2న మదనపల్లెలో ‘మేమంతా సిద్ధం’ సభ: మంత్రి పెద్దిరెడ్డి | Memantha Siddham Public Meeting In Madanapalle On April 2th | Sakshi
Sakshi News home page

2న మదనపల్లెలో ‘మేమంతా సిద్ధం’ సభ: మంత్రి పెద్దిరెడ్డి

Published Sun, Mar 31 2024 8:52 PM | Last Updated on Sun, Mar 31 2024 9:16 PM

Memantha Siddham Public Meeting In Madanapalle On April 2th - Sakshi

సాక్షి, అన్నమయ్య జిల్లా: ఏప్రిల్ 2న మదనపల్లెలో మేమంతా సిద్దం సభ నిర్వహించనున్నట్లు మంత్రిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మదనపల్లిలో పర్యటించిన ఆయన సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో పెద్దిరెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 27న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్ర ఇడుపులపాయలో ప్రారంభమైందన్నారు. నంద్యాల, ఎమ్మిగనూరులో మేమంతా సిద్దం సభలు విజయవంతం అయ్యాయన్నారు.

ఏప్రిల్ 2న మదనపల్లెలో 3, 4 తేదీల్లో పూతలపట్టు, నాయుడుపేట మేమంతా సిద్దం సభలు జరుగుతాయన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో బస్సు యాత్ర షెడ్యూల్ ఆలస్యమవుతుందన్నారు. రాబోయే ఎన్నికలకు ఈ సభలు ద్వారా వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మంచి ఉత్సాహం లభిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

ఇదీ చదవండి: చంద్రబాబు ఒరిజినల్‌ క్యారెక్టర్‌ ఇదే: సజ్జల

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement