Talasani Srinivas Yadav
-
BRS ప్రజా ప్రతినిధుల ఫోన్లు ఎత్తడం లేదు: తలసాని
-
దళిత నేతను అవమానించారు.. కాంగ్రెస్ పై తలసాని కామెంట్స్
-
ఇథనాల్ మంటలు: కాంగ్రెస్ నేతలకు తలసాని సవాల్
సాక్షి, హైదరాబాద్: దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాగే, దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని మీడియాతో మాట్లాడుతూ..‘ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో నా కుమారుడికి సంబందం ఉందని పీసీసీ అధ్యక్షుడు, మంత్రి సీతక్క ఆరోపణలు చేశారు. ఇథనాల్ కంపెనీతో మా కుటుంబానికి సంబంధం లేదు. ఇథనాల్ కంపెనీ వద్దు అని అక్కడి గ్రామస్తులు ధర్నాలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజమండ్రి దగ్గర ఒక డిస్టిలరీస్ కంపెనీలో 8 మంది డైరెక్టర్లలో ఒకరిగా నా కుమారుడు ఉన్నారు. 2016లోనే డిస్టిలరీస్ కంపెనీ డైరెక్టర్ గా నా కుమారుడు రాజీనామా చేశాడు.ఆ పేపర్లను పట్టుకుని మాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. నా కుటుంబానికి చెందిన కంపెనీ అని నిరూపిస్తే మీకే కంపెనీని రాసిస్తాను. బీఆర్ఎస్ పార్టీపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. దిలావర్పూర్ గ్రామ ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాజకీయాల్లో విమర్శలు.. ప్రతి విమర్శలు సహజం. ఇథనాల్ కంపెనీకి గత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇథనాల్ కంపెనీ పర్మిషన్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. లగచర్లలో కేటీఆర్ కుట్ర చేశారని ప్రభుత్వం ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు. -
పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం: ఎమ్మెల్యే తలసాని
సనత్నగర్ (హైదరాబాద్): తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కార్యకర్తలు, నాయకులు అయోమయానికి గురికావద్దని మాజీమంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ స్పష్టం చేశారు. వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద ఆదివారం నిర్వహించిన సనత్నగర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన సోదరుడు శంకర్యాదవ్ మరణం విషాదం నుంచి తాము ఇంకా కోలుకోలేదన్నారు. శంకర్యాదవ్తో తనకున్న ప్రత్యేక బంధం సికింద్రాబాద్ ప్రజలందరికీ తెలుసునన్నారు. తమ కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉందని, ఆ కారణంగానే రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనలేకపోతున్నట్లు వివరించారు. -
శ్రీనివాస్ యాదవ్ మౌనం వెనక కారణమేమిటో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో తనదైన ముద్రతో వ్యవహరించే మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రస్తుత లోక్సభ ఎన్నికల తరుణంలో పెద్దగా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబ సభ్యుల తర్వాత.. ముఖ్యంగా నగర రాజకీయాలకు సంబంధించిన అంశాల్లో అన్నీ తానై వ్యవహరించే తలసాని దూకుడు వైఖరి గతంలో మాదిరిగా కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గానికి సంబంధించినంత వరకు చురుగ్గా ఉన్నారని, స్థానిక సమస్యలు విన్నవించుకోవడానికి ప్రతిరోజూ ఉదయం తన వద్దకు వచ్చే ప్రజలను కలుస్తూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నారని ఆయన అనుయాయులు చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజులకు వ్యతిరేకంగా నగరవ్యాప్తంగా జరిగిన ధర్నా తదితర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నప్పటికీ ఎక్కడో ఏదో వెలితి కనిపిస్తోంది. బహుశా, ప్రత్యర్థి పార్టీలపై గతంలో మాదిరిగా తీవ్ర రాజకీయ విమర్శలు చేయకపోవడం వల్లే అయి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వ్యాఖ్యల ఆంతర్యమేమిటో? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి వారు నగరానికి వచ్చినప్పుడు విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు తానే వెళ్లడం తెలిసిందే. రాజకీయంగా ఎవరిౖపైనెనా వెరవకుండా విమర్శలు, ప్రతివిమర్శలు చేయడాన్ని, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డిపై సైతం గతంలో పరుష వ్యాఖ్యలు చేయడాన్ని నగర ప్రజలు గుర్తు చేస్తున్నారు. గతంలో మాదిరి దూకుడు లేకపోవడం వల్ల కావచ్చు వెలితిగా కనిపిస్తోందని అంటున్న వారూ ఉన్నారు. ప్రస్తుతం తమ పార్టీ అధికారంలో లేనందున అనవసర వివాదాల్లో తలదూర్చరాదనే తలంపుతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రాజకీయంగా ఎలాంటి విమర్శలు కానీ, ప్రతివిమర్శలు కానీ చేయడం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీలకు సంబంధించి సైతం ఆయన పెద్దగా విమర్శలు చేయలేదు. పైపెచ్చు పేదలకు ఉపకరించే కార్యక్రమాలు ఎవరు చేసినా తమ మద్దతు ఉంటుందని తన నియోజకవర్గంలో ఆయా కార్యక్రమాల ప్రారంభాల సందర్భంగా పేర్కొనడం గమనార్హం. లోక్సభ ఎన్నికలపైనా.. బీఆర్ఎస్ నుంచే ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరడంతో సికింద్రాబాద్ లోక్సభ టికెట్ తలసానికి ఇవ్వనున్నారనే ప్రచారం మొదలైనప్పటికీ ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దానం పార్టీ మార్పు గురించీ ప్రతిస్పందించలేదు. బహుశా తాను కూడా గతంలో పార్టీ మారడం వల్ల అయి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గత ఎన్నికల్లో ఆయన కొడుకు సాయికిరణ్కు టికెట్ కోసం ప్రయత్నించి, సాధించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ఆయననే రంగంలోకి దింపనున్నారా.. లేక తాను పోటీ చేసే యోచనలో ఉన్నారా అన్నదీ తెలియడం లేదు. అటు పోటీకి సంబంధించి కానీ, ఇటు రాజకీయ వ్యాఖ్యలకు సంబంధించి కానీ తొందరపడకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ తలసాని వ్యవహరిస్తున్న తాజా వైఖరికి కారణమేమిటన్నది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. -
ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్
-
గొర్రెల స్కాంలో ముమ్మరంగా సాగుతోన్న దర్యాప్తు
-
ఫైల్స్ చోరీ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన తలసాని ఓఎస్డీ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ కుమార్ తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ చోరీపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. అయితే, మూడు రోజుల క్రితం.. పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ చోరీ అయిన ఉదంతంలో కల్యాణ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్యాలయం నుంచి పలు కీలక పైళ్లను తీసుకెళ్లారని, మిగతా ఫైళ్లను చిందరవందరగా పడేశారని పేరొన్నారు. ఆఫీస్లో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారన్న వాచ్మన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కల్యాణ్తోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా.. మాసబ్ట్యాంక్లోని పశు సంవర్థకశాఖ కార్యాలయంలోనికి అక్రమంగా ప్రవేశించిన కల్యాణ్ బీరువాలో ఉన్న ద్రస్తాలను కారులో తరలించుకునిపోయారు. వాచ్మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు. అక్కడి సిబ్బంది సహాయంతో బీరువాలో ఉన్న ఫైళ్లను చింపేశారు. అంతటితో ఆగకుండా చించివేసిన ఫైళ్లను తన కారులో తరలించుకుని పోయారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం పనిచేయకుండా చేశారు. దీంతో వాచ్మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళ్యాణ్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. అతడికి సహకరించిన కంప్యూటర్ ఆపరేటర్స్ ఎలిజ మోహన్, అటెండర్లు వెంకటేశ్, ప్రశాంత్లపైనా కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. -
నడుస్తున్న ప్రగతికి ఓటెయ్యండి..
-
కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కాబోతున్నారు: తలసాని
-
కేసీఆర్ చేసినన్ని కార్యక్రమాలు దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు: తలసాని
-
నాంపల్లిలో ఘోరం.. ఆ ఒక్క తప్పుతో బూడిదైన బతుకులు
-
బజార్ ఘాట్ అగ్నిప్రమాదం.. మృతులకు 5లక్షల ఎక్స్గ్రేషియా
-
బజార్ ఘాట్ అగ్నిప్రమాదంపై కేటీఆర్, తలసాని
-
‘రేవంత్.. మేము కూడా నీలా మాట్లాడగలం’
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై మంత్రి తలసాని యాదవ్ మండిపడ్డారు. రేవంత్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేకంగా తనను, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును నోటికి వచ్చినట్లు రేవంత్ తిడుతున్నాడని, తాము కూడా అలా మాట్లాడగలం అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన తలసాని.. ‘ గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని సీట్లు గెలుస్తున్నాం. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు. తొమ్మిదిన్నర ఏళ్లలో అద్భుతంగా అభివృద్ది చెందింది. పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి పిసిసి నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. హోదా కలిగిన వ్యక్తి పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. నియోజకవర్గం లో ఉన్న ప్రజా ప్రతినిధులను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు. ప్రజలు వీడి భాషను గమనించాలి. రేవంత్ రెడ్డి ఒక్కడికే వస్తుందా ఆ భాష. నీచంగా మాట్లదటం ఎంత వరకు సబబు. కాంగ్రెస్ పార్టీ దీన్ని గమనించాలి’ అని పేర్కొన్నారు. -
ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు..మా గెలుపు ఖాయం
-
బీసీల కోసం కేసీఆర్ ఎంతో చేశారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీలకు, అట్ట డుగు వర్గాల పేదల అభ్యున్నతికి కేసీఆర్ లాగా కృషి చేసిన ముఖ్యమంత్రి దేశంలో మరెక్కడా లేరని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం తన నివాసంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ రాసిన ‘బీసీ ఆత్మగౌరవ భవనాలు’ పుస్తకాన్ని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీ సామాజిక వర్గాల జీవన ప్రమాణాలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్మాణాత్మకంగా కృషి చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బీసీలకు ఆత్మగౌరవ భవనాలు కట్టించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని, చేతి వృత్తుల వారికి లక్ష రూపాయలు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. ‘మేమొస్తే బీసీ సీఎం’ అని అమిత్ షా ప్రకటించడం పచ్చి బూటకమని విమర్శించారు. బీజేపీకి, కాంగ్రెస్కి బీసీ ఓట్ల మీద ఉన్న శ్రద్ధ బీసీల జీవన ప్రమాణాలు పెంచడంపై లేదని విమర్శించారు. పుస్తక రచయిత జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ దార్శ నిక ఆలోచనలకు ఆచరణ రూపంగా బీసీలు నిలిచి తీరుతారని, కేసీఆర్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటారని అన్నారు. -
సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
కానిస్టేబుల్ చెంపపై కొట్టిన హోంమంత్రి మహమూద్ అలీ
-
కానిస్టేబుల్ చెంపచెల్లుమనిపించిన హోంమంత్రి మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. సహనం కోల్పోయిన హోంమత్రి.. తన వ్యక్తిగత సహాయకుడు, గన్మెన్ అయిన కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతుండగా ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. అమీర్పేటల డీకే రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహారం కార్యక్రమాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. నేడు మంత్రి తలసాని జన్మదినం సందర్భంగా మంత్రి మహమూద్ అలీ ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమయంలో బోకే ఎక్కడ అంటూ తన సెక్యూరిటీ సిబ్బందిని అడిగారు. అయితే బోకే గురించి తెలియదని సిబ్బంది చెప్పడంతో సహనం కోల్పోయిన హోంమంత్రి మహమూద్ అలీ కానిస్టేబుల్ను చెంప దెబ్బ కొట్టారు. దీంతో షాక్ అయిన సదరు గన్మెన్ మంత్రిని అలాగే చూస్తుండిపోయారు. ఆకస్మిక ఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ క్రమంలో మంత్రి తలసాని.. మహమూద్ అలీకి సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. తరువాత వెనకాల ఉన్న వ్యక్తుల దగ్గరి నుంచి బొకే తీసుకుని మంత్రికి అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహమూద్ అలీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోంమంత్రి అయినంత మాత్రాన సిబ్బందిపై ఇలా దురుసుగా ప్రవర్తించడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Telangana Home Minister Mahamood Ali raises his hand on security for not bringing a bouquet to greet Minister Talasani Srinivas Yadav on his birthday pic.twitter.com/PDUFNcdUnP — Naveena (@TheNaveena) October 6, 2023 -
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటకు మాట
-
కర్ణాటకలో హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ నేతలు తెలంగాణలో డిక్లరేషన్లు పట్టుకుని తిరుగుతున్నారు: తలసాని
-
ఓటమి భయంతోనే బీజేపీ జమిలి ఆలోచనలు
సాక్షి, హైదరాబాద్: ఓటమి భయంతోనే కేంద్రంలోని బీజేపీ జమిలి ఎన్నికల ఆలోచనలు చేస్తోందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు తమదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తాజా సర్వేల్లో దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ గెలిచే అవకాశా ల్లేవని పేర్కొన్నారు. డబుల్బెడ్రూమ్ ఇళ్లపంపిణీకి సంబంధించి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జమిలి ఎన్నికలకు సంబంధించి విలే కరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, ఉన్నట్లుండి వేవ్ మార్చితే ఫలితాలు మారతాయని భ్రమ పడుతోందన్నారు. ఎన్నికలు ఎప్పుడైనా కేసీఆర్ సర్కార్ సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను నియమించిన పార్టీ తమదన్నారు. త్వర లో జరుగనున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ‘వన్ నేషన్– వన్ ఎలక్షన్’బిల్లు పెడతారనే ప్రచారం జరుగుతోందన్నారు. దేశంలో మోదీ క్రేజ్ పడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే నివేదికలు ఆ పార్టీ వద్ద ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ రెంటికీ కలిపి ఎన్నికలు పెడితే తమకేమైనా లాభం కలుగుతుందనే యోచనలో బీజేపీ ఉందన్నారు. జమిలి ఎన్నికలంటే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. నిర్ణీత షెడ్యూలు మేరకే ఎన్నికలు నిర్వహించాల్సిందిగా తాము ఈసీని కోరతామన్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. -
వచ్చే నెల 19నే వినాయక చవితి: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వినాయక చవిత ఉత్సవాలపై భాగ్యనగర్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల 19వ తేదీన సాంప్రదాయబద్దంగా వినాయక చవిత పండుగ నిర్వహించుకోవాలని సూచించింది. అలాగే, 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు సోమవారం భేటీ అయ్యారు. గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఏడాది వినాయక చవితి ఏ రోజున జరుపుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే, వచ్చే నెల18వ తేదీన మధ్యాహ్నం చవితి మొదలై 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుంది. సూర్యోదయం తర్వాత వచ్చిన తిథినే పండుగ రోజుగా గుర్తిస్తాం. కాబట్టి 19వ తేదీన సాంప్రదాయబద్దంగా వినాయక చవిత జరుపుతున్నాం. వచ్చే నెల 28వ తేదీన నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. పొలిటికల్ ఫ్లెక్సీలు వద్దు.. గత ఏడాది లాగే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం. గణేష్ పూజా విధానం తెలిపే బుక్తో పాటు పూజా సామాగ్రిని భక్తులకు ఇవ్వాలిని నిర్ణయించాం. గణేష్ మండపాలకు పోలీసు పర్మిషన్ తప్పనిసరి కాదు. స్థానిక పోలీసు స్టేషన్లో చెబితే సరిపోతుంది. గణేష్ ఉత్సవాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు పెడుతున్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే ఫ్లెక్సీలను నిషేధించింది. ఈసారి కూడా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను పెట్టవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు చెప్పాం. గణేష్ ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రావాలని అడిగినట్టు తెలిపారు. పండుగ ఘనంగా నిర్వహిస్తాం.. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. 30వేలకు పైగా వినాయక విగ్రహాలు తయారవుతున్నాయి. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పండుగ సజావుగా జరిగేందుకు కృషి చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున గడిచిన తొమ్మిదేళ్లలో అన్ని మతాల పండుగలను ఘనంగా నిర్వహించాం. గణేష్ నిమజ్జన కార్యక్రమం శోభాయమానంగా జరుగుతోంది. వినాయక నిమజ్జనం కోసం తాత్కాలిక చెరువులను ఏర్పాటు చేస్తాం. వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి ఒకేరోజు వస్తున్నాయి. ఆరోజు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బడ్జెట్తో సంబంధం లేకుండా ఉత్సవాలు నిర్వహిస్తాం. మన తెలంగాణ పండుగ సాంప్రదాయం దేశ విదేశాలకు విస్తరించింది. గణేష్ మండపాల పర్మిషన్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం’ అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: మొక్కలు రావాలంటే భూమికి తడి తగలాలి..సంస్కృతి నిలబడాలంటే.. -
చట్ట సభల్లో యాదవుల నాయకత్వం పెరగాలి
నాగోల్: రాష్ట్రంలో యాదవుల జనాభా ప్రకారంరాజకీయ పార్టీలు అవకాశాలు కల్పించాలని యాదవ సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. యాదవుల సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాలు స్పష్టం చేయాలని కోరాయి. అఖిల భారత యాదవ మహాసభ యాదవ విద్యావంతుల వేదిక, యాదవ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీల సంయుక్త ఆ ధ్వర్యంలో శుక్రవారం నాగోల్లో యాదవ యుద్ధ భేరి పేరిట బహిరంగ సభ నిర్వహించారు. యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పలు పా ర్టీలు, యాదవ సంఘాల నేతలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మంత్రి తలసాని మాట్లాడు తూ చట్టసభల్లో యాదవుల నాయకత్వం పెరగాల ని చెప్పారు. త్వరలో హైదరాబాద్లో 25లక్షల మంది యాదవులతో భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటుతామన్నారు. యాదవుల్లో ఐక్యత కోసం ప్రతి జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి, దీపావళి సదర్ వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకోవాలని కోరా రు. యాదవుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభు త్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని చెప్పారు. యాదవ నాయకుడు ప్రధాని కావాలి బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో గొల్ల కురుమలతోపాటు అన్ని బీసీ, ఎంబీసీ కులాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని వెల్లడించారు. రాజకీయ పా ర్టీల బీఫామ్ కోసం బిక్కుబిక్కుమనే పరిస్థితి దాపురించిందని, బీసీలే బీ ఫామ్లు ఇచ్చే పరిస్థితి రావాలని ఆకాంక్షించా రు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలందరూ ఏకమై రాజ్యా ధికారం సాధించాలని పిలుపునిచ్చారు. అంబర్పే ట నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ను యాదవ సంఘ నేత ఆర్.లక్ష్మణ్ యాదవ్కు ఇస్తామని, ఐక్యంగా గె లిపించుకోవాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల ప్రదాత బీపీ మండల్ మనవడు, ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సూరజ్ మండల్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో 20 శాతం జనాభా ఉన్న యాదవ నాయకుడు ప్రధానమంత్రి కావాల్సిన అవసరముందని తెలిపారు. తెలంగాణలో 18 శాతం జనాభా ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం నామమాత్రమేనని ఆందోళన వ్యక్తం చేశారు. యాదవుల అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యంపై యాదవ డిక్లరేషన్ను చలకాని వెంకట్ యాదవ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి తలసాని క్షమాపణలు
