Memantha Siddham
-
ది లీడర్..!
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)
-
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
మేమంతా ‘సిద్దం’ బస్సు యాత్రముగింపు సభలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఒకమాట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మధ్య తరగతిని ఆలోచనలో పడేసింది. “ఈ సభ నుంచి మీరు మీ ఇళ్ళకు వెళ్ళాక, మీ కుటుంబ సభ్యులు అందరూ పిల్లలు అవ్వాతాతలుతో సహా కలిసి కూర్చుని ఎవరికి వోటు వేయాలోమీరు చర్చించుకోండి...” అన్నారు.ఈ మాట విన్నాక, ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడ్డారు. ఇన్నాళ్ళూ “నా వల్ల మేలు జరిగితే నాకు వోటు వేయండి” అని చెప్పిన సిఎం, ఇప్పుడు అదే మాటను మీ కుటుంబంలో అందరూ ఒక మాట అనుకొని ఒక నిర్ణయానికి రండి, అని దీన్ని ఒక ‘హోమ్లీ ఎఫైర్’గా మార్చారు. ఓటర్లు పోలింగ్ బూత్ లోకి వెళ్ళడానికిఇంకా మూడు వారాలు సమయం ఉండగా ఆయన ఇటువంటి కొత్త పని వాళ్లకు అప్పగించారు. వినడానికి ఇది సాదాసీదా ప్రకటనగా ఉన్నప్పటికీ, ‘పిల్లలు అవ్వాతాతలుతో సహా కలిసి కూర్చుని...’ అనిఅనడం ద్వారా జగన్ దీన్ని ఒక ఇంట్లో మూడు తరాలు కలిసి కూర్చుని చేసే నిర్ణయంగా మార్చారు.కొన్ని కుటుంబాలు ఒక నిర్ణయం తీసువడం అంటే, ఎక్కడో పనిచేస్తూ ‘పోలింగ్’ రోజు ఊళ్లోకి వచ్చేవారి పిల్లలతో‘ఫోన్’లోమాట్లాడి కూడా కావొచ్చు. జగన్ చెప్పాడు- “కొన్ని కొంచెం మాత్రం పెంచి ఇంతకు ముందు ఇచ్చినవన్నీ మళ్ళీ ఇస్తాడంట...” అనేది అ చర్చలో కీలకం అవుతుంది. అయితేవారి‘నిర్ణయం’ ఏమిటి? అనే విషయం వద్దకు వచ్చేసరికి.మూడు తరాల్లో కూడా యువతరం (ఎమర్జింగ్ జెనరేషన్) ఏమనుకుంటున్నది అనేదిప్రధానం అవుతున్నది.నిర్లక్ష్యిత, లేదా వర్ధమాన సమాజాల్లోని యువతరం తమ ఆర్ధిక ప్రయోజనాన్ని మించి మరీ,సామాజిక కోణంలో రాజకీయ స్పృహను పెంచుకుంటున్న తీరు ఈ ఎన్నికల్లోస్పష్టంగా కనిపిస్తున్నది.ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొందరు విశ్లేషకులు ఈ పార్టీకి నాయకులు తప్ప ‘కేడర్’ లేదు అనేవారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీ తర్వాత ఆ ఖాళీ చాలావరకు నిండింది. అయితే, ఏప్రెల్ చివరి వారంలో ఈ పార్టీకి ఉన్న అదృశ్యశక్తి ఏమిటో విశాఖ జిల్లా భీమిలి‘సోషల్ మీడియా వారియర్స్’ సదస్సులో దృశ్యమానం అయింది. ఇన్నాళ్ళూ జగన్ కోసం స్వచ్చందంగా పనిచేసినఅదృశ్య ‘కేడర్’ ఇది. అభిమానమే అర్హతగా తలుపులు లేని పుష్పక విమానమిది. ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు ఉన్నవి రెండు రకాల యుద్దాలు అంటారు తత్వవేత్తలు.ఒకటి-'టెరిటోరియల్ బ్యాటిల్' మరొకటి-'ఐడిలాజికల్ బ్యాటిల్'. దీన్నేజగన్-‘పేదల కోసం పెత్తందార్లతో తన ప్రభుత్వం చేస్తున్న యుద్ధం’అంటారు.కావొచ్చు కూడా మరిఅటువంటప్పుడుఒక ప్రాంతం కోసం నాయకుడు తనను తానుకట్టేసుకోవడం రెండవ రకం యుద్ధం అయితే కావొచ్చు.అదలా ఉంచి స్వచ్చందంగా ‘సోషల్ మీడియా వారియర్స్’ఈ పార్టీని ఇలా ‘వోన్’ చేసుకోవడానికి మూడుకారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి- తమ సామాజిక వర్గాల వారు చిన్నదో పెద్దదో ఏదో ఒక రాజకీయ పదవితో ఈ ప్రభుత్వంలో గుర్తింపును పొందడం.రెండు- సంస్కరణలు వల్ల పరిపాలన వ్యవస్థ వారి సమీపానికి రావడం. మూడు- మొదటి ఐదేళ్లలోనే ‘రియాల్టీ’గా కనిపిస్తున్న2019 ఎన్నికల వాగ్దానాలు. వీటిని మించి విభజిత ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా రూపాంతర (ట్రాన్ఫార్మింగ్) దశలో ఉన్నప్పుడు,తమ కొత్త రాష్ట్రం ఎలా ఉండాలి? అనే భావన, దాన్ని వాస్తవం చేసే నాయకుడు ఎవరు? ప్రభుత్వం ఏది? అనే విషయంలో యువతఇప్పుడుపూర్తి స్పష్టతతో ఉంది. రేపటి వారి అవసరాలు,వారి పిల్లల అవసరాలు వారికీ ప్రధానం. వాటివెనుక- ఆర్ధికం సామాజికం సాంస్కృతికం ప్రాంతీయం ఇన్ని అంశాల నేపధ్యాలు ఉన్నాయి.ఎన్నికలు అనేసరికి తమ పార్టీల ప్రాధాన్యతల ఎంపికలో ‘కన్ఫ్యూజన్’కు గురి అవుతున్నది ఎవరు? వాటిని నిజాయతీగా అర్ధం చేసుకుంటున్నది ఎవరు?అనేది వాళ్లకు ఇప్పుడు పూర్తిగా అర్ధమయింది. ఎన్నికల ముందు ‘సీట్ల’ కోసం జరిగిన కొందరి పార్టీల మార్పు, నిరుపేదలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇచ్చే ప్రయత్నాలను పబ్లిగ్గా అవహేళన చేస్తున్న తీరు, వారి దృష్టిని దాటిపోయేవి కాదు. అటువంటివి వాళ్లకు ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకుంది. అందుకే, కేవలం పార్టీ పట్ల రాజకీయ అభిమానం ఉంచుకోవవడమే కాకుండా,నాయకుడి పట్ల యువత దాన్ని బహిరంగంగా వ్యక్తం చేసే తీరులో మునుపు ఎన్నడూ మనం చూడనివ్యక్తీకరణ ఒక‘హై వోల్టేజ్’ దేహభాషగా స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ కసి వెనుక ఉన్న కారణాల కోసం చూసినప్పుడు, రెండు ప్రధాన అంశాలు కనిపిస్తాయి. మొదటిది- ప్రభుత్వం నుంచి అందే మేలు ఏదైనా నిర్ణయాధికారం స్థానిక ఆధిపత్య వర్గాల చేతిలో నుంచి ఇప్పుడు అది సాంకేతికం అయింది. ఊళ్ళోని గ్రామ సచివాలయాల సిబ్బంది, ‘వాలంటీర్ల’ వద్దకు ‘ఆన్ లైన్’లోఅది చేరువయింది. దాన్ని ఆక్షేపిస్తూ ఏదొ వంకతో అ సేవలను నిలపాలనే వర్గాల నైజం కూడా అర్ధమయింది. జరుగుతున్న ‘యుద్దం’లో నిర్లక్ష్యిత, లేదా వర్ధమాన సమాజాల్లోని యువత ఇది తమ నిశబ్దవిజయం అనుకొంటున్నారు. రెండవది- గడచిన ఇరవై ఏళ్లుగాచిన్న’బ్యాగ్’ భుజాన వేసుకుని కాళ్ళకు చక్రాలు కట్టుకుని, దేశంలో ఎక్కడ పని దొరికితే అక్కడికిజీవిక వెతుక్కుంటూవెళ్ళాము. ఇక ముందు మాకు ఈ తిరుగుడు తగ్గాలి. దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి వర్గాల్లో కుటుంబం అంతా కనీసం సమీపంగా కలిసి జీవించే పరిస్థితి రావాలిఅనేది వారి ఆకాంక్ష. ఇప్పుడు వున్నఈ- ‘ఫీల్ గుడ్’ వాతావరణంతో పాటుగా,వేగవంతమైన అభివృద్ధి కోసం ఇప్పటికే సిద్దమయిన ‘లాజిస్టిక్స్’, వాటికితోడుగావిస్తరిస్తున్న మౌలిక వసతుల వల్లఇకముందు ఉపాధి అవకాశాలు ఇక్కడే మెరుగవుతాయనికొత్త పార్టీ ప్రణాళిక చూశాక వాళ్ళు బలంగా నమ్ముతున్నారు.జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
Watch Live : సీఎం జగన్ కందుకూరు బహిరంగ సభ
-
ఆ పేరే.... ఒక నమ్మకం!
నలభై రెండు డిగ్రీలు దాటిన ఎండల్లో నడిరోడ్లపై గంటల తరబడి వేలాదిమంది ప్రజలు ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారంటే అర్థం ఏమిటి? వయోభేదం లేదు. కులమతాల పరిధులు లేవు. ఆడామగా తేడా లేదు. ఆబాల గోపాల జన తరంగం ఆ నాయకుడు కనిపించగానే కేరింతలు కొట్టడం దేనికి సంకేతం? ఆ నిరీక్షణలకు అర్థం అక్కడో ప్రభంజనం వీస్తున్న దని! ఒక వేవ్ పుట్టిందనడానికి సంకేతాలే అక్కడ కనిపించే పరవశాల కేరింతలు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 27 రోజులపాటు సాగించిన బస్సు యాత్ర సందర్భంగా అటువంటి ఒక ప్రభంజనం పెల్లుబికింది.నాన్నల భుజాల మీద నిలబడి నాయకుడు కనిపించగానే సంభ్రమంతో ‘జగన్ మామా’ అని ఎలుగెత్తే చిన్నారులు. ఓ చేత్తో చంటిబిడ్డనెత్తుకొని మరో చేత్తో మొబైల్ ఫోన్ ఎక్కుపెట్టి దగ్గరగా జగనన్న ఫోటోను తీసుకోవడానికి ఆరాటపడుతున్న ఆడపడుచులు. దూరంగా బస్సు కనిపించగానే ‘అదిగో నా కొడుకొస్తున్నాడ’ని బోసినవ్వుతో భావప్రకటన చేసే అవ్వా తాతలు. నాయకుని వాహనం ముందూవెనుకా ఉరకలెత్తుతున్న యవ్వనోత్తేజాలు. రోడ్డు పక్కనున్న స్తంభాలను అధిరోహించి, చెట్ల కొమ్మలనాక్రమించి జయ జయధ్వానాలు చేసే చిట్టి తమ్ముళ్లు. ముఖాల మీద భద్రతా భావాన్ని, భరోసాను వేలాడ దీసుకొని రోడ్డు పక్క భవనాల మీద నిలబడి ఎదురు చూస్తున్న నడివయసు అన్నలూ అక్కలూ!ఆనందోద్వేగాల వ్యక్తీకరణలో ఎన్ని ఛాయలుంటాయి? అభినందనాభివ్యక్తిని ఎన్ని రంగుల్లో ప్రకటించవచ్చును? కృత జ్ఞతాపూర్వక అరుపుల్లో, కంటి మెరుపుల్లో కనిపించే సందేశ కావ్యాల్లో ఎన్ని రకాలుంటాయి? బస్సు యాత్రలో పాల్గొన్న జనప్రవాహం దృశ్యాలను ఫ్రేములుగా విడదీసి ఒక్కొక్కటే గమనించండి. లెక్కించలేనన్ని ఛాయలు. ఊహలకందని రంగులు. చదవలేనన్ని సందేశాలు కనిపిస్తాయి. ఒక నాయకుడు లక్షలాది మంది ప్రజలతో విడివిడిగా ముఖాముఖి సంబంధం ఏర్పరుచుకుంటే తప్ప ఇన్ని భావోద్వేగాలు ఉదయించవు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడిగా కనిపిస్తాడట! జన సమ్మోహన నాయకుడు కూడా అంతే! నాయకుడి మీద ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడినప్పుడే ఈ ఆత్మీయ బంధం అల్లుకుంటుంది. డెబ్బయ్యో దశకంలో ఇందిరాగాంధీ దగ్గర ఈ మ్యాజిక్ ఉండేది. కోట్లాదిమంది భారతీయులు ఆమెను ‘అమ్మ’గా పిలుచుకునేవారు. ఎనభయ్యో దశకంలో ఎమ్జీ రామచంద్రన్, ఎన్టీరామారావు వారి రాష్ట్రాల్లోని ప్రజలతో ఆత్మీయ స్పర్శను అనుభవించగలిగారు. పేదల జీవితాల్లో మార్పులు తెస్తాడన్న నమ్మకంతో ఎమ్జీఆర్ను ‘పురట్చి తలైవర్’ (విప్లవ నాయకుడు)గా తమిళ ప్రజలు పిలుచుకున్నారు. పేదవాడి అన్నం గిన్నెగా మారిన ఎన్టీఆర్ను తెలుగు ప్రజలు ‘అన్న’గా సంబోధించారు. ఐదు పదుల వయసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి తన ఐదేళ్ల పదవీ కాలంలో పేదల బతుకుల్లో విప్లవాత్మక మార్పులకు పునాదులు వేయడంతోపాటు కోట్లాది మంది నోట ఆప్యాయంగా ‘అన్నా’ అని పిలుచుకోగలుగు తున్నారు.ఎమ్జీఆర్, ఎన్టీఆర్ల సంగతి వేరు. వారు రాజకీయాల్లోకి రాకముందే అఖండ ప్రజాదరణ కలిగిన సినీ హీరోలు. సినిమాల్లో వారు ఎక్కువగా పోషించినవి కూడా ఉదాత్తమైన పాత్రలు. అందువల్ల వారి రాజకీయ ప్రవేశం తమకు మేలు చేస్తుందని ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ప్రజల నమ్మకాన్ని వారు కూడా వమ్ము చేయలేదు. వారి సంగతి సరే! మరి జగన్మోహన్రెడ్డికి ఇంతటి జనాకర్షణ ఏర్పడటానికి కారణ మేమిటి? ప్రజలు ఆయన్ను ఇంతగా గుండెల్లో ఎందుకు పెట్టుకున్నారు? ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఆరేళ్లు పనిచేసిన అనంతరం 1989లో ఎన్నికలకు వెళ్లినప్పుడు పూర్వపు ఆదరణ కనిపించలేదు. ఆయన ప్రచార రథం వెంట జనం పరుగులు తీయలేదు. ఆయన రాక కోసం గంటల తరబడి నిరీక్షించడం కనిపించలేదు.జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పరిపాలన తర్వాత మొన్నటి బస్సు యాత్ర సందర్భంగా కనిపించిన దృశ్యాలు వేరు. ఎన్టీఆర్ తొలిరోజుల్లో సభావేదిక నెక్కి ‘నేల ఈనిందా... ఆకాశం చిల్లులు పడిందా’ అనగానే జన సముద్ర ఘోష దద్దరిల్లేది. ‘నా రక్తంలో రక్తమైన నా సోదరులారా’ అని ఎమ్జీఆర్ ప్రసంగం ప్రారంభించగానే జంఝామారుతంలా హర్షధ్వానాలు మార్మోగేవి. కానీ ఐదేళ్ల పాలన తర్వాత కూడా జగన్మోహన్రెడ్డికి అదే స్పందన. ప్రసంగానికి ముందు చేతిలోకి మైకు తీసుకుని వేళ్లతో దాని మీద తాళం వేయగానే వేల గొంతుకల్లో ఆ ప్రతిధ్వని మార్మోగుతున్నది. మాట మాటకూ చప్పట్ల కోరస్. మంత్రం వేసినట్టుగా ఆయన మాటతో మాట కలుపుతున్నారు. జనానికీ, జగన్కూ మధ్య ఏర్పడిన ఈ కమ్యూ నికేషన్ ఓ అధ్యయనాంశం.జగన్మోహన్రెడ్డి సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించు కొని పదమూడేళ్లయింది. ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా, ఐదేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసి మరోసారి అధికారం కోసం జనం ముందుకు వెళ్తున్నారు. మళ్లీ భారీ ఆధిక్యతతో అధికారంలోకి వస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రజలతో ఆయన సంబంధం రోజురోజుకూ బలపడుతున్నది. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన సీనియర్ మోస్ట్ రాజ కీయవేత్త ప్రజాదరణలో జగన్మోహన్రెడ్డి దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు. కారణం ఏమై ఉంటుంది?కారణం... ఆయన క్యారెక్టర్. మాట తప్పని, మడమ తిప్పని నైజం. ఎట్టి పరిస్థితుల్లో నోటి వెంట ఒక్క అబద్ధం కూడా చెప్పని తత్వం. పేదలకు, అసహాయులకు, రోగగ్రస్థులకు ప్రేమను పంచే స్వభావం. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలన్న పొలిటికల్ ఫిలాసఫీ. అంబేడ్కర్, అబ్రహాం లింకన్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ లక్షణాలన్నీ ఆయన్ను వర్తమాన రాజకీయ నేతల మధ్య ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆయన స్వభావానికీ, ఫిలాసఫీకీ పూర్తి భిన్నమైన చిత్రీకరణతో ఆయన ఎదుర్కొన్నంత దుష్ప్రచారాన్ని దేశ రాజకీయ నాయకుల్లో ఎవరూ ఎదుర్కోలేదు. ఆయన మీద జరిగినన్ని కుట్రలు ఎవరి మీదా జరగలేదు. అయినా శిలాసదృశంగా నిలబడగలిగారంటే అందుకు కారణం ఆయన క్యారెక్టర్. నిజాయితీ. ఇదిగో ఈ నిజాయితీ జనంలోకి డైరెక్ట్గా కమ్యూని కేట్ అయింది. గోబెల్స్ గొలుసుల్ని తెంచుకొని, మీడియా గోడల్ని బద్దలు కొట్టుకొని మరీ ఆయన క్యారెక్టర్ జనం గుండె ల్లోకి వెళ్లిపోయింది.జగన్మోహన్రెడ్డి మీద జరిగిన కుట్రల కమామిషు, ఆయన నాయకుడుగా ఎదిగిన కథాక్రమం తెలుగు ప్రజలు ఎరిగిన సంగతులే. చర్విత చర్వణం అనవసరం. ప్రజలిచ్చిన అధికారాన్ని అయిదేళ్లపాటు ప్రజా సాధికారత కోసమే ఆయన ఖర్చు చేశారు. అంతకు ముందు పది శాతమున్న పేదరికాన్ని నవరత్న పథకాల సాయంతో నాలుగు శాతానికి తగ్గించ గలిగారు. వచ్చే ఐదేళ్ల లోపల పేదరికాన్ని నిశ్శేషం చేయడం కోసం ఆ రత్నాలకు మరింత మెరుగుదిద్దినట్టు శనివారం ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోలో వెల్లడైంది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా చేసిన ప్రసంగం జగన్మోహన్రెడ్డి నిజాయితీకి అద్దం పట్టింది. ఆయన విజన్ను, తాత్వికతను మేనిఫెస్టో ఆవిష్కరించింది. ఒకపక్క ఆయన ప్రత్యర్థి అలవికాని వాగ్దానాలతో చెలరేగిపోతున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపెడుతున్నారు. బొందితో కైలాసానికి తీసుకెళ్తానన్న స్థాయిలో వాగ్దానాలు కురిపిస్తున్నారు. సూపర్ సిక్స్లు కొడతా నంటున్నారు. ప్రత్యర్థి చేస్తున్న ఈ ఊకదంపుడు... ముఖ్యమంత్రిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎందుకంటే, ఆయన పేరే ఒక నమ్మకంగా ప్రజల గుండెల్లో స్థిరపడిపోయింది.చంద్రబాబు బోగస్ హామీలను పూర్వపక్షం చేస్తూ జగన్మోహన్రెడ్డి మాట్లాడిన తీరు లైవ్లో చూస్తున్న లక్షలాది మంది టీవీ వీక్షకులను ఆకట్టుకున్నది. సంపద సృష్టించి హామీలు అమలుచేస్తానని చెబుతున్న చంద్రబాబు వాదనలోని డొల్లతనాన్ని ఆయన బయటపెట్టారు. చంద్ర బాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన పధ్నాలుగేళ్లూ ప్రతిపాదించిన బడ్జెట్లన్నీ రెవెన్యూ లోటునే చూపెట్టాయనీ, ఇక సంపద సృష్టించిందెక్కడనీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పేదల సంక్షేమం సాధికారతల పట్ల తనకంటే చిత్తశుద్ధి ఉన్న వారెవరూ లేరని చెబుతూ ప్రజలకు ఎంత గరిష్ఠంగా మేలు చేయగలమో ఆ మేరకే హామీలివ్వగలం తప్ప అబద్ధాలు చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పు లకు బాటలు పరుస్తూ, బలహీనవర్గాలు – మహిళల సాధికారత కోసం అడుగులు వేస్తూ సాగిన ఐదేళ్ల పాలన కొనసాగింపుగానే మరో ఐదేళ్ల పాలనకు సంబంధించిన మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఇది విప్లవ కర్తవ్యాల కొనసాగింపు. విద్యారంగంలో తాను ప్రవేశపెడుతున్న మార్పులు మరో పదిహేనేళ్లు కొనసాగితే పేదరికం ఆనవాళ్లు కూడా రాష్ట్రంలో కనిపించవని ఆయన నమ్ముతున్నారు. పేద విద్యార్థులందరూ సంపన్నుల బిడ్డలతో సమానంగా నాణ్యమైన విద్యను అభ్యసించగల పరిస్థితులను ప్రజలంతా స్వాగతించాలి. ప్రతి ఇంటినీ ఓ ఫ్యామిలీ డాక్టర్ సందర్శించగల అత్యున్నత స్థాయి వైద్య సేవల సమాజాన్ని నిండు మనసుతో ఆహ్వానించాలి. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో తరతరాలుగా వెనుకబడిన సమూహా లను, మహిళలను ముందడుగు వేయించే ప్రయత్నాలకు ప్రజ లందరూ భుజం కాయాలి. ఉన్నతస్థాయి సమాజ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాల వెన్నంటి నడవాలి. పేదల విముక్తికి అడ్డుగోడలా నిలబడుతున్న పెత్తందారీ శక్తులనూ, వారి రాజకీయ శిబిరాలనూ ఓడించాలి. లాంగ్ లివ్ ది రివల్యూషన్! ఇంక్విలాబ్ జిందాబాద్!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఆ పేరే... ఒక నమ్మకం!
నలభై రెండు డిగ్రీలు దాటిన ఎండల్లో నడిరోడ్లపై గంటల తరబడి వేలాదిమంది ప్రజలు ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారంటే అర్థం ఏమిటి? వయోభేదం లేదు. కులమతాల పరిధులు లేవు. ఆడామగా తేడా లేదు. ఆబాల గోపాల జన తరంగం ఆ నాయకుడు కనిపించగానే కేరింతలు కొట్టడం దేనికి సంకేతం? ఆ నిరీక్షణలకు అర్థం అక్కడో ప్రభంజనం వీస్తున్న దని! ఒక వేవ్ పుట్టిందనడానికి సంకేతాలే అక్కడ కనిపించే పరవశాల కేరింతలు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 27 రోజులపాటు సాగించిన బస్సు యాత్ర సందర్భంగా అటువంటి ఒక ప్రభంజనం పెల్లుబికింది.నాన్నల భుజాల మీద నిలబడి నాయకుడు కనిపించగానే సంభ్రమంతో ‘జగన్ మామా’ అని ఎలుగెత్తే చిన్నారులు. ఓ చేత్తో చంటిబిడ్డనెత్తుకొని మరో చేత్తో మొబైల్ ఫోన్ ఎక్కుపెట్టి దగ్గరగా జగనన్న ఫోటోను తీసుకోవడానికి ఆరాటపడుతున్న ఆడపడుచులు. దూరంగా బస్సు కనిపించగానే ‘అదిగో నా కొడుకొస్తున్నాడ’ని బోసినవ్వుతో భావప్రకటన చేసే అవ్వా తాతలు. నాయకుని వాహనం ముందూవెనుకా ఉరకలెత్తుతున్న యవ్వనోత్తేజాలు. రోడ్డు పక్కనున్న స్తంభాలను అధిరోహించి, చెట్ల కొమ్మలనాక్రమించి జయ జయధ్వానాలు చేసే చిట్టి తమ్ముళ్లు. ముఖాల మీద భద్రతా భావాన్ని, భరోసాను వేలాడ దీసుకొని రోడ్డు పక్క భవనాల మీద నిలబడి ఎదురు చూస్తున్న నడివయసు అన్నలూ అక్కలూ!ఆనందోద్వేగాల వ్యక్తీకరణలో ఎన్ని ఛాయలుంటాయి? అభినందనాభివ్యక్తిని ఎన్ని రంగుల్లో ప్రకటించవచ్చును? కృత జ్ఞతాపూర్వక అరుపుల్లో, కంటి మెరుపుల్లో కనిపించే సందేశ కావ్యాల్లో ఎన్ని రకాలుంటాయి? బస్సు యాత్రలో పాల్గొన్న జనప్రవాహం దృశ్యాలను ఫ్రేములుగా విడదీసి ఒక్కొక్కటే గమనించండి. లెక్కించలేనన్ని ఛాయలు. ఊహలకందని రంగులు. చదవలేనన్ని సందేశాలు కనిపిస్తాయి. ఒక నాయకుడు లక్షలాది మంది ప్రజలతో విడివిడిగా ముఖాముఖి సంబంధం ఏర్పరుచుకుంటే తప్ప ఇన్ని భావోద్వేగాలు ఉదయించవు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడిగా కనిపిస్తాడట! జన సమ్మోహన నాయకుడు కూడా అంతే! నాయకుడి మీద ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడినప్పుడే ఈ ఆత్మీయ బంధం అల్లుకుంటుంది. డెబ్బయ్యో దశకంలో ఇందిరాగాంధీ దగ్గర ఈ మ్యాజిక్ ఉండేది. కోట్లాదిమంది భారతీయులు ఆమెను ‘అమ్మ’గా పిలుచుకునేవారు. ఎనభయ్యో దశకంలో ఎమ్జీ రామచంద్రన్, ఎన్టీరామారావు వారి రాష్ట్రాల్లోని ప్రజలతో ఆత్మీయ స్పర్శను అనుభవించగలిగారు. పేదల జీవితాల్లో మార్పులు తెస్తాడన్న నమ్మకంతో ఎమ్జీఆర్ను ‘పురట్చి తలైవర్’ (విప్లవ నాయకుడు)గా తమిళ ప్రజలు పిలుచుకున్నారు. పేదవాడి అన్నం గిన్నెగా మారిన ఎన్టీఆర్ను తెలుగు ప్రజలు ‘అన్న’గా సంబోధించారు. ఐదు పదుల వయసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి తన ఐదేళ్ల పదవీ కాలంలో పేదల బతుకుల్లో విప్లవాత్మక మార్పులకు పునాదులు వేయడంతోపాటు కోట్లాది మంది నోట ఆప్యాయంగా ‘అన్నా’ అని పిలుచుకోగలుగు తున్నారు.ఎమ్జీఆర్, ఎన్టీఆర్ల సంగతి వేరు. వారు రాజకీయాల్లోకి రాకముందే అఖండ ప్రజాదరణ కలిగిన సినీ హీరోలు. సినిమాల్లో వారు ఎక్కువగా పోషించినవి కూడా ఉదాత్తమైన పాత్రలు. అందువల్ల వారి రాజకీయ ప్రవేశం తమకు మేలు చేస్తుందని ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ప్రజల నమ్మకాన్ని వారు కూడా వమ్ము చేయలేదు. వారి సంగతి సరే! మరి జగన్మోహన్రెడ్డికి ఇంతటి జనాకర్షణ ఏర్పడటానికి కారణ మేమిటి? ప్రజలు ఆయన్ను ఇంతగా గుండెల్లో ఎందుకు పెట్టుకున్నారు? ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఆరేళ్లు పనిచేసిన అనంతరం 1989లో ఎన్నికలకు వెళ్లినప్పుడు పూర్వపు ఆదరణ కనిపించలేదు. ఆయన ప్రచార రథం వెంట జనం పరుగులు తీయలేదు. ఆయన రాక కోసం గంటల తరబడి నిరీక్షించడం కనిపించలేదు.జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పరిపాలన తర్వాత మొన్నటి బస్సు యాత్ర సందర్భంగా కనిపించిన దృశ్యాలు వేరు. ఎన్టీఆర్ తొలిరోజుల్లో సభావేదిక నెక్కి ‘నేల ఈనిందా... ఆకాశం చిల్లులు పడిందా’ అనగానే జన సముద్ర ఘోష దద్దరిల్లేది. ‘నా రక్తంలో రక్తమైన నా సోదరులారా’ అని ఎమ్జీఆర్ ప్రసంగం ప్రారంభించగానే జంఝామారుతంలా హర్షధ్వానాలు మార్మోగేవి. కానీ ఐదేళ్ల పాలన తర్వాత కూడా జగన్మోహన్రెడ్డికి అదే స్పందన. ప్రసంగానికి ముందు చేతిలోకి మైకు తీసుకుని వేళ్లతో దాని మీద తాళం వేయగానే వేల గొంతుకల్లో ఆ ప్రతిధ్వని మార్మోగుతున్నది. మాట మాటకూ చప్పట్ల కోరస్. మంత్రం వేసినట్టుగా ఆయన మాటతో మాట కలుపుతున్నారు. జనానికీ, జగన్కూ మధ్య ఏర్పడిన ఈ కమ్యూ నికేషన్ ఓ అధ్యయనాంశం.జగన్మోహన్రెడ్డి సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించు కొని పదమూడేళ్లయింది. ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా, ఐదేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసి మరోసారి అధికారం కోసం జనం ముందుకు వెళ్తున్నారు. మళ్లీ భారీ ఆధిక్యతతో అధికారంలోకి వస్తారని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రజలతో ఆయన సంబంధం రోజురోజుకూ బలపడుతున్నది. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన సీనియర్ మోస్ట్ రాజ కీయవేత్త ప్రజాదరణలో జగన్మోహన్రెడ్డి దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు. కారణం ఏమై ఉంటుంది?కారణం... ఆయన క్యారెక్టర్. మాట తప్పని, మడమ తిప్పని నైజం. ఎట్టి పరిస్థితుల్లో నోటి వెంట ఒక్క అబద్ధం కూడా చెప్పని తత్వం. పేదలకు, అసహాయులకు, రోగగ్రస్థులకు ప్రేమను పంచే స్వభావం. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించాలన్న పొలిటికల్ ఫిలాసఫీ. అంబేడ్కర్, అబ్రహాం లింకన్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ లక్షణాలన్నీ ఆయన్ను వర్తమాన రాజకీయ నేతల మధ్య ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆయన స్వభావానికీ, ఫిలాసఫీకీ పూర్తి భిన్నమైన చిత్రీకరణతో ఆయన ఎదుర్కొన్నంత దుష్ప్రచారాన్ని దేశ రాజకీయ నాయకుల్లో ఎవరూ ఎదుర్కోలేదు. ఆయన మీద జరిగినన్ని కుట్రలు ఎవరి మీదా జరగలేదు. అయినా శిలాసదృశంగా నిలబడగలిగారంటే అందుకు కారణం ఆయన క్యారెక్టర్. నిజాయితీ. ఇదిగో ఈ నిజాయితీ జనంలోకి డైరెక్ట్గా కమ్యూని కేట్ అయింది. గోబెల్స్ గొలుసుల్ని తెంచుకొని, మీడియా గోడల్ని బద్దలు కొట్టుకొని మరీ ఆయన క్యారెక్టర్ జనం గుండె ల్లోకి వెళ్లిపోయింది.జగన్మోహన్రెడ్డి మీద జరిగిన కుట్రల కమామిషు, ఆయన నాయకుడుగా ఎదిగిన కథాక్రమం తెలుగు ప్రజలు ఎరిగిన సంగతులే. చర్విత చర్వణం అనవసరం. ప్రజలిచ్చిన అధికారాన్ని అయిదేళ్లపాటు ప్రజా సాధికారత కోసమే ఆయన ఖర్చు చేశారు. అంతకు ముందు పది శాతమున్న పేదరికాన్ని నవరత్న పథకాల సాయంతో నాలుగు శాతానికి తగ్గించ గలిగారు. వచ్చే ఐదేళ్ల లోపల పేదరికాన్ని నిశ్శేషం చేయడం కోసం ఆ రత్నాలకు మరింత మెరుగుదిద్దినట్టు శనివారం ఆయన విడుదల చేసిన మేనిఫెస్టోలో వెల్లడైంది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా చేసిన ప్రసంగం జగన్మోహన్రెడ్డి నిజాయితీకి అద్దం పట్టింది. ఆయన విజన్ను, తాత్వికతను మేనిఫెస్టో ఆవిష్కరించింది. ఒకపక్క ఆయన ప్రత్యర్థి అలవికాని వాగ్దానాలతో చెలరేగిపోతున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపెడుతున్నారు. బొందితో కైలాసానికి తీసుకెళ్తానన్న స్థాయిలో వాగ్దానాలు కురిపిస్తున్నారు. సూపర్ సిక్స్లు కొడతా నంటున్నారు. ప్రత్యర్థి చేస్తున్న ఈ ఊకదంపుడు... ముఖ్యమంత్రిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎందుకంటే, ఆయన పేరే ఒక నమ్మకంగా ప్రజల గుండెల్లో స్థిరపడిపోయింది.చంద్రబాబు బోగస్ హామీలను పూర్వపక్షం చేస్తూ జగన్మోహన్రెడ్డి మాట్లాడిన తీరు లైవ్లో చూస్తున్న లక్షలాది మంది టీవీ వీక్షకులను ఆకట్టుకున్నది. సంపద సృష్టించి హామీలు అమలుచేస్తానని చెబుతున్న చంద్రబాబు వాదనలోని డొల్లతనాన్ని ఆయన బయటపెట్టారు. చంద్ర బాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన పధ్నాలుగేళ్లూ ప్రతిపాదించిన బడ్జెట్లన్నీ రెవెన్యూ లోటునే చూపెట్టాయనీ, ఇక సంపద సృష్టించిందెక్కడనీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పేదల సంక్షేమం సాధికారతల పట్ల తనకంటే చిత్తశుద్ధి ఉన్న వారెవరూ లేరని చెబుతూ ప్రజలకు ఎంత గరిష్ఠంగా మేలు చేయగలమో ఆ మేరకే హామీలివ్వగలం తప్ప అబద్ధాలు చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పు లకు బాటలు పరుస్తూ, బలహీనవర్గాలు – మహిళల సాధికారత కోసం అడుగులు వేస్తూ సాగిన ఐదేళ్ల పాలన కొనసాగింపుగానే మరో ఐదేళ్ల పాలనకు సంబంధించిన మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఇది విప్లవ కర్తవ్యాల కొనసాగింపు. విద్యారంగంలో తాను ప్రవేశపెడుతున్న మార్పులు మరో పదిహేనేళ్లు కొనసాగితే పేదరికం ఆనవాళ్లు కూడా రాష్ట్రంలో కనిపించవని ఆయన నమ్ముతున్నారు. పేద విద్యార్థులందరూ సంపన్నుల బిడ్డలతో సమానంగా నాణ్యమైన విద్యను అభ్యసించగల పరిస్థితులను ప్రజలంతా స్వాగతించాలి. ప్రతి ఇంటినీ ఓ ఫ్యామిలీ డాక్టర్ సందర్శించగల అత్యున్నత స్థాయి వైద్య సేవల సమాజాన్ని నిండు మనసుతో ఆహ్వానించాలి. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో తరతరాలుగా వెనుకబడిన సమూహా లను, మహిళలను ముందడుగు వేయించే ప్రయత్నాలకు ప్రజ లందరూ భుజం కాయాలి. ఉన్నతస్థాయి సమాజ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాల వెన్నంటి నడవాలి. పేదల విముక్తికి అడ్డుగోడలా నిలబడుతున్న పెత్తందారీ శక్తులనూ, వారి రాజకీయ శిబిరాలనూ ఓడించాలి. లాంగ్ లివ్ ది రివల్యూషన్! ఇంక్విలాబ్ జిందాబాద్!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
కూటమి వెన్నులో వణుకు.. సీఎం జగన్ ప్రభంజనం..!
-
YSRCP: మరో జైత్రయాత్రకు సిద్ధం
సాక్షి, గుంటూరు: ఒకవైపు సంక్షేమ పథకాలు, అభివృద్ధి.. మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వంతో ప్రజాప్రతినిధుల్ని ప్రజలతో మమేకం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో జైత్రయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట నాలుగు భారీ బహిరంగ సభలు, 22 రోజులపాటు మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజా మద్దతు వైఎస్సార్సీపీకే ఉందని నిరూపించారాయన. ఎక్కువ విరామం తీసుకోకుండా మరో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారాయన. తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభంఈ నెల 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజూ 3 ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొనున్నారు. 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు.. 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండెపి, మైదుకూరు, పీలేరు.. మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో.. 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్మ్యాప్కు వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం.ప్రతిరోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆయా సభల్లో తన పాలనలో జరిగిన అభివృద్ధిని, కుల,మత,వర్గ, జాతి, రాజకీయ బేధాల్లేకుండా అందించిన సంక్షేమ లబ్ధిని వివరిస్తూనే.. మరోవైపు ప్రతిపక్ష కూటమి కుట్రలను ఎండగట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యలోనే ఆయన వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది. -
వార్ వన్ సైడే
నిన్ను చూడటానికే వచ్చానన్నా..బాపట్ల జిల్లా సంతమాగలూరు మండలం పుట్టావారిపాలెం అడ్డరోడ్డు వద్ద ఏప్రిల్ 10న మధ్యాహ్నం 1.30 గంటలకు 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలో సీఎం జగన్ను చూసేందుకు వేల్చూరు పంచాయతీ పరిధిలోని రామిరెడ్డిపాలెంకు చెందిన వెంకాయమ్మ పరుగెత్తుకొస్తోంది. మధ్యలో చెప్పులు తెగిపోయినా లెక్క చేయకుండా తారు రోడ్డుపై ఉత్త కాళ్లతోనే పరుగులు తీస్తున్న ఆమెను చూసిన సీఎం జగన్.. బస్సు ఆపించారు. ఆమెను దగ్గరికి పిలిచారు. ‘ఏం తల్లీ బాగున్నావా? ఏమైనా సమస్య ఉందా..’ అంటూ ఆత్మియంగా పలకరించారు. ‘జగనన్నా.. నీ పాలనలో నాకు ఎలాంటి సమస్య లేదు. నిన్ను దగ్గరి నుంచి చూద్దామని, పలకరిద్దామనే వచ్చా’ అని చెబుతూ మురిసిపోయింది.► కృష్ణా జిల్లా నందివాడ మండలం పుట్టగుంటకు ఒక కిలోమీటరు దూరంలో ఏప్రిల్ 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మండుతున్న ఎండలో సీఎం జగన్ను చూసేందుకు పొలాల వెంట 20–25 మంది మహిళలు పరుగులు పెడుతూ వస్తున్నారు. ఇది గమనించిన సీఎం జగన్ బస్సు నుంచి కిందకు దిగారు. మహిళలంతా సీఎం జగన్ చుట్టూ చేరారు. ‘విజయవాడలో మీపై రాయితో దాడి చేశారని తెలిసి తల్లడిల్లిపోయాం. మంచి చేసిన మిమ్మల్ని ప్రజలంతా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనే అక్కసుతో టీడీపీ వాళ్లు మీపై దాడి చేయించారు.. జాగ్రత్తగా ఉండు జగనన్నా.. మీరు బాగుంటేనే మేం బాగుంటాం’ అంటూ తోడబుట్టిన అన్నగా భావిస్తూ పరామర్శించారు. ► కాకినాడ జిల్లా సామర్లకోట ముఖ ద్వారం వద్ద ఏప్రిల్ 19న మధ్యాహ్నం ఒంటి గంటకు మండే ఎండలో వేలాది మంది మహిళలు రోడ్డుపై నిలబడ్డారు. సీఎం జగన్ బస్సు అక్కడకు రాగానే మహిళలు హర్షధ్వానాలు చేశారు. బస్సు దిగిన సీఎం జగన్.. వారితో ముచ్చటించారు. ‘జగనన్నా.. మీరు మాకు మంచి చేశారు. మేం మళ్లీ మిమ్మల్ని గెలిపించుకుని సీఎంగా చేసుకుంటాం’ అంటూ భరోసా ఇచ్చారు. గుమ్మడి కాయలతో దిష్టి తీసి.. హారతులు ఇచ్చి దీవించారు. ► వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ఆత్మియత, అనుంబంధాలకు అద్దం పట్టే ఇలాంటి దృశ్యాలు అడుగడుగునా కన్పించాయి. ఇలాంటి దృశ్యాలు రాజకీయాల్లో అత్యంత అరుదుగా కన్పిస్తుంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మాటపై నిలబడి.. నిబద్ధత, నిజాయితీతో పని చేసే నాయకుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారనడానికి సీఎం జగన్ బస్సు యాత్రే నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు.బస్సు యాత్ర సాగినంత దూరం.. మండుటెండైనా అర్ధరాత్రయినా లెక్క చేయకుండా స్కూలు పిల్లల నుంచి అవ్వాతాతల వరకు మానవ హారంగా ఏర్పడి సీఎం జగన్కు నీరాజనాలు పలకడం దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచిపోతుందని చెబుతున్నారు. ‘ఫలానా పనులు చేస్తాం.. మాకు ఓటేయండి’ అని రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు అడగడం సాధారణమని, కానీ.. ‘జగనన్నా.. మీరు మంచి చేశారు.. మిమ్మల్ని మళ్లీ గెలిపించి సీఎంగా చేసుకుంటాం’ అని ప్రజలు అడుగడుగునా భరోసా ఇస్తుండటం చరిత్రలో తామెన్నడూ చూడలేదని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. –మరిన్ని వివరాలు ఐఐఐలోసాక్షి, అమరావతి: రాష్ట్రంలో 22 రోజుల పాటు సాగిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్ను చూసేందుకు ఆద్యంతం జనం ప్రభంజనంలా తరలివచ్చారు. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న సీఎం జగన్ వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రను ఆరంభించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి సమీపంలో అక్కవరం బహిరంగ సభతో పాదయాత్రను ముగించారు. 23 జిల్లాల్లో 86 నియోజకవర్గాల్లో 2,188 కి.మీల దూరం బస్సు యాత్ర సాగింది.యాత్రలో 16 భారీ బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. వివిధ వర్గాల ప్రజలతో ఆరు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర తొమ్మిది ప్రాంతాల్లో భారీ రోడ్ షోలు నిర్వహించారు. బస్సు యాత్ర ప్రారంభమైన ఇడుపులపాయ నుంచి ఈనెల 13న విజయవాడలో జరిగిన రోడ్ షో వరకూ యాత్ర సాగినంత దూరం కెరటాల్లా జనం పోటెత్తారు. విజయవాడలో లక్షలాది మంది ప్రజలు రోడ్ షోలో సీఎం జగన్కు నీరాజనం పలుకుతుండడం చూసి ఓర్వలేక టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. సీఎం జగన్ను లక్ష్యంగా చేసుకుని పదునైన రాయితో గురిపెట్టి కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. విజయవాడ నుంచి సునామీలా పోటెత్తిన జనం విజయవాడలో తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత.. వైద్యుల సలహా మేరకు ఈనెల 14న విశ్రాంతి తీసుకున్న సీఎం జగన్ ఈ నెల 15 నుంచి యాత్రను కొనసాగించారు. సీఎం జగన్పై టీడీపీ నేతలు హత్యాయత్నానికి తెగబడటంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఈనెల 15 నుంచి సీఎం జగన్ బస్సు యాత్రకు సునామీలా జనం పోటెత్తి సంఘీభావం తెలిపారు. ఎన్టీఆర్, కృష్ణా, గోదావరి జిల్లాల్లో దారి పొడవునా జనం బారులు తీరి సీఎం జగన్కు మద్దతు తెలిపారు.రాజమహేంద్రవరంలో నిర్వహించిన రోడ్ షోకు లక్షలాది మంది ప్రజలు కదలిరావడం కూటమి వెన్నులో వణుకు పుట్టించింది. ఇక విశాఖపట్నంలో నిర్వహించిన రోడ్ షోకు లక్షలాది మంది జనం పోటెత్తడంతో కూటమి వణికిపోయింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ బస్సు యాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. ఘోర పరాజయం భయంతో వణికిపోతున్న టీడీపీ సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి(ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు(రాయలసీమ), మేదరమెట్ల(దక్షిణ కోస్తా)లో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు లక్షలాది మంది పోటెత్తడంతో గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్ర.. తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా నిలిచిపోయాయి. టీడీపీ–జనసేన జత కలిశాక తాడేపల్లి గూడెంలో నిర్వహించిన జెండా సభ, బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక చిలకలూరిపేటకు ప్రధానిని రప్పించి నిర్వహించిన సభకు జనం మొహం చాటేయడంతో కూటమి ఆందోళన చెందింది.ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం జగన్ నిర్వహించిన బస్సు యాత్రకు.. రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర.. ప్రాంతం ఏదైనా జనం నీరాజనాలు పలికారు. బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన 16 సభలకు లక్షలాది మంది ప్రజలు పోటెత్తారు. ఉమ్మడి రాష్ట్ర.. తెలుగు రాష్ట్రాల చరిత్రలో విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలలో సీఎం జగన్ నిర్వహించిన రోడ్ షోలు అతి పెద్ద మానవ హారంగా నిలిచిపోతాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.ఇదే సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా నిర్వహించిన సభలకు.. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో కలిసి వారిద్దరూ నిర్వహించిన సభలకు జనం రాకపోవడంతో ఘోర పరాజయం తప్పదనే నిర్ణయానికి ఆ నేతలు వచ్చేశారు. తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. సీఎం జగన్పై దూషణలకు దిగుతూ, వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు తెగబడాలని ఆ పారీ్టల కార్యకర్తలను రెచ్చగొడుతుండటమే అందుకు తార్కాణం. సీఎం జగన్ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిందని, ఎన్నికల్లో పోటీ ఏకపక్షమేనని.. వైఎస్సార్సీపీ విజయం లాంఛనమేనని తేల్చి రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. బస్సు యాత్ర జైత్ర యాత్రలా సాగడంతో టీడీపీ–జనసేన–బీజేపీ నేతల్లో ప్రకంపనలు రేపుతోంది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు భారీ ఎత్తున వైఎస్సార్సీపీలో చేరడం.. వేలాది మంది క్రియాశీలక కార్యకర్తలు వారి బాటనే అనుసరించడంతో ఆ పార్టీ నేతల్లో నైతిక స్థైర్యం దెబ్బతింది. ఘోర పరాభవం తప్పదనే నిర్ణయానికి వచ్చిన టీడీపీ, జనసేన అధ్యక్షుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్.. తీవ్ర నిరాశ, నిస్పృహలతో సీఎం జగన్పై దూషణలకు దిగుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
టెక్కలి గడ్డపై పంచులతో విరుచుకుపడ్డ సీఎం జగన్
-
పులివెందులలో సీఎం జగన్ నామినేషన్
-
టెక్కలి సభలో సీఎం జగన్ మాటల తూటాలు
-
22 రోజులు, 2100 కిలోమీటర్లు 16 బహిరంగ సభలు, 9 భారీ రోడ్ షోలు
-
ఒక ఛాన్స్ ఇవ్వండి.. మంచి చేస్తాడు వెనుక నేనుంటా.!
-
సింగపూర్ బాబు పై సీఎం జగన్ పేల్చిన మాటల తూటాలు
-
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
జగన్ చేయలేని స్కీములు.. చంద్రబాబు కాదుకదా వాళ్ల జేజమ్మ కూడా చేయలేరు..!
-
సిద్ధం అంటే అసలు అర్థం ఏంటో తెలుసా..!
-
జగన్ కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి..!
-
ఈ యాత్ర వైఎస్సార్సీపీ జైత్రయాత్రకు సంకేతం: సీఎం జగన్
-
టెక్కలిలో సింహం వేట .. సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
Watch Live: టెక్కలి మేమంతా సిద్ధం సభ
-
ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన సీఎం జగన్ బస్సు యాత్ర
-
YS Jagan మేమంతా సిద్ధం యాత్ర: స్కాట్లాండ్ యూకేలో సంఘీభావం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం యాత్రకు APలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్న వేల UK Scotland లోని ఎడిన్బర్గ్లో వైయస్సార్సీపీ UK కన్వీనర్లు డా ప్రదీప్ చింతా , ఓబులేరెడ్డి పాతకోట ఆధ్వర్యంలో మేమంతా సిద్ధం సంఘీబావ సభ నిర్వహించారుపేద ప్రజల అభ్యిన్నతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు 59 నెలలుగా కష్టపడుతున్నారు , మనమంతా ఈ ఒక్క నెలా జగనన్నకోసం కష్టపడి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలనిడా ప్రదీప్ చింతా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలు జగనన్నకు బ్రహ్మరథం పడుతున్నారు, 175 సీట్లు తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మేమంతా సిద్ధం నినాదంతో సభాప్రాంగణం మారుమ్రోగిందిఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ UK కమిటీ సభ్యులు అనిల్ బెంజిమెన్, ప్రభాకర్ రెడ్డి అవుతాల, విజయ్ పెండేకంటి, శ్రీకాంత్ పసుపుల, రఘు, దుష్యంత్ రెడ్డి, జోయెల్, రామిరెడ్డి పుచ్చకాయల, సాయి, కార్తీక్ భూమిరెడ్డి, క్రాంతి పాలెం, త్రినాథ్, గురు, శ్రీనివాస్ వరిగొండ, వాసూ విడుదల, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. యూకే నలుమూలలనుండి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.Read this article in English : Solidarity rally for YSRCP's Memantha Siddham yatra in Scotland -
మేమంతా సిద్ధం యాత్రకు స్కాట్లాండ్ లో సంఘీభావం
-
శ్రీకాకుళంలో ధూమ్ ధామ్..!
-
22 రోజుల బస్సు యాత్రతో సీఎం జగన్ కు పెరిగిన గ్రాఫ్
-
శ్రీకాకుళం జిల్లాలో కూటమికి ఎదురుదెబ్బ
శ్రీకాకుళం, సాక్షి: జనం అంతా జగన్ వెంటే.. మేమంతా సిద్ధం యాత్రతో ఈ విషయం మరోసారి స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే రాజకీయంగానూ అధికార పార్టీ మరింత బలపడుతోంది. కూటమికి షాకిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు.తాజాగా బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఉదయం ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో ప్రతిపక్షాలకు సంబంధించిన కొందరు నేతలు తమ అనుచరగణంతో సహా వైఎస్సార్సీపీలో చేరారు. వీళ్లలో పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మాజీ జడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు, అలాగే పార్వతీపురం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణిలు ప్రముఖంగా ఉన్నారు. పలాస నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె శిరీషలు వైఎస్సార్సీపీలో చేరారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం భారతీయ జనతాపార్టీకి చెందిన మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు, ఆయన కుమారుడు పెద్దింటి రామస్వామినాయుడు YSRCP కండువా కప్పుకున్నారు.ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్, మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావులు వైఎస్సార్సీపీలో చేరారు.సీఎం జగన్ వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు తాము సిద్ధం అని ప్రకటించారు. -
జగన్ మార్కుతో సమాజం ‘సిద్ధం’: సీఎం వైఎస్ జగన్
సమాజంలో ప్రతి రంగాన్ని మీ బిడ్డ ప్రభుత్వం అధికారం దక్కిన మొదటి రోజు నుంచే ఎలా సిద్ధం చేసిందో మీరే గమనించాలని కోరుతున్నా. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని మార్పులతో గ్రామస్థాయిలో వ్యవసాయ రంగం సిద్ధం! విప్లవాత్మక మార్పులతో మన గవర్నమెంట్ బడి సిద్ధం! గ్రామస్థాయి నుంచి వైద్య ఆరోగ్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులతో గవర్నమెంట్ ఆస్పత్రి సిద్ధం! పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికీ సేవలందిస్తున్న వలంటీర్ల వ్యవస్థ సిద్ధం! ఏకంగా 1.35 లక్షల మంది శాశ్వత ఉద్యోగాలతో మన చెల్లెమ్మలు, తమ్ముళ్లు దాదాపు 600 రకాల సేవలందిస్తూ మన గ్రామాల్లో సచివాలయాల్లో సిద్ధం! 58 నెలల్లో గ్రామ స్వరాజ్యం సిద్ధం! పట్టణాల్లో సైతం ఇంటింటికీ పౌరసేవలు సిద్ధం! దేశ చరిత్రలో తొలిసారిగా లంచాలు, వివక్ష లేకుండా రూ.2.70 లక్షల కోట్లు ఇంటింటికీ డోర్ డెలివరీ చేసిన వ్యవస్థ సిద్ధం! ఒకటో తేదీనే ఇంటికే వచ్చి రూ.3,000 పెన్షన్ ఇచ్చే వలంటీర్ల వ్యవస్థ సిద్ధం! ఇదీ మీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు. – సీఎం జగన్ సాక్షి, శ్రీకాకుళం: ‘‘ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు సిక్కోలు సింహాలు ఇవాళ ఇక్కడకు కదలివచ్చాయి. ఈ విప్లవ గడ్డపై ఆ పెత్తందార్ల ముఠాపై ఎగురవేస్తున్న తిరుగుబాటు బావుటా కనిపిస్తోంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగడుగునా జన సముద్రమే. వైఎస్సార్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు దారి పొడవునా జన సునామీని చూస్తుంటే 25 ఎంపీలకు 25 ఎంపీలు, 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు మొత్తంగా డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా?’’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. 22 రోజుల పాటు సాగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు సందర్భంగా బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం అక్కవరం వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ..బలమైన పునాదులతో..ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో 18 రోజుల్లో జరగనున్నాయి. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదు. ఈ 58 నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తెచ్చిన పలు సంస్కరణలు, పథకాలు కొనసాగాలా? వద్దా? అనేది నిర్ణయించే ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేయమంటే పథకాలన్నింటికీ ముగింపే. మళ్లీ మోసపోవటమే. జగన్ను ఓడించాలని వాళ్లు.. పేదలను గెలిపించాలని మనం తలపడుతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా? మంచి చేసిన చరిత్రగానీ, పేదల ఆశీస్సులుగానీ లేని ఆ మూడు పార్టీల కూటమి, వారి మోసాలకు చెంప ఛెళ్లుమనేలా సమాధానం చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? కుటుంబంతో చర్చించండిసినిమాకు వెళ్లినప్పుడు హీరో ఎందుకు నచ్చుతాడు? విలన్ ఎందుకు నచ్చడో ఒక్కసారి ఆలోచించండి. గుణగణాలు, మంచితనం వల్ల మా హీరో అని అనుకుంటాం. మోసాలు, అబద్ధాలు, కుట్రలు పన్నే క్యారెక్టర్ను విలన్ అంటాం. నిజ జీవితంలో, రాజకీయాల్లో హీరో ఎవరు? విలన్ ఎవరు? అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. మీరంతా ఇంటికి వెళ్లాక కాసేపు కుటుంబ సభ్యులతో కూర్చుని నింపాదిగా మాట్లాడండి. చిన్నపిల్లల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోండి. అవ్వాతాతలు, ఆడపడుచుల అంతరంగాన్ని గమనించండి. ఎవరి పాలనలో మంచి జరిగింది? ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందనే నమ్మకం కలుగుతుందో వారితోనే అడుగులు ముందుకు వేయాలని కోరుతున్నా. మీ గుండె చప్పుడే ‘‘సిద్ధం’’పొత్తుల జిత్తులు, జత కట్టిన జండాలకు బదులిస్తూ జగన్ వెనుక ఎన్ని కోట్ల మంది పేదలున్నారో చూపిస్తే అదే.. సిద్ధం! సామాన్యులు, పేదల గుండె చప్పుడే ఈ సిద్ధం. ఇడుపులపాయలో మొదలై ఇచ్ఛాపురం వరకు సాగిన ఈ బస్సు యాత్ర మన పార్టీ జైత్రయాత్రకు సంకేతం. ఇది మూడు నాలుగు నెలల క్రితం మొదలు పెట్టింది కాదు. ఓ 25 సభలతో వచ్చింది కాదు. మనందరి ప్రభుత్వం 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తెస్తూ చేస్తున్న యుద్ధమే ఈ సిద్ధం. ఆ చైతన్యం పేరే..ఇక్కడ నిర్వహిస్తున్న సభ పేరు మాత్రమే కాకుండా మరో ఐదేళ్లు ఈ మార్పులన్నీ కొనసాగాలని ఇంటింటికీ వెళ్లి వారు మరో వంద మందికి వివరించాల్సిన అవసరాన్ని చెప్పే అవసరమే ఈ సిద్ధం! మీకు మంచి జరిగి ఉంటే.. మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవాలని ప్రజలను కోరే ధైర్యమే సిద్ధం! ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుటలో పారేసే చంద్రబాబు సంస్కృతిని సమాధి కట్టి 99 శాతం వాగ్దానాలను నెరవేర్చి ఇంటింటికీ మళ్లీ ఆ మేనిఫెస్టోను పంపి ఎన్నికల వాగ్దానాలపై చేసిన చైతన్యం పేరే సిద్ధం!పేదలు, అక్కచెల్లెమ్మలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా సాధికారత దిశగా చెయ్యి పట్టుకుని నడిపించే ఘటమే ఈ సిద్ధం! ఇంతగా సిద్ధమైన సమాజంతో, మీ జగన్ పార్టీతో యుద్ధానికి బాబు మరో మూడు పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తోంది. పరోక్షంగా కూడా పొత్తులు వెతుక్కోవాల్సి వస్తోంది. కుట్రలకు దిగజారాల్సి వస్తోంది. నాలుగు మంచి పనులు చేశానని చెప్పలేని చంద్రబాబు రోజూ నన్ను తిట్టడం, తిట్టించడం, వారి ఛానళ్లు, పత్రికల్లో అదో ఘనకార్యమన్నట్లుగా చూపిస్తున్నారు. ఇది గొప్ప రాజకీయం అవుతుందా? మన అభ్యర్థులను ఆశీర్వదించండిఎంపీ అభ్యర్థి తిలక్, టెక్కలి నుంచి శ్రీను, ఆమదాలవలస నుంచి తమ్మినేని సీతారామ్, పలాస నుంచి డాక్టర్ అప్పలనాయుడు, పాతపట్నం నుంచి శాంతమ్మ, ఇచ్చాపురం నుంచి విజయమ్మ, నర్సీపట్నం నుంచి ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావును ఆశీర్వదించి గెలిపించాలని కోరుతున్నా. ఏనాడైనా ఆత్మవిమర్శ చేసుకున్నారా?మన ప్రభుత్వం వల్ల పేదల కుటుంబాల్లో, వారి చదువుల్లో, అక్కచెల్లెమ్మల సాధికారతలో, అవ్వాతాతలకు అందిన మనశ్శాంతిలో, రైతన్నలకు అందిన ఆత్మస్థైర్యంలో, సామాజిక వర్గాలకు దక్కిన ఆత్మగౌరవంలో ఎంత మార్పు తీసుకురాగలిగామో టీడీపీ, చంద్రబాబు, ఆయనకు దరువు వేసే ఎల్లో మీడియా ఏనాడైనా కనీసం ఆత్మవిమర్శ చేసుకోవడం చూశారా? ఇలాంటి వారికి పరిపాలన ఇవ్వడం అంటే అర్థమేమిటి? ప్రభుత్వం అనేది ఎవరి కోసం? అందమైన వాగ్ధానాలతో అధికారం లాక్కుని ఐదేళ్లు వంచించటానికి, లూటీ చేసి దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, దాచుకోవడం కోసమే వారికి అధికారం కావాలని అడుగుతున్నారు. బాబు రోల్డ్ గోల్డ్ దుకాణం..మీ బిడ్డ కరోనా కష్టంలో కూడా సాకులు వెతుక్కోలేదు. ఏ ఒక్క పథకాన్నీ, బటన్లు నొక్కటాన్ని ఆపలేదు. పేదవారి కష్టం తన కష్టం కంటే ఎక్కువని భావించాడు. మీ జగన్ స్వచ్ఛమైన మనసుతో, మంచి చేశాననే ఆత్మవిశ్వాసం, ఆత్మ సంతృప్తితో మీ ముందు సవినయంగా తలెత్తుకుని నిలబడ్డాడు. 2014 ఎన్నికల్లో కూడా చేయలేని ఏ వాగ్దానాలనూ మేనిఫెస్టోలో మీ బిడ్డ చెప్పలేదు. రాష్ట్ర ప్రజలు, నమ్ముకున్న వారిని ఎన్నటికీ మోసం చేయడు. బాబు మాదిరిగా రోల్డ్ గోల్డ్ దుకాణం తెరవడు.దాన్ని బంగారం అని నమ్మించే యత్నం చేయడు. చంద్రబాబు నిర్వహించే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు. 14 ఏళ్లు అధికారంలో ఉండీ ఏ ఒక్క మంచి పని చేయని చంద్రబాబుతో మీ బిడ్డ పోటీ పడడు. మీ జగన్ మార్కు ఇవాళ ప్రతి పేద ఇంట్లోనూ కనిపిస్తుంది. ప్రతి అక్కచెల్లెమ్మ చిరునవ్వులో, అవ్వాతాతల ఆనందంలో, పిల్లల ఆత్మవిశ్వాసంలో కనిపిస్తుంది. మీ జగన్ మార్కు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. జగన్కు పేదలపై ఉన్నంత ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికీ లేదు, ఉండదు. ఇది నిజం. ఇది మాత్రమే నిజం. ఇదీ చదవండి: యువనేత జైత్రయాత్ర!నావల్ల కానిది బాబు జేజమ్మ కూడా చేయలేదు..జగన్ చేయలేని ఏ స్కీమ్నూ చంద్రబాబు కాదు కదా.. ఆయన జేజమ్మ కూడా చేయలేదు! మోసాలు, అబద్ధాలతో ఏ స్థాయికైనా దిగజారి పొత్తులు పెట్టుకునే ఆయనతో మీ బిడ్డ పోటీ పడలేడు. నిజాలు, నిజాయితీకి ప్రజలు విలువ ఇస్తారన్న నమ్మకం నాకుంది. బాబు మాదిరిగా నేను మోసపూరిత వాగ్దానాలు చేయను. మోసాన్ని మోసంతోనే జయించాలన్న రాజనీతిని మీ బిడ్డ పాటించడు. మోసాన్ని నిజాయితీతోనే జయించవచ్చని నిరూపించటానికి మీ బిడ్డ సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమేనా? మోసాలా.. విశ్వసనీయతా? మీకు ఎలాంటి నాయకుడు కావాలని అందరినీ అడుగుతున్నా. బాబు లాంటి మోసగాడు కావాలా? జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా? మేనిఫెస్టోలో చెప్పేవన్నీ ఎగ్గొట్టే నాయకుడు అబద్ధాలు, వెన్నుపోట్లు నైజంగా కలిగిన నాయకుడు కావాలా? లేక నోటి నుంచి ఒక మాట వస్తే, మేనిఫెస్టోలో చేరిస్తే తు.చ. తప్పకుండా పాటించే జగన్ లాంటి నాయకుడు కావాలా? సొంత బలం లేక పొత్తుల డ్రామాలాడే నాయకుడు కావాలా? లేక చేసిన మంచిని చూపిస్తూ సింహంలా సింగిల్గా వచ్చే నాయకుడు కావాలా? మోసాలు చేసే చంద్రబాబు కావాలా? విశ్వసనీయతతో నిలబడే జగన్ కావాలా? తమ నాయకుడి గురించి కాలర్ ఎగరేసి గర్వంగా ఇంటింటికీ చెప్పుకోగలిగిన మీ బిడ్డ కావాలా? చెప్పిన మాటలు గాలికి వదిలేసే బాబు కావాలా? వ్యత్యాసాన్ని తుడిచి వేస్తూ..పిల్లలెవరకూ తమ కులం, మతం, ఆర్థిక పరిస్థితుల వల్ల మంచి చదువులు చదువుకోలేకపోయామని బాధపడేందుకు వీల్లేని సమ సమాజాన్ని మీ బిడ్డ నిర్మిస్తున్నాడు. ధనికులు, పేదలకు వేర్వేరు చదువులు అనే వ్యత్యాసాన్ని మీ బిడ్డ తుడిచి వేస్తున్నాడు. ఒక రైతు, ఒక కూలీ, చిరువ్యాపారి, పేద కుటుంబం, నిరుపేద సామాజిక వర్గం.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం నా కుటుంబానికి మంచి చేసిందని, ఆ మంచిని కొనసాగిస్తుందనే నమ్మకాన్ని ఇవ్వగలిగే పరిపాలనను 58 నెలలుగా అందిస్తున్నాడు. వ్యవస్థలు బాగుండాలంటే..మోసాలు, అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్రం, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమైతే వారి చీకటి యుద్ధాన్ని, ఆ ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సెల్ఫోన్లలో టార్చిలైట్లను వెలిగించండి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పేదలకు పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలనతో ముందుకు పోవాలన్నా, మన వ్యవస్థలన్నీ బాగుండాలన్నా ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లోనూ గొప్ప మెజార్టీతో గెలిపించాలి. బలమైన పునాదులతో..ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో 18 రోజుల్లో జరగనున్నాయి. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదు. ఈ 58 నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తెచ్చిన పలు సంస్కరణలు, పథకాలు కొనసాగాలా? వద్దా? అనేది నిర్ణయించే ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేయమంటే పథకాలన్నింటికీ ముగింపే. మళ్లీ మోసపోవటమే. జగన్ను ఓడించాలని వాళ్లు.. పేదలను గెలిపించాలని మనం తలపడుతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా? మంచి చేసిన చరిత్రగానీ, పేదల ఆశీస్సులుగానీ లేని ఆ మూడు పార్టీల కూటమి, వారి మోసాలకు చెంప ఛెళ్లుమనేలా సమాధానం చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? కుటుంబంతో చర్చించండిసినిమాకు వెళ్లినప్పుడు హీరో ఎందుకు నచ్చుతాడు? విలన్ ఎందుకు నచ్చడో ఒక్కసారి ఆలోచించండి. గుణగణాలు, మంచితనం వల్ల మా హీరో అని అనుకుంటాం. మోసాలు, అబద్ధాలు, కుట్రలు పన్నే క్యారెక్టర్ను విలన్ అంటాం. నిజ జీవితంలో, రాజకీయాల్లో హీరో ఎవరు? విలన్ ఎవరు? అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. మీరంతా ఇంటికి వెళ్లాక కాసేపు కుటుంబ సభ్యులతో కూర్చుని నింపాదిగా మాట్లాడండి. చిన్నపిల్లల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోండి. అవ్వాతాతలు, ఆడపడుచుల అంతరంగాన్ని గమనించండి. ఎవరి పాలనలో మంచి జరిగింది? ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందనే నమ్మకం కలుగుతుందో వారితోనే అడుగులు ముందుకు వేయాలని కోరుతున్నా. 2014లో చంద్రబాబు ముఖ్యమైన మోసాలివీ..► రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? ► పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా?► ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశారా?► ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఒక్కరికైనా ఇచ్చాడా?► అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తామన్నారు. ఏ పేదవాడికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా?► రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ అన్నాడు. చేనేత, పవర్లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. మరి అయ్యాయా?► మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి చేశాడా? ► సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. చేశాడా? ► ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. కట్టాడా? టెక్కలిలో లేదా శ్రీకాకుళంలో ఏమైనా కనిపిస్తోందా? ► ముఖ్యమైన హామీలంటూ ఒక్కటైనా నెరవేర్చాడా? ► పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా అంటే అదీ లేదు.► ఇప్పుడు సూపర్ సిక్స్, సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కార్ అంటూ మళ్లీ మోసాలకు తయారయ్యారు. -
జైత్రయాత్రను తలపించిన సీఎం జగన్ బస్సుయాత్ర
నేను కోరినట్లే నాకు అధికారం ఇచ్చారు. కానీ నేను దాన్ని అధికారం అనుకోలేదు. మిమ్మల్ని చూసుకునే బాధ్యత అనుకున్నాను. ప్రతి ఇంట్లో, ప్రతివ్యక్తికి మంచి చేసే అవకాశం మీరు ఇచ్చారు అనుకున్నాను. నేనూ అలాగే నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. ప్రతి ఇంటికి మేలు చేశాను. ఇది మీ ప్రభుత్వం. మీ తమ్ముడి ప్రభుత్వం.. మీ సోదరుడి ప్రభుత్వం గత డెబ్బై ఏళ్లలో ఏ ప్రభుత్వానికి సాధ్యం కానివి ఎన్నో చేసి చూపించాను.నేను చెప్పినవన్నీ నిజం అనిపిస్తే, నేను నిజంగా మీకు మేలు చేశాను అనిపిస్తే నాకు ఓటు వేయండి. లేదులేదు నేను మీకేమీ చేయలేదనిపిస్తే నాకు ఓటేయవద్దు అని చెబుతూ.. తన ఐదేళ్ల పాలన మీద మార్కులు వేయించుకునేందుకు ప్రజా స్పందన తెలుసుకునే నిమిత్తం సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజుతో ముగిసింది.మార్చి 27న ఇడుపులపాయలో ప్రారంభమైన బస్సుయాత్ర నేడు టెక్కలిలో ముగిసింది. 22 రోజుల పాటు 2100 కిలోమీటర్ల మేర జరిగిన ఈ బస్సు యాత్ర ఒక జైత్రయాత్రను తలపించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 15 బహిరంగ సభల్లో సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు. ఆరు ప్రత్యేక సమావేశాల్లో జగన్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 86 నియోజకవర్గాలోని కోట్లమందికి స్పృశిస్తూ సాగిన ఈ యాత్ర ఒక ఆత్మీయ యాత్రగా మారింది.ఎక్కడికక్కడ మహిళలు, వృద్ధులు.. రైతులు..యువత తమ అభిమాన నాయకున్ని చూసేందుకు నిప్పులుగక్కే ఎండను సైతం లెక్క చేయకుండా వేచి ఉన్నారు. ఆయనవెంట ..ఆ బస్సు వెంట పరుగులు తీసిమరీ సెల్ఫీలు సంపాదించి దాన్ని అపురూపంగా దాచుకున్న యువతీయువకులు ఎంతోమంది. మా అన్నకు కష్టం చెప్పుకుని సాంత్వన పొందాలని భావించి ఆయన్ను కలిసి గోడువెళ్లబోసుకుని కన్నీళ్లు తుడుచుకుని భరోసాతో అన్నకు బైబై అంటూ సాగనంపిన ఆడబిడ్డలు ఎంతోమంది. మనవడా.. నువ్వు మళ్ళీ రావాలి మాకందరికీ మంచి చేయాలి అంటూ ఆశీర్వదించి పంపిన అవ్వాతాతల ఆశీర్వాదాలు ఆ బస్సులో మూటలు మూటలుగా పేరుకుపోయాయి.మామయ్యా మళ్ళీ నువ్వొస్తావుగా అంటూ వీడ్కోలు పలికిన పిల్లల చిరునవ్వులు జగన్ మోములో ప్రతిబింబించాయి. ఇలా ఒకటా రెండా.. ఎన్నో గుండెలను, ఎంతోమంది మనసులను తడుముతూ ఈ యాత్ర సాగింది. తాను గతంలో ప్రతిపక్ష నేతగా నడిచి వెళ్లిన మార్గంలో మళ్ళీ ఇప్పుడిలా, అప్పుడు ఎలా ఉండే స్కూళ్ళు ఇప్పుడెలా మారాయి అప్పుడు కష్టాలతో కన్నీళ్లు ఇంకిన కళ్ళు ఇప్పుడు తనను ఆనందం నింపిన ప్రేమతో దగ్గరకు పిలుస్తుంటే ఏ నాయకుడికి మాత్రం ఆనందం కాదు.ఈ యాత్ర మొత్తం రాష్ట్ర రాజకీయ చిత్రాన్ని, ప్రజల మూడ్ను మార్చేసింది. ఎక్కడికక్కడ జగన్ మావాడే . నేను సైతం జగన్ వెంట అంటూ వేర్వేరు పార్టీల నుంచి వచ్చి చేరుతున్నవాళ్ళతో జిల్లాల్లో పార్టీ విభాగం కిక్కిరిసిపోతోంది. రానున్న ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేదానికి ఈ బస్సు యాత్ర ఒక నిదర్శనం.. మళ్ళీ వస్తాను..మీకు మరింత మంచి చేస్తాను..అని చెబుతూ జగన్ వెళుతున్న దారిని చూస్తూ ప్రజలు అరచేతుల్లోనే హారతి కర్పూరాలు వెలిగించి విజయీ భావ అంటూ ఆశీర్వదించి పంపించారు.-సిమ్మాదిరప్పన్న -
టెక్కలి సభలో సీఎం జగన్ పొలిటికల్ పంచ్లు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ‘‘మీ బిడ్డకు ఓటేస్తేనే.. పథకాలు కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే.. పథకాలన్నీ ముగింపే. కూటమి మోసాలకు చెంప చెళ్లుమనిపించాలంటూ టెక్కలి బహిరంగ సభ వేదికగా ప్రతిపక్షాల కుట్రలను సీఎం జగన్ తిప్పికొట్టారు. అబద్ధపు హామీలిచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. దోచుకోవడం, పంచుకోవడం వారి అలవాటు. మీ బిడ్డ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేశాం. ధనికులకు, పేదలకు వేర్వేరు చదువుల వ్యత్యాసం తుడిచివేశాం. డబుల్ సంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలి’’ అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్..బాబు లాంటి మోసగాడు కావాలా? జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా?చంద్రబాబు మోసాలు, అబద్దాలు, వెన్నుపోట్లతో నేను పోటీ పడలేను.చంద్రబాబులాగా నేను మోసపు హామీలు ఇవ్వనుఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు సంస్కృతిని చూశాం చంద్రబాబు పేరు చెబితే ఒక మంచి పని కూడా గుర్తుకురాదు.పేద ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలువిద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధంవైద్యరంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వాసుపత్రులు సిద్ధంఇంటింటికి పౌరసేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం600లకు పైగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు సిద్ధంమంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మీ జగన్ మార్క్.. ప్రతి పేదింట్లో కనిపిస్తోందిమీ జగన్ మార్క్.. అక్కా చెల్లెమ్మల చిరునవ్వులో కనిపిస్తుందిమీ జగన్ మార్క్.. ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోందిమాట మీద నిలబడే మీ జగన్ కావాలా?. మోసం, దగా చేసే చంద్రబాబు కావాలా? ఆలోచన చేయండి2014లో ఇదే కూటమి చేసిన మోసాలు గుర్తున్నాయా?రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు..చేశాడా?ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?అర్హులకు మూడు సెంట్ల ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?10వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ అన్నాడు.. చేశాడా?సింగ్పూర్ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుందిఇంటింటికి కేజీ బంగారం, బెంజ్కారు ఇస్తారంట నమ్ముతారా?.ఈ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మీరంతా సిద్ధమా?ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు వస్తున్నాడు -
సీఎం జగన్ బస్సు యాత్ర బ్రహ్మరథం పడుతున్న జనం
-
ఈ యాత్ర వైఎస్సార్సీపీ జైత్రయాత్రకు సంకేతం: సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఈ యాత్ర వైఎస్సార్సీపీ జైత్రయాత్రకు సంకేతం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలి వద్ద నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ‘‘సిక్కోలు జనం సింహాల్లా కదిలివచ్చారు. వైఎస్సార్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరుకూ జన సముద్రాలే కనిపించాయి. శ్రీకాకుళం జిల్లాలో జన సముద్రం కనిపిస్తోంది. డబుల్ సంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమా?’’ అంటూ సీఎం పిలుపునిచ్చారు.‘‘జగన్కు ఓటేస్తేనే.. పథకాలన్నీ కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికి ముగింపే. పేద ప్రజల గుండుచప్పుడే ఈ సిద్ధం సభ. మూడు పార్టీల కూటమి మోసాలకు చెంపచెళ్లు మనేలా సమాధానం చెప్పాలి. ఈ యాత్ర వైఎస్సార్సీపీ జైత్రయాత్రకు సంకేతం. జగన్కు ఓటేస్తే పథకాలన్నీ ముందుకే. 175కు 175 అసెంబ్లీ, 25కి 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.‘‘రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరుకు జన సునామీ చూశాం. విద్యా, వైద్య, ఆరోగ్యం రంగాల్లో మార్పులు తీసుకువచ్చాం. గ్రామ స్వరాజ్యంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. 58 నెలల్లో పేదల బతుకుల్లో వెలుగు నింపాం. మరో 18 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.. మీకు మంచి జరిగి ఉంటే ఓటు వేయండని అడిగే ధైర్యమే సిద్ధం. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99 శాతం నెరవేర్చాం. పొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ దిగజారిపోయారు. మంచి పనులు చేసానని చంద్రబాబు చెప్పుకోలేడు. అందుకే నన్ను తిట్టడమే చంద్రబాబు పని. ఇదొక రాజకీయం అవుతుందా చంద్రబాబూ..’’ అంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు.అబద్ధపు హామీలిచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. దోచుకోవడం, పంచుకోవడం వారి అలవాటు. మీ బిడ్డ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేశాం. ధనికులకు, పేదలకు వేర్వేరు చదువుల వ్యత్యాసం తుడిచివేశాం. డబుల్ సంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధం ఉండాలి. చంద్రబాబులాగా నేను మోసపు హామీలు ఇవ్వను. ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు సంస్కృతిని చూశాం. చంద్రబాబు పేరు చెబితే ఒక మంచి పని కూడా గుర్తుకురాదు. సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసిన చరిత్ర వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది. బాబు లాంటి మోసగాడు కావాలా? జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా?. చంద్రబాబు మోసాలు, అబద్దాలు, వెన్నుపోట్లతో నేను పోటీ పడలేను. 87 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైంది?’’ అని సీఎం జగన్ ప్రశ్నించారు. ‘‘పేద ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధం. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వాసుపత్రులు సిద్ధం. ఇంటింటికి పౌరసేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం. 600లకు పైగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు సిద్ధం. మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చాం. అక్కా చెల్లెమ్మలకు ఆర్థికంగా, రాజకీయంగా తోడుగా ఉన్నాం. కరోనా కష్టకాలంలోనూ ప్రతి ఇంటికి సంక్షేమం అందించాం. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచిపనైనా గుర్తుకొస్తుందా?’’ అంటూ సీఎం ధ్వజమెత్తారు. సాధ్యం కాని హామీలను మీ బిడ్డ ఎప్పుడూ ఇవ్వడు. మీ జగన్ మార్క్.. ప్రతి పేదింట్లో కనిపిస్తోంది. మీ జగన్ మార్క్.. అక్కా చెల్లెమ్మల చిరునవ్వులో కనిపిస్తుంది. మీ జగన్ మార్క్.. ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది. మాట మీద నిలబడే మీ జగన్ కావాలా?. మోసం, దగా చేసే చంద్రబాబు కావాలా? ఆలోచన చేయండి. 2014లో ఇదే కూటమి చేసిన మోసాలు గుర్తున్నాయా?. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?. ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు..చేశాడా?. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?. అర్హులకు మూడు సెంట్ల ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. 10వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ అన్నాడు.. చేశాడా?. సింగ్పూర్ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?. ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?, మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుంది. ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్కారు ఇస్తారంట నమ్ముతారా?. . ఈ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మీరంతా సిద్ధమా?. ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు వస్తున్నాడు’’ అని సీఎం జగన్ మండిపడ్డారు. -
అడుగడుగునా జన నీరాజనం
-
యువనేత జైత్రయాత్ర!
పట్టుదల, దీక్షా దక్షతలు కలిగిన యువనేత జగన్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెల 27న ఇడుపులపాయలో ప్రారంభించిన బస్సు యాత్ర 23 జిల్లాల గుండా సాగి ఏప్రిల్ 24న శ్రీకాకుళం జిల్లాలో దిగ్వి జయంగా ముగిసింది. ఈ యాత్రకు ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ రోడ్షోలు కూటమి నేతల వెన్నులో వణుకు పుట్టించాయి. యువ నేతకు ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి ఓర్వలేక ఆయనపై హత్యాయత్నానికి తెగబడ్డప్పటికీ వెరవ లేదు. నుదిటిపై తీవ్ర గాయమైనా చెదరని సంకల్పంతో సీఎం జగన్ తనయాత్ర కొనసాగించారు. తన తండ్రి చనిపోయిన సందర్భంలో ఢిల్లీ పీఠాన్ని ఎదిరించి ఓదార్పు యాత్ర చేసినా, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వేలాది కిలోమీటర్ల మేర కాలినడకన ప్రజా సంకల్ప యాత్ర చేసినా, ముఖ్యమంత్రి పీఠమెక్కి రాష్ట్రాన్ని జనరంజకంగా పాలించినా, ఎన్నికల ప్రచారం కోసం ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేసినా... వీటన్నింటిలోనూ ఒక ఆర్ధ్రత, ఒక ఆప్యాయత, ఒక ఆత్మీయ మేళ వింపు, కుటుంబ సభ్యుడితో మాట్లాడిన అను భూతి కనిపిస్తున్నాయి. ఫలితంగా మే 13న జరగ బోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఏకపక్షంగా మారిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.ఈ యాత్ర సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల నుండి 221 మంది రాష్ట్ర స్థాయి నేతలు సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకవైపు బస్సు యాత్రకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ, మరో పక్క తమ పార్టీలోని ముఖ్య నేతలు వైఎస్సార్ సీపీలో చేరడం వంటివి ప్రతిపక్ష పార్టీలకు మింగుడుపడడం లేదు. దీంతో బస్సు యాత్ర ఆపేందుకు కుటిల యత్నాలు చేశారు. ముఖ్య మంత్రిపై దాడిచేస్తే బస్సు యాత్రకు బ్రేక్ వేయవచ్చన్న దుర్బుద్ధితో వారు చేసిన ప్రయ త్నాలకు జగన్ వెరవలేదు. ఈ క్రమంలోనే దత్తపుత్రుడి చరిష్మా తగ్గిందని భావించిన పసుపు నేత చిరంజీవి అనే ముఖాన్ని మళ్లీ ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి బొక్క బోర్లా పడ్డారు.అన్నింటికంటే మిన్నగా బస్సుయాత్ర మొదలైనప్పటి నుండి వలంటీర్ల వ్యవస్థ మీద విషం చిమ్మడం ద్వారా జగన్ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నానికి తెర తీశారు. అయితే అదికాస్తా తిరిగి వారి మెడలకే చుట్టుకోవడంతో పాలుబోని పరిస్థితి నెలకొంది. దురదృష్టవశాత్తూ వలంటీర్గా పనిచేస్తున్న గీతాంజలి అనే ఒక ఆడబిడ్డ ప్రాణాలు తీసు కునేలా పచ్చ బ్యాచ్ బరితెగించింది. వలంటీర్ల వ్యవస్థ మీద చేయకూడని ఆరోపణలు చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే తాము కూడా వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు. మరో అడుగు ముందుకేసి వారి గౌరవ వేతనం రూ. 5 వేల నుండి రూ. 10 వేలకు పెంచుతామంటూ ఉత్తుత్తి హామీలు ఇచ్చారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయాన్ని ప్రజలు ఇప్పుడు సర్వత్రా చర్చించుకుంటు న్నారు. నిన్న మొన్నటి వరకూ జగన్ ఉచితాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేశారన్న చంద్ర బాబు... తీరా ఎన్నికలు వచ్చేటప్పటికి ఇప్పు డున్న సంక్షేమానికి మించి తాము సంక్షేమాన్ని అందిస్తామంటున్నారు. ముస్లిమ్ల రిజర్వేషన్పై మిత్రపక్షమైన బీజేపీ చేస్తున్న ప్రకటనలను కనీసం ఖండించలేని దుఃస్థితిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేస్తామని ఒక్క మాట కూడా ఈ కూటమి నాయకులు ఎవరూ అనక పోవడమూ గమనార్హం. ఇలా చెప్పు కుంటూ పోతే తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి జిమ్మిక్కులూ, అబ ద్ధాలూ, కుయుక్తులూ, విషప్రచారాలూ చాలానే ఉన్నాయి.ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్లో అవకాశవాద రాజకీయాలు ఒకవైపు, చిత్తశుద్ధి – అంకిత భావంతో కూడిన రాజకీయాలు ఇంకోవైపు ఉన్నాయని సామాన్య ప్రజలు అర్థం చేసుకున్నారు. పేదలు – పెత్తందార్ల మధ్య ఇప్పుడు యుద్ధం జరుగుతోందని ప్రతిపక్ష కూటమి చర్యలు మరోసారి రుజువు చేశాయి. ముఖ్యమంత్రి జగన్ తాను ఇప్పటివరకూ ప్రజలకోసం చేసిన పనులూ, మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తే చేయనున్న పనుల గురించి తప్ప మరో మాట మాట్లాడటం లేదు. అలా ఆయన ప్రజల మనసులు గెలుచుకోగలిగారు. ఇదే వైసీపీ విజయం సాధించడానికి మూల మంత్రంగా మారనుందనడంలో ఎటువంటి సందేహం లేదు. డా‘‘ పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ‘ 98481 05455 -
22 రోజులు.. 2100 కిలోమీటర్లు.. ముగిసిన సీఎం జగన్ బస్సు యాత్ర
CM Jagan Memantha Siddham Bus Yatra Live Updates..నేటితో ముగిసిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర22 రోజులు పాటు 2100 కిలోమీటర్ల మేర సాగిన బస్సు యాత్రఈ యాత్రలో 16 బహిరంగ సభల్లో పాల్గొన్న సీఎం జగన్6 ప్రత్యేక సమావేశాలకు హాజరయిన సీఎం జగన్9 చోట్ల భారీ రోడ్ షోల్లో పాల్గొన్న సీఎం జగన్ ఇడుపులపాయలో ప్రారంభమై 86 నియోజకవర్గాల మీదుగా సాగిన బస్సు యాత్రఅక్కవరం ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగంఅక్కవరంలో సిక్కోలు సింహాలు కనిపిస్తున్నాయి.అక్కవరం, శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లాలో జనసముద్రం కనిపిస్తోంది.సిక్కోలు జనం సింహాల్లా కదిలివచ్చారుజగన్కు ఓటేస్తే పథకాలన్నీ ముందుకేచంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపేమూడు పార్టీల కూటమి మెసాలకు చెంపచెళ్లు మనేలా సమాధానం చెప్పాలిఇవి ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కాదు.పేద ప్రజల గుండెచప్పుడే ఈ సిద్ధం సభ.ఈ యాత్ర వైఎస్సార్సీపీ జైత్రయాత్రకు సంకేతంఇక్కడి జనసునామి చూస్తుంటే 25కు 25 ఎంపీలు, 175కు 175 ఎమ్మెల్యే స్థానాలు గెలవడం ఖాయం.రాయలసీయ నుంచి ఉత్తరాంద్ర వరకు జన సునామీ చూశాంసంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసిన చరిత్ర వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది.విద్యా, వైద్య, ఆరోగ్య రంగంలో మార్పులు తీసుకువచ్చాం.గ్రామ స్వరాజ్యంతో విప్లవాత్మక మార్పులు తెచ్చాం.ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు సంస్కృతిని చూశాం58 నెలల్లో పేదల బతుకుల్లో వెలుగులు నింపాం.పేద ధనిక విద్యార్ధులకు ఒకే రకమైన విద్యను అందిస్తున్నాం.పొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ దిగజారిపోయారు.కూటమి మోసాలకు చెంప చెళ్లుమనిపించాలిమరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు సిద్ధమేనా?జగన్ వెనుక ఎన్ని కోట్ల మంది పేదలున్నారో చూపిస్తే అదే సిద్ధంవిప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధంవైద్య, ఆరోగ్య రంగంలో మార్పులతో ప్రభుత్వ ఆసుపత్రులు సిద్ధంఇంటింటికీ సేవలందిస్తున్న వాలంటీర్ల సేవలు సిద్ధంలక్షా 35 వేల మంచి ఉద్యోగాలతో మన చెల్లెమ్మలు సిద్ధంగ్రామస్వరాజ్యం సిద్ధం, పట్టణాల్లో ఇంటింటికీ పౌరసేవలు సిద్ధం1వ తేదీ ఇంటికే వచ్చే రూ.3 వేలు పింఛను సిద్ధంమీకు మంచి జరిగి ఉంటే ఓటు వేయండని అడిగే ధైర్యమే సిద్ధంమరో 18 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయిమేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99 శాతం నెరవేర్చాంపొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ దిగజారిపోయారుమంచి పనులు చేసానని చంద్రబాబు చెప్పుకోలేడు...అందుకే నన్ను తిట్టడమే చంద్రబాబు పనిఇదొక రాజకీయం అవుతుందా చంద్రబాబూజతకట్టిన జెండాలకు సరైన సమాధానం చెప్పాలిఅబద్ధపు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారుదోచుకోవడం, పంచుకోవడమే వారి అలవాటుచంద్రబాబులాగా నేను మోసపు హామీలు ఇవ్వనుబాబులాంటి మోసగాడు కావాలా?.. జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా?చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకురాదు2014లో ఇదే కూటమి చేసిన మోసాలు గుర్తున్నాయా?రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు.. చేశాడా?ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?సింగపూర్ను మించి అభిృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుందిఇప్పుడు సూపర్ 6 అంటూ చంద్రబాబు వస్తున్నాడు..ఇంటికి బంగారం, బెంజ్ కారు అంటున్నాడు..నమ్ముతారా?ఈ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్నికాపాడేందుకు మీరంతా సిద్ధమామీ జగన్ మార్క్.. ప్రతి పేదింట్లో కనిపిస్తోంది58 నెలల్లో గ్రామ స్వరాజ్యం సిద్ధంవిద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధంవైద్యరంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వాస్పత్రులు సిద్ధంఇంటింటికి పౌరసేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం..600లకుపైగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు సిద్ధంమంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి..మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చాం..అక్కాచెల్లెమ్మలకు ఆర్థికంగా, రాజకీయంగా తోడుగా ఉన్నాం..కరోనా కష్టకాలంలోనూ ప్రతి ఇంటికి సంక్షేమం అందించాం..చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచిపనైనా గుర్తుకొస్తుందా?మీ జగన్ మార్క్.. ప్రతి పేదింట్లో కనిపిస్తోందిమీ జగన్ మార్క్.. అక్కాచెల్లెమ్మల చిరునవ్వులో కనిపిస్తోందిమీ జగన్ మార్క్.. ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది..మాట మీద నిలబడే మీ జగన్ కావాలా?మోసం, దగా చేసే చంద్రబాబు కావాలా? ఆలోచన చేయండిశ్రీకాకుళం జిల్లాలో అడుగడుగునా సీఎం జగన్ బస్సు యాత్రకు జననీరాజనందారిపొడవునా జై జగన్ అంటూ నినాదాలుదారి పొడవునా సీఎం జగన్ బస్సు యాత్రకు మహిళల హారతులుఅభిమాన నేత కోసం ఎండను సైతం లెక్క జేయకుండా తరలివస్తున్న జనం చిన్నారి చికిత్సకు సాయం.. సీఎం జగన్కు కృతజ్ఞతలు►అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ను కలిసిన శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన చమల్ల శ్రీధర్►ఆరోగ్య శ్రీ ద్వారా తన కుమారుడు త్రిషాన్కు రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్న విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించి.. కృతజ్ఞతలు తెలిపిన శ్రీధర్►చిన్నారి త్రిషాన్ ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి►2022 జూలై 18న కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ జరిగిందని సీఎంకు చెప్పిన శ్రీధర్►కాక్లియర్ ఇంప్లాంట్ తర్వాత తన కుమారుడు త్రిషాన్ వినగలుగుతున్నాడని.. చిన్న చిన్న పదాలు కూడా పలుకుతున్నాడని ఆనందంగా సీఎంకి చెప్పిన శ్రీధర్► నరసన్నపేటకు చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర►ఆముదాలవలస ఫ్లై ఓవర్ చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర. ►ఎచ్చెర్ల చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర►చిలకపాలెం చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర►అక్కివలస నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం►శ్రీకాకుళం సిద్ధమా?. శ్రీకాకుళం జిల్లా సిద్ధమా..? #MemanthaSiddham— YS Jagan Mohan Reddy (@ysjagan) April 24, 2024 ►వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజైన బుధవారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగనుంది. Memantha Siddham Yatra, Day -22.ఉదయం 9 గంటలకు అక్కివలస రాత్రి బస నుంచి ప్రారంభంసాయంత్రం 3:00 గంటలకు టెక్కలి వద్ద బహిరంగ సభ#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/U5fyZ9Vt5d— YSR Congress Party (@YSRCParty) April 24, 2024 ►బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ మంగళవారం రాత్రి బస చేసిన అక్కివలస నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. కాగా, నేటితో మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగియనుంది. ►ఇక, ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురాంపురం జంక్షన్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కె.కొత్తూరు మీదుగా టెక్కలి వద్దకు చేరుకొని.. 3 గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఉత్తరాంధ్రలో జగనన్న జన ప్రభంజనం✊🏻Memantha Siddham Yatra, Day -21.#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/axMpaCHQ68— YSR Congress Party (@YSRCParty) April 23, 2024 -
నిజం బయటపడుతుందని భయంతో విజయవాడ సీపీ బదిలీ
-
మాట ఇస్తే నిలబడే పాలన మీ జగన్ ది..
-
నామినేషన్కు ముందు సర్వమత ప్రార్థనల్లో సీఎం జగన్ (ఫొటోలు)
-
అడుగడుగునా నీరా‘జనం’
(‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): మరోసారి చరిత్ర సృష్టించేందుకు చారిత్రక విజయనగరం జననేత జగనన్నకు అఖండ స్వాగతం పలికింది. అడుగడుగునా ప్రజలు జననీరాజనాలు పలికారు. ఉత్తరాంధ్ర కళారూపాలైన చెక్క భజనలు, కోలాటాలతో తమ అభిమాన నేతను అక్కున చేర్చుకున్నారు. విశాఖలోని ఎండాడ నైట్ స్టే పాయింట్ వద్ద అభిమానుల కోలాహలం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభమైంది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో 21వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఎండాడ నుంచి విజయనగరం వరకు సాగింది. దారిలో అడుగడుగునా అభిమానులు వెంటరాగా సీఎం జగన్ బస్సుపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైఎస్సార్ స్టేడియం, పీఎం పాలెం మీదుగా సాగిన యాత్ర జాతీయ రహదారి మొత్తం అభిమానులతో నిండిపోయింది. కొత్తవలస మండలంలోని చీడివలస గ్రామానికి చెందిన చెక్కభజన బృందంలోని అక్కచెల్లెమ్మలు జగన్ కోసం తరలివచ్చారు. ఎండాడ నుంచి కార్షెడ్ జంక్షన్, మధురవాడ, కొమ్మాది, పరదేశీపాలెం, గంభీరం, తాళ్లవలస వరకు వెంటనడిచారు. దారిపొడవునా అక్కచెల్లెమ్మల హారతులు, మహిళల కోలాటాలు, యువకుల తీన్మార్ డ్యాన్సులతో వారంతా సీఎం జగన్ యాత్ర వెంట అడుగులు వేశారు. జగన్ సైన్యంతో జాతీయ రహదారి కిటకిట.. ఇక ఉదయం పీఎంపాలెం వద్దకు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్రలో పాల్గొనేందుకు అప్పటికే ఆయన రాకకోసం పెద్దఎత్తున మహిళలు, పిల్లలతో పాటు ఆటోడ్రైవర్లు తరలివచ్చారు. జగన్ బస్సుపై నుంచి అభివాదం చేయగానే ఆ ప్రాంతమంతా జగన్నినాదాలతో మార్మోగింది. వైఎస్సార్ స్టేడియం నుంచి మొదలైన జనప్రవాహం కొమ్మాది, మారికవలస మీదుగా ఆనందపురం జంక్షన్కు చేరుకుంది. అక్కడ వేచి ఉన్న అక్కచెల్లెమ్మలు జగనన్నకు ఘనస్వాగతం పలికారు. జగన్ను దూరం నుంచి చూసిన అపార్ట్మెంట్లలోని మహిళలు, విద్యార్థులు సైతం బాల్కనీల్లో హుషారుగా కేరింతలు కొట్టారు. ‘గత ప్రభుత్వంలో ఏ చిన్న పనికావాలన్నా జన్మభూమి కమిటీల ద్వారా స్థానిక టీడీపీ నేతలను కలవాల్సి వచ్చేది. వారు అడిగింది ముట్టజెప్పినా, ఇష్టం లేకపోతే నెలల తరబడి తిప్పించుకునే వారు’ అని మహిళలు నాటి పీడకలలను గుర్తుచేసుకున్నారు. జగనన్న తీసుకొచ్చిన వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలతో ఇంటికే వచ్చి మీకేం అవసరమో చెప్పాలని అడిగి మరీ చేస్తున్నారని నేటి పరిస్థితులను వివరించారు. ఇది సామాన్యుల ప్రభుత్వమని, తామంతా ఆనందంగా ఉన్నామని జనం ముక్తకంఠంతో చెప్పారు. ఇక యాత్రలో భాగంగా సీఎం జగన్ ఆనందపురం జంక్షన్లోని చెన్నాస్ కన్వెన్షన్లో సోషల్ మీడియా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించారు. అనంతరం.. మోదవలస జంక్షన్ మీదుగా విజయనగరం జిల్లాలో యాత్ర కొనసాగింది. జిల్లా నాయకులు, జగన్ అభిమానులతో మోదవల కూడలి జనసందోహంతో నిండిపోయింది. యువకులు ర్యాలీగా వెంటరాగా, మ.2 గంటలకు జొన్నాడ సమీపంలో ముఖ్యమంత్రి భోజన విరామం తీసుకున్నారు. అనంతరం సా.5 గంటలకు జొన్నాడ నుంచి చెల్లూరు వరకు ర్యాలీగా వచ్చి అక్కడ అశేష జనావాహినితో నిండిపోయిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. ఈ బహిరంగ సభకు విజయనగరం జిల్లాకు చెందిన దివ్యాంగులు సీఎం జగన్కు మద్దుతుగా మూడు చక్రాల మోటార్ సైకిళ్లపై పెద్దఎత్తున తరలివచ్చారు. జగన్ సీఎం అయ్యాకే తమ భవిష్యత్తు బాగుందని ఎంతో సంతోషంతో చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోకి బస్సుయాత్ర.. సభ అనంతరం సీఎం జగన్ చింతలవలస మీదుగా విజయనగరం జిల్లా సరిహద్దు గ్రామం కొప్పెర్ల చేరుకున్నారు. అప్పటికే చీకటి పడినా జగన్ కోసం పెద్దఎత్తున అభిమానులు అక్కడే ఉండి తమ ప్రియతమ నేతకు భారీ పూలదండలతో శ్రీకాకుళం జిల్లాలోకి ఆహ్వానించారు. కిక్కిరిసిన జన సందోహం మధ్య జగన్ అభివాదం చేస్తూ సవరవిల్లి, భోగాపురం మీదుగా రణస్థలం చేరుకున్నారు. అక్కడ ప్రజలు, నాయMý ులు రహదారిపై బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి జన సంద్రాన్ని తలపించింది. అక్కడి నుంచి అక్కివలస సమీపంలోని రాత్రి బసకు జగన్ చేరుకున్నారు. వైఎస్సార్సీపీలోకి బీజేపీ నేతలు ఎండాడ నైట్ క్యాంపులో ఎస్.కోట, గాజువాక, విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, భీమిలి నియోజకవర్గ అభ్యర్థులతో పాటు ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సీఎం జగన్ను కలిశారు. వారిని పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పార్టీ కార్యకలాపాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఇందులో బీజేపీ గాజువాక నియోజకవర్గం నుంచి మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వీఎస్ ప్రకాశరావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవిందు, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి,సంపత్కుమార్ ఉన్నారు. వీరితోపాటు విశాఖ ఉత్తరం నుంచి జనసేన నాయకురాలు దివ్యలత, బీజేపీ నుంచి హేమాంబర్, వ్యాపారవేత్త షేక్ సలీమ్, షేక్ హుస్సేన్ బాషా తదితరులున్నారు. -
నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజైన బుధవారం(ఏప్రిల్ 24) షెడ్యూల్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ మంగళవారం రాత్రి బస చేసిన అక్కివలస నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురాంపురం జంక్షన్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కె.కొత్తూరు మీదుగా టెక్కలి వద్దకు చేరుకొని.. 3 గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. -
మీ డ్రీమ్సే.. నా స్కీమ్స్: సీఎం వైఎస్ జగన్
ఊరు కలలనూ నెరవేర్చాం..ఊరికి కూడా కలలుంటాయి. గ్రామంలో అందే సేవలు బాగుంటేనే తమ ఊరు బాగుంటుందని.. ఆ గ్రామాన్ని విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్లిపోరని.. గ్రామానికి కూడా కల ఉంటుంది. ఆ గ్రామం డ్రీమ్ కోసం మీ జగన్ ఎన్ని స్కీమ్లు తెచ్చాడో తెలుసా? ఏకంగా ఏడు స్కీమ్లు తెచ్చాడు. ఆ గ్రామంలోనే కనిపిస్తాయి సచివాలయాలు, 60–70 ఇళ్లకో వలంటీర్ వ్యవస్థ, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, నాడు–నేడుతో మారిన ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, మహిళా పోలీసు వ్యవస్థ కనిపిస్తాయి. వీటితోపాటు నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తాయి. గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్.. ఇవన్నీ మీ గ్రామాల్లోనే కనిపించే జగన్ మార్కు విప్లవాత్మక మార్పులు. గ్రామాలే కాకుండా రాష్ట్రం కలలను కూడా సాకారం చేస్తూ విప్లవాత్మక చర్యలు చేపట్టాం. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘‘డ్రీమ్స్ మీవి.. స్కీమ్స్ మీ బిడ్డ జగన్వి! ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం కలలను నెరవేరుస్తూ విప్లవాత్మక పథకాలు, వ్యవస్థలు తీసుకొచ్చాం. 58 నెలల పాలనలో మీ అందరి కలలను నెరవేర్చిన ప్రజా ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాల్లో ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కాలి’’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. మంగళవారం సాయంత్రం విజయనగరం జిల్లా చెల్లూరు వద్ద నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ‘చెల్లూరు సభ జనసముద్రాన్ని తలపిస్తోంది. ఒక్కసారిగా లక్షల మంది తాండ్ర పాపారాయుళ్లు శత్రుసైనాన్ని చిత్తుగా ఓడించేందుకు సిద్ధమైతే, ఆ యుద్ధం ఎలా ఉంటుందో పేదల వ్యతిరేకులకు రుచి చూపించడానికి నా ఉత్తరాంధ్ర, నా విజయనగరం సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. ఇంటింటి భవిష్యత్తును, తమకు అందుతున్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, తమ పిల్లల భవిష్యత్తును రాబోయే ఐదేళ్లు కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రజలంతా గుర్తించారు. వారికి అడ్డుతగులుతున్న ఆ పెత్తందార్లకు, ఆ కౌరవ సైన్యానికి, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తున్న ప్రజాసైన్యం ఈ రోజు నా కళ్ల ఎదుట కనిపిస్తోంది. చంద్రబాబుకు కాంగ్రెస్, బీజేపీ పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతిస్తున్నాయి. ఇదే బాబుకు తోడుగా దత్తపుత్రుడున్నా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉన్నాయి. వాళ్లు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అబద్ధాలు కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకమవుతున్నారు. జగన్ కనుక ఇంటింటికీ మంచి చేయకపోయి ఉంటే, జగన్ను ప్రతీ ఇంట్లోనూ తమ బిడ్డగా, తమ అన్నగా, తమ్ముడిగా భావించకపోతే ఇన్ని తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముంది? జగన్ ఒకే ఒక్కడు కాదు. నాకున్న ధైర్యం మీరే అని సగర్వంగా చెబుతున్నా. 58 నెలల పాలనలో ఇంటింటికీ చేసిన మంచి నా నమ్మకం. ప్రతీ వర్గాన్ని మోసం చేసిన వారితో ఈరోజు ఎన్నికల కురుక్షేత్రంలో తలపడుతున్నాం. జగన్ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించి ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేదానికి మీరంతా సిద్ధమేనా? ప్రజల కలల్ని తన మోసాలతో వంచించడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకు, ఆ బాబు కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? 420.. చంద్రముఖి బృందం వస్తువులు ఎత్తుకుపోయేవారని దొంగల ముఠా అంటాం. బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠా అంటాం. మరి ఎన్నికలప్పుడు నమ్మించి ఆ ప్రజలు ఇచ్చిన అధికారంతో ఐదేళ్లూ మోసం చేసిన చరిత్ర ఉన్న కూటమిని ఏమనాలి? తియ్యటి మాటలు మేనిఫెస్టోలో చెప్పి ఎన్నికలు అయిపోయిన తరువాత ప్రజల్ని మోసం చేసేవారిని ఏమంటాం? 420 అనే కదా అంటారు. పేదల కలల్ని, బతుకుల్ని బలిపెట్టి దోచుకునేందుకు వచ్చిన ఈ రాజకీయ కూటమిని చంద్రముఖి బృందం అని కూడా అంటాం. చంద్రబాబు అంటే చంద్రముఖి... తల్లుల కలలు, బాధల గురించి 14 ఏళ్లు పాలించానని చెప్పుకునే చంద్రబాబు ఏరోజైనా ఆలోచన చేశాడా? ఆయనకు ఆ ఆలోచన ఎందుకు రాలేదంటే కారణం.. చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి. పేదలకు మంచి చేయడం కోసం కాకుండా పేదల రక్తం తాగేందుకు లకలకా అని తపిస్తాడు. కలలను నెరవేర్చిన స్కీములు... ఏ అక్కచెల్లెమ్మ అయినా ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటుంది. పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని, కుటుంబం మరింత బాగుండేలా రెండు మెట్లు ఎదగాలని కలగంటుంది. చంద్రబాబు మాటలు నమ్మి 2014 నుంచి 2019 మధ్య కుదేలయిపోయిన పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల సాధికారత, మళ్లీ వాళ్లను తమ కాళ్ల మీద తమను నిలబెట్టేందుకు వారి డ్రీమ్స్ను సాకారం చేస్తూ వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాలు పుట్టాయి. 45 – 60 సంవత్సరాల వయసున్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆత్మగౌరవంతో జీవించేలా చేసేందుకు పుట్టింది వైఎస్సార్ చేయూత పథకం. నా కాపు అక్కచెల్లెమ్మల కోసం తెచ్చిన మరో పథకం వైఎస్సార్ కాపు నేస్తం. ఈబీసీ అక్కచెల్లెమ్మల కోసం వైఎస్సార్ ఈబీసీ నేస్తం అనే పథకం. తెచ్చాం. చంద్రబాబు హయాంలో ఏరోజూ ఇలాంటి స్కీములు ఎందుకు లేవు? నాడు ఉన్నదల్లా అక్కచెల్లెమ్మలను మోసం చేయడం, రక్తాన్ని పీల్చే ఒక చంద్రముఖి పాలన మాత్రమే. అక్కచెల్లెమ్మల సొంతింటి కల... తమకు సొంత ఇల్లు ఉండాలని ప్రతి అక్కచెల్లెమ్మ కల కంటుంది. కొన్ని కుటుంబాలకు ఇది జీవితకాల కల లాంటిది. వారి డ్రీమ్ను నెరవేరుస్తూ 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మీ బిడ్డ జగన్ ఇచ్చాడు. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. భావోద్వేగానికి గురైన మంత్రి బొత్స... చీపురుపల్లి అభ్యర్ధిగా మంత్రి బొత్స సత్యనారాయణను సీఎం జగన్ పరిచయం చేసిన సందర్భంలో ఉద్వేగ వాతావరణం నెలకొంది. బొత్స తనకు తండ్రి లాంటివారని, ఆయన్ను ఆప్యాయంగా అన్నా అని పిలుస్తానని సీఎం జగన్ చెప్పడంతో బొత్స భావోద్వేగానికి గురయ్యారు. అవ్వాతాతలు.. రైతుల కలలు నెరవేర్చాం ► అవ్వా తాతల డ్రీమ్ ఏమిటో తెలుసా? బాబు హయాంలో మాదిరిగా పెన్షన్ల కోసం క్యూలో నిలబడి తమ ప్రాణాలు అక్కడికక్కడే పోయే పరిస్థితి రాకూడదన్నది వారి డ్రీమ్. ఆ పెన్షన్ సొమ్ము కాస్తంత పెంచి ఇస్తే బాగుంటుందన్నది డ్రీమ్. వారి మనవడు జగన్ తెచ్చిన స్కీమ్ ఏమిటంటే అవ్వాతాతల ఆత్మ గౌరవాన్ని నిలబెడుతూ వలంటీర్లు నేరుగా ఇంటికి వచ్చి రూ.3 వేల పెన్షన్ ఇవ్వడం. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. నాడు చంద్రబాబు ముష్టి వేసినట్లు రూ.వెయ్యి రాష్ట్రంలో 39 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. ► మీ బిడ్డ వచ్చాక ఇంటివద్దే నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నాడు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 58 నెలల కాలంలో 2.31 లక్షల ఉద్యోగాలు యువతకు ఇచ్చి వారి కలను సాకారం చేశాం. రైతన్నలు కోరుకున్నట్లుగా పంట వేసే సమయానికి పెట్టుబడి సాయం, సమయానికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గ్రామంలోనే అందచేస్తున్నాం. అమూల్ను తెచ్చి పాడి రైతులకు అండగా నిలిచాం. ఏకంగా 35 లక్షల ఎకరాల భూముల మీద రైతులకు పూర్తి హక్కులు ఇచ్చిందీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. మరి రైతుల గురించి చంద్రబాబు ఏరోజైనా ఆలోచించాడా? నాడూ నేడూ ఇదే రాష్ట్రం.. ఇదే బడ్జెట్. కానీ చంద్రబాబు హయాంలో డీబీటీలు, బటన్లు నొక్కడం లేవు. మీ పొలాలలో పెట్టే దిష్టిబొమ్మనైనా నమ్మొచ్చేమో గానీ చంద్రబాబును మాత్రం నమ్మలేమని గుర్తు పెట్టుకోండి. విజయవాడలో కాల్మనీ, సెక్స్ రాకెట్లు నడపటం మినహా బాబు చేసిందేమిటి? మళ్లీ ప్రజల రక్తం తాగడానికి చంద్రముఖిలా మారాడు. జనానికి మంచి చేసిన మీ జగన్పై తోడేళ్లలా దాడి చేస్తున్నారు. మన 58 నెలల పాలనలో జరిగిన మేలుపై మీ కుటుంబమంతా చర్చించుకోవాలి. పిల్లలు, సంక్షేమ పథకాల భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఏకంగా 40 పథకాలు.. ఏ మనిషికైనా, ఏ కుటుంబానికైనా కొన్ని కలలు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని నిజం చేసే మార్గాలు ఉంటే ఆ కుటుంబం ఒక్కో మెట్టు ఎదుగుతూ పోతుంది. అలాంటి పేదల కలల్ని అర్ధం చేసుకుని నెరవేర్చేందుకు మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా? దాదాపుగా 40. ఈ 58 నెలల కాలంలో వాటిని నెరవేర్చేందుకు మీ బిడ్డ ఏకంగా 130 సార్లు బటన్లు నొక్కాడు. ఏకంగా రూ. 2.70 లక్షల కోట్లు నేరుగా అందజేశాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లాయి. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. దీనికి తోడు నాన్ డీబీటీ అంటే ఇళ్లస్థలాలు, విద్యాకానుక, టాబ్స్... ఇవన్నీ కలిపి మరో రూ.లక్ష కోట్లకుపైగా ప్రయోజనాన్ని చేకూర్చాం. ఇలా వాళ్ల డ్రీమ్స్.. మీ బిడ్డ స్కీమ్స్ ద్వారా ఏకంగా రూ. 3.75 లక్షల కోట్లు పై చిలుకు లబ్ధి చేకూర్చాడని చెప్పడానికి గర్వపడుతున్నా. విద్యా విప్లవం.. ప్రతి నిరుపేద తల్లి కలను నిజం చేయడానికే పుట్టింది జగనన్న అమ్మఒడి పథకం. పేద తల్లులు తన పిల్లల భవిష్యత్తు కోసం కనే కలలు గురించి అర్థం చేసుకున్నాను. తమ పిల్లల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, పెద్ద కంపెనీల్లో ఉద్యోగస్తులుగా చూడాలని, ఉన్నత చదువులు చదివించాలన్న కలల నుంచి పుట్టిన స్కీములతో నాడు – నేడు, ఇంగ్లిష్ మీడియం బడులు, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం చేశాం. 3వ తరగతి నుంచి గవర్నమెంట్ బడుల్లో టోఫెల్ శిక్షణ, సబ్జెక్టు టీచర్లు, బైజూస్ కంటెంట్, 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన, క్లాస్ రూముల్లో ఐఎఫ్పీ ప్యానళ్లతో డిజిటల్ బోధన, 8వ తరగతికి పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టాం. పెద్ద చదువులు చదువుతున్న 93 శాతం మందికి ఈ రోజు విద్యాదీవెనతో లబ్ధి చేకూరుతోంది. డిగ్రీ కరిక్యులమ్లో మార్పులు తీసుకొస్తూ, విదేశీ విశ్వవిద్యాలయాల్లో సర్టిఫైడ్ ఆన్ లైన్ వర్టికల్స్ను మన డిగ్రీలతో అనుసంధానం చేయడం, డిగ్రీలో తప్పనిసరి ఇంటర్న్షిప్ తెచ్చాం. ఇవన్నీ నా అక్కచెల్లెమ్మలు, ఆ పిల్లల డ్రీమ్స్ నుంచి వచ్చిన మీ జగనన్న స్కీమ్స్. అత్యధిక మెజార్టీతో గెలిపించండి... విజయనగరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పరిచయం చేశారు. ఎంపీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం అసెంబ్లీ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి, బొబ్బిలి అసెంబ్లీ అభ్యర్థిగా శంబంగి చిన అప్పలనాయుడు,. నెల్లిమర్ల అసెంబ్లీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు, రాజాం నుంచి పోటీచేస్తున్న డాక్టరు తలే రాజేష్, గజపతినగరం నుంచి పోటీచేస్తున్న బొత్స అప్పలనరసయ్య, ఎచ్చెర్ల నుంచి పోటీచేస్తున్న గొర్లె కిరణ్ను గొప్ప మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు. 2014లో ‘చంద్రముఖి’ మోసాలివీ.. ► రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? ► పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? ► ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశారా? ► ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ► అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తామన్నారు. ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా? ► రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ అన్నాడు. చేనేత, పవర్లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. మరి అయ్యాయా? ► మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి చేశాడా? ► సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. చేశాడా? ► ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి నిర్మించాడా? విజయనగరంలో ఏమైనా కనిపిస్తోందా? ► పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా అంటే అదీ లేదు. ► ఇప్పుడు సూపర్ సిక్స్, సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కార్ అంటూ మళ్లీ మోసాలకు తయారయ్యారు. -
మేమంతా సిద్ధం: చెల్లూరు సభకు పోటెత్తిన జనసునామీ (ఫొటోలు)
-
చంద్రబాబు హయాం అంతా.. మోసం,మోసం, మోసం
-
2014 లో ప్రదర్శించిన చంద్ర "కళలు" చూద్దామా..!
-
నా తండ్రి లాంటి వారు ఎమోషనల్ అయిన బొత్స
-
అక్క చెల్లమ్మలకు జగనన్న విజ్ఞప్తి..!
