mithun reddy
-
ఇష్టానుసారం మాటలు కాదు.. దమ్ముంటే నిరూపించండి: మిథున్ రెడ్డి సవాల్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో టీడీపీ మరో కొత్త నాటకానికి తెర లేపిందన్నారు వైఎస్సార్సీపీ లోక్సభపక్షనేత, ఎంపీ మిథున్రెడ్డి. తప్పుడు ఆరోపణలతో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. టీడీపీకి దమ్ముంటే ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు.వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసింది. క్షక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తప్పుడు ఆరోపణలతో మా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. టీడీపీ మళ్లీ కొత్త నాటకానికి తెరలేపింది. లిక్కర్ స్కాం చేశామని ఆరోపణలు చేస్తున్నారు.. దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయండి. మొదట 50వేల కోట్ల రూపాయల స్కాం అని ప్రచారం చేశారు. ఇప్పుడు మూడువేల కోట్ల రూపాయల స్కాం అని ఆరోపణలు చేస్తున్నారు. మూడువేల కోట్ల రూపాయలు మడిచి జేబులో పెట్టుకుంటారా?.ఢిల్లీలో ప్రభుత్వ దుకాణాలను ప్రైవేటులో నడిపారు. కానీ, మా ప్రభుత్వంలో పారదర్శకంగా ప్రభుత్వమే దుకాణాలను నిర్వహించింది. మేము భూములు కబ్జా చేశామని తప్పుడు ఆరోపణలు చేశారు. అఫిడవిట్లో కాకుండా, అదనపు భూమి మాకు ఏమైనా ఉంటే చూపించండి. అరెస్టు చేసిన గౌతమ్ తేజ్ వ్యక్తికి పాలీ గ్రాఫ్ టెస్ట్ చేశారు. అందులో కూడా ఆయన నేరం చేయలేదని తేటతెల్లమైంది. వందల మైన్ కాదు ఒక్క మైన్లో కూడా అక్రమాలు చూపండి. ఒక్క ఆరోపణకైనా సాక్ష్యం చూపించారా?. మీకు దమ్ముంటే ఆరోపణలను రుజువు చేసి చూపించండి.ఎర్రచందనం విషయంలోను ఇలాగే తప్పుడు ఆరోపణలు చేశారు. మాపై బురద కొట్టి పారిపోతున్నారు. పసలేని ఆరోపణలు చేస్తున్నారు. అటవీ భూములు కబ్జా చేశారని తప్పుడు ఆరోపణలు చేశారు. మా కుటుంబంపైనే 75 ఎకరాల భూమి ఉందని కలెక్టర్ రిపోర్టు ఇచ్చారు. కలెక్టర్ చేసిన దర్యాప్తులో కూడా టీడీపీ ఆరోపణలు రుజువు కాలేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
జగన్ ప్రాణాలకు ముప్పు కేంద్రానికి ఎంపీ సంచలన లేఖ
-
ప్రధాని, హోంమంత్రులకు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి లేఖ
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వైఎస్సార్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్ళిన వైఎస్ జగన్కు పోలీసులు రక్షణ కల్పించలేదు. జగన్ పర్యటనలో తీవ్రమైన భద్రత వైఫల్యం తలెత్తింది’’ అని లేఖలో మిథున్రెడ్డి వివరించారు.జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి. ఇటీవల వైఎస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయి. ఇవి భారీ ఎత్తున పన్నిన కుట్రలో భాగంగా జరుగుతున్న ఘటనలు. వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా భద్రత వైఫల్యం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం విధానాల వల్ల మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడిచేలా ప్రమాదకర ధోరణికి తెరలేపుతోంది’’ అని లేఖలో మిథున్రెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: జనం గుండెల్లో జగన్.. కూటమి గుండెల్లో రైళ్లుకాగా.. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించింది. మాజీ సీఎం పర్యటనలో భద్రత కల్పనపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ వైఫల్యంపై వైఎస్సార్సీపీ నేతలు గురువారం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేశారు. -
ఈడీ విచారణ జరిపించాల్సిందే: ఎంపీ మిథున్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణమైన మార్గదర్శి కుంభకోణంపై ఈడీ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి.మిథున్రెడ్డి డిమాండ్ చేశారు. లోక్సభ వేదికగా మార్గదర్శి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రమేష్ సివిల్ కాంట్రాక్టులు కావాలంటే చంద్రబాబుతో మాట్లాడుకోవాలే తప్ప తమపై ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు. సీఎం రమేష్ బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టు అని, ఆయన బీజేపీ కోసం పనిచేయడం లేదని చెప్పారు.మంగళవారం లోక్సభ జీరో అవర్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ప్రసంగానికి ఎంపీ మిథున్రెడ్డి అడ్డుపడ్డారు. సీఎం రమేష్ అస్పష్టమైన ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. అంతకుముందు సీఎం రమేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీని 2019–2024 మధ్య మార్చారన్నారు. మద్యం ప్రైవేట్ షాపుల నుంచి ప్రభుత్వ షాపుల వైపు మళ్లిందని, ఐదేళ్లలో మొత్తం రూ.లక్షకోట్ల అమ్మకాలు జరిగాయని చెప్పారు. ఈ లావాదేవీలన్నీ నగదు ద్వారానే జరిగాయని, ఒక్క డిజిటల్ చెల్లింపు లేదని ఆరోపించారు. అన్ని మద్యం షాపుల ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికనే ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం రూ.30 వేలకోట్ల మద్యం కుంభకోణం చేసిందని ఆరోపించారు. ఇది రూ.2,500 కోట్ల ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే 10 రెట్లు పెద్ద కుంభకోణమన్నారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి సీఎం రమేష్ వైఖరిపై మండిపడ్డారు. లోక్సభ వేదికగా మార్గదర్శి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే ప్రతీకారంగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మిథున్రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆర్గానిక్ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సాహంఏపీలో 2021–22 నుంచి మూడేళ్లలో 21.56 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువుల ఉత్పత్తి జరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) కింద కేంద్రం ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి మంగళవారం లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో 2021–22లో 25,006 మెట్రిక్ టన్నులు, 2022–23లో 2,72,572 మెట్రిక్ టన్నులు, 2023–24లో 18,58,652 మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువుల ఉత్పత్తి జరిగిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఏపీలోని 13,321 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తికేంద్రం ప్రవేశపెట్టిన ‘స్వామిత్వ’ పథకంలో భాగంగా ఏపీలో 13,321 నోటిఫైడ్ జనావాస గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తిరుపతి జిల్లాలో 1045 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందని తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లోక్సభలో మంగళవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానమిచ్చారు. స్వామిత్వ పథకం అమలు కోసం 2020 డిసెంబర్ 8న ఉప్పదం కుదుర్చుకుందని, 2025 పిబ్రవరి 11నాటికి రాష్ట్రంలోని 26జిల్లాల్లో ఈ మొత్తం డ్రోన్ సర్వే నిర్వహించామని తెలిపారు. ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ (ఐఈసీ) కార్యకలాపాలు, స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ (ఎస్పీఎంయూ) ఏర్పాటు కోసం రాష్ట్రానికి రూ.26.7 లక్షలు విడుదల చేశామన్నారు. ఆస్తి కార్డు ఫార్మాట్ రాష్ట్రం ద్వారా ఇంకా ఖరారు చేయని కారణంగా..వాటిని ఇంకా తయారు చేయలేదని పేర్కొన్నారు. -
మార్గదర్శి స్కాం దేశంలోనే చాలా పెద్దది: మిథున్ రెడ్డి
-
‘మార్గదర్శి’ని ఎందుకు వదిలేశారు?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి కారణమైన మార్గదర్శిని ఎందుకు వదిలేశారు? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ పీవీ మిథున్రెడ్డి ప్రశ్నించారు. చట్టం అందరికీ ఒకేలా ఉండాలన్నారు. మార్గదర్శికి ఒక మీడియా సంస్థ ఉన్నందున విడిచిపెట్టాల్సిన అవసరమేంటన్నారు. సోమవారం లోక్సభలో 2025–26 కేంద్ర బడ్జెట్పై జరిగిన సాధారణ చర్చలో పాల్గొన్న ఎంపీ మిథున్రెడ్డి మాట్లాడుతూ.. రూ.2,600 కోట్లు డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన మార్గదర్శి, ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఆ నిధులను దారి మళ్లించిందన్నారు.ఈ రకంగా నిధులు సేకరించడం తప్పని ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. ఆదాయ పన్ను విభాగం మార్గదర్శికి రూ.1000 కోట్ల జరిమానా విధించడంతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని విమర్శించారు. లక్షలాది మంది డిపాజిటర్లకు న్యాయం జరిగేలా రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా మార్గదర్శి కుంభకోణంపై పోరాటం చేస్తామని చెప్పారు. ఇంత పెద్ద ఆర్థిక కుంభకోణం జరిగితే ఈడీ ఎందుకు విచారణ జరపట్లేదని ప్రశ్నించారు.17 మెడికల్ కాలేజీల పనుల నిలిపివేశారు వచ్చే ఐదేళ్లలో దేశంలో 75 వేల మెడికల్ సీట్లను అందుబాటులోకి తెస్తామని బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. ఏపీలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొందని ఎంపీ మిథున్రెడ్డి తెలిపారు. ఇప్పటికే తమకు కేటాయించిన మెడికల్ సీట్లను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి మెడికల్ కమిషన్ కు లేఖ రాశారని లోక్సభ దృష్టికి తెచ్చారు. ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించారని, అయితే ఇప్పుడు ఆ పనులన్నింటినీ ప్ర స్తుత ప్రభుత్వం ఆపేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చే శారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి జోక్యం చేసుకుని నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.⇒ మిథున్రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎంపీ పురందేశ్వరి అడ్డుపడే ప్రయత్నం చేశారు.. పురందేశ్వరి భౌతికంగా బీజేపీలో ఉన్నా.. ఆమె మనస్సు మాత్రం టీడీపీలోనే ఉందని మిథున్రెడ్డి ఎద్దేవా చేశారు. విపక్షాలు ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించని పురందేశ్వరి.. చంద్రబాబు గురించి మాట్లాడగానే స్పందిస్తున్నారని విమర్శించారు. ⇒ బడ్జెట్లో పోలవరం ఎత్తు తగ్గించమని ఎవరు అడిగారంటూ మిథున్రెడ్డి ప్రశ్నించారు. 41.15 మీటర్లకు ఎత్తు తగ్గించడం వల్ల పోలవరం సామర్థ్యం తగ్గిపోతుందని.. జాతీయ ప్రాజెక్టుకు రావాల్సిన రూ.60 వేల కోట్లలో కేవలం రూ.30 వేల కోట్లు ఇస్తే, మిగతా రూ.30 వేల కోట్ల పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు. ⇒ రైల్వేజోన్ను 10 ఏళ్ల తర్వాత ఇచ్చినా వాల్తేర్ డివిజన్ను రెండుగా విభజించి ఏపీకి అన్యాయం చేశారన్నారు. ఇప్పటికైనా మొత్తం వాల్తేర్ డివిజన్ను కొత్త రైల్వే జోన్లోకి కలపాలని డిమాండ్ చేశారు.⇒ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోందని మిథున్రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి స్పష్టమైన ప్రకటన ఇవ్వాలన్నారు. -
మార్గదర్శి అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోవాలి
-
‘మార్గదర్శి’పై ఎంపీ మిథున్రెడ్డి ఫైర్
సాక్షి,న్యూఢిల్లీ: మార్గదర్శి స్కామ్ దేశంలోనే చాలా పెద్ద స్కామ్ అని, ఈ స్కామ్లో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం(ఫిబ్రవరి10) మిథున్రెడ్డి లోక్సభలో బడ్జెట్పై చర్చలో భాగంగా మాట్లాడారు.‘ మార్గదర్శి లక్షల మంది డిపాజిటర్లను మార్గదర్శి ముంచేసింది. మార్గదర్శి అక్రమాలపై కేంద్రం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు. ప్రతిసారి ఈ అంశాన్ని లోక్సభలో ప్రస్తావిస్తూనే ఉన్నాం. ఇంత పెద్ద స్కాం జరిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఏం చేస్తోంది. రూ.2వేల600కోట్లు డిపాజిట్లుగా సేకరించారు. విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరిస్తున్నారా..కేంద్రం దీనికి సమాధానం చెప్పాలి.మిథున్రెడ్డి ఇంకా ఏమన్నారంటే..మార్గదర్శి రూ. 2600 కోట్ల రూపాయలు వసూలు చేసిందిఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి వసూలు చేసిందిడిపాజిటర్లకు న్యాయం జరగాలిదీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకోవాలిఒకవైపు 75 వేల మెడికల్ సీట్లని కేంద్రం చెబుతోందికానీ ఏపీ ప్రభుత్వం మాత్రం మాకు మెడికల్ సీట్లు వద్దని సరెండర్ చేస్తుంది ఏపీలో 17 మెడికల్ కళాశాల నిర్మాణాన్ని ఆపేశారు.కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు ఇప్పించాలికేంద్రం విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలిపోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించవద్దుపోలవరం నిర్మాణానికి అరకొరగా నిధులు ఇస్తున్నారురాజధాని అమరావతికి నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలిపదేళ్ల తర్వాత రైల్వే జోన్ ఇచ్చారువాల్తేర్ డివిజన్ రెండుగా విభజించి అన్యాయం చేశారువాల్తేర్ డివిజన్ విశాఖ జోన్లోనే ఉంచాలివిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాంతిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో నాపై దాడిచేశారు: ఎంపీ గురుమూర్తి తిరుపతిలో తనపై జరిగిన దాడి అంశాన్ని లోక్సభలో 377 నిబంధన కింద లేవనెత్తిన ఎంపీ గురుమూర్తిఏపీలో ప్రజాస్వామ్య విలువలపై దాడి జరిగిందితిరుపతి కార్పొరేషన్ ఎన్నికల సమయంలో నాపైన, మహిళా కార్పొరేటర్లపై దాడికి పాల్పడ్డారుఎన్నికల నేపథ్యంలో రాజ్యాంగ విధులు నిర్వహిస్తున్న సమయంలో మమ్మల్ని అడ్డుకున్నారుతిరుపతి జిల్లా పోలీసులు దాడులు నిరోధించడంలో ఫెయిల్ అయ్యారుబాధ్యులపై చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర చూస్తున్నారుఈ దాడులపై వెంటనే దర్యాప్తు జరపాలిదాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి -
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం
-
ఈ అన్యాయాన్ని ఆంధ్రా ప్రజలు క్షమించరు: ఎంపీ మిథున్ రెడ్డి
న్యూఢిల్లీ, సాక్షి: పోలవరం విషయంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే పార్టీలకతీతంగా ఎంపీలతో కలిసి పోరాడేందుకు సిద్ధమని లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి ప్రకటించారు. మంగళవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై చర్చలో ఆయన ఏపీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. ‘‘పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని తగ్గించవద్దు. ఒరిజినల్గా పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 194 టీఎంసీలు. ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు అందేలా దీన్ని డిజైన్ చేశారు. ఇరిగేషన్ తో పాటు తాగునీటి కోసం ఉపయోగించాలనేది ఉద్దేశం. కానీ, 41.15 మీటర్లకు ప్రాజెక్టును తగ్గిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టారు. దీనివల్ల పోలవరం కెపాసిటీ 194 నుంచి 115 టీఎంసీలకు పడిపోతుంది. ఈ తగ్గించడం వల్ల కేవలం 3.2 లక్షల ఎకరాలకి నీరు అందుతుంది. ఇది రైతులకు, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్లే. ఈ అన్యాయం ఎదిరించేందుకు టిడిపి ఎంపీలతో కలిసి పోరాటానికి సిద్ధం. లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు’’ అని అన్నారాయన. ‘‘ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇప్పుడు పోలవరం కెపాసిటీని తగ్గించారు. విభజన చట్టం మేరకు ఒరిజినల్ గా ఉన్న పోలవరం సామర్ధ్యాన్ని కొనసాగించాలి. కెపాసిటీ తగ్గించిన తర్వాత బనకచర్లకు నీరు ఎలా అందుతుంది?. రాయలసీమకు నీరేలా ఇస్తారు? అని ప్రశ్నించారాయన. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 👉ఏపీ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని మెల్లగా రద్దు చేస్తున్నారు. ఇంగ్లీష్ చదివితేనే విదేశాల్లో కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉంది. ఇంగ్లీష్ మీడియం తో పాటు తెలుగు కొనసాగించాలి. 👉ఆర్బీఐ నిబంధనల విరుద్ధంగా మార్గదర్శి సంస్థ రూ. 2,600 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడింది. ప్రజల డబ్బును ఇతర కంపెనీలకు మళ్ళించారు. సహారా, శారద కుంభకోణం కంటే మార్గదర్శక కుంభకోణం పెద్దది. మార్గదర్శిపై రూ. 1,000 కోట్ల రూపాయల జరిమానా విధించారు. డిపాజిటర్ల డబ్బు తిరిగి చెల్లించకుండా వాటిని రెన్యువల్ చేస్తున్నారు. మార్గదర్శి కుంభకోణం పై దర్యాప్తు జరపాలి. ఈ అంశంపై ప్రధాని జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలి👉విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో జిందాల్ గ్రూపును పిలిచి మాట్లాడాలి. 👉విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి -
చంద్రబాబు పెట్టే కేసులకు మేం భయపడం: మిథున్ రెడ్డి
-
గాలివీడు ఘటనపై పవన్ కళ్యాణ్ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన మిథున్ రెడ్డి
-
జమిలి బిల్లుకు మా మద్దతు అందుకే...
-
సోలార్ పవర్ ఒప్పందంపై బాబు తప్పుడు ప్రచారం
-
లోక్సభలో టీడీపీ బండారం బయటపెట్టిన మిథున్రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో సోలార్ పవర్ విషయంలో వైఎస్సార్సీపీపై గత కొన్నాళ్లుగా టీడీపీ, దాని అనుకూల మీడియా అడ్డగోలు ప్రచారానికి దిగాయి. ప్రముఖ వ్యాపారవేత్త అదానీపై అమెరికాలో నమోదైన అభియోగాలను.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అన్వయిస్తూ ఇష్టానుసారం కథనాలతో వైఎస్ జగన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించాయి. అయితే.. ఈ కుట్రను తాజాగా లోక్సభలోనూ వైఎస్సార్సీపీ బయటపెట్టింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. ఇదే సమయంలో అదానీతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని పార్టీ తరఫున ఆయన మరోసారి వివరణ ఇచ్చారు.పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘సోలార్ పవర్ విషయంలో మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు . ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకుంది. అదానీతో ఒప్పందం చేసుకోలేదు. సెకీతో అనేక రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. చాలా తక్కువ రేటుకు మేము ఒప్పందం చేసుకున్నాం. 2021లో సోలార్ పవర్ 5.90 యూనిట్కు ఉంది. మేము 2.49కు మాత్రమే కొనడానికి ఒప్పందం చేసుకున్నాము. ఇటీవల కాలంలో కూడా ఐదు రూపాయలకు పైగా యూనిట్కు చెల్లించి పవర్ కొన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఒక వర్గం మీడియా, మేధావులు మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చట్ట సభ దృష్టికి తీసుకెళ్లారు. దేశంలో బ్యాంకింగ్ రంగం గణనీయంగా వృద్ధి చెందుతుంది. దేశంలో 62% జనాభా వ్యవసాయంపైన ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగం అభివృద్ధికి తగిన చర్యలు కనిపించడం లేదు. రుణమాఫీ, అందుబాటులోని రుణాలు క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడం లేదు. చాలా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. చిన్నతరహ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. విద్యార్థులకు ఇచ్చే రుణాలకు సరైన విధానం రూపొందించాలి’ అని మిథున్ రెడ్డి సూచనలు చేశారు. -
AP: రాష్ట్రం ఒప్పందం సెకీతోనే కదా?: మిథున్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంపై టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని వైఎస్సార్సీపీ లోక్సభ పక్షనేత, ఎంపీ మిథున్రెడ్డి చెప్పారు. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రక్షణశాఖ రాజ్నాథ్సింగ్ అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. వైఎస్సార్సీపీ తరపున రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి, లోక్సభ పక్షనేత మిథున్రెడ్డి హాజరయ్యారు. మిథున్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రంగసంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) తనంతకు తాను అత్యంత చౌకగా యూనిట్ విద్యుత్ రూ.2.49తో ఇస్తామని ముందుకొచ్చిందన్నారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం అని, ఇందులో లంచాలకు తావెక్కడ ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సెకీతోనే ఒప్పందాలు జరిగాయి తప్ప.. అదానీతో కాదని తేల్చిచెప్పారు. కావాలనే టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందన్నారు. పోలవరంపై భిన్న వ్యాఖ్యలుఅనంతరం లోక్సభ పక్షనేత మిథున్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం విషయంలో ఇటీవల మంత్రుల నుంచి భిన్నమైన స్టేట్మెంట్స్ వస్తున్నాయన్నారు. మొదట్లో ఉన్న ఎత్తు ఇప్పుడు ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఈ విషయంపై పార్లమెంట్లో చర్చిస్తామన్నారు. పునర్విభజన చట్టంలోని అనేక హామీలను కేంద్రం అమలు చేయలేదని విమర్శించారు. ఈ హామీలను అమలు చేయాలని కోరామన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దని అఖిలపక్షం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ సమావేశాల్లోనే కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిపిందన్నారు. మైనార్టీలకు అన్యాయం జరగకుండా, వారి పక్షాన వైఎస్సార్సీపీ నిలబడుతుందన్నారు. ఇప్పటికే వక్ఫ్ బిల్లుపై రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి తమ పార్టీ వైఖరేమిటో తెలిపారన్నారు. డ్రగ్స్ను అరికట్టేందుకు కఠిన విధానాలు అవసరమని చెప్పామన్నారు.‘సోషల్’ అరెస్టులపై గొంతెత్తుతాంకూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుంచి వైఎస్సార్సీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై దారుణంగా వ్యవహరిస్తున్నారని, అక్రమంగా అరెస్టులు చేస్తున్న విషయాన్ని అఖిలపక్షం దృష్టికి తీసుకెళ్లామని మిథున్రెడ్డి తెలిపారు. సోషల్ మీడియా పోస్టులపై కార్యకర్తలపై పెట్టాల్సిన సెక్షన్లు కాకుండా.. సంబంధం లేని సెక్షన్లు నమోదు చేస్తూ జైలుకు పంపుతున్న విషయాన్ని వివరించామన్నారు. దీనిపై పార్లమెంట్ సమావేశాల్లో గొంతెత్తుతామని చెప్పారు. -
పార్లమెంట్ లో మా టార్గెట్ ఒక్కటే - ఎంపీ మిథున్ రెడ్డి
-
అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్ సమావేశాలపై చర్చ
సాక్షి,ఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభమవనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేవం నిర్వహిస్తోంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం ఆదివారం(నవంబర్ 24) సమావేశమైంది. అఖిలపక్ష సమావేశానికి పలు పార్టీల ఫ్లోర్లీడర్లతో పాటు వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి , లోక్ సభపక్ష నేత మిథున్రెడ్డి హాజరయ్యారు.పోలవరం ఎత్తు , ప్రత్యేక హోదా, వక్ఫ్ బిల్లు , విశాఖ స్టీలు ప్రైవేటీకరణ అంశాలను వైఎస్సార్సీపీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు లేవనెత్తనున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల అక్రమ కేసులను నేతలు ప్రస్తావించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పార్లమెంట్లో గళం విప్పనున్నారు.కాగా, సోమవారం(నవంబర్ 25) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవనున్నాయి. డిసెంబర్ 20దాకా సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ చట్టం సవరణ బిల్లు, ఒకే దేశం ఒకే ఎన్నికలు(జమిలి ఎన్నికలు) బిల్లులతో పాటు మరో 16 బిల్లులను ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వక్ఫ్, జమిలి ఎన్నికల చట్టాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.ఇదీ చదవండి: మహాయుతి దెబ్బకు ఎల్వోపీ సీటు గల్లంతు -
టీడీపీ నేతలకు మిథున్ రెడ్డి వార్నింగ్..
-
‘హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే.. వేధింపులా?’
చిత్తూరు: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్సీపీ సోషల్మీడియా కార్యకర్తలు ప్రశ్నిస్తే వారిని అక్రమ కేసులతో వేధింపులకు గురిచేయడం అత్యంత దారుణమమన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి. టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిని పూతలపట్టు వైఎస్సార్సీపీ మండల పార్టీ కన్వీనర్ శ్రీకాంత్రెడ్డిని మిథున్రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కక్ష్య పూరిత రాజకీయాలకు టీడీపీ నాయకులు స్వస్తి పలకాలి. సొంత ఊర్లో తిరగలేని పరిస్థితి ఈరోజు పూతలపట్టు మండల పార్టీ కన్వీనర్ విషయంలో మీరు తీసుకు వచ్చారు. పోలీసులు చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పై దృష్టి పెట్టండి, డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. సోషల్ మీడియా కార్యకర్తలు పై కేసులు పేరుతో వేధింపులు మానుకోవాలి.గతంలో టీడీపీ ప్రోద్బలంతో వైఎస్ జగన్పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయండి అని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు పై వేధింపులు మానుకోవాలి.ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి.. ఇలానే చేస్తే ముగింపు అనేది ఉండదు’ అని మండిపడ్డారు మిథున్రెడ్డి. -
ఇస్తాంబుల్ లో గ్రీన్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సు
-
పెట్టుబడుల అనుమతులకు ఒకే మంత్రిత్వ శాఖ: ఎంపీ మిథున్ రెడ్డి
ఢిల్లీ, సాక్షి: పరిశ్రమల అనుమతుల కోసం మూడు, నాలుగు మంత్రిత్వ శాఖలకు తిరిగే బదులుగా ఉమ్మడిగా ఒకే శాఖ ఉండాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. తమ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో సింగిల్ మినిస్ట్రీ ద్వారా అనుమతులు ఇచ్చి పెట్టుబడులకు సులభతరం చేశామని తెలిపారు. ఇస్తాంబుల్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వాతావరణ మార్పుల సదస్సుకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరైన ఈ సదస్సుకు భారత్ తరపున ఎంపీ మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడారు. ‘‘ పెట్టుబడులకు సంబంధించి రెండు ప్రధాన సవాళ్లు వస్తున్నాయి. ఒకటి భూమి, రెండోది రెగ్యులేటరీ ఏజెన్సీలు. గ్రీన్ జోన్లలో పెట్టుబడుల దిశగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఈ అంశాలను సులభతరం చేయాలి. అనుమతులకు సంబంధించి ఒకే మంత్రిత్వ శాఖ ఉండాలి’’ అని అన్నారు.మారుతున్న వాతావరణ పరిస్థితులు,అనుసరించాల్సిన వ్యూహాలపై ఇస్తాంబుల్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు నిర్వహించారు. గ్రీన్ జోన్లలో పెట్టుబడుల ద్వారా సమీకరణకు ఎదురవుతున్న సవాళ్లపై చర్చలు జరిపారు. గ్రీన్ ఇన్వెస్ట్మెంట్లు చేసే దిశగా పారిశ్రామికవేత్తలను ఎంపీలు ప్రోత్సహించాలని సదస్సు లక్ష్యం పెట్టుకుంది. ఎంపీలు టార్చ్ బేరర్లుగా గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ల దిశగా పనిచేయాలని సదస్సు పిలునిచ్చింది. -
వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట..
-
వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డికి ఊరట
సాక్షి, గుంటూరు : వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డికి ఊరట దక్కింది. పుంగనూరు కేసులో మిథున్రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందంటూ ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం మిథున్రెడ్డికి బెయిల్ ఇచ్చింది. మిథున్రెడ్డితో పాటు మరో ఐదుగురికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
పుంగనూరుకు టీడీపీ మంత్రులు.. ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్
-
వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి
-
పుంగనూరుకు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి.. బాలిక కుటుంబానికి పరామర్శ
-
పుంగనూరుకు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి
-
ఈ చిన్నారి ఘటన మీకు కనిపించలేదా?
పుంగనూరు((చిత్తూరు జిల్లా): కిడ్నాప్కు గురై ఆపై హత్య గావించబడ్డ పుంగనూరుకు చెందిన అశ్వియా కుటుంబాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డిలు పరామర్శించారు. శనివారం పుంగనూరుకు వెళ్లిన పెద్దిరెడ్డి, మిథున్రెడ్డిలు.. అశ్వియా కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. కుమార్తె అశ్వియా హత్యకు గురి కావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తండ్రి హజ్మతుల్లాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డిలు ఓదార్చి ధైర్యం చెప్పారు.అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘పుంగనూరులో ఇలాంటి దారుణ ఘటన ఎప్పుడూ జరగలేదు. ఇంటి ముందు ఆడుకుంటున్న రెండవ తరగతి చదువుతున్న చిన్నారి కిడ్నాప్ , హత్య జరిగితే ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై దోషులను శిక్షించకపోతే అందుకు తగిన విధంగా స్పందిస్తాం. ఈ ఘటనలో పోలీసుల అసమర్థత కనిపిస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనలో డీజీపీ, సీఐడీ అధికారులను ప్రత్యేక ఫ్లైట్, హెలికాప్టర్ ఇచ్చి పంపించి దర్యాప్తు చేశారు. మరి ఈ చిన్నారి ఘటన పోలీస్ ఉన్నతాధికారులకు కనిపించడం లేదా?, ఈ నెల9వ తేదీన వైఎస్ జగన్మోహన్రెడ్డి పుంగనూరుకు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టనుంది. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. ‘కానరాని లోకాలకు చిట్టితల్లి’9న పుంగనూరుకు వైఎస్ జగన్ -
ఇది మంచి పద్ధతి కాదు.. ఎంపీ మిథున్ రెడ్డి వార్నింగ్
-
మిమ్మల్ని చూస్తుంటే మాకు ధైర్యం మరింత రెట్టింపు అవుతుంది
-
పుంగనూరు నియోజకవర్గం నాకు తల్లితో సమానం
-
పుంగనూరులో ఉద్రిక్తత
-
విజయవాడలో అంత బీభత్సం
-
‘మార్గదర్శి స్కాం’ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం: ఎంపీ మిథున్రెడ్డి
సాక్షి, గుంటూరు: మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటనపై దుష్ఫ్రచారం చేస్తున్నారని.. దీనిపై పరువు నష్టం దావా కూడా వేశామని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. నాపై దాడులు చేసి.. మళ్లీ నాపైనే హత్యాయత్నం కేసు పెట్టారని మండిపడ్డారు.‘‘టీడీపీ కరపత్రంలా ఈనాడు మారింది. ఇప్పటికే ఎల్లో మీడియాకు నోటీసులు పంపాం. మదనపల్లె ఘటనపై విచారణ చేయమని మొదట్నుంచీ కోరుతున్నాం. దేశంలోనే అతిపెద్ద స్కామ్ మార్గదర్శి స్కామ్.. నిజాలు నిగ్గు తేలేవరకు తాను పార్లమెంట్లో పోరాడతా’’ అని మిథున్రెడ్డి తెలిపారు.వైఎస్సార్సీపీలో కొంత మంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం తమ అనుకూల మీడియా ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, ఇంకోవైపు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోందన్నారు. గడిచిన కొద్ది రోజులగా ఎక్కడ ఏం జరిగినా.. కనీసం వివరణ కూడా తీసుకోకుండా పూర్తి అవాస్తవాలనే ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మదనపల్లి ఘటనలో నిజానిజాలు తేలాలని ఇప్పటికే మూడుదఫాలు మీడియా ముందు చెప్పామని… ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ చేతుల్లో ఉంది, తప్పు ఎక్కడ జరిగిందో తేల్చాలని ఆయన ప్రభుత్వాన్ని మిథున్రెడ్డి డిమాండ్ చేశారు.ఈనాడులో తమపై వరుసగా వస్తున్న తప్పుడు కథనాలన్నీ ఒక పద్దతిప్రకారం జరుగుతున్నాయన్నారు. ఈ తప్పుడు వార్తలపై పరువునష్టం దావా కోసం నోటీసులు కూడా ఇచ్చామని.. అయినా ఇంకా వరుసగా తప్పుడు కథనాలు రాస్తూ.. దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వీటిపై ఆధారాలు చూపమంటే స్పందించడం లేదన్నారు. ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి తప్పుడు కథనాలతో ప్రచారం చేసినా తాము ఎన్నికల్లో విజయం సాధించామని.. దీంతో ఓర్వలేక అదే పద్దతి కొనసాగిస్తున్నారన్నారు.దేశంలో అతిపెద్ద కుంభకోణమైన మార్గదర్శిపై తాను పార్లమెంటులో ప్రస్తావిస్తానని.. ఆర్బీఐ కూడా మార్గదర్శి వ్యవహారంలో తప్పుపడుతూ కోర్టుకెళ్లిందన్నారు. అడిగేవాళ్లు లేరని అవాస్తవాలు ప్రచురించి బ్లాక్మెయిల్కి పాల్పడుతున్న ఈనాడు సంస్ధలు, మార్గదర్శి చిట్ఫండ్స్ తో సహా వీళ్ల అక్రమాలన్నీ బయట పెడతామన్నారు. తమను మానసికంగానూ, రాజకీయంగా దెబ్బతీసేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ఈనాడు ఈ కథనాలు రాస్తోందని.. వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.ఈనాడు యాజమాన్యం పూర్తిగా తెలుగుదేశం పార్టీ కరపత్రంలా మారిపోయి.. టీడీపీ నేతలు ఎవరిని నిర్ణయిస్తే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ రకమైన కథనాలు రాస్తూ బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ సహా హామీలను నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో.. ప్రజల దృష్టి మరల్చడానికే ఈ తరహా రాతలు రాస్తున్నారని తేల్చి చెప్పారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై చేస్తున్న దాడులతో టీడీపీ నేతలు పైశాచికానందం పొందుతున్నారని.. తమపై దాడి చేసి కేసులు కూడా తిరిగి తమపై పెడుతున్నారని మిథున్ రెడ్డి నిప్పులు చెరిగారు. -
టీడీపీలో చేరమని ఒత్తిడి చేస్తున్నారు: కుప్పం ఎంపీపీ
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సోమవారం కుప్పం ఎంపీపీ అశ్విని, ఎంపీటీసీలు కలిశారు. తన తండ్రి కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ మండలం కన్వీనర్ మురుగేశ్, సోదరుడు శ్రీను రాజేంద్ర ప్రసాద్ అక్రమంగా అరెస్టు చేశారంటూ ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేశారు. మిథున్రెడ్డిని కలిసిన అనంతరం ఎంపీపీ అశ్విని మీడియాతో మాట్లాడారు. ‘‘ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా నిలుస్తుందని ఎంపీ మిథున్రెడ్డి చెప్పారు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నారు. జనవరి నెలలో మల్లనూరు పంచాయితీ ట్రాక్టర్ పోయిందని మేము పిర్యాదు చేశాం, ఇప్పుడు మాపైనే కేసు పెట్టారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరమని ఒత్తిడి చేస్తున్నారు, లేదంటే కుప్పం ఎంపీపీ పదవికి రాజీనామా చేయమంటున్నారు. కుప్పంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుపై తప్పుడు కేసులు బనాయించి సీఐ ఇబ్బందులు పెడుతున్నారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు.. ఐదేళ్ల తర్వాత పరిస్థితి మారుతుంది.. అప్పుడు మీ పరిస్థితి ఆలోచన చేసుకోండి’’ అని ఆమె అన్నారు. -
లోక్సభ ముందు వక్ఫ్బోర్డు సవరణ బిల్లు.. ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్న మిథున్రెడ్డి
-
Lok Sabha: వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ
సాక్షి, ఢిల్లీ: లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు ముస్లిం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ లోక్సభ పక్షనేత మిథున్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. అలాగే, ఈ బిల్లుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అభిప్రాయాలతో తాము ఏకీభవిస్తున్నామని వెల్లడించారు.కాగా, ఈరోజు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఈ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. బిల్లును సభలో ప్రవేశపెట్టే మందు ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఇక, ఈ బిల్లును వైఎస్సార్సీపీ, టీఎంసీ, ఎస్పీ, కాంగ్రెస్, మజ్లిస్, కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకించాయి. అలాగే, టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి.ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కామెంట్స్..వక్ఫ్ బిల్లుతో మత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. వక్ఫ్ సవరణ బిల్లు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, అధికారాల విభజనకు విఘాతం కలిగిస్తుంది. వక్ఫ్ ఆస్తులు మతపరమైన కార్యక్రమాల నిర్వహణ కోసం ఉన్నాయి. ఆర్టికల్-25కి భంగం కలిగేలా ఈ బిల్లు ఉంది. అల్లా పేరు మీద ఆస్తిని విరాళంగా ఇచ్చే అవకాశం లేకుండా చేశారు. దర్గా, మసీదుల ఆస్తులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు వైఎస్సార్సీపీ ఎంపీల విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను వైఎస్సార్సీపీ లోక్సభ ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనుజరాణిలు సోమవారం కలిశారు. ఈ సందర్బంగా కడప-బెంగళూరు మధ్య నూతన రైల్వే లైన్ పనులను వేగవంతం చేయాలని కేంద్రమంత్రిని వైఎస్సార్సీపీ లోక్సభ పక్షనేత మిథున్ రెడ్డి కోరారు.కడప-బెంగళూరు రైల్వే లైన్తో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల సరఫరా మెరుగవుతుందని తెలిపారు. పీలేరు-పుంగనూరు- మదనపల్లిల మీదుగా వెళ్లే ఈ రైల్వే లైన్ వల్ల రాయలసీమ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కాగా కడప నుంచి బెంగళూరుకు కొత్త రైల్వే లైన్ను 2008-09 రైల్వే బడ్జెట్లోనే మంజూరు చేశారని, ప్రాథమికంగా సర్వే నిర్వహించి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అయితే కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చేయాలని కోరారు. -
ఏపీకి అప్పులు కాదు... అభయం ఇవ్వండి
-
‘సూపర్సిక్స్’ అమలు ఎప్పుడు?: లోక్సభలో ఎంపీ మిథున్రెడ్డి
సాక్షి,ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సారీ సిక్స్ గా మార్చవద్దని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్రెడ్డి కోరారు. సోమవారం(జులై 29) లోక్సభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా మిథున్రెడ్డి మాట్లాడారు. ఏపీలో సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదని, సూపర్ సిక్స్ అమలుకు గడువు ప్రకటించాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతలు లేకుండా పెట్టుబడులు ఎలా..ఏపీలో శాంతిభద్రతలు దిగజారితే పెట్టుబడులు ఎలా వస్తాయి. నా నియోజకవర్గంలో నన్ను తిరగకుండా అడ్డుకున్నారు. నాపైన దాడి చేశారు. నా వాహనాన్ని ధ్వంసం చేశారు. అన్ని టీవీ చానల్స్ చూస్తుండగానే దాడి జరిగింది. నాపైనే దాడి చేసి నాకు వ్యతిరేకంగా హత్యాయత్నం కేసు పెట్టారు. ఏపీలో శాంతిభద్రతలను కాపాడాలి. హింసకు చరమ గీతం పాడాలి. అమరావతికి రుణం వద్దు.. గ్రాంట్గా కావాలి..పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి బాధ్యులు ఎవరు. అమరావతికి ఇచ్చే రూ. 15వేల కోట్లు రుణంగా కాకుండా గ్రాంట్గా ఇవ్వాలి. విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. పదేళ్లు గడిచిన విశాఖ మెట్రో, కడప స్టీల్ ప్లాంట్ ఊసే లేదు. ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. బడ్జెట్లో రూ. 11 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించవద్దు’అని మిథున్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. -
అధికారం ఉంటే సరిపోదు.. కొంచెం జ్ఞానం ఉండాలి..
-
వారిపై పరువు నష్టం దావా వేస్తా.. ఎంపీ మిథున్రెడ్డి వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: తమపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. వ్యక్తిగత ఆరోపణలు చేసే ముందు వివరణ తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మదనపల్లి ఆర్డీవో ఆఫీసు ఫైళ్ల దహనంపై పసలేని ఆరోపణలు చేస్తున్నారు.. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.మా వ్యక్తిగత ఇమేజ్ దెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తున్నారు. మా ఆస్తుల వివరాలన్నీ ఎలక్షన్ అఫిడవిట్లలోనే ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి నిజానిజాలు ప్రభుత్వం బయటపెట్టాలి. ఈ ఘటనకు సంబంధించి అరెస్టయిన అనురాగ్ టీడీపీకి చెందిన వ్యక్తే.. మాపై పత్రికలు కథనాలు ప్రచురించే ముందు మా వివరణ తీసుకోవాలి. ఏకపక్షంగా కథనాలు వేయవద్దు. ఇదిలాగే కొనసాగితే పరువు నష్టం దావా వేస్తాం’’ అని మిథున్రెడ్డి హెచ్చరించారు.‘‘మా ఆస్తుల వివరాలు అఫిడవిట్లలో ఉన్నాయి. చట్టబద్ధంగా ఆదాయ పన్ను కడుతూ వ్యాపారం చేస్తున్నాం. ఎవరి దగ్గర ఒక్క రూపాయి ఎలక్షన్ ఫండ్ తీసుకోలేదు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు నేను సిద్ధం. రికార్డులు తారుమారు చేశారని ఆరోపణలు చేస్తున్నారు. మా ఇమేజ్ దెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తున్నారు. సాక్ష్యాధారాలు చూపమంటే తోక ముడిచారు. ఆరోపణలు నిరూపించకుంటే క్షమాపణ చెప్పాలి.. లేదంటే, పరువు నష్టం దావా వేస్తా’’ అని మిథున్రెడ్డి మండిపడ్డారు. -
బాబు హత్యలు దేశం మొత్తం తెలిసేలా ఢిల్లీలో ధర్నా..
-
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందే.. విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని వైఎస్సార్ సీపీ రాజ్యసభ, లోక్సభ పక్ష నేతలు వి.విజయసాయిరెడ్డి, పి.మిథున్రెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు నిర్వహించిన అఖిలపక్ష భేటీలో వారిద్దరూ ఆంధ్రప్రదేశ్లో అదుపు తప్పిన శాంతి భద్రతలు, అధికార పార్టీ దాడులు, విభజన హామీల అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎంపీలకే రక్షణ లేని దుస్థితి..ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ సభ్యులకు సైతం భద్రత లేకుండా పోయిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లిన ఎంపీ మిథున్రెడ్డిపై టీడీపీ గూండాలు దాదాపు 500 మందితో వచ్చి రాళ్లు, కర్రలతో దాడి చేశారన్నారు. దాడులకు బరి తెగించిన టీడీపీ గూండాలను వదిలేసి వైఎస్సార్ సీపీకి చెందిన బాధితులపై నే కేసులు బనాయించడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగించేందుకు టీడీపీ ప్రభుత్వానికి ఏమాత్రం అర్హత లేదని, రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో 45 రోజుల టీడీపీ పాలనలో 490 ప్రభుత్వ భవనాలు, 560 ప్రైవేట్ ఆస్తులపై దాడులు జరిగాయన్నారు. యథేచ్ఛగా హత్యలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై వేలాదిగా దాడులు జరిగాయన్నారు. టీడీపీ గూండాలు వినుకొండలో వైఎస్సార్ సీపీ కార్యకర్త రషీద్ను నడిరోడ్డుపై నరికి చంపుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమన్నారు. ఇలాంటి వాళ్లా రాష్ట్రాన్ని పాలించేది? అని ప్రజలు ఆలోచిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 300 హత్యాయత్నాలు జరిగాయంటే ఎలాంటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయో ఊహించవచ్చన్నారు. మౌనపాత్ర పోషిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వచ్చే బుధవారం ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తారని తెలిపారు. గత 45 రోజులుగా రాష్ట్రంలో ఏం జరిగిందో ఫోటో ప్రదర్శన కూడా ఉంటుందన్నారు. ప్రజల బాగోగుల పట్ల చిత్తశుద్ధితో రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రుల అపాయింట్మెంట్లు కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు వ్యతిరేకంగా ఏం జరిగినా కేంద్రం, రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రజల కోసం వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమన్నారు.అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక హోదా, బడ్జెట్లో ఎక్కువ వాటా, విభజన హామీల్లో ప్రధానంగా పెండింగ్లో ఉన్న పెట్రో కెమికల్, రైల్వే జోన్, గిరిజన వర్సిటీ తదితర అంశాలపై డిమాండ్ చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ బిహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో కోరగా మరో కీలక భాగస్వామి టీడీపీ మాత్రం దీనిపై నోరు మెదపకపోవడం దారుణమన్నారు. మాపై దాడి చేసి.. మాపైనే కేసులా?రెండుసార్లు తన నియోజకవర్గానికి వెళ్లేందుకు సిద్ధమైనా టీడీపీ గూండాలు అడ్డుకుని భౌతిక దాడులకు దిగినట్లు ఎంపీ మిథున్రెడ్డి చెప్పారు. గృహ నిర్భంధం విధించి భద్రత కల్పించలేమని పోలీసులు చేతులెత్తేశారన్నారు. పోలీసుల సమక్షంలోనే మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేసి వాహనాలను దగ్ధం చేస్తే హత్యాయత్నం, నాన్ బెయిలబుల్ కేసులు తమపై బనాయించడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధికే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యుల సంగతి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. వినుకొండలో రషీద్ది రాజకీయ హత్య అని మృతుడి తల్లిదండ్రులు చెబుతున్నా ప్రభుత్వం ఆలకించడం లేదని మండిపడ్డారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపులో లేవన్నారు. -
ఏపీలో రాష్ట్రపతి పాలన..!
-
వాళ్లు తప్పు చేసి.. మాపైనే కేసులు
సాక్షి, అమరావతి: ‘అన్ని తప్పులు వాళ్లే చేసి.. తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దౌర్జన్యాలు, దాడు లు, విధ్వంసాలకు లెక్కే లేదు. ఈ 45 రోజుల్లో 36 మంది రాజకీయ హత్యలకు గుర య్యారు. హత్యలు, దాడులు చేయడానికే టీడీపీ వాళ్లకు లైసెన్స్ ఇచ్చినట్టుగా ఉంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి నిప్పులు చెరిగారు.తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్.. టీడీపీ కార్యకర్తలపై ఎన్ని కేసులు ఉంటే అంత బాగా పని చేసినట్లు అని ప్రచారం చేశారు. ఎ న్నికల తర్వాత టీడీపీ గెలిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ చూసిన రెడ్ బుక్ ఫొటోలతో కూడిన హో ర్డింగ్లు ఏర్పాటు చేశారు. టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ కార్యకర్త లపైకి, ప్రజలపైకి ఉసిగొల్పుతున్నారు’ అని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ‘పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంట్లో ఉండగా నా పైనే దాడి చేసి, నాపైనే హత్యా నేరం మోపడం దారుణం. వందలాది మంది టీడీపీ కార్యకర్తలను సమకూ ర్చుకొని ఇంట్లో ఉన్న నా పై దాడి చేశారు. పుంగనూరు నేను ప్రాతినిథ్యం వహిస్తున్న రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలోనిదే. పుంగనూరు నియోజకవర్గానికి మా నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. కావాలనే అక్కడ టీడీపీ మనుషులు ఉండేలా, పోలీసులతో ప్లాన్ చేసి మరీ దాడులు చేశారు. 75 ఏళ్ల వయసున్న మాజీ ఎంపీ రెడ్డె్డప్ప ఒక న్యాయవాది.ఆయన ఇంటిపైనే రాళ్లతో దాడి చేసి, వాహనాలు ధ్వంసం చేశారు. మాజీ ఎంపీ రెడ్డె్డప్పకు చెందిన వాహ నాన్ని దగ్ధం చేశారు. వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. తిరిగి ఆయనపైనే హత్య నేరం కేసు పెట్టడం దారుణం’ అని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో ఏపీలో విధ్వంసకాండ, ఆటవిక పాలన గురించి గట్టిగా ప్రస్తావిస్తామని చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల నేతలందరినీ ఒకే విధంగా, సమానంగా చూడాలని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చెప్పారన్నారు.వినుకొండలో ‘రషీద్ హంతకుడైన జిలానీ.. లోకేశ్ పుట్టిన రోజున స్థానిక ఎమ్మెల్యే భార్యకు స్వయంగా కేక్ తినిపించిన ఫొటోలు, ఎమ్మెల్యేతో ఉన్న ఫొటోలను.. రషీద్ తల్లిదండ్రులు చూపారు. అయినా వినుకొండ ఎమ్మెల్యే ప్రెస్మీట్ పెట్టి జిలానీ గురించి అబద్ధాలు చెబుతున్నారు. ఫొటోల్లో స్పష్టంగా కన్పిస్తుంటే చంద్రబాబు, పవన్లు మాట్లాడక పోవటం, ఖండించక పోవటం ఆశ్చర్యకరం అన్నారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై దాడి : ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డిరాష్ట్రంలో జరుగుతున్న ఈ ఆకృత్యాలు ఒక రాజకీయ పార్టీపై జరుగుతున్న దాడిగా కాకుండా, ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా దేశ ప్రజలు చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీ ఎంపీలతో సమావేశం అనంతరం.. ఆ వివరాలను అయోధ్య రామిరెడ్డి మీడియాకు వివరించారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులపై చేస్తున్న భౌతిక దాడులు, ప్రజల్లో నెలకొన్న భయాందోళల గురించి, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించామని చెప్పారు. వాటన్నింటినీ పార్లమెంట్లోనూ ప్రస్తావించాలని నిర్ణయించామన్నారు. ‘రాష్ట్రంలో జరిగిన విధ్వంసకాండపై ఢిల్లీలో బుధవారం జరిగే ధర్నాలో ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేస్తాం. వీడియోల ద్వారా దేశ ప్రజలందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు ఇప్పటికే అపాయింట్మెంట్ అడిగాం. లోక్సభ, రాజ్యసభలో పెద్ద ఎత్తున మా వాణి వినిపిస్తాం’ అని చెప్పారు. -
ఇదేం పాలన పాక్ చంద్రబాబు.. తప్పు సరిచేసుకో..