సాక్షి, హైదరాబాద్: ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం సందర్భంగా జరిగిన ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ స్పందించారు. బైంసా ఏఎంసీ ఛైర్మన్ రాజేష్బాబుకు మంత్రి క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు. కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడిందని.. పక్కనున్న ఓ వ్యక్తి తన కాలు తొక్కుతూ ముందుకెళ్లడంతో కాలికి గాయం అయ్యిందని ఆ సందర్భంగానే వ్యక్తిని నెట్టివేశానని అన్నారు మంత్రి తలసాని. సోషల్ మీడియాలో కావాలనే ఈ ఘటనను పెద్దది చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. తను తోసేసిన వ్యక్తి రాజేష్ బాబు అని, గిరిజన బిడ్డ తర్వాతే తెలిసిందని, వెంటనే ఫోన్ చేసి క్షమాపణ చెప్పానన్నారు. ఆ రోజు జరిగిన ఘటనపై గిరిజనుల మనోభావాలు దెబ్బతింటే మరోసారి క్షమాపణ చెబుతున్నానని తలసాని చెప్పారు. తాను బడుగు, బలహీన, దళిత, మైనార్టీ గిరిజన వర్గాల గొంతుకనని, తెలంగాణలో జరిగే సేవాలాల్, కొమురం భీం జయంతి కార్యక్రమాలు ముందుండి చేస్తానన్నారు. ఆ రోజు జరిగిన ఘటనపై వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మరోసారి క్షమాపణ చెబుతున్నానని తలసాని పేర్కొన్నారు. చదవండి: ‘పాలేరు నుంచే తుమ్మల పోటీ’ -
హైదరాబాద్లో భయంకరమైన పరిస్థితుల్లేవ్: మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: నగర పరిధిలో వర్షాలతో ప్రజలకు ఏ ఇబ్బంది కలగలేదని.. జీహెచ్ఎంసీ అద్భుతంగా పని చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో నగర వర్షాలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. భయంకర పరిస్థితులు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసినప్పటికి ప్రజలకు ఇబ్బంది కలుగలేదు. మంత్రి కేటీఆర్ దూరదృష్టితో SNDP వర్క్ ఫలితం ప్రజలను ఇబ్బందుల నుంచి తప్పించింది. జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తోన్న అన్ని శాఖలను నేను అభినందిస్తున్నా. GHMC కంట్రోల్ రూమ్ మూడు షిఫ్ట్ల్లో పనిచేస్తోంది. గత ప్రభుత్వాలు వర్షాల సమస్యలను తప్పించుకొని పారిపోయాయి.కానీ, బీఆర్ఎస్ మాత్రం సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. మరోవైపు.. ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు పోలీస్ కృషి చేస్తోంది. గాజుల రామరంలో లే అవుట్ సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. నాలా పనుల్లో 36కుగానూ.. 30 పూర్తి అయ్యాయి. నగరంలో ఎడతెరిపిలేని వర్షాలతో ఏదో జరిగిపోతోందని.. భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ప్రచారం ఉత్తదే అని తేల్చేశారాయన. హైదరాబాద్ ప్రజల కోసం ప్రభుత్వం, జిహెచ్ఎంసి పనిచేస్తున్నాయని.. ఏదైనా సమస్య ఉంటే టోల్ఫ్రీ నెంబర్స్కు ఫిర్యాదు చేయాలని కోరారాయన. అలాగే.. భారీ వర్ష సూచన ఉన్నప్పుడు ప్రజలు రోడ్ల మీదకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఎప్పటికప్పుడు సెల్ఫోన్లకు EVDM ద్వారా అప్రమత్తం చేస్తున్నామని.. అసలు ఈ కాన్సెప్ట్ దేశంలో ఎక్కడా లేదని మంత్రి తలసాని పేర్కొన్నారు. ట్రాఫిక్ వల్లే ఇబ్బంది జీహెచ్ఎంసీ పరిధిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ తెలిపారు. ‘‘వచ్చిన ఫిర్యాదులను అదే రోజు క్లియర్ చేస్తున్నాం. జీహెచ్ఎంసీ పరిధిలో 2వేలకు పైగా సిబ్బంది ఫీల్డ్ పై ఉన్నారు అని తెలిపారామె. అయితే.. ట్రాఫిక్ సమస్య వల్ల కొంత ఇబ్బంది అవుతోంది. వర్షం కురిసిన తరువాత రెండు గంటల సమయం పడుతుందని వెల్లడించారు. అలాగే.. జీహెచ్ఎంసీ పరిధిలో 11సెంటిమిటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని.. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని కోరారామె. పాత భవనాలకు నోటీసులిచ్చాం జీహెచ్ఎంసీ పరిధిలో జులై నెలలో పడాల్సిన వర్షం కంటే.. 60శాతం ఎక్కువగా పడిందని జీహెచ్ఎంసి కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలిపారు. ‘‘జీహెచ్ఎంసి పరిధిలో 455 టీమ్స్ పనిచేస్తున్నాయి. 399 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం. DRF టీమ్స్ 30 ఉన్నాయి. 197 మోటార్లు నీళ్లను తీసివేయ్యడానికి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నాయి. 9 టీమ్స్ గార్బేజ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసాము. చుట్టుపక్కల 185 చెరువులు ఉన్నాయి.. 35 చెరువులు FTL వరకు వచ్చాయి. అన్ని చెరువులను మానిటరింగ్ చేస్తున్నాం. 238 వాటర్ లాగింగ్ పాయింట్స్ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నాయని తెలిపారాయన. సర్కిల్ వారిగా వర్షపాతంను జిహెచ్ఎంసి మానిటరింగ్ చేస్తోందని.. శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి...నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారాయన. అలాగే.. నగరంలో సెల్లార్స్ తవ్వడంపై నిషేధం ఉడడంతో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారాయన. ప్రస్తుతం నగరంలో 130 రిలీఫ్ సెంటర్స్ను సిద్ధం చేసుకున్నామని, ప్రజలకు సమస్యలు వస్తే గనుక అక్కడికి తరలిస్తామని తెలిపారు. -
కిషన్ రెడ్డికి ఎందుకు ఈ రాజకీయ డ్రామా? :మంత్రి తలసాని
-
కిషన్రెడ్డి ఎందుకు ఈ రాజకీయ డ్రామా?: తలసాని ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేతల బాట సింగారం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పర్యటన ఉద్రిక్తరంగా మారిన విషయం తెలిసిందే. పర్యటన సందర్బంగా బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావులను పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం.. బీజేపీ పార్టీ ఆఫీసు వద్ద దింపేశారు. ఈ క్రమంలో కేసీఆర్ సర్కారుపై బీజేపీ నేతలు ఫైరయ్యారు. ఈ క్రమంలో బీజేపీ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తలసాని మాట్లాడుతూ.. కేంద్రమంత్రిగా కిషన్రెడ్డి అధికారికంగా వెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను చూడవచ్చు. కిషన్రెడ్డి ఎందుకు ఈ రాజకీయ డ్రామా?. కిషన్రెడ్డి వస్తానంటే నేనే కొల్లూరు తీసుకునిపోయి చూపిస్తాను. కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1.50లక్షలు మాత్రమే ఇస్తోంది. తెలంగాణకు కేంద్రం ఏం చేసింది?. మేము కట్టిన ఇళ్ల దగ్గర బీజేపీ నేతల తాపత్రయం ఎందుకు?. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడయినా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిందా?. ఈరోజు ఉదయం నుంచి కిషన్రెడ్డి డ్రామా చేస్తున్నారు. అంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవాలకు కిషన్ రెడ్డి, నేను కలిసి వెళ్లాం. కిషన్ రెడ్డి చాలా సార్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బాగున్నాయని అన్నారు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ ప్రభుత్వంపై మా యుద్ధం మొదలైంది: కిషన్ రెడ్డి ఫైర్ -
Telangana:బీసీ దారిలో బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్ అంశంలో కాంగ్రెస్పై మూకుమ్మడిగా విమర్శల దాడికి దిగిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మరో అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇటీవల బీఆర్ఎస్లోని బీసీ మంత్రులు, నేతలు లక్ష్యంగా చేసిన విమర్శలు.. బీసీల్లో పట్టు కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిదాడికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ బీసీ నేతల కీలక భేటీ జరిగింది. మంత్రులు శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సంస్థల చైర్మన్లు ఇందులో పాల్గొన్నారు. భేటీపై కొన్ని గంటల ముందు మాత్రమే సమాచారం అందడంతో పరిమిత సంఖ్యలోనే బీసీ నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 25న విస్తృత స్థాయిలో బీసీ నేతల భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ను ప్రజాక్షేత్రంలో ఎండగడదాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇటీవల బీసీ మంత్రులు, ఇతర నేతల పట్ల చేసిన వ్యాఖ్యలు, బీసీ నేత దాసోజు శ్రవణ్కు వచ్చిన బెదిరింపులు తదితర అంశాలు తలసాని ఆధ్వర్యంలోని భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. బీసీ సభల పేరిట ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ చేస్తున్న హడావుడి, సూర్యాపేటలో సభ నిర్వహించి బీసీ డిక్లరేషన్ ప్రకటించేందుకు చేస్తున్న సన్నాహాలపైనా నేతలు చర్చించారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం బీసీల కోసం అమలు చేసిన పథకాలు, చేకూరిన లబ్ధి తదితరాలను విశ్లేషించారు. ఆత్మ గౌరవ భవనాలు మొదలుకుని అన్ని బీసీ కులాల కోసం అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్ను ఎండగట్టాలని.. లేకుంటే కాంగ్రెస్ బీసీలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని భేటీలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. కార్యాచరణపై ఈ నెల 25న విస్తృత భేటీ బీసీల ఆత్మగౌరవాన్ని చాటడంతోపాటు బీసీల కోసం బీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలు, పథకాలను వివరించేందుకు ‘బీసీ గర్జన’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ బీసీ నేతలు నిర్ణయించారు. హైదరాబాద్తోపాటు ఇతర జిల్లా కేంద్రాల్లోనూ బీసీ ఆత్మగౌరవ సభలు నిర్వహించాలనే ఆలోచనకు వచ్చారు. రాష్ట్ర మంత్రివర్గం మొదలుకుని పార్లమెంట్, అసెంబ్లీ, ప్రభుత్వ కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలతో పరేడ్ నిర్వహించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. ఈ కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఈ నెల 25న హైదరాబాద్లో మరోమారు విస్తృత స్థాయి భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, 93బీసీ కుల సంఘాల నేతలను ఆహ్వానించనున్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే కాంగ్రెస్ భూస్థాపితమే.. – మంత్రులు తలసాని, శ్రీనివాస్గౌడ్, గంగుల హెచ్చరిక – త్వరలో బీసీ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి బీసీ ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా కించపర్చే ఆరోపణలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తీరు సరికాదని మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్ మండిపడ్డారు. బీసీల జోలికొస్తే బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. తలసాని కార్యాలయంలో బీసీ నేతల భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. బీసీలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ కొందరు కాంగ్రెస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. పెయిడ్ ఆర్టిస్టులతో బీసీల్లో కొట్లాట పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జనాభాలో 56శాతంగా ఉన్న బీసీలు ఆత్మగౌరవాన్ని వదులుకోబోరన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉందంటున్న కాంగ్రెస్ ఎంత మంది బీసీలకు ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీసీలను కదిలించేందుకు అవసరమైన కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. -
కాంగ్రెస్ నేతలను తిరగనివ్వం.. తలసాని మాస్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీలను కించపరుస్తూ మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైరయ్యారు. రాష్ట్రంలో బీసీలమందరం ఏకమవుతున్నామని స్పష్టం చేశారు. ఎక్కువగా మాట్లాడితే తెలంగాణ గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను తిరగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. కాగా, తెలంగాణలో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అనంతరం, మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. నోరుందని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. అన్నీ బీసీ కులాల నాయకులను పిలిపించి చర్చిస్తాం. బీసీ నేతలై వ్యక్తిగత దాడులు చేస్తే ఊరుకునే ప్రస్తకే లేదు. బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడొద్దు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఏకం చేస్తాం. కుల వృత్తుల సమస్యలు, బాధలు మాకు తెలుసు. భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నాం. బాడీషేమింగ్ చేస్తే బాగోదు. హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మాటలు నేర్పిందా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఆత్మగౌరవ భవనాలు నిర్మించాం. రైతు బంధు, రైతు బీమా మెజారిటీ బీసీలకు అందుతోంది. కాంగ్రెస్ పార్టీ విధానమా.. సొంత ఎజెండనా అర్ధం కావడం లేదు. బీసీలను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. మీ పార్టీ విధానం కదా చెప్పాలి. గ్రామల్లో కాంగ్రెస్ నాయకులను తిరగకుండా చేస్తాం. ప్రజలకు సేవా చేయాలనీ చిన్న సమాజం నుంచి వచ్చిన నాయకులం మేము. 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మాటలు నేర్పిందా? అని ప్రశ్నించారు. వ్యక్తి గత భాష ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేము తెగిస్తే దేనికైనా సిద్ధం. ఒక పద్ధతిగా ఉండాలని సైలెంట్గా ఉన్నాం. మమ్మల్ని నమ్మిన వాళ్లు ప్రతీ ఒక్కరు బాధ పడుతున్నారు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్.. జీతం ఎంతంటే? -
‘రుద్రమాంబపురం’పై మంత్రి తలసాని ప్రశంసలు
ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న రుద్రామాంబపురం చిత్రంపై తెలంగాణ మంత్రి శ్రీనివాస యాదవ్ ప్రశంసలు కురిపించారు. మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు , ఆచారాలు, వారి కష్ట సుఖాల మీద వచ్చిన ఈ చిత్రం తనకు బాగా నచ్చిందన్నారు. ఇంత గొప్ప చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన చిత్రబృందానికి ఆభినందనలు తెలుపుతున్నాను అన్నారు. ఎన్వీఎల్ ఆర్ట్స్ పతాకంపై నండూరి రాము నిర్మించిన చిత్రం రుద్రమాంబపురం. మహేష్ బంటు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మూల కథ అజయ్ ఘోష్ అందించారు. శుభోదయం సుబ్బారావు, అజయ్ ఘోష్, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, టివి.ఎయిట్ సాయి, శంకర్, డివి.సుబ్బారావు, ప్రమీల, రజిని శ్రీకళ, రత్నశ్రీ, షెహనాజ్, రజిని, సురేఖ, రమణి ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా వీక్షించిన మంత్రి..పై విధంగా స్పందించారు. ఈ సందర్భంగా నిర్మాత నండూరి రాము మాట్లాడుతూ.. మా రుద్రమాంబపురం సినిమా డిస్నీ హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా చూసిన అందరూ బాగుంది అంటున్నారు, ప్రస్తుతం సినిమా హాట్ స్టార్ లో టాప్ పొజిషన్ లో ట్రేండింగ్ అవుతోంది. థియేటర్స్ లో రావాల్సిన సినిమా ఇదని అంటుంటే ఆనందంగా ఉంది అన్నారు. -
‘కేసీఆర్ ఆదేశిస్తే.. ఎన్నికల్లో పోటీ చేస్తా’.. సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు
సాక్షి, యాదగిరిగుట్ట: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగింది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలోని నేతలు సీట్ల వేటలో ఉన్నారు. ఈ క్రమంలో కొందరికి ఇప్పటికే సీట్ల కేటాయింపు జరిగిపోయింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఏ స్థానం నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. మరోవైపు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం సికింద్రాబాద్ మహంకాళి దేవాలయంలో తలసాని విలేకరులతో మాట్లాడారు. ఈ క్రమంలో తలసాని మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాల్లో ఈ స్థాయికి చేరుకున్నా.. నాకు సీఎం కావాలనే ఆశ లేదు, ఆశకు కూడా ఓ హద్దు ఉండాలి. ఇప్పుడున్న దాంతో సంతోషంగా ఉన్నా’ అని అన్నారు. కాంగ్రెస్లో గిరిజన ఎమ్మెల్యే సీతక్క ముఖ్యమంత్రి కావొచ్చనే వ్యాఖ్యలు వచ్చాయని, మీ పార్టీలో బీసీ సీఎం అనే ఆలోచన వస్తే మీరు పోటీలో ముందుంటారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తలసాని ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: మంత్రి కేటీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సవాల్ -
Bonalu 2023: వైభవంగా ఉజ్జయినీ మహంకాళి బోనాలు
రాంగోపాల్పేట్: చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. సీఎం కేసీఆర్ దంపతులతో పాటు వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులతో కలిసి దేవాలయానికి వచ్చారు. ఆయన సతీమణి స్వర్ణ అమ్మవారికి బోనం సమర్పించారు. మంత్రి మొదటి పూజ చేసిన అనంతరం 4.15 గంటలకు సాధారణ భక్తులను అనుమతించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం ముఖ్యమంత్రి కేసీఆర్ తన సతీమణితో కలిసి అమ్మవారిని దర్శించుకుని పట్టువ్రస్తాలు సమర్పించి పూజలు చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, ఈవో గుత్తా మనోహర్రెడ్డి, వేద పండితులు, అర్చకులు పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎంపీ కేకే తదితరులు కూడా సీఎంకు స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ వచ్చారు. కాగా హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కె.కవిత, మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి, మాజీ ఎంపీలు వి.హన్మంతరావు, అంజన్కుమార్ యాదవ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ కవిత బంగారు బోనంతో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి వచ్చే సమయంలో విడిగా వచ్చిన కవిత, తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం తల్లిదండ్రులతో కలిసి వెళ్లారు. పద్మారావు ఇంట్లో విందుకు సీఎం మహంకాళి అమ్మవారికి పూజలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి నేరుగా టకారాబస్తీలోని డిప్యూటీ స్పీకర్ పద్మారావు నివాసానికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులతో కలిసి బోనాల విందును ఆరగించారు. సీఎంతో పాటు ఆయన సతీమణి, మంత్రులు మల్లారెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కవిత తదితరులు ఉన్నారు. -
వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజల అనంతరం ఉదయం 3.30 గంటలకు ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఆదివారం తెల్లవారుజాము నుంచే మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్సీ కవిత మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. ఇక ఆషాఢమాస జాతరలో భాగంగా ఆదివారం బోనాలు, సోమవారం రంగం కార్యక్రమం జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ, విద్యుత్, జలమండలి, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మహంకాళి దేవాలయాన్ని విద్యుద్దీపాలు, పూలు, పండ్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆషాడ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి కుటుంబసభ్యులతో కలిసి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. #LashkarBonalu #SecunderabadBonalu #Bonalu pic.twitter.com/zf1zbzl0WY — Talasani Srinivas Yadav (@YadavTalasani) July 9, 2023 -
రవీంద్రభారతిలో ఘనంగా మహిళాసంక్షేమ సంబరాలు (ఫొటోలు)
-
గొల్ల, కురుమల అభివృద్ధికి కృషి
నకిరేకల్(నల్లగొండ): గొర్రెల పెంపకం వృత్తి గా జీవిస్తున్న గొల్ల, కురుమల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అర్హులైనవారికి గొర్రె పిల్లల యూనిట్లు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. నల్లగొండ జిల్లా నకిరేకల్లో రెండవ విడత గొర్రెల యూనిట్ల పంపిణీని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తల సాని మాట్లాడుతూ.. గొర్రెల పంపిణీకి రాష్ట్ర బడ్జెట్లో రూ.12వేల కోట్లు ప్రకటించారని తెలిపారు. మొదటివిడతలో 50 శాతం పంపిణీ చేశామన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో రెండో విడత పంపిణీ చేపట్టామన్నారు. మొదట ఒక యూనిట్కు రూ.1.25 లక్షలు ఉండగా, రేట్లు పెరిగాయని గ్రహించిన సీఎం కేసీఆర్ ఒక యూనిట్కు రూ.1.75 లక్షలకు పెంచి పథకాన్ని కొనసాగించారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.90 కోట్ల గొర్రెలు ఉన్నాయని తలసాని వెల్లడించారు. కాంగ్రెస్తో ఒరిగేదేమీ లేదు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ఒరిగేదే మీ లేదని మంత్రి తలసాని అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉండగా తెలంగాణ అన్ని రంగా ల్లో వెనుకబడిందన్నారు. తెలంగాణలో అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్, సంక్షేమ రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి వైపు ఇతర రాష్ట్రాలు చూస్తున్నాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టంకట్టేందుకు ప్రజ లు సిద్ధంగా ఉన్నారన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్య క్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా ఎస్పీ అపూర్వరావు తదితరులు పాల్గొన్నారు. -
మూడేళ్ళ తర్వాత చేప మందు పంపిణీ
-
చేప ప్రసాదం పంపిణీకి భారీ సన్నాహాలు (ఫొటోలు)
-
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి.. (ఫొటోలు)
-
తలసాని Vs రేవంత్.. ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గొల్ల కురుమలను కించపరిచేలా రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. దున్నపోతులతో గాంధీభవన్ను ముట్టడించేందుకు యాదవ సంఘం యత్నించింది. సమాచారం అందుకున్న పోలీసులు గొల్ల కురుమలను అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు. తలసాని Vs రేవంత్ కాగా రాష్ట్రంలోని యాదవ, కురుమలను అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి తలసానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని యాదవ జేఏసీ డిమాండ్ చేసింది. తమ సామాజికవర్గాన్ని తక్కువ అంచనా వేయకూడదని, రాష్ట్రంలో 20 శాతానికి పైగా జనాభా ఉన్నదని, తమ సత్తా ఏమిటో చూపుతామని అన్నారు. రేవంత్ రెడ్డి ఏ గల్లీలో తిరిగినా అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే 25న వేలాదిగా యాదవులు, కురుమలు దున్నపోతులతో ఇందిరాపార్కు నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తామని, అక్కడి నుంచి గాంధీ భవన్కు చేరుకొని ముట్టడిస్తామని మంగళవారం హెచ్చరించారు. -
జూన్ 5 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీకి రంగం సిద్ధమైంది. వచ్చే నెల 5వ తేదీ నుంచి రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. గొర్రెల పంపిణీ పథకంపై మంగళవారం డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షాసమావేశంలో గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్సిన్హా, డైరెక్టర్ డాక్టర్. ఎస్.రాంచందర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయి 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ఈ ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 5వ తేదీ నుంచి గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, ఈలోగా లబ్ధిదారులను తీసుకెళ్లి గొర్రెలు కొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రూ.500 కోట్లు విడుదల కాగా, గొర్రెల పంపిణీ పథకానికి అవసరమైన నిధులను ఇవ్వడంలో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) జాప్యం చేస్తున్న నేపథ్యంలో ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వమే తన ఖజానా నుంచి నిధులను సమకూర్చాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రస్తుతానికి రూ.1000 కోట్ల నిధులను మంజూరు చేసింది. రూ.వెయ్యి కోట్లలో రూ.500 కోట్లకు గాను ఆర్థిక శాఖ బడ్జెట్ విడుదల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో గొర్రెల కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లలో పశుసంవర్ధక శాఖ అధికారులున్నారు. కాగా, రెండో విడత పంపిణీ ప్రక్రియను వచ్చే నెల 5వ తేదీన మంత్రి తలసాని నల్లగొండలో ప్రారంభించనుండగా, అదే రోజున అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రారంభం కానుంది. -
పిసుక్కుంటున్న రేవంత్, తలసాని
-
తలసాని తకిడతకిడత..
-
'మా ఊరి పొలిమేర'-2 పోస్టర్ రిలీజ్
‘‘మా ఊరి పొలిమేర’ పోస్టర్ బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గౌరు గణబాబు సమర్పణలో డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, అక్షత, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను ముఖ్య తారలు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేశారు. ‘‘మా ఊరి పొలిమేర’ చూసి ఎగ్జయిట్ అయ్యాను. ఆ సినివ సీక్వెల్ను మా బ్యానర్లో చేసినందుకు డా. అనిల్ విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు’’ అన్నారు గౌరీకృష్ణ. -
మా ఊరి పొలిమేర 2 ఫస్ట్ లుక్ చూశారా?
సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, అక్షత, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం మా ఊరి పొలిమేర 2. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. శనివారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ...``మా ఊరి పొలిమేర -2` పోస్టర్ చాలా బాగుంది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు`` అన్నారు. నటుడు సత్యం రాజేశ్ మాట్లాడుతూ.. 'మా ఊరి పొలిమేర చిత్రాన్ని ఎంతో ఆదరించారు. దానికి సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రాన్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని నమ్ముతున్నాం' అన్నారు. దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. `మా సినిమా ఫస్ట్లుక్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేయడం చాలా పాజిటివ్గా అనిపించింది. ఇది ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతున్నా. `మా ఊరి పొలిమేర` చిత్రాన్ని ప్రేక్షకులందరూ బాగా ఆదరించారు. 'మా ఊరి పొలిమేర' చిత్రానికి సిక్వెల్ ఉందా? లేదా? అని చాలా మంది అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి సమాధానంగా `మా ఊరి పొలిమేర -2` ఫస్ట్ లుక్ లాంఛ్ చేశాం. త్వరలోనే రిలీజ్ డేట్ వెల్లడిస్తాం` అన్నారు. ఈ చిత్రానికి సంగీతంః గ్యాని; సినిమాటోగ్రఫీః ఖుషేందర్ రమేష్ రెడ్డి; ఎడిటింగ్ః శ్రీ వర; కో-డైరక్టర్ః ఆకుల నాగ్; పీఆర్వోః జికె మీడియా; ఆర్ట్ డైరక్టర్ః ఉపేంద్ర రెడ్డి చందా; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః ఎన్.సి.సతీష్ కుమార్; నిర్మాతః గౌరి కృష్ణ; స్టోరి-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరక్షన్ః డా.అనిల్ విశ్వనాథ్. చదవండి: సింగర్తో ఛత్రపతి డేటింగ్... ఎగిరి గంతేసిన నటి -
నంది అవార్డులు ఎవరు పడితే వారు అడిగితే ఇచ్చేవి కావు: తలసాని
-
నంది అవార్డుల వివాదంపై స్పందించిన మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తరపున సినీ అవార్డులను వచ్చే ఏడాది నుంచి ప్రకటిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం దివంగత దాసరి నారాయణరావు 76వ జయంతిని పురస్కరించు కుని మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో ఆయన విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ సినీరంగానికి దాసరి చేసిన సేవలను కొని యా డారు. దర్శకుడిగా 150 సినిమాలను తెరకెక్కించి గిన్నిస్బుక్ రికార్డును స్వంతం చేసుకున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. దాసరి వంటి దర్శక దిగ్గజం మన తెలుగు సినీ పరి శ్రమలో ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నంది అవార్డులు ఎందుకు ఇవ్వట్లేదని కార్యక్రమంలో విలేకరు లు మంత్రి తలసానిని అడిగారు. అవార్డులు ఇవ్వాలని సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వాన్ని ఎవరూ సంప్రదించలేదని మంత్రి బదులిచ్చా రు. కార్యక్రమంలో చిత్రపురి హౌసింగ్ సొసై టీ, 24 క్రాఫ్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్కుమార్, సినీ ప్రముఖులు సి.కల్యాణ్, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, దర్శ కులు ఎన్.శంకర్, రేలంగి నర్సింహారావు, దాసరి అరుణ్కుమార్, ఫిలించాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్గా సంయుక్తా మీనన్! -
హుస్సేన్ సాగర్ : కమ్మని నీరా.. కేఫ్ లోపల ఎలా ఉందో చూసేయండి (ఫొటోలు)
-
బల్కంపేట ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
-
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన మంత్రి తలసాని
-
మోదీ పర్యటన.. బీజేపీకి మంత్రి తలసాని సవాల్..
సాక్షి, హైదరాబాద్: అధికారిక కార్యక్రమాల్లో రాజకీయాలు మాట్లాడటం బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వందే భారత్ రైళ్లను ఎన్నిసార్లు ప్రారంభిస్తారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ తప్పుడు విమర్శలు చేశారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిపై మోదీ మాకు నీతులు చెప్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఏ అభివృద్ధి చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఆపిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ హయాంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తలసాని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందకపోతే కేంద్రం ఇన్ని అవార్డులు ఎందుకు ఇస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన మోదీకి రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు. పార్లమెంట్ వేదికగా తెలంగాణపై విషం చిమ్మారని గుర్తు చేశారు. సింగరేణిని ప్రవేటీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘భారత్ బయోటెక్ వచ్చినప్పుడు కేసీఆర్ రాకుండా చేసిందెవరు. బీబీ నగర్ ఏయిమ్స్ను మీరు కట్టారా. తెలంగాణకు అవార్డులు ఇస్తున్నారు. నిధులు ఇవ్వడం లేదు. ఎంపీగా ఉండి తెలంగాణ ప్రజలకు లక్ష రూపాయలు కూడా కర్చు పెట్టలేదు. విభజన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదు. దేశానికి అత్యధిక రెవెన్యూ ఇస్తున్న రాఫ్ట ం తెలంగాణ. తెలంగాణకు చట్టం ప్రకారం రావాల్సిందే ఇస్తున్నారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అదనంగా ఇచ్చిందేం లేదు. తెలంగాణ అభివృద్ధిపై మోదీతో చర్చకు మేం సిద్ధం.’ అని మంత్రి తలసాని సవాల్ విసిరారు. చదవండి: కేసీఆర్ కోసం ఎదురుచూశాం.. శాలువా కూడా తెచ్చా: బండి సంజయ్ -
సాయన్న 72వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసిన మంత్రులు
-
మాంసపు వ్యర్థాలు రోడ్లపై వేస్తే కఠిన చర్యలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వీధి కుక్కల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రజల భద్రత, జీవాల సంరక్షణకు ప్రభుత్వం సమ ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. గురువారం వివిధ శాఖల అధికారులతో తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. నగరంలో కుక్కల బెడద నివారణకు నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి స్టెరిలైజేషన్ కార్యక్రమాలు చేయాలని అధికారులను ఆదేశించారు. బస్తీలు, కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నగరంలో కుక్కలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాలకు తరలించి ఆహారం, తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో నూతన సంరక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రోడ్లపై కుక్కలకు ఇష్టమొచ్చినట్లుగా ఆహారం వేయడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని కోరారు. షాపుల నిర్వాహకులు మాంసం వ్యర్థాలను రోడ్లపై వేస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో కుక్కలు ఎక్కువగా చేరడానికి కారణమవుతోందని పేర్కొన్నారు. మటన్, చికెన్ షాపుల వద్ద శుక్రవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా రోడ్లపై మాంసపు వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుక్కల విషయంలో ప్రస్తుతం 8 ప్రత్యేక టీములతో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు చెప్పారు. సమస్యలు పరిష్కరిస్తాం.. కోతులు, కుక్కల కారణంగా తలెత్తే సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ టోల్ఫ్రీ నంబర్ (040–21111111)కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రత్యేక యాప్ను కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వాటి ద్వారా ద్వారా ఫిర్యాదులు చేయొచ్చని తెలిపారు. కోతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. ప్రత్యేక అనుభవం ఉన్న వారి ద్వారా నగరంలోని కోతులను పట్టుకొని అటవీ శాఖ అధికారుల సమన్వయంతో వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, అడిషనల్ కమిషనర్ శ్రుతిఓజా (హెల్త్), పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
జీహెచ్ఎంసీలో వీధి కుక్కల దాడుల ఘటనపై తలసాని సమీక్ష
-
ఎమ్యెల్యే సాయన్న మృతిపట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం
-
బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్: తలసాని
బంజారాహిల్స్ (హైదరాబాద్): తన జాతిని సన్మార్గంలో నడిపించి భారత్లోని దాదాపు 11 కోట్ల బంజారాలకు సంత్ సేవాలాల్ మహారాజ్ ఆరాధ్య దైవంగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బంజారాహిల్స్లోని బంజారా భవన్లో బుధవారం నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సాంస్కృతిక జీవన విధానాన్ని కాపాడటం కోసం సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారని చెప్పారు. తెలంగాణ వస్తే అణగారిన వర్గాల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు దక్కుతుందనడానికి సేవాలాల్ జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడమే నిదర్శనమన్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసిందని తెలిపారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బంజారా, లంబాడా వర్గాలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలోని తాండాలను గ్రామ పంచాయితీలుగా మార్చి.. ‘మా తండాలో మా రాజ్యం’అనే గిరిజనుల చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్షను నెరవేర్చిందని చెప్పారు. గిరిజన విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
ఎవ్వరితో పొత్తుల్లేవ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ తెలంగాణలో ఎవరిపైనా ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేయదని, స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా తమ పార్టీకి ఉందని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గంటకో మాట మార్చే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి విశ్వసనీయత లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ భవన్లో బుధవారం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలతో మమేకమైన తమ పార్టీకి పొత్తులు పెట్టుకునే అవసరం లేదన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్లో ఎంపీగా ఉంటూ మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓట్లు వేయాలని కోమటిరెడ్డి చెప్పారని గుర్తు చేశారు. చర్చకు సిద్ధమేనా కిషన్రెడ్డి? అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో అంబర్పేటలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు అక్కడి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీలు మారిన వారు, బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు వెళ్లిన వారి పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారని, ఈటల రాజేందర్ బీఆర్ఎస్లోకి రావడం గురించి ఆయనకే తెలియాలని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. కడపలో స్టీల్ ప్లాంట్ ప్రారంభానికి అనుమతిచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు. సెక్రటేరియట్ కట్టడం గొప్పతనం భవిష్యత్తులో అందరికీ తెలుస్తుందని, కొత్త సచివాలయాన్ని చూసి కొందరు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. కేసీఆర్ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహిస్తాం ఈనెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను డివిజన్ల వారీగా నిర్వహిస్తామని, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు చెందిన ప్రార్థనా స్థలాలు, మందిరాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరుగుతాయని తలసాని వివరించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయంలో మేయర్ విజయలక్ష్మి, సికింద్రాబాద్ గణేశ్ దేవాలయంలో డిప్యూటీ మేయర్ శ్రీలత పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బల్కంపేట ఆలయంలో రాజశ్యామల యాగం నిర్వహించడంతో పాటు నెక్లెస్ రోడ్డులోని థ్రిల్ సిటీలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. -
వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తాం: తలసాని
-
రాయితీపై రొయ్య పిల్లలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దేశంలో సబ్సిడీ మీద రొయ్య పిల్లలను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. చేపపిల్లలను వంద శాతం సబ్సిడీతో అందచేస్తూ ముదిరాజ్, బెస్త తదితర సామాజిక వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా సభ్యులు జీవన్రెడ్డి, ముఠా గోపాల్, కల్వకుంట్ల విద్యాసాగర్రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని సమాధానం ఇచ్చారు. 2022–23లో 4.67 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 23,748 నీటి వనరుల్లో చేప పిల్లలను వదిలామని చెప్పారు. చేపల మార్కెటింగ్ కోసం మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. గతంలో 647 సొసైటీలు ఉండగా, ఇప్పుడు వాటిని 5112కు పెంచుకున్నామని వెల్లడించారు. ఈ ఏడాది కొత్తగా లక్ష మందికి సభ్యత్వం ఇచ్చినట్లు చెప్పారు. పాల ఉత్పత్తి పెంపునకు చర్యలు విజయ డెయిరీని మూసివేసే పరిస్థితి నుంచి పురోగమించే స్థితికి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి తలసాని అన్నారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిపై సభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి, జైపాల్ యాదవ్, భాస్కర్ రావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెపుతూ విజయ డెయిరీతో పాటు కరీంనగర్, ముల్కనూర్ తదితర నాలుగు సహకార డెయిరీల అభివృద్ధికి కృషి జరుగుతోందన్నారు. -
Lumbini Park Photos: లుంబినీ పార్కులో మ్యూజికల్ ఫౌంటేన్ ప్రారంభం (ఫొటోలు)
-
బీసీల సంక్షేమానికి పెద్దపీట: హరీశ్
మణికొండ: దేశంలోని ఏరాష్ట్రంలోనూ లేనివిధంగా తెలం గాణలో బీసీల సంక్షేమానికి ఇప్పటివరకు రూ.48 వేల కోట్లు ఖర్చుచేశామని, ఈ సంవత్సరం 6,229 కోట్లను బడ్జెట్లో కేటాయించామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి టి.హరీశ్రావు అన్నారు. మంగళవారం ఆయన మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్లతో కలిసి గండిపేట మండలం కోకాపేటలోని ఆరెకటిక, గాండ్ల, రంగ్రేజ్, భట్రాజ్ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాలను పరిశీలించారు. ఆయా భవనాలకు అవసరమైన విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాల కల్పనపై అధికారులతో సమావేశం నిర్వహించారు. కోకాపేటలో బీసీల ఆత్మగౌరవ సముదాయాల నిర్మాణపనులను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. తుది దశకు చేరుకున్న యాదవ, కురుమ సంఘాల భవనాలను మార్చి 10న ప్రారంభిస్తామన్నారు. బీసీలకు ప్రభుత్వం అండ: రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు అండగా నిలుస్తున్నారని మంత్రి కమలాకర్ అన్నారు. ఇప్పటివర కు 29 బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాలకు భూమిపూజ చేశామన్నారు. దేశవ్యాప్తంగా ఆయా ప్రభుత్వాలు బీసీల గురించి కేవలం మాటలే చెబుతాయని, తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ సర్కారు చేతల్లో చూపిస్తోందని మంత్రి తలసాని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి జరుగుతున్న కృషిని ఆయా కులసంఘాల నేతలు, ప్రజలు దేశవ్యాప్తంగా చాటిచెప్పాలని సూచించారు. గతంలో ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశాయని, కేంద్ర ప్రభుత్వం బీసీలకు 2 వేల కోట్లు కేటాయించగా, తెలంగాణలో 6,229 కోట్లు సీఎం కేసీఆర్ కేటాయించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మల్లేశం, బండ ప్రకాశ్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కమీషన్ సభ్యుడు ఉపేంద్ర, జిల్లా కలెక్టర్ హరీశ్, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, ఆయా కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
బీసీల చరిత్రలో ఇది సువర్ణాధ్యాయం
ఉప్పల్: దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి తోడ్పాటునందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రులు గంగుల కమాలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్గౌడ్, చామకూర మల్లా రెడ్డిలు అన్నారు. వెనుకబడిన వర్గాల చరిత్రలో ఈ రోజు సువర్ణాధ్యాయమని పేర్కొన్నారు. ఆదివారం ఉప్పల్ భగాయత్లో 38 ఎకరాలలో 13 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలకు మంత్రులు భూమి పూజ చేశారు. స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారితో పాటు వివిధ కులసంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ గత 75 ఏళ్లలో ఇంతవరకు ఏ ప్రధాని, ముఖ్యమంత్రి చేయని విధంగా వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మేలు చేస్తున్నారని అన్నారు. ఈ ఆత్మగౌరవ భవనాలను తమ కులం ప్రతిష్టను ఇనుమడించేలా, సంస్కృతి వెళ్లి విరిసేలా డిజైన్లు చేసి నిర్మించుకునే ఆవకాశం వారికే ఇచ్చారన్నారు. ఆత్మగౌరవ భవనాల్లో దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి వసతి, తమ సంస్కృతిని చాటేలా కమ్యూనిటీ హాళ్లు, పిల్లల చదువు కోసం లైబ్రరీలు, రిక్రియేషన్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆత్మగౌరవ భవనాలకు రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. తెలంగాణ రావడంతోనే వెనుకబడిన కులాల్లో పెద్ద మార్పు వచ్చిందన్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ..వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనన్నారు. కుల వృత్తులకు చేయూత ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ దోపిడీ చేస్తుందని, బీజేపీ మతం మత్తులో ముంచుతుందని విమర్శిస్తూ కేవలం బీఆర్ఎస్ మాత్రమే అభివృద్ధి చేస్తుందని అన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ కుల వ్యవస్థపై జోతిబాపూలే అద్భుత పరిశోధన చేసి మనమంతా ఒక్కటే అని, కేవలం వృత్తిపరంగా కులాలకింద విభజితులైనట్లు చెప్పారని పేర్కొన్నారు. అయితే అందరినీ కలపడానికి పూలే పడ్డ ఆవేదన నేడు కేసీఆర్లో కనబడుతోందన్నారు. సమూహంగా ఎదగడానికి ఈ భవనాలు దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, ఎమ్మెల్యే ముఠాగోపాల్, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరి శంకర్, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఉప్పల్ తహసీల్దార్ గౌతం కుమార్, బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
K Viswanath : కళాతపస్వి పార్థివదేహానికి ప్రముఖుల నివాళులు (ఫొటోలు)
-
క్రైస్తవులు ఏకతాటిపైకి రావాలి
హిమాయత్నగర్ (హైదరాబాద్): కొంతకాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే.. కొన్ని వర్గాల వారు చర్చిలు, మసీదులు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. కానీ, రాష్ట్రంలో వారి పప్పులు ఉడకవని, ముఖ్యమంత్రి కేసీఆర్ అటువంటి వారిని ఉపేక్షించరన్నారు. రాష్ట్రంలోని క్రైస్తవులంతా ఒకేతాటిపైకి వచ్చి వారి హక్కులు, సంక్షేమ పథకాలు సాధించుకునేందుకు అవకాశాలను అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. మంగళవారం నారాయణగూడలోని బాప్టిస్టు చర్చిలో ‘తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్’(టీయూసీపీఏ) ఆధ్వర్యంలో 33 జిల్లాల పాస్టర్ల సమావేశం జరిగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలసి మంత్రి తలసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. క్రైస్తవుల్లో ఐకమత్యం లోపిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి హైదరాబాద్ వరకు ప్రతి మండలానికి ఓ కమిటీని రూపొందించి ఈ కమిటీలన్నీ ఒకే గొడుగు కింద ఉండేలా కృషి చేయాలన్నారు. అందరూ ఏకతాటిపైకి వస్తే దక్కాల్సిన హక్కులు తప్పకుండా దక్కుతాయన్నారు. మైనార్టీలు అంటే క్రైస్తవులు కాదనే ఆలోచన నుంచి క్రైస్తవులు బయటకు రావాలని సూచించారు. క్రైస్తవుల కోసం షాదీముబారక్ పేరుమార్పు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. లోపాలను సరిదిద్దుకుని ముందుకువచ్చి హైదరాబాద్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని, అందరూ ఏకతాటిపైకి వచ్చి నిలబడితే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నానని తలసాని ప్రకటించారు. రాష్ట్రంలో కోటిన్నర జనాభా కలిగిన క్రైస్తవులు డెసిషన్ మేకర్స్ అని ఎమ్మెల్యే దానం అన్నారు. కొంతకాలంగా కొన్ని వర్గాలపై ప్రణాళిక ప్రకారం దాడులు జరుగుతున్నాయని.. దానిని అధిగమించేందుకు క్రైస్తవులు ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. -
