లో కసరత్తు జరుగుతోంది. శా సనమండలి సభ్యులు తేరా చిన్నపరెడ్డి, న్యాయవా ది కోటిరెడ్డి, దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్, మాజీ శాసనసభ్యులు రామ్మూర్తి యాదవ్ మనుమడు మన్నెం రంజిత్ యాదవ్ పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నాయి. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం తో తమకు అవకాశం వస్తుందని కోటిరెడ్డి, రంజిత్ యాదవ్ భావిస్తున్నారు. ఓవైపు సొంత పార్టీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్న టీఆర్ఎస్ విపక్ష పార్టీ ల వ్యూహంపైనా ఓ కన్నేసింది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి లేదా ఆయన కుమారుడు రఘువీర్రెడ్డి, బీజేపీ నుంచి నివేదితరెడ్డి లేదా కడా రి అంజయ్య యాదవ్ పోటీలో ఉంటే ఎదురయ్యే పరిస్థితులను కూడా టీఆర్ఎస్ బేరీజు వేస్తోంది. -
జానాకి పోటీ.. రంగంలోకి యువనేత
సాక్షి, నల్గొండ : ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు సవాల్గా మారాయి. మరోవైపు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో మరో ఉప ఎన్నికను ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. దుబ్బాకలో రామలింగారెడ్డి భార్యను బరిలోకి దింపినా టీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ బలమైన స్థానిక నేతను అన్వేషించే పని పడినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అర్ధాంతరంగా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించే సంప్రదాయాన్ని టీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తూ వస్తోంది. కానీ, దుబ్బాకలో ఎదురైన చేదు అనుభవం ఆ పార్టీని పునరాలోచనలో పడేసింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లను మార్చిన చోట విజయం సాధించిన టిఆర్ఎస్.. సిట్టింగులు ఉన్న చోట ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. వీటన్నింటి నేపథ్యంలో నర్సింహయ్య కుటుంబ సభ్యులను బరిలోకి దింపాలా లేక మరొకరికి అవకాశం ఇవ్వాలా అనే విషయంలో టీఆర్ఎస్ తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నోముల కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే.. ఎవరికి అవకాశం ఉంటుందనే చర్చ జోరందుకుంది. జానా రెడ్డికి గట్టి పోటీ! ఇక మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ మనవడు, టీఆర్ఎస్ యువనేత మన్నెం రంజిత్ యాదవ్కు ఈసారి టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు ప్రముఖంగా వినబడుతోంది. నియోజకవర్గంలో రామ్మూర్తికి ఉన్న మంచి పేరు రంజిత్కు కలిసి వస్తుందని, ఆయనకు టికెట్ కేటాయిస్తే కారు పార్టీకే విజయం వరిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ యువ నేత నియోజకవర్గ స్థాయిలో చాలా యాక్టివ్గా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పటికే మద్దతును కూటగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న రంజిత్ కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో సాగర్ నియోజకవర్గ ప్రజలు తమకు అందుబాటులో ఉండే నేతను ఎమ్మెల్యే అభ్యర్థి నిలిపితే బాగుంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా సీనియర్ నేతైన జానారెడ్డికి గట్టి పోటీ ఇచ్చే నాయకుడు రంజిత్ యాదవ్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే స్థానికంగా బలమైన యాదవ సామాజిక వర్గంనికి చెందిన నేత కావడంతో.. సీనియర్లు సైతం ఆయనవైపే మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నియోజవర్గంలో రెడ్డి ఓట్లతో పాటు పెద్ద ఎత్తున యాదవ్ సామాజిక ఓటర్లు కూడా ఉన్నారు. ఇది రంజిత్ యాదవ్కు కలిసొచ్చే పరిణామం. మరోవైపు మంత్రి కేటీఆర్కు సన్నిహితంగా ఉండే ఎన్ఆర్ఐ గడ్డంపల్లి రవీందర్ రెడ్డికి టిక్కెట్ దక్కే అవకాశం కూడా ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. -
తిరుపతిలో మకాం వేసిన బీజేపీ నేత విష్ణు
సాక్షి, తిరుపతి: తిరుపతి లోక్సభ ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అసంతృప్తి నేతలకు గాలం వేయడానికి బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అత్యంత సన్నిహితుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణుకుమార్ రెడ్డి ద్వారా బేరసారాలు మొదలుపెట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకోసమే విష్ణు తిరుపతిలో మకాం వేసినట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతి ఎంపీ బల్లిదుర్గాప్రసాద్ అకస్మిక మరణంతో పార్లమెంట్ ఉప ఎన్నిక అనివార్యం కానుంది. బీజేపీ, టీడీపీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఏకగ్రీవం కావాల్సిన లోక్సభ సీ టును ఉపఎన్నికల వరకు తీసుకువెళ్లడానికే సిద్ధమయ్యారు. దుబ్బాక వాపును చూసి, బలుపనుకుని రకరకాల ఎత్తులు వేస్తున్నారు. (శ్రీకాళహస్తిలో నాటకాన్ని రక్తికట్టిస్తున్న బీజేపీ, జనసేన) గత ఏడాదిన్న కాలంగా సీనియర్ టీడీపీ నేతలు పలువురు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వైఖరి నచ్చక కొందరు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో మరికొందరు టీడీపీకి రాజీనామా చేసినా తర్వాత చంద్రబాబు బుజ్జగింపులతో మెత్తబడ్డారు. అయితే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటువంటి వారి జాబితా దగ్గర పెట్టుకుని బీజేపీ నేతలు సదరు అసమ్మతి నేతలతో మంతనాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్ధానికంగా కమలం పార్టీలోని నేతలతో టీడీపీ అసమ్మతి నేతలతో ముందుగా మాట్లాడించి, తర్వాత విష్ణు రంగంలోకి దిగుతున్నారని తెలిసింది. అందులో భాగంగా సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుని తిరుపతికి పిలిపించుకుని మంతనాలు మొదలుపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. దుబ్బాక గెలుపుతో ఏపీ నాయకత్వంపై ఒత్తిడి తెలంగాణాలోని దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అనూహ్యంగా గెలవడంతో తిరుపతి లోక్సభ ఉపఎన్నికల విషయమై రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెరిగినట్లు తెలిసింది. నిజానికి దుబ్బాకలో గెలిచేంత సీన్ కమలానికి లేదు. అయితే టీఆర్ఎస్ను వ్యతిరేకించే అనేక అంశాలు కలసి రావడంతో బీజేపీ నేతలంతా దుబ్బాకలో తిష్ట వేసి, గెలుపు కోసం రేయింబవళ్లు కష్టపడడంతో విజయం సాధ్యమైందనేది వాస్తవం. కాగా దుబ్బాకకు తిరుపతికి మధ్య ఎంత దూరం ఉందో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో గెలుపునకు బీజేపీ అంతే దూరంలో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కమలనాథులు మాత్రం విజయం తమదే అంటూ రెచ్చిపోతున్నారు. (రూ.7,200 కోట్లు తీసుకొని భ్రమరావతిగా మార్చిన చంద్రబాబు) డిపాజిట్ కోల్పోయిన కమలం గత ఎన్నికల్లో విజయం సాధించిన బల్లికి 2.28 లక్షల ఓట్ల మెజారిటీ వస్తే బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. కమలం అభ్యర్థికి కేవలం 16 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాంటిది జరగబోయే ఉపఎన్నికలో తమ గెలుపు ఖాయమని వీర్రాజు లాంటి వారు చెబుతుంటే... జనం నవ్వుకుంటున్నారు. అయితే కమలదళం హడావుడి మాత్రం అంతా ఇంతా కాదు. గెలుస్తారో లేదో తెలియదు కానీ టీడీపీ అసమ్మతి నేతలతో పాటు రాజకీయాలకు సంబంధం లేని ప్రముఖులను కూడా తమ వైపునకు మొగ్గేలా బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పనిలో పనిగా జనసేన కార్యకర్తలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
దుబ్బాక ఫలితాలపై స్పందించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు తమ పార్టీని మరింత అప్రమత్తం చేసిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఫలితాలు తాము ఆశించినట్లు రాలేదని, ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించుకుంటామని తెలిపారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ..దుబ్బాక ఫలితాలు తమ పార్టీ కార్యకర్తలను మరింత అప్రమత్తం అయ్యేలా చేశాయని, త్వరలోనే ఫలితాలపై పునఃసమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. (చదవండి : దుబ్బాకలో టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ) ‘2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో సైతం ఘన విజయం సాధించింది. మేము విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము. మాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పాటు పడిన కార్యకర్తలు, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు. ఫలితాలు మేము ఆశించిన విధంగా రాలేదు. ఈ ఫలితాలు మా పార్టీ అప్రమత్తం కావడానికి ఉపయోగపడుతంది. ఫలితాలు ఆశించిన విధంగా ఎందుకు రాలేదో, ఎక్కడ తప్పు జరిగిందో సమీక్షించుకొని పార్టీ అధ్యక్షుడిని నిర్ణయం మేరకు ముందుకు సాగుతాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్ఎస్ కంచుకోటలో తొలిసారి కాషాయ జెండా ఎగరేసింది. 1470 ఓట్ల మెజార్టీతో సమీప టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్ విజయం సాధించారు. -
సిద్దిపేటలో ఉద్రిక్త వాతావరణం
సాక్షి, సిద్ధిపేట: మరికొన్ని గంటల్లో దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సిద్ధిపేటలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. కాగా స్థానికంగా ఉన్న స్వర్ణా ప్యాలెస్ హోటల్లో డబ్బులు పంచుతున్నట్లు సమాచారం ఉందంటూ బీజేపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అదే హోటల్లో బస చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, బీజేపీ నేతల మధ్య తోపుటలా జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు యత్నిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తించారని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని, తనను కొట్టే ప్రయత్నం చేస్తుంటే టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపారు. బీజేపీ దాడిలో టీఆర్ఎస్ కార్యకర్త గాయపడ్డారని పేర్కొన్నారు. దళిత ఎమ్మెల్యేపై దాడి హేయమైన చర్య మంత్రి హరీష్రావు మండిపడ్డారు. పథకం ప్రకారమే బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని అన్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసుకున్న బీజేపీ నాయకులు దళిత బిడ్డలైన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సిద్దిపేటలోనీ స్వర్ణ ప్యాలెస్లో దాడికి పాల్పటం హేయమైన చర్య అని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. ఈ దాడికి పాల్పడిన బీజేపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమీషన్, పోలీసు డిపార్టుమెంట్ను కోరుతున్నామన్నారు. -
హైదరాబాద్: బీజేపీ కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపు
-
నిరూపిస్తే.. ఉరేసుకుంటా: బండి సంజయ్
సాక్షి, సిద్దిపేట : తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తిప్పికొట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో బిజెపి ప్రభుత్వాన్ని బెదిరించడం సరికాదన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా శనివారం ఆయన రాయపోల్ మండలం పలు గ్రామాలలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం నిధుల విడుదలపై చర్చకు రావాలంటూ సీఎం కేసీఆర్కు ప్రతి సవాల్ విసిరారు. ఒకవేళ నిధులు విడుదల చేయలేదని నిరూపిస్తే దుబ్బాక చౌరస్తాలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటానని కేసీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. (చదవండి : నిరూపిస్తే.. రాజీనామా చేస్తా : సీఎం కేసీఆర్) అంతకుముందు బీజేపీ నాయకులపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెన్షన్ల విషయంలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం కేవలం మనిషికి రూ.200 చొప్పున మాత్రమే పింఛన్లు అందిస్తే.. బీజేపీ నేతలు మాత్రం రూ.1600 చొప్పున ఇస్తోందని అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ల విషయంలో తాను చెప్పేది అబద్దమని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని బీజేపీ నేతలకు కేసీఆర్ సవాల్ విసిరారు. -
టీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో పోలీసుల సోదాలు
సాక్షి, సిద్ధిపేట జిల్లా: దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో శనివారం పోలీసులు టీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఏక కాలం లో 8 మంది టీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు చేశారు. వీరితోపాటు పలువురు రాజకీయ నాయకుల ఇళ్లలో కూడా తనిఖీచేశారు. దుబ్బాక జడ్పీటీసీ రవీందర్ రెడ్డి , ఎంపీపీ పుష్ప లత కిషన్ రెడ్డి , దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ బండి శ్రీలేఖ రాజు , ఆర్య వైశ్య సమాజ అధ్యక్షుడు చింత రాజు , సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు , సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి , కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి ,సిద్దిపేట పట్టన పార్టీ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం వారి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. చదవండి: దుబ్బాక ఉప ఎన్నిక: ఎవరి ధీమా వారిదే -
దుబ్బాక ఉప ఎన్నిక: ఎవరి ధీమా వారిదే
మేమే గెలుస్తాం.. ప్రస్తుతం దుబ్బాకలో ప్రధాన పార్టీల నాయకుల నోట ఇదే మాట. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. రామలింగారెడ్డి చేసిన సేవలు తన విజయానికి సోపానాలని, అధిక మెజార్టీతో విజయం సాధిస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, బీజేపీపై సానుకూలత నియోజకవర్గంలో నిశ్శబ్ద విప్లవంగా వ్యాప్తి చెందుతోందని, ఈసారి విజయం బీజేపీదేనని ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్రావు అంటున్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే అంటూ తమ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, టీఆర్ఎస్, బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను బేరీజు వేసుకుంటూ.. గెలుపుపై అభ్యర్థులు అంచనాలు వేసుకుంటున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 1,90,483 ఓట్లు ఉండగా.. 1,63,658 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డికి 89,112 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వర్రెడ్డికి 26,691, బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు 22,595 ఓట్లు వచ్చాయి. – సాక్షి, సిద్దిపేట భారీ మెజార్టీ సాధిస్తాం ప్రజలకు టీఆర్ఎస్పై నమ్మకం ఉంది. భారీ మెజార్టీతో విజయం సాధిస్తాను. దుబ్బాక ప్రాంతం అంటేనే వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. తాగునీరు, సాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడేవారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నా భర్త ప్రజల దాహార్తిని తీర్చారు. గోదావరి జలాల తరలింపుతో సాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటి తలుపు తట్టాయి. ప్రజల కష్టాలు తీర్చిన పార్టీగా టీఆర్ఎస్ వెంట ప్రజలు ఉన్నారు. మంత్రి హరీశ్రావు సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నా. రామలింగారెడ్డి చేసిన సేవలు చూసి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. నా విజయాన్ని ఎవరూ ఆపలేరు. – సోలిపేట సుజాత (టీఆర్ఎస్ అభ్యర్థిని) ఓటు బ్యాంకు ఉంది నియోజకవర్గంలో మా తండ్రి ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి కళ్ల ముందు కన్పిస్తోంది. నాడు వెంట ఉండి నాలుగు పర్యాయాలు అసెంబ్లీకి పంపించిన ప్రజలు ఇప్పుడు ఆయన వారసుడిగా.. నన్ను ఆదరిస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ అంటే ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నుంచి ఇప్పటి వరకు మా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా దుబ్బాకలో ఉండి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. కాంగ్రెస్కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఇలా ప్రతీ అంశం మా విజయానికి దోహద పడుతుంది. – చెరుకు శ్రీనివాస్రెడ్డి (కాంగ్రెస్ అభ్యర్థి) మార్పు ఖాయం అబద్ధాలకోరు టీఆర్ఎస్తో విసిగి పోయిన దుబ్బాక ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం వచ్చింది. ఈ విప్లవమే బీజేపీ విజయానికి సోపానం అవుతుంది. రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో దుబ్బాక ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. కానీ రాష్ట్ర ఫలాలు మాత్రం సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు అందుతున్నాయి. ఆ మూడు నియోజకవర్గాలను చూసిన వారెవ్వరూ దుబ్బాకలో టీఆర్ఎస్కు ఓటు వేయరు. దుబ్బాక నియోజకవర్గంలో 99 శాతం పల్లెలు ఉన్నాయి. పల్లెల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విరివిరిగా నిధులు ఇస్తుంది. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ చరిష్మా సిద్దిపేటలో కూడా పనిచేస్తుంది. గెలిచినా..? ఓడినా..? దుబ్బాక ప్రజల మధ్యనే ఉన్నా..? ఈ సారి దుబ్బాక గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయం. నా విజయం దాదాపు ఖాయమైంది. – రఘునందన్రావు (బీజేపీ అభ్యర్థి) -
అప్పుడే బాయి కాడ మీటర్ల జోలికి రారు
సాక్షి, మెదక్: బాయి కాడ మీటర్ల పేరుతో కేంద్రం బిల్లు తెచ్చిందని.. బోర్ల వద్ద మీటర్లు వద్దనే రైతులు.. బీజేపీని 300 ఫీట్ల లోతులో పాతి పెట్టాలని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు పిలుపునిచ్చారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా చేగుంటలో రోడ్షో, రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో కాలిపోయే మోటార్లు, పైసలు ఉంటేనే ట్రాన్స్ఫార్మర్లు వచ్చేవని, బీజేపీ ప్రభుత్వం ఏకంగా వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించేందుకు చట్టం తీసుకొచ్చిందన్నారు. ఏప్రిల్ 27న కేంద్ర ప్రభుత్వం ఉచిత కరెంటు, సబ్సిడీ కరెంటు ఇవ్వొద్దని, వ్యవసాయ మీటర్లు పెడితే రూ.2,500 కోట్లు ఇస్తామని కేంద్రం మే 17న లేఖ రాసిందన్నారు. అయినప్పటికీ.. రైతులకు ఉచిత కరెంటు అందిస్తామని కేంద్రానికి సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారన్నారు. కాళేశ్వరం నీళ్లు దుబ్బాక వరకు వచ్చాయని.. త్వరలోనే చేగుంట, శంకరంపేట మీదుగా మెదక్ వరకు అందిస్తామన్నారు. మార్కెట్ కమిటీలను ప్రైవేట్ పరం చేస్తే రైతులు ఆగమవుతారని మంత్రి తెలిపారు. వ్యవసాయాన్ని ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేయమంటే కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. తోకముడిచిన బీజేపీ నేతలు టీఆర్ఎస్ మాత్రం బీడీ కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు రూ.2 వేల పింఛన్ అందిస్తోందని చెప్పారు. కేంద్రం దేనికోసం నిధులు ఇచ్చిందో నిరూపించమంటే బీజేపీ నేతలు తోకముడిచారని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రచారంలో పరాయి నాయకులు, కిరాయి జనాలే కనిపిస్తున్నారని విమర్శించారు. దుబ్బాకలో సుజాతక్కను గెలిపిస్తే మనకు సీఎం నిధులు ఇస్తారన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ సాక్షి, సిద్దిపేట: కరోనా భయం నేపథ్యంలో దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటు వేయాలనుకునే వృద్ధులు, దివ్యాంగులకోసం భారత ఎన్నికల సంఘం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. గతంలో ఎన్నికల డ్యూటీలో ఉన్న ఉద్యోగులకు కల్పించిన పోస్టల్ బ్యాలెట్ మాదిరిగానే.. పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేమని ముందుగా తెలిపిన వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ పేపర్లు ఇచ్చి ఓటు వేసిన తర్వాత సీల్డ్ కవర్లను స్వీకరిస్తున్నారు. కాగా, ‘నవంబర్ మూడో తేదీన ఎన్నికలు ఉండగా.. పోలింగ్కు ముందే ఈ పోలింగ్ ఏంది.. ఎవరికీ సమాచారం లేకుండా ఎలా ఓట్లు వేయిస్తున్నారు’అని పలువురు నాయకులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. నార్సింగి మండల కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్లను స్వీకరిస్తున్న అధికారులను ఇలానే వెనక్కి పంపించారు. అయితే భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సేకరిస్తున్నామని, ఈ విషయం రిటర్నింగ్ అధికారి నిర్వహించిన అన్ని పార్టీల సమావేశంలో వివరించామని అధికారులు చెబుతున్నారు. 1,553 మంది పోస్టల్ బ్యాలెట్కు అంగీకారం దుబ్బాక నియోజకవర్గంలో 1,084 మంది వృద్ధులు, 469 మంది దివ్యాంగులు మొత్తం 1,553 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. వంద మంది ఓటర్లకు ఒక బృందం చొప్పున మొత్తం 15 టీమ్లను ఎంపిక చేశారు. 15 బ్యాలెట్ బాక్స్లు వీరికి అందజేశారు. ఇద్దరు ఎన్నికల నిర్వహణ ఉద్యోగులు, ఇద్దరు పోలీసులు కలిసి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారినుంచి సీల్డ్ కవర్ను సేకరిస్తున్నారు. సమాచారం లేదని అడ్డుకున్న యువకులు చెప్పాపెట్టకుండా బ్యాలెట్ బాక్సులతో వచ్చి ఓట్లు వేయించుకుంటున్నారని బీజేపీతోపాటు ఇతర పార్టీలకు చెందిన కొందరు యువకులు, నాయకులు బ్యాలెట్ బాక్సులతో వచ్చిన అధికారులను వెనక్కి పంపిన సంఘటన మంగళవారం నార్సింగి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి శ్యామల బృందం నార్సింగి మండల కేంద్రంలోని గుర్రాల చంద్రయ్య ఇంటికి వెళ్లింది. 80 సంవత్సరాలకు పైబడిన ఆయన తల్లికి ఇచ్చిన బ్యాలెట్ పేపర్ను తీసుకుంటుండగా.. అక్కడికి వచ్చిన పలువురు యువకులు.. ఎవరికీ చెప్పకుండా వచ్చారు. ఎన్నికలకు ముందు ఈ ఓటింగ్ ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంపై అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినకుండా అక్కడి నుంచి పంపించారు. రాజకీయ పార్టీల సమావేశంలోవివరించాం భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కోవిడ్ నేపథ్యంలో 80 సంవత్సరాలకు పైబడిన వారికి, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాం. పోలింగ్ స్టేషన్కు రాలేమని ముందుగా చెప్పిన వారికి బ్యాలెట్ పత్రాలను అందజేశాం. ఈ విషయం రాజకీయ పార్టీల సమావేశంలో కూడా చెప్పాం. గ్రామాల్లోకి వచ్చే పోలింగ్ అధికారులకు సహకరించాలి. సీల్డ్ కవర్లలోనే బ్యాలెట్ పత్రాన్ని స్వీకరించి సిబ్బంది బాక్స్లలో వేస్తున్నారు. – చెన్నయ్య, రిటర్నింగ్ అధికారి -
హరీశ్ వ్యాఖ్యలపై పలు అనుమానాలు: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రాదని ఆర్థిక మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి అన్నారు. హరీశ్రావు మాటలు వింటుంటే.. దుబ్బాకలో పోలింగ్ జరిగిన తర్వాత, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఈవీఎం మిషన్లు పెట్టి ఓట్లను లెక్కిస్తారేమో అనే అనుమానం కలుగుతోందని సందేహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మరణించడంతో జరిగే ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా హరీశ్రావు ఎందుకు ఇంత హైరానా పడుతున్నారో ఎవరికి అంతుబట్టడం లేదని ఫేస్బుక్లో ఆమె తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే.. దాని ప్రభావం హరీశ్ రావు మంత్రి పదవి మీద పడుతుందని సీఎం కేసీఆర్ ఏదన్నా అల్టిమేటం జారీ చేశారేమోనన్న చర్చ కూడా జరుగుతోందని విజయశాంతి చెప్పుకొచ్చారు. అందుకే తెలంగాణ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావు, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మెదక్ జిల్లాకు కేటాయించిన నిధుల కంటే.. దుబ్బాకలో ఓటర్లను కొనేందుకు ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కువగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు. -
దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడు
-
దుబ్బాక ఉప ఎన్నికపై ఈసీ స్పెషల్ ఫోకస్
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టింది. రాజకీయ నేతల ఫిర్యాదుతో ఈ ఎన్నికలకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించింది. శాంతి భద్రతల పరిశీలకుడిగా తమిళనాడుకు చెందిన ఐపీఎస్ అధికారి సరోజ్ కుమార్ నియమితులయ్యారు. కాగా దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయం జోరందుకున్నది. బీజేపీ వర్సెస్ అధికార పార్టీ టిఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్టుగా ఓట్లు రాబట్టేందుకు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారం కొనసాగిస్తున్నాయి. దీంతో దుబ్బాక నియోజకవర్గంలో ఉప పోరు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్ర నేతలంతా దుబ్బాకలో మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక జరగనుండగా, 10న ఓట్ల లెక్కింపు, విజేతను ప్రకటిస్తారు. (చదవండి : ఉపఎన్నిక.. ‘దుబ్బాక’ కాక) -
డీకే అరుణ ఇంటి వద్ద హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: సిద్ధిపేట ఘటనకు నిరసనగా అధికార టీఆర్ఎస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏబీవీపీ, బీజేవైఎం ‘ఛలో ప్రగతిభవన్’కు పిలుపునిచ్చాయి. దీంతో ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు ప్రగతిభవన్ వద్ద భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. అదే విధంగా పలువురు బీజేపీ నేతలను హౌజ్అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, మోత్కుపల్లి నరసింహులు ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. హైడ్రామా.. ప్రగతి భవన్కు వెళ్లవద్దు ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. దుబ్బాక ప్రచారానికి వెళ్లాలని అరుణ పట్టుబట్టగా.. ఇంటిని వీడే బయటకు వెళ్లేందుకు వీల్లేదంటూ అడ్డుకున్నారు. అయితే ఆమె ఏమాత్రం వెనక్కితగ్గలేదు. ప్రచారానికి వెళ్లకుండా ఎందుకు ఆపుతున్నారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎట్టకేలకు దిగి వచ్చిన పోలీసులు, దుబ్బాక ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు డీకే అరుణకు అనుమతినిచ్చారు. ప్రగతి భవన్కు వెళ్లవద్దని సూచిస్తూ.. ఎస్కార్ట్ వాహనం ఇచ్చి పంపించారు.(చదవండి: సీపీని సస్పెండ్ చేయాలి: బండి సంజయ్ ) అదే విధంగా మోత్కుపల్లికి కూడా దుబ్బాక వెళ్లేందుకు అనుమతినిచ్చారు. మరోవైపు.. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో నోట్లకట్టల కలకలం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్టు ఘటనలపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల కమిషన్ను కలవనున్నారు. సిద్ధిపేట ఘటనపై పరస్పర ఫిర్యాదులకు సిద్ధమయ్యారు. -
ఈ ఎన్నిక కాంగ్రెస్కు చావోరేవో!
సాక్షి, మెదక్: దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చావోరేవో లాంటిదని, ఆరునూరైనా గెలిచి తీరాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ అన్నారు. మెదక్ జిల్లాలోని చేగుంట మండలం శివనూర్లో మంగళవారం దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంట, నార్సింగి మండలాల బూత్ ఇన్చార్జీల సమావేశంలో ఠాగూర్ మాట్లాడారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీ గతానికి భిన్నంగా ప్రచార వ్యూహాలను అమలు చేస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులను బూత్ కమిటీ ఇన్చార్జీలుగా నియమించినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. ఈ ఎన్నిక తెలంగాణ కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకమని, ఇక్కడ ఫలితాన్ని అనుకూలంగా రాబట్టి కొత్త ఉత్సాహంతో భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. ఇన్చార్జీలు ఎవరూ వారికి అప్పగించిన గ్రామాలు, మండలాల నుంచి బయటకు రావొద్దని ఆదేశించారు. దుబ్బాక ఉపఎన్నికలో విజయం సాధిస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో ఈసారి పాత సంప్రదాయానికి భిన్నంగా కాంగ్రెస్ ప్లాన్ చేసిందన్నారు. నియోజకవర్గంలోని 146 గ్రామాలకు పీసీసీలోని 146 మంది ముఖ్యనాయకులను ఇన్చార్జీలుగా నియమించామన్నారు. ఇక ఏడు మండలాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కీలక నేతలకు ఇన్చార్జీలుగా బాధ్యతలు అప్పగించినట్లు ఆయన వివరించారు. -
‘దుబ్బాకలో కాంగ్రెస్ ఖాళీ’
సాక్షి, సిద్దిపేట: దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. తమ పార్టీ అభ్యర్థికి కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. శుక్రవారం దుబ్బాక మండల కేంద్రంలో పీసీసీ ప్రచార కార్యదర్శి వెంకట నర్సింహారెడ్డి, సీనియర్ నేత మోహన్రావు రెండు వేల మంది కార్యకర్తలతో కలసి మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికలప్పుడే కాంగ్రెస్ నేతలకు ప్రజలు గుర్తుకొస్తారని విమర్శించారు. ‘వానాకాలం వస్తే ఉసిళ్లు వస్తాయి.. ఎన్నికలు వచ్చినప్పుడే గ్రామాలకు కాంగ్రెస్ నాయకులు వస్తారు’అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ను విడిచి పెట్టి రారని, గత ఎన్నికల్లో ప్రచారం కోసం వచ్చిన వారు ఇప్పటి వరకు దుబ్బాక ప్రజల గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల మధ్యనే ఉండే టీఆర్ఎస్ నాయకులు కావాలా..? హైదరాబాద్లో ఉండి ఎన్నికలప్పుడే వచ్చే కాంగ్రెస్ నాయకులు కావాలా? అని ప్రజలను అడిగారు. ముఖ్యమంత్రి ప్రతి అడుగు అన్నదాత సంక్షేమం కోసం వేస్తున్నారన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో రైతులు పండించిన ‘మక్క’లు మోరీలో వేయాల్సిన దుస్థితి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. -
ముచ్చటగా మూడోసారి బరిలో: ఈసారైనా..!