-
చంద్రబాబు రక్తచరిత్ర పాలన.. ఢిల్లీలో బయటపెడతాం
-
ఇంకెంతమందిని చంపాలనుకుంటున్నారు?: ఎంపీ మిథున్రెడ్డి
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకకాండ నడుస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకకాండ నడుస్తోంది. పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్సీపీ యువకార్యకర్త రషీద్ హత్య అత్యంత కిరాతకం. ప్రభుత్వంలో ఉన్న పెద్దల సహకారంతోనే ఇలాంటి దారుణ హత్యలు జరుగుతున్నాయి. నామీద కూడా దాడులు చేశారు. గతంలో యాక్టివ్గా పని చేసిన నేతలందరినీ టీడీపీ టార్గెట్ చేసింది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయటం ఏంటి?. ఇంకెంతమందిని చంపాలనుకుంటున్నారు?. పార్లమెంటులో వీటిపై చర్చిస్తాం. దేశమంతా ఏపీలోని దారుణాల గురించి విస్తుపోతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఎందుకు నోరుమెదపటంలేదు?. .. బుధవారం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీపై దాడులపై ఢిల్లీలో ధర్నా చేయనున్నారు.దేశమంతా ఏపీలోని కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాలపై చర్చించేలా చేస్తాం’ అని అన్నారు.చదవండి: మీ కోసమే.. మీతోనే నా ప్రయాణం.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్ -
AP: నిన్న దాడి.. ఇవాళ సెక్యూరిటీ తగ్గించారు
సాక్షి, చిత్తూరు: ఏపీలో కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. అలాగే, పోలీసుల సమక్షంలో నిన్న తమపై టీడీపీ నేతలు దాడులు చేశారని చెప్పుకొచ్చారు.కాగా, రాజంపేటలో ఎంపీ మిథున్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘పుంగనూరులో పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. అనంతరం, మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిపై రాళ్ల దాడులు చేశారు. అంతటితో ఆగకుండా వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఎపిసోడ్ అంతా జరిగింది. మళ్లీ అదే పోలీసులు మాపై నాన్బెయిలబుల్ కేసులు పెట్టారు. నిన్న నాపై దాడి జరిగింది. ఈరోజు నా భద్రతను తగ్గించారు.ఈరోజు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. మీరు అధైర్యపడవద్దు. కార్యకర్తలకు, పార్టీ నాయకులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాను. విద్యార్థి దశ నుంచే మా తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదిసార్లు ఎన్నికలు చూశారు. చంద్రబాబు చేసే దుర్మార్గపు రాజకీయాలను ఎప్పుడూ చూడలేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
కేసులకు భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి: ఎంపీ మిథున్రెడ్డి
సాక్షి, చిత్తూరు: మన ప్రభుత్వంలో ఇలాంటి దాడులు చూడలేదని.. కేసులకు భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి’’ అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి ధైర్యం చెప్పారు. శుక్రవారం ఆయన సదుం మండలంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మిథున్రెడ్డి మాట్లాడుతూ, నాపై కూడా నాన్బెయిలబుల్ కేసులు పెట్టారు. పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించం. పోలీసులు పట్టించుకోకుంటే న్యాయపోరాటం చేస్తాం. నేను ఎవ్వరినీ వదిలి పెట్టను, కార్యకర్తలకు అండగా ఉంటా. పోలీసులు పట్టించుకోకుంటే కోర్టు ద్వారా ప్రైవేట్ కేసులు వేస్తాం.. మీకు ధైర్యం చెప్పేందుకే నేను వచ్చాను’’ అని మిథున్రెడ్డి చెప్పారు.వైఎస్సార్సీపీ నేత పోకల అశోక్కుమార్ మాట్లాడుతూ, చట్టానికి ఎవరు అతీతులు కారు, కుట్ర పూరితంగా కేసులు పెడుతున్నారు. ప్రజలు అందరు గమనిస్తున్నారు. వాళ్లకు తగిన బుద్ధి చెప్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి వెన్నంటే మన కార్యకర్తలు, నాయకులు ఉన్నారన్నారు. -
టీడీపీ నేతలకు మిథున్ రెడ్డి వార్నింగ్
-
Midhun Reddy: మాటువేసి మూకుమ్మడి దాడి ..
-
ఎంపీ మిథున్పై దాడి.. పుంగనూరులో టీడీపీ గూండాల విధ్వంసకాండ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వినుకొండలో నడిరోడ్డుపై వైఎస్సార్ సీపీ కార్యకర్తను నరికి చంపిన టీడీపీ గూండాలు 12 గంటలు గడవక ముందే పుంగనూరులో మరో విధ్వంస కాండను సృష్టించారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా జరిగిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన వారు, ఆస్తులు, పంటలను కోల్పోయిన బాధితులను పరామర్శించి భరోసా కల్పించేందుకు వచ్చిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని అంతమొందించే ప్రణాళికతో పచ్చముఠాలు గురువారం రోజంతా మారణాయుధాలతో తిష్ట వేసి దాడులకు దిగాయి.నాలుగు గంటలు స్వైర విహారం..రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని హతమార్చడమే లక్ష్యంగా అసాంఘిక శక్తులు పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తతలు రేకెత్తించాయి. గురువారం ఉదయం 8 గంటల సమయంలో మిథున్రెడ్డి పుంగనూరు ఎల్ఐసీ కాలనీలోని చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలతో సమావేశమైన విషయం తెలుసుకున్న టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. ఎంపీ మిథున్రెడ్డిని రాళ్లు, కర్రలతో కొట్టి చంపేందుకు మూకుమ్మడిగా దాడులకు తెగబడ్డాయి. టీడీపీ గూండాలను నిలువరించేందుకు యత్నించిన మాజీ ఎంపీ, దళిత నాయకుడు రెడ్డప్పపైనా టీడీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. దుర్భాషలాడుతూ రెడ్డప్ప నివాసంలోకి చొరబడ్డారు. ప్రమాదాన్ని పసిగట్టిన వైఎస్సార్సీపీ శ్రేణులు తలుపులు మూసివేయడంతో బద్ధలు కొట్టేందుకు యత్నించారు. రెడ్డప్ప నివాసంలోకి రాళ్లు రువ్వారు. ఇంటి ముందు ఉన్న పలు వాహనాలను ధ్వంసం చేసి రెడ్డప్ప వాహనానికి నిప్పు పెట్టి తగలబెట్టారు. నిలువరించేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనా దాడులు చేశారు. ఘటన గురించి తెలియడంతో అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులపైనా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. 4 గంటలపాటు సాగిన ఈ విధ్వంసంతో పుంగనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా ఓ ఎంపీనే హత్య చేసేందుకు తెగించినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయంతోపాటు టీడీపీ శ్రేణులు కూల్చివేసిన ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించి ఎంపీ మిథున్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుసుకున్న అల్లరిమూకలు హింసాకాండకు బుధవారం రాత్రే పక్కా పథకం రూపొందించినట్లు సమాచారం. మూకుమ్మడిగా చంపాలన్నదే టార్గెట్!ప్రణాళికలో భాగంగా టీడీపీ మూకలు ఉదయం నుంచి స్థానిక ఎంపీడీవో కార్యాలయం సమీపంలో రాళ్లు, కర్రలు, ఇతర ఆయుధాలతో మాటు వేశాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ముగించి మిథున్రెడ్డి బయటకు వస్తున్నట్లు గుర్తించి ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. రాళ్లు రువ్వుతూ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసాన్ని చుట్టుముట్టాయి. వారిని అడ్డుకునేందుకు యత్నించిన రెడ్డప్పపైనా దాడికి దిగాయి. ‘రేయ్.. బయటకు రారా..’ అంటూ దుర్భాషలకు దిగాయి. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడగా 25 మందికిపైగా వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు సాక్షి విలేకరులతోపాటు మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.గాల్లోకి కాల్పులు జరిపిన ఎంపీ గన్మెన్ఎంపీ, మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేతలకు చెందిన 15 వాహనాలను టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. మరో 12 ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనానికి నిప్పుపెట్టి తగలబెట్టారు. రెడ్డెప్ప నివాసం వద్ద పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అల్లరి మూకల నుంచి రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని రక్షించేందుకు గన్మెన్ రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అడుగడుగునా పోలీస్ వైఫల్యంపుంగనూరులో జరిగిన విధ్వంస కాండలో అడుగడుగునా పోలీసుల నిర్లక్ష్యం కనిపించింది. పోలీసుల సమక్షంలోనే రాళ్లు రువ్వుతూ, కర్రలతో స్వైర విహారం చేస్తున్నా చూస్తుండిపోయారు. భారీగా టీడీపీ మూకలు మోహరించినా వెంటనే స్పందించాల్సిన ఉన్నతాధికారులు తీరిగ్గా కొంత మంది పోలీసులను పంపి చేతులు దులుపుకోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎంపీ మిథున్రెడ్డి అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. బాబు ఆదేశాలతో హౌస్ అరెస్టు..ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి గత నెల 15న పుంగనూరులో పర్యటించాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పోలీసులు వారిద్దరినీ తిరుపతిలో హౌస్ అరెస్ట్ చేశారు. తాజాగా పార్టీ కార్యకర్తలను, బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఎంపీ మిథున్రెడ్డిని ఏకంగా హతమార్చేందుకు పచ్చమూకలు పథకం వేశాయి.బెదిరింపులకు భయపడం: ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డికూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలే అజెండాగా పని చేస్తోంది. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పురిగొల్పడం దారుణం. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. నియోజకవర్గంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు గతంలో ఎప్పుడూ చూడలేదు. అభివృద్ధి అంటే వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లను కూల్చడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, పిల్లలు ఆడుకునే బ్యాడ్మింటన్ కోర్టును ధ్వంసం చేయడమా? ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదు. చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. డీఎస్పీ, సీఐ స్థాయి అధికారుల ఎదుటే దాడులు జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణం. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని మరో బిహార్లా మార్చే యత్నం చేస్తున్నారు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తేలేదు. ప్రజలకు అండగా ఉంటాం. ప్రజల్లోనే ఉంటూ మరోసారి వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తాం. తిరిగి ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుంది. అమ్మ ఒడి పథకం పేరు మార్చి తల్లికి వందనం అంటూ ఒక్కరికే ఇస్తామని మాట మార్చారు. అభివృద్ధిని విస్మరించి, సంక్షేమ పథకాలను ఆపివేసి ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి పొందకుండా తమ పెట్టుబడితో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన సంస్థను చంద్రబాబు సర్కారు కుటిల యత్నాలతో అడ్డుకోవడం సరికాదు. హింసాత్మక ఘటనలు పునరావృతమైతే టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.రాళ్లతో కొట్టి చంపే యత్నం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని రాళ్లతో కొట్టి చంపాలని టీడీపీ రౌడీమూకలు యత్నించాయి. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఎక్కడా లా అండ్ ఆర్డర్ లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. దళిత నాయకుడైనా నాపైనా దాడి చేశారు. నా ఇంటిని చుట్టుముట్టి రాళ్లు, మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. నా కారుకి నిప్పుపెట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక విధ్వంసకాండకు తెర తీసింది. ప్రశాంతంగా ఉండే పుంగనూరులో 12 సార్లు దాడులు జరిగాయి.– మాజీ ఎంపీ రెడ్డప్పపాలనపై దృష్టి పెట్టండిచంద్రబాబు దాడులపై కాకుండా పాలనపై దృష్టి సారించాలి. ప్రజా ప్రతినిధులకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ నిర్వీర్యంగా మారింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు తగవు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి వారి మెప్పు పొందాలే కానీ దాడులకు పాల్పడడం సరి కాదు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం నిర్వీర్యం కాకుండా చూసే బాధ్యత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులదే. వారి తీరు చూస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించే పరిస్థితి కనిపించటం లేదు.– నారాయణస్వామి, మాజీ డిప్యూటీ సీఎంహేయమైన చర్యరాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిధున్రెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేయడం అత్యంత హేయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఓ ఎంపీకే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్యులను ఎలా కాపాడుతుంది? ఎంపీపై రాళ్ల దాడి జరుగుతున్నా పోలీసులు చోద్యం చూశారంటే రాష్ట్రంలో ఎలాంటి ఆటవిక పాలన కొనసాగుతుందో తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని దాడుల సంస్కృతిని టీడీపీ పాలనలో చూస్తున్నాం. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలి. దాడులకు తగిన మూల్యం చెల్లించుకునే రోజు కచ్చితంగా వస్తుంది. – మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎంపీ -
పుంగనూరులో టీడీపీ విధ్వంసకాండ.. ఎంపీ మిథున్రెడ్డిపై హత్యాయత్నం!
చిత్తూరు, సాక్షి: పుంగనూరులో ఇవాళ తెలుగుదేశం పార్టీ విధ్వంసకాండ కొనసాగింది. టీడీపీ దాడుల్లో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తల్ని, సానుభూతిపరుల్ని పరామర్శించేందుకు రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి ఆ నియోజకవర్గానికి వెళ్లారు. అయితే ఆయన పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ యత్నించడం, ఆయనపై దాడికి యత్నించడంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొంది.మిథున్రెడ్డిని అడ్డుకునేందుకు రాళ్ల దాడికి దిగాయి టీడీపీ శ్రేణులు. ఆ కవ్వింపు చర్యలను ప్రతిఘటించేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు యత్నించాయి. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎంపీ గన్మెన్ గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం ఆయన మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకోగా.. పచ్చ పార్టీ కార్యకర్తలు అక్కడా వీరంగం సృష్టించారు. రెడ్డప్ప ఇంటిపైకి రాళ్లు రువ్వారు. ఆయన కారుకు నిప్పు పెట్టారు. అంతేకాదు.. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. ఈ క్రమంలో 15 కార్లు, పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. మరోవైపు రెడ్డప్ప ఇంటి నుంచి కదిలేదే లేదని, తన పర్యటన కొనసాగుతుందని ఎంపీ మిథున్రెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ఏఎస్పీ రెడ్డప్ప నివాసానికి చేరుకుని మిథున్రెడ్డితో చర్చలు జరిపారు. చివరకు.. కట్టుదిట్టమైన భద్రత నడుమ పుంగనూరు నుంచి తిరుపతిలోని మారుతినగర్ నివాసానికి ఎంపీ మిథున్రెడ్డిని పోలీసులు తరలించారు. ఇది హత్యాయత్నమే.. ఎంపీ మిథున్రెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన వైఎస్సార్సీపీ.. దీన్నొక హత్యాయత్నంగా అభివర్ణించింది. మాజీ ఎంపీ రెడ్డప్ప పుంగనూరు ఉద్రిక్తతలపై స్పందిస్తూ.. ఎంపీ మిథున్రెడ్డిపై హత్యయత్నం జరిగిందన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ పాలనలో దాడులు ఎక్కువ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.సంబంధిత వార్త: ఎంపీ మిథున్రెడ్డిపై రాళ్ల దాడిభయపడేది లేదు: మిథున్రెడ్డిపుంగనూరులో గతంలో ఈ తరహా దాడులు ఏనాడూ జరగలేదని, చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్లోనే దాడులు జరగుతున్నాయని, టీడీపీ నేతలు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, ఇలాంటి దాడులకు మేం భయపడమని ఎంపీ మిథున్రెడ్డి అంటున్నారు. -
ఎల్లోబాన్లపై వైఎస్సార్సీపీ ఆగ్రహం
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచకాలపై వైయస్సార్సీపీ నేతలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా వినుకొండలో పార్టీ కార్యకర్త దారుణహత్య. పుంగనూరులో ఎంపీ పి.మిధున్రెడ్డిపై రాళ్లతో దాడి. వాహనాల «ధ్వంసం ఘటనలను వారు ముక్త కంఠంతో ఖండించారు.అ«ధికారం చేపట్టిన టీడీపీ తొలి రోజు నుంచి పాలన గాలికి వదిలేసి, కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, ఎక్కడికక్కడ దాడుల చేస్తోందని వారు ఆక్షేపించారు. ఇకనైనా టీడీపీ తన వైఖరి మార్చుకోకపోతే, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదని వైయస్సార్సీపీ నేతలు, నాయకులు హెచ్చరించారు.వైయస్సార్సీపీ నేతలు.. ఎవరు, ఏమన్నారంటే..: ప్రశాంతంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం సృష్టించారు. రాళ్ళతో, మారణాయుధాలతో దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ డైరెక్షన్లోనే పుంగనూరు ఘటన చోటు చేసుకుంది. పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధిని అడ్డుకోవాలన్న కుట్రలో భాగమే ఈరోజు అక్కడ రాళ్ల దాడి, వాహనాల ధ్వంసం జరిగింది. రూ.5 వేల కోట్లతో ఎలక్ట్రిక్ కార్ల ఫ్యాక్టరీ పుంగనూరులో ఏర్పాటవుతుంటే, దాన్ని ఎలాగైనా ఆపాలన్న కుట్ర చేస్తున్నారు. ఎల్లకాలం మీ ఆటలు సాగవు. ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. నా సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా ఉండాలని చూస్తున్నారు. అందుకే మా వాహనాలు ధ్వంసం చేశారు. నాపై రాళ్ల దాడి చేశారు.:::పి.మిధున్రెడ్డి. రాజంపేట ఎంపీపుంగనూరు నా ఇంటికి వచ్చిన ఎంపీ పి.మిధున్రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. మారణాయుధాలు, రాళ్లతో ఎంపీ మిథున్రెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. నా వాహనాలతో పాటు, మిథున్రెడ్డి వాహనాలు కూడా ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా, పోలీసులు పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. వారు టీడీపీ తొత్తులుగా వ్యవహరించారు.:::రెడ్డప్ప. చిత్తూరు మాజీ ఎంపీఎంపీ మిధున్రెడ్డిపై రాళ్ళ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దాడులు హత్యలు దారుణంగా పెరిగిపోయాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమంజసం కాదు. దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. దాడులు చేస్తున్న వారికి ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారు.:::గొల్ల బాబురావు. ఎంపీ (రాజ్యసభ సభ్యుడు)చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద ఎంపీ మిధున్రెడ్డిపై దాడి అమానుషం. ఎంపై రాళ్ల దాడి చేసి, వారి వాహనాలు« «ధ్వంసం చేయడం అత్యంత హేయం. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో రాక్షస, ఆరాచక పాలన సాగుతోంది. ఈ దాడులపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. ప్రజలు అధికారాన్ని ఇస్తే, సభ్య సమాజం తలదించుకునేలాగా టీడీపీ నాయకులు ప్రవర్తించడం సిగ్గుచేటు.:::ఇస్సాక్ బాషా. వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ.రేపు (19వ తేదీ, శుక్రవారం) ఉదయం మా పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి వినుకొండలో పర్యటిస్తారు. టీడీపీ కార్యకర్త చేతిలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. ఆ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పడానికే, ఆయన రేపు వినుకొండలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది, వందలాది ప్రజలు, పోలీసులు చూస్తుండగానే, వినుకొండ నడిరోడ్డులో మా పార్టీ కార్యకర్తను నరికి చంపడం అంటే.. అంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా?. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది.. ఇలా పార్టీ కార్యకర్తలను నరికి చంపడానికా?. వినుకొండలో తెలుగుదేశం పార్టీ కొత్త సాంప్రదాయానికి బీజం వేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పని చేస్తున్నాడన్న కారణంతోనే రషీద్ను దారుణంగా నరికి చంపారు.:::బొల్లా బ్రహ్మనాయుడు. మాజీ ఎమ్మెల్యే (వినుకొండ)వినుకొండ టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ ఘటన.. మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. అంత కిరాతకమైన దృశ్యాలు ఆ వీడియోలో కన్పిస్తున్నాయి. రషీద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను.ఆంధ్రప్రదేశ్ను అత్యాచారప్రదేశ్గా మార్చొద్దు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ కనిపించడం లేదు. కేవలం నారా లోకేష్ ఆర్డర్ కనిపిస్తోంది. వినుకొండ లాంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటిపై ప్రధాని మోదీ గారు, కేంద్ర హోం మంత్రి అమిత్షాగారు దృష్టి పెట్టాలి. అలాగే రాష్ట్రంలో ఈ ఒకటిన్నర నెలల్లో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి.:::సి.అనిల్కుమార్ యాదవ్. మాజీ మంత్రి.వినుకొండలో జరిగిన హత్య ఒక రాజకీయ హత్య. అలాగే ఎంపీ మిథున్రెడ్డిపై దాడి అత్యంత హేయం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. వినుకొండలో మా పార్టీ కార్యకర్తను అత్యంత పాశవికంగా హత్య చేసి, దాన్ని వ్యక్తిగత హత్యగా చిత్రీకరించడం దారుణం. టీడీపీ దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరు వెళ్లిన ఎంపీ మిధున్రెడ్డిపై రాళ్లతో దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యుడికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం, సామాన్య కార్యకర్తలకు ఏ విధమైన రక్షణ కల్పిస్తుంది?. ఏకంగా ఒక ఎంపీపైనే రాళ్లతో దాడి చేస్తున్నా, రక్షణ కల్పించకుండా పోలీసులు చోద్యం చూశారంటే, ఇక్కడ ఏ విధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలి. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని ఇప్పుడు చూస్తున్నాం. అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకొంటే బాగుంటుంది.:::ధర్మాన కృష్ణదాస్. మాజీ మంత్రి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన తాలిబన్ల పాలనను తలపిస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్పై దృష్టి పెట్టకుండా సూపర్ మ్యాజిక్ చేసి మోసం చేస్తున్నారు. కూటమి నాయకులు దళితులనే టార్గెట్ చేసి దాడులు చేయడం హేయమైన చర్య. ఈ కూటమి తాలిబన్లను తరమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. మీ దాడులపై మా పార్టీ ప్రతి దాడులకు దిగితే తట్టుకోలేరు.:::కోరుముట్ల శ్రీనివాసులు. మాజీ ఎమ్మెల్యే (రైల్వే కోడూరు)రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. చంద్రబాబు మార్క్ రాజకీయాలు నడుస్తున్నాయి. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. హత్యలు, దొమ్మీలు ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. ఈ తరహా పద్ధతి మారకపోతే తిరగబడాల్సి వస్తుంది. పుంగనూరులో ఎంపీ మిథున్రెడ్డిపై జరిగిన దాడి దారుణం. వెంటనే రాజ్యాంగ వ్యవస్థలు జోక్యం చేసుకోవాలి. ఇకనైనా చంద్రబాబు తన పద్ధతి మార్చుకోవాలి.:::జక్కంపూడి రాజా. మాజీ ఎమ్యెల్యే. (తూ.గో.జిల్లా)కూటమి పాలనలో రాష్ట్రంలో అరాచకం నడుస్తోంది. టీడీపీ నాయకులు దాడులు, మర్డర్లు ,మానభంగాలతో చెలరేగిపోతున్నారు. ఇందుకేనా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది?. మీ పాలనలో గ్రామాలలో ఎన్నో కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. వినుకొండలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే మా పార్టీ కార్యకర్తను నరికి చంపడం దారుణం.:::కాసు మహేష్రెడ్డి. మాజీ ఎమ్మెల్యే (గురజాల).తెలుగుదేశం నాయకులు అసలు ఎందుకు దాడులు చేస్తున్నారు?. నడిరోడ్డుపైన పోలీసులు ఉండగానే రషీద్ను అత్యంత దారుణంగా చంపడం దుర్మార్గపు చర్య. గతంలో జిల్లా ఎస్పీగా మల్లికాగార్గ్, నెల రోజులపాటు పని చేసినప్పుడు, ఈ తరహా దాడులు కాస్త తగ్గాయి. జిల్లాకు చెందిన ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, సీఎం చంద్రబాబును కలిసి, ఎస్పీని మార్చమని కోరారు. ఆయన వెంటనే ఆ పని చేశారు. ఇప్పుడు వినుకొండలో మా పార్టీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. ఘటన జరిగిన వెంటనే, ఎలాంగి దర్యాప్తు చేయకుండానే, అర్ధరాత్రి మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ, అది వ్యక్తిగత, పాత కక్షల వల్లనే జరిగిందని చెప్పడం దారుణం. మరోవైపు రషీద్ను నరికి చంపిన జిలానీ, వాస్తవానికి టీడీపీకి చెందినవాడైనా, అతడు తమ పార్టీ కార్యకర్త అంటూ, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో జిలానీ, టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు కోసం పని చేశారు.:::మర్రి రాజశేఖర్. ఎమ్మెల్సీ.చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేయటమే తెలుగుదేశం కార్యకర్తలు పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వారు గాలికి వదిలేశారు. హత్య జరిగిన తరవాత అర్ధరాత్రి ప్రెస్మీట్ పెట్ని ఎస్పీ, పాతకక్షల వల్లే రషీద్ హత్య జరిగిందని చెప్పడం దారుణం.:::గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి. మాజీ ఎమ్మెల్యే (నర్సారావుపేట) పక్కా ప్లాన్తో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. గడిచిన 45 రోజులుగా ఏపీలో జరుగుతున్న హింస ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. 31 హత్యలు, 35 మంది ఆత్మహత్యలు జరిగాయి. ఏకంగా 2,750 కుటుంబాలు ప్రాణభయంతో వలస పోయాయి. ప్రతిపక్షాన్ని టెర్రరైజ్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ ని తలపిస్తున్నారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. హైకోర్టు కోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలి. వినుకొండ హత్యకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. అటు పుంగనూరులో ఎంపీ మిథున్రెడ్డిపై రాళ్ల దాడి చేశారు. ఇందుకేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది?. వారం లోగా పరిస్థితిని చక్కదిద్దాలి. లేకపోతే రాజీనామా చేయాలి. మా ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుంది.:::కనుమూరు రవిచంద్రారెడ్డి, వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల కూడా గడవక ముందే మా పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలపై టీడీపీ దాడులు తీవ్రమయ్యాయి. ఎంపీ మిధున్రెడ్డిపై పుంగనూరులో రాళ్లదాడిని ఖండిస్తున్నాం. సౌమ్యుడిగా, మంచి వ్యక్తిగా పేరున్న మిథున్రెడ్డిపై టీడీపీ దాడి ఎంత వరకు సబబు?. తమ నియోజకవర్గంవలో పర్యటించే హక్కు, ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధికి, ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. ఆ హక్కును కాలరాయాలని టీడీపీ చూడడం దారుణం.:::అకేపాటి అమర్నాథ్రెడ్డి. రాజంపేట ఎమ్మెల్యే.రాష్టంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. గుంటూరు జిల్లాలో వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ వారి దాడులు తీవ్రమవుతున్నాయి. వినుకొండలో నడి రోడ్డుపై రషీద్ను దారుణంగా నరికి చంపారు. వ్యక్తిగత వివాదాలు, పాతకక్షల వల్లే ఆయన హత్య జరిగిందని, అర్థరాత్రి హడావిడిగా ఎస్పీ చెప్పడం దారుణం. అలాంటి ఎస్పీకి రాష్ట్రంలో పని చేసే అర్హత లేదు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దాడులు పెరిగాయి. దాదాపు 3 వేల కుటుంబాలు ఇళ్లు, ఊళ్లు వదిలి వెళ్లాయి. మరోవైపు మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు అధికమయ్యాయి. మా పార్టీ వారిపై నానాటికీ దాడులు పెరుగుతున్నా, పోలీసులు అస్సలు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు 40 రోజుల పాలనలో అనేక దారుణాలు జరిగాయి. ఆడపిల్లల జోలికి వస్తే.. భయపడేలా చేస్తామన్న పవన్కళ్యాణ్.. ఇప్పుడు నోరు మెదపడం లేదు.:::కాకాణి గోవర్థన్రెడ్డి. మాజీ మంత్రి.పుంగనూరులో ఎంపీ మిథున్రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాల «ధ్వంసం హేయమైన చర్య. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యుడు మిథున్రెడ్డి. పుంగనూరులో మాజీ ఎంపీ ఇంటికి వెళ్లిన ఆయనపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేయడం, ఆయన వాహనాలు ధ్వంసం చేయడం పిరికిపంద చర్య. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వరుసగా జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల ధ్వంసం, కూల్చివేతల సంఘటనలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. గతంలో ఏనాడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. నెల రోజులుగా వరుసగా పసిపిల్లలపై అత్యాచారాలు జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం. నంద్యాల జిల్లా నందికొట్కూరు ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారానికి గురై, హత్యకు గురైనా, ఇప్పటికీ ఆ బాలిక మృతదేహం కనుక్కోక పోవడం దారుణం.:::జి.శ్రీకాంత్రెడ్డి. వైయస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడురాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్రెడ్డిపై దాడి అత్యంత హేయం. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏవిధమైన రక్షణ కల్పిస్తుంది. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏవిధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంçస్కృతిని ఇప్పుడు చూస్తున్నాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి. అధికారం శాశ్వతం కాదు.:::గురుమూర్తి. ఎంపీ (తిరుపతి) -