తెలంగాణ గవర్నర్పై మంత్రి తలసాని సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక, గణతంత్ర వేడుకల నేపథ్యంలో మాటల దాడి మరింత పెరిగింది. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవంలో రాజకీయాలు మాట్లాడటం తగదు. రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినేలా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడారు. గవర్నర్ వైఖరిపై రాష్ట్రపతికి లేఖ రాస్తాము. గవర్నర్ విషయంలో రాష్ట్రపతి కల్పించుకోవాలి. గవర్నర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడకూడదు అంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత సైతం గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా.. ‘కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే దేశ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టిపెట్టకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగ యువత కోసమే మా పోరాటం. ఇలాంటి ప్రత్యేకమైన రోజున, సీఎం కేసీఆర్ ప్రశ్నించిన వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్కు ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేశారు. -
సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం.. తప్పించుకునే యత్నంలో ఇరుక్కుపోయారు
సాక్షి, హైదరాబాద్/రామ్గోపాల్పేట: సికింద్రాబాద్ మినిస్టర్స్ రోడ్లోని రాధా ఆర్కేడ్లో ఉన్న డెక్కన్ కార్పొరేట్ గోడౌన్ అగ్నిప్రమాదంలో గల్లంతైన ముగ్గురిలో ఒకరి మృతదేహానికి సంబంధించిన ఎముకలు, సగం కాలిన పుర్రెను హైదరాబాద్ క్లూస్ టీమ్ శిథిలాల నుంచి రికవరీ చేసింది. గురువారం ఈ ప్రమాదం జరగ్గా శనివారం సాయంత్రం ఇవి లభించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మిగిలిన ఇద్దరు కూడా మృతి చెందే ఉంటారని, వాళ్ల ఎముకలు స్వాధీనం చేసుకోవడం కష్టసాధ్యమని ఓ అధికారి వ్యాఖ్యానించారు. భవనంలోని పరిస్థితులు ఇప్పటికీ నేరుగా అడుగు పెట్టడానికి అనువుగా లేకపోవడంతో విక్టిమ్ లొకేషన్ కెమెరా(వీఎల్సీ)తో కూడిన డ్రోన్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. శుక్రవారం వాడిన డ్రోన్కు అదనంగా శనివారం మరొకటి వినియోగించగా... ఆదివారం కూడా ఈ గాలింపు ప్రక్రియ జరుగనుంది. లిఫ్ట్ వద్ద షట్టర్ మూసి ఉండటంతో... గోదాములో అగ్నిప్రమాదం జరిగి పొగలు వస్తున్న సమయంలో ఆ సంస్థ ఉద్యోగులైన జునైద్, వశీం, జహీర్ అక్కడే ఉన్నారు. అప్పటికే పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు పైఅంతస్తుల్లో ఇరుక్కున్న నలుగురు కూలీలను రెస్క్యూ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ‘డెక్కన్’ యజమాని ఆదేశాల మేరకు ముగ్గురు ఉద్యోగులు మొదటి అంతస్తులో ఉన్న సరుకు తీసుకురావడానికి లోపలకు ప్రవేశించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే పొగతో పాటు మంటలూ ఎక్కువ కావడం.. అవి మొదటి అంతస్తును చుట్టేయడంతో ఆ ముగ్గురూ తప్పించుకోవడానికి భవనం వెనుక వైపున ఉన్న లిఫ్ట్ వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మొదటి అంతస్తుకు, లిఫ్ట్కు మధ్య ఉండే షట్టర్ లాక్ చేసి ఉండటంతో అక్కడే ఉండిపోయి పొగ వల్ల మరణించడమో, లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లి సజీవ దహనం కావడమో జరిగి ఉంటుందని అక్కడి పరిస్థితులను పరిశీలించిన అధికారులు చెబుతున్నారు. కూలిన శిథిలాల్లో మరో ఇద్దరి అవశేషాలు... ఈ భవనానికి వెనుక వైపుగా దాదాపు అన్ని ఫ్లోర్లకు సంబంధించిన శ్లాబ్స్ కూలిపోయాయి. మొదటి అంతస్తులో ఉన్న షట్టర్ వద్దా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. షట్టర్ పక్కన గోడ వద్ద ఉన్న యువకుడి మృతదేహంపై శ్లాబ్ ముక్కలు పడటంతో స్వాధీనం చేసుకున్న ఎముకలు మాత్రమే మిగిలాయని అధికారులు చెప్తున్నారు. మిగిలిన ఇద్దరూ చనిపోయే ఉంటారని, వారి ఎముకలు వంటి అవశేషాలు శకలాల్లో పడిపోయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆదివారం వీటి కోసం గాలించాలని భావిస్తున్నారు. ఈ అవశేషాలను బయటకు తీసుకురావడానికి క్లూస్ టీమ్తో పాటు డీఆర్ఎఫ్ అధికారులు తీవ్రంగా శ్రమించారు. సిటీ క్లూస్టీమ్ అధికారులు తమ వద్ద ఉన్న 3డీ స్కానర్తో భవనాన్ని విశ్లేషించారు. ఆపై భవనం ఎడమ వైపున ఉన్న సందు నుంచి వెనక్కు వెళ్లారు. అక్కడ కిటికీ సహాయంతో లోపలకు వెళ్లి సగం పడిపోయిన గ్రిల్ ఎక్కడం ద్వారా మొదటి అంతస్తునకు చేరుకున్నారు. అక్కడ శనివారం సాయంత్రానికి కూడా వేడిగానే ఉండటం గమనార్హం. డీఎన్ఏ పరీక్షలకు మాంసం, ఎముకలు.. ఈ అవశేషాలను శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో క్లూస్ టీమ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వెంకన్న, లాలాపేట క్లస్టర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంజయ్ సేకరించారు. వీటిని తొలుత గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. స్వాధీనం చేసుకున్న వాటిలో సగం కాలిన పుర్రె, కాళ్లు, చేతులకు సంబంధించిన కీలు, తొడ ఎముకలు ఉన్నాయి. తొడ ఎముక వద్ద కొంచెం కాలిన మాంసం కూడా లభించింది. దీన్ని సేకరించి డీఎన్ఏ పరీక్షలకు పంపనున్నారు. ఇప్పటికే ఆ ముగ్గురి బంధువులు నగరానికి చేరుకోవడంతో వారి నుంచి నమూనాలు తీసి ఆ మాంసంతో పోల్చనున్నారు. ఈ నివేదిక వచ్చిన తర్వాతే అది ఎవరి మృతదేహానికి సంబంధించినదో తేలుతుందని నిపుణులు చెప్తున్నారు. ‘చెల్లా చెదురుగా దొరికిన ఎముకలు తదితరాలు కూడా 80 శాతం కాలిపోయాయి. గట్టిగా పట్టుకుంటే బూడిదలా మారేలా ఉన్నాయి. ఒకటి రెండు రోజుల్లో డీఎన్ఏ నివేదిక వస్తుంది’ అని డాక్టర్ వెంకన్న తెలిపారు. భవనం లోపల ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మరో ఇద్దరికి సంబంధించిన అవశేషాలైనా దొరుకుతాయా లేదా అనే సందేహాలూ నెలకొన్నాయి. -
హైదరాబాద్కు కిషన్ రెడ్డి ఒక్క పైసా తెచ్చింది లేదు: తలసాని
-
‘అక్రమ కట్టడాలను రాత్రికి రాత్రే తొలగించడం సాధ్యం కాదు’
సాక్షి, హైదరాబాద్: రామ్గోపాల్పేట్లోని డెక్కన్ మాల్ భవనంలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. కాగా, డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదం నేపథ్యంలో నగరంలో అక్రమ నిర్మాణాలపై మరోసారి చర్చ మొదలైంది. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. డెక్కన్ మాల్ భవనంలో కెమికల్స్ వల్ల మంటలు ఆరలేదు. హైదరాబాద్లో డెక్కన్ మాల్ వంటి భవనాలు 25వేల వరకు ఉండొచ్చు. అక్రమ కట్టడాలను రాత్రికి రాత్రే తొలగించడం సాధ్యం కాదు. ఇలాంటి కట్టడాల విషయంలో ఏం చేయాలనే దానిపై కమిటీ వేశాము. ప్రమాద ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గాలిమాటలు మాట్లాడుతున్నారు. భవనాల క్రమబద్దీకరణపై స్టే ఉందని కిషన్ రెడ్డికి తెలియదా?. గుజరాత్లో కూడా వంతెన కూలి 180 మంది మరణించారు. కిషన్ రెడ్డి లాగా మేము రాజకీయాలు చేశామా?. హైదరాబాద్ అభివృద్ధికి గత ఎనిమిదేళ్లలో 65 వేల కోట్ల రూపాయలు కేటాయించాము. ఇంత అభివృద్ధి గతంలో ఎపుడైనా జరిగిందా?. రాజకీయాలు మాట్లాడటానికి ఇది సమయం కాదు. బాధితులను ఆదుకున్నది రాష్ట్ర ప్రభుత్వమా లేక కేంద్ర ప్రభుత్వ అధికారులా?. కిషన్ రెడ్డి భాద్యత లేకుండా మాట్లాడటం ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. మా ప్రభుత్వంలో ఒక్క భవనాన్ని కూడా రెగ్యులరైజ్ చేయలేదు. అగ్ని ప్రమాదం కారణంగా పక్కన ఉన్న బస్తీ వాసులకు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకున్నాము. బాధితులను కాపాడే క్రమంలో అగ్ని మాపక సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన కట్టడం నాణ్యతపై నిట్ ఆధ్వర్యంలోని కమిటీ తన నివేదికని త్వరలోనే సమర్పిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాము’ అని స్పష్టం చేశారు. -
సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. పక్క బిల్డింగ్కు వ్యాపించిన మంటలు
సాక్షి, సికింద్రాబాద్: నగరంలోని దక్కన్ స్టోర్లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంటల కారణంగా భవనంలో దట్టమైన పొగ అలుముకుంది. భవనం ఆరో అంతస్తులో మంటలు చెలరేగి కింద వరకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఇదిలా ఉండగా.. దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కాగా, మొదటి అంతస్తులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కాసేపటి క్రితమే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మంటలు చేలరేగాయి.. మంటలు కాస్తా పక్కనే ఉన్న మరో భవనానికి వ్యాపించాయి. ఘటనా స్థలంలో మూడు గంటలుగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు.. ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహాయక చర్యలను పరిశీలించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఫైర్ సిబ్బంది నలుగురు వ్యక్తులను కాపాడారు. మరో ఇద్దరు లోపల ఉన్నట్టు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది అని స్పష్టం చేశారు. -
గుడిమల్కాపూర్ కార్పొరేటర్ హఠాన్మరణం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నాయకుడు, గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ (55) హఠాన్మరణం చెందారు. గురువారం రాత్రి ఇంట్లో మనవడితో ఆడుకుంటూ ఉల్లాసంగా ఉన్న కరుణాకర్ ఒక్కసారిగా కుర్చీలో నుంచి కిందపడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను అంబులెన్స్లో సిటీన్యూరో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు నిర్ధారించి చికిత్స అందించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతదేహాన్ని గుడిమల్కాపూర్లోని స్వగృహంలో ఉంచగా పార్టీ నేతలు, కార్యకర్తలు సందర్శించారు. కాగా కరుణాకర్ రెండు పర్యాయాలు కార్పొరేటర్గా, ఆయన భార్య దీప ఓ పర్యాయం కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. శాసనసభ ఎన్నికల్లో నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు బంధువే కాకుండా అత్యంత సన్నిహితుడు. కరుణాకర్కు భార్య దీప, కుమారుడు దేవర వంశీ ఉన్నారు. కాగా గత రెండేళ్ల క్రితం ఆయన ఏకైక కుమార్తె దేవర భవానీ మృతి చెందారు. నివాళులర్పించిన మంత్రి తలసాని దేవర కరుణాకర్ మృతి చెందిన విషయం తెలుసుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుడిమల్కాపూర్కు వచ్చేసి మృతదేహానికి నివాళులు అరి్పంచారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజాసమస్యలపై గళమెత్తే నాయకుడని బల్దియా సమావేశాలలో ప్రజల మౌళిక సదుపాయాల కోసం ఆయన నిరంతరం ప్రశ్నించే వారని అన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నగర మాజీ మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్, నగరానికి చెందిన వివిధ డివిజన్ల బీజేపీ కార్పొరేటర్లు కరుణాకర్ మృతదేహానికి నివాళులు అరి్పంచారు. -
కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన వేణుగోపాలచారి, ఈడిగ ఆంజనేయగౌడ్ గురువారం జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ (టీఎస్ఐడీసీ) చైర్మన్గా వేణుగోపాలచారి బంజారాహిల్స్లోని ఐడీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు హాజరై వేణుగోపాలచారికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థి నేతగా క్రియాశీలకంగా పనిచేసిన ఈడిగ ఆంజనేయగౌడ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మంత్రులు వి.శ్రీనివాస్గౌడ్, తలసాని, ఎమ్మెల్సీ కవిత హాజరై శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి నడిచిన ఉద్యమకారులకు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతీ నియోజకవర్గంలో స్టేడియం నిర్మాణంతో పాటు అంతర్జాతీయ క్రీడాకారులను తయారుచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. -
మంత్రి తలసాని నిర్వహించిన అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న ప్రముఖులు (ఫొటోలు)
-
‘కంటివెలుగు’ కోసం 1,500 బృందాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 18 నుంచి ప్రారంభించనున్న రెండో దఫా కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు కార్యక్రమం సన్నద్ధతపై మంగళవారం మంత్రులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయనతోపాటు ఇతర మంత్రులు జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సీఎస్ సోమేశ్కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు శ్వేత మహంతి, డాక్టర్ శ్రీనివాస్రావు, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుంచి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, పంచాయతీ, మున్సిపల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హరీశ్రావు మాట్లాడుతూ మొదటిదఫా కంటివెలుగు కార్యక్రమంలో 1.54 కోట్ల మందికి స్క్రీనింగ్ చేసి, 50 లక్షల కళ్లద్దాలు ఇచ్చామని చెప్పారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు గ్రామం, మున్సిపల్ వార్డు కేంద్రంగా క్యాంపుల నిర్వహణ ఉంటుందని చెప్పారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలలు జరిగిందని, రెండోవిడత కంటి వెలుగు వంద పనిదినాల్లో పూర్తి చేస్తామన్నారు. మొదటి దఫా కంటివెలుగులో 827 బృందాలు పనిచేయగా, ఇప్పుడు 1,500 బృందాలను ఏర్పాటు చేశామని, తద్వారా గిన్నిస్ రికార్డులో నమోదయ్యేలా కృషి చేయాలని అన్నారు. ఒక్కో బృందంలో అప్టో మెట్రిస్ట్, సూపర్వైజర్, ఇద్దరు ఏఎన్ఎం, ముగ్గురు ఆశా, డీఈవో ఉంటారన్నారు. 55 లక్షల కళ్లద్దాల పంపిణీ... పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామని మంత్రి హరీశ్ అన్నారు. ఇందులో 30 లక్షల రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్క్రిçప్షన్ గ్లాసెస్ ఉంటాయని, మొత్తం 55 లక్షల కళ్లద్దాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. రోజువారీ వైద్యసేవలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీలోగా అన్ని జిల్లాల్లో మంత్రుల నేతృత్వంలో కంటివెలుగు సమావేశాలు నిర్వహించాలని, అన్ని మున్సిపాలిటీలు, మండల పరిషత్లకు షెడ్యూల్ ఖరారు చేయాలన్నారు. రేషన్ షాపుల్లో, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో క్యాంపుల నిర్వహణ తేదీలు అందరికీ తెలిసేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో 10, జిల్లాకొక క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కంటి వెలుగు కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని మంత్రి ఆదేశారు. -
సినీ కార్మికులకు అండగా ఉంటాం
మణికొండ: సినీ రంగానికి చెందిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ భరోసానిచ్చారు. గురువారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్ ఎం పభ్రాకర్రెడ్డి చిత్రపురి కాలనీలో 1176 ఎంఐజీ గృహాలు , 180 హెచ్ఐజీ డ్యూప్లెక్స్ విల్లాలకు సంబంధించి లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. లబ్ధిదారులు సామూహిక గృహా ప్రవేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ చిత్రపరిశ్రమకి చెందిన 24 విభాగాలలో ఉపాధి పొందుతున్న వేలాది మంది కార్మికుల సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో సీనియర్ నటులు దివంగత ప్రభాకర్రెడ్డి కృషితో ప్రభుత్వం ఇక్కడ స్థలం కేటాయించిందన్నారు. ఈ కాలనీలో ఇప్పటికే రూ. 20కోట్లతో రోడ్లను వేశామనీ, ఇక్కడి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సినీ పరిశ్రమ పెద్దలతో కలిసి కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటికే బస్తీ దవాఖాన మంజూరు చేశామన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా గృహ నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించిన కమిటీని మంత్రిఅభినందించారు. పరిశ్రమకు నేను పెద్దను కాదు: చిరంజీవి సినీ పరిశ్రమకు తాను పెద్దను కానని, కొందరు తమ వయసును తగ్గించుకునేందుకు తనను అలా అంటున్నారనిపిస్తోందని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. తను పరిశ్రమలో ఒకనిగా ఎదిగానని, ఎక్కడా పెద్దరికం చేయలేదన్నారు. సినీ పరిశ్రమ తాను అనుకున్న దానికన్నా అధికంగానే ఇచ్చిందని, ఇక నుంచి నావంతుగా సినీ కార్మికులకు సహాయం చేస్తానని చిరంజీవి హామీనిచ్చారు. సొసైటీ లోటు బడ్జెట్తో ఉన్నా.. ఎన్నో ఇబ్బందులు వచ్చినా పరిశ్రమ, ప్రభుత్వ పెద్దలు అండగా ఉండటంతోనే గృహనిర్మాణాలు పూర్తి చేయగలిగామని చిత్రపురి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు అనిల్కుమార్ చెప్పారు. -
ఆడియో, వీడియోలు అబద్ధమా?: బీజేపీ నేతలపై తలసాని ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి తలసాని బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫామ్హౌస్ కేసుతో సంబంధంలేదని ఇప్పుడు ఎందుకు సంబురపడిపోతున్నారు?. మంత్రి కిషన్రెడ్డి మాట్లాడిన తీరు అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆడియో, వీడియోలు అబద్ధమా?. కేంద్రమంత్రి కిషన్రెడ్డి అమావాస్య, పౌర్ణమి ఒకసారి హైదరాబాద్కు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో అభివృద్ధిపైన ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. కేంద్రం నుండి హైదరాబాద్కు ఏం తెచ్చారో చెప్పాలి. హైదరాబాద్ విషయం పక్కన పెట్టు.. ఆయన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో చేసిన అభివృద్ధి పని ఏంటో చెప్పాలి?. ఏది పడితే అది మాట్లాడొద్దు. నా జీవితంలో ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎక్కడా చూడలేదు. తెలంగాణ ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతోంది. కేంద్రం కొంత సహాయం చేస్తోంది అని చెప్పాలి. కానీ, ఎంతసేపు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఫామ్హౌస్ కేసులో ముందుగా కోర్టుకు వెళ్లింది మేరే కదా. మీ తప్పు లేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లారు. కేసు సిట్ నుండి సీబీఐకి మాత్రమే కోర్టు బదిలీ చేసింది. అంతేగానీ.. క్లీన్ చీట్ ఏమీ ఇవ్వలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
కిషన్ రెడ్డి మాట్లాడిన తీరు అనుమానాలకు తావిస్తోంది: మంత్రి తలసాని
-
అశ్రునయనాలతో తుది వీడ్కోలు
రాయదుర్గం(హైదరాబాద్): అశ్రునయనాల మధ్య సినీనటుడు కైకాల సత్యనారాయణకు కుటుంబసభ్యులు, అభిమానులు తుదివీడ్కోలు పలికారు. ఆయన పార్థివదేహానికి రాయదుర్గంలోని మహాప్రస్థానంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో పోలీసు బందోబస్తు, లాంఛనాలతో ఆయన పార్థివదేహాన్ని మహాప్రస్థానానికి తీసుకొచ్చారు. సత్యనారాయణ చితికి ఆయన పెద్ద కుమారుడు రామారావు నిప్పు అంటించారు. అంత్యక్రియలకు బంధువులు, కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ నాయకులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జూబ్లీహిల్స్లోని కైకాల నివాసానికి వెళ్లి పార్థివదేహం వద్ద నివాళి అర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశం మేరకు కైకాల అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనాన్ని సమర్పించి గాలిలోకి మూడుసార్లు తుపాకులతో కాల్పులు జరిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు బాలశౌరి వల్లభనేని, టీటీడీ సభ్యుడు దాసరి కిరణ్, ప్రజాగాయకుడు గద్దర్, సినీనిర్మాత అల్లు అరవింద్తోపాటు పలువురు రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. కైకాల కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం... వైకుంఠ మహాప్రస్థానంలో కైకాల పార్థివదేహానికి నివాళి అర్పించిన అనంతరం మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలు అనే తేడా లేకుండా అన్ని సినిమాల్లో దాదాపు ఆరు దశాబ్దాలపాటు నటించి ప్రేక్షకులను మెప్పించారని కొనియాడారు. ‘గుడివాడలో ఉన్న కైకాల కళాక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసి చిరస్థాయిగా నిలిపే విధంగా కృషి చేస్తాను. ఆయన స్వగ్రామం కౌతవరంలో ఆయన పేరు మీద ఒక కమ్యూనిటీ హాలు నిర్మించటానికి సాయం చేస్తాను. గుడివాడలో కైకాల సత్యనారాయణ కళాక్షేత్రం అని ఉంది. ఆ కళాక్షేత్రాన్ని మరింతగా డెవలప్ చేసి ఆయన పేరును చిరస్థాయిగా నిలిపేవిధంగా ఒక పార్లమెంట్ సభ్యునిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’అన్నారు. -
పార్లమెంట్ సమావేశాల్లోనే పీవీకి భారతరత్న ప్రకటించాలి
సనత్నగర్: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు. పీవీ నరసింహారావు 18వ వర్ధంతి సందర్భంగా పీవీ మార్గ్లోని పీవీ జ్ఞానభూమిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి రచించిన ‘నిజాం రాష్ట్రంలో మహాత్ముని పర్యటనలు’, ‘హైదరాబాద్ నగరంలో రాజకీయ సభలు’, ‘భాగ్యనగర్ రేడియో’అనే పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ ప్రధానిగా పీవీ సంస్కరణలను తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి సమర్ధవంతమైన పాలనను అందించారని గుర్తుచేసుకున్నారు. దేశానికి, రాష్ట్రానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఏడాదిపాటు పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. 26 అడుగుల కాంస్య విగ్రహాన్ని హుస్సేన్సాగర్ తీరాన ఏర్పాటు చేయడంతోపాటు నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్గా నామకరణం చేసినట్లు చెప్పారు. నివాళులు అర్పించినవారిలో ఎమ్మెల్సీ వాణీదేవి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, మాజీ కార్పొరేటర్లు అరుణగౌడ్, శేషుకుమారి తదితరులు ఉన్నారు. పీవీకి నివాళులు అర్పించిన గవర్నర్ పీవీ జ్ఞానభూమిలో జరిగిన వర్ధంతి కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై హాజరై నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్సింగ్, కేవీపీ, పొన్నం ప్రభాకర్, మల్లు రవి, శ్రీధర్బాబు, అంజన్కుమార్యాదవ్, బీజేపీ నుంచి మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ తదితర ప్రముఖులు పీవీకి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. -
నిబంధనల మేరకు నాలాలను నిర్మిస్తాం: మంత్రి తలసాని