-
వీళ్ళే మన అభ్యర్థులు .. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
చంద్రబాబు అంటే చంద్రముఖి: వైఎస్ జగన్
-
నా ప్రతి ఇంటి ఆడపడుచు, నా తల్లి ఒక కల కంటుంది..!
-
లక్షల మంది తాండ్ర పాపారాయుడులు
-
చంద్రబాబు పాలన రక్తాన్ని పీల్చే పాలన.. బాబుపై సీఎం జగన్ సెటైర్లు
-
కూటమికి కొత్త పేరు పెట్టిన సీఎం జగన్..!
-
ఆ దేవుడు శాశిస్తాడు మీ జగన్ పాటిస్తాడు...!
-
అలాంటి మోసగాళ్లను ఏమంటాం.. 420లు అంటాం
-
నారా సైన్యానికి బుద్ధి చెప్పటానికి ప్రజా సైన్యం సిద్ధం..!
-
ప్రజల అండతో సీఎం జగన్.. ఇతర పార్టీల అండతో చంద్రబాబు
-
ర్యాంప్ పై నడుస్తూ ప్రజలకు అభివాదం
-
సీఎం జగన్ డైనమిక్ ఎంట్రీ
-
పొలాల్లో దిష్టిబొమ్మనైనా నమ్మొచ్చు కానీ.. బాబును నమ్మలేం: సీఎం జగన్
సాక్షి, విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబు వెనక బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఒకరు ప్రత్యక్షంగా మరొకరు పరోక్షంగా మద్దతిస్తున్నాయని విమర్శించారు. ఒక్క జగన్ మీదకు బాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ ఎగబడుతున్నారని మండిపడ్డారు. ఇంత మంది తోడేళ్లు ఏకమై తన మీద యుద్ధానికి వస్తున్నారని తెలిపారు. పెత్తందార్లకు, నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేసిన జగన్పై తోడేళ్ల దాడి సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 21వ రోజు మంగళవారం విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చెల్లూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష కూటమిపై నిప్పులు చెరిగారు. ప్రజలను మోసాలతో వంచించడమే చంద్రబాబు పని అంటూ ధ్వజమెత్తారు. ప్రజలకు మంచి చేసిన జగన్పై తోడేళ్లు దాడికి దిగుతున్నాయని దుయ్యబట్టారు. మీ బిడ్డకు తోడుగా దేవుడి దయ, కోట్ల ప్రజల హృదయాలు ఉన్నాయన్నారు. మోసాల బాబుకు బుద్ది చెప్పేందుకు సిద్ధమా? ఎన్నికలప్పుడు కూటమి నమ్మించి మోసం చేస్తుందని మండిపడ్డారు సీఎం జగన్. నమ్మించి మోసం చేసిన కూటమి నేతల్ని 420 అంటారని అన్నారు. చంద్రబాబు వెనక దత్తపుత్రుడు ఉన్నాడని అన్నారు. ఓవైపు జగన్ ఒక్కడే అయితే మరోవైపు తోడేళ్లు ఏకమయ్యాయని విమర్శించారు. మోసాల బాబుకు బుద్ది చెప్పేందుకు మీరంతా సిద్ధమా?..చంద్రబాబుబు కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమా? అంటూ చెల్లూరు సభకు హాజరైన జనవాహినిని ఉద్ధేశించి సీఎం జగన్ ప్రసంగించారు. సీఎం జగన్ ఇంకా మాట్లాడుతూ. విజయ నగరం జిల్లాలో మహాసముద్రం కనిపిస్తోంది. శత్రు సైన్యాన్ని చిత్తుగా ఓడించేందుకు మీరంతా సిద్ధమా? ఈ ఎన్నికలు.. రాబోయే అయిదేళ్ల భవిష్యత్తు. 58 నెలల్లో 130సార్లు బటన్ నొక్కి సంక్షేమం అందించాం. దాదాపు 40 పథకాలను పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందించాం. 2 లక్షల 70 వేల కోట్లు నేరుగా ప్రజలకు అందించాం. నాన్డీబీటీ ద్వారా మరో లక్ష కోట్లకు పైగా ఇచ్చాం. మొత్తం రూ. 3 లక్షల 75 వేల కోట్లకు పైగా అందించాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా బటన్ నొక్కి నేరుగా ప్రజల ఖాతాలకు నగదు వేశాం. మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను. పిల్లలను చదివించేందుకు అమ్మఒడి పథకం తీసుకొచ్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. పిల్లల ఉన్నత చదువుల కోసం విద్యా దీవెన, వసతి దీవెన. డ్రీమ్స్ పేదింటి అమ్మది.. స్కీమ్స్ మీ బిడ్డవి. అక్కాచెల్లెమ్మల సాధికారత కోసం వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ. అక్కాచెల్లెమ్మల కోసం వైఎస్సార్ చేయూత తీసుకొచ్చాం. వైఎస్సార్ కాపునేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం. చంద్రబాబుకు ఎప్పుడైనా ఇంతమంచి ఆలోచన వచ్చిందా? పేద ప్రజల గురించి ఏ ఒక్కరోజు కూడా చంద్రబాబు ఆలోచన చేయలేదు. చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి ఆ ఆలోచన రాలేదు. చంద్రబాబు హయాంలో చంద్రముఖి పాలన చూశాం. డ్రీమ్స్ అవ్వాతాతలవి.. స్కీమ్స్ మీ బిడ్డవి అవ్వాతాతల డ్రీమ్స్ నెరవేరుస్తూ ప్రతినెలా రూ.3 వేల పెన్షన్. వాలంటీర్ల ద్వారా ఒకటో తేదీనే ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్. డ్రీమ్స్ యువతది.. స్కీమ్స్ మీ జగనన్నది. దేశంలో ఎప్పుడూ జరగని విధంగా ఉద్యోగాలిచ్చాం. 58 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం. 31 లక్ష ఇళ్ల పట్టాలను పేదింటి మహిళలకు ఇచ్చింది మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంత మంచి చేసిన మీ అన్నకు రాఖీ కడతారా?. స్టార్ క్యాంపెయిన్లుగా మీరంతా మీ అన్నకు తోడుగా ఉంటారా? చంద్రబాబు హయాం అంతా.. మోసం,మోసం, మోసం బాబు పాలనలో స్కీంలు ఉండవు.. స్కాంలు మాత్రమే ఉంటాయి. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకున్నారు. విజయవాడలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ నడపడం తప్ప చంద్రబాబు చేసింది ఏంటి? ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి. డ్రీమ్స్ రైతులవి.. స్కీమ్స్ మీ జగన్వి ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్. పెట్టుబడి సాయంగా రైతు భరోసా రూ. 13,500 ఇచ్చాం. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, రూ. 65 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు. దోచుకోవడం.. పంచుకోవడమే చంద్రబాబు డ్రీమ్. పొలాల్లో పెట్టే దిష్టిబొమ్మనైనా నమొచ్చేమోకానీ చంద్రబాబును నమ్మలేం. ప్రతి ఎన్నికల సమయంలో రంగరంగుల మేనిఫెస్టో తెస్తారు. ఎన్నికల అయిపోయాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడు చంద్రబాబు. నారా కౌరవ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. గ్రామాల కోసం 7 స్కీమ్లు తీసుకొచ్చాం సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, ఆర్బీకే, విలేజ్క్లినిక్ స్కూళ్ల రూపురేఖలు, మహిళా పోలీస్, డిజిటల్ లైబ్రరీలు 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి మాట ఇస్తే నిలబడే పాలన మీ జగన్ది చంద్రబాబు మోసాలను గుర్తు చేసుకోండి ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచన చేయండి -
Watch Live: మేమంతా సిద్ధం చెల్లూరు సభ (విజయనగరం జిల్లా)
-
రేపు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర షెడ్యూల్ ఇలా..
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 22 రోజు షెడ్యూల్ను సీఎంఓ కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనతో సీఎం జగన్ బస్సు యాత్ర ముగియనుంది. యాత్రలో భాగంగా ఉదయం 9 గంటలకు అక్కివలస(రాత్రి బస చేసిన ప్రాంతం) నుంచి బయల్దేరుతారు. ఎచ్చెర్ల, కుశాలపురం, శ్రీకాకుళం బైపాస్, పలివలస, నరసన్నపేట క్రాస్, గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాలి మీదుగా పరుశురాంపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పరుశురాంపురం జంక్షన్ వద్ద సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు లంచ్ క్యాంప్ నుంచి అక్కవరంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకుబయల్దేరుతారు. 4.20 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 5.20 గంటల వరకు సభలో ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి అక్కవరం హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో విశాఖపట్నం విమాశ్రయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 6.15 నిమిషాలకు విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. 6.30 గంటలకు విశాఖపట్నం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్లనున్నారు. 7.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టునుంచి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకోనున్నారు. చదవండి: మీ అభిమానిగా ఒక్కరోజు బ్రతికినా చాలన్న: YSRCP సోషల్ మీడియా వింగ్ జనమే సైన్యంగా సంక్షేమసారథి యాత్ర సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం జగన్ గత నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రను ప్రారంభించారు. 43 నుంచి 45 డిగ్రీల మండుటెండల్లోనూ.. రాత్రి పొద్దుపోయినా సీఎం జగన్ను చూసేందుకు ప్రజలు ఆరాటపడుతున్నారు. సీఎం జగన్ను దగ్గరి నుంచి చూసేందుకు.. మాట కలిపేందుకు.. వీలైతే ఫోటో దిగేందుకు బస్సు వెంట పరుగులు తీస్తున్నారు. అడుగడుగునా జనంతో మమేకమవుతూ.. బాధితులకు భరోసా ఇస్తూ సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. జనమే సైన్యంగా సంక్షేమ రథసారథి ప్రారంభించిన బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. బుధవారం శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్ర ముగియనుంది. ఇప్పటిదాకా 21 రోజులు పాటు 22 జిల్లాల్లో యాత్ర సాగింది. బస్సు యాత్రలో భాగంగా రోడ్ షోలు.. వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించిన సీఎం జగన్ 15 భారీ బహిరంగ సభల్లో(మంగళవారం సభతో సహా) పాల్గొని ప్రసంగించారు. -
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి (ఫొటోలు)
-
అడుగడునా ప్రజల కష్టాలు వింటూ ముందుకు సాగుతున్న సీఎం జగన్
-
మీ అభిమానిగా ఒక్కరోజు బ్రతికినా చాలన్న: YSRCP సోషల్ మీడియా వింగ్
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 21వ రోజు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ప్రభంజనంలా కొనసాగుతోంది. దారిపొడవునా సీఎం జగన్కు ప్రజలకు బ్రహరథం పడుతున్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. విశాఖపట్నం పెద్దిపాలెంలోని చెన్నాస్ కన్వెషన్ హాలులో జరిగిన ఈ సమావేశంలో రెండు వేల మందితో కూడిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింగ్తో సీఎం సంభాషించారు. పలువురు YSRCP సోషల్ మీడియా కార్యకర్తలు తమ మనోగతాన్ని సీఎం జగన్తో పంచుకున్నారు. మీకు మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది ‘నా తమ్ముడు భరత్ కుమార్ రెడ్డి ఫిబ్రవరి నెలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగివస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్, భార్గవ్ అన్న మా కుటుంబానికి అండగా నిలిచారు. నా తమ్ముడుకు మీరే దైవం అన్న. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ఎల్లోమీడియా ఎంతో దుష్ప్రచారం చేసేది. అయితే భార్గవ్ అన్న ఛార్జ్ తీసుకున్న తర్వాత మన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతిపక్షాలు భయపడేంతగా స్ట్రాంగ్ అయ్యింది. మా తమ్ముడు చనిపోయినా బాధగా ఉన్నాకూడా మీతో ఒక్కసారి ఫోటో దిగానా, మిమ్మల్ని కలుసుకున్నా వాడి ఆత్మ శాంతిస్తుందని వచ్చా. మీ అభిమానిగా ఒక్కరోజు బ్రతికినా చాలు.. మీకు మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది’ -ఎం. అనిల్ కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం జగనన్న మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మనస్సుకు ఎంతగాయమైనా, దేహానికి ఎంతగాయమైనా చిరునవ్వుతో బతకాలని అన్నది మిమ్మల్ని చూసి ఇన్పైర్ అయ్యాము. నా పిల్లలకు ఎంతో సాయం చేశారు అయితే ఇంకా అండాదండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను సార్.. -బాలచంద్ర, గుంటూరు జిల్లా, తెనాలి మండలం (గీతాంజలి భర్త) బాల చంద్ర వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందిస్తూ.. ‘బాలచంద్ర.. నీ కుటుంబానికి 100 శాతం అన్నిరకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం ఇప్పటికే జరుగుతోంది. ఇది ఎప్పటికీ మనస్సులో పెట్టుకో. సజ్జల భార్గవ్కు కూడా చాలా క్లియర్గా చెప్పాను. అన్నిరకాలుగా నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తాడు’ అని భరోసా ఇచ్చారు చంద్రబాబు యుద్ధానికి డైరెక్ట్గా రాడు ‘అన్న ఒక చిన్న విషయం చెప్తాను. తెనాలిలో ఇళ్ల పట్టా తీసుకుని గీతాంజలి చాలా సంతోషంతో చెప్పలేని ఆనందంతో తన అభిప్రాయాన్ని చెప్పుకుంది. కానీ మీరు చెప్పినట్టు.. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాయలున్న చెట్టు. తెలుగుదేశం పార్టీ ముళ్లున్న చెట్టు. గీతాంజలి కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతో అండగా నిలిచింది. మీ మీద దాడి జరిగితే అది మా మీద జరిగినట్టు భావించాం. అన్నా మీరు చాలా జాగ్రత్త.. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు. చంద్రబాబు యుద్ధానికి డైరెక్ట్గా రాడు, వారి వెన్నుపోటుకు జాగ్రత్తగా ఉండమని చేతులెత్తి దండమెడుతున్నా. -పి. నాని, బాపట్ల జిల్లా 2014 నుంచి 2019 వరకు ముస్లింలంతా భయపడుతూ బ్రతికారు. 2019లో మా రాజన్న బిడ్డ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలర్ ఎగరేసుకుని బ్రతుకుతున్నాం. మైనార్టీలను నలుగురిని ఎమ్మెల్యేలు చేశారు, ఎమ్మెల్సీలను చేశారు, డిప్యూటీ సీఎంను చేశారు, మండలి వైస్ ఛైర్మన్ను చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఏడుగురికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు, అదీగాక హఫీజ్ ఖాన్ కు రాజ్యసభ అనౌన్స్ చేశారు. ముస్లింల కోసం వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే.. మీరు నాలుగు అడుగులు ముందుకేశారు. వాళ్లు మూడు జెండాలతో వస్తున్నారు మనది ఒకటే జెండా కానీ ఆ జెండాకు మూడక్షరాలు Y.S.R అదిచాలన్నా ఆ జెండాను మోసేందుకు.. -వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని.. నా గుండెల్లోంచి జగనన్నను తీయలేకపోయా ‘విశాఖ ఎయిర్పోర్టు ఫుడ్ కోర్టుకు సంబంధించి అంతా టీడీపీ వాళ్లు అని తెలియక అక్కడ ఉద్యోగంలో చేరాను నేను. కోడికత్తి శ్రీను విశాఖలో మీమీద దాడి చేసిన ఘటనకు ప్రత్యక్ష సాక్షిని నేను. ఆ ఘటన తర్వాత నేను జగన్ అభిమానిని అని తెలిసి వాళ్లు నన్ను చాలా వేధించారు. అక్కడ టీడీపీ నాయకులు లోకేష్, చంద్రబాబు, బాలకృష్ణ, సీఎస్వో వేణుగోపాల్, హర్షవర్థన్ అందరూ ఒక కూటమిలా అక్కడ ఉండేవాళ్లు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నేను PCS రూల్ ప్రకారమే ఉండాలని ప్రయత్నించేదాన్ని. మీ అభిమానిని అన్న కారణంగా నన్ను అనుమానించి, నాపై దొంగకేసులు బనాయించారు. నాకెక్కడా ఉద్యోగం రాకుండా చేశారు. నా కుటుంబాన్ని కూడా ఎంతగానో హింసించారు. వేణుగోపాల్ అయితే నిన్ను ఎక్కడా బతకనివ్వను అని బెదిరించారు. మీ మీద హత్యాయత్నం వ్యవహారంలో నేనే చేయించినట్టు చెప్పాలంటూ నా మీద ఒత్తిడి తెచ్చారు. దీంతో నేను ఉద్యోగానికి రిజైన్ చేశాను. కుటుంబం అంతా కూడా దూరంగా వెళ్లిపోయాం. ఇన్నేళ్లూ నేను ఉద్యోగం కూడా లేకుండానే ఉన్నాను. కానీ మొన్న విజయవాడలో మీ మీద బోండా ఉమ చేయించిన దాడి చూశాక మౌనంగా ఉండకూడదు అనుకున్నాను. ఈ విషయాన్ని ఇప్పుడు మీ ముందే బయటపెడుతున్నాను. దొంగ కేసు పెట్టి నా కెరీర్ నాశనం చేసారు. అయినా నేను బాధపడలేదు. నా ఉద్యోగం అయితే తీయగలిగారు కానీ నా గుండెల్లోంచి జగనన్నను తీయలేకపోయారు. -సామ్రాజ్యం, గతంలో ప్రేవేట్ చీఫ్ సెక్యూరిటీ అఫీసర్, విశాఖ ఎయిర్పోర్టు సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాపరంగా ఎవరైనా హెరాస్మెంట్కి లోనైతే సహాయం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎవరైనా సోషల్ మీడియా వల్ల ఇబ్బందులకు గురైతే చెప్పుకోగలిగేలా ఒక యాప్ తయారుచేయాలి. ప్రతివారం నాకు దానిపై రిపోర్టు కావాలి. అవతలి వాళ్లు మన మీద దాడి చేస్తున్నారు అంటే, సుచిత్ర కానీ, గీతాంజలి కానీ, సాక్షాత్తూ నామీద కానీ, దాని అర్థం ఏమిటంటే.. మనం విజయానికి చేరువగా ఉన్నామని...విజయానికి వాళ్లు దూరంగా ఉన్నారని. మిమ్మల్ని తలవని రోజు, మీ గురించి మాట్లాడని రోజు, మీ గురించి రాయని రోజు లేదు. మా గురించి, మా కుటుంబం గురించి అయినా మర్చిపోతామేమో కానీ మీ గురించి మర్చిపోయి ఒక్కరోజు కూడా లేము. మా కుటుంబం కంటే ఎక్కువ అయ్యారు మీరు. ఎందుకంటే మీరు ఎంతో గొప్ప ఇన్స్పిరేషన్ మాకు. అబ్రహాం లింకన్, మహాత్మాగాంధి, అంబేడ్కర్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం కానీ మీరు మాకు కనిపించే లైవ్ ఎగ్జాంపుల్. 36 ఏళ్ల వయసులో మీరు ఢిల్లీ పీఠాన్ని ఎదిరించారు. మీ లైఫ్ జర్నీ ఇంకా తెలుసుకోవాలని ఉంది. మీరు చెప్పే మాటలు మాకెంతో ఇన్సిపిరేషన్ ఇస్తాయి. యువతను ఉత్తేజపరుస్తాయి. మీకోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం. -హెబ్సిబా, అసోసియేట్ ప్రొఫెసర్, ఫార్మసీ *కడుపు కాలేవాడికే మీ పథకాల విలువ తెలుస్తుంది. మా అన్నయ్య మన పార్టీ వీరాభిమాని, సోషల్ మీడియా సైనికుడు. 2022లో యాక్సిడెంట్లో మరణించాడు. అది తెల్సుకుని ముందుగా సజ్జల భార్గవ్ గారు స్పందించారు. మా ఇంటికి వచ్చారు. మీ గురించి జగనన్నకు కూడా తెలియజేసామని, మీకు సాయం అందించమని ఆదేశించారని కూడా చెప్పారు. మా కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పి రెండు నెలల్లోనే మా వదినకు ఉద్యోగం ఇప్పించారు. అంతే కాదు మా సొంత పిన్నీ, బాబాయ్ టీడీపీ అభిమానులు, అంతేకాదు గత టీడీపీ ప్రభుత్వంలో వాళ్లే జన్మభూమి కమిటీలో మెంబర్లు కూడా. వాళ్లకి సైతం పెన్షన్ మన ప్రభుత్వంలోనే ఇచ్చారు. సంక్షేమ పథకాలు మాకు, వాళ్లకూ కూడా వస్తున్నాయి. ఇప్పుడు వాళ్లింట్లో ఆడవాళ్లంతా కూడా జగనన్నకే ఓటు వేస్తాం అని చెబుతున్నారు. మీరు అందించే పథకాల విలువ కడుపు కాలేవాడికే తెలుస్తుంది. కడుపు నిండిన వాడికి తెలియదు. ఆ పెత్తందారులు మాకు గాయం చేస్తే మీరు మాకు సాయం చేస్తున్నారు. మా చివరి శ్వాస వరకూ జై జగన్ అనే అంటాం. ఫ్యాన్కే ఓటేస్తాం. వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా మాకు కుటుంబమే అన్నా.. మా అన్న చనిపోయినప్పుడు ఓ కూలీ చేసుకునే వ్యక్తి ఫోన్ చేసి నేను ఇవాళ కూలి పనికి వెళ్తున్నా, కూలీగా వచ్చిన రూ.600 నీకు పంపుతా తమ్ముడూ అని చెప్పాడు. ఇంత గొప్ప కుటుంబం ఇచ్చింది నువ్వే కదా జగనన్నా...నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. -వినయ్ కుమార్, మల్కాపురం, జగ్గయ్యపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా -
సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి
-
విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్ బస్సు యాత్ర
-
మిమ్మల్ని తలవని రోజు లేదు అన్న.. మహిళ భావోద్వేగం
-
100 ఈనాడులు, 100 ఆంధ్ర జ్యోతిలు వచ్చినా మీ అన్నకు భయం లేదు..!
-
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ సెల్ఫీ
-
సంచలన నిజాలు బయటపెట్టిన అప్పటి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్
-
"దుర్మార్గులు ట్రోల్ చేసి చంపేశారు" సీఎం జగన్ ఎమోషనల్..!
-
విశాఖపట్నంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ రోడ్ షో విజువల్స్
-
గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేసి వేధించారు: సీఎం జగన్
విశాఖపట్నం, సాక్షి: సోషల్ మీడియాలో టీడీపీ, దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఆనందపురంలో రెండు వేల మందితో కూడిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింగ్తో ముఖాముఖి నిర్వహించారాయన. ‘‘మనం కూటమి కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు, దత్తపుత్రుల కుట్రలతో యుద్ధం చేస్తున్నాం. అబద్ధాలు, మోసాలతో యుద్ధం చేస్తున్నాం. నేను ఒక్కడిని ఒకవైపు.. చంద్రబాబు, దత్తపుత్రుడు, ఇతరులు మరోవైపు. ఒకే ఒక్కడిగా ఎన్నికల కురుక్షేత్రంలో దిగుతున్నా. విజయానికి దగ్గరగా ఉన్నామనే.. మనపై దాడి తీవ్రతరం చేశారు. గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేసి వేధించారు. టీడీపీ.. వ్యవస్థ ఎంత దిగజారిందో అనడానికి గీతాంజలి ఆత్మహత్య ఘటనే ఉదాహరణ. కానీ, సోషల్ మీడియా మనతోనే ఉంది. సెల్ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ మనతోనే ఉన్నారు. దాడులకు భయపడేది లేదు. దేవుడు ఇంకా ఏదో పెద్ద స్క్రిప్ట్ ఏదో రాశాడు. అందుకే దాడి నుంచి బయటపడగలిగాను. ఈసారి ఎన్నికల్లో 175కి 175 రావాలి. 25కి 25 లోక్సభ సీట్లు గెలవబోతున్నాం’’ అని సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ అన్నారు. సీఎం వచ్చి నేరుగా విశాఖలో కూర్చుంటే.. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైతో పోటీ పడే స్థాయికి వెళ్తుంది. విశాఖపట్నం ఏపీకి డెస్టినేషన్ అవుతుంది. ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు YSRCP సోషల్ మీడియా కార్యకర్తలు తమ మనోగతాన్ని సీఎం జగన్తో పంచుకున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ ఏమన్నారంటే.. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన పార్టీ సోషల్ మీడియా ఆఫీస్ బేరర్స్ కు, పార్టీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ కు, ఇండిపెండెంట్ ఇన్ ఫ్లూయెన్సర్స్ కు, ఎన్ఆర్ఐ యాక్టివిటీలో అక్కడ నుంచి వర్చువల్ గా అటెండ్ అవుతున్న సోషల్ మీడియా సైనికులకు, యూట్యూబ్ నెట్ వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉన్న వాళ్లందరికీ, ఇక్కడికి రాలేకపోయినా కూడా మీ అభిమానంలో మాత్రం ఎక్కడా కూడా తక్కువ అనేదే లేకుండా మీ అన్నకు, దాదాపుగా 5 సంవత్సరాల పాటు మనం అధికారంలోకి రాకమునుపటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ తోడుగా ఉంటూ వస్తున్న నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు, కొంత మంది నా అన్నలకు కూడా మీ అందరికీ కూడా మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు పేరు పేరునా రెండు చేతులూ జోడించి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. ఈరోజు ఇక్కడ మనమంతా ఏకమయ్యాం రాబోయే మరో 18 రోజుల్లో జరగబోతున్న ఎన్నికల కురుక్షేత్రంలో మనమంతా కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ఈరోజు అందరం కూడా షేర్ చేసుకునే విషయంలో ఏకమయ్యాం. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెబుతున్నాను. మనకు ఒకవైపున చూస్తే, అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు. అటువైపు మనం యుద్ధం చేస్తున్నది ఎవరితో అని చూస్తే, ఇటువైపున కేవలం మీ జగన్ ఒకే ఒక్కడు కనిపిస్తాడు. కానీ అటువైపున కూటమిలో వాళ్లను చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తుంటుంది. ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5.. వీళ్లందరూ సరిపోరు అన్నట్టుగా ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్. వీళ్లందరే కాకుండా మనం యుద్ధం చేస్తున్నది ఎవరితో అంటే వీళ్ల కుట్రలతో, కుతంత్రాలతో, అబద్ధాలతో, మోసాలతో యుద్ధం చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో అయితే వాళ్ల ఉక్రోశం ఏ స్థాయిలోకి వెళ్లిపోయింది అంటే చివరికి సోషల్ మీడియాలో మీ జగన్ కు అంటే వాళ్ల అన్నకు తాను సపోర్ట్ చేసింది అని, ఆ సపోర్ట్ కూడా పాపం తాను ఎందుకు చేసిందంటే.. తాను జగనన్న చేసిన మంచితో తాను కూడా బాగుపడింది అని, జగనన్న వల్ల తనకు ఇల్లు వచ్చిందని, ఇంటి స్థలం వచ్చిందని, మిగిలిన పథకాలు కూడా జగనన్న వల్ల వచ్చాయని, తన సంతోషాన్ని తన సోషల్ మీడియాలో పాలు పంచుకుంటే ఏకంగా ఆ గీతాంజలి అనే నా చెల్లెల్లి ఎంత దారుణంగా ట్రోల్ చేశారో అందరం కూడా చూశాం. ఎంతటి దారుణంగా వేధించారో కూడా అందరం చూశాం. చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునేంత దూరం కూడా పోయింది అంటే నిజంగా ఈ వ్యవస్థ అన్నది ఎంత దారుణంగా చెడిపోయింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. మనకు సోషలో మీడియా ఉంది. ఇంతకు ముందు నేను చెప్పాను. జగన్ ఇటువైపున ఒకే ఒక్కడు. అటువైపున చూస్తే ఇంత మంది.. ఈ ఇంత మందికీ తోడు కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు, బెదిరింపులు, హెరాస్ మెంటు, అన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇంత మందితో, ఇన్ని కుట్రలతో, ఇన్నిన్ని ఇబ్బందుల మధ్య మీ జగన్.. మీ అన్న, మీ తమ్ముడు.. తట్టుకొని నిలబడగలుగుతున్నాడంటే కారణం.. వాళ్లకు ఈనాడు ఉండొచ్చు, ఆంధ్రజ్యోతి ఉండొచ్చు, టీవీ5 ఉండొచ్చు. కానీ మనకు.. సోషల్ మీడియా ఉంది. సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడూ జగన్ కు తోడుగా ఉన్నాడు. అందుకే జగన్ ఒంటరి కాదు. జగన్ కు ఇన్ని కోట్ల గుండెలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. జగన్ కోసం ప్రాణం ఇచ్చేదానికి కొన్ని లక్షల గుండెలు అండగా, తోడుగా ఉన్నాయి. ఇంత మంది తోడున్న జగన్ ఒంటరివాడు కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఒంటరి ఎలా అవుతాడు? ఆ దేవుడి దయ మీద జగన్ కు నమ్మకం ఉంది. జగన్ ను ప్రేమించే గుండెల మీద జగన్ కు నమ్మకం ఉంది. మీ అందరూ చేసిన, చేస్తున్న, చూపిస్తున్న అభిమానానికి, ఆప్యాయతలకు మీ జగన్ మాత్రం నిండు మనసుతో ఒకటే చెప్పగలుగుతాడు. మీకు ఎంత చేసినా, ఏమి చేయగలిగినా కూడా అది తక్కువే అవుతుందని మాత్రం ఈ సందర్భంగా సగర్వంగా చెప్పగలుగుతాడు. అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మాత్రం మరొక్కసారి భరోసా ఇస్తున్నాను. ఆర్గనైజేషన్ ను కూడా స్ట్రీమ్ లైన్ చేసే విషయంలో చాలా ఎఫెక్టివ్ గా స్ట్రీమ్ లైనింగ్ కూడా జరిగింది. భార్గవ్ కూడా చాలా క్రియాశీలకంగా స్ట్రీమ్ లైనింగ్ చేసే కార్యక్రమంలో తాను కూడా ముందుండి అడుగులు వేస్తున్నాడు. మీ అందరికీ భరోసా ఇస్తున్నా... అందరం కూడా మీ అందరికీ కూడా ఒకటే అసూరెన్స్ ఇస్తున్నాం.మీ వెనకాల ఉండేది ఒక్క జగనే కాదు. మీ వెనకాల ఉన్నది ఒక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీ వెనకాల ఉంది అని చెబుతున్నాను.ప్రతి నియోజకవర్గంలోనూ తోడుగా ఉంది. ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూమీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా చెబుతున్నాను. ఈ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ, సోషల్ మీడియా పరంగా మీరు ఏదైనా అడగాలి అనుకుంటే మీ అన్న, మీ తమ్ముడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ సందర్భంగా చెబుతూ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడమని కూడా కోరుతున్నాను. సిటీ ఆఫ్ డెస్టినీ రేపు ఆంధ్రా డెస్టినీ కాబోతుంది ఈ రోజు ఎలాగూ అందరూ విశాఖపట్నానికి వచ్చారు. కొంతమంది విశాఖపట్నం వాసులు, కొంత మంది విశాఖపట్నం బయట నుంచి కూడా వచ్చిన వాళ్లు. ఈరోజు ఈ సిటీని చూస్తున్నారు కదా.. ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అనేది రేప్పొద్దున ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుందన్నది మాత్రం ఈ సందర్భంగా కచ్చితంగా తెలియజేస్తున్నాను. ఈ విషయం తెలియజేస్తూ, ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ సిటీలో కూర్చోవడం మొదలు పెడతాడో, ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఈ సిటీ నుంచి పరిపాలన చేయడం మొదలు పెడతాడో అప్పుడు ఈ సిటీ అన్నది హైదరాబాద్ తో పోటీ పడే పడే పరిస్థితి, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి, ఐటీని ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కు తీసుకుని పోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ మాట చెబుతూ మైకులో మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే మీ దాకా మైకు వస్తుంది. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. నేను ఎదైనా నోట్ చేసుకోవాల్సి ఉంటే నోట్ చేసుకుంటాను. మీకు ఏదైనా నేను సమాధానం చెప్పాల్సి వస్తే చెప్తాను. థ్యాంక్యూ. అని సీఎం జగన్ ప్రసంగంలో పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రతినిధులు మాట్లాడిన అనంతరం సీఏం జగన్ ఏం మాట్లాడారంటే.. జగనన్న మీకు ఎప్పుడూ అండగా, తోడుగా ఉంటాడు మీ అందరితో కూడా ఒకే ఒక విషయం చెప్పదల్చుకున్నాను. చాలా మంది మాట్లాడగలిగారు. ఇంకా చాలా మంది మాట్లాడలేని పరిస్థితి. కానీ మీ అందరితో ఒకటే చెబుతున్నాను. మీ అందరికీ కూడా తోడుగా, మీ జగనన్న ఎప్పుడూ మీకు అండగా ఉంటాడని మాత్రం ఈ సందర్భంగా చెబుతున్నాను. దేవుడు పెద్ద స్క్రిప్టే రాశాడు ఇంకొక విషయం కూడా చెబుతున్నాను. ఈ దెబ్బ ఇక్కడ (నుదురుపైన) తగిలింది అంటే అది ఇక్కడా(కంటి మీద) తగల్లేదు. ఇక్కడా (కణత మీద) తగల్లేదు అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టే మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అని దాని అర్థం. కాబట్టి భయం లేదు. పైన దేవుడు – కింద మీరు అండగా ఉండగా మీ అన్నకు భయంలేదు మనం గెలిచేది 175కు 175 సీట్లే అని 25కు 25 ఎంపీ సీట్లే. ఒక్క సీటు కూడా ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. మీ భుజస్కందాల మీద ఫోన్ అనే ఈ ఆయుధం మీ చేతుల్లో ఉందనేది గుర్తుపెట్టుకోమని అందరితో కోరుతున్నాను. అటు వైపున 100 ఈనాడులు వచ్చినా, 100 ఆంధ్ర జ్యోతులు వచ్చినా, 100 టీవీ 5లు వచ్చినా, 100 మంది చంద్రబాబులు, 100 మంది దత్తపుత్రులు వచ్చినా, జాతీయ పార్టీలు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ మద్దతు పలికినా, కుట్రలు పన్నినా కుతంత్రాలు పన్నినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా మీ అందరికీ ఒకటే చెబుతున్నాను మీ జగన్కు భయం లేదు. మీ అన్నకు. మీ తమ్ముడుకి భయం లేదు. కారణం పైన దేవుడు ఉన్నాడు. కింద మీరంతా మీ అన్నకు అండగా ఉన్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు ఇక్కడ ఉన్న వాళ్లకు, ఇక్కడికి రాలేకపోయిన చాలా మంది ఆత్మీయులకు, దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండి కూడా వారి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపిస్తున్న నా అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు అందరికీ కూడా మీ జగన్ మరొక్కసారి మనసారా చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఇటువైపున తిరుగుతా వచ్చినంత మేర సెల్ఫీ తీసుకుంటాను అంటూ... సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. -
US: టెక్సాస్ హ్యుస్టన్లో మేమంతా సిద్ధం!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకి మద్దతుగా టెక్సాస్లోని హ్యుస్టన్ నగరంలో సంఘీభావ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ హ్యుస్టన్ నాయకులు బ్రహ్మనంద రెడ్డి , మారుతి , పుల్లా రెడ్డి , శ్రీనివాస్ ఎర్రబోతుల ,యాదగిరి రెడ్డి కుడుముల, విశ్వ సానపరెడ్డి, నర్సి రెడ్డి మరియు దాదాపు 90 మంది వైఎస్సార్సిపి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆన్లైన్ ద్వారా కిలారి రోశయ్య , ఎంపీ అయోధ్య రామి రెడ్డి మరియు పండుగాయల రత్నాకర్ గారు జాయిన్ అయ్యి ప్రసంగించారు. బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ.. ఐదేళ్లలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాళ్లలో జరిగినందుకుగాను జగన్ గారి మేమంత సిద్ధం బస్సుయాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ సంఘీభావం తెలుపుతున్నారు. రాష్ట్రంలో గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లీనిక్స్ తదితర ప్రభుత్వ సేవలపై సంతృప్తి వ్యక్తం చేసారు. ప్రభుత్వ బడులను గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. బడుల అభివృద్ధిని పూర్తిగా వదిలేయడంతో చాలా వరకూ శిథిలావస్థకు చేరాయి. ఇకపై ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడాలంటే నాడు–నేడుకు ముందు, ఆ తర్వాత అని విభజించి మాట్లాడాల్సిందే అన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 175 వైస్సార్సీపీ ఎమ్మెల్యే, 25 ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇక శ్రీనివాస్ ఎర్రబోతుల మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కళాశాలలు, గ్రామ, వార్డు సచివాలయ భవనాలు, విలేజ్ క్లినిక్లు, ఆస్పత్రి భవనాలు అని వివరించారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పేదింటి పిల్లలు చదువుకునే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం అమలు, ప్రతి విద్యార్థి కార్పొరేట్ స్థాయిలో గౌరవంగా చదువుకునేలా యూనిఫాం, బూట్లు అందజేత, పోషక విలువలతో కూడిన గోరుముద్ద, విద్యార్థులకు ట్యాబ్స్ వంటివి అద్భుతాలు అన్నారు. తాము ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాం. ఈ ఐదేళ్లలో నాడు–నేడు ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ పాఠశాలల రూపు రేఖలే మారాయన్నారు. మారుతి మాట్లాడుతూ.. జగన్ అన్న ప్రతి ఇంటికి మంచి చేశానని ధైర్యంగా చెబుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అలా చెప్పలేకపోతున్నారు. పైగా వలంటీర్ల వ్యవస్థపై ఆయన యుటర్న్ తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ పరువు పోయింది. చంద్రబాబు తను కూడా అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి పదివేల వేతనం ఇస్తానని చెప్పడం ద్వారా ఆయనే స్యయంగా జగన్ పాలన బాగుందని సర్టిఫికెట్ ఇచ్చినట్లే కదా అన్నారు. పుల్లా రెడ్డి మాట్లాడుతూ జగన్ గారు పేద ప్రజల కోసం అమ్మఒడి , జగన్ అన్న విద్యా కానుక, గోరు ముద్ద, సచివాలయ వ్యవస్థ, పోర్టులు నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. ప్రజలు వైస్సార్సీపీ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి జగన్ గారి ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఇవ్వాల్సిందిగా కోరారు . (చదవండి: ఎన్నికల తర్వాత బాబు, లోకేష్ ఎన్ఆర్ఐలే అవుతారు: రత్నాకర్) -
Memantha Siddham Bus Yatra: వన్స్మోర్ జగన్.. గళమెత్తిన విశాఖ (ఫొటోలు)
-
బస్సు యాత్రలో జగన్ జైత్రయాత్ర కనిపిస్తోంది..!
-
21వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర
-
Watch Live: సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి
-
పాదయాత్రకు మించి బస్సు యాత్రకు ప్రజాదరణ