టీడీపీ నేతలపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్
-
లా అండ్ ఆర్డర్ విఫలం.. చేతులెత్తేసిన పోలీసులు
-
వినుకొండ ఘటనపై మిథున్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
-
ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ దాడి
-
పుంగనూరులో ఎంపీ మిథున్రెడ్డిపై టీడీపీ దాడి
సాక్షి, చిత్తూరు: టీడీపీ అరాచకాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. పుంగనూరులో ఎంపీ మిథున్రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. మాజీ ఎంపీ రెడప్ప నివాసానికి మిథున్రెడ్డి రాగా.. రెడ్డప్ప ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లదాడికి దిగాయి.టీడీపీ దాడిలో గాయపడ్డ నేతలతో మిథున్రెడ్డి సమావేశం జరుగుతుండగా.. ‘పచ్చ’మూకలు రెచ్చిపోయాయి. రాళ్లతో దాడులకు తెగబడ్డాయి. రెడ్డప్ప ఇంటిని చుట్టిముట్టిన టీడీపీ గూండాలు.. మీడియా ప్రతినిధులపైనా రాళ్లతో దాడి చేశారు. రెడ్డప్ప ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేతల వాహనాలను కూడా టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు.చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్లోనే దాడులు: మిథున్రెడ్డి ప్రశాంతంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం సృష్టించారని మిథున్రెడ్డి మండిపడ్డారు. ‘‘రాళ్లతో మారణాయుధాలతో ఈ రోజు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ డైరెక్షన్ లోనే ఈరోజు పుంగనూరులో దాడులు జరుగుతున్నాయి. పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి అడ్డుకోవాలని కుట్రలో భాగమే. 5 వేల కోట్లతో ఎలక్ట్రికల్ కారు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే, దాన్ని రాకుండా కుట్రలు చేస్తున్నారు. ఎల్లకాలం మీ ఆటలు సాగవు, ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. నా పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించే వాతావరణం లేకుండా దాడులు చేస్తున్నారు. మా వాహనాలు ధ్వంసం చేశారు. ఇప్పటికీ రాళ్లు దాడి చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేస్తూనే ఉన్నారు’’ అని మిథున్రెడ్డి ధ్వజమెత్తారు.దాడులు అత్యంత హేయం: ఎంపీ గురుమూర్తితెలుగుదేశం నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లిన మిధున్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు. మిథున్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు.ప్రజాస్వామ్య బద్దంగ ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యునికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు ఏవిధమైన రక్షణ కల్పిస్తుందన్నారు. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తుంటే ఏవిధమైన ఆటవిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని అధికారం శాశ్వతం కాదు అనేది గుర్తుంచుకొంటే బాగుంటుందని ఆయన అన్నారు. నేడు మీ వెనుక ఉండి దాడులకు ప్రోత్సహించే నాయకులూ నాడు ఎవరూ ఉండరు అనేది ఆలోచించించాలని అన్నారు. -
KSR Live Show: టీడీపీ అరాచకం.. అరెస్టుకైనా.. ప్రాణ త్యాగానికైనా సిద్ధం
-
ఎంపీ మిథున్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డిలపై ఆంక్షలు
సాక్షి, తిరుపతి టాస్క్ఫోర్స్: రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పుంగనూరు ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డిని ఆ నియోజకవర్గంలో పర్యటించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. శాంతి భద్రతల పేరుతో వారి పర్యటనలకు అడ్డు చెబుతున్నారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొనడంతో పాటు కూటమి నేతల దాడుల్లో నష్టపోయిన వారిని పరామర్శించి, భరోసా కల్పించాలని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి నిర్ణయించారు.ఆదివారం పార్లమెంట్ సమావేశాలు ఉండవు కాబట్టి ఢిల్లీ నుంచి తిరుపతి చేరుకున్నారు. ఇక్కడి నుంచి పుంగనూరుకు వెళ్లే సమయంలో పోలీసులు ఆదివారం ఆయన నివాసానికి చేరుకుని అక్కడికి వెళ్లడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ఎంపీకి నోటీసులు ఇచ్చేందుకు గోడలు దూకి హడావుడి చేశారు. తిరుపతిలోని వకుళామాత ఆలయానికి కూడా వెళ్లడానికి వీలు లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.పర్యటిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని సాకు చెప్పారు. అంతటితో ఆగని పోలీసులు.. ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని కలిసేందుకు వచ్చిన నియోజకవర్గ ప్రజలను సైతం లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. వంద మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, పెద్దిరెడ్డి నివాసంలోకి ఎవరూ వెళ్లేందుకు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలను కలిసేందుకు కూడా ఒప్పుకోలేదు. ఇదే సమయంలో పుంగనూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పలువురు వైఎస్సార్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. తమ ఆదేశాలను పాటించకపోతే కేసులు పెడతామని బెదిరించారు. నా నియోజకవర్గానికి నేను వెళ్లకూడదా?ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి నేతలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, గతంలో ఎన్నడూ లేని సంస్కృతికి తెరలేపారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో ఆదివారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందన్నారు. నియోజకవర్గంలో ఎలక్ట్రికల్ బస్సు కంపెనీ రాకుండా, పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.ఇన్ని గొడవల నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల ఫ్యాక్టరీ యాజమాన్యం సందిగ్ధంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పుంగనూరుకు ఏ పరిశ్రమలు రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన నియోజక వర్గంలో పర్యటించకుండా, ప్రజల్ని కలవకుండా అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జేసీబీలు తీసుకొచ్చి వైఎస్సార్సీపీ నాయకుల మామిడి తోటలు, ఆస్తులు, కుటుంబ సభ్యుల వాహనాలను ధ్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.నియోజకవర్గంలో పేదల ఆవులు కూడా ఎత్తుకెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తాం. కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణం. మా వారిని పరామర్శించడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటి? నా నియోజకవర్గంలో నేను పర్యటించకూడదా? ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. వైఎస్సార్సీపీకి 40 శాతం మంది ఓటేశారని, వారందరినీ రాష్ట్రం నుంచి తరిమేస్తారా?’ అని నిప్పులు చెరిగారు. అరెస్టుకైనా, ప్రాణ త్యాగానికైనా సిద్ధం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటామని ఎంపీ మిథున్రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారాలని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాను బీజేపీలోకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చల్లా బాబును అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నప్పటికీ, ఇలాంటివి ఎప్పుడూ లేవని, బాబు ట్రాప్లో పడొద్దని హితవు పలికారు. గతంలో పోలీసులపై దాడి చేసిన చల్లా బాబు జైలుకు వెళ్లారన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల కోసం తాను అరెస్టుకైనా, ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మంత్రి పదవిని కాపాడుకోవడానికే రాంప్రసాద్ తమపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు.పుంగనూరులో ఉద్రిక్తత పుంగనూరు: ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీలు తమ సొంత నియోజకవర్గాలలో తిరగరాదని హెచ్చరికలు చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న ఘటనలు ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఆదివారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డి పుంగనూరులో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కూటమి నేతలు పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో ధర్నా చేపట్టి, నల్లజెండాలతో నిరసనకు దిగారు.ఎమ్మెల్యే, ఎంపీలు రాకూడదంటూ దూషణల పర్వం కొనసాగించారు. సుమారు రెండు గంటల సేపు హైడ్రామా సాగింది. ఈ నెల15న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పుంగనూరు పర్యటన సమయంలో కూడా కూటమి నేతలు ఇలాగే అడ్డుకున్నారు. కూటమి నేతల తీరుతో జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పోలీసులు ఎంపీ మిథున్రెడ్డిని తిరుపతిలో హౌస్ అరెస్ట్ చేశామని తెలపడంతో కూటమి శ్రేణులు శాంతించారు. -
రాష్ట్రంలో ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది
-
పుంగనూరుకు పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారు: ఎంపీ మిథున్ రెడ్డి
సాక్షి, తిరుపతి: తిరుపతిలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు ఓవరాక్షన్కు దిగారు. మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంట్లోకి కొత్త వారిని రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.కాగా, ఆదివారం తెల్లవారుజామునుంచే ఎంపీ మిథున్ రెడ్డి నివాసానికి పోలీసులు చేరుకున్నారు. మిథున్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. అనంతరం, ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే, నేడు మిథున్ రెడ్డి పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయనను అడ్డుకునేందుకు ముందస్తుగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎంపీ మిథున్ రెడ్డికి ఏఎస్పీ కులశేఖర్, ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి నోటీసులు ఇచ్చారు.ఇక, మిథున్ రెడ్డి ఇంట్లోకి కొత్త వారిని కూడా పోలీసులు అనుమతించడం లేదు. ఎవరైనా వస్తే వారికి అడ్డుకుంటున్నారు. ప్రజలను కలిసేందుకు కూడా మిథున్ రెడ్డిని అనుమతించడం లేదు. దీంతో, భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ అభిమానులు మిథున్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సీరియస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘గతంలో ఎప్పుడూ లేని విధంగా పేదలు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకుల మామిడి తోటలు, ఆస్తులు, కుటుంబ సభ్యుల వాహనాలు ధ్వంసం చేస్తున్నారు. పుంగనూరు నియోజక వర్గంలో పేదలు ఆవులు ఎత్తుకుని పోతున్నారు. నియోజకవర్గంలో ప్రజల్ని కలవడానికి కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు.నా నియోజకవర్గంలో ప్రజల్ని కలవకుండా అడ్డుకుంటున్నారు.. ఇదే విషయం స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తాను. రాష్ట్రంలో 40 శాతం ప్రజలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారు. వీళ్లందరినీ రాష్ట్రం నుంచి బయటకు పంపించి వేస్తారా?. గతంలో ఎప్పుడూ ఈ సంస్కృతి లేదు. రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాము. పుంగనూరు నియోజక వర్గంపై కక్ష సాధిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎలక్ట్రికల్ బస్ కంపెనీ రాకుండా, పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారు .పదవులు కావాలి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని తిడితే వస్తాయి అనుకుంటున్నారు. టీడీపీ పుంగనూరు ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్తల్ని భయపెడుతున్నారు, భౌతిక దాడులు చేస్తున్నారు. నన్ను చంపినా పర్వాలేదు, మేము ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం’ అని చెప్పారు.అలాగే, బీజేపీలో చేరుతున్నారు అంటూ చేస్తున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మిథున్ రెడ్డి. కొందరు పనిగట్టుకుని నాపై విష ప్రచారం చేస్తున్నారు. పుంగనూరులో ఫ్యాక్షన్ తరహాలో రాజకీయాలు చేస్తున్నారు. పార్టీ మారకుండా కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. జేసీబీలతో ఇళ్లను కూలుస్తున్నారని అన్నారు. -
కూటమి నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారు: మిథున్ రెడ్డి
-
బీజేపీలో చేరాల్సిన ఖర్మ నాకు లేదు: ఎంపీ మిథున్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారు. బీజేపీలో చేరాల్సిన ఖర్మ తనకు లేదన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. అలాగే, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్లో తాను పనిచేస్తానని చెప్పుకొచ్చారు.కాగా, పార్లమెంట్లో ప్రమాణం చేసేందుకు ఎంపీ మిథున్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా పార్లమెంట్ వద్ద మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజంపేట ప్రజల మద్దతుతో మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యాను. హ్యాట్రిక్ విజయాలతో పార్లమెంట్లో అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. మా పార్టీ అధినేత వైఎస్ జగన్కు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్లో పని చేస్తాను.జాతీయ, రాష్ట్ర ప్రయోజనాలు ఉండే బిల్లులకు మద్దతిస్తాం. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే వ్యతిరేకిస్తాం. బీజేపీలో చేరాల్సిన ఖర్మ నాకు లేదు. కూటమి నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారు. గతంలో నేను విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే బీజేపీలో చేరుతానని ప్రచారం చేశారు. వైఎస్ జగన్ నన్ను సొంత తమ్ముడిలా భావిస్తారు. వైఎస్సార్సీపీకి పూర్వవైభవం సాధించే వరకు కష్టపడతాను. రాజంపేటలో అత్యధిక రోడ్డు వేయించిన ఘనత మాదే’ అంటూ కామెంట్స్ చేశారు. -
యథేచ్ఛగా హింసాకాండ.. ఇదేమి రాజ్యం?: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజు లుగా అరాచక శక్తులు సాగిస్తున్న హింసాకాండను చూస్తుంటే టీడీపీ కార్యకర్తలా? గూండాలా? అన్న ప్రశ్న తలెత్తుతోందని వైఎస్సార్ సీపీ ఎంపీలు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేయడంతోపాటు ఇళ్లు, ఆస్తుల విధ్వంసాలకు పాల్ప డటం ఆటవిక చర్యగా అభివర్ణించారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయక ముందే ఇలాంటి దారుణాలు జరిగాయంటే రాబోయే ఐదేళ్లు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చన్నారు. టీడీపీ గూండాల దాడులపై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి, ఎన్హెచ్ఆర్సీ కార్యాలయాల్లో బుధవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందచేసిన అనంతరం వైఎస్సార్ సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్రావు, రఘునాధరెడ్డి, బాబూరావు, తనూజరాణి, గురుమూర్తిలతో కలిసి పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ మూకల దాడులకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఏమన్నారంటే..చంద్రబాబుది ఆటవిక పాలనటీడీపీ అధినేత చంద్రబాబుది ఆటవిక పాలనకు నిదర్శనంగా నిలుస్తోంది. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. టీడీపీ గూండాల అకృత్యాలను రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రంలో చట్టాలు, స్వేచ్ఛ, న్యాయ పాలన లేదు. అన్యాయం రాజ్యమేలుతోంది. కనీసం ఫిర్యాదు తీసుకునేందుకు కూడా అధికారులు జంకడం చంద్రబాబు పాలన ఎలా ఉంటుందో బోధపడుతుంది. ప్రమాణ స్వీకారం కంటే ముందే రాష్ట్రాన్ని అత్యంత భయానక వాతావరణంలోకి నెట్టారు. ఇప్పటి వరకూ ఎన్నో ఎన్నికలు జరిగాయి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్లాయి కానీ ఇలాంటి దుష్ట సంప్రదాయాలకు నాంది పలికింది చంద్రబాబే.ముందే దాడులకు పురిగొల్పి..ఎన్నికల కోడ్ వచ్చిన నాటి నుంచి మొదలైన దాడులు ఫలితాల తర్వాత తీవ్రరూపం దాల్చాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు, మద్దతుదారుల ప్రాణాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని టీడీపీ గూండాలు స్వైర విహారం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అంటేనే గూండాగిరీ అని రుజువు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే దాడులకు పురిగొల్పి చంద్రబాబు బాధ్యత నుంచి తప్పించుకునే ఎత్తుగడ వేశారు. వీటిని అరికట్టాల్సిన పోలీసు వ్యవస్థ నీరుగారిపోయింది. బాధితుల ఆక్రందనలు తమ కుటుంబ సభ్యులివిగానే భావించి ఈ రక్త చరిత్రను అరికట్టాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది.మూడుసార్లూ బీజేపీతో అండతో పీఠం1999, 2014, 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మూడుసార్లూ బీజేపీ సహకారం వల్లే పీఠం దక్కించుకున్నారు. హింసాకాండకు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. భావితరాలకు హింసా సంస్కృతిని నేర్పడం ఎవరూ హర్షించరు. అధికారం అంటే బాధ్యత అని గుర్తుంచుకోవాలి. అధికారం అంటే రౌడీయిజం గూండాయిజం కాదు. బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదలపై టీడీపీ సాగిస్తున్న దౌర్జన్యకాండ సభ్య సమాజం తలదించుకొనేలా ఉంది. యూనివర్సిటీలు, వీసీలపై దాడులు తగవు. అమానవీయ ఘటనలకు పాల్పడడమే కాకుండా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. మంగళగిరిలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజ్కుమార్పై లోకేష్ మనుషులు చేసిన దాడిని సోషల్ మీడియాలో అందరూ చూశారు. బంగారం లాంటి రాష్టం తగలడుతుంటే బాధగా ఉంది. ఏపీలో ఘటనలకు కేంద్రం కూడా తలవంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మీడియాపైనా అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. టీవీ 9, ఎన్టీవీ, సాక్షి తదితర చానెళ్లను ఎంఎస్వోల నుంచి తొలగిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందన్న భావన కలుగుతోంది. ఏపీలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రిని మరోసారి నేరుగా కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై ఫిర్యాదు చేస్తాం.రాష్ట్రం, దేశ ప్రయోజనాలే లక్ష్యంపార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు సంబంధించి రాష్ట్రం, దేశ ప్రయోజనాలే పరమావధిగా వైఎస్సార్సీపీ వ్యవహరిస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. గతంలోనూ అదే రీతిలో బిల్లులకు మద్దతు ఇచ్చామని మీడియా ప్రశ్నలకు సమాధానంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉభయ సభల్లో టీడీపీకి 16 మంది ఎంపీలుండగా వైఎస్సార్ సీపీకి 15 మంది సభ్యులున్నారని చెప్పారు. రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందాలంటే ఎన్డీఏ ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ అవసరం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి అటు టీడీపీ, ఇటు వైఎస్సార్సీపీ అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంట్లో వైఎస్సార్సీపీదే బలమెక్కువ అని తెలిపారు. ఎన్డీఏ కూటమా? ఇండియా కూటమా? అనేది కాకుండా రాష్ట్రం, దేశ ప్రయోజనాలే లక్ష్యంగా బిల్లులకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఎన్డీఏ సంఖ్యాబలం ఆధారంగా కొద్ది మెజారిటీతోనైనా లోక్సభ స్పీకర్ ఎంపిక జరిగిపోతుందని చెప్పారు. ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫైడ్ సివిల్ కోడ్)కి తాము మద్దతు ఇవ్వబోమన్నారు. ఒకే దేశం – ఒకే ఎన్నికలపై తమ పార్టీ అధినేత సూచనలు తీసుకొని ముందుకెళ్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపడతామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, టీఆర్ఎస్.. ఇలా దేశంలో అన్ని పార్టీలతోనూ జత కట్టిన మహానాయకుడు చంద్రబాబు మినహా మరెవరూ లేరని వ్యాఖ్యానించారు. నూతన ప్రభుత్వానిదే బాధ్యత: ఎంపీ మిథున్రెడ్డి రాష్ట్రంలో కొద్ది రోజులుగా చెలరేగుతున్న హింసాత్మక ఘటనలకు నూతన ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఎన్నికల తర్వాత కూడా రాజకీయాలు చేయడం సరికాదు. ప్రజాతీర్పును గౌరవిస్తూ హామీలను నెరవేర్చి చిత్తశుద్ధి చాటుకోవాలి. వైఎస్సార్సీపీకి 40 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. కొత్త ప్రభుత్వం అందరినీ సమాన దృష్టితో చూడాలి.న్యాయ పోరాటం: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతల దారుణ వైఫల్యంపై రాష్ట్రపతి, ప్రధాని, హోంశాఖ, ఎన్హెచ్ఆర్సీలకు ఫిర్యాదు చేశాం. తగిన స్పందన లేకుంటే న్యాయ పోరాటం చేస్తాం. టీడీపీ గూండాయిజం భరించలేక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు నెలకొన్నాయి. కుట్రపూరితంగా ప్రమాణ స్వీకారం కంటే ముందే కార్యకర్తల్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఉసిగొల్పారు. మా కార్యకర్తల్ని కాపాడుకుంటాం. బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటాం. అల్లరి మూకలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఊరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నందున కేంద్రం తక్షణమే స్పందించి శాంతి భద్రతలు పరిరక్షించాలి. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలను పార్లమెంట్ దృష్టికి తెస్తాం. -
టీడీపీ దాడులపై మిధున్ రెడ్డి రియాక్షన్
-
టీడీపీ దొంగ మేనిఫెస్టో నమ్మి ఈసారి ప్రజలు మోసపోరు
-
కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబుపై మిథున్ రెడ్డి సీరియస్ కామెంట్స్
-
Rajampet Lok Sabha: లోకల్ లీడర్ vs గెస్ట్ పొలిటిషన్
అన్నమయ్య: రాజంపేట లోక్సభకు అరుదైనపోరు ఆవిర్భవించింది. ఆరుదశాబ్దాల తర్వాత ఏక సామాజికవర్గం మధ్య లోక్సభ ఎన్నికల రణరంగానికి రాజంపేట వేదికగా మారింది. ఈ లోక్సభపై రాష్ట్రం దృష్టి సారించింది. కారణం కూటమి అభ్యర్థిగా, బీజెపీ నుంచి ఉమ్మడిరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పోటీచేస్తుండగా, ఈ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీ అయిన పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి వైఎస్సార్సీపీ నుంచి బరిలోకి దిగారు. ఇప్పటి వరకు రాజంపేట లోక్సభకు బలిజ,రెడ్డి సామాజికవర్గాలకు చెందిన అభ్యర్థుల మధ్య పోటీ కొనసాగుతూ వచ్చింది. ఈ సారి ఇద్దరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే లోక్సభ ఎన్నికబరిలో ఉండటంతో అరుదైన పోరుగా రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. 1957 నుంచి... రాజంపేట లోక్సభ ఆవిర్భవించిన తర్వాత 1957 నుంచి 2019 వరకు 16 సార్లు జరిగిన ఎన్నికల్లో మొదటి రెండు, చివరి రెండుసార్లు మినహా మొత్తం 12 సార్లు కాపు (బలిజ)లే దక్కించుకున్నారు.ఈ నేపథ్యంలో ప్రధాన అభ్యర్థులుగా ఇద్దరు ఓకే సామాజికవర్గానికి వారు తలపడి 62 సంవత్సరాలు అయింది. 1962 తర్వాత.. 2019 ఎన్నికల్లో బలిజ సామాజికవర్గానికి చెందిన ఆదికేశవులనాయుడు సతీమణి సత్యప్రభతో వైఎస్సార్సీపీ అభ్యర్థి మిథున్రెడ్డి తలపడి గెలుపొందారు. 2014లోనూ బీజెపీ అభ్యర్థి, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై పోటీ చేసి గెలుపొందడం విశేషం. 1962 తర్వాత ఒకే సామాజికవర్గానికి చెందిన అభ్యర్థుల మధ్య పోరు 2024 ఎన్నికల్లో ఆవిష్కృతంకావడంతో రాజంపేట లోక్సభ స్థానం ప్రత్యేకతను సంతరించుకుంది. బహుశా రాష్ట్రంలో కూడా రెండు ప్రధాన పార్టీల నుంచి ఒకే సామాజికవర్గం వారు పోటీ పడిన సందర్భం ఎక్కడా ఉండకపోవచ్చు. 9 సార్లు కాపుల మధ్యే పోరు రాజంపేట లోక్సభ ఏర్పడిన 1957 నుంచి 2019 వరకు ఎన్నికల చరిత్రలోకి వెళితే...ఇప్పటికి 16సార్లు ఎన్నికలు జరిగాయి. తొలి ఎన్నికల్లో 1957లో టీవీఎన్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కాగా , 1962లో ఇండింపెండెట్గా సీవీఎల్రెడ్డి చేతిలో టీవీఎల్ఎన్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమిపాలయ్యారు. అంటే 1962లో ఇద్దరు ఒకే సామాజికవర్గ అభ్యర్థుల మధ్య పోరు జరిగింది. తర్వాత ఈ వర్గానికి మధ్య ఇప్పటి వరకు పోరు జరగలేదు. 1967లో బలిజ సామాజికవర్గానికి చెందిన పార్థసారధి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో ఆయనపై సీఎల్ఎన్రెడ్డి స్వతంత్య్రఅభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1971లో కాంగ్రెస్ అభ్యర్థిగా తిరిగి పోటీ చేసిన పార్థసారధిపై,ఎన్సీవో పార్టీ అభ్యర్ధిగా యశోదరెడ్డి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1977లో మూడోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పార్థసారధి, బీఎల్డీ అభ్యర్ధి తిమ్మారెడ్డి పై పోటీ చేసి గెలుపొందారు. 1980లో నాలుగోసారి పార్థసారధి కాంగ్రెస్(ఐ) అభ్యర్థిగా పోటీచేశారు. ఈ సారి బలిజ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ (యు) అభ్యర్థిగా ఆర్,సభాపతిపై పోటీ చేసి గెలుపొందారు. బలిజసామాజికవర్గానికి చెందిన 1984లో పాలకొండ్రాయుడు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి సాయిప్రతాప్ గెలుపొందారు. 1989లో సాయిప్రతాప్, టీడీపీ నుంచి పోటీ చేసిన సీ.రామచంద్రయ్యపై గెలుపొందారు. 1991లో సాయిప్రతాప్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా, పాలకొండ్రాయుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1996లో సాయిప్రతాప్ కాంగ్రెస్ అభ్యర్థిగా , టీడీపీ అభ్యర్థి పోతురాజు ప్రతాప్పై పోటీ చేసి గెలుపొందారు. 1998లో టీడీపీ అభ్యర్థి గునిపాటిరామయ్యపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1999లో గునిపాటి గెలుపొందారు. అంటే 1977 నుంచి 2004 వరకు జరిగిన తొమ్మిది ఎన్నికల్లో బలిజసామాజికవర్గం అభ్యర్థుల మధ్య పోటీ సాగింది. నాలుగుసార్లే... 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సాయిప్రతాప్ టీడీపీ అభ్యర్థి రమేష్రెడ్డిపై పోటీ చేసి గెలుపొందారు. 2014లో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ పీవీ మిథున్రెడ్డి వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసి ,బీజెపీ అభ్యర్థి పురందేశ్వరిపై గెలుపొందారు. 2019లో మిథున్రెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై పోటీ చేసి గెలుపొందారు. అంటే మొత్తం 67 నుంచి జరిగిన ఎన్నికల్లో నాలుగుసార్లు రెడ్డి, బలిజ అభ్యర్ధుల మధ్య పోటీ జరగ్గా , మిగతా అన్నిసార్లు బలిజ,బలిజల మధ్యే ఎన్నికల పోరు కొనసాగింది. లోక్సభ స్వరూపమిలా.. ఏపీలోని 25 లోక్సభ నియోజకవర్గాల్లో రాజంపేట ఒకటి. ఈ నియోజకవర్గ పరిధి ఆధారంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటుచేశారు. ఇందులో ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో పుంగనూరు నియోజకవర్గం జిల్లాకేంద్రానికి దగ్గరగా ఉండటానికి చిత్తూరు జిల్లాలో కలిపారు. ► మిథున్రెడ్డి, కిరణ్కుమార్రెడ్డి మధ్య పోరు... రాజంపేట సిట్టింగ్ ఎంపీ పీవీ మిథున్రెడ్డి, మాజీ సీఎం నలారి కిరణ్కుమార్రెడ్డి మధ్య పోరు సాగుతోంది.1962లో జరిగిన ఎన్నికల్లో తప్ప ఇప్పటి వరకు రెడ్డి, రెడ్డి మధ్య జరగని పోరు ఈ సారి ఎన్నికల్లో ఆవిష్కృతం కావడంతో రాజంపేట పార్లమెంట్ పోరు అరుదైన ఘట్టంగా మారిందని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
పిఠాపురం లో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు
-
పవన్ కళ్యాణ్ ను ఓడిస్తాం వంగా గీత విజయం తథ్యం
-
పవన్ను పట్టించుకోవాల్సిన పనిలేదు: మిథున్ రెడ్డి
సాక్షి, కాకినాడ: ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారో వారికే ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ మిథున్రెడ్డి. పవన్ కల్యాణ్ను వాళ్ల కేడరే చేరుకోలేదు. ఆయన ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే వంగా గీతను గెలిపించాలని కోరారు. కాగా, మిథున్ రెడ్డి శనివారం మాట్లాడుతూ.. పిఠాపురంలో వంగా గీత బలమైన అభ్యర్థి. పవన్ కల్యాణ్ రాక ముందే ఆమె ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. గతంలో వంగా గీత ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. నిత్యం ప్రజల్లోనే ఉంటారు. ఇబ్బందులు ఉంటే ఎవరు ప్రజల్లో ఉంటారని ప్రజలు కోరుకుంటారు. పిలిస్తే పలికే వ్యక్తులకే ప్రజలు మద్దతు ఇస్తారు. పవన్ కల్యాణ్ను వాళ్ల కేడరే చేరుకోలేరు. ఆయన ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. పిఠాపురంపై మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. 175 నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. పిఠాపురంలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. పిఠాపురంలో కష్టపడాల్సింది పవన్. డబ్బులు తీసుకుని ప్రజలు ఓటు వేయరు. నేను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఇంత వరకు నేను పిఠాపురంలో అడుగుపెట్టింది లేదు. తాను ఓడిపోతే చెప్పుకోడానికి పవన్ కొన్ని కారణాలు వెతుక్కుంటున్నాడు. పవన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డబ్బుల గురించి పవన్ కల్యాణ్ మాట్లాడటం విడ్డూరం ఉంది. డబ్బులు తీసుకుని సీట్లు ఇచ్చిందే పవన్ కల్యాణ్’ అంటూ కౌంటరిచ్చారు. ఈనెల 19వ తేదీన కాకినాడ రూరల్లో మేమంతా సిద్దం సభ ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలో పాల్గొంటారు. రాజకీయాల్లో మేమంతా సిద్ధం యాత్ర ఒక గేమ్ ఛేంజర్. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరుతున్నాం అని అన్నారు. -
ముద్రగడను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు.. పార్టీలోకి ఆహ్వానం
సాక్షి, కాకినాడ: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లి వైఎస్సార్సీపీ నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం, ముద్రగడ నివాసంలోనే ఆయనతో మిథున్ రెడ్డి, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబు, జగ్గంపేట ఇన్ఛార్జ్ తోట నరసింహం భేటీ అయ్యారు. ఇక, వీరి భేటీ అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ముద్రగడను కలిశాం. ఈ సందర్బంగా ముద్రగడను వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించాం. త్వరలోనే ముద్రగడ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. కాపు రిజర్వేషన్ల కోసం గొప్ప ఉద్యమం చేసిన నేత ముద్రగడ. ఆఫర్ల కోసం పార్టీలో చేరే వ్యక్తి కాదు. స్వతహాగా ఆయనే పార్టీలో చేరుతారు. సీఎం జగన్కు పెద్దలను ఎలా గౌరవించాలో తెలుసు. ముద్రగడకు సముచిత స్థానం ఇస్తారు’ అని కామెంట్స్ చేశారు. -
జగన్ పాలన మళ్లీ వస్తేనే ఇంటింటికీ సంక్షేమం
సాక్షి, అమలాపురం: వైఎస్ జగన్ పాలన మళ్లీ వస్తేనే ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతాయని.. టీడీపీ గెలిస్తే అన్నీ ఆగిపోతాయని వైఎస్సార్సీపీ ఉమ్మడి గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. వలంటీర్, సచివాలయాల వ్యవస్థలు లేకుండా పోతాయని.. సచివాలయాలన్నీ జన్మభూమి కమిటీల కార్యాలయాలుగా మారిపోతాయనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం చాకలిపాలెంలో జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగిన సభలో వైఎస్సార్సీపీ కార్యకర్తలతో మిథున్రెడ్డి మాట్లాడారు. ‘ఇంటింటికీ వెళ్లినప్పుడు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చెప్పడంతో పాటు ఆయన మళ్లీ సీఎం కాకపోతే జరిగే నష్టాలను కూడా ప్రజలకు వివరించండి. చంద్రబాబు అధికారంలోకి వస్తే జరిగే అనర్థాలను తెలియజేయండి. జన్మభూమి కమిటీల పెత్తనం మళ్లీ పెరుగుతుందని వివరించండి. వైఎస్ జగన్ పాలన మళ్లీ వస్తేనే ఇంటింటికీ సంక్షేమాభివృద్ధి అందుతుందని తెలియజేయండి’ అని సూచించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. పొత్తుల విషయంలో టీడీపీ, జనసేన గందరగోళంలో ఉన్నాయన్నారు. అభ్యర్థులు ఎవరనేది తేల్చుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పుడు వారి పరిస్థితి చూస్తుంటే ఉమ్మడి గోదావరి జిల్లాలను క్లీన్స్వీప్ చేస్తామనే నమ్మకం తనకు పెరిగిందన్నారు. సీఎం జగన్ కోసం నెల రోజులు కష్టపడితే.. ఆయన మళ్లీ సీఎం అయిన తర్వాత అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటారని చెప్పారు. మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ.. ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని పాచ్చిలు పొత్తు పెట్టుకున్నా.. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న సీఎం జగన్ను ఓడించడం సాధ్యం కాదన్నారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రధానులు, ముఖ్యమంత్రులు ఇప్పటి వరకు ఎవ్వరూ లేరన్నారు. సీఎం జగన్ ఒక్కరే మేనిఫెస్టోలోని ప్రతి హామీనీ నెరవేర్చారని చెప్పారు. సమావేశంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయెల్, కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. -
3న ఏలూరులో ‘సిద్ధం’ బహిరంగ సభ!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం బహిరంగసభ ‘సిద్ధం’కు ఏలూరు ముస్తాబవుతోంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది పార్టీ కేడర్ సభకు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను పార్టీ ముఖ్యులు పరిశీలించారు. గోదావరి జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్కుమార్యాదవ్, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సభా ప్రాంగణంలో ‘సిద్ధం’ పోస్టర్లను ఆవిష్కరించారు. 110 ఎకరాల ప్రాంగణంలో.. ఏలూరు నగర సమీపంలో, దెందులూరు జాతీయ రహదారి వద్ద 110 ఎకరాల స్థలంలో సభావేదిక నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీలు.. కార్యకర్తలందరికీ దగ్గరగా వెళ్లి అభివాదం చేసేందుకు సభా వేదిక నుంచి వాక్వే ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సభా ప్రాంగణం వెనుక భాగంలో హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు. 50 నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది రానున్న క్రమంలో వాహనాల పార్కింగ్తో సహా ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. సభా ప్రాంగణానికి సమీపంలోని దెందులూరు ఊరు ప్రారంభంలో 40 ఎకరాల ప్రాంగణాన్ని, అలాగే సభా ప్రాంగణానికి, ఆటోనగర్కు మధ్యలో 25 ఎకరాల ప్రాంగణం, మరో రెండు పార్కింగ్ స్థలాలు, ఆటోనగర్ లోపల, ఆశ్రం కళాశాల, ఏలూరు ప్రారంభంలోని రియల్ ఎస్టేట్ వెంచర్లో మొత్తం 150 ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించి జిల్లాల వారీగా వచ్చే వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. బుధవారం ఎంపీ మిథున్రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ ఏలూరు జిల్లా రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ‘సిద్ధం’ బహిరంగ సభ జరుగుతుందని, 3న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ సభా ప్రాంగణానికి చేరుకుని పార్టీ కేడర్కు దిశా నిర్దేశం చేస్తారని వివరించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, ఎస్పీ డీ.మేరీప్రశాంతి తదితరులున్నారు. -
షర్మిల దుష్టశక్తుల ట్రాప్ లో పడింది: ఎంపీ మిథున్ రెడ్డి
-
చంద్రబాబు పై మిథున్ రెడ్డి ఫైర్
-
మహబూబ్నగర్లో అరాచక పాలన నడుస్తోంది: మిథున్ రెడ్డి
-
లోకసభ స్పీకర్ స్థానంలో ఎంపీ మిథున్ రెడ్డి...?
-
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఎంపీ మిథున్ రెడ్డి
-
‘నోట్ల రద్దు తుగ్లక్ చర్య అని అప్పుడు విమర్శలు.. ఇప్పుడు నా వల్లే అని బిల్డప్’
సాక్షి, విజయవాడ: గతంలో పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో అదొక తుగ్గక్ చర్య అని విమర్శించిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు రెండు వేల నోట్ల రద్దు తన వల్లే అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎంపీ మిథున్రెడ్డి. ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని తిట్టిన చంద్రబాబు.. ఇప్పుడు పొత్తు కోసం మోదీని పొగుడుతుండటం రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతుందన్నారు. ‘2000 నోట్ల రద్దు తన వల్లే అని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం. నోట్ల రద్దు తుగ్లక్ చర్య అని చంద్రబాబు గతంలో విమర్శించారు చంద్రబాబు. 2000 నోటు ఉపసంహరణ ను మా పార్టీ స్వాగతీస్తోంది. బీజేపీ తో పొత్తు కోసం మోడీ ని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు పొగుడుతున్నాడు. చంద్రబాబు అసహనంతో సీఎం జగన్ బట్టలు, చెప్పుల పై కూడా విమర్శిస్తున్నారు. చంద్రబాబు కొడుకు, భార్య, కోడలు పై ఏనాడైనా సీఎం జగన్ విమర్శ చేశారా..? చంద్రబాబు దిగజారి సీఎం జగన్పై విమర్శలు చేస్తున్నాడు. లింగమనేని ఇంట్లో అద్దె కట్టకుండా చంద్రబాబు ఎందుకు ఉన్నాడు?, లింగమనేని, చంద్రబాబు ఇద్దరు ఈ ఇళ్ళు మాది కాదంటే మరి ఎవరిది..? అమరావతిని 50 వేల ఎకరాల రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లా చంద్రబాబు కలగన్నాడు.టీడీపీ, జనసేన కలిసినా సీఎం జగన్ను ఏమి చెయ్యలేరు. చంద్రబాబుని ఎప్పటికి ప్రజలు నమ్మరు’ అని మిథున్రెడ్డి స్పష్టం చేశారు. -
నారా లోకేష్కు ఎంపీ మిథున్రెడ్డి సవాల్
సాక్షి, తిరుపతి: చంద్రగిరి మండలం తొండవాడలో వైఎస్సార్సీపీ ఆత్మీయ సభ శుక్రవారం నిర్వహించారు. ఎంపీలు మిథున్రెడ్డి, రెడప్ప, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్రెడ్డి మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా అభివృద్ధిపై నారా లోకేష్తో చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. ‘‘దమ్ముంటే ఈ నెల 12న చర్చకు రావాలి. చిత్తూరు జిల్లా డీఎన్ఏ నీలో ఉంటే జిల్లాలో ఏదో ఒక చోట పోటీ చేయాలన్నారు. ‘‘విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి ఆపేస్తాం అంటూ లోకేష్ మాట్లాడుతున్నారు. ప్రజలు కష్టాలు తెలుసుకుని సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. విశాఖ సమ్మిట్లో లక్షలు కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఈ నాలుగేళ్లలో చంద్రగిరి ఎంత అభివృద్ధి జరిగిందో మీకు తెలుసు. కరోనా సమయంలో చెవిరెడ్డి అన్న మీ ఇంటి గడప గడపకు వచ్చి అండగా నిలిచారు’’ అని మిథున్రెడ్డి అన్నారు. ‘‘2014లో డ్వాక్రా, రైతు రుణాలు మాఫీ చేస్తామని టీడీపీ మోసం చేసింది. మోసపూరిత వాగ్ధానాలతో మళ్లీ టీడీపీ నేతలు వస్తున్నారు. వారి మాటలు నమ్మొద్దు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి చెవిరెడ్డి... గత ప్రభుత్వం హయాంలో ఆయనపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తుంటే టీడీపీ నేతలు ఏడుస్తున్నారు. మహిళల అభివృద్ధికి, చదువుకు, పేదల ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తుంటే ఎందుకు వద్దంటున్నారు’’ అంటూ ఎంపీ మిథున్రెడ్డి దుయ్యబట్టారు. చదవండి: సీబీఐ కట్టుకథలు అల్లుతోంది: ఎంపీ అవినాష్రెడ్డి -
ఇంకా అనేక కంపెనీలు ఏపీకి వస్తాయి : ఎంపీ మిథున్ రెడ్డి
-
హోదా ప్రస్తావనేదీ?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన జరిగి దాదాపు పదేళ్లవుతున్నా, ఈ బడ్జెట్లోనూ ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి సంబంధించినంత వరకు నిరాశ ఎదురైందన్నారు. బుధవారం పార్లమెంటులో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. పార్టీ లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఇటీవల విశాఖపట్నం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విభజన హామీలను ప్రస్తావించారని గుర్తుచేశారు. ‘‘పోలవరం నిధుల ఊసూ లేదు.ప్రత్యేక హోదా ప్రస్తావనా లేదు. వెనుకబడిన జిల్లాలకు కేటాయించే నిధుల్లోనూ ప్రగతి లేదు. రైల్వే కారిడార్, స్టీల్ ప్లాంట్కు చేస్తామన్న సాయాన్నీ ప్రస్తావించలేదు. వీటన్నిటిపైనా కేంద్రాన్ని నిలదీస్తాం. బడ్జెట్పై జరిగే చర్చలో కూడా లేవనెత్తుతాం. నర్సింగ్ కాలేజీలు, ఏకలవ్య పాఠశాలలు తదితర అంశాల్లో ఆంధ్రప్రదేశ్కు గరిష్ట ప్రయోజనం రాబట్టడానికి ప్రయత్నిస్తాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుసార్లు కేంద్రానికి స్వయంగా విజ్ఞప్తులు చేసినప్పటికీ పోలవరం నిధుల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం బాధాకరం. ఉచిత బియ్యం, పీఎంఏవై ఇళ్ల కేటాయింపులు పెంచడం వల్ల రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం ఉంది’ అని మిథున్రెడ్డి తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ఏ రంగానికి ఎంత బడ్జెట్ సమకూరుస్తుందో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఎంపీ మోపిదేవి వెంకట రమణ చెప్పారు. ప్రత్యేక హోదా సాధన అనేది వైఎస్సార్సీపీ ప్రధాన అజెండా అని, దీని కోసం చివరి వరకు పోరాడతామని అన్నారు. స్వార్థపూరిత విధానాలతో ఆనాడు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును తాకట్టుపెట్టారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, కేంద్రం సహకారం పొందే విషయంలో నిర్లక్ష్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రంగానికి సంబంధించి ధరల స్థిరీకరణ, ఎగుమతికి ఫ్రీ ట్రేడింగ్ విషయంలో కేంద్రం ఇంకా చొరవ చూపాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వికాసానికి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల సమీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నారని, మార్చిలో విశాఖలో జరిగే ఈ భారీ సదస్సుకి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారాన్ని కోరుతున్నామని చెప్పారు. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేకంగా ఏమీ లేవని ఎంపీ మార్గాని భరత్రామ్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్టంలో కొత్తగా 18 వైద్య కళాశాలలు తీసుకురావాలని చూస్తుంటే కేంద్రం మూడింటికే నిధులిస్తామని చెప్పిందన్నారు. అన్ని కాలేజీలకు నిధులివ్వాలని కోరుతున్నామన్నారు. రైల్వే పరంగా విశాఖపట్నం–విజయవాడకు మూడో లైను ఇవ్వాల్సి ఉందన్నారు. కొవ్వూరు–భద్రాచలం లైను ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉందని, ఈ లైను వల్ల హైదరాబాద్, సికింద్రాబాద్లకు 70 కి.మీ దూరం తగ్గి ప్రయాణికులకు భారం తగ్గుతుందన్నారు. విశాఖపట్నం – చెన్నై, చెన్నై – బెంగళూరు, బెంగళూరు – హైదరాబాద్ కారిడార్లకు నిధులిస్తే 80 జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఇండియ¯న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ను హైదరాబాద్కు ఇచ్చారని, రాష్ట్రానికి ఏదో ఒకటి ఇచ్చి ఉంటే బాగుండేదని అన్నారు. రామాయపట్నం పోర్టుకు కూడా నిధులివ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు యూటర్న్ తీసుకోకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేదన్నారు. మచిలీపట్నంలో వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల మంజూరు చేయడం సంతోషకరమని ఎంపీ బాలశౌరి చెప్పారు. మీడియా సమావేశంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, పోచ బ్రహ్మానందరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎన్.రెడ్డెప్ప, తలారి రంగయ్య, బెల్లాన చంద్రశేఖర్, ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, నందిగం సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కుప్పంలో బోగస్ ఓట్లు.. బయటపడ్డ చంద్రబాబు గుట్టు
-
ఎంపీ మిథున్రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
-
మంత్రి పెద్దిరెడ్డి, మిథున్రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, అన్నమమ్య: మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. సంక్రాంతి పండుగ వేళ బంధువుల ఇంటికి మంత్రి పెద్దిరెడ్డి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్లోని వాహనాన్ని ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. వివరాల ప్రకారం.. రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్ రోడ్డు వద్ద మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు తృటిలో ప్రమాదం తప్పింది. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిల కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుంగనూరు నుండి వీరబల్లిలోని అత్తగారి ఇంటికి వెళ్తుండగా మార్గ మద్యంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వచ్చిన ఓ కారు మిథున్ రెడ్డికి చెందిన కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆ కారు పల్టీలు కొట్టి కిందపడిపోయింది. కాగా, ప్రమాద సమయంలో మంత్రి పెద్దిరెడ్డి కారులో మిథున్ రెడ్డి ఉండటంతో ప్రమాదం తప్పింది. ఇక, ఈ ప్రమాదంలో మిథున్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
మీ ఇద్దరిలో సీఎం అభ్యర్థి ఎవరు?
చిత్తూరు జిల్లా: చంద్రబాబు.. పవన్కల్యాణ్.. ఇద్దరిలో ఎవరు సీఎం అభ్యర్థి అనేది ప్రజలకు స్పష్టం చేయాలని లోక్సభ ప్యానల్ స్పీకర్, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డి ప్రశ్నించారు. సోమవారం పుంగనూరు మున్సిపాలిటీలో ఎంపీ రెండోరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ రెడ్డెప్పతో కలసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఎం అభ్యరి్థగా చెప్పుకునే జనసేన నాయకుడు పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుతో జతకట్టడం సిద్ధాంతాలు లేకపోవడమేనన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ఎత్తుగడలు, పవన్కల్యాణ్ అభిమానులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయన్నారు. పవన్ కల్యాణ్ షోలతో చంద్రబాబుకు జనం ఓట్లు వేయరన్నారు. రాజకీయం సినిమా కాదని.. కాపుల ఓట్ల కోసం చంద్రబాబు వల విసురుతున్నాని చెప్పారు. 2019లో వారిద్దరూ జతకట్టి, కాపుల ఓట్ల కోసం డ్రామాలాడి అభ్యర్థులను నిలబెట్టారని ఎంపీ ఆరోపించారు. రాష్ట్రంలో బాబు, ఆయన దత్త పుత్రుడు ఒక్కటైనా వారికి ఓట్లు పడవని, వారికి తగిన గుణపాఠం నేర్పుతారని స్పష్టంచేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని వారు ఆర్భాటాలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. చంద్రబాబునాయుడు సభలు, ర్యాలీల్లో అమాయకులను బలిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కుప్పం సభకు ఆయన అనుమతి తీసుకోకపోవడం చట్టాన్ని అతిక్రమించడమేనన్నారు. చట్టాన్ని గౌరవించలేని వారు సమాజాన్ని ఏవిధంగా పాలిస్తారని నిలదీశారు. సభలు, రోడ్ షోల నిర్వహణపై ఇచ్చిన జీవోను వాళ్లిదరూ చదవాలని సూచించారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్కల్యాణ్ కూడా సినిమా ఈవెంట్లు అనుమతి పొంది నిర్వహించారని తెలియజేశారు. కుప్పంలో చంద్రబాబు నకిలీ పేషెంట్లకు ఆస్పత్రిలో చికిత్సలు చేయించి షో చేశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు గుర్తించి ఓట్లు వేయమని కోరుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా పాల్గొన్నారు. -
జీవోను చంద్రబాబు, పవన్ తప్పుపట్టడం సిగ్గుచేటు: ఎంపీ మిథున్ రెడ్డి
-
వీజీఎఫ్పై రాష్ట్రానిదే నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం–కాకినాడలో పెట్రోలియం కెమికల్స్, పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (పీసీపీఐఆర్) ఏర్పాటు విషయంలో వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్)పై రాష్ట్రమే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పెట్రోలియం, సహజ వనరులశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. లోక్సభలో గురువారం వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఈ ప్రాజెక్టు ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం, హెచ్పీసీఎల్ 2017లోనే అవగాహన ఒప్పందం చేసుకున్నాయని చెప్పారు. వివరణాత్మక అధ్యయనం తర్వాత ప్రాజెక్టు ఆచరణలోకి తీసుకురావడానికి వీజీఎఫ్ అవసరమని నిర్ధారించారని తెలిపారు. ప్రాజెక్టుకు భారీ మొత్తంలో పెట్టుబడి, రిఫైనరీ, పెట్రో కెమికల్ ప్రాజెక్టును పెంచే పెట్టుబడులు అవసరమని ఏపీ ప్రభుత్వానికి తెలిపామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యపై రాష్ట్రమే తగిన నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. రూ.8,710.72 కోట్ల వినియోగం ప్రధానమంత్రి ఆవాస్ యోజన–అర్బన్ (పీఎంఏవై–యు)కు 2019–20 నుంచి 2021–22 వరకు కేంద్ర సాయంగా రూ.5,800.90 కోట్లు విడుదల చేయగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో రూ.8,710.72 కోట్లు వినియోగించారని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. డిసెంబర్ 12, 2022 వరకు మంజూరైన 20,74,770 ఇళ్లకుగాను 6,56,529 ఇళ్లు పూర్తిచేసి పంపిణీ కూడా చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి ప్రశ్నకు సమాధానమిచ్చారు. విజయవాడ తూర్పు వైపు బైపాస్ నిర్మాణం విజయవాడలో తూర్పువైపు బైపాస్ నిర్మించాలని ఏపీ ప్రభుత్వం కోరిందని కేంద్ర జాతీయ రహదారులు, రహదారి రవాణాశాఖ మంత్రి నితిన్గడ్కరీ తెలిపారు. ప్రతిపాదిత బైపాస్కు సంబంధించిన ప్రభుత్వ స్థలాన్ని ఎన్హెచ్ఏఐకు ఉచితంగా ఇవ్వాలని సూచించామని వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిళ్ల గురుమూర్తి ప్రశ్నకు సమాధానమిచ్చారు. కృష్ణానదిపై ప్రధాన వంతెన నిర్మాణం సహా జాతీయ రహదారి–16లో 40 కిలోమీటర్ల పొడవుతో విజయవాడకు తూర్పు బైపాస్ నిర్మాణం నిమిత్తం వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక అధ్యయనం చేపట్టామన్నారు. విశాఖలో కంటైనర్ టెర్మినల్ నుంచి రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వద్ద ఎన్హెచ్–16 వరకు రోడ్డుకు డీపీఆర్ తయారీ చేపట్టినట్లు తెలిపారు. ఏపీలో 33,955 పబ్లిక్ టాయిలెట్లు ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి నవంబర్ 2022 వరకు 33,955 పబ్లిక్ టాయిలెట్లు నిర్మించినట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. స్వచ్ఛభారత్ మిషన్–అర్బన్లో భాగంగా ఏపీకి రూ.571.33 కోట్లు కేటాయించగా, రూ.559.26 కోట్లు వినియోగించిందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు. స్వచ్ఛభారత్–అర్బన్ 2.0లో రూ.1,413.30 కోట్లు కేటాయించగా, రూ.298.68 కోట్లు రాష్ట్రం క్లెయిమ్ చేసిందని తెలిపారు. నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేయండి సబ్బవరం జంక్షన్ నుంచి నర్సీపట్నం మీదుగా తుని వరకు ఉన్న రాష్ట్ర రహదారిని నాలుగు లేన్ల జాతీయ రహదారిగా మార్చాలని వైఎస్సార్సీపీ ఎంపీ బీవీ సత్యవతి కేంద్ర జాతీయ రహదారులు, రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్గడ్కరీకి వినతిపత్రం ఇచ్చారు. -
మదనపల్లెలో సాగు, తాగునీటి కష్టాలు తీరాయి: ఎంపీ మిథున్రెడ్డి
-
వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తో " స్ట్రెయిట్ టాక్ "
-
చంద్రబాబు పై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్..
-
కేంద్రం కంటే మెరుగ్గానే
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ఆర్థిక పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కంటే మెరుగ్గా ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసేలా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ఎప్పటికీ శ్రీలంకగా మారదు కానీ చంద్రబాబు మాత్రం రాజపక్సలా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. బాబు త్వరలో సింగపూర్ లేదా ఇతర దేశాలకు పరారయ్యే సూచనలున్నాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఆయన సొంత కుటుంబంతోపాటు రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు, మరో వ్యక్తి కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరితే ఇప్పుడు సీఎం జగన్ ఐదు కోట్ల మందికిపైగా మేలు చేస్తున్నారని చెప్పారు. కేంద్రంతోపాటు దేశంలోని పలు ధనిక రాష్ట్రాలు చేసిన అప్పులతో పోల్చుకుంటే ఏపీ చాలా మెరుగైన పరిస్థితుల్లో ఉందని గణాంకాలతో సహా వెల్లడించారు. గురువారం ఢిల్లీలోని ఏపీ భవన్లో పార్టీ లోక్సభా పక్ష నేత పీవీ మిధున్రెడ్డి తదితరులతో కలసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ► ఆంధ్రప్రదేశ్ సమర్థుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పథంలో పురోగమిస్తోంది. 2021–22లో కేంద్ర ప్రభుత్వ అప్పులు–జీడీపీ నిష్పత్తి 57 % కాగా ఏపీలో 32.4% మాత్రమే ఉంది. పంజాబ్ 47%, రాజస్థాన్ 39.8%, పశ్చిమ బెంగాల్ 38.8%, కేరళ 38.3%తో ఏపీ కంటే ముందున్నాయి. ► రుణాలు – జీఎస్డీపీ నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంది. ఏపీ రెవెన్యూ లోటు రూ.8,500 కోట్లు కాగా ద్రవ్యలోటు రూ.25,194.62 కోట్లు. రాష్ట్ర ద్రవ్యలోటు జీఎస్డీపీతో పోల్చుకుంటే 2.1% కన్నా తక్కువే. 15వ ఆర్థిక సంఘం సూచించిన 4.5% పరిమితి కంటే ఇది తక్కువే. ► 2021–22లో కేంద్ర ద్రవ్యలోటు 6.9% కాగా ఏపీ ద్రవ్యలోటు 3.18% మాత్రమే. ► 2019–20లో శ్రీలంక వ్యాపార ఎగుమతులు 12.9 బిలియన్ డాలర్లు కాగా ఏపీ ఎగుమతులు రూ.85,665 కోట్లు. ► 2021లో శ్రీలంక ఎగుమతులు 12 బిలియన్ డాలర్ల వద్దే స్తంభించగా ఏపీ ఎగుమతులు ఏకంగా 62% పెరిగి రూ.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ► 2021–22లో మన దేశానికి వచ్చిన విదేశీ చెల్లింపులు 87 బిలియన్ డాలర్లు కాగా శ్రీలంకకు వచ్చినవి 5.49 బిలియన్ డాలర్లు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన విదేశీ చెల్లింపులు 4.35 బిలియన్ డాలర్లు. విదేశీ చెల్లింపుల రాకతో ఏపీలో సుస్థిర పెరుగుదల నమోదైంది. ► 2015–16లో పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.14.4 లక్షల కోట్లు కాగా 34.91% మాత్రమే రాష్ట్రాలకు వాటాగా ఇచ్చింది. అందులో ఏపీకి వచ్చింది 1.50% మాత్రమే. 2021–22లో కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ఆదాయం రూ.28 లక్షల కోట్లకు పెరిగినా ఏపీకి ఇచ్చిన వాటా 1.32%కి తగ్గిపోయింది. ► కేంద్రం సెస్లు, సర్ చార్జీల ద్వారా తన ఆదాయాన్ని పెంచుకుంటూ రాష్ట్రాలకు వచ్చే ఆదాయాన్ని మాత్రం ప్రణాళికాబద్ధంగా తగ్గిస్తోంది. ► 2014–19 మధ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 60% అధికంగా అప్పులు చేయగా నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు ఏకంగా 117.42% అప్పులు చేసింది. సీఏజీఆర్ (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) అప్పులు చంద్రబాబు హయాంలో 16.8%కి పెరిగాయి. టీడీపీ సర్కారు ఖర్చు చేసిన రూ.1,62,828 కోట్లకు లెక్కలు లేవని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఆ పార్టీ ఎంపీకే పార్లమెంట్లో చెప్పింది. ► 2019–22 మధ్య కేంద్ర ప్రభుత్వం అప్పులు 49.6% పెరగ్గా వైఎస్సార్సీపీ పాలనలో 43% మాత్రమే పెరిగాయి. సీఏజీఆర్ అప్పులు 12.75% మాత్రమే పెరిగాయి. ► కోవిడ్ కష్ట కాలంలో పేదలను ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంది. మూడేళ్లలో వివిధ పథకాల ద్వారా నేరుగా రూ.1.62 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. రాష్ట్రంలో 1.68 కోట్ల కుటుంబాలకు గానూ 1.4 కోట్ల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ► 2020–21లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.10,14,373 కోట్లు కాగా 2021–22 నాటికి రూ.12,01,736కి పెరిగింది. ఈ ఆర్థిక ఏడాది రూ.13,38,575 కోట్లకు చేరుకుంటుందని అంచనా. జీవీఏ (గ్రాస్ వాల్యూ ఎడిషన్ ) రాష్ట్ర విభజన తరువాత అత్యధికంగా 2021–22లో 18.47% పెరిగింది. ► సులభతర వాణిజ్యం (ఈవోడీబీ)లో ఏపీ దేశంలోనే ప్ర«థమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యం: మిథున్రెడ్డి ఏపీ విధానాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. సచివాలయాల వ్యవస్థ, ఆర్బీకేలను కేంద్రం ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. వలంటీర్ వ్యవస్థను చత్తీస్గఢ్, అసోం, యూపీ లాంటి రాష్ట్రాలు అధ్యయనం చేసి ప్రారంభించాయి. వాటర్గ్రిడ్ పథకానికి రూ.9 వేల కోట్ల వ్యయంతో టెండర్లు పిలవగా సీఎం జగన్ సూచనల మేరకు ఎంపీలంతా కృషి చేయడంతో కేంద్రం సానుకూలంగా స్పందించి దాదాపు రూ.4,500 కోట్లు మంజూరు చేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతం, ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా సాగుతో కలుషితమైన ప్రాంతాలకు వాటర్గ్రిడ్ పథకం ద్వారా మేలు జరుగుతుంది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పంచాయతీరాజ్, ఉపాధి హామీ నిధులు పెద్ద ఎత్తున సాధించేందుకు ప్రయత్నిస్తున్నాం. -
టీడీపీ నేతలపై మిథున్ రెడ్డి ఫైర్
-
‘వరికెపూడిశెల’కు పర్యావరణ అనుమతులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: పల్నాడు ప్రాంతానికి నీరందించే వరికెపూడిశెల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపిందర్ యాదవ్ను ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో మంత్రిని కలసి వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికే సంబంధిత డీపీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందని తెలిపారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి గంగలగుంట సమీపంలో నాగార్జున సాగర్ రిజర్వాయర్ ముందు ఉన్న నది ప్రాంతాన్ని.. అనేక అధ్యయనాల తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికి అనువుగా ప్రతిపాదించినట్లు తెలిపారు. సాగర్ రిజర్వాయర్ ఒడ్డున ఉన్న స్థలం, ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన ప్రతిపాదిత జాక్వెల్ పంప్ హౌస్కు నది నీటి ప్రవాహం 10 మీటర్ల వద్ద ఉందని తెలిపారు. ఇది పంట కాలం అంతటా తగినంత నీరు అందుబాటులో ఉండేందుకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ప్రతిపాదిత ప్రాజెక్టు కింద 24,900 ఎకరాల ఆయకట్టు ఉందని వివరించారు. పల్నాడు ప్రాంతంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులిచ్చి సహకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. జలశక్తి మంత్రితో భేటీ.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో మంత్రి అంబటి భేటీ అయ్యారు. బుధవారం లోక్సభలో వైఎస్సార్సీపీ పక్షనేత మిథున్రెడ్డితో కలిసి షెకావత్ను కలిశారు. మంత్రిగా తొలిసారి ఢిల్లీ వచ్చిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కేంద్ర జలశక్తి మంత్రిని కలిసినట్లు అంబటి చెప్పారు. -
పార్టీకి కార్యకర్తలే మూలస్తంభాలు: ఎంపీ మిథున్ రెడ్డి
సాక్షి,రాజంపేట: వైఎస్సార్సీపీకి కార్యకర్తలు, నాయకులే మూలస్తంభాలని రాజంపేట ఎంపీ, లోక్సభ ఫ్లోర్లీడర్ పీవీ మిథున్రెడ్డి అన్నారు. మంగళవారం తోట కన్వెన్షన్ హాలులో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడి నేతృత్వంలో వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే కార్యకర్తలే కీలక సూత్రధారులన్నారు. కార్యకర్తలకు వెన్నంటే ఉంటామన్నారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జెడ్పీచైర్మన్ ఆకేపాటి అమర్నాథ్రెడ్డిలు కూడా నియోజకవర్గంలో కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో తనతోపాటు ముందంజలో ఉంటారన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గడపగడపకు తీసుకెళ్లాలన్నారు. రాజంపేట అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయని, త్వరలో తాను, ఎమ్మెల్యే, జెడ్పీచైర్మన్ సీఎంను కలిసి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ మేనిఫెస్టోలోని హామీలను మూడేళ్లలో తొంభై ఐదుశాతానికి పైగా అమలు చేసిన సీఎం జగన్కు, ఎన్నికల అనంతరం మేనిఫెస్టోను ఆన్లైన్లో తొలగించిన చంద్రబాబుకు పోలిక ఎక్కడ అని ప్రశ్నించారు. ప్రజలను ఓట్లు అడిగే హక్కు వైఎస్సార్సీపీకే ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామన్నారు. టీడీపీకి దుష్టచతుష్టయం, ఎల్లోమీడియా మద్దతు ఉంటే వైఎస్సార్సీపీకి ప్రజల మద్దతు ఉందన్నారు. పార్టీ కన్నతల్లి లాంటిదని, ఊపిరి ఉన్నంతవరకు వైఎస్సార్సీపీ జెండా కిందనే జీవిద్దామని కార్యకర్తలకు, నాయకులకు గడికోట పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టంతోనే జెండా రెపరెపలు రైల్వేకోడూరు అర్బన్: కార్యకర్తలు, వైఎస్ అభిమానులు, నాయకుల కష్టంతోనే వైఎస్సార్సీపీ ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించి పార్టీ జెండా రెపరెపలాడుతోందని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. రైల్వేకోడూరులో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారన్నారు. వారి కష్టాన్ని పార్టీ ఎప్పటికీ విస్మరించదన్నారు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ డీవీ సాఫ్ట్వేర్ కంపెనీకి శ్రీకారం
పెనుమూరు(చిత్తూరు): ఏపీలో రూ.50 కోట్లతో స్మార్ట్ డీవీ సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లె పంచాయతీ కొటార్లపల్లె వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీకి గురువారం ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణస్వామి, ఎంపీలు మిథున్రెడ్డి, రెడ్డప్పలు ఆర్టీసీ ఉపాధ్యక్షుడు విజయానందరెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. నారాయణస్వామి మాట్లాడుతూ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదన్నారు. ఎంపీలు మిథున్రెడ్డి, రెడ్డప్పలు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం రాయితీలిస్తోందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ, మెడికల్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. డీవీ గ్రూప్ కంపెనీ చైర్మన్ దీపక్కుమార్ తాల మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో 3,000 మందికి ఉపాధి కల్పనే తమ కంపెనీ ఏర్పాటు వెనుక ముఖ్యోద్దేశమన్నారు. -
భారత యూనివర్శటీలో చేర్చుకోవాలి: ఎంపీ మిథున్ రెడ్డి
-
సీఎం జగన్ చొరవతో తంబళ్ళపల్లికి మహర్ధశ
-
గడ్కరీతో మంత్రి శంకరనారాయణ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ సమావేశమయ్యారు. ఢిల్లీలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్సభ పక్ష నేత మిథున్రెడ్డి, ఎంపీ మార్గాని భరత్తో కలిసి గడ్కరీని కలిశారు. అనంతరం మంత్రి శంకరనారాయణ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ తూర్పు బైపాస్, విశాఖ–భోగాపురం ఎయిర్పోర్టుకు ఆరు లేన్ల రహదారి, కడప–రేణిగుంట రహదారి నిర్మాణాలకు అవసరమైన నిధుల గురించి గడ్కరీకి విజ్ఞప్తి చేశామని తెలిపారు. అనంతపురం, చిత్తూరుతోపాటు ఇతర జిల్లాల్లోని ముఖ్యమైన అంతర్రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కోరామన్నారు. తాము కోరిన అన్నింటికీ కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. -
అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత బీజేపీపైనే ఉంది: మిథున్రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీ విభజన అడ్డగోలుగా చేశారని.. కాబట్టే కాంగ్రెస్ను ప్రజలు సమాధి చేశారని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ, అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత బీజేపీపైనే ఉందన్నారు. విభజన చట్టంలో హామీలన్నీ తక్షణమే అమలు చేయాలన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం హామీలు నిలబెట్టుకోవాలన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తాము మొదటి నుంచి చెబుతున్న విషయాన్ని ప్రధాని ఈరోజు చెప్పారన్నారు. టీడీపీ రాష్ట్రాభివృద్ధి వదిలేసి పనికిమాలిన ఫిర్యాదులు చేస్తోందని.. రాష్ట్రాభివృద్ధిని టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఎంపీ మిథున్రెడ్డి నిప్పులు చెరిగారు. చదవండి: ఏపీ విభజనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు -
TDP ని కాపాడేందుకు చంద్రబాబు ముందస్తు డ్రామా ఆడుతున్నారు
-
‘గతంలో అర్హత ఉన్నా జన్మభూమి కమిటీ చెబితేనే పెన్షన్ ఇచ్చేవారు’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ను 2500 రూపాయలకు పెంచారని వైఎస్సార్సీపీ ఎంపీ వెంకట మిథున్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం అందుతుందన్నారు. ఈ మేరకు ఎంపీ చిత్తూరులో ఆదివారం మాట్లాడుతూ.. ఎవరి రికమెండేషన్ లేకుండానే పథకాలు ఇంటిటికీ చేరుతున్నాయన్నారు. గతంలో అర్హత ఉన్నా కూడా జన్మభూమి కమిటీ చెబితేనే పెన్షన్ ఇచ్చేవారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు మాత్రమే టీడీపీ పెన్షన్ పెంచిందని దుయ్యబట్టారు. పిల్లలు అందరూ చదువుకుని ప్రయోజకవంతులు అవ్వాలనేదే సీఎం జగన్ ఉద్దేశ్యమని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు, అప్పుడే కుటుంబాలు బాగుపడుతాయనేది ఆయన ఆలోచన అని కొనియాడారు. అందుకే పెచ్చులు ఊడిపోయే పాఠశాలలను నాడు-నేడుతో అబివృద్ది చేశారని, పిల్లలకు యూనిఫాం, భోజనం, అమ్మ ఒడి ఇస్తున్నారని పేర్కొన్నారు. తెలుగులో చదివి ఢిల్లీలో ఉద్యోగం కావాలంటే కష్టమని అందుకే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష మీడియా తీసుకొచ్చామని చెప్పారు. చదవండి: బయపరెడ్డీ అని కేక వేస్తే.. ఒకరు కాదు.. పది మంది వస్తారు.. ఎందుకంటే? ‘చంద్రబాబు మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి కానీ పెద్దవాళ్ళ పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలా? చిన్న పిల్లలకు ఎవ్వరికీ ఓట్లు లేవు, కేవలం అందరి జీవితాల్లో మార్పు కోసమే ఈ పథకాలు. ప్రతి పథకం మహిళలకు అందిస్తున్నారు, ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలు అమలు చేస్తున్నారు. పేద ప్రజలకు సహాయం చేస్తే చంద్రబాబుకు వచ్చే బాధ ఏంటి?. గతంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాం అని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. సీఎం జగన్ ఒక మాట చెపితే దానికి కట్టుబడి ఉంటారు. పేదలకు ఇళ్ళు లేవని ఇప్పుడు గృహ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. ’ అని ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. చదవండి: ఛీ ఛీ పార్టీ ఆఫీస్లో ఇదేం పని.. బీజేపీ నేతల వీడియో వైరల్ -
పెండింగ్ నిధులు విడుదల చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు వైఎస్సార్సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీలు మిథున్రెడ్డి, వంగా గీత, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. నిధులు ఎప్పటికప్పుడు విడుదలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుల్లో అసమానత తొలగించండి రెండు రాష్ట్రాల జీఎస్డీపీ భిన్నంగా ఉన్నప్పటికీ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కార్డుల అమలులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను ఒకేలా పరిగణిస్తున్నారని, అసమానతలు తొలగించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్కు వైఎస్సార్సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, తలారి రంగయ్య, చింతా అనూరాధ, బి.వి.సత్యవతిలతో కూడిన బృందం బుధవారం కేంద్రమంత్రితో భేటీ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆమోదించిన ఎన్ఎఫ్ఎస్ఏ ఫార్ములానే ఇంకా అనుసరిస్తున్నారని ఎంపీలు చెప్పారు. దాన్ని మార్చాలని కోరారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు. ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుల వ్యవహారం పలుసార్లు కేంద్రం దృష్టికి తీసుకొచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుల వ్యత్యాసంపై దృష్టి సారించి వెంటనే సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. 2021 జనాభా లెక్కల తర్వాతే ఎన్ఎఫ్ఎస్ఏ నిష్పత్తిని సవరిస్తామని కేంద్రమంత్రి వారికి తెలిపారు. అరకు–భద్రాచలం రైల్వే లైను ఏర్పాటు చేయండి అరకు–భద్రాచలం రైల్వే లైను ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు వైఎస్సార్సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి విజ్ఞప్తి చేశారు. ఎంపీలు మార్గాని భరత్రామ్, చింతా అనూరాధ, వంగా గీతతో కలిసి ఆమె రైల్వే మంత్రితో సమావేశమయ్యారు. అరకు నుంచి పాడేరు మీదుగా భద్రాచలం రైల్వే లైను ఉత్తరాంధ్రకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు సాకారమయ్యేలా చొరవ చూపాలని కోరారు. ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు ఎంతోమంది పర్యాటకులను ఆకర్షిస్తోందని, రైల్వేస్టేషన్ సుందరీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆయా అంశాలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని అనంతరం ఎంపీ మాధవి తెలిపారు. ప్రధానిని కలిసిన ఎంపీలు పార్లమెంటు శీతాకాల సమావేశాల ముగింపు అనంతరం ప్రధాని నరేంద్రమోదీని వైఎస్సార్సీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డి, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎన్.రెడ్డెప్ప, గోరంట్ల మాధవ్, వంగా గీత, బి.వి.సత్యవతి, చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి తదితరులు ప్రధానమంత్రిని కలిశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలసిన వైఎస్సార్సీపీ ఎంపీల బృందం -
ఎంపీ ప్రత్యేక చొరవ.. సౌదీలో చిక్కుకున్న బాధితులకు విముక్తి
సాక్షి, వైస్సార్ కడప: సౌదీలో యజమాని చెరలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైఎస్సార్ కడప వాసులకు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి విముక్తి కల్పించారు. కడపకు చెందిన గొరెంట్ల రమణయ్య, సతీష్ చౌదరి ఆరేళ్ల క్రితం బతుకుదెరువు కోసం సౌదీవెళ్లారు. ఆ తర్వాత సౌదీ యజమాని వారి నుంచి పాస్పోర్టులు లాక్కొని సరైన ఆహరం పెట్టకుండా పొలం పనులు చేయిస్తూ చిత్రహింసలకు గురిచేశారు. ఈ మేరకు బాధితుల కుటుంబ సభ్యులు తమవారి బాధను ఎంపీ మిథున్రెడ్డికి తెలియజేశారు. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని విదేశాంగశాఖ దృష్టికి తీసుకెళ్లారు. విదేశాంగశాఖ అధికారులు బాధితులకు రావాల్సిన జీతం డబ్బులు ఇప్పించి, త్వరలోనే తిరిగి వారి స్వస్థలాలకు చేరేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎంపీ మిథున్రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చదవండి: భార్యపై అనుమానం.. వివస్త్రను చేసి.. తాడుతో బిగించి -
ప్రత్యేక హోదా ఎందుకివ్వరు?
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎందుకివ్వరని మంగళవారం పార్లమెంటులో వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లోక్సభలో వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత పి.వి.మిథున్రెడ్డి, రాజ్యసభలో పార్టీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని కోరారు. లోక్సభలో డిమాండ్స్, గ్రాంట్స్పై జరిగిన చర్చలో మిథున్రెడ్డి మాట్లాడుతూ యూపీఏ, ఎన్డీయే కలిసి రాష్ట్రాన్ని విభజించాయని గుర్తుచేశారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నాటి ప్రధాని మన్మోహన్, ప్రస్తుత ప్రధాని మోదీ సభలోను, బయట ఇచ్చిన హోదా హామీ నెరవేర్చాలని కోరారు. విభజన సమయంలో తెలంగాణ కన్నా ఏపీ తలసరి ఆదాయం తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. విభజన చట్టం అమలు పదేళ్ల కాలంలో ఇప్పటికి ఎనిమిదేళ్లు ముగిసిందని చాలా హామీలు నెరవేర్చాల్సి ఉందని చెప్పారు. విభజన హామీల అమలు తీరు.. ఒక రాష్ట్రానికి సాయం చేయడానికి ఓ రాజు పలువురు తెలివైనవారి సలహాలు తీసుకుని పులిని చేయబోయి పిల్లిని ఆవిష్కరించినట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లు గడిచినా పోలవరం ప్రాజెక్టు, పెట్రోకారిడార్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, వెనకబడిన జిల్లాల గ్రాంటు ఇలా పలు అంశాల్లో రాష్ట్రం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. విభజన సమయంలో ఎన్డీయే, యూపీఏ రెండూ రాష్ట్రానికి హామీలిచ్చాయని గుర్తుచేశారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో కేంద్రం రాష్ట్రానికి సహకరించాలని కోరారు. పోలవరాన్ని ఇరిగేషన్, తాగునీరు..అంటూ వేరుచేయడం సరికాదు పోలవరం ప్రాజెక్టుకు నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే 194 టీఎంసీలతో డిజైన్ రూపొందించారని గుర్తుచేశారు. ప్రాజెక్టును విభజన చట్టం రాకముందే మొదలు పెట్టారన్నారు. విభజన చట్టంలో పోలవరానికి జాతీయ హోదా ప్రకటిస్తూ.. కేంద్రమే పూర్తిచేస్తుందని, అన్ని అనుమతులు ఇచ్చి పునరావసం పరిహారం సహా అన్నింటినీ నెరవేరుస్తామని చెప్పి ఇప్పుడు చేయకపోవడం బాధాకరమని చెప్పారు. సవరించిన అంచనాలకు సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపిందని, దీన్ని కేబినెట్ ఆమోదించాలని కోరారు. నాడు ఎన్డీయే ప్రభుత్వం, టీడీపీల మధ్య ఏం జరిగిందో అనవసరమని రాష్ట్రానికి నిర్మాణ బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తిగాక ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇరిగేషన్, తాగునీరు కాంపొనెంట్ అంటూ వేరుచేయడం సరికాదన్నారు. సవరించిన అంచనా రూ.55 వేల కోట్లకు అనుమతించినప్పుడే ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందన్నారు. ఇవ్వాల్సిన రూ.1,700 కోట్లు వెంటనే విడుదల చేయాలి ఏపీలో పౌరసరఫరాలకు ఇవ్వాల్సిన రూ.1,700 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ విషయంలో కాగ్ ఆడిట్ చేసి చెప్పిన విధంగా రాష్ట్రానికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంపై ఇటీవల భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని, తక్షణ సాయంగా రూ.వెయ్యికోట్లు విడుదల చేయాలని కోరారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని, కేంద్ర ప్రభుత్వమే ఈ పరిశ్రమను నడిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన 13 వైద్య కళాశాలలకు సాయం చేయాలని కోరారు. నియోజకవర్గంలో అభివృద్ధి నిమిత్తం సభ్యులకు ఎంపీలాడ్స్ నిధులు పెంచాలని మిథున్రెడ్డి కోరగా పలువురు సభ్యులు బల్లలు చరిచి మద్దతు తెలిపారు. విభజన హామీల అమలుకు గడువు రెండేళ్లే ఉన్నందున ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం సానుభూతి చూపించాలని ఆయన కోరారు. ఏపీ ఆర్థికంగా నష్టపోయింది రాజ్యసభ జీరో అవర్లో ఎంపీ సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ.. విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా నష్టపోయిందని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. -
AP: రైల్వే జోన్ కార్యకలాపాలు వెంటనే ప్రారంభిస్తాం: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్సభాపక్ష నేత పీవీ మిథున్ రెడ్డి శుక్రవారం పార్లమెంట్లోని మంత్రి కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా కార్యకలాపాలను ప్రారంభించడంలో విపరీతమైన జాప్యం జరుగుతోందని వారు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి వెంటనే విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసేలా వైఎస్సార్సీపీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి తెలిపారు. కాగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ను వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు కలిశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పెండింగ్లో ఉన్న రూ.4,157 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు. పీజీ వైద్యుల కొరతను పరిష్కరించాలి కాగా, పీజీ మెడికల్కు సంబంధించి భారత్, నేపాల్ మధ్య ఎంవోయూ కుదిరితే దేశంలో పీజీ వైద్యుల కొరత చాలా వరకు పరిష్కారమవుతుందని మిథున్రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. శుక్రవారం వారిద్దరూ కేంద్ర ఆరోగ్య, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసి ఈ అంశంపై వినతిపత్రం సమర్పించారు. ఎరువుల కేటాయింపులు ఏపీ రైతుల అవసరాలకు సరిపోవట్లేదని, అందువల్ల ఏపీకి కేటాయింపులు పెంచాలని విన్నవించారు. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు పరిష్కారం కనుగొనాలి రాజ్యసభలో విజయసాయిరెడ్డి వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తక్షణం శాస్త్రీయ పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. వాయు కాలుష్యంపై శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ సభ్యుల తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దేశంలో రెండు దశాబ్దాలుగా గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతోందన్నారు. ఇందుకు దారి తీస్తున్న కారణాలేమిటో విశ్లేషించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు రూ.639 కోట్లతో క్లీన్ ఎయిర్ ఏపీ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. విద్యుత్ వాహనాల తయారీ రంగంలో 2024 నాటికి రూ.30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. తద్వారా 60 వేల ఉద్యోగాల కల్పనతోపాటు ఏటా 10 లక్షల విద్యుత్ వాహనాల తయారీకి ప్రణాళిక చేసిందన్నారు. కాగా, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్ దంపతులకు విజయసాయిరెడ్డి, ఎంపీ వంగా గీత ఘన నివాళులు అర్పించారు. న్యూఢిల్లీలోని కామ్రాజ్ మార్గ్లో ఉంచిన బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక పార్థివ దేహాల వద్ద శుక్రవారం పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. -
రఘురామ కేసులపై విచారణ వేగవంతం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై నమోదైన కేసులపై కేంద్రం విచారణను వేగవంతం చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనపై నమోదైన సీబీఐ కేసుల దర్యాపును ముమ్మరం చేయాలని కోరారు. సోమవారం లోక్సభ జీరోఅవర్లో రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ రాజధాని సాధనకు పాదయాత్ర చేస్తున్న రైతుల పట్ల ఏపీ ప్రభుత్వ పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. రఘురామ వ్యాఖ్యలను మిథున్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘రఘురామ రెండు సీబీఐ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. కేసుల నుంచి బయటపడేందుకు కేంద్రంలోని అధికార బీజేపీలో చేరాలనుకుంటున్నారు. బ్యాంకులను రూ.వేలకోట్లు మోసం చేసిన కేసుల నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఆయనపై ఉన్న కేసుల విచారణను కేంద్రం ప్రభుత్వం వేగవంతం చేయాలి. దర్యాప్తు వేగిరంగా పూర్తిచేయాలి’ అని కోరారు. వరదసాయం కింద రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలి: మార్గాని భరత్ ఇటీవల వరద కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం స్పెషల్ గ్రాంటు కింద తక్షణమే రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ కోరారు. జీరోఅవర్లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇటీవలి వరదలతో రాష్ట్రంలో రూ.6 వేలకోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం కేంద్రంపై ఉందన్నారు. కిసాన్రైల్ రాయితీని రూ.150 కోట్లకు పెంచండి: చంద్రశేఖర్ కరోనా మహమ్మారి సమయంలో రైతులకు అండగా నిలిచేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కిసాన్రైల్ సేవలకు ప్రభుత్వం ఏటా ఇస్తున్న రాయితీని రూ.50 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పెంచాలని వైఎస్సార్సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కేంద్రాన్ని కోరారు. ఆయన లోక్సభలో మాట్లాడుతూ రవాణా ఖర్చును టన్నుకు రూ.వెయ్యి, ప్రయాణ సమయాన్ని దాదాపు 15 గంటలు తగ్గించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ సేవలు ప్రయోజనం కలిగిస్తున్నాయని చెప్పారు. దిశ బిల్లు త్వరగా ఆమోదించండి: వంగా గీత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన దిశ బిల్లును త్వరితగతిన ఆమోదించి మహిళలు, బాలికలకు భరోసా కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఏపీ దిశ బిల్లు ఒక మైలురాయిగా పేర్కొంటూ 2019లో శాసనసభ ఆమోదించిందని చెప్పారు. మహిళలు,బాలికలపై జరిగే లైంగిక నేరాలకు సంబంధించి ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తిచేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును కేంద్రం ఆమోదించాలన్నారు. ఇటువంటి కేసుల్లో సత్వర న్యాయం, కఠిన శిక్షల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా ఈ బిల్లులో ప్రతిపాదనలున్నాయని చెప్పారు. వీటన్నింటని పరిగణనలోకి తీసుకుని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తదుపరి చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
నారా లోకేష్ పై ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆగ్రహం
-
సీఎం జగన్ చేసిన సంక్షేమ పాలనే వైఎస్ఆర్ సీపీని గెలిపిస్తుంది
-
వాతావరణ సమతుల్యతను కాపాడాలి
పీలేరు(చిత్తూరు జిల్లా): ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను కాపాడి, తద్వారా ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి సూచించారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో స్కాట్లాండ్లో శుక్రవారం నిర్వహించిన గ్లాస్గో సదస్సులో మిథున్రెడ్డి ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కరోనా వ్యాప్తికి ముందు, తరువాత ప్రపంచంలో జరిగిన మార్పులపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేయాలని కోరారు. -
కుప్పం ప్రజలకు చంద్రబాబు అన్యాయం చేశారు
-
'పవన్ కల్యాణ్ కులాల్ని రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారు'
సాక్షి, తిరుపతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కులాల మధ్య చిచ్చురేపుతున్నారంటూ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'పవన్ కల్యాణ్ కులాల్ని రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఆయనకు కనిపించడం లేదు. సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి మ్యానిఫెస్టోలోని హామీలను అమలుపరచడం పవన్కు కనిపించడం లేదా?. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు తీవ్ర అన్యాయం చేసింది. గత ప్రభుత్వంలో సోమల, సదుం మండలాల్లో భూముల రికార్డులు టాంపరింగ్, అక్రమాలు జరిగాయి. సీఐడీ విచారణలో అక్రమాలు వెలుగులోకి వస్తాయి' అని ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. చదవండి: (ప్యాకేజీ పెంచుకునేందుకే శ్రమదానం) -
కువైట్లో ఎంపీ మిథున్రెడ్డి జన్మదిన వేడుకలు
యువనేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మిథున్ రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో కువైట్, ఆంధ్రప్రదేశ్లలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మిథున్ రెడ్డి సేవా సమితి, కువైట్ అధ్యక్షులు గోవిందు నాగరాజు, కో కన్వీనర్ షేక్ రహంతుల్లా ఇతర సభ్యులు యస్ లక్ష్మిప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ జాబ్రీయాలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. వివిధ కమిటీల ఇన్ఛార్జీలు, నాయకులు , కార్యకర్తలు, అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. - వైఎస్సార్ కడప జిల్లా పెనగలూరు మండలం చక్రంపేట ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు జామెట్రీ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, షేక్ ఇంతియాజ్, చక్రంపేట మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. - పుల్లంపేట పార్టీ ఆఫీసు నందు కేక్ కటింగ్ చేయడం జరిగింది... ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యూత్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. - తిరుపతిలోని మనో వికాస్ ఆశ్రమంలో అన్నదానం చేశారు. చదవండి : టీప్యాడ్ ఆధ్వర్యంలో డల్లాస్లో రక్తదాన శిబిరం -
‘ఆంగ్ల బోధనపై చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటు’
-
‘ఆంగ్ల బోధనపై చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటు’
సాక్షి, చిత్తూరు: ఆంగ్ల బోధనపై చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కొడుకు లోకేష్ ఏ మీడియంలో చదివాడో చెప్పాలని నిలదీశారు. ఇప్పుడు లోకేష్ కొడుకు ఏ మీడియంలో చదువుతున్నాడో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు కొడుకు, మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవొచ్చు.. కానీ పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా అని నిలదీశారు. విద్యకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎంపీ మిథున్రెడ్డి గుర్తుచేశారు. చదవండి: ‘టీడీపీ అండ్ కో పిచ్చి మాటలు మానుకోవాలి’ -
ఆఫ్గాన్లో తాజా పరిస్థితులను వివరించిన విదేశాంగశాఖ
-
ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై అఖిలపక్ష సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్లో నెలకొన్న పరిణామాలపై గురువారం అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. విదేశాంగ మంత్రి జయశంకర్ ఆఫ్ఘనిస్తాన్లో పరిణామాలను ఫ్లోర్ లీడర్లకు వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేవానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్షనేత, ఎంపీ మిథున్రెడ్డి హాజరయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ని భారతీయులను, మైనారిటీ హిందువులు, సిక్కులను తరలించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరింస్తున్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో భారత్పై పడే ప్రభావంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. చదవండి: దేశంలో కొత్తగా 46,164 కరోనా కేసులు -
తిరుచానూరు ఆలయంలో లోక్సభ స్పీకర్ ఓంబిర్లా
తిరుపతి: లోక్సభ స్పీకర్ ఓంబిర్లా రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి, డాక్టర్ గురుమూర్తి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా తిరుచానూరు పద్మావతి ఆలయానికి చేరుకున్నారు. స్పీకర్కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానం పలికారు. -
కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ మిథున్ రెడ్డి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఎంపీ మిథున్రెడ్డి బుధవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ను కలిశారు. ఈ నేపథ్యంలో.. ఏపీకి ప్రత్యేకంగా యూరియాను కేటాయించాలని విజ్జప్తి చేశారు. అదే విధంగా, ఎఫ్బీవోల ఏర్పాటుకు ఏపీఎండీసీ సంస్థను ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా గుర్తించాలని కోరారు. కాగా, ఏపీలో జాతీయ వ్యవసాయ వర్శిటీని ఏర్పాటు చేయాలని ఎంపీ మిథున్రెడ్డి కోరారు. -
పెగాసస్ అంశంపై చర్చకు విపక్షాల పట్టు
-
జీఎస్టీ చెల్లింపులు త్వరితగతిన చెల్లించాలి: ఎంపీ మిథున్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం పార్లమెంట్ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాజెక్ట్లు చేస్తున్న ఎంఎస్ఎంఈల బకాయిలు చెల్లించాలని, ఇందులో ఆలస్యం కారణంగా ఎంఎస్ఎంఈలు జీఎస్టీ కట్టలేకపోతున్నాయంటూ వివరించారు. రాష్ట్రానికి జీఎస్టీ చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ చెల్లింపులు త్వరితగతిన చెల్లించాలని ఆయన కోరారు. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. ఎంఎస్ఎంఈల బకాయిలు 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించామని పేర్కొన్నారు. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని సమాధానమిచ్చారు. ఇక జూలై 19(సోమవారం) నుంచి 17వ లోక్సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు మొత్తం 19 రోజుల పాటు జరగనున్నాయి. -
ఏపీ పట్ల ఎందుకింత పక్షపాతం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను అఖిలపక్ష సమావేశం సాక్షిగా వైఎస్సార్సీపీ ఎండగట్టింది. అధికారంలోకి రావడానికి ఎంతకైనా దిగజారతారా అని ప్రశ్నించింది. ఏపీ పట్ల అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు, సవతితల్లి ప్రేమ, మొండిచెయ్యి చూపడం మానుకోవాలని హితవు పలికింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో న్యూఢిల్లీలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ద్వంద్వ ప్రమాణాలను నిలదీశారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర సమస్యలపై చర్చించడానికి సమయం ఇవ్వకపోతే ప్రొటెస్ట్ చేయడానికి వెనకాడబోమన్నారు. అనంతరం విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి మీడియాతో మాట్లాడారు. 29 నెలలుగా పోలవరం పునరావాస ప్యాకేజీ పెండింగ్ పోలవరం సాగునీటి ప్రాజెక్టు పునరావాసం పరిహారం ప్యాకేజీ 29 నెలలుగా పెండింగ్లో ఉందని విజయసాయిరెడ్డి మీడియాతో చెప్పారు. ‘రాష్ట్రానికి రూ.55,657 కోట్లు ఇవ్వకుండా కేంద్రం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తోంది. సాంకేతిక అనుమతులిచ్చినా పెండింగ్లో ఉంచడం రాష్ట్రానికి ద్రోహం అనడంలో సందేహం లేదు. విశాఖ ఉక్కు దేశ ఆస్తి. దాన్ని అమ్మే అధికారం ప్రభుత్వానికి ఉండదు. విశాఖ ఉక్కుపై తాము చేసిన 3 సూచనలు అమలు చేయకపోతే.. ఏదైనా ప్రభుత్వరంగ సంస్థలో విలీనం చేయాలని కోరాం. 8 ఏళ్లయినా విభజన హామీలు నెరవేరలేదు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వడంపై సమావేశంలో ప్రస్తావించాం. ఇటీవల పుదుచ్చేరి ఎన్నికల సమయంలో బీజేపీ మేనిఫెస్టోలో ప్రత్యేకహోదా చేర్చారు. ఇదెలా సాధ్యం? అధికారంలోకి రావడానికి బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది. విభజన చట్టం అమల్లోకి వచ్చి ఎనిమిదేళ్లయినా చాలా హామీలు నెరవేరలేదు. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కోరాం. బియ్యం రాయితీ రూ.5,056 కోట్లు, ఉపాధి నిధులు రూ.6,750 కోట్లు వెంటనే విడుదల చేయాలని, వంశధార ట్రిబ్యునల్ తీర్పును గెజిట్ నోటిఫై చేయాలని, పెండింగ్లో ఉన్న దిశ బిల్లు వెంటనే క్లియర్ చేయాలని కోరాం. 2016 నుంచి 2018 వరకు విద్యుత్ సరఫరా చేసినందుకు తెలంగాణ నుంచి ఏపీకి రూ.6,112 కోట్లు రావాలని, ఆ రాష్ట్రం చెల్లించని నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్పాం. సీఆర్డీఏ భూముల కుంభకోణం, ఏపీ ఫైబర్నెట్, లక్ష్మీనరసింహస్వామి రథం కాలిపోవడం అంశాలపై సీబీఐ విచారణ కోరినా కేంద్రం స్పందించలేదని గుర్తుచేశాం. పీఎం ఆవాస్ యోజన కింద మౌలిక వసతుల ఏర్పాటు నిమిత్తం రూ.11 వేల కోట్లు ఇవ్వాలని కోరాం. వైఎస్సార్సీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్ 11 నెలలుగా పెండింగ్లో ఉంచారు. బీజేపీకి అనుకూలంగా ఉండేవారిపై చర్యలు తీసుకోవడానికి సభాపతి వెనకంజ వేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవాణి వినిపిస్తాం వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డి మాట్లాడుతూ.. విభజన చట్టంలో చాలా విషయాలు అమలు కాలేదని సమావేశంలో స్పష్టం చేశామన్నారు. ఆయా అంశాలపై మాట్లాడడానికి సమయం ఇవ్వడంతోపాటు స్వల్పకాలిక చర్చకు అనుమతి ఇవ్వాలని డిమాండు చేసినట్లు తెలిపారు. ఉపాధిహామీ, పోలవరం, ఇతర ప్రాజెక్టుల నిధులకు సంబంధించి చర్చ జరగాలని కోరామన్నారు. ఏ ఒక్క అంశాన్ని వదలబోమని, ఉభయసభల్లో రాష్ట్ర వాణి వినిపిస్తామని ఆయన చెప్పారు. -
కేంద్ర అఖిలపక్ష సమావేశం ప్రారంభం
సాక్షి, ఢిల్లీ: కేంద్ర అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ భేటీలో కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని కేంద్రం కోరనుంది. సమావేశానికి వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి హాజరయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు, విశాఖ స్టీల్ప్లాంట్, పోలవరం ప్రాజెక్ట్కు నిధులు, ప్రత్యేక హోదా అంశాలను వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రస్తావించనున్నారు. -
పార్లమెంట్ లో విశాఖ ఉక్కు పైపోరాడతాం
-
‘రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు పాకులాడుతున్నారు’
సాక్షి, వైఎస్ఆర్ కడప: ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే టీడీపీ నేతలు విమర్శించడం దారుణమని వాపోయారు. అన్నిప్రాంతాల సమగ్రాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే బాబు, లోకేష్ ఓర్వలేకపోతున్నారని, తన అనుకూల మీడియాతో ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో 3 బ్యారేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. బ్యారేజీల ఏర్పాటుతో సముద్రంలో వృధాగా పోయే నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందని, రాయలసీమ లిఫ్ట్ ద్వారా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. -
బాబు కనుసన్నల్లోనే కుట్ర
సాక్షి, అమరావతి: ఎంపీ రఘురామరాజును పోలీసులు కొట్టలేదని న్యాయస్థానం నియమించిన వైద్యుల కమిటీ నిగ్గు తేల్చడంతో ఆయనకు ప్రాణహాని ఉందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారని వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్రెడ్డి, వల్లభనేని బాలశౌరి, లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. ‘ఈ వ్యవహారంపై తేల్చేందుకు హైకోర్టు.. మెడికల్ బోర్డుకు రిఫర్ చేసింది. వైద్యులను కూడా న్యాయస్థానమే నియమించింది. రఘురామను పరీక్షించిన అనంతరం వైద్య బృందం సీల్డ్ కవర్లో తన నివేదికను అందచేసింది. ఈ మొత్తం ప్రక్రియలో అసలు రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఎక్కడుంది? టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమైతే ఆ పార్టీ నేతలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, అచ్చెన్నాయుడు విషయంలో కూడా ప్రభుత్వం అలాగే వ్యవహరించేది కదా? ఇదంతా చూస్తుంటే ఇందులో కుట్ర దాగుందని బోధపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు పన్నిన కుట్రలు వెలుగులోకి వస్తున్నాయనే భయంతోనే అరెస్టుపై చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. రఘురామరాజును చంద్రబాబు పావులా వాడుకున్నారని చెప్పారు. కులమతాల చిచ్చు రగల్చడం, దిగజారుడు భాష మాట్లాడిన వారిని చట్టం ఎందుకు ఉపేక్షిస్తుందని ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఎంపీలు సోమవారం విలేకరులతో మాట్లాడారు. కేసుల భయంతో చంద్రబాబుతో కలిసి కుట్ర: మిథున్రెడ్డి రఘురామరాజును పోలీసులు కొట్టలేదని న్యాయస్థానం నియమించిన వైద్యుల కమిటీనే నిగ్గు తేల్చింది. దీంతో ఆయనకు ప్రాణహాని ఉందంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారు. టీడీపీ నేతలు అరెస్టైనప్పుడు కూడా ఇంతగా స్పందించని వ్యక్తి ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా నానా హైరానా చేస్తున్నారు. నిజంగా పోలీసులు కొడితే రఘురామరాజు కోర్టుకు నడుచుకుంటూ రాగలరా? వైద్యం కోసం రమేష్ ఆస్పత్రికే వెళ్తానని ఎందుకు పట్టుబడుతున్నారు? అది టీడీపీ వారిది కావడం వల్లే. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టేందుకు గతంలో శంకర్రావును వాడుకున్నట్లే ఇప్పుడు ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు రఘురామరాజును పావుగా వినియోగించుకుంటున్నారు. ఆఖరుకు ఆయన కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగారు. రఘురామపై సీబీఐ కేసులు నమోదైన తరువాత చంద్రబాబు వల వేశారు. తమ కుట్రలో పాలు పంచుకుంటే సీబీఐ కేసుల నుంచి బయటపడేస్తానని బీజేపీలో చేరిన తన మనుషుల ద్వారా లోబర్చుకున్నాడు. ఇవన్నీ ఎక్కడ బయటకొస్తాయోనని చంద్రబాబు భయపడుతున్నారు. సీఎం జగన్పై బురద జల్లేందుకు చంద్రబాబు గతంలో గుళ్లు, గోపురాలను వాడుకున్నాడు. ఇప్పుడు కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఇందులో రఘురామ, ఓ వర్గం మీడియా భాగస్వాములే. చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే బీజేపీలోని ఓ వర్గం మాట్లాడుతోంది. అది ఓ ఎంపీ మాట్లాడే భాషేనా?: బాలశౌరి రఘురామరాజు ఎంపీ కాకముందే ఐదుసార్లు పార్టీలు మారాడు. మొదటిసారి ఎంపీ అయినప్పటికీ ఆయన కోరిక మేరకు సీఎం జగన్ పార్లమెంట్ కమిటీకి చైర్మన్గా చేశాడు. మరో రెండు కమిటీల్లో సముచిత స్థానం కల్పించారు. ఇంత ప్రాధాన్యం మరే ఎంపీకి ఇవ్వలేదు. ఇంత చేస్తే పార్టీ ఎంపీలను, ఐఏఎస్ అధికారులను, సీఎంను దూషించడం దుర్మార్గం. మమ్మల్ని దూషిస్తే ఊరుకున్నాం. కానీ కులమతాల మధ్య చిచ్చు పెడితే చట్టం చూస్తూ కూర్చుంటుందా? పాస్టర్ల ఉచ్ఛారణను అనుకరిస్తూ వారి మనోభావాలను దెబ్బతీశాడు (ఆ వీడియోలు ప్రదర్శించారు). రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ ఎంపీ కూడా ఇంత అసభ్యంగా, అభ్యంతరకరంగా మాట్లాడలేదు. రఘురామను భుజానికెత్తుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వారి పార్టీల్లో ఎవరైనా ఇదే విధంగా మాట్లాడితే ఊరుకుంటారా? ఓ ఎంపీ ఇలా మాట్లాడటం తప్పని ఎప్పుడైనా ఈ విపక్ష నేతలు చెప్పారా? కుట్రలో భాగంగానే రాష్ట్రపతికి చంద్రబాబు లేఖ రాశారు. అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల అరెస్టు అయినప్పుడు కూడా ఆయన ఇలా స్పందించలేదు. చంద్రబాబు హయాంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం అరెస్టు సందర్భంగా పోలీసులు ఎలా ప్రవర్తించారో ప్రజలకు ఇంకా గుర్తుంది. ఆయన భార్యను దుస్తులు పట్టుకుని, కొడుకును కాళ్లతో తన్నుకుంటూ తీసుకెళ్లిన విషయం చంద్రబాబు మర్చిపోయారా? అరెస్టులో ఉల్లంఘన లేదు: శ్రీకృష్ణదేవరాయలు రఘురామరాజు అరెస్టులో ఎక్కడా నిబంధన ఉల్లంఘన జరగలేదు. క్రిమినల్ కేసుల్లో ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు. సివిల్ కేసుల్లో అయితే పార్లమెంట్ జరిగేప్పుడు, స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం ఉన్నప్పుడు మినహా ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు. రఘురామను రమేష్ ఆసుపత్రికే తరలించాలని టీడీపీ ఎందుకు పట్టుబడుతోంది? కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఎయిమ్స్ మంగళగిరిలో ఉంది. ఇంకా పలు ప్రైవేట్ ఆసుపత్రులున్నాయి. అక్కడికి తరలిస్తే నిజాలు బయటకొస్తాయని టీడీపీ కంగారు పడుతోంది. న్యాయస్థానాలపై వైఎస్సార్సీపీకి విశ్వాసం ఉంది. కోర్టు ఆదేశాల మేరకే జీజీహెచ్ ఆసుపత్రికి రఘురామరాజును పంపాం. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఏనాడూ నియోజకవర్గానికి వెళ్లని ఎంపీ.. చంద్రబాబు చెప్పినట్లు కుట్రలు పన్నడం, అసభ్యంగా మాట్లాడటం ఏమాత్రం క్షమించరాని నేరం. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆయన భాష, దుర్మార్గపు చర్యలను అర్థం చేసుకోవాలి. -
రఘురామ్ ... కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించారు
-
చంద్రబాబు డైరెక్షన్లోనే ఇదంతా
-
చంద్రబాబు డైరెక్షన్లోనే ఇదంతా: మిథున్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: రఘురామకృష్ణంరాజు చర్యల వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్రెడ్డి అన్నారు. బాబు డైరెక్షన్లోనే రఘురామ పని చేస్తున్నారని, బెయిల్ రాకపోవడంతోనే కొత్త డ్రామాలకు తెరతీశారని విమర్శించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. మిథున్రెడ్డి మాట్లాడుతూ..‘‘రఘురామకృష్ణంరాజు అకారణంగా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు. కుటుంబసభ్యులను కూడా పావులుగా వాడుకుంటున్నారు. ప్రాణహాని ఉందంటూ కేసును డైవర్డ్ చేసేందుకు యత్నిస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక టీడీపీ నేతలు అరెస్టైనప్పుడు కూడా ఇంత హడావిడి చేయని చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం హైరానా పడుతున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులు కొట్టలేదని వైద్య బృందమే కోర్టుకు నివేదిక ఇచ్చిందన్న మిథున్రెడ్డి.. కేవలం రమేష్ ఆస్పత్రిలోనే ట్రీట్మెంట్ జరగాలనడం సరికాదని పేర్కొన్నారు. అసత్య ఆరోపణలు చేశారు: బాలశౌరి ఎంపీ కాకముందే రఘురామకృష్ణరాజు ఐదుసార్లు పార్టీ మారారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి అన్నారు. పార్టీలో రఘురామకృష్ణరాజుకు సముచితస్థానం ఇచ్చామని, అయినప్పటికీ సీఎం, మంత్రులపై లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారని, పోలీసులు కొట్టారంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. టీడీపీ స్క్రిప్టు ప్రకారమే: శ్రీకృష్ణ దేవరాయలు రఘురామకృష్ణరాజు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. టీడీపీ స్క్రిప్ట్ను రఘురామకృష్ణరాజుతో చదివిస్తున్నారని, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పిందే రఘురామకృష్ణరాజు చేస్తున్నారన్న ఎంపీ.. . ట్రీట్మెంట్ కోసం రమేష్ ఆస్పత్రికే ఎందుకు తీసుకెళ్లాలని ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభుత్వం చట్టప్రకారమే వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. చదవండి: రఘురామకృష్ణంరాజు ఒంటిపై గాయాలేవీ లేవు -
మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న ఎంపీ మిథున్రెడ్డి
పుంగనూరు (చిత్తూరు జిల్లా): కరోనా తీవ్రమవుతున్న తరుణంలో పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మందులు, ఆక్సిజన్ కొనుగోలు చేసేందుకు లోక్ సభ ప్యానెల్ స్పీకర్, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి తన సొంత నిధులు కోటి రూపాయలు విరాళం చెక్కును జిల్లా కలెక్టర్ హరినారాయణ్కు అందజేశారు. గురువారం పుంగనూరు ఆర్టీసీ డిపోను సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్చువల్ విధానం ద్వారా అమరావతి నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ద్వారకనాథరెడ్డి, నవాజ్బాషా, సబ్ కలెక్టర్ జాహ్నవితో కలసి ఎంపీ మిథున్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి సూచనల మేరకు పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు కరోనా సమయంలో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆక్సిజన్తో పాటు మందులను కొనుగోలు చేసి, అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించేలా జిల్లా కలెక్టర్ను కోరామన్నారు. పుంగనూరు ప్రజలకు ఏ సమస్య ఎదురైనా తమ కుటుంబం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం కావాలన్నారు. చదవండి: YS Jagan: అత్యధిక పరీక్షలు, ఉచిత వైద్యం.. ప్రజలకు అండగా.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ -
పాదయాత్రలో పేదల కష్టాలు చూశా: డా. గురుమూర్తి
సాక్షి, చిత్తూరు: అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి పాదయాత్ర చేసే భాగ్యం తనకు దక్కిందని తిరుపతి లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డా. గురుమూర్తి అన్నారు. పాదయాత్రలో అడుగడుగునా పేదల కష్టాలు చూశానన్నారు. బుధవారం శ్రీకాళహస్తిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఈ సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. వెంకటగిరిలో నేత కార్మికుల కష్టాలు చూసి సీఎం వైఎస్ జగన్ చలించిపోయారని గుర్తు చేసుకున్నారు. నేతన్నలకు ఆర్థిక సహాయం చేయడానికి ఆయన ఆనాడే పూనుకున్నారని, కానీ దీన్ని తెలుగుదేశం తప్పుపట్టిందని మండిపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సొంత జిల్లా చిత్తూరును అభివృద్ధి చేయలేని చంద్రబాబుకు కనీసం చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదని ఎద్దేవా చేశారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బాబు కొత్త డ్రామాలకు తెర లేపారని దుయ్యబట్టారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇంతగా సంక్షేమ పథకాలు జరుగుతున్నాయా? అని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ గురుమూర్తి మంచి విద్యావేత్త అని, అందుకే ఈయనకు సీఎం జగన్ ఎంపీ టికెట్ ఇచ్చారని అన్నారు. 17వ తారీఖున సంపన్నులకు పేదవాడికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. పేద కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. చదవండి: టీడీపీ– జనసేన మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందా? తిరుపతి ఉప ఎన్నిక రెఫరెండమే -
లోక్ సభలో ఆర్ధిక బిల్లు 2021 పై చర్చ
-
తిరుపతి, రేణిగుంట మీదుగా 45 ప్రత్యేక రైళ్లు
సాక్షి , న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో తిరుపతి, రేణిగుంటలను దేశంలోని వివిధ ప్రాంతాలకు కలిపేలా 45 ప్రత్యేక రైళ్లు (డైలీ, నాన్డైలీ) నడపుతున్నట్లు కేంద్రం తెలిపింది. ఇవి కాకుండా తిరుమల, తిరుపతి దర్శనానికి ఐఆర్సీటీసీ రైలు, రోడ్డు, విమానాల ద్వారా టూర్ ప్యాకేజీలు నిర్వహిస్తోందని వైఎస్సార్సీపీ సభ్యులు గొడ్డేటి మాధవి, విుథున్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ బుధవారం లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కొత్త ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రతిపాదన లేదు దేశవ్యాప్తంగా ఎక్కడా కొత్త ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్రం పేర్కొంది. గడిచిన ఐదేళ్లలో దేశంలో ఎక్కడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదని వైఎస్సార్సీపీ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో 13, తెలంగాణలో 30 డిజిటల్ విలేజ్ పథకంలో భాగంగా ఏపీలో 13, తెలంగాణలో 30 గ్రామాలు గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. వైఎస్సార్సీపీ సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి అడిగిన ప్రశ్నకు ఐటీశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీకి 20,28,899 ఇళ్లు మంజూరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 20,28,899 ఇళ్లు మంజూరు చేశామని, ఈ ఏడాది మార్చి 1వ తేదీ నాటికి 3,60,325 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం కోసం రూ.89,377 కోట్ల పెట్టుబడిలో కేంద్ర వాటా రూ.30,731 కోట్లుగా ఉందని, అందులో ఇప్పటి వరకు కేంద్ర వాటా రూ.9,311 కోట్లు విడుదల చేశామని రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఉడాన్లో సాగర్, ప్రకాశం బ్యారేజీలు ఉడాన్ పథకంలో భాగంగా వాటర్ ఏరో డ్రోమ్ నిర్మాణానికి నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీలను గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. -
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని కోరాం: ఎంపీ మిథున్ రెడ్డి
-
విశాఖ ఉక్కుపై పలుసార్లు ఒత్తిడి తెచ్చాం
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయొద్దని పలుసార్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డి తెలిపారు. సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయొద్దని వైఎస్సార్సీపీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పిందని గుర్తు చేశారు. పోలవరం, విశాఖ ఉక్కు పరిశ్రమ అంశాలపై పలుసార్లు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. సోమవారం నిర్వహించిన బీఏసీ సమావేశంలోనూ రాష్ట్ర సమస్యలతోపాటు, విశాఖ ఉక్కు, పోలవరంపై మాట్లాడడానికి సమయం ఇవ్వాలని కోరామన్నారు. విశాఖ ప్లాంటుపై కేంద్ర మంత్రుల్ని కలిసి పరిస్థితి వివరించామన్నారు. నష్టాలు వస్తే అమ్ముకోవచ్చు కానీ, లాభాలు వచ్చే అవకాశం ఉన్న ప్లాంటును అమ్మడం సరికాదన్నారు. విశాఖ ప్లాంటుకు సొంత గనులు కేటాయించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రానికి చెప్పారన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్కు పార్లమెంటు ప్రొసీడింగ్స్ తెలియవేమోనని, కనీసం పత్రికలూ చదవరేమోనని మిథున్రెడ్డి ఎద్దేవా చేశారు. విశాఖ ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఎంపీలు మాట్లాడిన అంశాలు పత్రికల్లో వచ్చాయన్నారు. నాలుగు రోజులు ఢిల్లీలో ఉండి బీజేపీ భాగస్వామి పవన్ ఏంచేశారో చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకొచ్చేబాధ్యత వైఎస్సార్సీపీ ఎంపీలపై ఉందని, తప్పకుండా తీసుకొస్తామని మిథున్రెడ్డి తెలిపారు. -
ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతా: మిథున్ రెడ్డి
-
ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతా: మిథున్ రెడ్డి
ఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్సభాపక్ష నేత మిథున్ రెడ్డి సోమవారం నిర్వహించిన లోక్సభ బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర సమస్యలను ప్రస్తావించేందుకు అధిక సమయం ఇవ్వాలని కోరాము. దీనికి లోక్సభ స్పీకర్ సానుకూలంగా స్పందించారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానికి సీఎం జగన్ లేఖ రాశారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. వైఎస్ఆర్సీపీ ఎంపీలందరం కేంద్రమంత్రులను కలిశాం. అలానే పోలవరం ప్రాజెక్ట్కు నిధులన్నీ కేంద్రమే భరించాలి.. సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరాం.పోలవరం, విశాఖ ఉక్కు అంశాలపై పార్లమెంట్లో పోరాడుతాం’’ అని తెలిపారు మిథున్ రెడ్డి. చదవండి: విశాఖ ఉక్కును కాపాడేందుకు కృషి: సీఎం జగన్ -
విశాఖ స్టీల్ప్లాంట్పై నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వైఎస్సార్సీపీ ఎంపీలు కోరారు. ఈ మేరకు వారు వినతిపత్రం అందజేశారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై సీబీఐ విచారణ చేయించాలని, దిశ చట్టాన్ని త్వరగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ లోక్సభా పక్ష నేత మిథున్రెడ్డి, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంవీవీ సత్యనారాయణ, తలారి రంగయ్య, డాక్టర్ సత్యవతి, వంగా గీత, చింతా అనురాధ, జి.మాధవిలు శుక్రవారం పార్లమెంట్లోని హోం మంత్రి కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధుల విడుదల, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఏపీ భవన్లో పిల్లి సుభాష్చంద్రబోస్, వంగా గీత, ఎంవీవీ సత్యనారాయణలు మీడియాతో మాట్లాడారు. ప్రైవేటీకరణ అంశాన్ని పక్కన పెట్టాలని కోరాం ‘విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు అనే నినాదం తో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాల్సిన అవసరం ఉందని హోంమంత్రికి చెప్పాం. ప్రధానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖను పరిగణనలోకి తీసుకొని ప్రైవేటీకరణ అంశాన్ని పక్కన పెట్టాలని, ప్లాంట్ను లాభాల బాట పట్టించే విధంగా చర్యలు చేపట్టాలని కోరాం. దీనిపై అమిత్షా సానుకూలంగా స్పందించారు. ప్రధానితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై సీబీఐ విచారణ చేపట్టే విషయమై త్వరలో నిర్ణయం వెలువరిస్తామన్నారు..’ అని సుభాష్చంద్రబోస్ తెలిపారు. ఉద్యోగుల ఆందోళన వివరించాం ‘విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఉద్యోగులు, రాష్ట్ర ప్రజల ఆందోళన గురించి కేంద్ర హోం మంత్రికి వివరించాం. 32 మంది బలిదానం ఫలితంగా స్టీల్ప్లాంట్ ఏర్పడటం, అనేక మంది స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం గురించి తెలియజేశాం. వారి త్యాగాలను గుర్తించాలని కోరాం. కర్మాగారం నష్టాలకు కారణాలు చెప్పాం. లాభాల బాటలో నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించాం. స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్ల కేటాయింపు లేకపోవడం ఆయన దృష్టికి తెచ్చాం. రూ.23 వేల కోట్ల రుణాన్ని దీర్ఘకాలిక రుణంగా మార్చాలి లేదా ఈక్విటీగా మార్చాలని కోరాం..’ అని ఎంవీవీ సత్యనారాయణ వెల్లడించారు. ‘దిశ’ దేశవ్యాప్తంగా ఉపయోగపడే చట్టం ‘దిశ చట్టం దేశవ్యాప్తంగా ఉపయోగపడుతుంది. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా ఆమోదించాలని హోంమంత్రిని కోరాం. ఇందుకోసం ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్లలో అవసరమైన మార్పులు చేయాలి. తెలంగాణలో జరిగిన ఘటన నేపథ్యంలో మహిళల రక్షణ కోసం సీఎం జగన్ ఈ చట్టాన్ని తెచ్చారు. మహిళలపై దాడుల వంటి ఘటనలను వేగవంతంగా దర్యాప్తు చేసేందుకు ఈ చట్టం ఉపకరిస్తుంది. దిశ చట్టం అమలుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలను, ఇతర రాష్ట్రాలు ప్రశంసిస్తున్న విషయాన్ని కేంద్రం గమనించాలి. రాష్ట్రంలో సీఎం జగన్ అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నారు..’ అని వంగా గీత తెలిపారు. తమ వినతులపై సానుకూలంగా స్పందించిన అమిత్షాకు ఎంపీలు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా వైఎస్సార్సీపీ ఎంపీలందరం పోరాడుతామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దీక్షలు ప్రారంభం ఉక్కునగరం: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాటంలో భాగంగా స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద శుక్రవారం కార్మికుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో ఉక్కు ఉద్యమంలో పాల్గొన్న కొల్లు రామ్మోహన్ ఈ దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గంటా శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, నన్నపనేని రాజకుమారి తదితరులు శిబిరం వద్దకు వచ్చి కార్మికులకు మద్దతు తెలిపారు. -
ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణపై పోరాటం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై పోరాటం చేస్తామని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీ ఎంపీలు అందరం.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను కలసి విశాఖ స్టీల్ను ప్రైవేటీకరించొద్దని కోరుతూ వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. మంగళవారం ఏపీ భవన్లో పార్టీ లోక్సభా పక్ష నేత మిథున్రెడ్డి, ఎంపీలు బాలశౌరి, అనూరాధ, గొడ్డేటి మాధవి, బి.సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, తలారి రంగయ్య, రెడ్డెప్ప, పోచ బ్రహ్మానందరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. ‘1999–2004 మధ్య 56 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన చంద్రబాబు, ఆయన తొత్తులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడటం హాస్యాస్పదం. వైఎస్ జగన్ ఉక్కు మనిషి అయితే, చంద్రబాబు తుక్కు మనిషి. చంద్రబాబుకు వైజాగ్ స్టీల్ గురించి తెలీదు. సుజనా స్టీల్ గురించే తెలుసు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను లాభాల్లోకి తీసుకువచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ చేసిన సూచనలు కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించాం. ఏడు మేజర్ పోర్టుల ప్రైవేటీకరణను కూడా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పాం. విభజన చట్టంలో హామీలన్నీ నెరవేర్చాల్సిందిగా కోరాం’ అని విజయసాయిరెడ్డి చెప్పారు. ఎస్ఈసీని తొలగించే అధికారం గవర్నర్కు ఉండాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)ను గవర్నర్ నియమిస్తారు. అందువల్ల శాసనసభ సిఫారసు మేరకు ఎస్ఈసీని తొలగించే అధికారమూ గవర్నర్కు ఉండేలా రాజ్యాంగాన్ని సవరించాలని వైఎస్సార్సీపీ కోరుతోందని చెప్పారు. రాష్ట్రంలో విగ్రహాలు చోరీలను చంద్రబాబు, అచ్చెన్నాయుడు ప్రోత్సహిస్తున్నారని, మత మార్పిడుల్లోనూ చంద్రబాబు, ఆయన అనుచరుల పాత్రే ఉంది’ అని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రజలకు ఆమోదయోగ్యం కాదని ఆర్థిక మంత్రికి వివరించినట్లు మిథున్ రెడ్డి తెలిపారు. నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా రాజ్యసభ చైర్మన్ను అగౌరవపరచడమో, విధులు నిర్వర్తించకుండా చేయడమో తన ఉద్దేశం కాదని, సోమవారం సభలో తాను ఆవేదనలో ఉన్న సమయంలో జరిగిన పరిణామమని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాజ్యసభ జీరోఅవర్లో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ తన వ్యాఖ్యల పట్ల విచారం వెలిబుచ్చారు. ఆవేదనలో వచ్చిన భావోద్వేగమే తప్ప దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. కేశినేని వ్యాఖ్యలపై మిథున్ అభ్యంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్సభలోజరిగిన చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ కేశినేని నాని పలుమార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు ప్రస్తావించడాన్ని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత పీవీ మిథున్రెడ్డి తప్పు పడుతూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణకు వీలుగా రాష్ట్ర అసెంబ్లీ చట్టాన్ని తెచ్చిందని గుర్తు చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగిస్తామని ప్యానల్ స్పీకర్ భరృ్తహరి మెహతాబ్ పేర్కొన్నారు. -
‘కోవిడ్ టెస్టులకు రూ. 4.57 కోట్లు ఖర్చు చేశాం’
సాక్షి, తాడేపల్లి: కరోనా వైరస్ నివారణకు వివిధ రాజకీయ పక్షాలతో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం జరిగిన ప్రధాని వర్చ్యువల్ సమావేశంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సమావేశంలో కరోనా నివారణ, వ్యాక్సిన్ల పంపిణీపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టమెంటరి సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. టెస్టింగ్ లేని సమయంలోనే తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక స్థాయిలో పరీక్షల నిర్వహించారన్నారు. దాదాపు 20 శాతం జనాభాకు ఇప్పటి వరకు కరోనా టెస్టులు చేశామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6వేల యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయని, 0.81 శాతం మరణాల రేటు ఉందన్నారు. దీంతో కరోనా రీకవరి రేటులో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉందని తెలిపారు. దీనికి సీఎం వైఎస్ జగన్ కృషితోపాటు ప్రధాని సహకారం కూడా ఉందన్నారు. కాగా వ్యాక్సిన్ తయారీలో ప్రధాని చూపుతున్న కృషి అభినందనీయం ఆయన పేర్కొన్నారు. (చదవండి: సోషల్ మీడియా కార్యకర్తలను విస్మరించం..) తొలుత ఫ్రాంట్ లైన్ వారియర్స్కు ఈ వాక్సిన్ ఇవ్వాలని మీరు తీసుకున్న నిర్ణయం ముదావహం అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆరోగ్య శ్రీ ద్వారా కోవిడ్కు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని, 150 సూపర్ స్పెషలిటీ ఆస్పత్రుల్లో రీయంబర్స్ చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్ మొత్తం 432 సంఖ్యలో108, 656 సంఖ్యలో 104 వాహనాల సేవలను అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. కోవిడ్ నివారణకు ఏపీలో అధికంగా నిధులు ఖర్చు చేస్తున్నామని, కోవిడ్ నివారణ కోసం తాము రోజుకు 10.18 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దీనిలో 4.57 కోట్ల రూపాయలు కేవలం టెస్టులకే ఖర్చు చేశామని వెల్లడించారు. కాగా కరోనా నివారణకు ఏపీకి తమ వైపు నుంచి కూడా ఆర్థికంగా సాయం చేయాలని ఆయన ప్రధానిని కోరారు. వాక్సిన్ స్టోరేజీకి కేంద్రం కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటుకు కూడా కేంద్రం సాయం చేయాలని, బీపీఎల్ వారికి ఉచితంగా వాక్సిన్ ఇవ్వాల్సిందిగా ప్రదానిని ఆయన విజ్ఞప్తి చేశారు. (చదవండి: వైఎస్సార్ విగ్రహం అంటే.. బాబుకు నిద్రపట్టట్లేదు) -
పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో మనోళ్లు
న్యూఢిల్లీ: శాఖల వారీగా మరింత జోరుగా పరిపాలన సాగించేందుకు కేంద్రం సిద్ధమైంది. మంగళవారం స్టాండింగ్ కమిటీలకు సభ్యులను నియమించింది. అన్ని పార్టీల ఎంపీలనూ పరిపాలనలో భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నిస్తూ... స్టాండింగ్ కమిటీల్లో వివిధ పార్టీల ఎంపీలకు బాధ్యతలు అప్పగించింది. ఈ కమిటీల్లో చాలా వాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఎంపీలను సభ్యులుగా నియమించింది. ఆయా స్టాండింగ్ కమిటీలకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల ఎంపీల వివరాలు.. స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆర్థిక శాఖ మిథున్ రెడ్డి, సీఎం. రమేష్, జీవీఎల్ నరసింహారావు పరిశ్రమల శాఖ వైఎస్ అవినాష్ రెడ్డి వాణిజ్య శాఖ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్ఆర్డీ లావు శ్రీకృష్ణదేవరాయలు , గల్లా జయదేవ్ ఆరోగ్యశాఖ టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత న్యాయశాఖ టీఆర్ఎస్ ఎంపీలు సురేష్రెడ్డి, వెంకటేష్ నేత ఐటీ శాఖ వైఎస్ఆర్సీ ఎంపీ సత్యనారాయణ, టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి రక్షణ శాఖ రేవంత్ రెడ్డి, కోటగిరి శ్రీధర్, లక్ష్మీకాంత్ ఇంధన శాఖ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్మిక శాఖ టీఆర్ఎస్ ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్ రైల్వే శాఖ రెడ్డప్ప, సంతోష్ కుమార్ పట్టణాభివృద్ధి శాఖ బండి సంజయ్ కెమికల్ అండ్ ఫర్టిలైజర్ శాఖ నందిగం సురేష్ బొగ్గు,ఉక్కు శాఖ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్ గ్రామీణ అభివృద్ధి శాఖ తలారి రంగయ్య -
కేంద్రమంత్రి షెకావత్తో సీఎం జగన్ భేటీ
-
త్వరలో జలశక్తి మంత్రి పోలవరం పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. బుధవారం ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సీఎం జగన్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్కు నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా షెకావత్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు అందించాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పర్యటకు రావాలని జలశక్తి మంత్రిని సీఎం జగన్ కోరగా, త్వరలోనే పోలవరం పర్యటనకు వస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే గోదావరి-కావేరి నధుల అనుసంధానంపైన కూడా చర్చ జరిగింది. నదుల అనుసంధానం అంశంపై రాష్ట్ర పర్యటనకు వెళ్లాలని టాస్క్ఫోర్స్ చైర్మన్ వేదిరే శ్రీరామ్కు జలశక్తి మంత్రి షెకావత్ సూచించారు. సీఎం జగన్ వెంట వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. కాగా 2021 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. (ఏపీకి నిధులు ఇవ్వండి) కాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ మంగళవారం సాయంత్రం హోం మంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటితోపాటు దిశ చట్టం, శాసన మండలి రద్దు.. చట్ట రూపు దాల్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్టు ఆ వర్గాలు తెలిపాయి. -
కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి అనిల్ కుమార్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు మిథున్రెడ్డి, గోరంట్ల మాధవ్, లావు కృష్ణ దేవరాయలు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ను సోమవారం కలిశారు. పోలవరం బకాయిలు, పునరావాసం ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం వైఎస్ జగన్ ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారని తెలిపారు. 2021 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి అనిల్ కుమార్ వెల్లడించారు. పునరావాసం ప్యాకేజీని త్వరితగతిన సెటిల్ చేయాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని అనిల్ కుమార్ తెలిపారు. 4 వేల కోట్ల రూపాయల పోలవరం బకాయిలు త్వరితగతిన విడుదల చేస్తామని మంత్రి గజేంద్ర సింగ్ హామినిచ్చారని పేర్కొన్నారు. జల వివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశం తేదీని కేంద్రం నిర్ణయిస్తే మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అనిల్కుమార్ స్పష్టం చేశారు. (చదవండి: ఎందుకు.. ఏమిటి.. ఎలా?)