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికలో ఏ పార్టీ నుంచి ఎవరికి టికెట్ వస్తుందోనన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. అధికార టీఆర్ఎస్ పార్టీ అందరికన్నా ముందుగా తమ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత పేరును ప్రకటించింది. మంగళవారం బీజేపీ అభ్యర్థిగా రఘునందన్రావు పేరును ఆ పార్టీ జాతీయ ఎన్నికల కమిటీ ప్రకటించింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్రెడ్డి పేరును ఖరారు చేస్తూ ఏఐసీసీ నుంచి బుధవారం ప్రకటన విడుదల చేశారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో నామినేషన్ల దాఖలు, ప్రచార వ్యూహాలపై నేతలు కసరత్తు ప్రారంభించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వచ్చినా చివరకు అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అందరూ ఊహించినట్లుగానే సుజాత పేరును ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ముందుగా వెంకటనర్సింహారెడ్డి, తర్వాత శ్రావణ్కుమార్ రెడ్డి, అనంతరం శ్రీనివాస్రావు, నర్సారెడ్డి పేర్లు వినిపించాయి. చివరకు నర్సారెడ్డి పేరును ఖారారు చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్ మరో ఆలోచనగా మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడిని పోటీలో దింపాలనే ఆలోచనకు వచ్చింది. ఇందుకు అనుగుణంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించి.. శ్రీనివాస్రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 55 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏఐసీసీ నుంచి అభ్యర్థుల జాబితా విడుదలైంది. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ దుబ్బాక నియోజకవర్గంపై కన్నేసింది. ఇందులో భాగంగానే రెండు నెలలుగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్రావు నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారం ప్రారంభించారు.(పట్టుబడ్డ నగదు: వివాదంలో రఘునందన్) ముచ్చటగా మూడోసారి బరిలో.. అయితే ఈ సారి తనకు టికెట్ ఇవ్వాలని జిల్లా కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలాకర్ రెడ్డి ఆశించడంతో ఇద్దరి మధ్య పోటీ పెరిగింది. ఈ విషయంపై తర్జనభర్జన చేసిన అధినాయకత్వం రఘునందన్రావును ప్రకటించారు. 2014,18 వరుస ఎన్నికలతో పాటు గత లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓటమి చవిచూసిన రఘునందన్ ఈసారి ఎలాగైన విజయం సాధించి తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టాలని ఆతృతగా ఉన్నారు. దుబ్బాక అసెంబ్లీ స్థానంలో ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగిన ఆయనకు ఉప ఎన్నిక ఎలాంటి ఫలితానిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతో పోల్చుకుంటే రఘునందన్ ప్రచారంలో ఓ అడుగు ముందే ఉన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్రావుతో పాటు కేటీఆర్లపైనే ఆయన ప్రధానంగా విమర్శలు గుప్పిస్తున్నారు. సిద్దిపేట, సిరిసిల్లపై ఉన్న ప్రేమ టీఆర్ఎస్ నేతలకు దుబ్బాకపై లేదని, ప్రశ్నించే గొంతుకగా తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లును అభ్యర్థిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడే పోటీ చేసి ఓటమి చవిచూసిన తనపై ఈసారి దుబ్బాక ఓటర్లు సానూభూతి చూపిస్తారని, మొదటి సారి అసెంబ్లీలోఅడుగుపెట్టే అవకాశం దక్కడం ఖాయమని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ముమ్మరంగా ప్రచారం.. ఉప ఎన్నికలో మొదటి ఘట్టం అభ్యర్థుల ప్రకటన దాదాపుగా పూర్తయింది. దీంతో నామినేషన్ల స్వీకరణ, ప్రచార వ్యూహాలపై కసరత్తు ప్రారంభించారు. 9వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉండటంతో.. ఎప్పుడు నామినేషన్ వేయాలి? ఎంత మందితో వేయాలి? నామినేషన్లు వేసే ప్రక్రియకు ఎవరు హాజరు అవుతారు అనే విషయంపై అన్ని పార్టీల్లో చర్చ సాగుతోంది. అదేవిధంగా నామినేషన్ వేసిన తర్వాత ఇరువై రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఇప్పటి నుంచే ప్రచా ర వేగం పెంచారు. టీఆర్ఎస్ గెలుపు బాధ్యత భుజాన వేసుకున్న మంత్రి హరీశ్రావు రెండు రోజులుగా అభ్యర్థి సుజాతతో కలిసి ప్రచారంలో వేగం పెంచారు. బీజేపీ నుంచి రఘునందన్రావు ఒంటరి పోరాటం చేస్తూ ప్రచారం ము మ్మరం చేశారు. మంగళవారం గాంధీ భవన్లో శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరడమే ఆలస్యంగా బుధవారం సిద్దిపేటలో మాజీ ఎంపీ హనుమంతరావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ప్రచారం ప్రారంభించారు. -
పోలింగ్ ప్రశాంతం
న్యూఢిల్లీ/చండీగఢ్/ముంబై: దేశంలో మినీ అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. మహారాష్ట్రలో 288, హరియాణాలో 90 అసెంబ్లీ స్థానాలతోపాటు వివిధ రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ స్థానాలకు రెండు పార్లమెంటు స్థానాలకు సోమవారం పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. మహారాష్ట్రలో 60.46% మంది, హరియాణాలో 65% మంది తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. క్యూల్లో ఓటర్లు నిలుచుని ఉన్నందున ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. 51 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో దాదాపు 57% పోలింగ్ నమోదైందని వెల్లడించింది. కేరళలో భారీగా వర్షం కురిసినప్పటికీ ప్రజలు ఓటింగ్లో ఉత్సాహంగా పాల్గొన్నట్లు తెలిపింది. కాగా, ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. సాయంత్రం 6 గంటల సమయానికి మహారాష్ట్రలో 60.46% పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో 63.38% పోలింగ్ నమోదు కావడం విశేషం. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపారు. ముంబైలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీతోపాటు వచ్చిన ఓ వృద్ధుడు తన ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ‘ఈ రోజు హీరో ఖన్నా సాబ్. ఆర్మీలో పనిచేసిన ఈయన వయసు 93 ఏళ్లు. ఓటేయడానికి వచ్చారు. ఇది అందరికీ స్ఫూర్తినిచ్చే అంశం’ అంటూ ఇరానీ పేర్కొన్నారు. హరియాణాలో 65% నమోదు గత ఎన్నికలతో పోలిస్తే హరియాణాలో ఈసారి తక్కువ మంది ఓటేశారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 65% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం పేర్కొంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇది 76.54% కాగా, 2019 లోక్సభ ఎన్నికల్లోనూ 70.36% మంది ఓటు హక్కు వినియోగించుకోవడం గమనార్హం. పోలింగ్పై ఫిర్యాదులు.. అపశ్రుతులు ఉల్లంఘనలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 250 వరకు ఫిర్యాదులు చేసిందని ఎన్నికల సంఘం తెలిపింది. రాంటెక్ నియోజకవర్గంలో ఓ వ్యక్తి ఈవీఎంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్తు బటన్ నొక్కగా బీజేపీకి ఓటు పడినట్లు చూపినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పుర్సల్ గొండి గ్రామంలో ఎన్నికల విధులకు వెళ్తూ బాపు పాండు గవాడే(45) అనే ఉపాధ్యాయుడు మరణించాడు. భోసారి నియోజకవర్గంలో అబ్దుల్ రహీం షేక్(62) ఓటేసేందుకు వచ్చి అకస్మాత్తుగా తుదిశ్వాస విడిచాడు. ఉప ఎన్నికల్లో మోస్తరు ఓటింగ్ దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 56.84% పోలింగ్ నమోదైంది. అతితక్కువగా ఉత్తరప్రదేశ్లో 47.05% మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేరళలో ముఖ్యంగా ఎర్నాకులంలో భారీ వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచినప్పటికీ ఓటర్లు వెనుకంజవేయలేదు. ఇక్కడ 53.27% మంది ఓటేశారు. కేరళలో అత్యధికంగా అరూర్లో 75.74% ఓటింగ్ నమోదైంది. కాగా, అరుణాచల్ప్రదేశ్లో ఖోన్సా వెస్ట్ నియోజకవర్గంలో అత్యధికంగా 90% ఓటింగ్ నమోదైంది. ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో 74%, తెలంగాణలోని హుజూర్నగర్లో 84% మంది ఓటు వేశారు. తమిళనాడులోని విక్రవండి నియోజకవర్గంలో 84.36%, గుజరాత్లో 51%, బిహార్లో 49.50% పంజాబ్లో 60%, రాజస్తాన్లో 66% పోలింగ్ నమోదైంది. వ్యాపార దిగ్గజాలు పోలింగ్కు దూరం టాటా గ్రూప్నకు చెందిన రతన్ టాటా, ఎన్. చంద్రశేఖరన్, అంబానీ సోదరులు, సజ్జన్ జిందాల్ వంటి వ్యాపార దిగ్గజాలు సోమవారం ఓటింగ్కు దూరంగా ఉన్నారు. అయితే, చాలా ముఖ్యమైన పనుల్లో వారు వేరే ప్రాంతంలో బిజీగా ఉన్నందునే ఓటెయ్య లేకపోయారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సాధారణంగా ముకేశ్, అనిల్ అంబానీ సోదరులు తమ కుటుంబాలతో కలిసి వచ్చి ఓటు వేస్తుంటారు. కానీ, ఈసారి వారు రాలేదు. అందుకు కారణాలు కూడా వెల్లడి కాలేదు. సోమవారం పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ వ్యాపార వేత్తల్లో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ సీఈవో కేకి మిస్త్రీ, మరికో చైర్మన్ హర్‡్ష మరివాలా, ఎం అండ్ ఎం ఎండీ పవన్ గోయెంకా ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాల్లో ఒక ముంబై మహానగరానికి సంబంధించి 38 నియోజకవర్గాలున్నాయి. ముంబైలో ఓటు వేసిన బాలీవుడ్ నటులు ఆమిర్ ఖాన్, దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్ ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు, ఊర్మిళా మతోండ్కర్, మాజీ క్రికెటర్ సచిన్, అంజలి దంపతులు -
‘హుజూర్’లో ముందంజ
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికలో పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేల ప్రకారం కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ ఎంతో ముందంజలో ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. హుజూర్నగర్లో ఉప ఎన్నిక ప్రచారం తీరుతెన్నులపై పార్టీ ఇన్చార్జిలు, సీనియర్ నేతలతో శనివారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ ఇన్చార్జిలతో పాటు, ఇతర నేతల నుంచి ప్రచారం జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇంటింటికీ పార్టీ ప్రచారం చేరాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు.. ప్రజల నుంచి టీఆర్ఎస్కు అనూహ్య మద్దతు లభిస్తోందని, పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేల్లో కనీసం 50 శాతం ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా పోలవుతాయని కేటీఆర్ వెల్లడించారు. గత ఎన్నికల్లో పార్టీ ఎన్నికల చిహ్నం కారును పోలివున్న ట్రక్కు గుర్తుతో టీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారని పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ కొన్ని వాహనాలకు సంబంధించిన ఇతర గుర్తులు ఉన్నందున.. పార్టీ చిహ్నాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డమ్మీ ఈవీఎంలు ఉపయోగించాలని పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్కు ప్రచారాంశాలు కరువు.. ‘టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్నగర్కు లాభం’ నినాదంతో చేస్తున్న ప్రచారానికి ప్రజల మద్దతు లభిస్తోందని, అదే సమయంలో కాంగ్రెస్కు ప్రచారాంశాలు లేకుండా పోయాయని పార్టీ నేతలతో కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో లేకున్నా.. కేంద్ర నిధులతో హుజూర్నగర్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి చేస్తున్న ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యత లేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుత ఉప ఎన్నికతో బీజేపీ బలం తేలిపోతుందని, డిపాజిట్ దక్కితే అదే వారికి అతిపెద్ద ఉపశమనమన్నారు. ప్రజాభిమానం పొందలేని బీజేపీ.. కాంగ్రెస్కు పరోక్షంగా సహకరిస్తూ దొంగ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. హుజూర్నగర్ ప్రచారానికి కేటీఆర్ దూరం..? దసరా తర్వాత హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో కేటీఆర్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తొలుత వెల్లడించాయి. నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత ఈ నెల 4న హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన రోడ్షోలో కేటీఆర్ పాల్గొన్నారు. తిరిగి ఈ నెల 10 నుంచి నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్షోలలో పాల్గొంటారని ప్రచారం జరగ్గా.. చివరి నిమిషంలో పర్యటన షెడ్యూల్ రద్దయింది. కాగా, హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో కేటీఆర్ పాల్గొనే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడిం చాయి. ఈ నెల 19న ఉప ఎన్నిక ప్రచారం ముగియనుండగా.. సీఎం కేసీఆర్ ఈ నెల 18న జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని ప్రచారం జరిగింది. అయితే సీఎం కేసీఆర్ ప్రచారానికి సంబంధించి ఇప్పటివరకు షెడ్యూల్ ఖరారు కాలేదు. -
ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు సీపీఐ మద్దతు!
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికను తెలంగాణ అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే ఉన్నప్పటికీ బరిలో నిలిచేందుకు అన్ని రాజకీయ పక్షాలు పోటీపడుతున్నాయి. అయితే గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ పదునైన వ్యూహాలను రచిస్తోంది. దీనిలో భాగంగానే సీపీఐ మద్దతును కోరింది. ఈ మేరకు టీఆర్ఎస్ నేతలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, వినోద్ కుమార్లు ఆదివారం హైదరాబాద్లోని సీపీఐ కార్యాలయంలో చాడా వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. ఉప ఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తాము ఇక్కడి వచ్చినట్లు టీఆర్ఎస్ పార్టీ నేతలు తెలిపారు. వారి రాకను స్వాగతించిన చాడ వెంకట్రెడ్డి.. మంగళవారం జరిగే సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన అనంతరం తమ నిర్ణయం తెలుపతామని ప్రకటించారు. యూరేనియం విషయంలో సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్ర అభివృద్ధే తమ లక్క్ష్యమని చాడా అభిప్రాయపడ్డారు. కాగా ప్రధాన పోటీదారులపై కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా బీజేపీ, టీడీపీ కూడా అభ్యర్థులను బరిలో నిలిపాయి. సీపీఎం కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. దీంతో హుజూర్నగర్ ఉప ఎన్నిక ఉత్కంఠగా మారింది. -
ఒక్క స్థానం.. 18 వేలమంది బందోబస్త్
రాయ్పూర్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్గఢ్లోని దంతెవాడ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 21న పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఏకంగా 18వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పోలీసుశాఖ తెలిపింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా దంతేవాడ ఎమ్మెల్యే అయిన భీమా మాండవిని గత ఏప్రిల్లో మావోయిస్టులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మావోయిస్టులకు ప్రధాన కేంద్రంగా ఉన్న దంతెవాడలో ఎన్నిక నిర్వహణ అంతా సులభమైన విషయం కాదు. అలాగే మావోయిస్టుల కదలికలను పసిగట్టేందుకు డోన్ల సహాయం కూడా తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
జనవరి 28న తిరువారుర్ ఉప ఎన్నిక
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరువారుర్ అసెంబ్లీ స్థానానికి జనవరి 28న ఉప ఎన్నికలు జరగనున్నాయి. 31న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటన చేసింది. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మరణించడంతో ఈ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. తిరువారుర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన కరుణానిధి ఆగస్టు 7న కన్నుమూశారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 3న విడుదల చేస్తామని తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి సత్యబ్రతా సాహు తెలిపారు. అప్పటి నుంచి తిరువారుర్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు. నామినేషన్ల దాఖలు చేయడానికి చివరి తేది జనవరి 10. తర్వాతి రోజు నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 14. ఈవీఎంలు, వీవీప్యాట్లను వినియోగించనున్నట్టు ఈసీ తెలిపింది. -
కర్ణాటకలో బీజేపీకి షాకిచ్చిన అభ్యర్థి
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఉప ఎన్నికలకు ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ఎల్ చంద్రశేఖర్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. పార్టీ నేతలు తన గెలుపునకు కృషి చేయలేదని, ప్రచారం కూడా నిర్వహించకుండా తననో బలిపశువును చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూ పోటీ నుంచి విరమించుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ ఎన్నికలో తాను జేడీఎస్- కాంగ్రెస్ కూటమి అభ్యర్థి అనితా కుమారస్వామికి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో అనితా కుమారస్వామి గెలుపు నల్లేరు మీద నడకే కానుందని కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన సీఎం కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రలోభాలకు గురిచేసి విజయం సాధించాలనుకోవడం బీజేపీ నైజమని వ్యాఖ్యానించారు. అయితే ఒక్కోసారి వారి వ్యూహాలు ఇలాగే బెడిసి కొడతాయని ఎద్దేవా చేశారు. కాగా ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి జేడీఎస్- కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. చెన్నపట్నం, రామ్నగర స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందిన హెచ్డీ కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన రామనగర అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. రామ్నగరతో పాటు జంఖాడీ అసెంబ్లీ స్థానం, బళ్ళారి, శివమెగ్గ, మండ్యా లోక్సభ స్థానాలకు శుక్రవారం ఉప ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. -
జయనగరలో పోలింగ్ ప్రశాంతం
జయనగర: బెంగళూరులోని జయనగర నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలో 55 శాతం పోలింగ్ నమోదైంది. జయనగర బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్కుమార్ అకస్మికంగా చనిపోవడంతో ఇక్కడ మే 12న జరగాల్సిన ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఈ ఎన్నికలో బీజేపీ తరఫున విజయ్ సోదరుడు ప్రహ్లాద, కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్య పోటీ పడ్డారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సౌమ్యాకు జేడీఎస్ మద్దతు ప్రకటించింది. జూన్ 13న ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. -
ఈసీకి శివసేన లేఖ
సాక్షి, ముంబై: పాల్ఘడ్ లోక్సభ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఓటర్లకి డబ్బులు పంచుతుందని శివసేన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ‘ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార బలంతో బీజేపీ ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తోంది. బీజేపీ ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తోంది. బీజేపీ అభ్యర్థి రాజేందర్ రావిట్ను అనర్హుడిగా ప్రకటించాలి’ అని శివసేన ఈసీకి రాసిన లేఖలో పేర్కొంది. బీజేపీ డబ్బులు పంచడం తమ కార్యకర్తలు చూశారని, ఎన్నికల సంఘం అధికారుల తనిఖీలో కూడా బీజేపీ నేతలు పట్టబడ్డారని శివసేన ఎమ్మెల్యే అమిత్ ఘోడా ఆరోపించారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శివసేన, బీజేపీ ఈ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్డీఏ కుటమి నుంచి బయటకు వచ్చిన శివసేన పాల్ఘడ్ ఉప ఎన్నికల్లో ఇరు పార్టీలు వేర్వురుగా అభ్యర్థులను నిలిపిన విషయం తెలిసిందే. -
ఉపఎన్నిక ముఖ్యమంత్రికి సవాలే
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్... ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ నుంచి కొత్త సవాల్ను ఎదుర్కొంటున్నారు. ఆర్డేడీ-కాంగ్రెస్ కూటమి నుంచి విడిపోయి ఎన్డీఏలో చేరిన జేడీయూ ఇటీవల జరిగిన ఆరారియా లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. త్వరలో జరుగనున్న జోకిహత్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఇప్పుడు నితీష్కు సవాలుగా మారింది. వచ్చేవారం జోకిహత్ ఉపఎన్నిక జరుగనుండడంతో క్యాబినెట్ మంత్రులందరిని నియోజకవర్గంలో మోహరించారు. జేడీయూ అభ్యర్ధి ముర్షిద్ ఆలంపై ఒక గ్యాంగ్ రేప్తో సహా ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయి. తేజస్వీపై అవినీతి కేసులు ఉన్నాయన్న ఆరోపణలతో కూటమి నుంచి బయటకు వెళ్లిన నితీష్ ఇప్పుడు క్రిమినల్స్కి పార్టీ టిక్కెట్లు ఇస్తున్నారని ఆర్జేడీ విమర్శిస్తోంది. జోకిహత్ ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలం ఆరారియా లోక్సభ నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికవ్వడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమయింది. జేడీయూ నుంచి ముర్షిద్ ఆలం పోటీ చేస్తుండగా, మాజీ ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలం సోదరుడు షానవాజ్ ఆలంను ఆర్జేడీ పోటీలో నిలిపింది. ప్రచారంలో భాగంగా శుక్రవారం ఓ సమావేశంలో మాట్లాడిన తేజస్వీ నితీష్పై విమర్శల వర్షం కురిపించారు. నితీష్ రాష్ట్రానికి సీఎం అయినా కూడా పరిపాలనంతా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవాత్ కనుసన్నలో నడుస్తోందని విమర్శించారు. నితీష్ బీజేపీతో కలిసిన కూడా విజయం తమదేనని తేజస్వీ ధీమా వ్యక్తం చేశారు. జేడీయూ-బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో మతతత్వ ఘర్షణలను ప్రోత్సహిస్తోందని అన్నారు. ఇటీవల భాగల్పూర్లో జరిగిన ఘర్షణలో కేంద్రమంత్రి అశ్విని చోబే కుమారుడు ఉన్నా కూడా ప్రభుత్వం అతనిపై ఏలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. -
బీజేపీ ఒక హంతక పార్టీ : శివసేన
సాక్షి, ముంబై : ఈనెల(మే) 28న జరగనున్నపల్ఘార్ ఉప ఎన్నికలో గెలుపొందడమే లక్ష్యంగా బీజేపీ, శివసేన పార్టీలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. పల్ఘార్లో అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా శివసేన.. బీజేపీని మోసం చేసిందంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఫడ్నవిస్ ఆరోపణలపై స్పందించిన శివసేన.. ‘ఉన్మాదిగా మారిన బీజేపీ తనకు అడ్డొచ్చిన వారందరినీ నరికి వేసుకుంటూ వెళ్లే ఒక హంతక పార్టీ’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈమేరకు తన పత్రిక సామ్నాలో ఓ వ్యాసాన్ని కూడా ప్రచురించింది. ‘పల్ఘార్ ఎంపీ చింతమన్ వనగా మరణం పట్ల బీజేపీ జాతీయ నాయకులెవరూ కనీసం సానుభూతి వ్యక్తం చేయలేదు. ఆయన కుటుంబాన్ని కూడా ఎవరూ పరామర్శించలేదు. ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వకుండా.. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన మరొకరికి అవకాశం ఇచ్చారు. ఇలా చేయడం ద్వారా ఫిరాయింపులను ప్రోత్సహించడం తమ ప్రజాస్వామిక హక్కుగా బీజేపీ భావిస్తున్నట్టుంది. కర్ణాటక ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనమంటూ’ శివసేన ఎద్దేవా చేసింది. అంతేకాకుండా బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు మహారాష్ట్రకు వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై కూడా శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ప్రచారంలో భాగంగా మరాఠ వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసే సమయంలో కపట నాయకుడు యోగి చెప్పులు కూడా విప్పకుండా ఆయనను అవమానించారు. తద్వారా ఛత్రపతి వంటి యోధులను బీజేపీ ఎంత గౌరవిస్తుందో ఇట్టే అర్థమైపోతుందంటూ’ సామ్నాలో పేర్కొంది. కాగా, ఈ ఏడాది జనవరి 30న బీజేపీ ఎంపీ ఎంపీ చింతమన్ వనగా మరణించిన నేపథ్యంలో పల్ఘార్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇందులో భాగంగా తమ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ మాజీ నేత రాజేంద్ర గవిట్ను బీజేపీ నిలబెట్టింది. అంతేకాకుండా పల్ఘార్లో తమకు పోటీగా అభ్యర్థిని నిలబెట్టవద్దంటూ శివసేనను కోరింది. అయితే బీజేపీ మాటను లెక్కచేయకుండా రాజేంద్ర గవిట్కు పోటీగా.. చింతమన్ కుమారుడు శ్రీనివాస్ను నిలబెట్టి బీజేపీకి గట్టి షాక్ ఇచ్చింది. -
మోదీ అహంకారం వల్లే.. ఈ ఫలితాలు!
పట్నా: ఉత్తరప్రదేశ్, బిహార్ ఉప ఎన్నికల్లో బీజేపీ పరాభవం నేపథ్యంలో సొంత పార్టీపై ఎంపీ శత్రుఘ్న సిన్హా మరోసారి నిప్పులు చెరిగారు. బీజేపీ అధినాయకత్వం అహంకారం, అతి విశ్వాసం, షార్ట్టెంపర్ కారణంగానే ఈ పరాభవం ఎదురైందంటూ పరోక్షంగా ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. ‘ప్రజాస్వామ్య రాజకీయాల్లో అహంకారం, అతి విశ్వాసం, అతి కోపం పతనానికి దారితీస్తాయని నేను పదేపదే చెప్తూ వస్తున్నాను. ఇవి ట్రంప్ లేదా, మిత్రోం లేదా, ప్రతిపక్ష నాయకులు ఎవరి నుంచి వచ్చినా ప్రమాదమే’ అని శత్రుఘ్న ట్వీట్ చేశారు. మిత్రోం అంటూ ప్రధాని మోదీ ప్రసంగించే సంగతి తెలిసిందే. అదేవిధంగా బీజేపీకి రానున్నది కష్టకాలమేనని, ఇప్పటికైనా బీజేపీ అధినాయకత్వం (ప్రధాని మోదీ, అమిత్షా) మేలుకోవాలని హితవు పలికారు. ‘మన వ్యక్తులు, శ్రేణులు త్వరగా సీటు బెల్టు సర్దుకోవాల్సిన అవసరాన్ని యూపీ, బిహార్ ఫలితాలు చాటుతున్నాయి. రానున్నది సంక్షోభకాలం. ఈ సంక్షోభం నుంచి ఎంత త్వరగా బయటపడితే.. అంత మంచిదని కోరుకుంటూ మనం ప్రార్థించాలి. ఈ ఫలితాలు మన భవిష్యత్తు గురించి సంకేతాలు ఇస్తున్నాయి. వీటిని తేలికగా తీసుకోకూడదు’ అని ఆయన ట్వీట్ చేశారు. 2019 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్గా భావించిన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్, ఫుల్పూర్ లోక్సభ ఉప ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఎస్పీ, బీఎస్పీ కూటమి ఇక్కడ ఘనవిజయాలు సాధించింది. అటు బిహార్లోనూ బీజేపీ-జేడీయూ కూటమిని మట్టికరిపిస్తూ ఆర్జేడీ విజయాలు సాధించింది. ఈ ఫలితాలు బీజేపీ అధినాయకత్వంలో తీవ్ర ఆంతర్మథనానికి కారణయ్యాయి. -
బీజేపీకి తిప్పలు.. విపక్షాల మెప్పులు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడంతో కమలనాథులు ఇరుకునపడ్డారు. ఇదే అదునుగా మిత్రపక్షాలు, విపక్షాలు కాషాయ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. బీజేపీ, నరేంద్ర మోదీ పనైపోయిందని ఎద్దేవా చేశాయి. మరోవైపు విపక్షాలు పరస్పరం ప్రశంసించుకున్నాయి. శివసేన విసుర్లు ఆదిత్యనాథ్ యోగి పాలనను ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని బీజేపీ మిత్రపక్షం శివసేన వ్యాఖ్యానించింది. బీజేపీ గొప్పలు చెప్పుకోవడం మానేయాలని, ఒక్క నరేంద్ర మోదీ చరిష్మాతోనే ఎన్నికల్లో గెలవలేరని హితవు పలికింది. రోజులు దగ్గరపడ్డాయి: కాంగ్రెస్ రైతులు, యువత, మహిళా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. దీనికి యూపీ, బిహార్ లోక్సభ ఉప ఎన్నికల ఫలితానే నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. మమత అభినందనలు అఖిలేశ్యాదవ్, మాయావతికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. బీజేపీ పాలనకు చరమగీతం పాడేందుకు ముందడుగు పడిందని ఆమె ట్వీట్ చేశారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు కూడా మమత అభినందనలు తెలిపారు. బీఎస్పీకి థ్యాంక్స్ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్, పూల్పూర్లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంలో బహుజనసమాజ్వాదీ పార్టీ కార్యకర్తల పాత్ర ఎంతో ఉందని సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ ప్రశంసించారు. బీఎస్పీ నాయకత్వానికి ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. -
లాఠీఛార్జ్లో ఎమ్మెల్యే అభ్యర్థికి గాయాలు!
సాక్షి, భోపాల్: పోలీసుల లాఠీఛార్జ్లో తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాయపడ్డారని అందుకు బీజేపీనే కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని కొలారస్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఫిబ్రవరి 24న ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ పార్టీ అభ్యర్థి తరపున బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ కుశ్వాహ ప్రచారం ముగించుకుని వెళ్తుండగా గురువారం సాయంత్రం 5గంటలకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎస్యూవీ కారును అడ్డుకున్నారు. కారులో డబ్బు, ఇతరత్రా ఏమైనా ఉన్నాయో చెక్ చేయాలంటూ పోలీసులను కాంగ్రెస్ కార్తకర్తలు పట్టుబట్టారు. కుశ్వాహ డ్రైవర్ వేగం పెంచి కారును అక్కడినుంచి తీసుకెళ్లారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది తెలిపారు. అదేసమయంలో తీవ్ర ఆవేశానికి లోనైన తమ పార్టీ కార్తకర్తలు బీజేపీ ఎమ్మెల్యే కారుపై రాళ్లు రువ్వగ పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహేంద్ర సింగ్ యాదవ్ తమ కార్తకర్తలను కలుసుకునేందుకు లాఠీఛార్జ్ జరిగే ప్రదేశానికి వెళ్లగా ఆయనపై కూడా పోలీసులు లాఠీ పవర్ చూపించారని పంకజ్ చతుర్వేది చెప్పారు. లాఠీఛార్జ్లో ఎమ్మెల్యే అభ్యర్థి మహేంద్రకు గాయాలుకాగా, చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు వివరించారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే కుశ్వాహ కాంగ్రెస్ కార్తకర్తలపై ఫిర్యాదు చేశారు. తనను అడ్డగించిన కార్తకర్తలు, రాళ్లతో తన వాహనంపై దాడి చేసి ధ్వంసం చేశారని కుశ్వాహ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్పీ, అసిస్టెంట్ కలెక్టర్ కేసు దర్యాప్తు చేస్తున్నారని కలెక్టర్ తరుణ్ రాటీ తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలు ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ లో లాఠీఛార్జ్పై ఫిర్యాదు చేశారు. -
కాంగ్రెస్కు షాక్.. బీజేపీలోకి ఫిల్మ్ స్టార్స్!
సాక్షి, భువనేశ్వర్: ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నటి అపరాజిత మహంతీ తన భవిష్యత్ కార్యాచరణ ప్రారంభించారు. కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, మరికొందరు పార్టీ సీనియర్ల సమక్షంలో ఒడిషా నటి బీజేపీలో చేరారు. రాజధాని భువనేశ్వర్లో జరిగిన సమావేశంలో అపరాజిత బీజేపీలో చేరడం కాంగ్రెస్కు మింగుడు పడటం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని చూసి తాను ఎంతో నేర్చుకున్నానని, మోదీ హాయాంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆమె ఆకాంక్షించారు. మోదీ పాలనలో చేపడుతున్న అభివృద్ధి పథకాలు తనను బీజేపీ చేరేందుకు ఆకర్షించాయని నటి అపరాజిత మహంతీ తెలిపారు. అపరాజిత చేరికతో బీజేపీ మరింత బలోపేతం అయిందన్నారు. బిజేపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అరపున అపరాజిత ప్రచారం చేస్తారని పార్టీ నేతలు చెప్పారు. అపరాజితతో పాటుగా మరికొందరు ఒడిషా ఫిల్మ్ స్టార్లు మిహిర్ దాస్, అను చౌదరి, మహస్వేతా రేలు కాషాయ పార్టీలో చేరడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతున్నట్లు సమాచారం. ఈ నటీనటులు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసి బీజేపీకి విజయం అందిస్తారని రాష్ట్ర పార్టీ అధిష్టానం భావిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన నటి ఈ నెల 13న పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కటక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసిన ఆమె బీజేడీ అభ్యర్థి భర్తృహరి మహతాబ్ చేతిలో పరాజయం పాలయ్యారు. -
ఓటు వేసిన శిల్పా , కుటుంబసభ్యులు
-
ఓటు వేసిన శిల్పా, కుటుంబసభ్యులు
సాక్షి, నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంజీవ్నగర్ బూత్ నంబర్ 81కి కుటుంబ సమేతంగా వచ్చిన శిల్పా.. ఓటు వేశారు. కాగా, ఉప ఎన్నికలో అధికార పార్టీ తెలుగుదేశం, ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్న విషయం తెలిసిందే. -
నంద్యాలలో ప్రారంభమైన పోలింగ్
-
నంద్యాలలో ప్రారంభమైన పోలింగ్
కర్నూలు: జిల్లాలోని నంద్యాలలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. 2,19,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉప ఎన్నిక కోసం నియోజకవర్గ వ్యాప్తంగా 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 141 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా పరిగణిస్తున్నారు. 40 మంది డీఎస్పీలు, 150 మంది సీఐలు నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కల్పిస్తున్నారు. ఆరున్నర గంటల ప్రాంతం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. -
సిక్కింలో బీజేపీకి షాక్!
సిక్కిం ఉప ఎన్నికలో అధికార సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) అభ్యర్థి దిల్లీ రామ్ థాపా సమీప బీజేపీ అభ్యర్థిపై ఘనవిజయం సాధించారు. ఇటీవల అప్పర్ బర్తుక్ అసెంబ్లి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన 8వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికలో మొత్తం 9,427 ఓట్లు పోలవ్వగా.. అందులో అధికార పార్టీ ఎమ్మెల్యేకు 8,406 ఓట్లు వచ్చాయి. ఆయనకు గట్టి పోటీ ఇస్తారని భావించిన బీజేపీ అభ్యర్థి సురేష్ ఖనల్ శర్మకు కేవలం 374 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర రాయ్కి నోటా కన్న రెండు తక్కువగా 98 ఓట్లు రావడం గమనార్హం. బరిలో మొత్తం ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు ఉండగా వారందరికీ కలిపి 449 ఓట్లు వచ్చాయి. నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ తమంగ్ అనర్హతకు గురికావడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. -
నాయకులకు షాక్.. ఈసీ కీలక సిఫారసు!
న్యూఢిల్లీ: ఇప్పటివరకు ఎన్నికల్లో ఒకటికి మించి స్థానాల్లో పోటీచేస్తున్న రాజకీయ నాయకులకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఒక వ్యక్తి ఒకేసారి రెండుస్థానాల్లో పోటీచేసేందుకు వీలు లేకుండా నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈసీ కోరింది. అలా చేయని పక్షంలో కనీసం రెండు స్థానాల్లో గెలిచిన అభ్యర్థి ఒకదానిని ఖాళీ చేసి ఉప ఎన్నికలకు కారణమైతే.. అందుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వానికి చెల్లించేలా ఆదేశించేలా ఎన్నికల చట్టాల్లో సవరణలు తీసుకురావాలని సూచించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఒక వ్యక్తి సాధారణ ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు, లేదా ద్వైవార్షిక ఎన్నికల్లో గరిష్ఠంగా రెండుస్థానాల్లో పోటీచేసేందుకు అనుమతినిచ్చింది. అయితే, రెండుస్థానాల్లో గెలుపొందినా ఒకే స్థానంలో మాత్రమే కొనసాగాలని నిబంధనలు విధించింది. 1996కు ముందు ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల్లోనైనా పోటీచేసే అవకాశం ఉండేది. కానీ 1996లో తీసుకొచ్చిన ఎన్నికల సవరణలతో ఒక అభ్యర్థి రెండుస్థానాల్లో మాత్రమే పోటీచేసేలా పరిమితి విధించారు. అయితే, కేంద్ర న్యాయశాఖకు ఇటీవల ప్రతిపాదించిన ఎన్నికల సంస్కరణల్లో సెక్షన్ 33 (7)ను మార్చాలని కోరినట్టు ఈసీ తెలిపింది. సెక్షన్ 33 (7)ను సవరించి ఒక అభ్యర్థిని ఒకే స్థానంలో పోటీచేసేలా పరిమితి విధించాలని, ఒకవేళ అది కుదరకపోతే.. కనీసం గెలిచిన అభ్యర్థి సీటును ఖాళీ చేస్తే.. ఉప ఎన్నికలకు అయ్యే ఖర్చును మొత్తం అతను/ఆమె భరించేలా సవరణలు తీసుకురావాలని కోరింది. ఈ వ్యయాన్ని అసెంబ్లీ స్థానానికి రూ. 5 లక్షలుగా, లోక్సభ స్థానానికి రూ. 10 లక్షలుగా ఈసీ ప్రతిపాదించింది. -
‘ఖేడ్’ టీఆర్ఎస్ కైవసం
నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం ♦ 53,625 ఓట్ల మెజారిటీతో భూపాల్రెడ్డి గెలుపు ♦ రెండో స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్.. టీడీపీ డిపాజిట్ గల్లంతు నారాయణఖేడ్: నారాయణఖేడ్ శాసనసభ స్థానం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మహారెడ్డి భూపాల్రెడ్డి 53,625 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిట్టింగ్ సీటు కోల్పోయిన కాంగ్రెస్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. టీడీపీ డిపాజిట్ గల్లంతయింది. ఈనెల 13న నారాయణఖేడ్ ఉప ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో మొత్తం 1,88,373 ఓట్లకుగాను 1,54,912 ఓట్లు పోలైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ ఓట్ల లెక్కింపు మంగళవారం జరిగింది. నారాయణఖేడ్ మండలంలో జూకల్ శివారులోని పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తంగా 21 రౌండ్లలో ఓట్లు లెక్కించగా... చివరి రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్రెడ్డి 93,076 ఓట్లు పొంది విజయం సాధించారు. ఈ అసెంబ్లీ స్థానం చరిత్రలోనే ఓ అభ్యర్థి ఇన్ని ఓట్లు సాధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇక సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ళ సంజీవరెడ్డికి 39,451 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ఎం.విజయపాల్రెడ్డి కేవలం 14,787 ఓట్లను పొంది డిపాజిట్ కోల్పోయారు. స్వతంత్ర అభ్యర్థులు జాజుల భాస్కర్ 5,377 ఓట్లు, బోరంచ సంగారెడ్డి 509, ఐ.మాదప్ప 235, ముదిరాజ్ వెంకటేశం 291, మురళీ గోవింద్ 333 ఓట్ల పొందారు. నోటాకు 853 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం కోసం మంత్రి హరీశ్రావు చేసిన కృషి ఫలించింది. ఈ ఫలితాన్ని బుధవారం నాటి సీఎం కేసీఆర్ పుట్టినరోజుకు కానుకగా ఇద్దామంటూ హరీశ్రావు ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. సీఎంకు కానుక: భూపాల్రెడ్డి తన గెలుపును సీఎం కేసీఆర్కు పుట్టిన రోజు కానుకగా అందజేస్తున్నట్టు నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా గెలిచిన ఎం.భూపాల్రెడ్డి అన్నా రు. మంగళవారం ఖేడ్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి హరీశ్రావు సహకారంతో ఈ అపూర్వ విజయం సాధ్యమైందన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి నియోజకవర్గాన్ని బంగారు ఖేడ్గా మారుస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి హరీశ్రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. మాట నిలబెట్టుకుందాం: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా ఎన్నికైన భూపాల్రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు. భూపాల్రెడ్డి మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్ను అధికారిక నివాసంలో కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టాలని మెదక్ జిల్లా నాయకులకు సూచించారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతలను తీసుకోవాలని మంత్రి హరీశ్రావుకు సూచించారు. రౌండ్లవారీగా మూడు పార్టీలకు పోలైన ఓట్లు, ఆధిక్యత వివరాలు.. రౌండ్ నెంబర్ టీఆర్ఎస్ ఆధిక్యం కాంగ్రెస్ టీడీపీ 1 3,922 1,952 1,970 701 2 3990 2,003 1,987 832 3 4,730 3,347 1,383 1,608 4 4,635 2,360 2,275 712 5 4,387 1,903 2,484 1,043 6 4,024 2,590 1,434 664 7 4,529 3,211 1,318 1,110 8 4,429 2,606 1,823 793 9 4,863 2,558 2305 295 10 4,558 2,781 1,777 551 11 5,008 2,582 2,426 735 12 5,032 3,301 1,731 635 13 5,399 3,370 2,029 415 14 5,669 4,098 1,571 331 15 5,129 3,044 2085 580 16 3,774 2,393 1381 614 17 4,555 2,243 2,312 761 18 3,374 1,151 2,223 1,128 19 5,199 3,120 2,079 463 20 4,484 2,491 1,993 485 21 1384 519 865 105 మొత్తం 93,076 53,625 39,451 14,787 -
టీఆర్ఎస్కు అరుదైన విజయం
సాక్షి, హైదరాబాద్: సానుభూతి పవనాలతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవాల్సిన నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం రాజకీయవర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అది కూడా ఏకంగా 53 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించడం అరుదైన విజయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నారాయణఖేడ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణంతో ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. తమ సిట్టింగ్ స్థానమైన ఇక్కడ కిష్టారెడ్డి కుమారుడినే బరిలోకి దింపితే సానుభూతి పవనాలతో విజయం సాధించవచ్చని కాంగ్రెస్ భావించింది. కానీ కాంగ్రెస్కు కంచుకోట అయిన ఈ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు మంత్రి హరీశ్రావు పన్నిన వ్యూహం విజయవంతమై.. గులాబీ జెండా ఎగిరింది. ఈ ఉప ఎన్నికలో 50 వేల మెజారిటీ సాధిస్తామని నామినేషన్ల రోజే చెప్పిన హరీశ్రావు... అదే రీతిన ప్రచారం నిర్వహించి అనుకున్నది సాధించారు. మధ్యలో రెండు రోజులు మినహా నారాయణఖేడ్లోనే బసచేసి ఊరూరా తిరిగారు. నారాయణఖేడ్ను అభివృద్ధి చేసి చూపిస్తానని మాటిచ్చి ప్రజల మద్దతు కూడగట్టారు. సానుభూతిని అధిగమించి.. ఇప్పటివరకు ఏదైనా రాజకీయ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించడంతో జరిగిన దాదాపు అన్ని ఉప ఎన్నికల్లోనూ ఆయా పార్టీల అభ్యర్థులే విజయం సాధించారు. సానుభూతిని దృష్టిలో పెట్టుకుని ఏ రాజకీయ పార్టీ అయినా మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తుంటాయి. నారాయణఖేడ్లో కాంగ్రెస్ పార్టీ అదే పని చేసింది. కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డికి టికెట్ ఇచ్చింది. గత 30 ఏళ్లలో ఇలా జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులే విజయం సాధించారు. కానీ ఇప్పుడు నారాయణఖేడ్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. అంతేకాదు కాంగ్రెస్పై భారీ ఆధిక్యం సాధించడాన్ని రాజకీయ పరిశీలకులు అరుదైన విజయంగా అభివర్ణిస్తున్నారు. -
'ఉప ఎన్నికలో మాకే విజయావకాశాలు'
హైదరాబాద్: వరంగల్ లోక్సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికలో ఎన్డీయే తరఫు అభ్యర్థి ఎవరు అన్న అంశాన్ని మాత్రమే శనివారం జరిగిన సమావేశంలో చర్చించామని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఏ పార్టీ నుంచి అభ్యర్థిని దించాలనే అంశంపై మాట్లాడలేదని చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నికల్లో టీడీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికల్లో మిత్రపక్షాలు బీజేపీ-టీడీపీ కలిసి పోటీచేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలలో ఏ పార్టీ నుంచి అభ్యర్థిని పోటీకి దింపే విషయమై ఇరు పార్టీల నేతల మధ్య చర్చ జరుగుతున్నది. -
'ఎన్నికలకు రెడీ, ఎవరొస్తారో రండి'
-
కలిసి సాగితే విజయం మనదే..
టీఆర్ఎస్ అధినేత ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలి. సీఎంకు, మంత్రులకు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించే తీరిక లేదా? వడగళ్ల వానకు నష్టపరిహారంగా రైతులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన విద్యార్థుల కుటుంబాలను పట్టించుకోవడం లేదు. - ఎన్నికలే లక్ష్యంగా పనిచేయూలి - గ్రేటర్పై కాంగ్రెస్ జెండా ఎగరాలి.. - కాంగ్రెస్ ప్రత్యేక సమావేశాల్లో నేతలు వరంగల్ లోక్సభ ఉపఎన్నిక, గ్రేటర్ వరంగల్ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయూలని.. నాయకులు, కార్యకర్తలు కలిసి వెళ్తే విజయం తథ్యమని కాంగ్రెస్ రాష్ట్రస్థారుు కీలక నేతలు అభిప్రాయపడ్డారు. గురువారం ఒక్క రోజే నాలుగు నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించారు. హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల సమావేశానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, పరకాలలోని నిర్వహించిన సమావేశానికి టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్ధన్నపేటలో జరిగిన సమావేశానికి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి క్రమార్క హాజరై మాట్లాడారు. వరంగల్ : కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి సమన్వయంతో ముందుకు సాగితే వచ్చే ఉప ఎన్నికల్లో పార్టీ విజయం తథ్యమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్లో వరంగల్ పార్లమెంట్, నవంబర్లో గ్రేటర్ ఎన్నికలు రానున్నాయని చెప్పారు. సోనియా ఇచ్చిన తెలంగాణలో టీఆర్ఎస్ ఏడాది పాలన అధ్వానంగా తయారైందన్నారు. ఉప, గ్రేట ర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు స్థానిక కమిటీల సూచనల మేరకే టికెట్లు ఇస్తామని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా స్పష్టం చేశారు. రాష్ట్రంలో గవర్నర్ వ్యవహారం రెండు పిల్లుల పంచాయతీని కోతి తీర్చిం దన్న చందంగా ఉందన్నారు. తెలంగాణ కోసం కృషి చేసిన మాజీ ఎంపీ రాజయ్యకు మరో అవకాశం కల్పించాలన్నారు. ఏడాది పాలనలో టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరించి, వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సమష్టిగా ముందుకు సాగాలని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మీడియాను సీఎం కేసీఆర్ అణచివేస్తున్నారని, ప్రభుత్వ వ్యతి రేక విధానాలపై ధర్నాలు చేస్తే రౌడీ షీట్లు పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారని మాజీ మంత్రి బస్వరాజు సారయ్య మండిపడ్డారు.టీఆర్ఎస్ నేతల ఆదేశాలను పాటిస్తున్న అధికారుల్లారా ఖబడ్ధార్ అం టూ.. వచ్చే ప్రభుత్వం కాంగ్రె స్దే అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉత్తమ్కుమార్రెడ్డి పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు నడుం బిగించారని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ అన్నారు. కాంగ్రెస్ పాలనలోనే నగరాభివృద్ధి జరిగిందని మాజీ మేయర్ స్వర్ణ అన్నారు. రాజీవ్ ఆవాస్ యో జనలో కార్పొరేషన్కు రూ.70 కోట్లు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.30కోట్లు విడుదల చేయనందు వల్లే పేదల ఇళ్ల నిర్మాణాలు కాలేదన్నారు. సీఎం కేసీఆర్ అహం వల్లే ఉప ఎన్నికలు వచ్చాయ ని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. సాధ్యం కాని హామీలకు ప్రజలు మోసపోయారని మాజీ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. నగర అధ్యక్షుడు విద్యాసాగర్, డీసీసీబీ చైర్మన్ రాఘవరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి హరిరమాదేవి, బండా ప్రకాశ్, బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మహమూద్, ఈవీ.శ్రీనివాసరావు, బత్తిని శ్రీనివాస్, చం దుపట్ల ధనరాజ్, పోశాల పద్మ, బిన్ని లక్ష్మణ్, మం డల సమ్మయ్య, వీసం సురేందర్రెడ్డి పాల్గొన్నారు. కాగా, సమావేశం జరుగుతుండగా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. -
అమ్మపేరు ఖరారు
చెన్నైలోని డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ (ఆర్కేనగర్) ఉప ఎన్నికలో జయలలిత అన్నాడీఎంకే అభ్యర్థిగా ఖరారయ్యారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదాలో ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం తన పేరును తానే ప్రకటించుకున్నారు. * అన్నాడీఎంకే అభ్యర్థిగా జయలలిత * గట్టి పోటీ లేని ఉప ఎన్నిక చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు నాలుగేళ్ల జైలు శిక్షపడిన కారణంగా గత ఎన్నికలలో తాను పోటీచేసి గెలుపొందిన శ్రీరంగం స్థానాన్ని కోల్పోయారు. జయ వల్ల ఖాళీఅయిన శ్రీరంగం నియోజకవర్గం నుండి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీచేసిన వలర్మతి గెలుపొందారు. ఆస్తుల కేసు నుంచి జయ నిర్దోషిగా బైటపడగా ఈనెల 23 వ తేదీన జయలలిత మళ్లీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. జయ శాసనసభ్యురాలు కానందున ఆరునెలల్లోగా అసెంబ్లీ సభ్యత్వాన్ని పొందాల్సి ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక మునుపే చెన్నై నగరంలో అంతర్భాగమైన ఆర్కేనగర్ నియోజకవర్గాన్ని జయ సిద్ధం చేసుకున్నారు.ఆర్కేనగర్ ఎమ్మెల్యే వెట్రివేల్ చేత హడావిడిగా రాజీనామా చేయించారు. దీంతో ఆర్కేనగర్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. జూన్ 3 వ తేదీన నోటిఫికేషన్ వెలువడ నుండగా 27వ తేదీన ఆర్కేనగర్లో ఉప ఎన్నికపై పోలింగ్ జరుగనుంది. ఎమ్మెల్యే స్థానానికి జయ ఆరుసార్లు పోటీచేయగా ఒక్కసారి ఓటమిపాలైయారు. ఓటమిపాలైన సమయంలో రెండుచోట్ల నుండి పోటీచేసినందున ఎమ్మెల్యే ప్రాతినిధ్యాన్ని దక్కించుకున్నారు. ఆర్కేనగర్లో పోటీచేయడంపై ప్రతిపక్షాలు పెద్దగా ఆసక్తి చూపనందున జయ గెలుపు నల్లేరుపై నడక కాగలదు. అనారోగ్య కారణాల వల్లనే స్థానిక నియోజకవర్గాన్ని జయ ఎంచుకున్నారనే ప్రచారం ఉంది. సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి మినహా మరెవ్వరూ పోటీకి ముందుకు రాని పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారంలో జయ పాల్గొనడం కూడా అనుమానమని తెలుస్తోంది. గతంలో ఓటమి అనుభవంతో ప్రచారానికి వచ్చినా ఆశ్చర్యంలేదని అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నటి కుష్బు పేరు ప్రచారంలో ఉండగా, ఆమె మాత్రం కొట్టిపారేశారు. కాంగ్రెస్ అధిష్టానం కోరినా పోటీకి దిగేది లేదని ఆమె స్పష్టం చేశారు. డీఎంకే సైతం ఎన్నికలకు దూరమని ప్రకటించేసింది. మిగిలిన ప్రతిపక్షాలు గట్టి అభ్యర్థిని నిలబెట్టిన పక్షంలో జయ ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. -
'అమ్మ' ఆర్కే నగర్ నుంచే..
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పోటీవేదిక ఖరారైంది. అందరూ ఊహించినట్టుగానే ఆమె ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీచేయనున్నారు. జూన్ 27న పోలింగ్ జరగనుంది. పురుచ్చిత్తలైవి కోసం.. ఆమె మళ్లీ ఎన్నికయ్యేందుకు వీలుగా ఆర్కేనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పి. వేట్రివేల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. జయలలితపై అక్రమాస్తుల కేసును కర్ణాటక హైకోర్టు కొట్టేసిన తర్వాత... ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లోగా ఆమె శాసన సభ లేదా శాసన మండలికి ఎన్నిక కావడం తప్పనిసరి. అన్నాడీఎంకే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని సీఎం జయలలిత ప్రకటించారు. జయలలితపై పోటీకి దిగడం లేదని డీఎంకే ఇప్పటికే స్పష్టం చేసింది. ఆమె పోటీ చేయనున్న ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం లేదని డీఎంకే అధినాయకుడు కరుణానిధి తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖుష్బూ పోటీ చేయొచ్చని సమాచారం. పీఎంకే మాత్రం తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఏ పార్టీ నుంచి ఎవరెవరు బరిలో ఉంటారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కాగా గతంలో అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో ఆమె ముఖ్యమంత్రి పదవినీ, శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు. అయితే అమ్మను నిర్దోషిగా నిర్ధారిస్తూ మే 11న కర్ణాటక హై కోర్టు తీర్పు చెప్పడంతో మళ్లీ జయలలిత సీఎం పీఠాన్ని అధిరోహించారు.