పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం: ఎమ్మెల్యే తలసాని | Talasani Srinivas Yadav says his party changing is untrue | Sakshi
Sakshi News home page

పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం: ఎమ్మెల్యే తలసాని

Published Mon, Jul 1 2024 5:36 AM | Last Updated on Mon, Jul 1 2024 5:36 AM

Talasani Srinivas Yadav says his party changing is untrue

సనత్‌నగర్‌ (హైదరాబాద్‌): తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కార్యకర్తలు, నాయకులు అయోమయానికి గురికావద్దని మాజీమంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పష్టం చేశారు. వెస్ట్‌మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద ఆదివారం నిర్వహించిన సనత్‌నగర్‌ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

తన సోదరుడు శంకర్‌యాదవ్‌ మరణం విషాదం నుంచి తాము ఇంకా కోలుకోలేదన్నారు. శంకర్‌యాదవ్‌తో తనకున్న ప్రత్యేక బంధం సికింద్రాబాద్‌ ప్రజలందరికీ తెలుసునన్నారు. తమ కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉందని, ఆ కారణంగానే రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనలేకపోతున్నట్లు వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement