టీడీపీ విధ్వంసకాండ.. పుంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తత | TDP Attacks In AP, High Tensions In Punganur Latest News Updates And Top Headlines In Telugu | Sakshi
Sakshi News home page

టీడీపీ విధ్వంసకాండ.. పుంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తత

Published Thu, Jul 18 2024 2:29 PM | Last Updated on Thu, Jul 18 2024 4:09 PM

TDP Attacks High Tensions In Punganur Latest News Updates

చిత్తూరు, సాక్షి: పుంగనూరులో ఈ ఉదయం నుంచి మొదలైన తెలుగుదేశం పార్టీ విధ్వంసకాండ కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లు, వాహనాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగపడుతున్నాయి పచ్చ పార్టీ శ్రేణులు. వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ యత్నించగా.. ఈ ఉదయం నుంచి ఉద్రిక్తవాతావరణ నెలకొన్న సంగతి తెలిసిందే.  

అయితే మిథున్‌రెడ్డి మాత్రం తన పర్యటన కొనసాగించేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆయనపైనా దాడి జరిగింది. అక్కడి నుంచి టీడీపీ దాడులు ఇంకా తీవ్ర తరం అయ్యాయి. వైఎస్సార్‌సీసీ నేతలపై రాళ్లు రువ్వుతున్నారు. వాళ్ల వాహనాలకు నిప్పుడు పెడుతున్నారు.  దీంతో ప్రస్తుతం అక్కడ యుద్ధవాతావరణం నెలకొంది. 

మిథున్‌రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకోగా.. టీడీపీ నేతలు ఆ ఇంటిని చుట్టుముట్టారు.  ఇంటిపైకి రాళ్లు రువ్వారు. రెడ్డప్ప కారుకు నిప్పు పెట్టారు. 

సంబంధిత వార్త: ఎంపీ మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి

మరోవైపు రెడ్డప్ప ఇంట్లోనే ఉన్న మిథున్‌రెడ్డి.. అక్కడి నుంచి బయటకు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రెడ్డప్ప నివాసానికి చేరుకున్న ఏఎస్పీ మిథున్‌రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. 

పుంగనూరులో గతంలో ఈ తరహా దాడులు ఏనాడూ జరగలేదని, చంద్రబాబు, లోకేష్‌ డైరెక్షన్‌లోనే దాడులు జరగుతున్నాయని, టీడీపీ నేతలు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, ఇలాంటి దాడులకు మేం భయపడమని మిథున్‌రెడ్డి అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement